ఆత్మకూరు హెచ్‌ఎం సస్పెన్షన్‌ | - | Sakshi

ఆత్మకూరు హెచ్‌ఎం సస్పెన్షన్‌

Apr 3 2025 1:54 AM | Updated on Apr 3 2025 1:54 AM

ఆత్మకూరు హెచ్‌ఎం సస్పెన్షన్‌

ఆత్మకూరు హెచ్‌ఎం సస్పెన్షన్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఆత్మకూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెండ్‌ శ్రీనివాసప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. గత నెల 29న ఆత్మకూరు పరీక్ష కేంద్రంలో కేజీబీవీ విద్యార్థిని అప్పటికే తనకు తెలిసిన ప్రశ్నలన్నింటికీ జవాబులు రాసి కూర్చుంది. ఆ సమయంలో ప్రశ్నపత్రం కిందకు పడిపోయి గాలికి వెనుక వైపు బెంచీవద్దకు వెళ్లింది. అదే సమయంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసప్రసాద్‌ ఆ గదిలో చేరుకుని పరిశీలిస్తున్న క్రమంలో ఆ విద్యార్థిని వద్దకు వెళ్లాడు. ఆన్షర్‌ షీటు మాత్రం కనిపించడంతో ప్రశ్నపత్రం ఎక్కడ? అని అడిగాడు. హఠాత్పరిణామంతో ఆ విద్యార్థిని తీవ్ర కంగారుకు గురైంది. ఇక్కడే ఉందంటూ ఆందోళన చెంది వెతుకుతుండగా ఒక్కసారిగా కర్రతో ఆ విద్యార్థినిని చితకబాదాడు. దాడిలో భుజపుటెముక విరిగింది. దీంతో తర్వాత రోజు పరీక్ష రాయలేని పరిస్థితి. ఈ పరిణామంపై ‘సాక్షి’లో ‘శ్రీనివాసా...ఇదెక్కడి ‘కర్ర’ పెత్తనం శీర్షికతో కథనం వెలువడింది. దీనిపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. స్వయంగా పాఠశాల విద్య కమిషనర్‌ విజయరామరాజు ఈ ఘటనపై ఆరా తీశారు. విద్యార్థినిది ఏమాత్రం తప్పు లేదని హెచ్‌ఎం ఓవర్‌గా రియాక్ట్‌ అయ్యాడంటూ జిల్లా అధికారులు వివరించడంతో సదరు హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో హెచ్‌ఎం శ్రీనివాసప్రసాద్‌ను సస్పెండ్‌ చేస్తూ పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement