visakha express
-
విశాఖ ఎక్స్ ప్రెస్ లో వివాహితపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు
-
విశాఖ ఎక్స్ప్రెస్ అత్యాచార కేసులో ట్విస్ట్
సాక్షి, పల్నాడు: వివాహితకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి లాక్కెళ్లి మరీ అత్యాచారం జరిపిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసి ఉండే విశాఖ ఎక్స్ప్రెస్లో అదెలా సాధ్యమైందంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే.. రైల్వే పోలీసులు ఎట్టకేలకు ఈ కేసును చేధించారు. విశాఖ ఎక్స్ప్రెస్ వివాహిత అత్యాచార కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు ఏసీ బోగీలో పని చేసే కార్మికుడేనని తేలింది. ఒడిశాకు చెందిన శౌరవ్ బగ్దీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని.. అతన్ని అరెస్ట్ చేశామని విజయవాడ రైల్వే పోలీసులు ప్రకటించారు. తాను స్టాఫ్నని చెప్పి ఆ జంటను వెంట తీసుకెళ్లాడని, వాళ్ల ఆర్థిక స్థితి చెప్పడంతో డబ్బులు కూడా వద్దన్నాడని.. ఆపై ఏమార్చి వివాహితను ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు వెల్లడించారు.పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యభర్తలు జీవనోపాధి కోసం విశాఖకు వెళ్లారు. జెట్టిపాలెం(పల్నాడు)లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విశాఖ ఎక్స్ప్రెస్ జనరల్ బోగీ ఎక్కారు. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చాడు. ఏసీ బోగీలో సీట్లు ఉన్నాయని.. తన వెంట రావాలని తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక ఒక సీటే ఖాళీగా ఉందని చెప్పడంతో భార్యను పంపించి తాను టాయ్లెట్ వద్ద కూర్చోనిపోయాడు ఆ భర్త. అయితే ఇదే అదనుగా ఆ మహిళను హెచ్1ఏ బోగీలోకి లాక్కెల్లి.. కూపే తలుపు మూసి దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత నిందితుడు పారిపోగా.. భార్యభర్తలిద్దరూ రెంటచింతల పీఎస్లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై విజయవాడ రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు వేగవంతం చేశారు. -
విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం
-
భర్తను ఏమార్చి.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం!
సాక్షి, పల్నాడు: విశాఖ ఎక్స్ప్రెస్లో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గుర్తుతెలియని వ్యక్తి మాయమాటల్ని నమ్మి బాధిత దంపతులు వెంట వెళ్లగా.. ఏసీ బోగీలోకి తీసుకెళ్లి మరీ వివాహితపై అఘాయిత్యం జరిపినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా జరిగిన వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యభర్తలు జీవనోపాధి కోసం విశాఖలో నివాసం ఉంటున్నారు. జెట్టిపాలెంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కారు. ఈలోపు జనరల్ బోగీలో ఉన్న ఆ జంట వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. ఇక్కడ ఇబ్బంది ఎందుకు పడతారని?.. ఏసీ బోసీలో ఖాళీగా ఉందని చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని వాళ్లు వెంట వెళ్లారు. అయితే ఒక సీటే ఖాళీగా ఉందని చెప్పడంతో భర్త టాయ్లెట్ వద్ద కూర్చోనిపోయాడు. మహిళను హెచ్1ఏ బోగీలోకి తీసేకెళ్లి కూపే తలుపు మూసి దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు రెంటచింతల పీఎస్లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై విజయవాడ రైల్వే ఓలీసులు సమాచారం అందించారు. దీంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
విశాఖ ఎక్స్ప్రెస్లో దొంగల ముఠా హల్చల్.. రైల్వే పోలీసుల కాల్పులు
సాక్షి, పల్ల్నాడు: విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో కొందరు దుండగులు భారీ దొంగతనానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దొంగతనాలకు పాల్పడిన వారు బీహార్, మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్లుగా గుర్తించారు.వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్లో ఆదివారం తెల్లవారుజామున చోరీ యత్నం జరిగింది. ఈ క్రమంలో రైల్వే పోలీసులు.. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో, దొంగల ముఠా పారిపోయింది. అయితే, పిడుగురాళ్ల సమీపంలో వరుసగా రైళ్లలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్లు దొంగతనానికి పాల్పడుతున్నాయి. ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, వారం రోజుల వ్యవధిల ఇప్పటికే రైళ్లలో రెండు సార్లు దొంగతనం జరిగింది. తాజాగా మూడోసారి ఆదివారం తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడటంతో గాలిలోకి కాల్పులు జరిపినట్టు రైల్వే పోలీసులు చెప్పుకొచ్చారు. -
‘విశాఖ’కు బాంబు బెదిరింపు
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: భువనేశ్వర్ – సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టారంటూ బెదిరింపు కాల్ రావడంతో రాజమహేంద్రవరంలో రైల్వే అధికారులు బెంబేలెత్తారు. పోలీసుల కథనం ప్రకారం, భువనేశ్వర్లో ఎస్–6 బోగీలో కొందరు యువకులు ఎక్కారు. వీరిలో దిలీప్కుమార్ అనే యువకుడు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు. బోగీ లోపల ఖాళీ లేకపోవడంతో వీరు గేటువద్ద కూర్చున్నారు. అప్పటికే మద్యం తాగి ఉన్నవారి మధ్య విశాఖలో వివాదం మొదలైంది. సామర్లకోట చేరువలో దిలీప్కుమార్కు, మిగిలిన యువకులకు మధ్య ఘర్షణ ముదిరింది. రైలు నడుస్తుండగానే పరస్పరం నెత్తురు వచ్చేలా దాడులు చేసుకున్నారు. ఆ సందర్భంగా ఒక వర్గం యువకులు బాంబులు పెట్టి రైలును పేల్చివేస్తామంటూ బెదిరించారు. దీంతో బెంబేలెత్తిన ప్రయాణికులు కొందరు రైల్వే పోలీస్ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న దిలీప్కుమార్ చైన్ లాగి, రైలును నిలిపివేశాడు. దీంతో ఘర్షణ పడ్డ వారిలో కొందరు యువకులు రైలు దిగి పరారయ్యారు. వారు బాంబులు పెట్టారని దిలీప్కుమార్ అనడంతో బోగీలోని ప్రయాణికులు మరింత భీతిల్లారు. సమాచారం అందుకున్న సామర్లకోట రైల్వే పోలీసులు వెంటనే రైలును తనిఖీ చేసి, రాజమహేంద్రవరం తీసుకువచ్చారు. రాత్రి 8.20 గంటలకు రాజమహేంద్రవరం వచ్చిన ఆ రైలును రైల్వే స్టేషన్లో గంటపాటు నిలిపివేశారు. రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ భరత్ మాతాజీ ఆధ్వర్యాన టూ టౌన్ ఇన్స్పెక్టర్ ముక్తేశ్వరరావు, రైల్వే ఏఎస్పీ నగేష్ నోయల్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రమణయ్యలు బోగీ మొత్తం డాగ్, బాంబు స్క్వాడ్లతో తనిఖీలు చేశారు. బాంబు లేదని నిర్ధారణ అయిన అనంతరం రైలును వదిలారు. ఘర్షణకు దిగిన యువకుల్లో దిలీప్కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న అతడు పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని డీఎస్పీ భరత్ మాతాజీ తెలిపారు. నిందితులపై ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ ఎక్స్ప్రెస్లో చైన్ స్నాచింగ్
-
విశాఖ ఎక్స్ప్రెస్లో దొంగల హల్చల్
సాక్షి, పశ్చిమ గోదావరి : విశాఖ ఎక్స్ప్రెస్లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. నిడదవోలు సమీపంలోని కాల్దరి - సత్యవాడ స్టేషన్ల మధ్య రైలు చైన్ లాగిన దొంగలు మహిళల మెడలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఎస్ 6 నుంచి ఎస్ 13 వరకూ గల బోగీల్లో దుండగులు దోపిడికి పాల్పడినట్లు తెలిసింది. దోపిడి సమయంలో 28 నిమిషాల పాటు రైలు మార్గం మధ్యలో రైలు నిలిచిపోయిందని బాధితులు తెలిపారు. సుమారు 170 గ్రాముల బంగారాన్ని దుండగులు అపహరించుకెళ్లినట్లు సమాచారం. దాదాపు 10 మంది దుండగులు ఈ దోపిడిలో పాల్గొన్నట్లు తెలిసింది. నిడదవోలు రైల్వే స్టేషన్ పీఎస్లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్వగ్రామాలకు గల్ఫ్ బాధితులు
సాక్షి, ముంబై: గల్ఫ్ ఉపాధి పేరుతో మోసపోయిన వారంతా స్వగ్రామాల బాట పట్టారు. ముంబైలోని లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్టీటీ) నుంచి విశాఖ ఎక్స్ప్రెస్లో వీరందరు తిరుగు ప్రయాణమయ్యారు. గల్ఫ్ ఉపాధి పేరిట ఏకంగా 48 మంది మోసపోయిన సంగతి తెలిసిందే. మోసపోయిన వారిలో ముగ్గురు మినహా మిగిలిన వారంతా గురువారం ఉదయం ఎల్టీటీ నుంచి భీమవరానికి బయలుదేరినట్టు బాధితుడు దుర్గారావ్ తెలిపారు. కరీంనగర్ జిల్లాకు చెందిన భూమేష్, వరంగల్ జిల్లా బి వినోద్ వ్యక్తులు తమను మోసం చేసినట్టు వీరు ఆరోపిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు పోలీసు స్టేషన్లో మోసం చేసిన వారిపై ఫిర్యాదు చేస్తామని బాధితులు చెప్పారు. స్థానిక ప్రజా ప్రతినిధులు తమకు సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. -
రైలు బోగీలో అస్థిపంజరం
సికింద్రాబాద్ : రైలు బోగీలో అస్థిపంజరం బయటపడ్డ ఉదంతం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం ఈనెల 16న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకున్న విశాఖ ఎక్స్ప్రెస్ రైలులోని రెండు బోగీలను మరమ్మతు కోసం అదేరోజు షెడ్డుకు తరలించారు. మరమ్మతు చేసేందుకు ఇద్దరు కార్మికులు సోమవారం ఆ బోగీల వద్దకు వచ్చారు. బోగీలోంచి దుర్వాసన రావటంతో వారు పోలీసులకు సమాచారం అందించాచు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బోగీలోకి వెళ్లేందుకు యత్నించగా తలుపు లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో కిటికీలోంచి పరిశీలించగా అస్థిపంజరం కనిపించింది. గ్యాస్ కట్టర్తో తలుపును తెరిచి లోపల ఉన్న పురుషుడి అస్తిపంజరాన్ని బయటకు తీశారు. ఒంటిపై ఖాకీ చొక్కా మాత్రమే ఉంది. అస్థిపంజరాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలేవీ లభించలేదు. ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక గుండెపోటుతో చనిపోయాడా అనేది తేలాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.


