నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలి

Jun 24 2024 2:10 AM | Updated on Jun 24 2024 2:10 AM

నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలి

నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలి

తెయూ(డిచ్‌పల్లి): నీట్‌ పరీక్షను వెంటనే రద్దు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో వర్సిటీ మెయిన్‌ గేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎన్‌డీఏ, ఎన్‌టీఏల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్‌, తెయూ అధ్యక్షుడు కొమిర శ్రీశైలం మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్‌ పరీక్ష పేపర్‌ లీకై నందున వెంటనే పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. లీకేజీ నిందితులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఎలా లీకవుతున్నాయని ప్రశ్నించారు. తక్షణమే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి బాధ్యులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు స్వామి, సాగర్‌ నాయక్‌, ఆశిష్‌, రాజేందర్‌, శ్రీను రాథోడ్‌, నవీన్‌, మహేష్‌, అనిల్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement