నీటి ప్లాంటుకు రూ.10.50 లక్షలు మంజూరు
చెన్నూరు : మండలంలోని ఉప్పరపల్లెలో నీటి ప్లాంటు నిర్మాణానికి ప్రభుత్వం రూ.10.50 లక్షల నిధులు మంజూరు చేసిందని మండల ఉపాధ్యక్షులు కె. విజయభాస్కర్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు ప్లాంటు ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారన్నారు. ఈ మేరకు గ్రామం, మండలంలోని నాయకులు సంబంధిత అధికారులతో చర్చించి ఆర్డబ్ల్యూఎస్ శాఖ నుంచి నిధులు విడుదల చేయించామని, త్వరలోనే నీటిని ప్రజలకు అందిస్తామని చెప్పారు.