సుభాష్నగర్: నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అజ్మీర రాంజీ నాయక్ అకాల మరణం చెందడంపై ఎంప్లాయీస్ జేఏసీ, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంతాపం వ్యక్తం చేసింది. అజ్మీర రాంజీ చిత్రపటానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అజ్మీర రాంజీ అందించిన సేవలను కొనియాడారు. టీజీవో జిల్లా అధ్యక్షుడు సంగం అమృత్కుమార్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, చిట్టి నారాయణరెడ్డి, ఆకుల ప్రసాద్, పోల శ్రీనివాస్, బీఎల్ శంకర్, దినేష్ బాబు, జాకీర్ హుస్సేన్, సంజీవయ్య, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం కార్యదర్శి గొండ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment