రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
కోస్గి: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్యావిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ సూచించారు. ఈ మేరకు శనివారం స్థానిక ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను, వైద్యులు, సిబ్బంది పనితీరును, కాన్పుల వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో మౌళిక వసతులపై ఆరా తీయగా పోస్టుమార్టం గది, జనరేటర్, ఓపీ సామగ్రి, తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్ కావాల్సి ఉందని ఆస్పత్రి సూపరిండెంట్ అనూదీప్ వివరించారు. మహబూబ్నగర్ నుంచి కాకుండా నేరుగా హైద్రాబాద్ నుంచి మందులను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. సూపరింటెండెంట్లు రంజిత్కుమార్, అనుదీప్, స్వేత, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment