ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని తల్లిదండ్రుల హత్య
నల్గొండ : నల్లగొండ జిల్లా దిండి మండలం వీరబోయినపల్లిలో దారుణ సంఘటన జరిగింది. తన ప్రేమ పెళ్లిని నిరాకరించారనే ఆగ్రహంతో తల్లిదండ్రులను కొట్టి చంపాడు ఓ దుర్మార్గుడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా మద్యం మత్తులో అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.