breaking news
yellow metal
-
వారం రోజులు.. మారిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ మారిపోతున్నాయి. తీవ్రమైన హెచ్చుతగ్గులు, బలమైన రికవరీతో గత వారం రోజుల్లో (డిసెంబర్ 14 – డిసెంబర్ 21) హైదరాబాద్ సహా తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు గణనీయ మార్పులు నమోదు చేశాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారంతోపాటు ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పసిడి లోహం ధరలు మొత్తంగా చూస్తే స్వల్పంగా పెరిగాయి.ధరల మార్పు ఇలా..డిసెంబర్ 14న రూ.1,33,910గా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర.. పెరుగుతూ.. తగ్గుతూ డిసెంబర్ 21 నాటికి రూ.1,34,180 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల అనంతరం నికరంగా రూ.270 పెరిగింది.ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే డిసెంబర్ 14న రూ.1,22,750తో ప్రారంభమై, డిసెంబర్ 21న రూ.1,23,000 వద్ద కొనసాగుతోంది. నిరకంగా చూస్తే వారం రోజుల్లో రూ.250 ఎగిసింది.ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుబంగారాన్ని ప్రస్తుతం గ్లోబల్ ఇన్వెస్టర్లు ‘సేఫ్-హేవెన్’గా కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం డిమాండ్.. ధరలు పెరుగుతున్నాయి.అంతర్జాతీయ బంగారం ధరలు యూఎస్ డాలర్ బలం, అంతర్జాతీయ వడ్డీ రేట్ల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. డాలర్ బలంగా మారితే బంగారం ఫ్యూచర్స్పై ప్రభావం పడుతుంది. ఇది స్థానిక ధరలను ప్రభావితం చేస్తుంది.డిసెంబర్లో పండుగలు, శుభదినాలు, పెళ్లి సీజన్ మొదలైన సందర్భాల నేపథ్యంలో బంగారం కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. ఈ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తోంది.ఇక స్థానికంగా ఉన్న పన్నులు, సరఫరా, డిమాండ్ కూడా రోజువారీ పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. సీజనల్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంది. -
ఆరుగురి చేతిలో 40% పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్కు దిగుమతి అవుతున్న పసిడిలో 40% పరిమాణాన్ని కేవలం ఆరుగురు ట్రేడర్లు నియంత్రిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) తొలి ఆరు నెలల(ఏప్రిల్-సెప్టెంబర్) కాలంలో వీరి ద్వారానే 40% పసిడి దిగుమతులు జరిగాయని ప్రభుత్వ వర్గాలు విశ్లేషించాయి. వీరిలో ముగ్గురు ముంబైకి చెందిన పసిడి ట్రేడర్లుకాగా, మిగిలినవారు ముంబై, బెంగళూరు, హర్యానాలకు చెందిన వర్తకులు. అయితే ఈ ఆరుగురు ట్రేడర్లు నిర్వహించే వర్తకంలో చట్టవిరుద్ధమైన అంశాలేవీ లేవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇటీవల పసిడి దిగుమతులు పుంజుకోవడంతో ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించే యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. -
ఎగుమతులు నిరుత్సాహం
న్యూఢిల్లీ: భారత ఎగుమతులు ఈ ఏడాది అక్టోబర్లో నిరాశపరిచాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా ఈ విలువ 5.04 శాతం క్షీణించింది. ఆరు నెలల తరువాత ఎగుమతుల రంగంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకుంది. విలువ రూపంలో కేవలం 26.09 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. ఇక దిగుమతుల విషయానికి వస్తే- ఇవి 3.62 శాతం పెరిగాయి. ఈ విలువ 39.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దీనితో ఎగుమతులు-దిగుమతులకు మధ్య ఉన్న వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు ఈ నెలలో 13.35 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో వాణిజ్యలోటు 10.59 బిలియన్ డాలర్లు. బంగారంపై ఆంక్షలు కొనసాగింపు!? బంగారం దిగుమతులు పెరగడం వాణిజ్యలోటు భారీగా ఉండడానికి కారణాల్లో ఒకటి. 2013 అక్టోబర్లో బంగారం దిగుమతుల విలువ 1.09 బిలియన్ డాలర్లు. అయితే 2014 అక్టోబర్లో ఈ విలువ ఏకంగా 4.17 బిలియన్ డాలర్లకు ఎగసింది. బంగారం, వెండి రెండింటినీ చూస్తే ఈ విలువ 1.38 బిలియన్ డాలర్ల నుంచి 4.85 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఆయిల్ దిగుమతులు తగ్గడం వల్ల వాణిజ్య లోటు ఈ స్థాయిలో ఉందికానీ, లేదంటే ఈ లోటు మరింత పెరిగేదని నిపుణుల వ్యాఖ్య. నెలవారీగా చూస్తే అంటే సెప్టెంబర్తో పోల్చిచూస్తే- వాణిజ్యలోటు 14.25 బిలియన్ డాలర్ల నుంచి 13.36 బిలియన్ డాలర్లకు తగ్గింది. పండుగల సీజన్లో డిమాండ్ పెరగడమే పసిడి దిగుమతుల పెరుగుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ కరెంట్ అకౌంట్ లోటు కట్టడిలో భాగంగా ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కనకం దిగుమతుల కట్టడికి తీసుకుంటున్న చర్యల వల్ల ఈ మెటల్ దిగుమతులు గణనీయంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. కాగా వరుసగా రెండవ నెల (సెప్టెంబర్ 4.22 బిలియన్ డాలర్లు) బంగారం దిగుమతులు 4 బిలియన్ డాలర్లు పైగా నమోదుకావడం- తాజా ఆందోళనకు కారణమవుతోంది. ఈ మెటల్ దిగుమతుల కట్టడికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా సోమవారం తెలిపారు. పరిమాణం రూపంలో 2014 అక్టోబర్లో బంగారం దిగుమతుల పరిమాణం 150 టన్నులుగా ఉంది. 2013 ఇదే నెలలో ఈ పరిమాణం 24 టన్నులు. తాజా పరిణామం చూస్తుంటే... బంగారం దిగుమతులపై ఆంక్షలు మరికొంతకాలం తప్పేట్లు లేదని నిపుణుల వ్యాఖ్య. అమెరికా, యూరప్ల స్థితికి అద్దం! అమెరికా, యూరప్లలో మందగమన పరిస్థితులే ఎగుమతుల క్షీణతకు ప్రధాన కారణమని భారత ఎగుమతిదారుల సంఘం (ఎఫ్ఐఈఓ) ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ పేర్కొన్నారు. ఎగుమతిదారులకు సహాయం చేయడానికి ప్రభుత్వం కూడా ఇంకా ముందుకు రాకపోవడం పట్ల ఆయన నిరాశను వెలిబుచ్చారు. ఎగుమతిదారులకు సానుకూలమైన కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని సీఐఐ జాతీయ కమిటీ (ఎగుమతులు, దిగుమతుల విభాగం) చైర్మన్ సంజయ్ బుధియా అన్నారు. ఇంట్రస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ను మళ్లీప్రవేశపెట్టాలని ఈ రంగం కోరుతోంది.


