vaping
-
అన్నలా చెప్తున్నా.. బహిరంగంగా ఇలా చేయొద్దు: అశ్విన్
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెసింగ్ రూమ్లో ‘వేపింగ్’ (ఇ- సిగరెట్తో పొగ పీల్చడం) చేయడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అతడిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు తీసుకుంది. అయితే, అయితే మరీ కఠినంగా వ్యవహరించకుండా స్వల్ప స్థాయి శిక్షతో సరి పెట్టింది. జరిమానాతో సరిపరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలో వేసింది. క్రికెట్ గౌరవాన్ని తగ్గించే ఘటనగా పేర్కొంటూ పరాగ్కు శిక్ష వేస్తున్నట్లు ప్రకటించింది. ‘ఐపీఎల్ నియమావళిలో ఆర్టికల్ 2.21ను పరాగ్ ఉల్లంఘించాడు. ఇది క్రికెట్ను అగౌరవపర్చే చర్య. తన తప్పును అంగీకరిస్తూ పరాగ్ శిక్షకు సిద్ధమయ్యాడు’ అని బోర్డు పేర్కొంది. జట్టుపైనా చర్యలుఅయితే ఇలాంటి చర్యకు అవకాశం కల్పించిన రాజస్తాన్ రాయల్స్ టీమ్పై కూడా చర్య తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోందని కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ‘ఐపీఎల్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆటగాళ్లు, అధికారులతో పాటు టీమ్ మేనేజ్మెంట్పై కూడా ఉంది. ఈ నేపథ్యంలో సదరు టీమ్పై కఠిన చర్య తీసుకునే అవకాశాలు పరిశీలిస్తున్నాం’ అని ఆయన స్పష్టం చేశారు. దురదృష్టకర ఘటనఈ ఘటనపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తాజాగా స్పందించాడు. వేపింగ్ చేస్తూ రియాన్ పరాగ్ (Riyan Parag) పట్టుబడటాన్ని దురదృష్టకర ఘటనగా అభివర్ణించాడు. పరాగ్ అలా చేయాల్సింది కాదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్లు తమ చర్యల పట్ల జాగ్రత్తగా ఉండాలని అతను సూచించాడు. ‘ఇది అన్ని విధాలుగా నివారించి ఉండాల్సిన ఘటన. ఇలాంటి విషయాల్లో పడరాదని యువ ఆటగాళ్లకు చెబుతున్నా.అన్నలాగా సలహా ఇస్తున్నాఇది వ్యక్తిగత ఇష్టాలకు సంబంధించిన విషయమే. కానీ ఇవి వ్యక్తిగతంగానే ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరైంది కాదు. ఒక అన్నలాగా పరాగ్కు నేను సలహా ఇస్తున్నా. నీ వ్యక్తిగత జీవితంలో ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక ఐపీఎల్ టీమ్కు కెప్టెన్గా ఇలా చేయవద్దు. చాలా మంది యువ ఆటగాళ్లు నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు. కాబట్టి మరింత బాధ్యతగా మెలగడం అవసరం. ఈ రోజుల్లో దేనినీ దాచలేం. కాబట్టి మున్ముందు తప్పునుంచి నేర్చుకోవాలంటే తగిన శిక్ష వేయడం కూడా అవసరం. పరాగ్ విషయంలో అదే జరిగింది’ అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.రూ. 25 లక్షలు చెల్లించే అవకాశంకాగా మంగళవారం న్యూ చండీగఢ్లో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా పరాగ్ ఘటన చోటు చేసుకుంది. డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని ‘వేపింగ్’ చేస్తున్నట్లుగా వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. ఐపీఎల్ 19వ సీజన్ కోసం రాజస్తాన్ రాయల్స్ జట్టు రూ. 14 కోట్లకు పరాగ్ను రీటెయిన్ చేసుకుంది. మ్యాచ్కు రూ. 1 కోటి చొప్పున అతడికి లభిస్తుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐకి.. జరిమానా రూపంలో పరాగ్ రూ. 25 లక్షలు చెల్లించే అవకాశముంది. చదవండి: అస్సలు పట్టించుకోను.. వారితో నాకేంటి: రియాన్ పరాగ్ -
రియాన్ పరాగ్పై బీసీసీఐ చర్యలు
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు చేపట్టింది. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా ప్రవర్తించిన తీరుకు జరిమానాతో సరిపెట్టింది. కాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ పూర్తి స్థాయి కెప్టెన్గా నియమితుడైన రియాన్ పరాగ్.. సారథిగా ఆకట్టుకుంటున్నాడు.ఇ–సిగరెట్తో పొగ పీల్చి..పరాగ్ కెప్టెన్సీలో రాజస్తాన్ ఇప్పటికి తొమ్మిది మ్యాచ్లలో ఆరు గెలిచింది. అయితే, పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా పరాగ్ (Riyan Parag) ప్రవర్తించిన తీరు వివాదానికి దారి తీసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రెసింగ్ రూమ్లో ఉన్న రియాన్ పరాగ్ ‘వేపింగ్’ (ఇ–సిగరెట్తో పొగ పీల్చడం) చేశాడు.భారత్లో నిషేధంఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. నిజానికి ద్రవరూపంలో ఉండే నికొటిన్ను ఉపయోగించే ఇ–సిగరెట్లను భారత ప్రభుత్వం 2019లోనే నిషేధించింది. అలాంటి ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో కెప్టెన్ స్థాయిలో ఉండి పరాగ్ నిబంధనలు అతిక్రమించడం చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలో బీసీసీఐ రియాన్ పరాగ్పై వేటు వేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. ఓ జర్నలిస్టు మాత్రం అతడు చేసిన తప్పునకు విధించే శిక్ష విషయంలో ఐపీఎల్ నియమాల్లో స్పష్టత లేదని పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది.మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతరియాన్ పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు.. క్రమశిక్షణారాహిత్యం కింద అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 కింద ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ ఆర్టికల్ ప్రకారం.. టోర్నీ గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటారు.ఇదిలా ఉంటే.. వేపింగ్పై నిషేధం ఉన్నప్పటికీ ఈమేరకు అతిక్రమనకు పాల్పడితే లక్ష రూపాయల జరిమానా లేదా ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి తరుణంలో బీసీసీఐ మాత్రం తూతూమంత్రంగా చర్యలు తీసుకుందనే విమర్శలు వస్తున్నాయి.చదవండి: IPL 2026: క్లాసెన్ సంచలన నిర్ణయం..? డిమాండ్లకు తలొగ్గి? -
BCCI: రియాన్ పరాగ్ ఎస్కేప్.. ఊహించని ట్విస్ట్!
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్-2026లో భాగంగా.. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా అతడు డ్రెస్సింగ్రూమ్లో ‘వేపింగ్’ (ఇ–సిగరెట్తో పొగ పీల్చడం) చేసిన సంగతి తెలిసిందే. అతడు చేసిన పని టీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. రియాన్తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.లక్ష రూపాయల జరిమానా లేదాకాగా ద్రవరూపంలో ఉండే నికొటిన్ను ఉపయోగించే ఇ–సిగరెట్లను భారత ప్రభుత్వం 2019లోనే నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతిక్రమనకు లక్ష రూపాయల జరిమానా లేదా ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.నిజానికి ఇప్పుడు పరాగ్ వివాదం ప్రభుత్వ నిబంధనలకంటే బీసీసీఐ కోణంలో అతిపెద్ద సమస్యగా మారింది. ఐపీఎల్లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఒక జట్టుకు కెప్టెన్గా ఉంటూ అతడు ఇలా చేయడంపై చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ రియాన్ పరాగ్పై కఠిన చర్యలు తీసుకోనుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఊహించని ట్విస్ట్అయితే, రియాన్ పరాగ్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విపుల్ కశ్యప్ అనే జర్నలిస్టు ఇందుకు సంబంధించి తాజా అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. రియాన్ పరాగ్పై బీసీసీఐ నేరుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీని సారాంశం.రియాన్ పరాగ్ తప్పించునే అవకాశంఐపీఎల్ లేదంటే బీసీసీఐ ప్రవర్తనా నియమావళిలో ‘వేపింగ్’కు సంబంధించి ఎలాంటి శిక్ష విధించాలన్న అంశంపై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ తప్పించునే అవకాశం ఉండగా.. మ్యాచ్ అధికారులపై మాత్రం బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.🚨 BIG UPDATE FROM IPL 🚨Rajasthan Royals captain Riyan Parag could face a 2-match ban after an alleged dressing room incident.⚠️ Reports suggest he was caught vaping inside the dressing room.🔥 If confirmed, Yashasvi Jaiswal is likely to lead RR for the next two matches.… pic.twitter.com/bKD9zfpQko— True Vector (@TrueVector33) April 28, 2026ఆయనపై వేటు?ఓ ఆటగాడు అలాంటి నిషేధిత వస్తువును మైదానంలోకి తీసుకురావడమే గాకుండా.. ఓవైపు మ్యాచ్ జరుగుతుండగా డ్రెసింగ్ రూమ్లో వేపింగ్ చేయడాన్ని బీసీసీఐ భద్రతా వైఫల్యంగా భావిస్తున్నట్లు సమాచారం. అతడికి ఆ అవకాశం ఇచ్చినందుకు గానూ మ్యాచ్ రిఫరీ లేదంటే ఇతర అధికారులపై వేటు పడనుందని సమాచారం.కాగా పంజాబ్ కింగ్స్- రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్కు అమిత్ శర్మ రిఫరీ. ఒకవేళ బీసీసీఐ గనుక రంగంలోకి దిగితే అతడికి పనిష్మెంట్ తప్పకపోవచ్చు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ పంజాబ్కు ఈ సీజన్లో తొలిసారి ఓటమిని రుచిచూపించింది. శ్రేయస్ అయ్యర్ సేనను పరాగ్ బృందం ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో రియాన్ పరాగ్ 16 బంతుల్లో కేవలం 29 పరుగులు చేశాడు.UPDATE: రియాన్ పరాగ్పై బీసీసీఐ చర్యలుచదవండి: IPL 2026: భారీ తప్పిదం.. ముంబై ఇండియన్స్ ఓటమికి కారణం ఇదే? -
రియాన్ పరాగ్ అరెస్ట్ ?
-
వాపింగ్ ఇంత ప్రమాకరమైనదా..? ఆ మహిళ ఊపిరితిత్తుల్లో ఏకంగా..!
ధూమపానం అలవాటు ఎంత ప్రమాదకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ చెడు అలవాటుకు బలైన ఎందరో జీవితాలు గురించి విన్నాం. అయినా ఫ్యాషన్ కోసం లేదా ట్రెండ్ అనో చదువుకున్న యువతే పొగకు బానిస్వవ్వుతున్నారు. మూడుపదుల వయసు దాటక మునుపే కాటికి వెళ్లిపోతున్నారు. పొగతో జీవితాలనే చేజేతులారా మసిచేసుకుని విలవిలలాడుతున్నారు. మసిబారిపోతామని తెలిసి ఆస్వాదిస్తున్నారంటే..జీవితమంటే నిర్లక్ష్యమా లేక అహంకారమా అనేది ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. ఇదంతా ఎందుకంటే ఇక్కడొక మహిళ కూడా ఇలానే పొగకు బానిసై ఊపిరే భారమయ్యే సంకట స్థితిని ఎదుర్కొంది. చెప్పాలంటే చావుకి బతుకు మధ్య క్షణమో యుగంలా బతికింది. ఒక్కసారిగా జీవితం విలువ తెలసుకుని కన్నీళ్లు పెట్టింది. పొగబారిపోయిన జీవితాన్ని నయం చేసుకుని బతికిబట్టగలిగేందుకు మృత్యువుతో భయంకరంగా పోరాడింది. చివరికీ..అసలేం జరిగిందంటే..అమెరికాకు చెందిన జోర్డాన్ బ్రియెల్ అనే 32 ఏళ్ల మహిళకు యుక్త వయసు నుంచి ధూమపానం అలవాటు ఉంది. అయితే అది రాను రాను అలవాటుగా మారి ఎలక్ట్రానిక్ సిగరెట్లు(వాపింగ్) తాగేంత వరకు వచ్చింది. వాటికోసం ప్రతి వారం రూ. 40 వేల వరకు ఖర్చుపెట్టేది. జేబు చిల్లుపడేలా సిగరెట్లకే ఖర్చేపెట్టేసిది మొత్తం డబ్బంతా. దీంతో ఒక్కసారిగా ఆమె ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కి గురై ఆమె ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిపోయింది. ఊపిరి సలపని దగ్గుతో నరకయాతన అనుభవించింది. ముక్కు నుంచి నోటి నుంచి ఒకవిధమైన నలుపు రంగు శ్లేష్మంతో ఉలుకు పలుకు లేని జీవచ్ఛవంలా అయిపోయింది. ఇక బ్రియెల్ బతకనేమో అనే స్థితికి వచ్చేసింది. ఊపరి పీల్చుకోవడమే అత్యంత భారంగ మనుగడ కష్టం అనేలా అయిపోయింది పరిస్థితి. అయితే వైద్యులు ఆమె ఊపిరితిత్తుల్లో ఉన్న రెండు లీటర్ల విషపూరిత ద్రవాన్ని తొలగించి నయమయ్యేలా చేశారు. నెమ్మది నెమ్మదిగా కోలుకున్న బ్రియెల్ తాను మళ్లీ ఇలా బతికి బట్టకట్టగులుగుతానని అనుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పొగ అంటేనే భయపడిపోయే స్థితికి వచ్చేసింది. అది తన జీవితాన్ని ఎంత నరకపాయంగా మార్చింది గుర్తుతెచ్చుకుని కన్నీటిపర్యంతమయ్యింది. వాపింగ్ అనే ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లు ఎంత హానికరం అని చెప్పేందుకు బ్రియెల్ ఉదంతమే ఓ ఉదహరణ.వాపింగ్ అంటే..ఇక్కడ వాపింగ్ అంటే ద్రవ రుచిని అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేసినప్పుడు, పీల్చే ఏరోసోల్ ఏర్పడుతుంది. దీన్ని పీల్చుతూ అనందంపొందుతుంటారు పొగరాయళ్ళు. సిగరెట్లకు మంచి ప్రత్యామ్నాయంగా భావించి దీనికి అలవాటు పడుతున్నారు. వాస్తవానికి అనేక రసాయనాలను వాపింగ్లో ఉపయోగిస్తారు. వాటిని వేడి చేసినప్పుడు అవి చాలా విషపూరితంగా మారి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ఈ వేప్లను వేడి చేసినప్పుడు, విషపూరిత రసాయనాలు వేగంగా లీక్ అవుతాయని, ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని ఒక పరిశోధన వెల్లడించింది. అంతేగాదు దీనికి అలవాటు పడితే మాత్రం ఊపిరితిత్తులు దారుణంగా దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. (చదవండి: 50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూప్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!) -
ఈ-సిగరెట్టూ ‘పొగ’ పెడుతుంది!
ధూమపానం జీవితానికే పొగ పెడుతుంది. ఇది తెలిసినా మానలేని పరిస్థితి. ఈ వ్యసనాన్ని మాన్పించేందుకంటూ ఇటీవల ఈ-సిగరెట్లు విస్తృతంగా వాడకంలోకి వస్తున్నాయి. అయితే, వీటితోనూ ముప్పు అధికమేనన్న ఆందోళన లు వ్యక్తమవుతున్నాయి. దేశంలో తొలుత పంజాబ్, ఇటీవల మహారాష్ట్ర వీటిపై నిషేధం విధించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ-సిగరెట్లపై నిషేధం విధించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సిగరెట్ల గురించి పలు సంగతులు... ఎలా హానికరం..? కేన్సర్ కారక ఫార్మాల్డిహైడ్ వంటివి ఈ-సిగరెట్లలోనూ ఉంటాయి. వీటిలోనూ నికోటిన్ ఉంటుంది. దీనివల్ల గుండెజబ్బులు వస్తాయి. ఈ-సిగరెట్లోని నికోటిన్ లిక్విడ్ను వేగంగా ఖాళీ చేస్తే.. శరీరంలో వణుకు పుడుతుంది. కండరాలు పట్టు తప్పుతాయి. కోమాలోకి వెళ్లి, మరణించే ప్రమాదమూ ఉంటుంది. నోటి ద్వారా 30-60 మి.గ్రా. నికోటిన్ను తీసుకుంటే చాలు.. పక్షవాతంతో ఊపిరితిత్తులు విఫలమై చనిపోతారు. 10 మి.గ్రా. నికోటిన్ కూడా పిల్లల ప్రాణాలు హరిస్తుంది. వీటిని వాడటం అంటే.. ధూమపానాన్ని కొనసాగించడమేనని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్-ఎండ్స్(ఈ-సిగరెట్లు)కు ప్రాచుర్యం పెరగడం అనేది.. ధూమపానం మాన్పించేందుకు ఏళ్ల తరబడి జరిగిన శ్రమను బలహీనం చేస్తోంది. సాధారణ సిగరెట్లలో ఉండే టార్ వంటి విషపూరిత ఉప ఉత్పన్నాలు, పొగ ఎండ్స్లో ఉండవన్న వాదన ఉంది. కానీ వాస్తవమేంటంటే ఎండ్స్పై జరిగిన పరిశోధనలు చాలా తక్కువ. ఈ-సిగరెట్లు ‘పొగ మానిపించేందుకు ఉత్తమ పరికరాలు’ అన్నది కచ్చితంగా తేలలేదు. యువతను బాగా ఆకర్షిస్తున్న ఎండ్స్కు వివిధ ఫ్లేవర్లను జోడించడాన్ని నిషేధించాలి. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే చోట ఎండ్స్ వాడకాన్ని నిషేధించాలి. పొగ తాగనివారు, టీనేజ్ పిల్లలు వీటి బారిన పడకుండా ఉండేందుకు గాను వీటి ప్రకటనలకు పరిమితులు విధించాలి. ఏ దేశంలో ఎలా..? కెనడా : ఈ-సిగరెట్లు వ్యక్తిగతంగా వినియోగించవచ్చు. కానీ మార్కెట్లో అమ్మడం నిషిద్ధం. కొరియా : పొగాకు ఉత్పత్తుల మాదిరిగానే వీటిపైనా పన్ను ఉంటుంది. భారత్ : పాన్షాపులలో విక్రయిస్తున్నారు. పంజాబ్, మహారాష్ట్ర నిషేధించాయి. నిషేధంపై కేంద్రం యోచిస్తోంది. బ్రెజిల్, చైనా : ఈ-సిగరెట్లు చట్ట వ్యతిరేకం. ఐరోపా : బహిరంగంగా దుకాణాల్లో అమ్ముతారు. కానీ ప్రకటనలు మాత్రం నిషేధం. మరికొన్ని విశేషాలు... సాధారణ సిగరెట్లతో పోల్చితే ఈ-సిగరెట్లు మూడు రెట్లు చౌక. ఒక ఈ-సిగరెట్ ధర రూ. 500-3,000. ఆరు నెలలు పనిచేస్తుంది. సిగరెట్లో వాడే ఫ్లేవర్ లిక్విడ్కు నెలకు రూ. 1,000 ఖర్చవుతుంది. మింట్, చాకొలేట్, స్ట్రాబెర్రీ, పొగాకు ఫ్లేవర్లలో లిక్విడ్ లభిస్తుంది. ప్రతి ఈ-సిగరెట్లో 2 మిల్లీలీటర్ల లిక్విడ్ ఉంటుంది. ఈ-సిగరెట్లలో ఆవిరిని పీల్చుకోవడాన్ని ‘వ్యాపింగ్’ అంటారు. 2 ఎంఎల్ లిక్విడ్తో వందసార్లు వ్యాప్ చేయొచ్చు.


