‘జూడా’ల సమ్మెబాట
ఎంజీఎం: సమస్యలు పరిష్కరించాలని ఆర్నెళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా..ఎలాంటి స్పందన లేకపోవడంతో జూనియర్ వైద్యులు నిరవధిక సమ్మె బాట పట్టారు. కొద్ది రోజులుగా నల్లబ్యాడ్జీలు, కళ్ల కు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేసిన వైద్యులు ముందుగా ప్రకటించినట్లుగానే సోమవారం నుంచి ఎంజీఎం ఆస్పత్రిలో ఓపీ విధులు బహిష్కరించి ప్రాంగణంలో ఆందోళన బాట పట్టారు. ఉదయం 9 గంటలకు ఎంజీఎంలోని గాంధీ విగ్రహ ప్రాంగణానికి చేరుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈసందర్భంగా జూనియర్ డాక్టర్ల ప్రతిని ధులు మాట్లాడుతూ.. ప్రతీ నెల స్టైఫండ్ కోసం అధికారులకు విన్నవించినా.. నిధులు విడుదల కావట్లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మెడికల్ కళాశాలు ప్రారంభించామని పేర్కొంటు న్న ప్రభుత్వాలు ఆస్థాయిలో కళాశాలల్లో సౌకర్యాలు ఉన్నాయా.. లేవా? అనే విషయాన్ని విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకుందని వెంటనే భవన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉస్మానియాకు నిత్యం అధిక సంఖ్యలో రోగులు వస్తుండడం.. వారి సంఖ్యకు తగ్గట్లుగా సౌకర్యాలు లేకపోవడంతో ఇన్ఫెక్షన్ రేటు కూడా ఆస్పత్రిలో పెరిగిపోతోందన్నారు. కేఎంసీలో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయని, వెంటనే రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. హాస్టళ్ల పరిస్థితి కూ డా అధ్వానంగా ఉందని, కేఎంసీలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు.
ఎంజీఎంలో వైద్య విద్యార్థుల ఆందోళన
ఓపీ సేవల బహిష్కరణ
ప్రభుత్వం దిగిరాకపోతే ఎమర్జెన్సీ
సేవలు నిలిపేస్తామని స్పష్టీకరణ
Comments
Please login to add a commentAdd a comment