నేడు చలో హైదరాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు చలో హైదరాబాద్‌

Published Tue, Jun 25 2024 2:28 AM | Last Updated on Tue, Jun 25 2024 2:28 AM

నేడు చలో హైదరాబాద్‌

బోధన్‌: అసెంబ్లీ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు, ఆసరా పింఛన్‌ లబ్ధిదారులకు పింఛన్‌ పెంచుతామని కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన హామీల అమలు కోసం మంగళవారం చలో హైదరాబాద్‌ కార్యక్రమం తలపెట్టామని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్‌) జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి తెలిపారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. దివ్యాంగులు, ఆసరా పింఛన్‌ లబ్ధిదారులు అధిక సంఖ్యలో హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రాంతంలో గల ప్రెస్‌ క్లబ్‌ వద్దకు ఉదయం 10 గంటల వరకు చేరుకోవాలన్నారు. దివ్యాంగులకు పింఛన్‌ రూ. 4 వేల నుంచి రూ. 6 వేలు, వృద్ధులు , వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులకు రూ.2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచుతామని కాంగ్రెస్‌ నేతలు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలల కాలం గడిచిపోయినా ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. పెంచుతామని ఇచ్చిన మాట ప్రకారం గడిచిన డిసెంబర్‌ నెల నుంచే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్‌ వెంటనే ఇవ్వాల్సిందేనని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన ఏకైక నాయకుడు వీహెచ్‌పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అని పేర్కొన్నారు.

దివ్యాంగులు, ఆసరా పింఛన్‌

లబ్ధిదారులు తరలిరావాలి

వీహెచ్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షురాలు

సుజాత సూర్యవంశి పిలుపు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement