ఇంటర్‌ సప్లమెంటరీ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సప్లమెంటరీ ఫలితాలు విడుదల

Jun 25 2024 1:36 AM | Updated on Jun 25 2024 1:36 AM

మహబూబాబాద్‌ అర్బన్‌: ఇంటర్‌ సప్లమెటరీ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మే 24 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. కాగా జిల్లా ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచింది. ఎప్పటి మాదిరిగానే బాలికలు పైచేయి సాధించారు. కాగా మొదటి సంవత్సరం జనరల్‌ గ్రూపులో 2,047 మంది పరీక్షలు రాయగా 1,301 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ గ్రూపులో 531 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 300 ఉత్తీర్ణులయ్యాయి. మొత్తంగా 62.10 మంది విద్యార్థులు పాసయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్‌ గ్రూపులో 1,184 మంది పరీక్షలు రాయగా 601 మంది పాసయ్యారు. ఒకేషనల్‌ గ్రూపులో 419 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 237 మంది ఉత్తీర్ణత సాధించారు. 52.27శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మెరుగైన ఫలితాలు సాధించామని డీఐఈఓ సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement