ఒడిశాలో రియల్ టైం మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ టెక్నాలజీతో పని చేస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్
టీజీ ఎన్పీడీసీఎల్.. అధునాతన సాంకేతికత వినియోగంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రియల్ టైం మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ టెక్నాలజీని తీసుకురానుంది. దీని వల్ల సబ్స్టేషన్లో లోడ్, పవర్ ఫాక్టర్, ట్రిప్పింగ్లు, బ్రేక్ డౌన్లు, లైన్ క్లియర్ (ఎల్సీ)లకు సంబంధించిన పూర్తి సమాచారం ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంతోపాటు, సర్కిల్, సబ్స్టేషన్లలో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఉద్యోగులు ఇచ్చే సమాచారంతో తెలుసుకుంటున్నారు. ఇక నుంచి ఎక్కడ అంతరాయం ఏర్పడింది.. సబ్ స్టేషన్లో లోడ్ ఏ మేరకు ఉంది.. ట్రిప్పింగ్లు, ఎక్కడ బ్రేక్ డౌన్ అయింది.. వంటి సమస్యలు ఆయా కార్యాలయాల్లో అధికారుల ముంగిట కనిపిస్తుంది. దీంతో వెంటనే ఉద్యోగులను అప్రమత్తం చేసి నివారణ చర్యలు చేపట్టొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment