నేడు సాధారణ సమావేశం
మహబూబాబాద్: మానుకోట మున్సిపల్ సాధారణ సమావేశంలో 195అంశాలతో కూడిన ఎజెండాను తయారు చేశారు. ఈనెల 22న జరగాల్సిన కౌన్సిల్ సాధారణ సమావేశాలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన విషయం విదితియే. అయితే ఈనెల 24న నిర్వహించేందుకు కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మేనేజర్ శ్రీధర్ తెలిపారు. ఎజెండాలో ఎక్కువగా ఎజెండాలోని ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు చాలా తక్కువగా ఉండడంతో ఈ కౌన్సిల్ సాధారాణ సమావేశంలో అంశాలను బట్టి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
ఏర్పాట్లు పూర్తి..
మానుకోట మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశానికి తగు ఏర్పాట్లు చేశారు. ఎజెండాలో ఉన్న ప్రతిపాదనల్లో ఎక్కువగా ఇంజనీరింగ్ విభాగం, పారిశుద్ధ్యానికి సంబంధించినవి ఉండగా ఆ తర్వాత వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కు సంబంధించిన ప్రతిపాదనలే ఉన్నాయి. వాటితో పాటు స్టేషనరీకి చెందిన ప్రతిపాదనలు ఉన్నాయి . నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు పెద్దగా లేకపోవడంతో ఈ కౌన్సిల్ సాధారణ సమాశంపై కౌన్సిలర్ల నుంచి పెద్దగా స్పందన లేదు.
Comments
Please login to add a commentAdd a comment