No Headline
మూత్రశాలలు శుభ్రం చేస్తున్న జీపీ సిబ్బంది..
పంచాయతీ కార్మికులను గ్రామాల్లో జనాభా ప్రాతిపధికన పూర్తి స్థాయిలో నియమించలేదు. ఒక్కో పంచాయతీలో ఇద్దరు నుంచి ఎనిమిది మంది వరకు నియమించారు. ప్రతి గ్రామంలో 12 నుంచి 20వరకు వార్డులు ఉంటాయి. వాటన్నింటిలో రోజువారిగా చెత్తను సేకరించడం, పారిశుద్ధ్య చర్యలు చేపట్టడానికి సమయం సరిపోదు. దీనికితోడు సేకరించిన చెత్తను తడి, పొడి చెత్తగా విభజించి కంపోస్టు ఎరువుల తయారికి సహకరించాలి. ఇక కాలనీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం పనులు చేయాలి. అన్ని పనుల మధ్య పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు శుభ్రం చేయాలంటే ఎంత వరకు సాధ్యపడుతుందని ప్రశ్నార్థకంగా మారింది. ఇక పాఠశాలల్లోని గదులకు సంబందించి తాళాలు హెచ్ఎం దగ్గర ఉంటాయి. పాఠశాలలో విలువైన సామగ్రి ఉంటుంది. వాటి పరిరక్షణ బాధ్యతపై సందేహాలు వస్తున్నాయి. ఇక ప్రతిరోజు టీచర్లు, పిల్లలకు తాగునీరు సమకూర్చాలంటే సమయం సరిపోదనేది మరో వాదన.
ఎదురయ్యే సమస్యలు..
Comments
Please login to add a commentAdd a comment