టీడీపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసమ్మతినేతల సమావేశం
విశాఖపట్నం(పాయకరావుపేట): పాయకరావుపేట ఎమ్మెల్యే వి. అనితకు వ్యతిరేకంగా మంగళవారం అసమ్మతి నేతలు సమావేవం ఏర్పాటు చేశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడంలేదని, కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వలస నాయకులకు నామినేటెడ్ పదవులు ఇచ్చి ఎప్పటి నుంచో ఉన్న టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆమెకు వ్యతిరేకంగా అసమ్మతినేతలు పాయకరావుపేటలో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ విషయం గురించి పార్టీ జిల్లా అధ్యక్షుడు పప్పల చలపతిరావుని సుమారు 150 అసమ్మతి నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఈ నెల 14న ఏపీ సీఎం టీడీపీ అధినేతను చంద్రబాబును కలిసి తాడోపేడో తేల్చుకుంటామని వారు చెబుతున్నారు.