విద్యారణ్యపురి : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఫస్టియర్ (జనరల్) పరీక్ష ఫలితాల్లో హనుమకొండ జిల్లాలో బాలికలే అత్యధికంగా పాసయ్యారు. జిల్లావ్యాప్తంగా 12,694 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 8,856 మంది ఉత్తీర్ణత (69.77శాతం)సాధించారు.బాలురు 6,904 మంది పరీక్షలు రాయగా 4,473 మంది( 6479శాతం), బాలికలు 5,790మంది పరీక్షలకు హాజరుకాగా అందులో 4,383 మంది (75.7శాతం) ఉత్తీర్ణత సాధించారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు.
ఒకేషనల్ పరీక్షలో 61.11శాతం ఉత్తీర్ణత
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష (ఒకేషనల్) ఫలితాల్లో హనుమకొండ జిల్లాలో 61.11శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 342 మంది పరీక్ష కు హాజరు కాగా 209 మంది ఉత్తీర్ణత సాధించారు.
సెకండియర్లో 54.12శాతం ఉత్తీర్ణత
ఇంటర్మీడియట్ సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష (జనరల్) ఫలితాల్లో హనుమకొండ జిల్లాలో మొత్తం 54.12 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా 4,937మంది పరీక్షలు రాయగా 2,672 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 3,104 మందికి గాను 1,669 మంది (53.77శాతం), బాలికలు 1,833 మందికిగాను 1,003 మంది (54.72శాతం) ఉత్తీర్ణత సాధించారని డీఐఈఓ గోపాల్తెలిపారు.
సెకండియర్ ఒకేషనల్ ఫలితాల్లో..
సెకండియర్ ఒకేషనల్ పరీక్ష ఫలితాల్లో హనుమకొండ జిల్లాలో 56.85శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 241 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 137 మంది ఉత్తీర్ణత సాధించారు.
వరంగల్ జిల్లాలో..
కాళోజీ సెంటర్: వరంగల్ జిల్లావ్యాప్తంగా 6,102 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 3,298 మంది ఉత్తీర్ణత సాధించారని ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవ రావు తెలిపారు. ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 3,581 మంది పరీ క్షకు హాజరు కాగా 2,113 మంది ఉత్తీర్ణులయ్యా రు. సెకండ్ఇయర్ విద్యార్థులు 2,521 మంది రాయగా 1,185 మంది పాస్ అయ్యారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment