Sri Sathya Sai District Latest News
-
కనుల పండువగా పుష్పయాగోత్సవం
కదిరి: పక్షం రోజుల పాటు సాగిన ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి పుష్పయాగోత్సవంతో ముగిశాయి. ఈ ఉత్సవం కనుల పండువగా, అత్యంత వైభవంగా సాగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగేందుకు సహకరించిన అష్ట దిక్పాలకులు, పంచ భూతాలు, దేవతా మూర్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని.. వారి వారి లోకాలకు సాగనంపేందుకు నిర్వహించినదే ఈ పుష్పయాగోత్సవమని ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు వివరించారు. తీర్థవాది ఉత్సవం ముగియగానే శనివారం సాయంత్రం నుంచి ఆలయం తలుపులు మూసివేసిన విషయం తెలిసిందే. తిరిగి ఆదివారం వేకువ జామునే ఆలయ ద్వారాలు తెరిచి మహా సంప్రోక్షణ గావించారు. అనంతరం స్వామివారికి నిత్య పూజాది కై ంకర్యాలను నిర్వహించిన మీదట భక్తులకు ఆలయంలో శ్రీవారి సర్వ దర్శన భాగ్యం కలిగించారు. రాత్రి రంగమండపంలో శ్రీదేవి, భూదేవిల సమేత శ్రీవారిని కర్ణాటక నుంచి తెప్పించిన పుష్పాలతో అలంకరించారు. ఉత్సవానికి ఉభయ దారులుగా రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పూల అశ్వర్థనారాయణ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముగిసిన నృసింహుని బ్రహ్మోత్సవాలు -
నేలకూలిన భారీ వృక్షాలు
హిందూపురం: అసలే వర్షాలు అంతంతమాత్రం. గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్న నేపథ్యంలో పచ్చదనం పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెట్లను పరిరక్షించుకోవాల్సి ఉండగా కొందరు క్షణాల్లో కూల్చేస్తున్నారు. ఇందుకు అటవీ శాఖ అధికారులు కూడా అనుమతులు ఇవ్వడం గమనార్హం. హిందూపురంలోని గుడ్డం రంగనాథస్వామి ఆలయ సమీపాన విశాలమైన మైదానంలో అనేక ఏళ్లుగా ఫలసాయం అందిస్తున్న 21 చింత చెట్లను ఆదివారం యంత్రాల సాయంతో కూకటివేళ్లతో పెకలించి ముక్కలు చేసేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలుపుట్టపర్తి టౌన్: శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్, వాహనాల తనిఖీ తదితర చర్యలు చేపట్టారు. రాత్రివేళ గస్తీలు చేపడుతూ నైట్ బీట్ చెకింగ్లు ఏర్పాటు చేసి అనుమానితు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై ప్రత్యేకడ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగిస్తూ ప్రమాదాలు జరగకుండా సూచనలు చేస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. హెల్మెట్ ఫేస్వాష్పై కూడా అవగాహన కలిగిస్తున్నారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. గంజాయి, అక్రమ మద్యం రవాణా, నాటుసారాలపై దాడులు చేస్తున్నారు. గ్రామాలను సందర్శించి గొడవలకు వెళ్లకుంగా ప్రశాతంగా జీవించాలని అవగాహన కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల నూతన కమిటీ ఎంపిక పుట్టపర్తి టౌన్: జిల్లా పంచాయతీ కార్యదర్శుల (డిజిటల్ అసిస్టెంట్లు) సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆదివారం పట్టణంలోని సాయి ఆరామంలో జిల్లా ఇన్చార్జ్ చౌడప్ప ఆధ్వర్యంలో పంచాయితీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్లు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా చౌడప్ప, ఉపాధ్యక్షులుగా ప్రశాంతి, భార్గవ్ చౌదరి, జనరల్ సెక్రటరీగా లోకేష్, ట్రెజరర్గా రసూల్, జాయింట్ సెక్రటరీలుగా బాలాజీ, సాదిక్బాషా, సతీష్, శంకర, కమిటీ మెంబర్లుగా ప్రకాశ్, అశోక్, చంద్రశేఖర్, రవికాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఎస్సీ కాలనీలో విద్యుత్ కనెక్షన్లు కట్ బత్తలపల్లి: పోట్లమర్రి ఎస్సీ కాలనీలో 200 యూనిట్లకు మించి వినియోగించిన వారి విద్యుత్ కనెక్షన్లను అధికారులు కట్ చేశారు. కాలనీలో దాదాపు వంద కుటుంబాలు ఉన్నాయి. వీరందరికీ జగ్జీవన్ జ్యోతి స్కీం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలవుతోంది. అయితే 20 కుటుంబాల వారు 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించడంతో ఉచితం పరిధి దాటి బిల్లు పరిధిలోకి వచ్చారు. ఆ డబ్బు చెల్లించకపోవడంతో ఆదివారం 12 మంది సిబ్బంది కాలనీలోకి వచ్చి సదరు వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. తమకు గడువు ఇస్తే చెల్లిస్తామని ప్రాధేయపడినా వినలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రకృతి ప్రకోపం.. రైతులకు తీరని నష్టం
తాడిమర్రి: ప్రకృతి ప్రకోపం అన్నదాతలకు తీరని నష్టం మిగిల్చింది. శనివారం రాత్రి మండలంలో వడగండ్ల వర్షం, ఈదురుగాలులకు అరటి, దానిమ్మ, మొక్కజొన్న, టమాట పంటలు నేలకొరిగాయి. నాయనపల్లిలో రైతులు జానగాన పెద్దవీరనారప్ప, జడే శంకరయ్య, జడే నడిపి గంగన్న, జడే ఆది, బి.దస్తగిరి, పాళ్యం రహంతుల్లా, జడే శంకర్, డి.చెన్న యల్లప్ప, జె.శివయ్యతో సహా 15 మంది సాగు చేసిన అరటి తోటలు వడగండ్ల వర్షానికి దెబ్బతిన్నాయి. అరకొర పంటను కోసి అమ్ముకున్న మరో 20 మంది రైతులకూ తీరని నష్టం కలిగింది. దాడితోట గ్రామంలో ఈదురుగాలులకు రైతులు పాళ్యం రాము, పాళ్యం ఈశ్వరయ్య, సరిబాల రాజారెడ్డి, రవీంద్రారెడ్డి, పుల్లారెడ్డి, జొన్నగడ్డల శ్రీనివాస నాయుడు, బాలకృష్ణ తదితరులు సాగు చేసిన 130 ఎకరాల్లోని అరటి తోటలు ధ్వంసమయ్యాయి. తురకవారిపల్లిలో తమ్మినేని నరసింహనాయుడు, శ్రీరాములు, సూర్యనాగరాజు, పి.నారాయణ, నాగభూషణ, టి.నాగభూషణకు చెందిన దానిమ్మ చెట్లు నేలకొరిగాయి. ఇక టమాట తదితర పంటలు కూడా దెబ్బతిన్నాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. వడగండ్ల వర్షం, ఈదురు గాలులకు నేలకొరిగిన పంటలు -
ఇసుక దోపిడీ అడ్డగింత
గోరంట్ల: బూదిలి సమీపాన చిత్రావతి నదిపై బ్రిడ్జి నిర్మాణం మాటున కాంట్రాక్టర్ ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. హిటాచీలు పెట్టి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేస్తుండడంతో ఆదివారం సాయంత్రం బూదిలి సర్పంచ్ రామాంజనేయులు, మాజీ సర్పంచ్ శ్రీనివాసులరెడ్డి, బూదిలి, పాపిరెడ్డిపల్లి, గొల్లపల్లి, గంగాదేపల్లి గ్రామాల చిత్రావతి పరివాహక ప్రాంత రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుని అడ్డుకున్నారు. బ్రిడ్జి నిర్మాణం పేరిట అవసరానికి మించి ఎందుకు ఇసుక తవ్వి డంప్ చేస్తున్నారని కాంట్రాక్టర్ను నిలదీశారు. ఒక వేళ చిత్రావతి నది నుంచి ఇసుక తవ్వకం, తరలింపునకు అనుమతులు తీసుకుంటే పత్రాలు చూపాలని డిమాండ్ చేశారు. దీనికి కాంట్రాక్టర్ తరఫు నుంచి సరైన సమాధానం రాలేదు. ఇక్కడ తవ్విన ఇసుకను బ్రిడ్జి కోసం కాకుండా ఇతర పనుల్లో వాడేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు. చిత్రావతి నదిలోని ఫిల్టర్ బోరుబావుల కింద వందలాది ఎకరాల్లో పంటలు సాగు చేసుకున్నామని, ఇసుకను ఎడాపెడా తవ్వేస్తే భూగర్భజలాలు తగ్గిపోయి పంటలు ఎండిపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వే క్రమంలో ఫిల్టర్ బోర్లను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. -
క్రికెట్ బెట్టింగ్ జోరు
బెట్టింగ్లకు పాల్పడే వారిపై చర్యలు క్రికెట్ బెట్టింగ్ల పేరుతో యువతను ఊబిలోకి దించి ఆన్లైన్లో, ప్రత్యేక యాప్ల ద్వారా నేరుగా ఆడించి కమీషన్లు పొందే వారిపై కఠిన చర్యలు తప్పవు. యువత కూడా క్రికెట్ మోజులో పెడదారి పట్టకుండా జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలి. – కె.వి.మహేష్, డీఎస్పీ, హిందూపురం హిందూపురం అర్బన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ –2025 (ఐపీఎల్) 18వ సీజన్ మొదలైంది. ఉత్కంఠగా సాగే ఈ క్రికెట్ మ్యాచ్లను అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అభిమానుల ఉత్సాహాన్ని సొమ్ము చేసుకోవడానికి బుకీలు రంగంలోకి దిగారు. ‘మీ ఫేవరెట్ టీమ్ గెలుస్తుందా.. నిజంగా టీమ్పై అభిమానం ఉంటే బెట్టింగ్ కట్టవచ్చు కదా.. సరదాకు సరదా.. డబ్బులూ గెలుచుకోవచ్చు.. అంటూ చిన్నగా ముగ్గులోకి దించుతున్నారు. బెంగళూరు కేంద్రంగా హిందూపురం, కదిరి, పెనుకొండ, ధర్మవరం, మడకశిర పట్టణాలే కాకుండా మండల కేంద్రాలకు .. గ్రామాలకు బెట్టింగ్ వ్యవహారం విస్తరిస్తోంది. ఇదేమీ గుట్టుగా కాదు ఆన్లైన్ ద్వారా బహిరంగంగానే సాగిస్తున్నారు. బెట్టింగ్ అంతా సెల్ ఫోన్లోనే సాగుతోంది. ఇరువురు ఫోన్లలోనే కాంటాక్ట్ చేసి బెట్టింగులు కాయిస్తున్నారు. గెలిచిన వారి నుంచి కమీషన్ పొందేలా ఏర్పాట్లు చేసుకొన్నారు. పట్టణాలు, పల్లెల్లోని యువకులను టార్గెట్ చేస్తున్నారు. జిల్లాలో ఎంతోమంది యువకులు బెట్టింగ్లో ఓడి అప్పుల పాలైన సంఘటనలు గతంలో వెలుగుచూశాయి. కొందరు పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయి జీవితాలు నాశనం చేసుకొన్న విషయమూ విదితమే. ప్రతి బంతికీ ఓ రేటు.. టాస్ వేసే సమయం నుంచి బ్యాటింగ్ ఎవరు ఎంచుకొంటారు.. బౌలింగ్ ఎవరు చేస్తారు.. ఏ క్రికెటర్ ఎన్ని పరుగులు తీస్తాడు.. ఓవర్కు ఎన్ని పరుగులు వస్తాయి.. ఎవరు గెలుస్తారు.. ఎన్ని పరుగులతో మ్యాచ్ పూర్తి కానుంది .. ఇలా ప్రతి దానికీ ఒక పందెం ఉంటుంది. ప్రత్యేక యాప్ల ద్వారా.. ఆండ్రాయిడ్ సెల్ఫోన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడేవారు కొన్ని యాప్లను డౌన్లోడ్ చేసుకొని మ్యాచ్లను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ పందేలు కాయడం.. మ్యాచ్ చూసేందుకు ఒకటి.. బెట్టింగ్ కాసేందుకు మరో మొబైల్ వినియోగించి ఆన్లైన్లో క్రికెట్ బుకీలు సంప్రదింపులు జరుపుతూ కమీషన్ పొందుతున్నారు. ఇక స్థానికంగానూ.. హిందూపురం, ధర్మవరం, కదిరి లాంటి పెద్ద పట్టణాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ యువత పోగై తమకు అనువైన ప్రదేశాలను ఎంచుకొని అక్కడికి చేరుకొని నేరుగా బెట్టింగ్లకు దిగుతున్నారు. గతంలో ఎవరెవరు బెట్టింగ్లకు పాల్పడింది గుర్తించిన కొంత మంది పోలీసులు సైతం సొమ్ము చేసుకొంటున్నారు. అప్పుడే మొదలైన జోరు.. పట్టణాలు, గ్రామాల్లో అప్పుడే యువత బెట్టింగ్ల జోరు కనిపిస్తోంది. ప్రధానంగా ఏయే తేదీల్లో ఎవరెవరి మధ్య మ్యాచ్ జరగనుందో తెలుస్తుండటంతో చైన్నె, బెంగళూరు, హైదరాబాద్ , ముంబై టీమ్లపై బెట్టింగ్లు కాయనుండగా.. వీరిని కొందరు బుకీలు తమ వైపు తిప్పుకొని డబ్బు కాజేస్తున్నారు. కోడ్ లాంగ్వేజ్లతో.. బెట్టింగ్ వ్యవహరం అంతా కోడ్ లాంగ్వేజీలోనే సాగేలా ఏర్పాట్లు చేసుకొన్నారు. సెల్ ఫోన్లోనే ఎస్.. నో.. ఓకే.. డన్.. ఈటింగ్ వంటి పదాలు దీనికోసం వాడనున్నారు. చాలామంది సెల్ఫోన్లకు అతుక్కుపోయి పందేలు కాసేందుకు ప్రత్యేక కేంద్రాలను సిద్ధం చేసుకొన్నారు. ఇందుకు హిందూపురం పట్టణంలో బెంగళూరు రోడ్డు, మోడల్ కాలనీ, ముద్దిరెడ్డిపల్లి. దండు రోడ్డు, చిలమత్తూరు, లేపాక్షి మండల కేంద్రాల్లో కొంతమంది యువత తమకు అనువైన ప్రదేశాలకు మ్యాచ్ టైమ్లో చేరుతున్నారు. టీవీలు చూస్తూ పందేలు కాస్తున్నారు. గ్రౌండ్లో చూసే ఆటకు.. టీవీల్లో చూసే వారికి రెండు నుంచి మూడు బంతుల సమయం తేడా ఉంటుంది. ఆట ముందే తెలుసుకొని బెట్టింగులు కాసే వారి జేబులను బుకీలు గుల్ల చేస్తున్నారు. ఇది యువత గమనించాలి. మ్యాచ్లో ఎవరు గెలవనున్నారు.. ఎవరు ఓడి పోతారు.. ఎవరెన్ని పరుగులు చేస్తారు.. ఈ ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయనే కోణంలోనూ పందేలు కాయడం మొదలైంది. మొదలైన ఐపీఎల్ మ్యాచ్ల సందడి అభిమానుల అమితాసక్తిపై బుకీల వల బెట్టింగ్లోకి దింపి.. గుల్ల చేస్తున్న వైనం -
అవగాహన కల్పిస్తున్నాం
క్షయ నివారణకు పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ఒకరి నుంచి సగటున మరో 15 మందికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. వ్యాధి సోకే విధానం, ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. దీర్ఘకాలికంగా దగ్గు ఉన్నా.. ఆకలి మందగించినా.. బరువు తగ్గినా.. వెంటనే సమీపంలోని పీహెచ్సీలో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిది. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకుంటే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. – డాక్టర్ తిప్పయ్య, జిల్లా క్షయ అధికారి, పుట్టపర్తి -
కాక రేపుతున్న కొల్లేరు
అనంతపురం: ఐపీఎల్ తరహాలో సాగుతున్న ఏపీ సూపర్ కప్ ఫుట్బాల్ టోర్నీలో కొల్లేరు క్లబ్ జట్టు కాకరేపుతోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఏపీ సూపర్ కప్ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలిపి 8 జోన్లుగా, 8 క్లబ్లుగా విభజించి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో కొల్లేరు క్లబ్ జట్టులో ఏలూరు, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే. లీగ్ కం నాకౌట్ పద్థతిలో సాగుతున్న ఈ మ్యాచ్లు హోరాహోరీగా సాగుతున్నాయి. అనంతపురంలోని ఆర్డీటీ క్రీడాగ్రామం వేదికగా సాగుతున్న ఈ టోర్నీలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ల్లో అన్నింటా విజయం సాధించి కొల్లేరు క్లబ్ జట్టు 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో నల్లమల క్లబ్ జట్టుపై తలపడిన విశాఖ క్లబ్... 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్లో తుంగభద్ర క్లబ్పై ఏకంగా ఐదు గోల్స్ సాధించి గోదావరి క్లబ్ జట్టు (5–0) విజయం కై వసం చేసుకుంది. కొల్లేరు–కోరమాండల్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్లో 2–0 గోల్స్ తేడాతో కొల్లేరు క్లబ్ విజయకేతనం ఎగురవేసింది. -
కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృతి
ఎన్పీకుంట: వీధి కుక్కలు దాడి చేయడంతో గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఎన్పీకుంట మండలం ఎస్కే తండా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన రైతు దుంగావత్ కృష్ణానాయక్ పాడితో పాటు గొర్రెల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఇంటిక సమీపంలోని గొర్రెల కోసం ఓ దొడ్డిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆదివారం ఉదయం గొర్రె, మేక పిల్లలను దొడ్డిలో వదిలి ఇంటికి వెళ్లి వచ్చేసరికి వీధి కుక్కలు చొరబడి 10 గొర్రె పిల్లలు, పది మేక పిల్లలను చంపేశాయి. రూ.90 వేలు నష్ట పోయినట్లు రైతు వాపోయాడు. అభివృద్ధి పనుల ప్రారంభంసోమందేపల్లి: స్థానిక సప్తగిరి కాలనీ, గీతానగర్లో రూ.1.50 కోట్లతో తలపెట్టిన సీసీ రోడ్లు డ్రైనేజీ పనులను మంత్రి సవిత ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరేంద్ర కుమార్, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ఆంజనేయులు పాల్గొన్నారు. -
సూక్ష్మ సేద్యం పరికరాల దగ్ధం
చెన్నేకొత్తపల్లి: మండలంలోని పులేటిపల్లి గ్రామ సమీపంలో పొలాల్లో ఉంచిన డ్రిప్, స్ప్రింక్లర్ల పైపులు ఆదివారం అగ్నికి ఆహుతైనట్లు రైతు వాపోయాడు. వివరాలు... గ్రామానికి చెందిన రైతు దాసరి పెద్దన్న తన పొలంలో ఉన్న వేప చెట్టు కింద 30 స్ప్రింక్లర్ల పైపులు, 15 కట్టల డ్రిప్ పైపును భద్ర పరిచాడు. ఆదివారం మధ్యాహ్నం ఉన్నఫలంగా మంటలు వ్యాపించి సూక్ష్మ సేద్యం పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనతో రూ.50 వేల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. ‘రెవెన్యూ’ బెదిరింపులు.. రైతు ఆత్మహత్యాయత్నంబత్తలపల్లి: రెవెన్యూ అధికారుల బెదిరింపులతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం ఉప్పర్లపల్లి గ్రామానికి చెందిన రైతు నారాయణస్వామికి గ్రామంలో తనకున్న 2.43 ఎకరాల పొలంలో వ్యవసాయంతో పాటు గొర్రెల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గొర్రెల పోషణకు తన పొలంలో కంచె వేయాలని నిర్ణయించుకుని ఇప్పటికి ఐదు దఫాలుగా రెవెన్యూ అధికారులతో సర్వే చేయించాడు. అధికారలు నిర్దేశించిన హద్దుల మేరకు తన భాగానికి వచ్చిన పొలంలో కంచె వేసేందుకు సిద్ధం కాగా, పక్క పొలం రైతు అభ్యంతరాలు లేవనెత్తాడు. అంతటితో ఆగకుండా విషయాన్ని గ్రామ సర్వేయర్ రవికిరణ్, వీఆర్ఓ నాగేంద్ర దృష్టికి తీసుకెళ్లడంతో వారు నారాయణస్వామికి ఫోన్ చేసి కంచె ఎలా వేస్తావంటూ బెదిరింపులకు దిగారు. దీంతో మనస్తాపానికి గురైన నారాయణస్వామి శనివారం తన పొలంలోనే క్రిమి సంహారక మందు తాగాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఉప్పర్లపల్లికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలసి ఆరా తీశారు. ఘటనపై ఫిర్యాదు స్వీకరించారు. బెంగళూరులోని ఆస్పత్రికి పోలీసులు వెళ్లి బాధితుడి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు. కాగా, తాము బెదిరించలేదని, సమస్యను పరిష్కరించేందుకు సర్దిచెప్పినట్లు పోలీసుకు వీఆర్వో నాగేంద్ర, సర్వేయర్ రవికిరణ్ తెలిపినట్లు సమాచారం. -
విద్యార్థిని చితకబాదిన వార్డెన్
ధర్మవరం: మండలంలోని నాగలూరు వద్ద ఉన్న పీసీఎంఆర్ పాఠశాల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థిపై కిషోర్ని ఆదివారం రాత్రి వార్డెన్ సందీప్ చితకబాదాడు. బాధిత విద్యార్థి తెలిపిన మేరకు... ఆదివారం రాత్రి స్టడీ ఆవర్ ముగిసిన తర్వాత డయాస్ పైకి వెళ్లాలని వార్డెన్ తెలిపాడు. దీంతో కిషోర్ డయాస్పైకి వెళుతుండగా ‘ఇంకా ఇక్కడే ఉన్నావా’ అంటూ వార్డెన్ ఓ పైపు తీసుకుని బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ‘నీవు ఎంపీపీ సంగాలప్ప కొడుకువురా’ అంటూ దుర్భాషలాడుతూ పదేపదే పైపుతో కొట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకునేలోపు వార్డెన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వీపుపై, కాళ్లపై బలమైన గాయాలు కావడంతో అక్కడే కుప్పకూలి పోయిన విద్యార్థిని తల్లిదండ్రులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. 8 మందిపై హత్యాయత్నం కేసు నమోదు గోరంట్ల: ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించి 8 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు. వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. గోరంట్ల మండలం కంగారెడ్డిపల్లికి చెందిన రంగారెడ్డి, హిందూపురానికి చెందిన రాజశేఖర్రెడ్డికి మధ్య కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వేటకొడవళ్లు, ఇనుపరాడ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనకు సంబంధించి రంగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిందూపురానికి చెందని రాజశేఖర్రరెడ్డి, కంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బయపరెడ్డి, నరేంద్రరెడ్డిపై, రాజశేఖరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎరువుల అంగడి రంగారెడ్డి, అశ్వత్థరెడ్డి, జగన్నాథరెడ్డి, విజయకుమార్రెడ్డి, జనార్ధనరెడ్డిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు వేటకొడవళ్లు, ఓ ఇనుప రాడ్ స్వాధీనం చేసుకున్నారు. చీనీ చెట్లు దగ్ధంకనగానపల్లి: ఆకతాయిలు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి చీనీ తోట దగ్ధమైంది. వివరాలు.. కనగానపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన రైతు మురళి తనకున్న నాలుగు ఎకరాల్లో ఐదేళ్ల క్రితం 350 చీనీ మొక్కలు నాటాడు. ప్రస్తుతం పంట కాయ దశలో ఉంది. ఆదివారం మధ్యాహ్నం తోటకు సమీపంలోని ఎండు గడ్డికి ఆకతాయిలు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి తోటను చుట్టుముట్టాయి. చుట్టుపక్కల రైతులు గమనించి మంటలు ఆర్పే లోపు 200 చీనీ చెట్లు, డ్రిప్ పరికరాలు, పైపులు కాలిపోయాయి. రూ.3.5 లక్షల మేర నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. రెవెన్యూ, ఉద్యానశాఖ అధికారులు పరిశీలించి తనకు నష్టపరిహారం అందించాలని వేడుకున్నాడు. -
విస్తరిస్తున్న క్షయ
సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో క్షయ వ్యాధి నానాటికీ విస్తరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా రోజురోజుకీ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. సకాలంలో చికిత్స చేయించుకోకపోవడం, పాజిటివ్గా నిర్ధారణ అయినా మందులు సక్రమంగా వాడకపోవడం వంటి కారణాలతో బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. జిల్లాలో ఏటా వేల మంది క్షయ వ్యాధి బారిన పడుతున్నారు. జాగ్రత్తలు పాటించకపోవడమే ఇందుకు కారణంగా వైద్యాధికారులు చెబుతున్నారు. ఇతర వ్యాధులతో పోలిస్తే క్షయ చాలా ప్రమాదకారి వ్యాధిగా వైద్యులు చెబుతున్నారు. ఆరంభంలోనే గుర్తించి మందులు సక్రమంగా వాడితే నివారణ సాధ్యమని, లేకపోతే ప్రాణాపాయం తప్పందని హెచ్చరిస్తున్నారు. గాలి ద్వారా సులువుగా.. ‘మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్’ బ్యాక్టీరియా ద్వారా క్షయ వ్యాధి సోకుతుందని నిపుణులు అంటున్నారు. ఈ బ్యాక్టీరియా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సులువుగా సంక్రమిస్తుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో వేగంగా విస్తరిస్తుంది. రోగి దగ్గినప్పుడు, ఉమ్మిప్పుడు, చీదినప్పుడు రోగకారక క్రిములు గాలిలోకి చేరుతాయి. తద్వారా మరొకరి శరీరంలోకి ప్రవేశిస్తాయి. క్షయ రోగి ఓసారి దగ్గితే సుమారు 40 వేల వరకు వ్యాధికారక క్రిములు గాల్లో కలుస్తాయి. ప్రజల్లో అవగాహన లేని కారణంగా ఒకరి నుంచి మరొకరికి సులువుగా సోకుతోందని వైద్యులు అంటున్నారు. ముంచుతోన్న నిర్లక్ష్యం క్షయ వ్యాధిలో వివిధ రకాలు ఉన్నాయి. టీబీ సోకితే ఆరు నెలల మందులు వాడితే సరిపోతుంది. ఎండీఆర్ సోకితే దీర్ఘకాలంగా మందులు వాడాల్సి ఉంటుంది. ఎక్స్డీఆర్ సోకిన వారు ఆస్పత్రుల్లో డాక్టర్ల పర్యవేక్షణలోనే చికిత్స పొందాల్సి ఉంటుంది. ఈ విషయంగా ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో నేలకోట, నేలకోటతండా, పోతులనాగేపల్లి, ఉప్పనేసినపల్లి, టేకులోడు, బ్రాహ్మణపల్లి, మండ్లి, పందిపర్తి, మొలకవేముల, ఒడ్డుకిందతండా, తురకలాపట్నం, మదిరేబైలుతండా, ఇరగంపల్లి, గోపేపల్లి, మసకవంకపల్లి, పులగంపల్లి, వేళ్లమద్ది, తిప్పేపల్లి, అమగొండపాలెం, పైపల్లి గ్రామాలు క్షయ రహితంగా అధికారులు గుర్తించారు. వ్యాధి నివారణకు ఎనిమిది ప్రాంతాల్లో వ్యాధి నివారణ యూనిట్లు ఏర్పాటు చేశారు. రోగులు అక్కడికి వెళ్తే మందులు ఉచితంగా అందిస్తారు. సకాలంలో డాక్టర్ల సలహాల మేరకు మందులు వాడితే వ్యాధి నియంత్రణలోనే ఉంటుంది. ఏడాదిలో తేలిన 2,119 పాజిటివ్ కేసులు జిల్లా వ్యాప్తంగా 8 చోట్ల యూనిట్లునేడు ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భం : క్షయ వ్యాధి లక్షణాలు రెండు వారాల పాటు క్రమం తగ్గని దగ్గు రెండు వారాలకు మించి జ్వరం తెలియకుండా బరువు తగ్గిపోవడం రాత్రిపూట చెమటలు పట్టడం -
కౌలు రైతులకూ డ్రిప్ పరికరాలు
అనంతపురం సిటీ: కౌలు రైతులకూ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సరఫరా చేసి ఆదుకోవాలని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం చేయొద్దని ఉభయ జిల్లాల జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయీ సంఘ–1, 2, 3, 4, 5, 6, 7(ఆర్థిక, ప్రణాళిక/గ్రామీణాభివృద్ధి/వ్యవసాయం/విద్య, వైద్య/పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ శాఖలు/ఐసీడీఎస్/ సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రధాన సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుక్కరాయసముద్రం, గోరంట్ల, కణేకల్లు, నార్పల జెడ్పీటీసీ సభ్యులు భాస్కర్, జయరాం, పద్మావతి, వేదాంతం నాగరత్నమ్మ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, కనీసం తాగునీరు కూడా సరఫరా చేయకపోతే ఎలాగని అధికారులను నిలదీశారు. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ కల్పించుకుంటూ.. వేసవికి ముందే ఎక్కడెక్కడ తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందో గుర్తించి, అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించడంలో ఎందుకు వైఫల్యం చెందారంటూ రెండు జిల్లాల ఎస్ఈలను నిలదీశారు. తాగునీటి పథకాల నిర్వహణకు కోట్లాది రూపాయలు జెడ్పీ నుంచి నిధులు ఇస్తున్నా వాటర్ సీనరైజ్ చార్జెస్ను మున్సిపాలిటీల నుంచి వసూలు చేసుకొని వాడుకోవడం ఏమిటో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి తాగునీటి పథకంలో ఫిల్టర్ బెడ్స్ మార్చాలని ఆదేశించారు. దళితవాడలు, గిరిజన తండాల్లో రహదారులు, తాగునీటి సమస్యలను తక్షణం పరిష్కరించాలని కంబదూరు జెడ్పీటీసీ సభ్యుడు గుద్దెళ్ల నాగరాజు అధికారులను కోరారు. పాఠశాలలను తరచూ తనిఖీలు చేస్తే ఉపాధ్యాయుల్లో బాధ్యత పెరుగుతుందని నార్పల జెడ్పీటీసీ నాగరత్నమ్మ అన్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని గిరిజమ్మ సూచించారు. గత ప్రభుత్వం రూ. కోట్లు ఖర్చుపెట్టి అన్ని హంగులతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాల భవనాల్లో కొన్ని మండలాల్లో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడంపై అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ను బ్రోకర్లు శాసిస్తారా? శ్రీసత్యసాయి జిల్లాలో ఐసీడీఎస్ జిల్లా కార్యాలయాన్ని ఓ బ్రోకర్ శాసిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని గోరంట్ల జెడ్పీటీసీ సభ్యుడు పాలే జయరాం నాయక్ ఆరోపించారు. సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జయరాం నాయక్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలోనూ కొందరు సీడీపీఓలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అంగన్వాడీ కేంద్రాలను గాలికొదిలేశారని జెడ్పీ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ ఆరోపించారు. ఈ అంశంపై ఐసీడీఎస్ శ్రీసత్యసాయి జిల్లా పీడీ భారతి స్పందిస్తూ.. తాను కొత్తగా వచ్చానని, పరిశీలించి చర్యలు తీసుకుంటానన్నారు. అనంతపురం అర్బన్ పరిధిలోని బుడ్డప్పనగర్ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త భాగ్యమ్మ పదేళ్లుగా విధులకు డుమ్మాకొట్టి, ప్రైవేటు కాలేజీలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నట్లు గత సమావేశాల్లో అధికారుల దృష్టికి తెచ్చామని, ఆమైపె ఎటువంటి చర్యలు తీసుకున్నారని రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్ ఐసీడీఎస్ పీడీ నాగమణిని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పీడీ నాగమణి స్పందిస్తూ.. ఈ రోజే తొలగింపు ఉత్తర్వులు ఆమెకు అందించామని సమాధానమిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆదేశం -
కూటమి కినుక.. చేను తడవక
వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వరుసగా మూడేళ్ల పాటు కృష్ణా జలాలు మడకశిర మండలానికి వచ్చాయి. మడకశిర చెరువును సైతం కృష్ణా జలాలలో రెండుసార్లు నింపారు. దీంతో నియోజకవర్గ రైతులంతా ఎంతో సంతోషించారు. మిగతా మండలాలకు కూడా కృష్ణా జలాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి సర్కార్ ఈప్రాంత రైతులను పూర్తిగా విస్మరించింది. వైఎస్ జగన్ హయాంలో కృష్ణాజలాలు వదలడంతో పూర్తిగా నిండి మరువ పారుతున్న మడకశిర చెరువుమడకశిర: సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న మడకశిర నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి చూసి వైఎస్ రాజశేఖర్రెడ్డి చలించిపోయారు. 2004లో హంద్రీనీవా సుజల స్రవంతి పథకం (హెచ్ఎన్ఎస్ఎస్) ద్వారా నియోజక వర్గానికి కృష్ణా జలాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలోనే హంద్రీనీవా కాలువ పనులను 80 శాతం పూర్తి చేశారు. అయితే ఆయన భౌతికంగా దూరమయ్యాక మడకశిర రైతులను పట్టించున్న వారే కనిపించలేదు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక మడకశిర ప్రాంత రైతుల్లో ఆశలు చిగురించాయి. వైఎస్ జగన్ చొరవతో.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక హెచ్ఎన్ఎస్ఎస్ పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడానికి చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిర నియోజకవర్గానికి కృష్ణా జలాలను చేరవేయడానికి బైపాస్ కెనాల్ను రూపొందించారు. పెనుకొండ నుంచి నేరుగా మడకశిరకు బైపాస్ కెనాల్ నిర్మించడానికి రూ.214.85 కోట్లు మంజూరు చేశారు. ఈ కెనాల్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టేందుకు వీలుగా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. వివిధ మండలాల్లో నిలిచిపోయిన హెచ్ఎన్ఎస్ఎస్ పనులు పూర్తి చేసేందుకు అధికారులు రూ.70 కోట్లతో ప్రతిపాదనలు పంపగా వైఎస్ జగన్ వెంటనే ఆమోదించి నిధుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్నికలు రావడం, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో హంద్రీనీవా పథకానికి గ్రహణం పట్టింది. సమీక్షలకే పరిమితం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 9 నెలలు గడిచింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంపై స్థానిక నాయకులు అధికారులతో పలుసార్లు సమీక్ష చేశారు. సంబంధిత మంత్రి కూడా సచివాలయంలో ఈ పథకంపై స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్షించారు. కానీ నిధుల విడుదలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం నియోజకవర్గంలో భూగర్భజలమట్టం తగ్గిపోగా బోర్లు పనిచేయడం లేదు. చెరువులకింద ఆయకట్టు పొలాలన్నీ బీళ్లుగా మారుతున్నాయి. దీంతో ఇటీవలే రైతు సంఘం నాయకులు స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం కూడా ఇచ్చారు. అయినా పాలకుల్లో ఏమాత్రం స్పందన లేదు. నీరిచ్చే అవకాశం ఉన్నా... అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాల్లో హంద్రీనీవా పనులు పెండింగ్లో ఉన్నాయి. గుడిబండ మండలం శింగేపల్లి వద్ద హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి అగళి, రొళ్ల, గుడిబండ మండలానికి ఓ మైనర్ కాలువ, అమరాపురం మండలానికి మరో మైనర్ కాలువ వెళ్తుంది. ఈ మైనర్ కాలువ పనులను పూర్తి చేస్తే అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాలకు కూడా సాగునీరు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. కనీసం ఈ పనులపై కూడా పాలకులు దృష్టి సారించలేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా రైతుల సాగునీటి ఘోష పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మడకశిర.. వ్యవసాయం తప్ప మరో ఆధారం లేని ప్రాంతం. వర్షాధారంపైనే ఆధారపడి ఇక్కడి రైతులు పంటలు సాగుచేస్తారు. వర్షాభావ పరిస్థితుల్లో పొలాలన్నీ బీళ్లుగా మారుతాయి. జనమంతా పొట్ట కూటికోసం కర్ణాటకకు వలస వెళ్లాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న వైఎస్ జగన్ నియోజకవర్గంలో కృష్ణా జలాలు పారించి ఈప్రాంత రైతులకు మేలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మడకశిరపై శీతకన్ను వేసింది. సాగునీరు ఇవ్వకుండా రైతులను అష్టకష్టాలు పెడుతోంది. మడకశిరలో సాగునీటి ఘోష నేటికీ పూర్తి కాని హంద్రీ–నీవా పనులు కృష్ణా జలాలు అందక పొలాలు బీళ్లు పెట్టిన రైతులు వైఎస్ జగన్ హయాంలో మూడేళ్లు పారిన కృష్ణా జలాలు గత ప్రభుత్వంలోనే ఎంబీసీకి రూ.214.85 కోట్ల మంజూరు హెచ్ఎన్ఎస్ఎస్ పనుల పూర్తికి రూ.70 కోట్లతో ప్రతిపాదనలు తాజాగా ‘బైపాస్ కెనాల్’కు మంగళం పాడిన కూటమి ప్రభుత్వం కాలువ పనులను పూర్తి చేయాలి అగళి మండలంలో హంద్రీనీవా కాలువ పనులు పూర్తి కాలేదు. వెంటనే ప్రభుత్వం కాలువ పనులను పూర్తి చేసి సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి. ముఖ్యంత్రి చంద్రబాబు మడకశిర నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కాలువ పనుల పూర్తికి నిధులు మంజూరు చేయాలి. వైఎస్ జగన్ మంజూరు చేసిన బైపాస్ కెనాల్ పనులను కూడా ప్రారంభించాలి. – చంద్రప్ప, రైతు, మధూడి, అగళి మండలంహామీ నిలబెట్టుకోవాలి ప్రస్తుతం అగళి మండలంలో భూగర్భ జలమట్టం భారీగా తగ్గింది. బోర్లలోనూ నీళ్లు రావడం లేదు. కూటమి నేతలు ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు మడకశిర నియోజకవర్గంలో హంద్రీనీవా సాగునీటి పథకాన్ని పూర్తి చేసి అన్ని మండలాలకూ కృష్ణా జలాలు అందించాలి. లేకపోతే సాగునీటి సమస్యతో వ్యవసాయానికి స్వస్తి పలకాల్సి వస్తుంది. – నాగరాజు, రైతు, అగళి -
మున్సిపాలిటీ స్థలం కబ్జా
● దర్జాగా షెడ్డు వేస్తున్న టీడీపీ నేత చిలమత్తూరు: హిందూపురం మున్సిపాలిటీ స్థలాన్ని ఓ టీడీపీ నాయకుడు కబ్జా చేశాడు. అంతేకాకుండా ఆ స్థలంలో దర్జాగా షెడ్ల నిర్మాణం చేపట్టాడు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని కొట్నూరు సర్వే నంబరు 259/1సీలో 18 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. ఇది గ్రామ కంఠంగా రికార్డుల్లో నమోదై ఉంది. దీనిపై కన్నేసిన టీడీపీ నాయకుడు గతంలోనే ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా.. మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడ నోటీసు బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సదరు నాయకుడు మళ్లీ కబ్జాకు తెగించాడు. శనివారం మున్సిపల్ అధికారులు నాటిన బోర్డును తొలగించి షెడ్ల నిర్మాణాలు చేపట్టాడు. దీంతో మున్సిపల్ అధికారులు ఆ పనులను తాత్కాలికంగా నిలిపివేయించారు. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న సదరు నాయకుడు... గతంలోనూ పట్టణంలోని మరొక ప్రాంతంలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి చేజిక్కుంచుకున్నారన్న ఆరోపణలున్నాయి. న్యూస్రీల్ -
జిల్లాలో వడగండ్ల వాన
చిలమత్తూరు/తనకల్లు: భానుడి భగభగలతో అల్లాడిపోతున్న జనంపై వరుణుడు కరుణ చూపాడు. వేసవి తీవ్రతతో జిల్లాలో పక్షం రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. శనివారం మధ్యాహ్నం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో పాటు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో మబ్బులు కమ్ముకున్నాయి. వెంటనే ఉరుములతో కూడిన వడగండ్ల వాన కురిసింది. తనకల్లు మండలంలో ఎన్ హెచ్–42పై వడగండ్లు పెద్ద ఎత్తున పడటంతో యువకులు కేరింతలు కొట్టారు. వడగండ్లను రోడ్డుపై కుప్పగా పోసి సెల్ఫోన్లతో చిత్రీకరించారు. కాగా, అకాల వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో టమాట, మొక్కజొన్న, దబ్బ చిక్కుడు పంటలు దెబ్బతిన్నాయి. ఇక చిలమత్తూరు మండల పరిధిలోని మొరసలపల్లిలోనూ వడగళ్ల వాన కురిసింది. పాలేపల్లిలో 20 ఎకరాల మేర కోత దశకు వచ్చిన వరి నేలపాలైంది. వడగండ్ల దెబ్బకు వడ్లు నేల రాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. -
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు శనివారం జరగనున్నాయి. స్థాయీ సంఘం–1, 2, 4, 7 (ఆర్థిక, ప్రణాళిక/ గ్రామీణాభివృద్ధి/ విద్య, వైద్యం/ పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ శాఖల) సమావేశాలు ప్రధాన సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నారు. స్థాయీ సంఘం–3, 5, 6 (వ్యవసాయం/ ఐసీడీఎస్/ సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు ఆయా సంఘాల చైర్పర్సన్ల అధ్యక్షతన జెడ్పీ అదనపు భవన్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పూర్తి చేశారు. సమావేశాలకు సంబంధించి సభ్యులతో పాటు ఆయా శాఖల అధికారులకు ఇది వరకే సమాచారం అందించారు. అయితే ఈసారి జరిగే సమావేశాలు వాడీవేడిగా జరగనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రధానంగా సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. అనంతపురం అర్బన్ ప్రాజెక్టులో ఓ అంగన్వాడీ టీచర్ విధులకు హాజరుకాకుండా ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న విషయం ఆధారాలతో సహా తేలినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. సామాజిక భద్రత పింఛన్లలో కోతలు, రేషన్ సరుకులను డీలర్లు సక్రమంగా పంపిణీ చేయకపోవడం తదితర సమస్యలు ఉన్నాయి. గృహనిర్మాణ శాఖలో ఉద్యోగుల పనితీరు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ సమస్యలన్నింటిపై సభ్యులు గళం విప్పనున్నారు. వాడీవేడీగా జరిగే అవకాశం ఉందని ముందే పసిగట్టిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పరిస్థితులపై ఆరా తీసినట్లు తెలిసింది. ప్రధాన సమస్యలపై నిలదీయనున్న సభ్యులు -
బాధ్యతతో విధులు నిర్వర్తించాలి : డీఎంహెచ్ఓ
హిందూపురం టౌన్: అన్ని ఆరోగ్య కార్యక్రమాలు సకాలంలో ప్రజలకు చేరువయ్యేలా బాధ్యతతో విధులు నిర్వర్తించాలని ఆరోగ్య సిబ్బందికి డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం సూచించారు. శుక్రవారం హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రి, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లోని రికార్డులు, ల్యాబ్ నిర్వహణ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్సీడీ సర్వే, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డ్స్ పంపిణీ, ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై ఆరా తీశారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలన్నారు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. యువకుడి ఆత్మహత్యడి.హీరేహాళ్ (రాయదుర్గం): డి.హీరేహాళ్ మండలంలోని లింగమనహళ్లి గ్రామానికి చెందిన బసవరాజు (24) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న బసవరాజుకు తల్లి భాగ్యమ్మతో పాటు ఓ సోదరుడు, సోదరి ఉన్నారు. అవసరాల నిమిత్తం రూ.20 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చేందుకు భూమి విక్రయిద్దామనుకుంటే అది కాస్త కోర్టు పరిధిలో ఉంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి జీవితంపై విరక్తితో శుక్రవారం పొలం వద్ద క్రిమి సంహారక మందు తాగాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే బళ్లారిలోని విమ్స్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే మృతి చెందాడు. మృతుడి తల్లి కురుబ భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పండ్ల వ్యాపారి దుర్మరణం పావగడ: స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొమ్మతమరి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ప్రమాదంలో పండ్ల వ్యాపారి ఖాసీం సాహెబ్( 60) దుర్మరణం పాలయ్యాడు. సీఐ సురేష్ తెలిపిన మేరకు... వెంకటాపురం గ్రామానికి చెందిన ఖాసీం సాహెబ్ పెనుకొండలో పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున తన టీవీఎస్ వాహనంపై బయలుదేరిన ఆయనను తెల్లవారుజాము 5 గంటలకు దొమ్మతమర్రి శివారులోకి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఘటనలో ఖాసీం సాహెబ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో పాటు ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
ఎలుగుబంటి దాడిలో ఒకరికి గాయాలు
అమరాపురం: మండలంలోని కె.శివరం గ్రామ శివారులో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. గ్రామానికి చెందిన పాడి రైతు మహంతేష్ గ్రామ సమీపంలోని పొలంలో గేదెకు గ్రాసం కోస్తుండగా పొదల మాటు నుంచి ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. ఆ సమయంలో ప్రతిఘటించడంతో రెండు చేతులకు గాయాలయ్యాయి. మహంతేష్ కేకలు విన్న సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్న వారు అక్కడకు చేరుకుని గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంటి బెదిరి అక్కడి నుంచి పారిపోయింది. క్షతగాత్రుడిని హేమావతిలోని పీహెచ్సీకి తరలించారు. గ్రామ శివారలోకి ఎలుగుబంటి వచ్చిన విషయం తెలుసుకున్న స్థానికులు, అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టారు. చిరుతల దాడిలో జీవాల మృతి పావగడ: తాలూకాలోని కన్నమేడి గ్రామంలో చిరుతల దాడిలో నాలుగు గొర్రెలు, మేకలు మృతి చెందాయి. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత రైతు హనుమంతరాజు తెలిపిన మేరకు.. గ్రామం బయలు ప్రదేశంలో చెరువు వద్దకు గురువారం సాయంత్రం తన మేకలు, గొర్రెలను మేపునకు హనుమంతరాజు తీసుకెళ్లాడు. ఆ సమయంలో పొదల మాటు నుంచి వచ్చిన రెండు చిరుతలు మందపై దాడి చేశాయి. ఘటనలో రెండు గొర్రెలు, రెండు మేకలు మృతి చెందాయి. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన హనుమంతరాజు భయభ్రాంతులకు గురయ్యాడు. జీవాల పెంపకంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్న తనకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని అటవీ శాఖ అధికారులను కోరాడు. బ్యాంకుల బంద్ వాయిదా అనంతపురం అగ్రికల్చర్: ఈ నెల 24, 25న తలపెట్టిన బ్యాంకుల బంద్ వాయిదా పడింది. ఈ మేరకు బ్యాంకు ఉద్యోగుల యూనియన్ నాయకులు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. జాతీయ కమిటీ, కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సమస్యల పరిష్కారానికి సానుకూల స్పందన వ్యక్తమైన నేపథ్యంలో సమ్మెను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు జాతీయ కమిటీ నుంచి సమాచారం అందిందన్నారు. -
హత్యకు పురిగొల్పిన అనుమానం
హిందూపురం: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానమే సద్దాం హత్యకు కారణమైందని హిందూపురం డీఎస్పీ మహేష్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులు నలుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు వివరించారు. శుక్రవారం స్థానిక పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. హిందూపురం పట్టణానికి చెందిన షేక్ మహమ్మద్ షఫీ, రేష్మా అలియాస్ ఆయేషా దంపతులు. కుటుంబ పోషణకు స్థానిక ఓ రీలింగ్ యూనిట్లో ఆయేషా కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న సద్దాం బేగ్ పరిచయమయ్యాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉండేవారు. ఈ విషయం తెలుసుకున్న షఫీ... తన భార్యపై అనుమానాలు పెంచుకుని ఈ నెల 15న ఆస్పత్రి వద్ద సద్దాం బేగ్తో గొడవపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న షఫీ.. ఈ నెల 17న రాత్రి తన కుటుంబసభ్యులతో కలసి సద్దాం బేగ్ను ద్విచక్ర వాహనంపై అపహరించి, మలుగూరు చెరువు కట్ట కింద వేట కొడవండ్లతో దాడి చేసి హతమార్చాడు. హతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాలతో కొట్నూర్ శివారులో తచ్చాడుతున్న షేక్ మహమ్మద్ షషీతోపాటు అతని తమ్ముడు తౌఫిక్, చెల్లెలు రేష్మా, తల్లి సల్మాను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. సద్దాం హత్య కేసులో వీడిన మిస్టరీ నలుగురు నిందితుల అరెస్ట్ -
‘హరి–హర’ క్షేత్రానికి అడుగులు
● భారీ ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేసిన సనాతన ధర్మపరిరక్షణ వేదిక ●రూ.1,200 కోట్ల వ్యయంతో బృహత్ క్షేత్ర నిర్మాణం ●సమావేశంలో వెల్లడించిన సుప్రసిద్ధ స్తపతులు అనంతపురం కల్చరల్: ప్రపంచంలోనే ఎత్తైన 216 అడుగుల రామానుజల విగ్రహం, ఓంకారేశ్వరంలోని 108 అడుగుల ఆదిశంకర భగవత్పాదుల విగ్రహం, తెలంగాణాలో సుప్రసిద్ధి చెందిన యాదాద్రి గుట్టపై ఉన్న స్వర్ణగిరి మందిరాన్ని మించిన మరో అరుదైన ఆలయానికి ‘అనంత’ వేదికగా మారనుంది. సనాతన ధర్మ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్మాణమయ్యే అపురూపమైన ఈ కట్టడ నమూనాలను అనంత ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు శుక్రవారం అనంతపురంలోని గీతామందిరంలో ధర్మప్రచార మండలి అధ్యక్షుడు శ్రీపాద వేణు, ఇస్కాన్ ఇన్చార్జి దామోదర గౌరంగదాసు నేతృత్వంలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ ఆలయాలు, కట్టడాలను నిర్మించిన ప్రముఖ శిల్పులు డీఎన్వీ ప్రసాద్ స్తపతి, రాజమండ్రికి చెందిన శ్రీనివాస స్తపతి, తిరుమల గోవింద పీఠం పీఠాధిపతి శ్రీరామప్రియ యతీంద్ర స్వామీజీ తదితరులు మాట్లాడారు. వైదిక ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మరోసారి ఆధ్యాత్మికంగా స్వర్ణయుగం రానున్న నేపథ్యంలో చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ధార్మిక మండళ్ల ప్రతినిధులు పరాంకుశం కృష్ణశర్మ, ఆచార్య మనోరంజనరెడ్డి, చిదంబరం, శ్రీధర్, చంద్రశేఖర్, రంగారెడ్డి తదితరులు మాట్లాడుతూ.. కోటి మంది హిందువులను భాగస్వాములను చేస్తూ దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో అనంత వేదికగా బృహత్ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని నాయనిపల్లి క్రాస్ వద్ద ప్రాచీన విశేషాలతో కూడిన ‘హరి–హర క్షేత్రం’ నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలోనే ఎత్తైన 300 అడుగుల కోటి లింగాల అపురూప మహాశివలింగం, దాని కిందనే దివ్య స్పటిక శ్రీచక్ర మేరువు, చుట్టూ అష్టాదశ శక్తిపీఠాల ఆలయాల ప్రతిష్టాపన జరుగుతాయన్నారు. దీనికి పక్కనే 108 అడుగుల శ్రీమన్నారాయణ విశ్వరూప దర్శన కాంస్య విగ్రహంతో పాటు, అదే పీఠంపై దశావతారాల విగ్రహాలు నిర్మిస్తున్నట్లుగా తెలిపారు. వీటికి ఎదురుగా 54 అడుగుల ఎత్తుతో నంది, గరుడ విగ్రహాలు, సప్తాశ్వ రథారూఢుడైన సూర్యదేవ విగ్రహం, త్రిమతాచార్యులైన ఆది శంకరులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యుల విగ్రహలను ఏర్పాటు చేస్తామన్నారు. అన్నింటి కంటే ప్రధానంగా ఈ విశాలమైన ప్రదేశంలో వైదిక ధర్మాన్ని నేర్పే సంస్కృత పాఠశాల, వేద విజ్ఞానాన్ని అందించే పుస్తక భాండాగారం, రిషి విజ్ఞాన డిజిటల్ లైబ్రరీ, ప్రాచీన ఆయుర్వేదాలయం, రామాయణ, భగవద్గీతల విశిష్టతలను తెలియజేసే కళాఖండాలూ నిర్మిస్తామన్నారు. దేశ విదేశాలలో స్థిరపడిన హిందువులు వచ్చి దర్శించుకునేందుకు వీలుగా పర్యాటకంగా ఈ ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రత్యేక కమిటీగా ఏర్పడిన ధర్మ పరిరక్షణ వేదిక సభ్యులు వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం ఈ అపురూప కట్టడం గోదావరి తీరంలో కట్టాలని సంకల్పించినా ఇక్కడి ఆధ్యాత్మికవేత్తల చొరవతో అనంతకు మార్చారన్నారు. ఈ ఏడాది ఆగస్టులో భూమి పూజ ఉంటుందని, అప్పటి నుంచి ఐదేళ్ల లోపు నిర్మాణం పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. -
హోరాహోరీగా ఏపీ సూపర్ కప్ ఫుట్బాల్ టోర్నీ
అనంతపురం: ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంత క్రీడాగ్రామంలోని ఆర్డీటీ ఫుట్బాట్ స్టేడియం వేదికగా సాగుతున్న ఏపీ సూపర్కప్ ఫుట్బాల్ టోర్నీ రెండో రోజు హోరాహోరీగా సాగింది. తొలి మ్యాచ్లో తుంగభద్ర క్లబ్ జట్టుతో తలపడిన కోరమాండల్ క్లబ్ జట్టు 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. నల్లమల క్లబ్, పెన్నా క్లబ్ మధ్య జరిగిన రెండో మ్యాచ్లో ఇరు జట్లూ చెరో గోల్ సాధించడంతో మ్యాచ్ డ్రా అయింది. గోదావరి క్లబ్, వంశధార క్లబ్ మధ్య జరిగిన మూడో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మ్యాచ్ ఆరంభం నుంచి గోదావరి క్లబ్ జట్టు క్రీడాకారులు దూకుడును ప్రదర్శిస్తూ వచ్చారు. 7–0 గోల్స్ తేడాతో గోదావరి క్లబ్ జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. కొల్లేరు క్లబ్, విశాఖ క్లబ్ జట్ల మధ్య జరిగిన నాల్గో మ్యాచ్లో కొల్లేరు రెండు గోల్స్ సాధించింది. విశాఖ క్లబ్ జట్టు పేలవమైన ఆటతీరుతో ఒక్క గోల్ కూడా సాధించలేక చతికిలపడింది. ఈ మ్యాచ్లో కొల్లేరు క్లబ్ జట్టు విజయం సాధించింది. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ల్లో కొల్లేరు, కోరమాండల్ క్లబ్ జట్లు ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాయి. మ్యాచ్లను ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, ఏపీఎఫ్ఏ సీనియర్ క్రీడాకారులు సుధాకర్, సిరాజుద్దీన్, నీలాద్రి, శేషగిరి రావు, అనిల్, సురేష్, పవన్, రాజేష్ పరిశీలించారు. మ్యాచ్ కమిషనర్గా రెడ్డప్ప వ్యవహరించారు. -
నేత్రపర్వం.. శ్రీవారి అలుకోత్సవం
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి అలుకోత్సవం నేత్రపర్వంగా సాగింది. అనంతరం స్వామివారు అశ్వవాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు అర్చకులు యాగశాలలో నిత్యహోమం నిర్వహించారు. అనంతరం శ్రీవారికి విశేషాలంకరణ చేసి ఆలయానికి సమీపంలో ఉన్న సుద్దుల మండపం వద్దకు తీసుకువచ్చారు. ఆనవాయితీ ప్రకారం అలుకోత్సవం ఉభయదారులుగా వ్యవహరించిన ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు బ్రహ్మోత్సవాలు, అలుకోత్సవ విశిష్టతను భక్తులకు వివరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. నేడు తీర్థవాది ఉత్సవం.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి శనివారం భృగుతీర్థం(కోనేరు)లో తీర్థవాది ఉత్సవం నిర్వహించనున్నారు. ఆదివారం(రేపు) నిర్వహించనున్న పుష్పయాగోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. -
●తాగునీటి కోసం నిరసన
లేపాక్షి: బోర్లలో నీరు పుష్కలంగా ఉంది..పైప్లైన్ సమస్య లేదు. మోటార్లు బాగానే పనిచేస్తున్నాయి. కానీ నిర్వహణ లోపంతో కల్లూరు ఎస్సీ కాలనీ వాసులు ఐదు నెలలుగా తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో బస్టాండు వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ, తమ కాలనీలో వ్యక్తిగత కొళాయిలు లేవని, దీంతో పబ్లిక్ ట్యాప్ల వద్దే నీరు పట్టుకుంటామన్నారు. నీరు తగినంత అందుబాటులో ఉన్నా సరఫరా చేయడంలో నిర్వాహకులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. దీంతో కుటుంబానికి రెండు, మూడు బిందెల నీరు అందడం లేదన్నారు. దీంతో నీటికోసం తాము ఐదు నెలలుగా పనులు మానుకుని పడరానిపాట్లు పడుతున్నామన్నారు. నీటి సమస్యతో హోలీ పండుగ కూడా చేసుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కల్లూరు ఎస్సీ కాలనీలో ఐదు నెలలుగా తాగునీటి సమస్య పట్టించుకోని అధికారులు... ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు -
పోక్సో కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలు
పుట్టపర్తి టౌన్: పోక్సో కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. ఈ మేరకు అనంతపురం స్పెషల్ సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పు చెప్పారు. నల్లమాడ మండలం ఎనుమలవారిపల్లికి చెందిన కుళ్లాయప్ప కుమారుడు వీరానిపల్లి చిరంజీవి (22) ఓ బాలికను ఇంటి వద్ద వదిలిపెడతానని తన ఆటోలో తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కదిరి పోలీస్ స్టేషన్లో 2019 మార్చి 22న కేసు నమోదు చేశారు. నిందితుడిని అదే రోజు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి సీఐ బి.వెంకట చలపతి కేసు దర్యాప్తు చేశారు. అనంతరం సీఐ టి.మధు జిల్లా సెషన్స్ కోర్టులో నిందితుడు వీరానిపల్లి చిరంజీవి అలియాస్ చిరుపై చార్జ్షీటు దాఖలు చేశారు. ఈ కేసును అనంతపురం ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేశారు. గురువారం ఈ కేసును ట్రయిల్ చేసి మొత్తం 14 మంది సాక్షులను విచారణ చేశారు. నేరం రుజువు కావడంతో ముద్దాయి వీరానపల్లి చిరంజీవి అలియాస్ చిరుకు 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ జిల్లా ప్రత్యేక న్యాయ స్థానం (పోక్సో కోర్టు) శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ.3 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. స్పెషల్ పీపీ ఈశ్వరమ్మ, విద్యాపతి వాదించారు. మెడికల్ షాపుల్లో అధికారుల తనిఖీలు హిందూపురం టౌన్: ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న, విజిలెన్స్ అధికారులు, ‘ఈగల్’ అధికారులు సంయుక్తంగా శుక్రవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఏడు మెడికల్ షాపులపై దాడులు చేశారు. హిందూపురంలోని నాగశ్రీ, జనతా, బృంద మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనల అతిక్రమణలపై కేసులను నమోదు చేశారు. ఒక మెడికల్ షాపులో కాలం చెల్లిన ఔషధాలను గుర్తించారు. ఉమ్మడి జిల్లాలోని నాలుగు షాపుల్లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే (ఎన్ఆర్ఎక్స్) మందుల కొనుగోలు, అమ్మకాలలో వ్యత్యాసాలు గుర్తించినట్లు అనంతపురం ప్రాంతీయ నిఘా, అమలు అధికారి వైబీపీటీఏ ప్రసాద్ తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ సీఐలు జమాల్బాషా, సద్గురుడు తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లిష్ పరీక్షకు 111 మంది గైర్హాజరు పుట్టపర్తి: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 111 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్ప తెలిపారు. జిల్లాలోని 104 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 21,396 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 21,285 మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. 13 మంది విద్యార్థుల డీబార్ అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్లో ఎల్ఎల్బీ మొదటి, ఆరో సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడిన 13 మంది విద్యార్థులను డీబార్ చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర మాస్కాపీయింగ్కు పాల్పడుతున్న విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
వ్యభిచారం కేసులో కానిస్టేబుల్ అరెస్ట్
హిందూపురం అర్బన్: అడ్డదారులు తొక్కి సులువుగా డబ్బు సంపాదించాలన్న ఓ కానిస్టేబుల్ ఏకంగా వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హిందూపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కానిస్టేబుల్ పురుషోత్తం హిందూపురం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఇటీవలే మడకశిర స్టేషన్కు బదిలీ అయ్యాడు. హిందూపురంలోని మోడల్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. పట్టణంలోని బోయ పేటకు చెందిన ఓ మహిళతో కలిసి ఆ ఇంట్లో వ్యభిచార కేంద్రాన్ని ప్రారంభించాడు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చేవారు. కానిస్టేబుల్ వ్యవహారశైలిని గమనించిన చుట్టుపక్కల ఇళ్ల వారు పలుమార్లు హెచ్చరించారు. అయినా పద్ధతి మార్చుకోకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండో పట్టణ సీఐ అబ్దుల్ కరీం, సిబ్బంది ఈ నెల 18న రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి కానిస్టేబుల్తో పాటు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం వెలుగు చూడటంతో శుక్రవారం ఇద్దరిపై కేసు నమోదు చేసి..రిమాండుకు తరలించారు. ఇదే కేసులో మేళాపురానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. కాగా.. కానిస్టేబుల్ పురుషోత్తం గుడిబండ స్టేషన్లో పనిచేసిన సమయంలోనూ పలు ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు. మరో ఇద్దరు అరెస్టు.. ● హిందూపురం పట్టణంలోని సీపీఐ కాలనీలో ఎస్.బాబా, అతని భార్య వ్యభిచారం నిర్వహిస్తుండగా శుక్రవారం ఉదయం దాడి చేసి వారితో పాటు మరొక మహిళను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
స్వచ్ఛ ఓటరు జాబితాకు సహకరించండి
ప్రశాంతి నిలయం: స్వచ్ఛ ఓటరు జాబితా తయారీకి సహకరించాలని రాజకీయ పార్టీల నాయకులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీఎస్ చేతన్ కోరారు. ఓటర జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే వెంటనే తెలపాలన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాలులో ఎన్నికల అధికారులతో కలిసి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు నుంచి అవసరమైన సూచనలు, సలహాలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో 14,12,177 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషులు 7,01,586 మంది, సీ్త్రలు 7,10,527 మంది, ఇతరులు 64 మంది ఉన్నారని తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 1,576 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, తప్పుల్లేని ఓటరు జాబితా తయారీ, పోలింగ్ శాతం పెంచేందుకు అవసరమైన చర్యలు, యువతను ఓటరుగా నమోదు చేసే అంశాలపై సూచనలు, సలహాలు అందించాలని కలెక్టర్ కోరారు. అలాగే రాజకీయ పార్టీలన్నీ బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి అన్ని నియోజకవర్గాల బూత్ స్థాయి అధికారులను నియమించి త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో డీఆర్ఓ విజయసారథి, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ జాకీర్ హుస్సేన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాథమిక అంశాలపై నివేదికలు ఇవ్వండి త్వరలోనే కలెక్టర్లతో ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాధాన్య అంశాలపై నివేదికలు సమర్పించాలని కలెక్టర్ చేతన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాలులో అన్ని ప్రభుత్వ విభాగాల జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాకు సంబంధించిన ప్రగతి, ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రాబోయే మూడు నెలల్లో పంచాయతీ, మున్సిపల్, ఇరిగేషన్, డ్వామా, గ్రామీణ నీటి సరఫరా విభాగం, మత్స్య, గృహ, విద్య, వైద్య ఆరోగ్య, పరిశ్రమలు, డీఆర్డీఏ, లీడ్ బ్యాంక్, వ్యవసాయం, అనుబంధ రంగాలు, సంక్షేమ శాఖలు, సేవా రంగాల శాఖలు తదితర శాఖల పరిధిలో నిర్వహించాల్సిన ముఖ్యమైన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ టీఎస్ చేతన్ ఫారంపాండ్ల పనులు గ్రౌండింగ్ చేయాలి జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో 3 నుంచి 5 ఫారంపాండ్ల పనుల కోసం గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రపంచ జల దినోత్సవం, పల్లె పండుగ కార్యక్రమంపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ టీఎస్ చేతన్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో 7,760 ఫారంపాండ్లు నిర్మించాలని లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు. అందులో ఇప్పటిదాకా 1,784 ఫారంపాండ్లు మంజూరు కాగా, 840 పూర్తి చేశామన్నారు. ఈ నెలాఖరు నాటికి పశువుల షెడ్లు లక్ష్యాలను సాధించాలని డ్వామా పీడీని ఆదేశించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డీపీఓ సమత తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ పేరు తొలగింపు కక్షపూరితం
చిలమత్తూరు: విశాఖలోని ఏసీఏ – వీడీసీఏ క్రికెట్ స్టేడియానికి ఉన్న వైఎస్సార్ పేరును రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా తొలగించిందని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. హిందూపురం పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పేదల ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు గడించి, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరును తొలగించిన మాత్రాన ఆయన స్థానం పేదల్లో చెరిగిపోదనే విషయాన్ని కూటమి పెద్దలు గ్రహించాలన్నారు. వైఎస్ఆర్, వైఎస్ జగన్ పేరు వింటే చంద్రబాబుకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో ప్రజల్లో అప్రతిష్ట మూటకట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఇంతటి దుర్మార్గమైన ప్రభుతాన్ని మునుపెన్నడూ చూడలేదన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలు ప్రజాస్వామ్యానికి చేటు తెస్తున్నాయన్నారు. ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని తప్పక బుద్ది చెబుతారని పేర్కొన్నారు. హిందూపురం వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక -
వృద్ధుడి దుర్మరణం
నల్లచెరువు: స్థానిక జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన కేతప్ప (61) కాలి నడకన తిరుమలకు బయలుదేరాడు. గురువారం వేకువజామున నల్లచెరువు మండలం రాట్నాలపల్లి సమీపంలోకి జాతీయ రహదారికి ఓ వైపు నడుచుకుంటూ వెళుతున్న ఆయనను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఘటనలో కేతప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో సహా ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులుహిందూపురం: జీవితంపై విరక్తితో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయబోతే సకాలంలో పోలీసులు గుర్తించి కాపాడారు. హిందూపురం సీఐ ఆంజనేయులు తెలిపిన మేరకు... లేపాక్షికి చెందిన ఓ మహిళ భర్త ప్రమాదంలో మృతిచెందడంతో అందిన పరిహారం డబ్బును కుటుంబ సభ్యులు తీసుకున్నారు. అందులో కొంత తన జీవనోపాధికి ఇవ్వాలని ఆమె కోరినా ఫలితం లేకపోయింది. దీంతో జీవనం దుర్భరమై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె... గురువారం హిందూపురం రైల్వే స్టేషన్కు చేరుకుని తన తల్లి మొబైల్ నంబర్కు మెసేజ్ పంపింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన గురించి ఎవరు వెతకరాదని, తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలంటూ అభ్యర్థించింది. దీంతో కంగారు పడిన తల్లి వెంటనే ఫోన్ చేయగా అప్పటికే స్విచ్ఛాఫ్ కావడంతో విషయాన్ని వెంటనే లేపాక్షి పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సాయి స్పందించి హిందూపురం రూరల్ ఆప్గ్రేడ్ సీఐ ఆంజనేయులుకు సమాచారం అందించాడు. బాధితురాలి సెల్ఫోన్ లాస్ట్సిగ్నల్ ఆధారంగా ఆచూకీని గుర్తించిన పోలీసులు వెంటనే హిందూపురం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై అడ్డంగా నిలబడిన ఆమెను గుర్తించి అధీనంలోకి తీసుకున్నారు. కౌన్సెలింగ్ అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రాణాలను కాపాడిన సీఐ ఆంజనేయులు, సిబ్బందిని ఎస్పీ రత్న అభినందించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య జిల్లాలోని వేర్వురు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడగా... కుటుంబ సమస్యల నేపథ్యలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. ● ధర్మవరం అర్బన్: స్థానిక గిర్రాజుకాలనీకి చెందిన బద్దెల ఓబునాథ్ (35) టైల్స్ వర్క్తో జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా ఉన్న ఓ యువతిని ప్రేమించిన ఓబునాథ్... తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఇందుకు ఆమె నిరాకరించడంవతో గురువారం ఇంట్లోనే గవాచీకి తన తల్లి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కుఏసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రెడ్డెప్ప తెలిపారు. ● గోరంట్ల: మండలంలోని బూదిలి ఎస్సీ కాలనీకి చెందిన విమల (23) ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి, కుటుంబసభ్యులు బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. దీంతో బూదిలిలోని ఎస్సీ కాలనీలో తన మామ కిష్టప్ప ఇంట్లోనే ఉంటూ గోరంట్లలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో కుటుంబ సమస్యలతో విసుగు చెందిన ఆమె గురువారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. హిందీ అమలుకు కృషి చేయండి : డీఆర్ఎంగుంతకల్లు: రాజభాష హిందీని అమలు చేయడం బాధ్యతగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా పిలుపునిచ్చారు. రాజభాష అమలుల్లో ప్రతిభ కనబరిచిన దాదాపు 51 మంది ఉద్యోగులకు గురువారం తన కార్యాలయంలో ఆయన ప్రశంసా ప్రతాలను అందజేసి, అభినందించారు. రాజభాషా నియమాలను అనుసరించి ఉద్యోగులు తమ కార్యాలయాల్లో విధి నిర్వహణలో తప్పనిసరిగా హిందీ మాట్లాడం అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సుధాకర్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ రామకృష్ణ, డివిజన్ రాజభాష అధికారి ఆశా మహేష్కుమార్ పాల్గొన్నారు. -
విద్యుత్ మీటర్ రీడర్ల ధర్నా
పుట్టపర్తి టౌన్: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం విద్యుత్ మీటర్ రీడర్లు గురువారం ధర్నా చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పుట్టపర్తిలోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఉమ్మడి జిల్లా మీటర రీడర్ల సంఘం అధ్యక్షుడు కిరణ్కమార్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అంజనేయులు మాట్లాడుతూ... స్మార్ట్ మీటర్ విధానంతో గత 15 సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న రీడర్లు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. తమను విద్యత్ శాఖలోకి విలీనం చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్కా అకౌంట్ ద్వారా ప్రతి నెలా జీతాలు చెల్లించాలన్నారు. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 25న కలెక్టరేట్ ముట్టడి, 27న సీఎండీ కార్యాలయం ఎదుట ధర్నా ఉంటుందన్నారు. అప్పటికి సమస్యలు పరిష్కారం కాకపోతే ఏఫ్రెల్ 4న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఎస్ఈ కార్యాలయ ఎస్ఏఓ రామస్వామికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి వినోద్కుమార్, జిల్లా అధ్యక్షుడు షనవాజ్, రాఘవరెడ్డి, బాబా, నరేష్, రవి, నగేష్, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న ‘స్థానిక’ ఎన్నికలు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు ఎంపీపీ, నాలుగు ఉపాధ్యక్ష స్థానాలకు ఎన్నికలు అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు మండల పరిషత్ అధ్యక్ష స్థానాలతో పాటు నాలుగు మండలాల్లో ఉపాధ్యక్ష పదవుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటికి ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లా పరిషత్ సీఈఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఎన్నికల విభాగం ఏర్పాటైంది. రొద్దం మండలం లోచర్ల ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన పి.చంద్రశేఖర్, రామగిరి మండలం రామగిరి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా పని చేసిన మీనుగ నాగమ్మ మరణించడంతో ఆ రెండు మండలాల్లో ఎన్నిక అనివార్యమైంది. గాండ్లపెంట మండలం గొడ్డువెలగల ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా పని చేసిన కాటం జగన్మోహన్, కణేకల్లు మండలం గనిగెర ఎంపీటీసీగా గెలిచిన హరిజన సంధ్య, కంబదూరు మండలం ములకూరు ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన తిమ్మ రాజమ్మ తమ పదవులకు రాజీనామా చేయడంతో ఆయా స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. అలాగే ఉరవకొండ మండలం బూదగవి మండల ఉపాధ్యక్షుడు నరసింహులు ఎంపీపీగా, పెద్దపప్పూరు మండల ఉపాధ్యక్షుడు జి.వెంకట్రామిరెడ్డి ఎంపీపీగా ఎన్నికయ్యారు. దీంతో ఆ రెండు మండలాల్లో వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. యల్లనూరు మండల వైస్ ఎంపీపీగా పని చేసిన వెంకటరంగయ్య, రాయదుర్గం మండల వైస్ ఎంపీపీ సత్యనారాయణ నాయుడు అకాల మరణంతో ఆ రెండు స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. -
1,300 ఓటర్లు మించితే కొత్త పోలింగ్ కేంద్రం
హిందూపురం: పోలింగ్ కేంద్రంలో 1,300కు మించి ఓటర్లు ఉంటే దానిని విభజించి కొత్త కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఓటరు నమోదు అధికారి, జేసీ అభిషేక్కుమార్ తెలిపారు. ‘ఓటరు జాబితా సవరణ – నూతన పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు’ అంశంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు హిందూపురంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల విభజనపై చర్చించారు. ప్రతి ట్రాన్స్జెండర్నూ ఓటరుగా నమోదు చేయనున్నట్లు తెలిపారు. స్వచ్ఛందంగా ప్రతి ఓటరు తన ఆధార్ నంబర్ను ఎపిక్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని కోరారు. రాజకీయ పార్టీ నాయకులు కూడా ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ తహసీల్దార్లు జి.వెంకటేష్, జి.సౌజన్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సి.శ్రీనివాసులు, డీటీ మైనుద్దీన్, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐ అమరేంద్ర, ఎన్నికల, రెవెన్యూ సిబ్బంది, ఎలక్షన్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఎస్కేయూలో కొనసాగుతున్న గ్యాంగ్వార్ అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్లో గ్యాంగ్ వార్ పరంపర కొనసాగుతోంది. ఆధిపత్య పోరులో విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి బాహాబాహీకి తలపడుతున్నారు. రెండు రోజుల క్రితం క్యాంపస్లోని ఫార్మసీ విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ ఘటనను మరువకనే బుధవారం రాత్రి మరోసారి ఎల్ఎల్బీ, ఎంబీఏ విద్యార్థులు కొట్టుకున్నారు. వివరాలు... బుధవారం రాత్రి ఎంబీఏ హాస్టల్ వద్దకు ఎల్ఎల్బీ ఫైనలియర్ విద్యార్థి వెళ్లడంతో ఇక్కడ నీకేం పని అంటూ అక్కడే ఉన్న ఎంబీఏ ఫైనలియర్ విద్యార్థులు నిలదీశారు. దీంతో వారి మధ్య మాటామాట పెరిగింది. దీంతో వ్యక్తిగత ప్రతిష్టకు పోయిన ఎల్ఎల్బీ విద్యార్థి వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేసి ఎంత మంది ఉంటే అంత మంది ఎంబీఏ హాస్టల్ వద్దకు చేరుకోవాలన్నాడు. దీంతో ద్విచక్ర వాహనాలపై అక్కడకు చేరుకున్న ఎల్ఎల్బీ విద్యార్థులకు, అక్కడే ఉన్న ఎంబీఏ విద్యార్థులు బాహాబాహీకి దిగారు. పరస్పర భౌతిక దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎంబీఏ విద్యార్థి చేతికి, లా విద్యార్థి కన్నుకు గాయాలయ్యాయి. ఘటనపై క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు ఏడుగురు ఎంబీఏ విద్యార్థులు, పది మంది ఎల్ఎల్బీ విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు ఇటుకలపల్లి పోలీసులు తెలిపారు. -
రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం
● చేనేత కళాకారుడికి అరుదైన అవకాశం ధర్మవరం: న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ధర్మవరం చేతివృత్తుల కళాకారుడు చిప్పల చంద్రశేఖర్కు ఆహ్వానం అందింది. కేంద్ర ప్రభుత్వం చేతివృత్తుల వారికి ప్రోత్సాహం కల్పించేందుకు ఎబిలిటీ ఎక్స్పో – 2025 డ్యూరింగ్ ద పర్పుల్ ఫెస్ట్లో భాగంగా చేతి వృత్తుల కళాకారుల ప్రదర్శన కోసం రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం పంపారు. చిప్పల చంద్రశేఖర్ ప్రస్తుతం ఆర్డీటీ సంస్థలో చేతివృత్తులపై మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. దేశ రాజధానిలో చేతివృత్తుల ప్రత్యేకతను తెలియజేయడం గొప్ప విషయమని చంద్రశేఖర్ తెలిపారు. ఈనెల 21తేదీ ప్రదర్శన ఉంటుందన్నారు. వీఆర్కు కొత్తచెరువు సీఐ ఇందిర పుట్టపర్తి టౌన్: కొత్తచెరువు అప్గ్రేడ్ పోలీస్టేషన్ సీఐగా పనిచేస్తున్న ఎంపీ ఇందిరను వీఆర్కు పంపుతూ అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం ఎస్పీ కార్యాలయంలో వీఆర్కు రిపోర్టు చేసుకోవాలని సూచించారు. గతంలో కొన్ని కేసుల్లో న్యాయం చేయలేకపోవడం, వరుస హత్యలు, దొంగతనాలు లాంటి కేసుల్లో బాధితులకు న్యాయం చేయలేదన్న ఆరోపణలతోనే చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. -
‘పగబట్టిన విధి’పై స్పందించిన అధికారులు
తాడిమర్రి: డయాలసిస్ చేయించుకునేందుకు అనంతపురానికి వెళ్లి వచ్చేందుకు ప్రత్యేకంగా 108 అంబులెన్స్ను ఏర్పాటు చేస్తామని నిరుపేద కుటుంబానికి అధికారులు భరోసానిచ్చారు. ఓ వైపు బుద్ధిమాంద్య కుమార్తెల పోషణ, మరో వైపు భర్త డయాలసిస్ కోసం నిరుపేద మహిళ పడుతున్న ఇబ్బందులపై ‘పగబట్టిన విధి’ శీర్షికన ఈ నెల 17న ‘సాక్షి’లో వెలువడిన కథనం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎంపీడీఓ వెంకటరంగారావు, తహసీల్దార్ భాస్కరరెడ్డి, ఈఓఆర్డీ విజయశేఖర్నాయుడు, వైద్యాధికారి హరిత తదితరులు గురువారం తాడిమర్రి మండలం కునుకుంట్ల గ్రామానికి చెందిన బాధిత భూమే లక్ష్మయ్య, సుభద్రమ్మ దంపతుల ఇంటిని సందర్శించారు. కుటుంబ ఆర్థిక స్థితిగతులను పరిశీలించారు. కుటుంబ దైన్య స్థితిపై చలించిన అధికారులు సమస్యను కలెక్టర్, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. మంత్రి సత్యకుమార్యాదవ్ పీఏతో చర్చించి లక్ష్మయ్యను డయాలసిస్ కోసం తీసుకెళ్లి, తిరిగి గ్రామానికి చేర్చేందుకు 108 అంబులెన్స్ వాహనాన్ని ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని భరోసానిచ్చారు. డయాలసిస్కు వెళ్లి వచ్చేందుకు 108 వాహనం ఏర్పాటుకు భరోసా -
రెడ్డెప్పశెట్టికి ఎవిక్షన్ నోటీసు జారీ
చిలమత్తూరు: రియల్టర్ రెడ్డెప్పశెట్టికి ఎట్టకేలకు ఎవిక్షన్ నోటీసును రెవెన్యూ అధికారులు జారీ చేశారు. రెడ్డెప్పశెట్టి ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని కంచె మొత్తం తొలగించి రైతులకు ఊరట కలిగించే చర్యలకు శ్రీకారం చుట్టారు. వందలాది ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు, నిబంధనలకు విరుద్దంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన రెడ్డెప్పశెట్టి అక్రమాలపై ఇటీవల ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆర్డీవో ఆనంద్కుమార్, చిలమత్తూరు ఇన్చార్జ్ తహసీల్దార్ వెంకటేష్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి, వాస్తవాలు గుర్తించారు. అయితే ఈ పర్యటనను అధికారులు గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. రెడ్డెప్పశెట్టి వ్యవహారంలో ఇప్పటికే తహసీల్దార్పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ రహస్య తనిఖీలు దేనికి సంకేతమంటూ ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. రైతుల నుంచి అసైన్డ్ భూములను రెడ్డెప్పశెట్టి కొనుగోలు చేసినట్టుగా అధికారుల విచారణలో వెల్లడైంది. అసైన్మెంట్ యాక్ట్ ప్రకారం రైతులకు సాగు కోసం ఇచ్చిన పట్టాలను కొనడానికి, అమ్మడానికి వీల్లేదు. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ భూములను రెడ్డెప్పశెట్టి కొనుగోలు చేసినట్టుగా నిర్ధారణ అయింది. రెడ్డెప్పశెట్టి కొనుగోలు చేసిన అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందో.. లేదో వేచి చూడాలి. కంచె తొలగింపు, భూ ఆక్రమణలపై స్పందించిన అధికారులు అసైన్డ్ భూముల కొనుగోలును రద్దు పరిచేందుకు కసరత్తు? ఎస్టేట్లో పెనుగొండ ఆర్డీఓ, తహసీల్దార్ రహస్య పర్యటన -
● రోడ్డెక్కిన గాంధీ
నోటుపై గాంధీ.. నడిరోడ్డుపై ఏందీ? ఆకలి దప్పులు.. రోజూ తిప్పలు కూటికోసం... పూటకో వేషం పచ్చడి మెతుకుల కోసం.. జీవన సమరం దేహానికి రంగులు.. దేహీ అంటు వేడుకోలు గాంధీ స్వరాజ్యంలో.. ఆకలి గాంధీలెందరో సమాజమా.. సిగ్గనిపిస్తోందా అయ్యో అనక... ఆకలి తీర్చే మార్గం చూపు .. గురువారం ఖాద్రీశుడి రథోత్సవంలో కనిపించిన ఈ చిన్నారి గాంధీలను చూసి కొందరు అయ్యో అంటే..మరికొందరు ఆహా అంటూ ఫొటోలు తీసుకున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
అడవికి నిప్పు.. భవితకు ముప్పు
పెనుకొండ: నిన్నా.. మొన్నటి వరకూ పర్యావరణ ప్రియులను, ప్రజలను ఎంతో ఆకట్టుకున్న పెనుకొండ అటవీ ప్రాంతంలోని పచ్చదనం నేడు కనుమరుగైంది. పర్యావరణ విద్వేషకుల చేతిలో నిలువునా కాలిపోయింది. ఏటా ఇది ప్రహసంగా మారుతున్నా... ముందస్తు చర్యలు చేపట్టడంలో అటవీ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాలుతున్న చెట్లు.. పెనుకొండ అటవీ రేంజ్ పరిధిలో 20 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఎటు చూసినా కొండ గుట్టలు, మైదాన ప్రాంతాలలో పచ్చని చెట్లు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుండేవి. జూన్లో కురిసిన వర్షాలకు నిండుకున్న పచ్చదనం ఫిబ్రవరి మొదటి వారం వరకూ నేత్రానందం కలిగిస్తుంటుంది. ఆ తర్వాత వేసవి నేపథ్యంలో భూమిపై పరుచుకున్న గడ్డి ఎండిపోతోంది. ఇలాంటి తరుణంలో కొందరు స్వార్థపరులు నిప్పు రాజేయడంతో మంటలు చుట్టుముట్టి అటవీ ప్రాంతం బుగ్గవుతోంది. పచ్చని చెట్లతో పాటు వన్యప్రాణులూ సజీవ దహనమైపోతున్నాయి. కనిపించని ముందస్తు చర్యలు.. గతంలో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా అటవీ శాఖ అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకునేవారు. ఇందులో భాగంగా అటవీ ప్రాంతంలో ట్రెంచ్లు, ఫైర్ బ్రేక్లు ఏర్పాటు చేసేవారు. అలాగే ఎక్కడికక్కడ వాచర్లను నియమించి అటవీ ప్రాంతం సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం ఈ చర్యలు కనిపించడం లేదు. ఫైర్బ్రేక్లు, వాచర్లు మచ్చుకై నా కనిపించడం లేదు. దీంతో కొందరు ఆకతాయిల చేష్టలకు విలువైన అటవీ సంపద బుగ్గవుతోంది. అటవీ ప్రాంతంలో నిప్పు రాజేయకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలోనూ అధికారిక వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో ఫిబ్రవరి ఆరంభం నుంచే గ్రామాల్లో సదస్సులు నిర్వహించేవారు. కళాజాతాలతో ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకువచ్చేవారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అటవీ సంరక్షణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. కనుమరుగవుతున్న పచ్చదనం పర్యావరణ మనుగడ ప్రశ్నార్థకం పర్యావరణ మనుగడకు ముప్పు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అడవులకు, కొండ గుట్టలకు నిప్పు పెట్టడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. వేసవి వస్తే చాలు నిప్పుపెట్టడాన్ని ఓ సంప్రదాయంగా మార్చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో అడవులు అంతరించి జంతువులు జనావాసాల్లోకి చొరబడే ప్రమాదముంది. అసలే రాయలసీమలో వర్షపాతం తక్కువ. అడవులను కాపాడుకోకుంటూ పర్యావరణ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. ఈ విషయంగా ప్రజల్లో విస్తృత చైతన్యం తీసుకువచ్చేందుకు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తున్నాం. – జె.ప్రతాపరెడ్డి, పర్యావరణ పరిరక్షణ నాయకులు, పెనుకొండ -
‘డ్వామా’లో ముగిసిన బదిలీలు
పుట్టపర్తి అర్బన్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న సిబ్బంది బదిలీలు గురువారంతో ముగిసినట్లు డ్వామా పీడీ విజయ్ప్రసాద్ పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల మేరకే నిర్వహించామన్నారు. ఇందులో కౌన్సిలింగ్ మెంబర్, కన్వీనర్ డీఆర్డీఏ పీడీ నరసయ్య పాల్గొన్నారు. 21 ఏపీఓలు, 50 మంది సీసీలు, 18 మంది ఈసీలు, 81 మంది టీఏలు, ప్లాంటేషన్ సూపర్వైజర్ కలిపి మొత్తం 171 మంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఓ లక్ష్మీ, ఏపీడీ శివశంకర్, హెచ్ఆర్ మేనేజర్ పుష్ప తదితరులు పాల్గొన్నారు. క్వింటా చింతపండు రూ.33 వేలుహిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో క్వింటా చింతపండు గరిష్టంగా రూ.33 వేలు పలికింది. గురువారం మార్కెట్కు 1,891.80 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.33 వేలు, కనిష్టంగా రూ.8,100, సరాసరిన రూ.18 వేలు పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్టంగా రూ.12 వేలు, కనిష్టంగా రూ.4,320, సరాసరిన రూ.6 వేల ప్రకారం ధర పలికినట్లు కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. న్యూస్రీల్ -
గొట్లూరులో మరోసారి ఉద్రిక్తత
సాక్షి టాస్క్పోర్స్: ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ నడిబొడ్డున అంగన్వాడీ భవనాన్ని కూల్చివేసి అక్కడ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రామంలోని కొందరు కూటమి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాత్రికి రాత్రే పిల్లరు వేశారు. కోర్టు స్టేను పట్టించుకోకుండా... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గ్రామ నడిబొడ్డున ఉన్న శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ భవనాన్ని కూల్చివేశారు. అప్పట్లో ఈ చర్యను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ హేమంత్కుమార్, ఆర్డీఓ మహేష్ గ్రామంలో పర్యటించి విగ్రహ ఏర్పాట్లను నిలిపివేశారు. దీంతో సమస్య అప్పట్లో సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అంగన్వాడీ భవనం స్థానంలో కొత్తగా అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించాలని అధికారులకు వినతులు ఇచ్చారు. అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలంలో ఎలాంటి విగ్రహాలను ఏర్పాటు చేయకుండా గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం గ్రామస్తులకు అనుకూలంగా స్టే ఇచ్చింది. అయితే గ్రామంలోని కూటమి నాయకుల ప్రోద్బలంతో కొందరు శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు కోసం రాత్రికి రాత్రే పిల్లరు వేశారు. కోర్టు స్టేను పట్టించుకోకుండా దౌర్జన్యంగా పిల్లరు వేయడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కోర్టు స్టేను గౌరవించి అధికారులు విగ్రహ ఏర్పాటును నిలిపివేయాలని కోరుతున్నారు. విలువైన ప్రభుత్వ స్థలంలో కాకుండా గ్రామంలో మరోచోట విగ్రహం ఏర్పాటు చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదని చెబుతున్నారు. మంత్రి సత్యకుమార్యాదవ్ చొరవ తీసుకొని విలువైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలోని కొందరి ప్రయోజనాలను కాకుండా అందరి ప్రయోజనాలకు కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో కక్షలకు ఆజ్యం పోస్తున్న కూటమి నాయకులు కోర్టు స్టే ఉన్నా .. విగ్రహ ఏర్పాటుకు పిల్లరు ఏర్పాటు -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
హిందూపురం అర్బన్: క్షణికావేశంలో తప్పుచేసి జైలుకు వచ్చిన ఖైదీలందరూ బయటకు వెళ్లిన తరువాత సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయాధికారి సంస్థ కార్యదర్శి శివప్రసాద్ సూచించారు. గురువారం స్థానిక ఉపకారాగారాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. జైలులో ఉన్న ఖైదీల వివరాలను జైలు సూపరింటెండెంట్ హనుమన్నను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం కారాగార గదులు, నిత్యావసర సరకుల నాణ్యత పరిశీలించారు. ఖైదీలతో నేరుగా మాట్లాడారు. ఏ కేసుల్లో జైలుకు వచ్చారు? ఎప్పటి నుంచి ఉంటున్నారు? మీకు న్యాయవాదులు ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సమస్యలతో న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని వారు దరఖాస్తు చేసుకొంటే న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, న్యాయవాదులు సిద్ధు, సదాశివరెడ్డి, సంతోషికుమారి, మురళి, అంజినమ్మ, లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి, శారద పాల్గొన్నారు. ధర్మవరం అర్బన్: పట్టణంలోని సబ్జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.శివప్రసాద్యాదవ్ గురువారం తనిఖీ చేశారు. సబ్జైలులోని వంట గది, స్టోర్ రూం, బ్యారక్లను తనిఖీ చేశారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఖైదీలకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. సబ్జైలు సూపరింటెండెంట్ కెవీ బ్రహ్మంరెడ్డి, న్యాయవాదులు బాలసుందరి, నూర్ మహమ్మద్, పారా లీగల్ వలంటీర్ షామీర్బాషా, సబ్జైలు సిబ్బంది పాల్గొన్నారు. -
పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక ప్రగతి
ప్రశాంతి నిలయం: జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. తొలుత జిల్లా పరిశ్రమలశాఖ పనితీరుపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అయిన పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథకంలోని తీసుకురావాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇండస్ట్రీయల్ పాలసీకి అనుగుణంగా జిల్లా ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు సహకారం అందించాలన్నారు. జిల్లా స్థాయి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పారిశ్రామిక పెట్టుబడులు, యూనిట్ల స్థాపనపై అవగాహన పెంపొందించాలన్నారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ, పీఎంఈజీపీ పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, మండలాల వారీగా జాబితా సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహాని, డీపీఓ సుమంత్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
బ్రహ్మ రథోత్సవం హైలెట్స్
కదిరి: శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నారసింహుడు ఆశీనులైన బ్రహ్మరథం సరిగ్గా ఉదయం 8.15 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.53 గంటలకు తేరు యథాస్థానం చేరుకుంది. ● రథం వెళ్లాక రోడ్డుపై పడిన మిరియాలను భక్తులు ఒక్కోటి సేకరించడం కన్పించింది. అవి కొన్ని రకాల వ్యాధులను నయం చేస్తాయని వారి నమ్మకం. ● యువత చొక్కాలు చింపడం, రంగులు చల్లుకోవడం కనిపించింది. ● మిద్దెలపై నుంచి కొందరు రథంలాగే భక్తుల మీదకు బిందెలతో నీళ్లు చల్లారు. మరికొందరు నీళ్ల ప్యాకెట్లు విసిరారు. ● భక్తుల కోసం అడుగడుగునా ఉచిత అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేశారు. మజ్జిగ, మంచినీళ్లు ప్యాకెట్లను పెద్ద ఎత్తున పంచిపెట్టారు. ● బ్రహ్మోత్సవాల కోసం ఆర్టీసీ ప్రతినిధులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ● బ్రహ్మ రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తిరువీధుల్లోని మిద్దెలపైకి ఎక్కారు. ● కదిరి బ్రహ్మ రథోత్సవంలో 3 లక్షల మంది భక్తులు పాల్గొన్నట్లు అంచనా. ● రథోత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ వి.రత్న దగ్గరుండి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రథోత్సవానికి సహకరించిన పోలీసు అఽధికారులు, సిబ్బందితో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. నేడు అలుకోత్సవం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు అశ్వవాహనంపై తిరువీధుల్లో దర్శనమివ్వనున్నారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆలయం పక్కనే ఉన్న సుద్దుల మంటపం వద్దకు తీసుకువచ్చి అలుకోత్సవాన్ని నిర్వహించనున్నారు. -
●ఐరావతంపై వసంత వల్లభుడు
కదిరి: వసంత వల్లభుడిగా పేరు గాంచిన ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఐరావతం (గజవాహనం)పై దర్శనమిచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఐరావతంపై కాటమరాయుడి కమనీయ రూపాన్ని చూసి తరించారు. అనంతరం శ్రీవారు తిరిగి ఆలయంలోకి వెళ్లి పూజలందుకున్నారు. గురువారం తెల్లవారుజామున శ్రీవారు రథంపైకి ప్రవేశించనున్నారు. శ్రీదేవి, భూదేవిలను కంకణ భట్టాచార్యులు రథంపైకి తీసుకు రానున్నారు. అంతకుముందు అర్చకులు యాగశాలలో నిత్య హోమాలు నిర్వహించి రథ కలశ పూజలు చేశారు. ఆ తర్వాత దాన్ని శ్రీవారి బ్రహ్మ రథంపై ప్రతిష్టించారు. శ్రీవారికి నిత్య కై ంకర్య సేవలు నిర్వహించిన మీదట బ్రహ్మరథం వద్ద శుద్ధి పుణ్య హవచనం, వాస్తు హోమాలు, రథాంగ హోమాలు, రథ సంప్రోక్షణ చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. -
ఐచ్ఛికంతో ‘తెలుగు’ ప్రశ్నార్థకం
పుట్టపర్తి టౌన్: ఇంటర్మీడియెట్లో తెలుగును ఐచ్ఛికం (ఆప్షనల్) చేస్తే తెలుగుభాష ఉనికి ప్రశ్నార్థకమవుతుందని తెలుగు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ మూల్యాంకనం కోసం వచ్చిన అధ్యాపకులు బుధవారం కొత్త చెరువు జూనియర్ కళాశాల ఎదుట ఽనిరసనకు దిగారు. అనంతరం జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘునాథరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటర్మీడియెట్లో ద్వితీయ భాష తెలుగును ఐచ్ఛిక సబెక్టుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు నూరుల్లా, శంకరప్ప, పెద్దన్న, బయపరెడ్డి, నాగరత్నమ్మ, లలిత, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలకు 27న ఎన్నికలు అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడ్డ ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి తమకు ఉత్తర్వులు వచ్చాయని వివరించారు. ఖాళీ అయిన రొద్దం, రామగిరి, గాండ్లపెంట, కంబదూరు, కణేకల్లు ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఉరవకొండ, యల్లనూరు, పెద్దపప్పూరు, రాయదుర్గం వైస్ ఎంపీపీ స్థానాలకు అదే రోజు ఎన్నికలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య ప్రకటించారు. పైన పేర్కొన్న స్థానాల్లో కొందరు చనిపోగా, మరికొందరు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడిన స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. -
తహసీల్దార్లు స్థానికంగానే నివాసం ఉండాలి
ప్రశాంతి నిలయం: తహసీల్దార్లు మండల కేంద్రంలోనే నివాసం ఉంటూ ఎప్పటిపనులు అప్పుడే పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. రీసర్వేలో ప్రగతి సాధించేందుకు తహసీల్దార్లు, సర్వేయర్లు బాధ్యతతో పనిచేయాలన్నారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో రీసర్వే, పీజీఆర్ఎస్ తోపాటు రెవెన్యూ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇంటి స్థలం సర్టిఫికెట్ మ్యానువల్గా ఇవ్వకూడదన్నారు. రీసర్వే సక్రమంగా జరిగితే భూ సమస్యలు తగ్గుతాయన్నారు. నిబంధనల మేరకు రీ సర్వే నిర్వహించాలని, ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడాలన్నారు. పీజీఆర్ఎస్లో అందిన అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలన్నారు. భూముల హద్దులు నిర్ణయించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఐవీఆర్ఎస్ రిపోర్టులో అమరాపురం, ఆగళి, చిలమత్తూరు, రొద్దం, రొళ్ల, సోమందేపల్లి సర్వేయర్లపై వచ్చిన ఆరోపణలపై సంబంధిత ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో విచారించి నివేదికలు అందజేయాలన్నారు. అనంతరం జేసీ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో 25 గ్రామాలను పైలెట్గా ఎంపిక చేశామని, ఆయా గ్రామాల్లో మార్చి 20 నుంచి రీ సర్వే నిర్వహిస్తామన్నారు. ముందుగా ప్రతి రైతుకు, పట్టాదారునికి నోటీసులు జారీ చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు, సర్వే అండ్ ల్యాండ్ అధికారి, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
ఐసీడీఎస్.. అస్తవ్యస్తం
సాక్షి, పుట్టపర్తి ఆరేళ్లలోపు చిన్నారులు, బాలింతలు, గర్భిణుల సంక్షేమం కోసం సర్కారు ఏర్పాటు చేసిన ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్) విభాగంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికార పార్టీ నాయకుల మాట వినకుంటే బదిలీ బహుమానంగా ఇస్తున్నారు. చిన్నారులకు గుడ్లు, పండ్లు, కూరగాయలు పంపిణీ చేసే కాంట్రాక్టర్ల నుంచి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల నియామకాల వరకు కూటమి నేతలదే పెత్తనం. కూటమి నేతల సూచన మేరకు పని చేస్తేనే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఒక వేళ వారు చెప్పినట్లు తల ఆడించినా...ఉన్నతాధికారుల నుంచి వేటు తప్పదు. ఈక్రమంలో జిల్లా ఐసీడీఎస్ పీడీగా రావాలంటే అధికారులు జంకుతున్నారు. గడిచిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నూతనంగా జిల్లా ఏర్పడిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చే వరకు ఒకరే పీడీగా ఉన్నారు. అప్పట్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేవారు. కేవలం అర్హత ఆధారంగా నియామకాలు చేపట్టేవారు. ఫలితంగా ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. దీంతో ఉండలేక చాలామంది పీడీలు స్వచ్ఛందంగా తమ స్థానాలకు వెళ్లిపోతున్నారు. ఆ ఒక్క పదవీ విరమణతో.. జిల్లా ఏర్పాటు నాటి నుంచి ఐసీడీఎస్ పీడీగా ఉన్న లక్ష్మీకుమారి గతేడాది జూలై 31వ తేదీన పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత మడకశిర సీడీపీఓగా ఉన్న నాగమల్లీశ్వరి ఇన్చార్జ్ పీడీగా వచ్చారు. సుమారు రెండున్నర నెలల పాటు ఆమె విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఐసీడీఎస్లో పలు కాంట్రాక్ట్లకు టెండర్లు పిలిచారు. ఏం జరిగిందో తెలిసే లోపు.. ఆమె తిరిగి మడకశిర సీడీపీఓగా వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇన్చార్జ్ పీడీగా ఓడీ చెరువు సీడీపీఓగా ఉన్న సుధావరలక్ష్మి బాధ్యతలు తీసుకున్నారు. ఆమె హయాంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల నియామకాలు జరిగాయి. ఆ తర్వాత ఉన్నఫలంగా ఈనెల 17వ తేదీన కొత్త పీడీని నియమించారు. దీంతో ఆమె తిరిగి ఓడీ చెరువు సీడీపీఓగా వెళ్లిపోయారు. డైరెక్టరేట్ నుంచి వచ్చిన పీడీ.. జిల్లా ఐసీడీఎస్లో చోటు చేసుకుంటున్న నాటకీయ పరిణామాల కారణంగా.. నేరుగా డైరెక్టరేట్ నుంచి నియామకాలు చేపట్టారు. ఈ క్రమంలోనే గుంటూరులో పని చేసే శ్రీదేవిని.. శ్రీసత్యసాయి జిల్లా ఐసీడీఎస్ పీడీగా నియమించారు. ఈనెల 17వ తేదీన ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె ముందు పలు సవాళ్లు ఉన్నాయి. అన్నీ చక్కబెడతారా? లేక సర్దుకుంటారా? అనేది చర్చనీయంగా మారింది. నియామకాల్లో చేతివాటం! అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల నియామకాల్లో కూటమి నేతల సూచన మేరకు ఉద్యోగాలు ఇచ్చినా.. కొందరు సిండికేటుగా మారి ఆయా గ్రామ స్థాయి నాయకులతో కుమ్మకై ్క భారీగా చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వానికి.. అధికారికి చెడ్డపేరు రాకముందే మార్పులు చేస్తున్నారని సమచారం. దందా చేయడం.. చేయించడం.. తర్వాత బదిలీపై వెళ్లిపోవడం.. ఇంకొకరు రావడం.. ఐసీడీఎస్లో ఆర్నెల్లుగా జరుగుతున్న తీరు ఇదే. నెలల వ్యవధిలోనే మారిపోతోన్న పీడీలు కూటమి నేతల ఒత్తిళ్లతో దందా చేయడం.. వెళ్లిపోవడం అంగన్వాడీల నియామకాలు, బదిలీల్లో భారీగా చేతివాటం కొనసాగితే ఇబ్బందులు తప్పవని తెలిసి తప్పిస్తున్న నాయకులు ఫిర్యాదు చేయండి ఐసీడీఎస్లో ఎలాంటి అవినీతికి తావు లేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి. విచారణ చేయించి నేరం రుజువైతే చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తాం. ఏ రాజకీయ పార్టీకి ప్రాధాన్యం ఉండదు. ప్రభుత్వ నిబంధనల మేరకు నియామకాలు, పాలన ఉంటుంది. – శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ, శ్రీసత్యసాయి జిల్లా -
ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
కదిరి టౌన్: సబ్ జైలులోని ఖైదీలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ జైలు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక సబ్ జైలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఖైదీలకు కల్పించిన సౌకర్యాలు పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఖైదీలకు న్యాయ సాయం అందించాలని సూచించారు. అనంతరం ఖైదీలతో సమావేశమయ్యారు. జైలు జీవితం గడిపి బయటకు వెళ్లిన వారు శాంతియుత జీవనం సాగించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు నరసింహులు, రఘునాథ్, ప్రభాకర్, నరేష్, జైలు సూపరింటెండెంట్ వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముదిగుబ్బలో ఆక్రమణల తొలగింపుముదిగుబ్బ: స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పరిధిలోని స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బుధవారం జేసీబీ యంత్రాలతో తొలగించారు. పీఏసీఎస్ స్పెషల్ ఆఫీసర్, సబ్ డివిజన్ అధికారి వన్నూరుస్వామి, సీఈఓ శ్రీనివాసులు దగ్గరుండి ఆక్రమణలు తొలగించారు. పీఏసీఎస్ పరిధిలో అక్రమ నిర్మాణాలను చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయుడి ఔదార్యం ● విద్యార్థులకు సొంత ఖర్చుతో అల్పాహారం ఓడీచెరువు: ఒంటిపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో ఖాళీ కడుపుతోనే ఉదయమే పాఠశాలకు వస్తున్న విద్యార్థుల ఆకలి బాధలను డబురువారిపల్లి ఉపాధ్యాయుడు కె.నాగరాజు గుర్తించారు. పాఠశాలలోని 40 మంది పిల్లలు ఇబ్బందులు పడకుండా తన సొంతఖర్చులతో ఒంటిపూట బడులు ముగిసే వరకూ అల్పాహారం అందించేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో బుధవారం ఎస్ఐ మల్లికార్జునరెడ్డి చేతుల మీదుగా అల్పాహార కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పరీక్ష కేంద్రం తనిఖీ కదిరి అర్బన్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆర్జేడీ శామ్యూల్ బుధవారం తనిఖీ చేశారు. అలాగే బాలుర హైస్కూల్ సెంటర్ను డీఈఓ కృష్ణప్ప తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు ఆరా తీశారు. పిల్లలు వడదెబ్బ బారిన పడకుండా చూడండి పుట్టపర్తి అర్బన్: విద్యార్థులు వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఆర్బీఎస్కే జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ నివేదిత పేర్కొన్నారు. బుధవారం ఆమె పుట్టపర్తి మండలంలోని ఎనుములపల్లి అంగన్వాడీ కేంద్రం, ప్రశాంతిగ్రామం పాఠశాల, జగరాజుపల్లి మోడల్స్కూల్, మంగళకర పాఠశాలలను సందర్శించారు. ఆయా పాఠశాలల్లో రికార్డులు తనిఖీ చేశారు. చిన్నారులు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పిల్లల్లో రక్త హీనత నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ మునిచంద్రిక, సీహెచ్ఓ నగేష్, సూపర్వైజర్ చంద్రకళ తదితరులు ఉన్నారు. -
నేత్రపర్వం.. భూతప్పల ఉత్సవం
రొళ్ల: మండల కేంద్రంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం భూతప్ప ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవానికి ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యంలో భక్తులు మంగళవారం సాయంత్రమే తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. స్వామి మూల విరాట్కు బుధవారం తెల్లవారుజామున అభిషేకం, అంకురార్పణ, కుంకుమార్చన, తులసీపూజ చేశారు. అనంతరం వెండి, బంగారు ఆభరణాలతో పాటు పంచ లోహ కవచాలతో అలంకరణ చేశారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు, సంతానం లేని మహిళలు, పెళ్లిళ్లు కాని యువతులు, ఇతర కుటుంబసమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వేకువజామునే చన్నీటి స్నానంచేసి తడి దుస్తులతోనే స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఈరముద్దమ్మదేవి ఆలయం నుంచి ప్రధాన ఆలయం వరకూ దాదాపు కిలోమీటర్ల మేర భక్తులు భూతప్పల పాద స్పర్శ కోసం బోర్ల పడుకున్నారు. మారుతీ కాలనీ సమీపంలోని ముత్తరాయస్వామి ఆలయంలో విశేష పూజల అనంతరం మేళతాళాలతో పాదాల బండ వద్ద నుంచి బయలుదేరిన భూతప్పలు నృత్యం చేస్తూ భక్తుల మీదుగా ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం ప్రధాన ఆలయంతో పాటు సమీపాన ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలోనూ పూజలు చేశారు. తమ మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు సమర్పించిన బొరుగులను ఆంజనేయస్వామి ఆలయంలో రాసిగా పోసి, దాని చుట్టూ ఉరాల శబ్ధాల నడుమ భూతప్పలు నాట్యం చేస్తూ బొరుగులను ఆరగించారు. అనంతరం బొరుగులను భక్తులకు ప్రసాదంగా పంచారు. ఉత్సవానికి తరలి వచ్చిన భక్తుల సౌకర్యార్థం 8 ప్రాంతాల్లో అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4.30 గంటలకు లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో వెలసిన భూతప్ప ఆలయం వద్దకు చేరుకుని పట్టం కూర్చొబెట్టారు. ఉత్సవాల్లో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ప్రొబేషనరీ డీఎస్పీ ఉదయపావని నేతృత్వంలో మడకశిర సీఐ రాజ్కుమార్, ఎస్ఐలు వీరాంజినేయులు, ఇషాక్బాషా, సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు ప్రసాద వితరణ.. లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం భూతప్పస్వామి ఆలయం ఆవరణలో భక్తులు సమర్పించిన వడి బియ్యం, బెల్లం తదితర వాటితో 101 వడలు చేసి నైవేద్యం సమర్పించనున్నారు. అనంతరం భక్తులకు ప్రసాద రూపంగా పంపిణీ చేయనున్నారు. భూతప్పల కాలిస్పర్శ కోసం పోటెత్తిన భక్తులు -
తల్లి అంత్యక్రియలకు వెళితే.. ఇల్లు దోచేశారు
తాడిపత్రి: తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన కుమార్తె ఇంటిని దుండగులు దోచేశారు. తాడిపత్రి మండలం బందార్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన మేరకు... రెండు రోజుల క్రితం తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో తాడిపత్రిలోని భగత్సింగ్ నగర్కు చెందిన రసూల్బీ అనంతపురంలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాద విషయం తెలియగానే ఆమె కుమార్తె షేక్ హనీఫా ఇంటికి తాళం వేసి తన భర్తతో కలసి మంగళవారం రాత్రి అనంతపురంలోని సర్వజనాస్పత్రికి చేరుకుంది. బుధవారం తల్లి మృతదేహాన్ని తాడిపత్రికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం కుమార్తె హనీఫా తన స్వగ్రామం బందార్లపల్లికి చేరుకుంది. అప్పటికే ఇంటి తాళం పగులగొట్టి ఉండడం గమనించిన ఆమె ఆందోళనతో లోపలకు వెళ్లి పరిశీలించింది. బీరువాలోని బంగారు నెక్లెస్, లాంగ్ చైన్, కమ్మలు, కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించి సమాచారం ఇవ్వడంతో తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్రెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కళింగరతో జాగ్రత్త
అనంతపురం అగ్రికల్చర్: ‘‘మండు టెండ నుంచి ఉపశమనం పొందేందుకు ఎర్రగా కనిపిస్తూ నిగనిగలాడుతున్న కళింగర (పుచ్చకాయ), కర్భూజాలాంటివి తింటున్నారా? అయితే ముందు మీ ఆరోగ్యగం గురించి కూడా కొంచెం ఆలోచించండి’ అంటూ జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు (95812 75717) ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇటీవల కల్తీ, నాసిరకంతో పాటు విషపూరితమైన రసాయన మందులతో మాగబెట్టిన పండ్లు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారన్నారు. ఇందులో కళింగర కూడా ఉందన్నారు. మరీ ముఖ్యంగా వేసవి దాహాన్ని తీర్చుకునేందుకు బహిరంగ మార్కెట్లో కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతున్న కళింగర కాయ సహజమైన రంగా లేదంటే కృత్రిమ రసాయనాలు కలిపిన పండా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ● పక్వానికి రాని కళింగరలను, ఎర్ర రంగు రాని వాటికి సిరంజిల ద్వారా కృత్రిమ రసాయనాలను ఎక్కిస్తున్నారు. రసాయనాలు ఎక్కించిన కాయ లోపలి భాగం మామూలు కన్నా మరీ ఎర్రగా ఉంటుందన్నారు. లేదంటే నిర్ధిష్ట గడువు కంటే ముందుగానే మాగడం జరిగి ఉంటుందన్నారు. దీని వల్ల సహజంగా లభించే పోషకాలు అందక, అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందన్నారు. ● సహజంగా పండిన కాయలో మృదువైన ఎరుపు లేదా గులాబీరంగు ఉంటుంది. అదే రసాయనాలు కలిపిన వాటిలో డార్క్ రెడ్, బ్లడ్ రెడ్ రంగులో ఉంటాయి. అంతేకాక ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కళింగర కాయ కోసి ముక్కలు నీటిలో వేస్తే నీరు ఎరుపు రంగులోకి మారితే రసాయనాలు కలిపినట్లుగా నిర్ధారించుకోవచ్చు. అలాగే కాయ తిన్న తర్వాత చేతులకు ఎరుపు రంగు అంటి, అది తుడిచినా అలాగే ఉంటే రసాయనాలు కలిపినట్లు గుర్తించాలి. సహజంగా పండిన పుచ్చకాయ తీపిగా తేలికగా ఉంటుంది. కృత్రిమ రంగు వేసినది కొంచెం చేదు రుచి వస్తుంది. ● పుచ్చకాయ పైభాగం పచ్చగా ఉండాలి, మెరుస్తూ ఉండకూడదు. తక్కువ గ్రీన్ కలర్ ఉన్నదే మంచిదని గుర్తించాలి. కాయ నేలపై ఉండే భాగం పసుపు రంగులో ఉండాలి. అలాగే ఆకారంలో గుండ్రంగానూ, సమంగానూ ఉంటే మంచిది. ఎడమొడిగా ఉంటే బాగా లేదని అర్థం. కండ పట్టిన భాగం పచ్చగా ఉంటే ఇంకా పక్వానికి రాలేదని గుర్తు. పొడిగా, గోధుమ రంగులో ఉంటే పండిందని తెలుసుకోవాలి. కట్ చేసిన కాయ గాఢ ఎరువు రంగులో ఉండకూడదు. ● రసాయనాలు కలిపిన పుచ్చకాయను తినడం వల్ల అలర్జీ, డయేరియా బారిన పడటమే కాకుండా దీర్ఘకాలంలో కాలేయం, కిడ్నీల సమస్య తలెత్తవచ్చు. క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. రసాయనాలు వాడి ఎర్రగా ఆకర్షణీయంగా మార్చేస్తున్న దుస్థితి -
ఊర పిచ్చుక.. ఊరికే అందం
ఒక ఊరిలో పిచ్చుక కనిపిస్తే ఆ ఊరు పచ్చగా ఉన్నట్లు గ్రామీణులు ఓ అంచనా వేస్తుంటారు. పిచ్చుకలు కనిపిస్తున్నాయంటే ఆ ఊరిలో నీటి వనరులు సమృద్ధిగా ఉన్నట్లు.. పంటలు బాగా పండుతున్నట్లు భావిస్తారు. పంట చేలల్లో రైతులను ఇబ్బంది పెట్టే క్రిమికీటకాలను తింటూ ఎంతో మేలు చేస్తాయి. ఇంట్లో క్రిమికీటకాలు కనిపించాయంటే గుటుక్కున మింగేసి వాటిబారి నుంచి మనల్ని కాపాడతాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా ఉండే పిచ్చుకల సంఖ్య నేడు గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో పిచ్చుకల జాతి పరిరక్షణకు ప్రపంచ వ్యాప్తంగా 2010 నుంచి ఏటా మార్చి 20న ‘ప్రపంచ పిచ్చుకల దినోత్సవం’ నిర్వహిస్తూ వాటి మనుగడ ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అనంతపురం కల్చరల్: ఒకప్పుడు ఊర పిచ్చుకలు లేని ఊరులేదంటే అతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ వాడ చూసినా, ఏ ఇల్లు చూసినా గుంపులు గుంపులుగా ఊరపిచ్చుకలు కనిపించేవి. మిగతా పక్షులకు భిన్నంగా ఊర పిచ్చుకలు, మానవులు ఒకే కుటుంబసభ్యులుగా కలిసి పోయేవారు. గుప్పెడు గింజలు వేస్తే చాలు కలకాలం తోడుండే పిచ్చుకలు నేడు వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రేడియేషన్, శబ్ద కాలుష్యాల దెబ్బకు ఎక్కడికక్కడ రాలిపోతున్నాయి. దీంతో పర్యావరణాన్ని కాపాడే పిచ్చుకల జాతి సంరక్షణకు ప్రత్యేకంగా నడుం బిగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతరించిపోతున్న సంప్రదాయం ఇంట్లో పిచ్చుకలు గూడు కట్టుకుంటే శుభం జరుగుతుందని పూర్వీకులు భావించి, వాటిని మురిపెంగా పిలుస్తూ ధాన్యాలను వెదజల్లేవారు. ఇళ్లు, ప్రార్థనా మందిరాల్లో పావురాలు, పిచ్చుకలు యథేచ్ఛగా సంచరించేవి. ఇప్పుడవన్నీ భూతద్దం పెట్టి వెతికినా కానరావు. రోజురోజుకూ పెరిగిపోతున్న మానవుడి స్వార్థం కారణంగా పచ్చని చెట్లు, చల్లటి వాతావరణం కనుమరుగవుతోంది. జిల్లాలో పంటల సాగులో రసాయనిక మందుల వినియోగం పెరిగిపోవడం కూడా పక్షి జాతి అంతరించేందుకు కారణమవుతోంది. ముఖ్యంగా సెల్ఫోన్ల వాడకం పెరిగిపోయే కొద్దీ పిచ్చుకల జాతి క్రమంగా అంతరించిపోతూ వస్తోంది. నానాటికీ తగ్గుతున్న పర్యావరణ సమతుల్యత పక్షి జాతిని నేటి తరానికి దూరం చేస్తోంది. ఇలాంటి తరుణంలో పిచ్చుకల సంరక్షణకు మేము సైతం అంటూ పలువురు ముందుకొస్తున్నారు. కృత్రిమ గూళ్లను ఉచితంగా అందిస్తున్నారు. మలమల మాడ్చేస్తున్న వేసవి నుంచి కాపాడుకునేందుకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పలు చోట్ల నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఊరంతా పిచ్చుక గూళ్లు ఊర పిచ్చుకలకు మిగిలిన పక్షులకు చాలా తేడా ఉంటుంది. ఊర పిచ్చుకలు మనుషులతో సన్నిహితంగా మెలుగుతాయి. దీంతో ఒకప్పుడు ఊరంతా పిచ్చుక గూళ్లు కనిపించేవి. ఆహారం కోసం, నివాసం కోసం పూర్తిగా మానవులపై ఆధారపడతాయి. పొలాల్లో ఎగురుతూ పంట నష్టాలకు కారణమైన క్రిమికీటకాలను ఆరగిస్తాయి. పిచ్చుక చిన్నదే అయినా దాని ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక జీవన విధానం పిచ్చుకల మనుగడకు ప్రతిబంధకం కారాదని పక్షి ప్రేమికులు అంటున్నారు. పిచ్చుకల సంరక్షణకు అనంతపురానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త ఏజే అనిల్కుమార్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా 1.40 లక్షల కృత్రిమ గూళ్లను ఇంటింటికి అందించి, పిచ్చుకల పునరుత్పత్తికి దోహదపడేలా చర్యలు తీసుకున్నారు. పిచ్చుకల విషయంలో ఆయన తీసుకున్న శ్రద్ధ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో అనంత ఖ్యాతిని పతాక స్థాయిలో మెరిసేలా చేసింది. పర్యావరణానికి దోహదపడే పిచ్చుకలను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని, ఆ దిశగా అందరూ ప్రయాణం సాగించాలని అనిల్కుమార్రెడ్డి పిలుపునిస్తున్నారు. సందర్భంనేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం -
ఆర్థిక ఇబ్బందులు తాళలేక మాజీ వలంటీర్ ఆత్మహత్య
గుత్తి: తల్లి ఆపరేషన్ కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక గ్రామ సచివాలయ మాజీ వలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గోరిమానుపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు, మణెమ్మ దంపతుల కుమారుడు మహేంద్ర గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ గ్రామ సచివాలయ వలంటీర్గా పనిచేశాడు. ఆ సమయంలోనే తన తల్లికి శస్త్రచికిత్స అవసరం కావడంతో రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈలోపు రాష్ట్రంలో అధికారం మారి కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. వలంటీర్ వ్యవస్థను సీఎం చంద్రబాబు రద్దు చేయడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక మదనపడ్డాడు. వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లు తీవ్రం కావడంతో యాడికి మండలం బోయరెడ్డిపల్లి వద్ద ఉన్న పెన్నా సిమెంట్స్ పరిశ్రమలో పనిలోకి చేరాడు. ఈ క్రమంలోనే తమ అప్పు తీర్చాలంటూ వడ్డీ వ్యాపారుల నుంచి వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో దిక్కుతోచని మహేంద్ర (26) నాలుగు రోజుల క్రితం ఫ్యాక్టరీకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వచ్చాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లలేదు. బుధవారం ఉదయం గుత్తి రైల్వేస్టేషన్కు చేరుకున్న మహేంద్ర...జీఆర్పీ స్టేషన్ ఎదుట అందరూ చూస్తుండగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి ఆచూకీని గుర్తించిన జీఆర్పీ ఎస్ఐ నాగప్ప సమాచారంతో మహేంద్ర తల్లిదండ్రులు గుత్తికి చేరుకున్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఆర్థిక సమస్యలతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పాత బస్టాండ్ వద్ద వ్యక్తి మృతదేహం రాయదుర్గం టౌన్: స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ వెనుక గుర్తు తెలియని వ్యక్తి (55) మృతదేహాన్ని స్థానికులు బుధవారం ఉదయం గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ జయానాయక్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రిలోని మార్చురీ గదికి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో ఫొటోలను వైరల్ చేశారు. ఆచూకీ తెలిసిన వారు రాయదుర్గం పోలీసులను సంప్రదించాలని సీఐ కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా, రెండు రోజులుగా సదరు వ్యక్తి ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా స్థానికుల ద్వారా తెలిసింది. అతిగా మద్యం సేవించడంతో పాటు వడదెబ్బకు గురై మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
25న చలో కలెక్టరేట్
పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25న చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈఎస్ వెంకటేష్ అధ్యక్షతన పార్టీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న రాంభూపాల్ మాట్లాడుతూ... జిల్లాలో అర్ధంతరంగా ఆగిపోయిన జగనన్న ఇళ్లు, టిట్కో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు పట్టణాల్లో రెండు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలోనూ శ్మశానానికి భూమిని కేటాయించాలని, ఉపాధి బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. రైతులకు నష్టం కలిగించే హంద్రీనీవా లైనింగ్ పనులు వెంటనే నిలిపివేయాలన్నారు. కూటమి పార్టీల నేతల ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు, నరసింహులు, జంగాలపల్లి పెద్దన్న, దిల్షాద్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
రైతుల పేరుతో రెడ్డెప్పశెట్టి డ్రామా!
సాక్షి టాస్క్ఫోర్స్: చిత్రావతి నదిపై అక్రమంగా వంతెన నిర్మించి ఏళ్లుగా నదీ జలాలను సొంతానికి వాడుకుంటూ రైతుల నోట్లో మట్టికొట్టిన రియల్టర్ రెడ్డప్పశెట్టి...ఇప్పుడు తప్పించుకునేందుకు కొత్తరాగం అందుకున్నారు. చిత్రావతిపై వంతెన రైతుల కోసమేనంటూ సరికొత్త డ్రామాకు తెరతీశారు. అటు అధికారులను, ఇటు కోర్టులను కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన ఎస్టేట్ కోసం చిత్రావతి నదిపై నిర్మించుకున్న అక్రమ వంతెన తొలగిస్తే రైతులకు ఇబ్బంది అంటూ సంబంధం లేని వ్యక్తలతో గోప్యంగా కలెక్టర్కు వినతిపత్రం అందించినట్లు తెలుస్తోంది. కంచె వేసుకొని రైతులకు దారి కూడా ఇవ్వకుండా వేధిస్తున్న రెడ్డెప్పశెట్టి... ఇప్పుడు తప్పించుకునేందుకు రైతుల పేరునే వాడుకుంటున్నాడు. తనకు అనుకూలంగా ఉండే కొంతమందిని తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడంపై ప్రజల నుంచి విమర్శలు వినపడుతున్నాయి. చర్యలకు అధికారుల వెనకడుగు రియల్టర్ రెడ్డెప్పశెట్టి అక్రమాలు సాక్ష్యాలతో సహా వెలుగులోకి వచ్చినా...చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నదిపై అక్రమంగా వంతెన నిర్మాణం, కంచె వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించగా.. అధికారులు హడావుడి చేశారు. రెడ్డెప్పశెట్టికి నోటీసులిచ్చి, కేసు పెట్టి వదిలేశారు. ఫిబ్రవరి 28వ తేదీలోపే అక్రమ వంతెనను కూల్చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నా...నేటికీ చర్యలు తీసుకోలేదు. ఇక ఈడీ అటాచ్మెంట్లో ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములనూ విడిపించలేదు. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న అసైన్డ్ భూములనూ వెనక్కి తీసుకునే ప్రయత్నమేదీ చెయ్యలేదు. ఇది అధికారుల్లో నెలకొన్న అలసత్వమా.. లేక మరేదైనా కారణమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తప్పించుకునేందుకు సమయం ఇస్తున్నారా? రెడ్డెప్పశెట్టిపై రెండు కేసులు నమోదు కాగా, పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు తొలుత ప్రయత్నాలు చేశారు. అయితే ఆయన ఎక్కడ ఉన్నాడన్నది తెలియకపోవడంతో ఆ ప్రయత్నాలు విరమించారు. సదరు రియల్టర్కు బెయిల్ కూడా రాకపోవడంతో ఆయన అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఇక తామే చర్యలు తీసుకుంటామని చెప్పిన ఇరిగేషన్ అధికారులు నేటికీ ఆ దిశగా అడుగులు వెయ్యకపోవడంతో ఉన్నతాధికారుల ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 43 ఎకరాలు నది, ప్రభుత్వ భూమికి ఎంజాయ్మెంట్ పట్టా పొందడం, దాన్ని ఆక్రమించడం వంటి వాటికి సంబంధించి న్యాయ పరంగా తప్పించుకునేందుకే అధికారులు సమయం ఇస్తున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్, ఈడీలకు ఫిర్యాదు? రెడ్డెప్పశెట్టి తన పలుకుబడి వినియోగించి అక్రమాలను దాచేసి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యంలో కొంతమంది రైతులు గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నదీ జలాలను ఏళ్లుగా తన సొంత అవసరాలకు వినియోగించుకుంటూ, తన బోరుబావుల్లో నీరు వచ్చేలా ప్లాన్ చేసుకోవడం వంటి వాటితో నదీ పరివాహక రైతులు నీటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఇక నేరుగా గ్రీన్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేసేందుకు రైతులు సిద్ధమైనట్లు సమాచారం. అదే విధంగా ఈడీ అటాచ్మెంట్లోని భూములను ఆక్రమించిన నేపథ్యంలో ఈడీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చిత్రావతిపై అక్రమంగా వంతెన కట్టి రైతులను వంచించిన రియల్టర్ ఇప్పుడు రైతుల కోసమే వంతెన కట్టానంటూ తప్పించుకునే ప్రయత్నం ఫిబ్రవరి 28లోపే బ్రిడ్జి తొలగిస్తామని నోటిసులిచ్చి ఊరుకున్న అధికారులు కంచె తొలగింపులోనూ అలసత్వం గ్రీన్ట్రిబ్యునల్, ఈడీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన రైతులు -
● గరుడ వాహనంపై ఖాద్రీశుడు
కదిరి: కాటమరాయుడి బ్రహ్మోత్సవాలు కమనీయంగా సాగుతున్నాయి. పదో రోజైన మంగళవారం రాత్రి ఖాద్రీశుడు మరోసారి గరుడా రూఢుడై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ ఉత్సవంలో ముందు రోజు తిరువీధుల్లో ఊరేగిన శ్రీవారు సాయంత్రానికి తిరిగి ఆలయం చేరుకున్నారు. నిత్యపూజలు, గ్రామోత్సవం అనంతరం రాత్రి సమయంలో గరుడవాహనంపై ఆలయ ప్రాంగణంలో కొలువుదీరారు. విశేషాలంకరణ ముగిసిన వెంటనే స్వామి వారికి ప్రధాన అర్చకులు దివ్య మంగళ హారతినిచ్చారు. అప్పటికే రాజగోపురం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు తమ ఇలవేల్పును దర్శించుకుని తరించారు. తర్వాత స్వామి వారు తిరువీధుల్లో విహరించారు. ఉత్సవాలకు అధిపతి అయిన బ్రహ్మ ప్రజల కోరిక మేరకు తన ఇష్ట వాహనమైన గరుత్మంతుడిని నారసింహునికి వాహనంగా పంపుతారు. దీన్నే ప్రజా గరుడసేవ..మలి గరుడసేవ అని కూడా అంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. గిరి ప్రదక్షిణ గతంలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం లక్ష్మీ నారసింహుని జన్మనక్షత్రాన్ని పురస్కరించుకొని పట్టణానికి చెందిన భక్తులు ఉదయాన్నే కదిరి కొండకు చేరుకొని గిరి ప్రదక్షణ చేశారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బుధవారం రాత్రి తెల్లటి ఐరావతంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
తొలి సంతకం ఏమైంది బాబూ?
పరిగి: ‘‘ఎన్నికల వేళ బాబు వస్తే జాబు వస్తుందని గొప్పలు చెప్పారు. అధికారంలోకి రాగానే ఉన్న ఉద్యోగాలు పీకేశారు. తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్పైనే అంటూ ఆర్భాటంగా ప్రకటించారు..అధికారం చేపట్టి 9 నెలలు దాటినా ఇంతవరకూ నోటిఫికేషన్ లేదు. ఏటా జాబ్ క్యాలెండర్..అంటూ అరచేతిలో వైకుంఠం చూపారు. నేటికీ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా మోసం చేశారు’’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. మంగళవారం ఆమె.. మండలంలోని శీగిపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే తొలి సంతకంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో... నిరుద్యోగులు గంపెడాశలతో నాటి నుంచి ఎదురుచూస్తునే ఉన్నారన్నారు. పైగా కోచింగ్ల కోసం లక్షలాది రూపాయలను వెచ్చించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం అదిగో డీఎస్సీ...ఇదిగో నోటిఫీకేషన్ అంటూ కాలయాపన చేయడం మాని వెంటనే రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం రాష్ట్రంలో డిగ్రీలు, పీజీలతో పాటూ ఇతరత్రా టెక్నికల్ కోర్సులు చేసిన లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధ్యతారాహిత్యమని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దాదాపుగా నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించారన్నారు. అదేవిధంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు. వలంటీర్లకు తీరని అన్యాయం వలంటీర్ల ద్వారా గత ప్రభుత్వం ప్రతి గ్రామ గ్రామానా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసిందని ఉషశ్రీచరణ్ తెలిపారు. కోవిడ్ వంటి విపత్కర సమయంలో వలంటీర్ల సేవలతో యావత్ ప్రపంచమే జేజేలు పలికిందన్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు ఇస్తున్న వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక..ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోగా..ఉన్న వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. తమకు జరిగిన అన్యాయంపై గత కొన్ని రోజులుగా వలంటీర్లు ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం రాకపోవడం దురదృష్టకరమన్నారు. నిరుద్యోగుల సమస్యలతో పాటు ఉద్యోగాల నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేసి ఆదుకోకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని ఉషశ్రీ చరణ్ హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి, సర్పంచ్ లక్ష్మణ్ణ తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ అభ్యర్థులను వంచిస్తోన్న చంద్రబాబు వేతనాలు పెంచుతామని వలంటీర్లకు మోసం నిరుద్యోగ సమస్యపై సత్వరమే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ డిమాండ్ -
మొత్తం మండలాలు
రెవెన్యూ గ్రామాలుతొలుత విస్తీర్ణంప్రస్తుత విస్తీర్ణంపుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడా) చైర్మన్ పదవి హాట్ టాపిక్గా మారింది. పదవి కోసం కూటమి పార్టీల నేతలు పోటాపోటీగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలైతే ఏకంగా అమరావతిలోనే మకాం వేసి లోకేష్ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి రంగంలోకి దిగారు. ప్రొటోకాల్ సమస్య తీరడంతో పాటు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు పుడా చైర్మన్ గిరీ కోసం ప్రయత్నిస్తున్నారు. పుడా పరిధి ఇలా... సాక్షి, పుట్టపర్తి పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడా)పై ఇప్పుడు అందరి కళ్లూ పడ్డాయి. దాదాపు ఆరు మండలాలు విస్తరించి ఉన్న ‘పుడా’ పీఠం దక్కితే దాదాపు పుట్టపర్తి నియోజకవర్గమంతా చేతిలో ఉన్నట్లే. ప్రొటోకాల్తో పాటు కీలకమైన నిర్ణయాల్లోనూ ‘పుడా’ చైర్మన్ పాత్ర తప్పకుండా ఉంటుంది. వైఎస్సార్సీపీ హయాంలో చైర్మన్గా ఉన్న లక్ష్మీనరసమ్మ.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే స్వచ్ఛందంగా రాజీనామా చేయడంతో ఆ నామినేటెడ్ పోస్టు ఖాళీ అయ్యింది. దీంతో కూటమి నేతలందరి గురి ‘పుడా’ గిరిపై పడింది. రేసులో మాజీ మంత్రి కూటమి ప్రభుత్వం విడతల వారీగా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ వస్తోంది. అయితే ఇప్పటి వరకు పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడా) చైర్మన్పై స్పష్టత ఇవ్వలేదు. పుట్టపర్తి నుంచి ఒకప్పుడు మంత్రిగా పని చేసిన సీనియర్ నేత ‘పుడా’ చైర్మన్ పదవి ఆశిస్తున్నారని తెలిసింది. అధికార దాహంతో నిత్యం ప్రభుత్వ కార్యాలయాల్లో సమీక్షలు చేస్తూ విమర్శల పాలవుతోన్న ఆయన ‘పుడా’ చైర్మన్ పదవి వస్తే.. ప్రొటోకాల్ పంచాయితీ ఉండదనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరికో ఇవ్వడం ఎందుకు? తానే ‘పుడా’చైర్మన్ పదవి తీసుకుంటే తప్పేంటని సన్నిహితులతో చర్చించారని సమాచారం. ఈ క్రమంలోనే ఎవరికీ ఇవ్వకుండా.. జాప్యం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతున్నా..‘పుడా’ చైర్మన్గా ఎవరినీ ప్రకటించకపోవడంతో ఆశావహుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. అమరావతిలో ఆశావహుల మకాం వైఎస్సార్సీపీ హయాంలో బీసీ కేటగిరీకి చెందిన మహిళకు పుడా చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి బీసీ కులాలకే ఇస్తారన్న ఆలోచనతో ఆశావహులు జోరు మీద ఉన్నారు. కొందరు యువ నేతలూ తెరపైకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఆశావహులు ఎవరికి వారుగా.. అమరావతిలో మకాం వేస్తున్నారు. నెలలో మూడు – నాలుగుసార్లు వెళ్లి నారా లోకేశ్తో లాబీయింగ్ చేస్తున్నారని తెలిసింది. అయితే స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రమేయం లేకుండా ‘పుడా’చైర్మన్ గిరీ ఎవరికీ దక్కదన్న విషయం తెలిసినా.. దీనిపై ఆమె ఇంతవరకు నోరు విప్పకపోవడంతో కుటుంబ సభ్యులకే ఇస్తారేమో అనే చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ హయాంలోనే భారీ వృద్ధి నగరం నుంచి మారుమూల గ్రామాల వరకు అభివృద్ధే లక్ష్యంగా పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పుడా) పరిధిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం విస్తరించింది. 1992లో ఏర్పడిన ‘పుడా’ఆరు గ్రామాలకే పరిమితం కాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు మండలాలకు విస్తరించింది. ఫలితంగా ‘పుడా’పరిధి 1417.13 చదరపు కిలోమీటర్లకు చేరింది. మొత్తం 82 రెవెన్యూ గ్రామాలు ‘పుడా’పరిధిలో ఉన్నాయి. ప్రస్థానం ఇలా.. 1992 ఫిబ్రవరి 18వ తేదీన పుడా (పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పడింది. పుట్టపర్తి, కప్పలబండ, బ్రాహ్మణపల్లి, లోచెర్ల, బీడుపల్లి, ఎనుములపల్లి గ్రామాలు ‘పుడా’పరిధిలో ఉండేవి. మొత్తం 86.54 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉండేది. 1996 సెప్టెంబరు 3వ తేదీన పుడా పేరును ‘సుడా’(శ్రీసత్యసాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ)గా మార్పు చేశారు. తర్వాత 2007 ఫిబ్రవరి 28న ‘సుడా’పేరు తొలగించి మళ్లీ ‘పుడా’గా మార్చారు. 2022 మే 13వ తేదీన ఆరు మండలాలకు ‘పుడా’ను విస్తరించారు. పుట్టపర్తి నియోజకవర్గం మొత్తం (అమడగూరులోని ఐదు రెవెన్యూ గ్రామాలు మినహా) పుడా పరిధిలోకి తీసుకొచ్చారు. ఫలితంగా 1,407.87 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. తర్వాత 2022 నవంబరు 7వ తేదీన అమడగూరు మండలంలోని చీకిరేవులపల్లి, దడెంవారిపల్లి, కరిమిరెడ్డిపల్లి, రామానంతపురం, ఎస్.కురువపల్లె రెవెన్యూ గ్రామాలను చేర్చారు. ‘పుడా’పరిధిలోకి మరో 9.258 చదరపు కిలోమీటర్లు చేరడంతో ప్రస్తుతం ‘పుడా’పరిధి 1417.13 చదరపు కిలోమీటర్లకు చేరింది.అది నాదే కాదు.. నాది.. 682నేతలను ఊరిస్తోన్న ‘పుడా’ చైర్మన్ పదవి జాప్యంపై ఆశావహుల అసంతృప్తి ప్రొటోకాల్ కోసం మాజీ మంత్రి ఆసక్తి అధిష్టానం వద్ద నేటికీ తేలని పంచాయితీ వైఎస్సార్సీపీ హయాంలో బీసీలకు చైర్మన్ గిరి కూటమి సర్కారులో ఎవరినివరిస్తుందో తెలియని స్థితి86.541417.33‘పుడా’ పైనే గురి ఎందుకంటే... పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో రెండు అంతస్తుల కంటే ఎక్కువ నిర్మాణాలు చేపట్టాలన్నా...ఏడు సెంట్ల కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణాలు చేపట్టాలన్నా తప్పనిసరిగా ‘పుడా’ అనుమతులు తీసుకోవాలి. పుట్టపర్తి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనూ ‘పుడా’ కీలక పాత్రపోషిస్తుంది. అందువల్లే ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ ‘పుడా’ చైర్మన్కు తగిన ప్రాధాన్యం ఉంటుంది. ఇక గత టీడీపీ హయాంలో ‘పుడా’ను అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు సాగించిన దందా అంతా ఇంతా కాదు. అందుకే ఇప్పుడు మళ్లీ ‘పుడా’ పీఠం కోసం చాలా మంది తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. వీరి బాటలోనే మాజీ మంత్రి కూడా ఉన్నట్లు తెలిసింది.చ.కిలోమీటర్లు -
క్వింటా ఎండుమిర్చి రూ.15 వేలు
హిందూపురం అర్బన్: ఎండుమిర్చి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హిందూపురం వ్యవసాయ మార్కెట్కు మంగళవారం 93 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో క్వింటా గరిష్టంగా రూ.15 వేలు, కనిష్టంగా రూ.7 వేలు, సరాసరిన రూ.7,200 ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. ఎకై ్సజ్ శాఖలో పదోన్నతులు కర్నూలు: ఎకై ్సజ్ శాఖలో పదోన్నతులకు రంగం సిద్ధమైంది. ఫోర్త్జోన్ పరిధిలో మొత్తం 52 పోస్టులు ఖాళీగా ఉండగా 48 మంది హెడ్ కానిస్టేబుళ్లు, క్లర్కులకు అడ్హాక్ పద్ధతిలో ఎస్ఐలుగా పదోన్నతి కల్పించి పోస్టింగులు కేటాయించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ నుంచి ఇటీవల జిల్లా కేంద్రానికి ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గ్రూప్–2 పోస్టులే అయినా అడ్హాక్ పద్ధతిలో పదోన్నతికి రంగం సిద్ధం చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే సర్వీస్ రిజిస్టర్ల పరిశీలన పూర్తి కావడంతో ఈ నెల 20, 21 తేదీల్లో క్లర్కులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేందుకు తూనికలు, కొలతల శాఖ అధికారులకు డిప్యూటీ కమిషనర్ లేఖ రాశారు. సీమ జిల్లాల్లో 12 మంది క్లర్కులు ఎస్ఐలుగా పదోన్నతి పొందేందుకు జాబితా సిద్ధమైంది. వైద్యపరీక్షల అనంతరం పదోన్నతి కల్పించి ఈ నెలాఖరులోగా పోస్టింగులు కేటాయించే అవకాశమున్నట్లు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. జెడ్పీలో పదోన్నతులకు సన్నాహాలు అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధమైంది. సీఈఓ రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో జెడ్పీలోని ప్రత్యేక బృందం సీనియారిటీ జాబితా రూపకల్పనలో నిమగ్నమైంది. జిల్లా పరిషత్ కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయాలు, ఉన్నత పాఠశాలలు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ విభాగాల్లో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించనున్నారు. తొలుత సీనియారిటీ, రోస్టర్ ప్రకారం ముసాయిదా జాబితా తయారు చేసి సీఈఓ పరిశీలన అనంతరం అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు లేవనిపిస్తే.. తుది జాబితాను సిద్ధం చేసి చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆమోదంతో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి పోస్టింగ్లు ఇస్తారు. -
ఉచిత ఇసుక అందుబాటులో ఉంచాలి
ప్రశాంతి నిలయం: వినియోగదారులందరికీ ఉచిత ఇసుక అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ చేతన్ ఆదేశించారు. జిల్లాలో ఉచిత ఇసుక అమలుపై మంగళవారం స్థానిక మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నాణ్యమైన ఇసుక సరఫరా చేయాల్సిన బాధ్యత మైనింగ్ శాఖ అధికారులదేనన్నారు. నదీ ప్రవాహాలకు అనుకుని ఉన్న గ్రామాల పరిధిలో వినియోగదారులే ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చన్నారు. ఆర్డీఓలు ఇసుక డంపింగ్ యార్డులను తనిఖీ చేయడంతో పాటు ప్రతి 15 రోజులకోసారి ఉచిత ఇసుక అమలుపై సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు. అన్ని ఇసుక డంపింగ్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ బ్యానర్, జీపీఎస్ లేకుండా ఇసుకను రవాణా చేస్తే ఆ వాహనాన్ని బ్లాక్ లిస్ట్లో ఉంచాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై సమాచారం ఇవ్వండి జిల్లాల్లో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం చెప్పవచ్చని, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వి.రత్న తెలిపారు. జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, నిల్వ, బ్లాక్ మార్కెటింగ్పై రోజువారీగా కేసులు నమోదు చేస్తున్నామన్నారు. సమావేశంలో జేసీ అభిషేక్ కుమార్, జిల్లా గనులు శాఖ అధికారి పెద్దిరెడ్డి, ధర్మవరం ఆర్డీఓ మహేష్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. తప్పుడు సమాచారంతో ఆధార్ నమోదు చేయొద్దు ఆధార్ నమోదు, అప్డేషన్న్లలో తప్పులు దొర్లకూడదని, ఎవరైనా తప్పుడు సమాచారంతో ఆధార్ నమోదు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో జిల్లా కమిటీతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఆధార్ సెంటర్లను తనిఖీ చేసి నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ నమోదు స్పెషల్ క్యాంపులు నిర్వహించాలన్నారు. స్వర్ణాంధ్రకు పది సూత్రాలు అమలు చేయాలి స్వర్ణాంధ్ర విజన్–2047 సాకారానికి పది సూత్రాలు, ప్రభుత్వ మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని కోర్టు హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. త్వరలో విజయవాడలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలపై సమీక్షించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల ద్వారా ఆదాయాలు పెంచుకునే మార్గాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. నల్లచెరువు మండలంలో ఏర్పాటు చేయనున్న ఉద్యాన ప్రాసెసింగ్ యూనిట్పై సమీక్షించారు. 18పిటివై303–పది సూత్రాల అమలుపై సమీక్షిస్తున్న కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం -
టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు
లేపాక్షి: లక్షలాది రూపాయలతో వేలం పాట దక్కించుకున్నా అధికారులు డబ్బులు కట్టించుకోకుండా టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారు. ఎమ్మెల్యే కార్యాలయ పైరవీలతో చివరకు వేలాన్ని రద్దు చేసారు. వివరాలు... లేపాక్షి గ్రామ పంచాయతీ పరిధిలో వారపు సంత, బస్టాండు ఆదాయ వనరులపై పంచాయతీ అధికారులు సోమవారం ఉదయం వేలం పాట నిర్వహించారు. ఇందులో బస్టాండులో వాహనాల పార్కింగ్కు సంబంధించి లేపాక్షికి చెందిన శంకరరెడ్డి అత్యధికంగా రూ.72 లక్షల వేలం పాడి దక్కించుకున్నారు. నిబంధనల మేరకు వేలం పాడిన 24 గంటల్లోపు వేలం పాడిన మొత్తంలో 50 శాతం డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 12 గంటలకే 50 శాతం మొత్తాన్ని వేలం పాటదారుడు చెల్లించడానికి వెళితే అక్కడ అధికారులు అందుబాటులో లేకుండా పోయారు. ఇదేమని ఆరా తీస్తే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు కార్యాలయం వదిలి వెళ్లిపోయారని తేలింది. అదే సమయంలో సమయం మించి పోయిన తర్వాత డబ్బు చెల్లించేందుకు వచ్చినందుకు తిరస్కరిస్తున్నట్లుగా అక్కడున్న కింది స్థాయి సిబ్బంది నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసారు. ఈ అన్యాయంపై శంకర్రెడ్డి అసహనం వ్యక్తం చేస్తుండగానే టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి తమకు అనుకూలంగా ఉన్న వారికే అధికారులు పనులు చేయాలని, తమ పార్టీకి సంబంధంలోని వ్యక్తికి టెండర్ ఎలా ఇస్తారంటూ దౌర్జన్యానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ నరేంద్ర, గ్రామ సర్పంచ్ ఆదినారాయణ అక్కడకు చేరుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈఓఆర్డీ ఆనందకుమార్, పంచాయతీ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ... నిబంధనల మేరకు వేలం పాట రద్దు చేసి తిరిగి ఎప్పడు వేలం నిర్వహించేది ప్రకటిస్తామని పేర్కొన్నారు. శంకర్రెడ్డి మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తాను కార్యాలయానికి చేరుకున్న సమయంలో పంచాయతీ సిబ్బంది తప్ప కార్యదర్శి అందుబాటులో లేరన్నారు. 2 గంటల తర్వాత వచ్చిన కార్యదర్శి, ఈఓఆర్డీ డబ్బులు కట్టించుకోకుండా నిరాకరించారన్నారు. కేవలం టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తనకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. వాహనాల పార్కింగ్కు సంబంధించి రూ.72 లక్షల వేలం రద్దు చేసిన వైనం తెలుగు తమ్ముళ్ల హైడ్రామాలకు వేదికగా మారిన పంచాయతీ కార్యాలయం -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
పెనుకొండ: స్థానిక నగర పంచాయతీ పరిధిలోని ఇస్లాపురం గ్రామ సమీపంలో చోటు చేసుకున్న విశ్రాంత ఉపాధ్యాయుడి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేవారు. వివరాలను మంగళవారం సీఐ రాఘవన్ వెల్లడించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు ఆంజనేయులు అదే గ్రామానికి చెందిన తిప్పమ్మతో కొన్నేళ్లుగా సహజీవనం సాగిస్తున్నాడు. ఉద్యోగ విరమణ అనంతరంరామె వద్దనే ఉంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత కారణాలతో మూడు నెలల క్రితం ఆయనను తిప్పమ్మ కుమారుడు నాగరాజు హత మార్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తొలుత సాధారణ మృతిగా భావించినా... ఆంజనేయులు సోదరులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆంజనేయులుది సాధారణ మరణం కాదని, హత్యగా నిర్ధారణ కావడంతో పక్కా ఆధారాలతో మంగళవారం నాగరాజును అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. చెట్టుపై నుంచి పడి వృద్ధుడి మృతి అగళి: ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... అగళి మండలం పూజారిపల్లికి చెందిన చంద్రప్ప (72) కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలు కాగా, మొదటి భార్య శివలింగమ్మకు సంతానం లేకపోవడంతో అంజనమ్మను రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పి.బ్యాడగెర గ్రామానికి చెందిన రైతు సత్యప్ప పొలంలో చింత ఫలసాయాన్ని కొనుగోలు చేసిన గుడిబండ మండలానికి చెందిన రామకృష్ణప్ప సోమవారం పలువురు కూలీలను పనిలో పెట్టాడు. ఈ క్రమంలో చెట్టుపైకి ఎక్కి చింత కాయలు దులుపుతున్న చంద్రప్ప ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను తోటి కూలీలు వెంటనే మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక అదే రోజు రాత్రి ఆయన మృతి చెందాడు. మృతుడి కుమారుడు మారుతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రాచువారిపల్లిలో చోరీ తనకల్లు: మండలంలోని రాచువారిపల్లిలో నివాసముంటున్న దేశాయి భక్తవత్సలరెడ్డి ఇంట్లో మంగళవారం చోరీ జరిగింది. ఇంటికి తాళాం వేసి తన కుటుంబసభ్యులతో కలసి పది రోజుల క్రితం ఆయన కాశీకి వెళ్లారు. తాళం వేసిన ఇంటిని గమనించిన దుండగులు మంగళవారం పట్టపగలే ఇంటి వెనుక ఉన్న తలుపు తెరిచి లోపలికి ప్రవేశించారు. మూడు బెడ్రూములలో ఉన్న బీరువాలను ధ్వంసం చేసి అందులోని పట్టు చీరలు, ఇతర విలువైన సామగ్రిని అపహరించారు. భక్తవత్సలరెడ్డి సమీప బంధువు సమాచారంతో ఎస్ఐ గోపి అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దింపి నిందితుల వేలి ముద్రలను సేకరించారు. కాగా, ఇంటి యజమాని వచ్చిన తర్వాత ఏఏ వస్తువులు చోరీకి గురయ్యాయో తెలుసుకుని కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. తరగతి గదిలో విద్యార్థికి తేలు కాటు పెనుకొండ రూరల్: తరగతి గదిలో పాఠాలు వింటున్న ఓ విద్యార్థిని తేలు కుట్టింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే...మండల పరిధిలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన మహికాంత్ రెడ్డి స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుకుంటున్నాడు. మంగళవారం ఉదయం ఎప్పటిలాగే పాఠశాలకు వెళ్లాడు. ఉదయం తరగతి గదిలో పాఠాలు వింటుండగా ఏదో కుట్టినట్లు విపరీతమైన నొప్పి వచ్చింది. వెంటనే ఉపాధ్యాయులకు చూపించగా... తేలు మూడుచోట్ల కుట్టినట్లు గుర్తించి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. -
నాటి ఖాద్రి.. నేటి కదిరి
కదిరి: పూర్వం ఖాద్రిగా పిలుచుకునే ప్రాంతమే నేడు కదిరిగా మారింది. సంస్కృతంలో ‘ఖా’ అంటే విష్ణు పాదం అని అర్థం. అద్రి అంటే కొండ. ఈ రెండింటినీ కలిపి ఖాద్రి (విష్ణువు పాదం మోపిన కొండ)గా అప్పట్లో పిలిచేవారు. కాలక్రమేణా... ఖాద్రి కాస్త కదిరిగా మారిపోయింది. దేశంలోని అత్యధికంగా ప్రతిష్టిత ఆలయాలు ఉండగా.. మరికొన్ని స్వయంభువుగా వెలసినవి ఉన్నాయి. ఇందులో ఖాద్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. ఆలయ చరిత్రను పరిశీలిస్తే.. పూర్వం హిరణ్యకశ్యపుడి సంహారం అనంతరం ఖాద్రీ ప్రాంతంలో సంచరిస్తున్న నారసింహుడి ఉగ్రరూపాన్ని శాంతింప చేయడానికి దేవతల అభ్యర్థన మేరకు ప్రహ్లాదుడు స్తుతిస్తాడు. దీంతో సంతుష్టుడైన నారసింహుడు ప్రహ్లాదుడిని దగ్గరకు తీసుకుని ఆశీర్వదిస్తాడు. ఈ ఘట్టాన్ని ఆవిష్కరిస్తున్నట్లుగా కదిరి ఆలయంలో ప్రహ్లాద సమేతంగా నారసింహుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. క్రీ.శ. 10వ శతాబ్ధంలో పట్నం పాలేగారు రంగనాయకులుకు స్వామి స్వప్నంలో కనిపించి ఆదేశించిన మేరకు ఖాద్రి వృక్షం కింద తవ్వకాలు చేపడతాడు. ఆ సమయంలో బయటపడిన ప్రహ్లాద సమేత నారసింహుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. నాలుగు దివ్యమైన గోపుర శిఖరాల నడుమ వెలసిన ఈ ఆలయంలో స్వామి వారిని దర్శించుకుంటే సాక్షాతూ ఆ బదరీనారాయణుడిని దర్శించుకున్నంత పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. తూర్పు రాజగోపురాన్ని హరిహర రాయలు, పడమర గోపురాన్ని క్రీ.శ 1469లో స్వామి భక్తురాలు సాసవుల చిన్నమ్మ, దక్షిణ గోపురాన్ని క్రీ. శ 1386లో కొక్కంటి పాలేగారు వీరమల్లప్ప నాయుడు కుటుంబీకులు, ఉత్తర రాజ గోపురాన్ని ముస్లిం పాలకులు నిర్మించినట్లు తెలుస్తోంది. బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని రోజూ కదిరి మల్లెలతోనే అలంకరిస్తారు. ఇక్కడి దవణానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులు తమవెంట కదిరి మల్లెలు, కుంకుమ, దవణం విధిగా తీసుకెళ్తారు. -
తూతూమంత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక
● ఈమె పేరు లక్ష్మీనరసమ్మ. రొద్దం మండలం కలిపి గ్రామం. సర్వే నంబరు 261–1లో ఎకరా, సర్వే నంబరు–491లో 1.04 ఎకరాలు, సర్వే నంబరు 50లో 60 సెంట్లు భూమి ఉంది. అన్ని చోట్ల ఆమె కుటుంబ సభ్యులే సాగులో ఉన్నారు. అయితే ఆ భూమి మొత్తాన్ని ఆమెకు తెలియకుండా వేరే వాళ్లు ఆన్లైన్లో ఎక్కించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవస్థలు పడుతున్నట్లు లక్ష్మీనరసమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి.. తిరిగి.. అలసిపోయి.. చివరకు కలెక్టరేట్ మెట్లు ఎక్కినట్లు వాపోయారు. ● ఇక్కడ కనిపిస్తోన్న రైతు పేరు వెంకటరెడ్డి. కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామం. ఈయనకు సర్వే నంబరు–127లో 31 సెంట్లు, సర్వే నంబరు–137లో 3 సెంట్లు, సర్వే నంబరు–208లో 45 సెంట్ల భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన కూటమి నేతలు కొందరు ఆ భూమిని ఆక్రమించారు. దీంతో బాధిత రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికీ విచారణ పూర్తి కాలేదు. అయితే ఇంతలోనే కూటమి నేతలు ఆ స్థలంలో రోడ్లు వేశారు. దీంతో వెంకటరెడ్డి నాలుగు నెలల వ్యవధిలోనే 11 సార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేదని వాపోయారు. ● ఈ చిత్రంలో కలెక్టర్కు అర్జీ ఇస్తున్న రైతు పేరు చిమిరాల జగన్నాథ్. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి గ్రామం. పుట్టపర్తి రెవెన్యూ పొలం సర్వే నంబర్ 295–1లోని 32 సెంట్లలో 11 సెంట్లు, సర్వే నంబర్ 296–3లోని 34 సెంట్లలో 12 సెంట్లు, సర్వే నంబర్ 296–7లోని 30 సెంట్లుపైకి 10 సెంట్ల భూమి ఉంది. మూడు సర్వే నంబర్లలో కలిపి మొత్తం 33 సెంట్లకు సంబంధించి రిజిష్టర్ డాక్యుమెంట్లు, లింకు డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే ఆ పొలం ఇతరులు ఆక్రమించారు. అధికారులకు విన్నవించినా.. న్యాయం జరగలేదు. భూమిని సర్వే చేయించి తనకు పాసు పుస్తకం మంజూరు చేయాలని సోమవారం కలెక్టర్ను కోరాడు.సాక్షి, పుట్టపర్తి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ జిల్లాలో ప్రజా ప్రదక్షిణల వేదికగా సాగుతోంది. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామ, మండల స్థాయిలో అర్జీలిచ్చి...అక్కడ పరిష్కారం కాక ఎంతో ఆశతో ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ‘పరిష్కార వేదిక’కు వస్తున్నారు. అయితే ఇక్కడా సరైన పరిష్కారం దొరకడం లేదు. దీంతో ప్రజలు ఒకే సమస్యపై పదేపదే అర్జీలివ్వడం...అధికారులు వాటిని తీసుకుని బుట్టదాఖలు చేయడం పరిపాటిగా మారింది. ఫలితంగా ప్రతి సోమవారం అర్జీల సంఖ్య 400 దాటిపోతోంది. అధికారులు మాత్రం సమస్యలన్నీ పరిష్కరించినట్లు చెబుతున్నారు. కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను సోమవారం ‘సాక్షి’ విజిట్ చేయగా.. పలు విషయాలు వెలుగు చూశాయి. రెవెన్యూ సమస్యలే అధికం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరాక రెవెన్యూ సమస్యలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా భూ సమస్యలు పెరిగిపోయాయి. ఇక తమ భూమి కబ్జా చేశారని అందే వినతులు వందల్లోనే ఉంటున్నాయి. కబ్జా రాయుళ్లు కూటమి పార్టీల నేతలు కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదు. దశాబ్దాల కాలంగా సాగులో ఉన్నోళ్లను కాదని.. వన్–బీలలో పేర్లు మారుస్తున్నారు. వాటన్నింటినీ సరిదిద్దుకునేందుకు నిజమైన అర్హులు అధికారుల చుట్టూ నెలల తరబడి తిరుగుతూనే ఉన్నారు. ఒక్కో సమస్యపై పదిసార్లకుపైగా వినతులు ఇచ్చినట్లు సోమవారం కలెక్టరేట్కు వచ్చిన పది మంది పైగా చెప్పడం గమనార్హం. తూతూ మంత్రంగా పరిష్కారం ‘అర్జీలు పునరావృతం కారాదు’ అని కలెక్టర్ చేతన్ ప్రతి వారం ఆదేశిస్తున్నా.. సిబ్బంది పాటించడం లేదు. ప్రజల నుంచి అర్జీలు అందిన వెంటనే పరిష్కరించినట్లు ఆన్లైన్లో చూపిస్తున్నారు. దీంతో సమస్య తీరక.... ప్రజలు కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వ్యయప్రయాసల కోర్చి కలెక్టరేట్కు వచ్చి ఏకంగా కలెక్టర్కే అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ ప్రభుత్వంతో పాటు అధికారులపై కూడా నమ్మకం పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20,070 ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందిన అర్జీలు4,713 సర్వే సమస్యలపై అందిన అర్జీలు 7,608 పెండింగ్లో ఉన్న అర్జీలు(గణాంకాలు 2024 జూన్ 19 నుంచి 2025 మార్చి 17 వరకు) పదుల సార్లు విన్నవించినా పరిష్కారం కాని సమస్యలు ఒకే సమస్యపై పదే పదే వస్తోన్న ఫిర్యాదులు కూటమి హయాంలో పెరిగిన భూ సమస్యలు అధికారుల అలసత్వంతో పెరిగిన భూకబ్జాలు టీడీపీ నేతలు విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నట్లు ఆరోపణలు మొక్కుబడిగా పరిష్కారం చూపిస్తున్నారని బాధితుల ఆవేదన పరిష్కార మార్గం చూపిస్తున్నాం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో నమోదయ్యో ప్రతి అర్జీకి పరిష్కార మార్గం చూపుతున్నాం. అర్జీలు పునరావృతం కాకూడదన్నదే ముఖ్య ఉద్దేశం. ఒకసారి ఆన్లైన్లో నమోదు చేసిన సమస్య మరోసారి పునరావృతం కాకుండా చూస్తున్నాం. రెవెన్యూలో అవకతవకలు జరగకుండా చూసుకుంటాం. కబ్జాల విషయంలో విచారణ చేయించి.. బాధితులకు న్యాయం చేస్తున్నాం. – టీఎస్ చేతన్, కలెక్టర్, శ్రీసత్యసాయి జిల్లా పరిహారం అందలేదు నాకు గ్రామంలో సర్వే నంబరు 27–4లో రెండు ఎకరాలుండగా... హౌసింగ్ కోసం అధికారులు తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. పోనీ సాగుచేసుకుందామని పొలంలోకి వెళ్తే అధికారులు అడ్డు పడుతున్నారు. గృహ నిర్మాణ సంస్థకు సంబంధించిన మెటీరియల్ అక్కడ దింపారు. న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. – బోయ నరసింహప్ప, మణేసముద్రం, హిందూపురం -
నిలకడగా చింత పండు ధరలు
హిందూపురం అర్బన్: చింతపండు ధరలు మార్కెట్లో నిలకడగా కొనసాగుతున్నాయి. సోమవారం హిందూపురం వ్యవసాయ మార్కెట్కు 1991.70 క్వింటాళ్ల చింతపండు రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ. 30 వేలు, కనిష్టంగా రూ.8,200, సగటున రూ.15 వేల ప్రకారం ధర పలికింది. అలాగే ప్లవర్ రకం క్వింటా గరిష్టంగా రూ. 12,500, కనిష్టంగా రూ. 4,500, సగటు రూ.7 వేల ప్రకారం క్రయవిక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. బేస్బాల్ పోటీల్లో నల్లమాడ విద్యార్థుల సత్తా ● జాతీయ స్థాయి టోర్నమెంట్కు ఇద్దరి ఎంపిక నల్లమాడ: బేస్బాల్ పోటీల్లో నల్లమాడ విద్యార్థులు సత్తా చాటారు. అండర్–14 జాతీయ స్థాయి టోర్నమెంట్కు ఎంపికయ్యారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కుసుమూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల్లో స్థానిక ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కె. భాస్కర్ నాయక్ (9వ తరగతి), ఎం. లిఖిత్ నాయక్ (8వ తరగతి) జిల్లా జట్టు తరఫున ఆడి సత్తా చాటారు. దీంతో నిర్వాహకులు వారిని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అండర్–14 రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు పాఠశాల హెచ్ఎం సతీష్, వసతి గృహ సంక్షేమాధికారి సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిద్దరూ పంజాబ్లోని సంగ్రూర్లో ఈనెల 27 నుంచి 31 వరకు జరిగే జాతీయ టోర్నమెంట్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. జాతీయ స్థాయి టోర్నమెంట్కు ఎంపికై న విద్యార్థులను హెచ్ఎం, హెచ్డబ్ల్యూఓతో పాటు పీడీ ధరణి, పాఠశాల సిబ్బంది అభినందించారు. సూపర్ స్పెషాలిటీలో పీడియాట్రిక్ సర్జరీ విభాగం అనంతపురం మెడికల్: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ సర్జరీ విభాగాన్ని సోమవారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు, సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజనాస్పత్రి నుంచి సూపర్ స్పెషాలిటీకి పీడియాట్రిక్ సర్జరీ విభాగాన్ని మార్చడం జరిగిందన్నారు. వారంలో మూడు రోజుల పాటు ఓపీ, మూడు రోజుల పాటు శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. చిన్నారుల్లో హెర్నియా, మూత్రనాళం, మలనాళం, అపెండీసైటీస్ తదితర సమస్యలకు శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఐసీడీఎస్ పీడీ పుట్టపర్తి అర్బన్: సమీకృత శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్గా (పీడీ)గా తోట శ్రీదేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులోని డైరెక్టరేట్ కార్యాలయంలో పని చేస్తున్న ఆమెను, ఉన్నతాధికారులు ఇటీవలే జిల్లా ఇన్చార్జ్ పీడీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ చేతన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, ఇప్పటిదాకా ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీగా పనిచేసిన సుధావరలక్ష్మి తిరిగి ఓడీసీ సీడీపీఓగా పూర్వ స్థానానికి వెళ్లారు. -
ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
పుట్టపర్తి/ పుట్టపర్తి టౌన్: పదో తరగతి పరీక్షలు జిల్లాలో తొలిరోజు సోమవారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణప్ప తెలిపారు. ధర్మవరం, పెనుకొండ డివిజన్ల పరిధిలో 104 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 210 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వెల్లడించారు. 21393 మంది విద్యార్థులకు గాను, 21,183 మంది హాజరయ్యారని వెల్లడించారు. కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ పదో తరగతి పరీక్ష కేంద్రాలను సోమవారం కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న పరిశీలించారు. పుట్టపర్తి మన్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేంద్రాన్ని వారు వేర్వేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు తదితర మౌలిక సదుపాయలపై ఆరా తీశారు. పరీక్షా కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్నీ పరిశీలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వారికి మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ... విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కేంద్రాల్లోకి ఇతరులను అనుమతించకూడదన్నారు. పుట్టపర్తిలో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ చేతన్ -
● మోహినీ రూపం.. భక్త పారవశ్యం
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజైన సోమవారం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వయ్యారాలు ఒలకబోసే సోయగాలతో, చంకన అమృత భాండాగారాన్ని పెట్టుకొని సుకుమార వేషంలో కనిపించిన శ్రీవారిని దర్శించుకుని భక్తులు తరించారు. ధగధగ మెరిసే పట్టు చీర ధరించి, గుభాళించే కదిరి మల్లెల అలంకరణలో కనిపించిన ఖాద్రీశుని వైభవాన్ని చూస్తే తప్ప చెప్పటం సాధ్యంకాదు. శ్రీవారి కుచ్చుల వాలు జడ ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాల కడలిని మదించి అందులో ఉద్భవించిన అమృతాన్ని సేవించడానికి దేవతాసురులు పోటీ పడగా, అమృతాన్ని పంచడానికి శ్రీమహావిష్ణువే మోహినీ అవతారమెత్తాడని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవ ఉభయదారులుగా కోటా గోపాలకృష్ణయ్య గుప్త కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భక్తుల వద్దకే వసంతవల్లభుడు తిరు వీధుల దర్శనానంతరం స్వామివారు రాత్రంతా పట్టణంలో విహరించారు. ఆలయానికి రాలేకపోతున్న తన భక్తుల ఇళ్ల వద్దకే వెళ్లి దర్శనమిచ్చారు. మంగళవారం సాయంత్రం తిరిగి ఆలయం చేరుకొని అలంకరణ అనంతరం ప్రజా గరుడ సేవలో భాగంగా మరోసారి గరుడవాహనంపై తన భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న శ్రీవారి బ్రహ్మ రథోత్సవం ఈ నెల 20న జరగనుంది. ఆలయ అధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వైభవంగా ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు -
భూ సేకరణ విరమించుకోవాలి
మడకశిర రూరల్: ‘‘పరిశ్రమల కోసం ఇప్పటికే 15 ఏళ్ల క్రితం గౌడనహళ్లి పంచాయతీ పరిధిలో 800 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ పరిశ్రమల పేరు చెప్పి గౌడనహళ్లి, తురుకువాండ్ల పల్లి, జమ్మానిపల్లి గ్రామాల పరిధిలో 2 వేల ఎకరాలు సేకరిస్తామంటున్నారు. పరిశ్రమలు కావాల్సిందే... కానీ అందుకు మా కడుపు కొట్టొద్దు. వ్యవసాయం తప్ప మరో పని తెలియని వాళ్లం. మా భూములు తీసుకుంటే మేమెట్టా బతికేది. ఇప్పటికై నా భూసేకరణను విరమించుకోవాలి. లేదంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం’’ అంటూ మండల పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గౌడనహళ్లి, తురుకువాండ్ల పల్లి, జమ్మానిపల్లి గ్రామాల పరిధిలో ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం 2 వేల ఎకరాల భూసేకరణను సిద్ధమైంది. దీంతో రైతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. అప్పులు చేసి బోర్లు వేసి పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు. ఈ భూములను తీసుకుంటే మూడు గ్రామాల్లోని చిన్న, సన్న కారు రైతులు దాదాపు 400 మంది వరకు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమకు అన్యాయం చేయవద్దన్నారు. అనంతరం తహసీల్దార్ కరుణాకర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ తెలిపారు. -
పరిటాల పేరు చెప్పి రూ.లక్షలు దోచేశాడు
పుట్టపర్తి టౌన్: రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేరు చెప్పి రూ.లక్షలు దోచేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ రత్నకు బాధితుడు లాలూనాయక్ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలసి తన ఫిర్యాదును అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘మాది ముదిగుబ్బ మండలం పూజారి తండా. నా పేరు రమావత్ లాలూనాయక్. చదువులు పూర్తి చేసుకున్న నా కుమారుడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నాతో పరిచయమున్న ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత వెంకటనారాయణ ఓ రోజు నన్ను కలసి నా కుమారుడి ఉద్యోగం గురించి అడిగాడు. చాలా ప్రయత్నాలు చేస్తున్నా ఏ ఒక్కటీ దొరకలేదని అన్నా. అయితే తనకు పరిటాల శ్రీరామ్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, శ్రీరామ్కు చెప్పి అనంతపురంలోని కలెక్టరేట్లో నీ కుమారుడికి కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం ఇప్పిస్తానని అన్నాడు. మొదట నేను నమ్మలేదు. అయితే తన మాట శ్రీరామ్ జవదాటడంటూ నమ్మబలికాడు. ఉద్యోగం కావాలంటే రూ.3.50 లక్షలు ఇవ్వాలన్నాడు. దీంతో అతని మాటలు నమ్మి గత ఏడాది ఆగస్టులో రూ.3.50 లక్షలు ఇచ్చాను. నెలలు గడుస్తున్నా ఉద్యోగం కల్పించే విషయం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పలుమార్లు అడిగినా ఇదిగో... అదిగో అంటూ చెబుతూ వచ్చాడు. రెండు రోజుల క్రితం గట్టిగా నిలదీశా. ఉద్యోగం లేదు.... గిద్యోగం లేదు. డబ్బు కూడా వెనక్కు ఇవ్వను. నీ దిక్కున్న చోటుకెళ్లి చెప్పుకో. ఎక్కువ మాట్లాడితే అధికారంలో ఉన్నాం. పోలీసులకు చెప్పి నీ మీదే కేసు పెట్టిస్తా. కాదూకూడదంటావా శ్రీరామ్తో చెప్పి నిన్ను చంపిస్తా అంటూ బెదిరించాడు. అయ్యా.. నేను పేదోడిని నాకు న్యాయం చేయాలని ఎస్పీ ఎదుట మొరపెట్టుకున్నా. మేడమ్ స్పందించి న్యాయం చేస్తానని మాటిచ్చారు’ అంటూ వివరించాడు. 50 వినతులు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 50 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఆదినారాయణ, విజయ్కుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి పాల్గొన్నారు. ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు ఉద్యోగ కల్పన పేరుతో ఘరానా మోసం ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి : ఎస్పీ -
ప్రహ్లాద సమేత నారసింహుడు ఇక్కడే...
కదిరి: నవ నారసింహ క్షేత్రాల్లో ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. ఇక్కడ స్వామివారు నిత్య పూజలతో వెలుగొందుతున్నారు. అయితే తన ప్రియభక్తుడు ప్రహ్లాదుడితో కలసి ఉన్న నరసింహస్వామి దర్శనం కదిరిలో తప్ప దేశంలో మరెక్కడా లేదు. నారసింహుడికి ఎడమ వైపు ప్రహ్లాదుడు నిల్చొని ఉండడం ఇక్కడ చూడవచ్చు. ‘భక్త ప్రహ్లాద సమేత నారసింహుడి దర్శనం..పాప విమోచనం’ అని ఇక్కడి అర్చక పండితులు చెబుతున్నారు. సైన్స్కు కూడా అంతుచిక్కని దైవ రహస్యం మరొకటి ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడి మూలవిరాట్కు ప్రతి నెలా స్వాతి నక్షత్రం రోజు మాత్రమే అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన అనంతరం మూలవిరాట్ నుంచి స్వేద బిందువులు బయటకు వస్తుంటాయి. వస్త్రంతో ఆ స్వేదాన్ని తుడిచినా మళ్లీ వస్తూ ఉంటుంది. స్వామివారు ఇక్కడ నిజరూపంలో ఉన్నారని చెప్పడానికే ఇలా స్వేద బిందువులు వస్తుంటాయని భక్తుల నమ్మకం. -
మహిళల భద్రతకు పెద్దపీట
● జిల్లాలో ఆరు ‘శక్తి’ టీంలు ఏర్పాటు ● జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఎస్పీ రత్న పుట్టపర్తి టౌన్: మహిళల భద్రత కోసం జిల్లాలో ఆరు ‘శక్తి’ టీంలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. సోమవారం ఆమె శక్తి టీంల కోసం ‘మీ రక్షణ– మా కర్తవ్యం’ అనే నినాదాలతో రూపొందించిన వాహనాలను జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ..పోలీస్ సబ్డివిజన్కు ఒక టీం చొప్పున జిల్లాలో ఆరు శక్తి టీంలు ఏర్పాటు చేశామన్నారు. టీంలో నోడల్ అధికారిగా మహిళా డీఎస్పీ, ఎస్ఐ, ఏఎస్ఐ నేతృత్వంలో ఇద్దరు మహిళా సిబ్బంది, నలుగురు కానిస్టేబుళ్లు మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారన్నారు. శక్తి టీంలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలపై జరుగున్న దాడులు, ఆకతాయిలు వేధింపులు నియంత్రించడంతో పాటు మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలపై అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘శక్తి యాప్’ను రూపొందించినట్లు తెలిపారు. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు 112 లేదా 100 నంబర్కు కాల్చేస్తే సంఘటనా స్థలానికి వెళ్లి తక్షణ సాయం అందిస్తాయన్నారు. కార్యక్రమంలో మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ, పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఎస్ఐ ప్రదీప్కుమార్, ఆర్ఐ మహేష్, మహిళా పోలీస్టేషన్ సీఐ గోపీనాథ్రెడ్డి, డీసీఆర్బీ సీఐ శ్రీనివాసులు, ఆర్ఎస్ఐలు వెంకటేశ్వర్లు, ప్రదీప్సింగ్తోపాటు శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు.తాగునీటి కోసం మహిళల ధర్నా అగళి: మండలంలోని ముక్కడమపల్లి గ్రామంలో తాగునీటి కోసం ఎస్సీ కాలనీ మహిళలు రోడ్డెక్కారు. రత్నగిరికి వెళ్లే మార్గంపై బైఠాయించి నిరసన తెలపడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నెల రోజులుగా తాగునీరు రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని ఈ సందర్భంగా వారు ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్ నరసింహమూర్తికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నీటి కోసం సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. -
టీడీపీ నేతల బరి తెగింపు
గోరంట్ల: రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటైన తర్వాత టీడీపీ నాయకులు బరితెగించారు. సంపద సృష్టి పేరుతో ఇష్టానుసారంగా ప్రకృతి వనరులను దోచేయడం మొదలు పెట్టారు. చివరకు ప్రభుత్వ చింత వనం నుంచి అక్రమంగా మట్టి తరలింపులు చేపట్టడం టీడీపీ నేతల బరితెగింపులకు పరాకాష్టగా నిలిచింది. వివరాలు.. గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని సర్వే నంబర్ 205లో 23 సంవత్సరాల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ సోమేష్ కుమార్ చొరవతో చింత– నిశ్చింత కార్యక్రమం కింద ప్రభుత్వ చింత వనం అభివృద్ధి చేశారు. ప్రస్తుతం చింత చెట్లు ఏపుగా పెరిగి ఫలసాయాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్తో కలసి టీడీపీ నేతలు కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే చింత వనం నుంచి మట్టి తరలింపులు చేపట్టారు. ఇందు కోసం హిటాచీలను రంగంలో దించారు. రేయింబవళ్లూ మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా రియల్టర్ల భూములకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న పెనుకొండ డివిజన్ నీటి పారుదల శాఖ డీఈ లక్ష్మీనారాయణ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మట్టి తవ్వకాలు సాగిస్తున్న హిటాచీని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై డీఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, టీడీపీ ముఖ్యనేత అండతో కొంత కాలంగా స్థానిక చోటా నాయకులు అక్రమంగా మట్టి తరలించి రూ. లక్షల్లో సొమ్ము చేసుకున్న వైనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ చింత వనం నుంచి అక్రమంగా మట్టి తరలింపు తవ్వకాలను అడ్డుకుని హిటాచీని పోలీసులకు అప్పగించిన ఇరిగేషన్ అధికారులు -
ప్రకృతి వ్యవసాయంపై 22 నుంచి సదస్సు
ప్రశాంతి నిలయం: అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ అనంతపురంలో జరిగే సదస్సును సద్వినియోగం చేసుకోవాలని రైతులకు కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి ‘మన వ్యవసాయం, పంటలు, వంటలు, ఆరోగ్యం’ అంశంతో ముద్రించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. 22న పకృతి వ్యవసాయంపై, 23న పంటలు, వంటలు, ఆరోగ్యంపై, 24న మారుతున్న వాతావరణ పరిస్థితులు– వ్యవసాయంపై సదస్సులు ఉంటాయన్నారు. రోజూ వెయ్యి మంది రైతులు పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరై ప్రకృతి వ్యవసాయంపై కొత్త విషయాలను వివరిస్తారని, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో కలసి నిర్వహిస్తున్న సదస్సును సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జేడీఏ సుబ్బారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, జనజాగృత స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు డీపీ బలరాం, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సీడీసీ శంకర్, టింబక్ట్ శ్రీకాంత్, సుస్థిర వ్యవసాయ వేదిక ప్రతినిధులు ఆదినారాయణ, ఉత్తప్ప తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య తలెత్తరాదు: వేసవి ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో ఎక్కడేగాని తాగునీటి సమస్య తలెత్తరాదని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. తాగునీరు, వడగాలులు, పీ–4 సర్వే, రీ సర్వే, పీజీఆర్ఎస్ అంశాలపై సోమవారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన సమీక్షించారు. తాగునీటి సమస్యలు తలెత్తే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాబోవు మూడు నెలలు ఎంతో కీలకమని, పీ–4 అమలుపై ప్రజాభిప్రాయ సేకరణను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. జేసీ అభిషేక్కుమార్, అన్ని మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. పోస్టర్లు విడుదల చేస్తున్న కలెక్టర్ టీఎస్ చేతన్ -
బడ్జెట్లో చేనేతలకు అన్యాయం
ధర్మవరం: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేత రంగానికి అరకొర కేటాయింపులు జరిపి చేనేతలకు తీరని అన్యాయం చేసిందని, ప్రభుత్వ చర్యల కారణంగా చేనేత మనుగడ ప్రశ్నార్థకమవుతోందని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుడగ వెంకటనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. చేనేతలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమవారం ధర్మవరంలోని కాలేజ్ సర్కిల్ నుంచి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడారు. ప్రస్తుతం చేనేత రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి చేనేతలను ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లు కేటాయిస్తారని భావించామన్నారు. ఇదే అంశాన్ని ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ సైతం ధర్మవరంలో నేతన్నలకు స్పష్టమైన భరోసానిచ్చారన్నారు. చేనేతలకు జీఎస్టీని ఎత్తివేస్తామని, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని, ఆప్కో ద్వారా సొసైటీలకు నిధులు ఇస్తామని హామీలు గుప్పించారన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకాన్ని ఆపేశారన్నారు. అంతేకాక రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి కేవలం రూ.138కోట్లు నిధులు మాత్రమే కేటాయించి తీరని అన్యాయం చేశారన్నారు. ఈ నిధులు ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోతాయని, ఇక చేనేతలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తక్షణం ప్రభుత్వం స్పందించి ఎన్నికలకు ముందు చేనేతలకు ఇచ్చిన హామీలను అమలు చేసి బడ్జెట్లో నిధులు సరిపడా కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నాయకులు చెన్నంపల్లి శ్రీనివాసులు, వెంకటస్వామి, ఆదినారాయణ, శ్రీనివాసులు, శ్రీధర్, రంగయ్య, కొండ, పెద్దకోట్ల గణేష్, కేశవ, రమణ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఏపీ చేనేత కార్మిక సంఘం వినూత్న నిరసన -
రెండో రోజూ శ్రీవారిని తాకిన సూర్యకిరణాలు
ధర్మవరం అర్బన్: స్థానిక లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలోని చెన్నకేశవస్వామి మూలవిరాట్ను సోమవారం ఉదయం రెండో రోజు కూడా సూర్యకిరణాలు తాకాయి. సూర్య పూజా మహోత్సవాలలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. మూడు రోజుల పాటు స్వామిని సూర్యకిరణాలు తాకుతాయని ఏటా ఇలా జరుగుతుందని అర్చకులు తెలిపారు.రెడ్డెప్పశెట్టి ఎస్టేట్లో వలస కూలీ మృతిచిలమత్తూరు: మండలంలోని కొడికొండ సమీపంలో రియల్టర్ రెడ్డెప్పశెట్టికి చెందిన ఎస్టేట్లో పనిచేస్తున్న వలస కూలీ ఆదివారం మృతి చెందాడు. ఈ మేరకు ఎస్ఐ మునీర్ అహమ్మద్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్కు చెందిన అర్జున్ (21) విష ద్రావకం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం అందడంతో అక్కడికెళ్లి పరిశీలించామన్నారు. విషం ఎందుకు తాగాడనేది తెలియాల్సి ఉందన్నారు. అయితే ఈ విషయం బయట పడకుండా ఎస్టేట్ యాజమాన్యం తొక్కి పెట్టి గుట్టు చప్పుడు కాకుండా అర్జున్ మృతదేహాన్ని ఖననం చేయడం అనుమానాలకు తావిస్తోంది. కొడికొండ చెరువులో మృతదేహాన్ని ఖననం చేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకోవడంతో తిరిగి ఎస్టేట్ పరిసరాల్లోనే పాతిపెట్టారు. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడమే ఆత్మహత్యకు కారణంగా స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రమాదంలో యువకుడి మృతి బెళుగుప్ప: మండలంలోని బి.రామసాగరం వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బెళుగుప్పకు చెందిన బోయ చంద్రన్న కుమారుడు సతీష్కుమార్ (19) అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి ఇటీవల ఇంటికి వచ్చాడు. తనతో పాటు అదే కళాశాలలో చదువుకున్న స్నేహితుడు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామానికి చెందిన పవన్కుమార్తో కలసి సోమవారం ఉరవకొండ మండలం వై.రాంపురంలో ఎర్రితాత రథోత్సవానికి వెళ్లాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు బి.రామసాగరం క్రాస్ వద్దకుచేరుకోగానే అదుపు తప్పి కిందపడ్డారు. చీకటిలో అటుగా వచ్చిన కొందరు గుర్తించి కుటుంబసభ్యులకు విషయం తెలిసి, 108 అంబులెన్స్ ద్వారా కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సతీష్కుమార్ మృతిచెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన పవన్కుమార్కు చికిత్సలు అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
వలంటీర్లను మోసగించిన బాబు
పరిగి: తాము అధికారంలోకి రాగానే వలంటీర్ వ్యవస్థ యథాతథంగా కొనసాగించడంతో పాటూ వారికి నెలకు రూ.10 వేల చొప్పున వేతనం ఇస్తామని నమ్మబలికిన చంద్రబాబు... చివరకు అధికారం చేపట్టిన తర్వాత 2.50 లక్షల మంది వలంటీర్లను తొలగించి వారి కుటుంబాలను రోడ్డు పాలు చేశారంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. పరిగి మండలం అక్కంపల్లిలో సోమవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యాన్ని సిద్ధింపజేశారన్నారు. మూడున్నర లక్షల నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ వలంటీర్ల ద్వారా సంక్షేమ ఫలాలను అత్యంత పారదర్శకంగా అందజేశారన్నారు. అలాంటి వ్యవస్థలను సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేసి, కేవలం కూటమి నాయకులు, కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వలెంటీర్లు రోడ్డెక్కి ధర్నా చేసినప్పటికీ కూటమి సర్కార్లో చలనం లేకపోవడం మోసానికి ప్రతిరూపంగా నిలిచిందన్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి రూ. 15 వేలు చొప్పున ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ లబ్ధి చేకూరుస్తామన్న చంద్రబాబు... నేడు తల్లులనూ దగా చేశారన్నారు. డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసి తొమ్మిది నెలలు కావస్తున్నా నేటికీ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగ యువతీయువకులతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ తీరులో మార్పు రాకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా విన్నవించుకోవాలని సూచించారు. నేడు ఎస్పీ కార్యాలయంలో... పుట్టపర్తి టౌన్: ఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. అర్జీదారులు తమ ఆధార్కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలన్నారు. అమ్మూ... ఇక నేను బతకలేనమ్మా! ● బేకరీ షాపు నిర్వహకుడు ఆత్మహత్య బత్తలపల్లి: బేకరీ వ్యాపారం సరిగా జరగకపోవడంతో కుమార్తె వివాహం, కుమారుడి చదువుకు డబ్బు ఎలా సమకూర్చాలో తెలియక షాపు నిర్వాహకుడు సతమతమయ్యాడు. రోజూ ఇదే ఆలోచనలు చేసి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెకు వీడియో కాల్ చేసి ‘అమ్మూ.. ఇక నేను బతకలేనమ్మా’ అంటూ చెప్పి ఉరివేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. కేరళకు చెందిన పరంబత్ జయప్రకాష్ (55) 35 ఏళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లికి వలస వచ్చాడు. తొలుత ఓ బేకరీలో పనిచేసేవాడు. తర్వాత కదిరి రోడ్డులో సొంతంగా ‘మైసూర్ బేకరీ’ షాపు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడే లక్ష్మీకళ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి జపాన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కుమార్తె రిన్షా, బెంగళూరులో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న కుమారుడు రోహన్ ఉన్నారు. అయితే కొంత కాలంగా వ్యాపారం సరిగా జరగడం లేదు. దీనికితోడు రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణం తొలగిస్తారని ఆందోళనకు గురయ్యేవాడు. ఈ విషయమై భార్యతో అమ్మూ(రిన్షా) వివాహం ఎలా చేయాలి, అప్పూ (రోహన్) చదువులకు డబ్బులు ఎలా సమకూర్చాలో అర్థం కాలేదని చెబుతూ మదనపడుతుండేవాడు. ఎప్పటికప్పుడు భార్య ధైర్యం చెప్తూ వస్తోంది. బెంగళూరులో తన బంధువుల ఇంట్లో జరుగుతున్న సీమంతం కార్యక్రమానికి భార్య లక్ష్మీకళ శనివారం వెళ్లింది. ఇంట్లో ఒక్కడే ఉన్న జయప్రకాష్ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కూతురుకు వీడియో కాల్ చేసి ‘నేను చనిపోతానమ్మా.. ఇక బతకను’ చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే కూతురు బెంగళూరులో ఉన్న తల్లికి విషయం చెప్పింది. బత్తలపల్లిలోని ఇంటి సమీపంలో ఉన్న సాంబశివుడు(హోటల్ శివ)కు లక్ష్మీకళ ఫోన్ చేసి అప్రమత్తం చేసింది. శివ వెళ్లి చూసేసరికి జయప్రకాష్ బేకరీ షెడ్లో ఉరికివేలాడుతూ నిర్జీవంగా కనిపించాడు. అనంతరం కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏసీబీ పేరుతో సైబర్ నేరగాళ్ల వల● రూ.50 వేలు పోగొట్టుకున్న లైన్మెన్ ధర్మవరం అర్బన్: విద్యుత్ శాఖ లైన్మెన్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారి పేరు చెప్పి లైన్మెన్ నుంచి రూ.50 వేలు దండుకున్నారు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని విద్యుత్శాఖలో పనిచేస్తున్న ఏఈ నాగభూషణంకు శనివారం అపరిచిత నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. మీ ఆఫీస్లో సీనియర్ ఉద్యోగి పేరు చెప్పాలని అడిగితే లైన్మెన్ నాగరాజు పేరును ఏఈ చెప్పారు. వెంటనే లైన్మెన్ను కాన్ఫరెన్స్లోకి తీసుకున్నారు. ‘మీరు చాలా అక్రమాలకు పాల్పడ్డారని మాకు ఫిర్యాదు వచ్చింది. మీపై చర్యలు తీసుకుని కేసు నమోదు చేసి, అరెస్టు చేస్తాం’ అని లైన్మెన్కు చెప్పారు. ఇప్పుడు తాను ఏమి చేయాలి సార్ అని లైన్మెన్ అడిగితే ‘మాకు రూ.5 లక్షలు ఇస్తే కేసు లేకుండా చేస్తా’ అని అటువైపు వ్యక్తి లంచం అడిగాడు. తన దగ్గర అంత డబ్బు లేదని ఏఈ తెలపడంతో చివరకు రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. వెంటనే ఫోన్పేలో రూ.50 వేలు వేయించుకున్నారు. ఎవరికీ చెప్పకుండా 2 గంటల వ్యవధిలోపు మిగిలిన డబ్బులు ఇవ్వాలని, లేకుంటే నీపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని సదరు వ్యక్తి బెదిరించారు. ఇదేదో సైబర్ నేరగాళ్ల పని అని అనుమానం రావడంతో వెంటనే వన్టౌన్ పోలీసులను సంప్రదించి, ఫిర్యాదు చేశారు. -
సూర్య, చంద్రప్రభ వాహనాలపై నృసింహుడి విహారం
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన ఆదివారం శ్రీవారు పగలు సూర్య ప్రభ, రాత్రి చంద్ర ప్రభ వాహనాలపై విహరించారు. లోకంలో పుట్టడం, పెరగడం, నశించడం అనే మూడు ప్రక్రియలు కాలాధీనాలు. ఆ కాల స్వరూపుడిని తానే అంటూ చాటి చెబుతూ శ్రీవారు సూర్య, చంద్ర ప్రభలనధిష్టించి దర్శనమిచ్చారు. సూర్య మండల మధ్యస్తుడైన శ్రీ మహా విష్ణువుకు నారాయణుడని పేరు. పగటికి సూర్యుడు రారాజైతే, రేయికి చంద్రుడు అధిపతి. సృష్టికి ఎంతో ముఖ్యమైన ఈ రేయింబవళ్లను శ్రీమహావిష్ణువు రెండు కళ్లుగా కలిగి ఉండి వాటినే వాహనాలుగా మార్చుకొని సృష్టిలో సర్వమూ తానే అని చాటిచెబుతూ తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవ ఉభయదారులుగా అంబే శ్రీరామమూర్తి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సోమవారం మోహినీ ఉత్సవం నిర్వహించనున్నారు. నృసింహుని సన్నిధిలో కలెక్టర్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని కలెక్టర్ చేతన్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కలెక్టర్కు ఈఓ శ్రీనివాసరెడ్డి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. రథోత్సవానికి ఏర్పాట్లు ఈ నెల 20న నిర్వహించనున్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రథానికి కప్పిన రేకులు తొలగించి అగ్నిమాపక శాఖ అధికారుల సాయంతో నీటితో శుభ్రం చేశారు. రథం లాగేందుకు మోకులు, తెడ్లు సిద్ధం చేస్తున్నారు. -
కటకటాల్లోకి కీచక ప్రిన్సిపాల్
కదిరి టౌన్: హోలీ సందర్భంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటపతి కటకటాలపాలయ్యారు. అమ్మాయిల పట్ల ప్రిన్సిపాల్ వ్యవహరిస్తున్న తీరును కళాశాల సమీపంలోని మహిళలు సెల్ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. మహిళా కానిస్టేబుల్ గౌసియా ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ సెక్షన్ 75 కింద ప్రిన్సిపాల్పై శనివారం కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆదివారం ప్రిన్సిపాల్ వెంకటపతిని హిందూపురం రోడ్డు కోనేరు సర్కిల్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి, కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా నిందితునికి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో అతడిని సబ్జైలుకు తరలించినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. -
కొండవీడు బండి... కదలదండీ
● రైలు వేళల్లో మార్పులతో అవస్థలు సాక్షి, పుట్టపర్తి యశవంతపుర – మచిలీపట్నం మధ్య నడిచే కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు వేళల్లో మార్పుల కారణంగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పెనుకొండ నుంచి ధర్మవరం చేరేందుకు మధ్యలో పుట్టపర్తిలో మాత్రమే స్టాప్ ఉంటుంది. ఆ స్టేషన్ల మధ్య ప్రయాణం గంట కూడా పట్టదు. అయితే వేళల్లో మార్పులతో కొండవీడు ఎక్స్ప్రెస్ పెనుకొండ నుంచి ధర్మవరం చేరాలంటే మూడున్నర గంటలు పడుతోంది. కాగా ఆ సమయంలో రైలు బండి ఎక్కడ హాల్ట్ చేస్తారనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. ఒకరోజు పెనుకొండలో.. మరోసారి పుట్టపర్తిలో.. ఇంకోసారి బసంపల్లిలో గంటల తరబడి హాల్ట్ చేస్తున్నారు. దీంతో రైలు ఎక్కిన వాళ్లు.. ఇబ్బందులు పడినా.. ఎక్కాల్సిన వారు తికమక పడుతున్నారు. స్టేషన్కు ఎంతసేపటికి వస్తుందో.. అర్థం కాక ముందే వచ్చి.. వేచి చూసి విసిగి చెంది వెనక్కి వెళ్లి.. ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్నారు. మూడు రోజులూ.. ముచ్చెమటలు వారంలో మూడు (మంగళ, గురు, శనివారం) రోజుల పాటు యశవంతపుర – మచిలీపట్నం మధ్య నడిచే కొండవీడు ఎక్స్ప్రెస్ (17212) రైలు రెండు గంటల ముందే నడుస్తోంది. అయితే యశవంతపుర నుంచి ధర్మవరం వరకు మాత్రమే టైమింగ్ మారింది. ధర్మవరం నుంచి మచిలీపట్నం వరకు పాత టైం ప్రకారమే నడుస్తోంది. దీంతో యశవంతపురం నుంచి యలహంక, హిందూపురం, పెనుకొండ వరకు ఇబ్బంది లేదు. ఆ తర్వాత నారాయణపురం, పుట్టపర్తి, బసంపల్లి వరకు రోజుకో చోట.. గంటల తరబడి హాల్ట్ చేస్తున్నారు. దీంతో పుట్టపర్తిలో ఎక్కాల్సిన వారు అవస్థలు పడుతున్నారు. చాలా ఇబ్బంది పడ్డాను కొండవీడు రైలు ఇంతకుముందు సరైన సమయానికే నడిచేది. ఉన్నఫలంగా టైమింగ్ మార్చారు. దీంతో రెండు రోజుల క్రితం పుట్టపర్తిలో గంటన్నర సేపు వేచి ఉండాల్సి వచ్చింది. ఆన్లైన్లో చూస్తే పెనుకొండకు మూడు గంటలకే చేరింది. వెంటనే 3.20 గంటలకు పుట్టపర్తి రైల్వే స్టేషన్ చేరుకున్నా. అయితే రైలు మాత్రం 4.50 గంటలకు వచ్చింది. – బాబయ్య, ఉపాధ్యాయుడు -
విద్యార్థులూ.. విజయీభవ!
పుట్టపర్తి: విద్యార్థుల జీవితంలో తొలిసారి పబ్లిక్ పరీక్షలు రాసే రోజు రానే వచ్చింది. జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 104 పరీక్ష కేంద్రాల్లో 23,730 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలుంటాయి. ఇప్పటికే అన్ని కేంద్రాల్లో మౌలి వసతులు కల్పించారు. విద్యార్థులకు ఏచిన్న ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా తాగునీరు, ఫర్నీచరు, విద్యుత్ సదుపాయం అన్ని కేంద్రాల్లోనూ ఉండేలా అధికారులు దృష్టి సారించారు. గంట ముందుగానే చేరుకోవాలి.. తొలిరోజు విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చూడాలని అధికారులు సూచిస్తున్నారు. ముందుగా వచ్చి హాల్టికెట్ నంబరు ఆధారంగా ఏ గది ఎక్కడుందో చూసుకోవాలని చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఉంటుంది. హాల్టికెట్ చూపిస్తే చాలు పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు. పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్స్టేషన్ల నుంచి ప్రశ్నపత్రాలు తీసుకొచ్చే సమయం, వాటిని ఓపెన్ చూసి విద్యార్థులకు అందజేసే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. మీడియంను ఒకటికి రెండుసార్లు పరిశీలించి సంబంధిత ప్రశ్నపత్రం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఏమాత్రం తారుమారైనా విద్యార్థులు నష్టపోతారనే విషయాన్ని ఇన్విజిలేటర్లు గుర్తు పెట్టువాలని చెబుతున్నారు. పేపర్ లీక్ చేస్తే అడ్డంగా బుక్ అవుతారని, భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో కేంద్రాల్లోకి సిబ్బంది కోసం టీ, కాఫీ బయట నుంచి తీసుకురాకూడదు. పొరబాటున ఏ ఒక్క వ్యక్తి బయటకు వచ్చినా అందుకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, అడిషనల్ డిపార్ట్మెంటల్ అధికారి, ఎంఈఓలను బాధ్యులను చేస్తారు. పటిష్ట బందోబస్తు పుట్టపర్తి టౌన్: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రత్న పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరన్నారు. పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, సెల్ఫోన్ షాపులు తెరిచి ఉంచరాదని ఎస్పీ ఆదేశించారు. పరీక్ష కేంద్రం వద్ద గుంపులుగా ఉండరాదని, 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, మెడికల్ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నేటి నుంచి పదో తరగతి పరీక్షలు పరీక్షలు రాయనున్న 23,730 మంది విద్యార్థులు సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ అధికారులు -
రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం
ముదిగుబ్బ: మహాకుంభ మేళా సమయంలో రద్దయిన ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. ప్యాసింజర్ రైళ్ల కోసం ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల మీదుగా గుంతకల్లు– తిరుపతి– గుంతకల్లు (రైలు నంబర్ 57403–57404), తిరుపతి –కదిరిదేవరపల్లి– తిరుపతి (57405–57406), తిరుపతి–హుబ్లీ– తిరుపతి (57401–57402) ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. మహాకుంభ మేళా సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఈ రైళ్లను రెండు నెలలపాటు రద్దు చేసి.. ప్రయాగరాజ్ వైపు మళ్లించారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఈ రైళ్లను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు అప్పట్లో ప్రకటించారు. అయితే ఆ తేదీకి రైళ్లు నడపలేదు. ఏడో తేదీ నుంచి నడుస్తాయని చెప్పారు. అదీ వాయిదా పడింది. ప్యాసింజర్ రైళ్లు తిరిగి పట్టాలు ఎప్పుడు ఎక్కుతాయా అని ముదిగుబ్బ స్టేషన్ నుంచి ప్రయాణించే ఉద్యోగులు, సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణించే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రైలు టికెట్ ధర అతి తక్కువగా ఉంది. తిరుమలకు రోజూ ముదిగుబ్బ నుంచి వందలాది మంది భక్తులు వెళ్లే వారు. అనారోగ్యంతో ఉన్న వారు తిరుపతిలోని పలు ఆస్పత్రులకు చికిత్సల కోసం వెళ్తుంటారు. అంతే కాకుండా అనంతపురం, ధర్మవరం నుంచి వచ్చే ఉద్యోగులకు కూడా ఈ ప్యాసింజర్ రైళ్లు అనుకూలంగా ఉండేవి. టికెట్ ధర తక్కువగా ఉండడంతో బస్సుల్లో ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు కాదు. ముదిగుబ్బ నుంచి తిరుపతికి వెళ్లాలంటే ప్యాసింజర్ రైళ్లలో టికెట్ ధర రూ.50 మాత్రమే. అదే బస్సులో ప్రయాణిస్తే రూ.300కు పైగా వెచ్చించాల్సి ఉంటుంది. బస్సులో అయితే ప్రయాణం కూడా సౌకర్యంగా ఉండదు. మధ్య తరగతి ప్రజల కోసం ప్యాసింజర్ రైలులో రెండు స్లీపర్ బోగీలు ఉంటాయి. హుబ్లీ తిరుపతి ప్యాసింజర్ రైలులో ఒక స్లీపర్ బోగీ ఉంది. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు చాలామంది వీటిలో రెండు నెలల ముందే బుక్ చేసుకొని వారు ప్రయాణాలు కొనసాగించేవారు. రెండు నెలలు దాటినా రద్దయిన ప్యాసింజర్ రైళ్లు తిరిగి నడపపోవడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. ముదిగుబ్బ నుంచి తిరుపతికి ప్యాసింజర్లో వెళ్లే రైలు టిక్కెట్ ధరలు ఈ విధంగా వున్నాయి. జనరల్ టికెట్ ముదిగుబ్బ నుంచి తిరుపతికి రూ.50 అదే విధంగా స్లీపర్ టికెట్ ధర ముదిగుబ్బ నుంచి తిరుపతికి రూ.120. గతంలో ఇదే రిజర్వేషన్ టికెట్ రూ.330 ఉండేది. అలాగే సిట్టింగ్ టికెట్ ధర ముదిగుబ్బ నుంచి తిరుపతికి రూ.65. ఇదే టికెట్ ధర గతంలో రూ.120 ఉండేది. ముదిగుబ్బలో నిలిచిన ప్యాసింజర్ రైలు (ఫైల్) మహాకుంభమేళా సమయంలో ఆరు ప్యాసింజర్ రైళ్లు రద్దు పునరుద్ధరణపై రైల్వే శాఖఅధికారుల తాత్సారం ప్రయాణికులకు తప్పని అవస్థలుభారీగా తగ్గిన రైలు చార్జీలు 30 నుంచి రైళ్ల పునరుద్ధరణ ప్రజల సౌకర్యార్థం రైల్వే శాఖ వారు ప్యాసింజర్ రైలు టికెట్ ధరలు భారీగా తగ్గించారు. మార్చి 30 నుంచి రద్దయిన ప్యాసింజర్ రైళ్లు తిరుగుతాయి. ముదిగుబ్బ నుంచి తిరుపతికి గతంలో రూ.330 ఉన్న స్లీపర్ టికెట్ ధర ప్రస్తుతం రూ.120కి తగ్గించారు. సిట్టింగ్ టికెట్ ధర గతంలో రూ.120 ఉండగా ఇప్పుడది రూ.65కు తగ్గింది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. నాగభూషణం రైల్వే స్టేషన్ మాస్టర్, ముదిగుబ్బ తక్కువ టికెట్ ధరతోనే సురక్షితంగా గమ్యస్థానం చేర్చే ప్యాసింజర్ రైళ్లు పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలన్నా.. ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు తిరుపతి వరకు వెళ్లాలన్నా ఈ ప్యాసింజర్ రైళ్లు చాలా అనుకూలంగా ఉంటున్నాయి. అలాంటి రైళ్లను మహాకుంభమేళా కోసం మళ్లించారు. మహాకుంభ మేళా ముగిసి మూడు వారాలవుతున్నా ఇంతవరకూ ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించలేదు. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.రైళ్ల రద్దు కారణంగా తిరుమలకు వెళ్లాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంది. బస్సులో వెళ్లాలంటే చార్జీలు ఎక్కువ. అదే రైలు టికెట్ ధర చాలా తక్కువగా ఉంది. మాలాంటి మధ్యతరగతి ప్రజల కోసం రైళ్లు పునరుద్ధరించాలని కోరుతున్నాం. – వెంకటరెడ్డి, ముదిగుబ్బ తక్కువ ధరకే సౌకర్యమైన ప్రయాణం -
అమరజీవి సేవలు చిరస్మరణీయం
ప్రశాంతి నిలయం: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణాలు త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కొనియాడారు. పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలను కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జేసీ తొలుత పొట్టిశ్రీరాములు చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేసిన పొట్టి శ్రీరాములు నేటి యువతకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయ సారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, ఏఓ వెంకటనారాయణ, పర్యాటక శాఖ మేనేజర్ ప్రతాప్రెడ్డి, కలెక్టరేట్లోని అన్ని విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. పొట్టిశ్రీరాములు జీవితం స్ఫూర్తిదాయకం పుట్టపర్తి టౌన్: త్యాగమూర్తి, నిరాడంబరుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ రత్న పేర్కొన్నారు. ఆదివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐ మహేష్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నియామకాల్లో నిర్లక్ష్యంపై కొరడా
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) కొరడా ఝళిపించారు. ఐదుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇన్విజిలేషన్ డ్యూటీల కేటాయింపుల్లో గందరగోళం, అంధులు, పక్షవాత బాధితులు, దివ్యాంగ టీచర్లు, చివరకు రిటైర్డ్ అయిన వారినీ విధులకు కేటాయించిన వైనంపై ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. ‘పది పరీక్షల నిర్వహణలో గందరగోళం’, ‘పదింతల నిర్లక్ష్యం’ కథనాలు విద్యాశాఖలో ప్రకంపనలు సృష్టించాయి. సామాజిక మాద్యమాల్లోనూ వైరల్ అయ్యాయి. ప్రాథమిక విద్య కమిషనర్, కలెక్టర్ కూడా స్పందించారు. ఈ క్రమంలో పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్, డెప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు, అనంతపురం ఎంఈఓ వెంకటస్వామి, సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, పరీక్షల విభాగం అసిస్టెంట్ రామాంజనేయులుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిచ్చే వివరణను బట్టి తదుపరి చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రధాన కారణంగా భావిస్తున్న కీలక అధికారిపై వేటు తప్పదనే ప్రచారం సాగుతోంది. ‘టిస్’ ఉన్నా అలసత్వం.. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టిస్) ద్వారా ఇటీవల ఉపాధ్యాయుల పూర్తి వివరాలు సేకరించారు. ఏ స్కూల్లో ఏ టీచరు పని చేస్తున్నాడు... పేరు, వయసు, పుట్టిన రోజు, పీహెచ్ కేటగిరీ తదితర వివరాలున్నాయి. ఫిబ్రవరి 28న రిటైర్డ్ అయిన వారి వివరాలు కూడా ఇందులో అప్డేట్ అయ్యాయి. ఈ వివరాలన్నీ డీఈఓ కార్యాలయంలో ప్రభుత్వ పరీక్షల విభాగం పక్క గదిలోనే లభిస్తాయి. అయినా ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే పరీక్షల నిర్వహణ విభాగం అదికారులు ఎంత నిర్లక్ష్యంగా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. ఎంఈఓలు, హెచ్ఎంలకు పంపి ఉంటే... 10–15 రోజుల ముందే ఎంఈఓల ద్వారా ప్రధానోపాధ్యాయులకు జాబితాలు పంపి రిమార్కులు అడిగి ఉంటే కూడా చాలా వరకు తప్పిదాలకు అవకాశం ఉండేదికాదు. అలా చేయకుండా కేవలం పరీక్షల విభాగం ఒంటెద్దు పోకడలతో తీసుకున్న నిర్ణయాలు అనేకమంది టీచర్లను ఇక్కట్లు పాలు చేశాయి. ఈ క్రమంలోనే అంధులు, పక్షవాత బాధితులు, చంటిపిల్లల తల్లులు, బాలింతలు, దివ్యాంగ టీచర్లు, రిటైర్డ్ టీచర్లు, మెడికల్ లీవ్లో ఉన్న వారినీ ఇన్విజిలేటర్లుగా నియమించారు. ఇలాంటి వారే 200 మంది దాకా ఉన్నట్లు తెలిసింది. పరీక్ష కేంద్రాల చీఫ్లకు అందజేసి చేతులు దులుపుకోవడం వల్ల సమాచార లోపించి ఆర్డర్లు జారీ చేసి రెండు రోజులు దాటినా 40 శాతానికి మందికి పైగా ఉత్తర్వులు అందజేలేదు. ఈ విషయంపైనా ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు. ఇన్విజిలేషన్ డ్యూటీల్లో అవకతవకలపై ఆర్జేడీ చర్యలు ఐదుగురికి షోకాజ్ నోటీసులు తీవ్ర చర్చనీయాంశమైన ‘సాక్షి’ వరుస కథనాలు -
అసిస్టెంట్ ప్రొఫెసర్ మృతిపై అనుమానాలు
బుక్కరాయసముద్రం: మండలంలోని జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ వద్దతిలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ యోజితా సాహో (27) మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీకేఎస్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చత్తీస్ఘడ్ రాష్ట్రం రాయ్పూర్ జిల్లా దుర్గ్ గ్రామానికి చెందిన యోజిత సాహో బుక్కరాయసముద్రంలోని తాను నివాసముంటున్న అద్దె గృహంలో శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు రాయ్పూర్ నుంచి ఆదివారం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూడగానే బోరున విలపించారు. అనంతరం ఆమె అద్దెకున్న ఇంటిని పరిశీలించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఈ సందర్భంగా వారు పోలీసులకు తెలిపారు. కుమార్తె ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా అనంతపురం డీఎస్పీ వెంకటేశ్వర్లు, బీకేఎస్ సీఐ కరుణాకర్ కేసు నమోదు చేశారు. మృతురాలి ఐ ఫోన్, లాప్టాప్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వర్సిటీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో యోజితా మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రులు స్వగ్రామానికి తరలివెళ్లారు. అరటి తోట దగ్ధం బెళుగుప్ప: అగ్ని ప్రమాదంలో అరటి తోట దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన రైతు నరసింహులు తనకున్న ఆరు ఎకరాల్లో అరటి పంట సాగు చేపట్టాడు. ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. ఆదివారం ఉదయం తోట వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుని నిప్పు రవ్వలు ఎగిసి పడి మంటలు వ్యాపించాయి. దీంతో సుమారు 2.5 ఎకరాల్లోని డ్రిప్ పరికరాలతో పాటు అరటి చెట్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసింది. దాదాపు రూ.6 లక్షల మేర నష్టం వాటిల్టినల్లు బాధిత రైతు వాపోయాడు. ప్రైవేట్ స్కూల్ టీచర్ దుర్మరణం ధర్మవరం: మండలంలోని చిగిచెర్ల వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచరు దుర్మరణం పాలయ్యారు. వివరాలు... ధర్మవరంలోని మార్కెట్ వీధిలో నివాసముంటున్న బోయ నారాయణస్వామి (54) ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పని చేస్తున్నారు. వ్యక్తిగత పనిపై తన స్నేహితుడు సాంబశివుడుతో కలసి ధర్మవరం నుంచి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై అనంతపురానికి బయలుదేరిన ఆయన... మార్గమధ్యంలో చిగిచెర్ల దాటగానే ఓబిరెడ్డి తోట మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్ను గమనించక వేగంగా దూసుకెళ్లారు. ఘటనలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడింది. కల్వర్టు వద్ద లోతైన గుంతలో పడిన నారాయణస్వామి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంపై వెనుక కూర్చొన్న సాంబశివుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కంబాలరాయుడే కాటమరాయుడు
కదిరి: దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహా విష్ణువు వివిధ రూపాల్లో సాక్షాత్కరించారు. ఇందులో ఒకటి నారసింహుడు. ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టిన హిరణ్య కశ్యపుడిని అంతమొందించేందుకు సగం మనిషి, సగం సింహ రూపంలో అవతరించిన నారసింహుడుని కంబాల రాయుడు అని కూడా భక్తులు పిలుస్తుంటారు. కంబం అంటే స్తంభం. స్తంభం నుంచి ఉగ్రరూపంతో భువిపైకి వచ్చిన నారసింహుడు.. హిరణ్య కశ్యపుడిని అంతమొందించిన తర్వాత గాండ్లపెంట మండలం గొడ్డువెలగల సమీపంలోని కొండపై అవతరించారని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. ఇందుకు అక్కడి కొండపై స్వామి పాదాలు వెలిసినట్లు పురాణాలు సైతం చెబుతున్నాయి. ఇదే కొండపై శ్వేద తీర్థం, శిద్దుల దొన ఉన్నాయి. ఎన్ని కరువు కాటకాలొచ్చినా నీరు ఇంకి పోకుండా ఉండడం ఈ దొనల ప్రత్యేకత. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలేగాళ్లు పాలించారు. వారు తమ ఇలవేల్పుగా లక్ష్మీనరసింహస్వామి కొలిచేవారు. అందుకే వీరి కుటుంబీకులు కదిరి ప్రాంతంలో ఎంతోమంది కంబన్న, కంబాలమ్మ అనే పేర్లు పెట్టుకున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో పాలేగాళ్ల వారసులు గొడ్డువెలగల నుంచి నృసింహాలయానికి ఆనవాయితీగా ఇప్పటికీ జ్యోతిని తీసుకొస్తుంటారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. కామాంధుడి బారి నుంచి తనను తాను కాపాడుకునే క్రమంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోగా... అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ కౌలు రైతు, జీవితంపై విరక్తితో మరో యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ● నార్పల: లైంగిక వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... నార్పలలోని సుల్తాన్పేట కాలనీకి చెందిన కవిత(26), వెంకటశివ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గొర్రెల పోషణతో జీవనం సాగిస్తున్న వెంకటశివ శనివారం రాత్రి గ్రామ శివారులో విడిచిన గొర్రెల వద్దకు కాపలాకు వెళ్లాడు. విషయాన్ని గుర్తించిన అదే కాలనీకి చెందిన యువకుడు బండి లక్ష్మీనారాయణ... ఇంట్లోకి చొరబడి కవితాపై అత్యాచార యత్నం చేశాడు. ఆ సమయంలో కేకలు వేస్తూ అతని బారి నుంచి బయటపడిన ఆమె... లోపలి గదిలోకి వెళ్లి తలుపునకు గడియ పెట్టుకుంది. అదే సమయంలో తలుపులు బద్ధలుగొట్టేందుకు లక్ష్మీనారాయణ ప్రయత్నించడంతో దిక్కుతోచని స్థితిలో కవిత ఉరి వేసుకుంది. ఇంతలో శబ్ధాలకు చుట్టుపక్కల వారు.నిద్ర లేచి గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి లక్ష్మీనారాయణ పారిపోయాడు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించిన స్థానికులు అప్పటికే ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కవితను గమనించి సమాచారం ఇవ్వడంతో వెంకటశివ అక్కడకు చేరుకుని బోరున విలపించాడు. రెండేళ్లుగా కవితను బండి లక్ష్మీనారాయణ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, ఈ నేపథ్యంలోనే కవితను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడంటూ తల్లి నాగసుబ్బమ్మ చేసిన ఫిర్యాదు మేరకు సీఐ కౌలుట్లయ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ● పెద్దవడుగూరు: మండలంలోని గుత్తి అనంతపురం గ్రామానికి చెందిన రైతు తలారి రాము(43) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్న రాము... మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. దిగుబడి రాక అప్పులకు వడ్డీల భారం పెరిగింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మదనపడుతున్న రాము... ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషపు గుళికలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు. ● కూడేరు: మద్యం మత్తులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరు మండలం కలగళ్లకు చెందిన అమర్నాథ్(28) మద్యానికి బానిసగా మారి జులాయిగా తిరిగేవాడు. శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లోకి చేరుకుని తలుపులు వేసుకుని నిద్రించాడు. ఇంటి బయట నిద్రించిన తండ్రి కొండయ్య ఆదివారం ఉదయం లేచి తలుపులు తీయాలని పిలిచినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. దీంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూశారు. అప్పటికే ఫ్యాన్కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతూ కనిపించిన కుమారుడిని చూసి సమాచారమివ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
● మంత్రి సవిత పెనుకొండ: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పెనుకొండ మార్కెట్యార్డ్లో ఆదివారం జిల్లా రచయితల సంఘం, త్రిపురా రిసార్ట్, ఎంక్యూయూఏ, ఘనగిరి లలిత కళాపరిషత్, బహుజన చైతన్య వేదిక తదితర సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. సభా అధ్యక్షుడిగా జాబిలి చాంద్బాషా, సమన్వయకర్తగా ఉద్దండం చంద్రశేఖర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... ప్రతి కుటుంబం అభ్యున్నతి వెనుక మహిళ పాత్ర ఎంతో కీలకమన్నారు. తమ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించాలన్నారు. బాల్య వివాహాలు లేకుండా చూడాలని కోరారు. పెనుకొండలో షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ ప్రజలకు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఎస్పీ రత్న, షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ నిర్వాహకులు శిల్ప అనుపాటి తదితరులు మాట్లాడుతూ.. విద్యతోనే మహిళల జీవితం ఉన్నతంగా ఉంటుందన్నారు. అనంతరం మంత్రికి పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురికి మహిళా శిరోమణి పురస్కారాలను మంత్రి అందజేసి సత్కరించారు. సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, రామ్మూర్తినాయుడు, శ్రీరాంయాదవ్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, సంస్థల నాయకులు గోపీనాథ్, ఖలీముల్లా, టిప్పు సుల్తాన్ సంస్థ ఉమర్ఫారూక్ఖాన్, పలువురు కవులు, కళాకారులు పాల్గొన్నారు. -
ఖాళీ బిందెలతో నిరసన
సోమందేపల్లి: మండలంలోని బ్రహ్మసముద్రం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మాజీ సర్పంచ్ కంబాలప్ప ఆధ్వర్యంలో స్థానికులు ఖాళీ బిందెలతో ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా ఎస్సీ, బీసీ కాలనీ వాసులకు తాగునీరు అందడం లేదన్నారు. విషయాన్ని అధికారులకు తెలిపినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై న అధికారులు స్పందించి తాగునీటి సమస్య తీర్చాలని కోరారు. సత్యసాయి సందేశం అనుసరణీయంప్రశాంతి నిలయం: ఆధ్యాత్మికత, సేవా మార్గం వైపు నడిపిస్తూ సత్యసాయి అందించిన సందేశం నేటి యువతకు అనుసరణీయమని సత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు అన్నారు. సత్యసాయి ఆధ్యాత్మిక, సేవా తత్వాలపై యువతను చైతన్యవంతులను చేసేందుకు సత్యసాయి సేవా సంస్ధల ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ సత్యసాయి వాహిని సుధామృత కోర్సును పూర్తి చేసిన వారికి ఆదివారం సర్టిపికెట్లను అందజేశారు. ఆన్లైన్ ద్వారా ఈ కోర్సును దేశీయంగా 750 మందికి పైగా అభ్యసించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఆదివారం ఉదయం యజూర్ మందిరం నుంచి ర్యాలీగా సత్యసాయి సందేశాలను ప్రదర్శిస్తూ మహాసమాధి చెంతకు చేరుకున్నారు. ఆర్.జె రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యసాయి సేవా సంస్ధల ద్వారా యువతను చైతన్యవంతులను చేసేందుకు పలు కోర్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘రాజా’కు ఘన వీడ్కోలు గుంతకల్లు టౌన్: రైళ్లల్లో పేలుడు పదార్థాల గుర్తింపు, లిక్కర్ అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు విధి నిర్వహణలో సమర్థవంతమైన సేవలందించిన సాహస జాగిలం రాజా (శునకం)కు ఆర్పీఎఫ్ పోలీసులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న రాజా పదవీ విరమణను స్థానిక ప్రభాత్నగర్లోని ఆర్పీఎఫ్ డాగ్ స్క్వాడ్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
పుట్టపర్తి/పుట్టపర్తి టౌన్: జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు శనివారం కెమిస్ట్రీ/కామర్స్/సోషియాలజీ, ఒకేషనల్ గ్రూపులకు సంబంధించి ఫైన్ ఆర్ట్స్ పరీక్షలు జరిగాయి. జనరల్ విద్యార్థులు 9,057 మందికి గాను 8,877 మంది, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 785 మందికి గాను 745 మంది హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాఽశాఖాధికారి రఘునాథరెడ్డి తెలిపారు. మొత్తంగా 214 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ గ్రూపులకు సంబంధించిన విద్యార్థులకు ఈనెల 18, 20వ తేదీల్లో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఇంటర్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. శనివారం ఆమె స్థానిక మంగళకర కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ వెంట రూరల్ ఎస్ఐ లింగన్న ఉన్నారు. రేపటి నుంచి ‘పది’ పరీక్షలు ● పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు●● హాజరు కానున్న 2,23,730 మంది విద్యార్థులు ● జిల్లాలో 104 కేంద్రాల ఏర్పాటు పుట్టపర్తి: పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 17వ తేదీ (సోమవారం) ప్రారంభం కానున్నాయి. జిల్లా నుంచి 2,23,730 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, 104 కేంద్రాలు ఏర్పాటు చేశామని డీఈఓ కృష్ణప్ప శనివారం విలేకరులకు తెలిపారు. 17వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్, 19వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లిష్, 24న గణితం, 26న ఫిజిక్స్, 28న బయాలజీ, 29న ఒకేషనల్, మార్చి 31న సోషల్ స్టడీస్ పరీక్ష ఉంటుదని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రాల్లో నీటి వసతి, ఫర్నీచర్, ఫ్యాన్లు ఏర్పాటు చేశామన్నారు. మాస్ కాపీయింగ్, కాపీయింగ్కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని డీఈఓ సూచించారు. 1,400 మంది ఇన్విజిలేటర్ల నియామకం జిల్లాలో 104 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా...1,400 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు డీఈఓ కృష్ణప్ప వెల్లడించారు. అలాగే 104 మంది ఛీప్ సూపరింటెండెంట్లు,104 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను, 13 మంది అడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించామని తెలిపారు. -
ప్లాస్టిక్ కాటు.. చేటు!
ధర్మవరం: ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీసే ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వాలు నిషేధించాయి. కానీ జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, ఇతర సామగ్రి విక్రయాలు విచ్చల విడిగా సాగుతున్నాయి. ఇందులో ధర్మవరం మున్సిపాలిటి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. దీంతో రోడ్డు ప్రక్కన, డ్రైనేజీలలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు దర్శనమిస్తున్నాయి. పట్టణానికి చెందన కొందరు వ్యాపారులు జిల్లాలోని పలు ప్రాంతాలకూ ప్లాస్టిక్ కవర్లను సరఫరా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిబంధనలు బేఖాతర్ 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వం నిషేధించింది. ఈ ప్లాస్టిక్ కవర్లు గానీ, వస్తువులు గానీ ఎక్కడా కూడా విక్రయించ కూడదు. కానీ మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించకపోవడంతో పట్టణంలోని వ్యాపారులు, చిరు వ్యాపారులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. ప్లాస్టిక్ ఎగుమతులకు అడ్డాగా ధర్మవరం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు కంపెనీల నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకుని నిషేధిక ప్లాస్టిక్ కవర్లు, ఇతర సామగ్రిని భారీగా నిల్వ చేసుకుని విక్రయాలు జరుపుతున్నారు. పట్టణంలోని పీఆర్టీ సర్కిల్, అంజుమన్ సర్కిల్, కాలేజ్ సర్కిల్లో ముగ్గురు వ్యాపారులు నిషేధిక ప్లాస్టిక్ కవర్లను కదిరి, హిందూపురం, పెనుగొండ, మడకశిర, రాప్తాడులకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వస్తువులను కిలో రూ.130 చొప్పున అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అధికారులకు ముడుపులు ప్లాస్టిక్ హోల్సేల్ వ్యాపారులు మున్సిపాలిటిలోని కొందరు అధికారులకు ప్రతి నెలా ముడుపులు ముట్టజెపుతూ ప్లాస్టిక్ విక్రయాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అందువల్లే అధికారులు కూడా సదరు వ్యాపారుల గోడౌన్లు, దుకాణాల వైపు చూడటం లేదు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తే హడావుడి చేస్తారు. తోపుడు బండ్ల వ్యాపారులు, కిరాణా షాపు యజమానులకు జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా మున్సిపాలిటి పరిధిలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. దీంతో ప్రజారోగ్యం, పర్యావరణం కూడా దెబ్బతింటోంది. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడపడితే అక్కడ పడేస్తుండటంతో వాటిని తిని మూగ జీవాలు మృతి చెందుతున్నాయి. పూలు, పండ్లతో పాటు ఏ చిన్నపాటి వస్తువు కొన్నా ప్లాస్టిక్ కవర్లలో చుట్టివ్వడం సాధారణమైంది. దీనికి తోడు ఇప్పుడు ఇడ్లీ వేసేందుకూ ప్లాస్టిక్ కవర్లనే వాడుతున్నారు. వేడీ వేడి సాంబార్ను, టీని సైతం ప్లాస్టిక్ కవర్లో పార్శిల్ చేస్తున్నారు. ఇలా విచ్చల విడిగా ప్లాస్టిక్ వాడటం వల్ల అటు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతోంది. అందువల్లే ప్రభుత్వాలు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిషేధించాయి. కానీ ధర్మవరంలో మాత్రం ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గలేదు. పైగా ఇక్కడి నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, ఇతర సామగ్రి ఎగుమతి అవుతోంది. ప్లాస్టిక్ కూపంగా ధర్మవరం యథేచ్ఛగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగం కీలకంగా మారిన ముగ్గురు వ్యాపారులు ఇతర ప్రాంతాలకూ ‘ప్లాస్టిక్’ సరఫరా కట్టడి చేయడంలో వ ుున్సిపల్ అధికారులు విఫలం దెబ్బతింటున్న పర్యావరణం, ప్రజారోగ్యం -
నాణ్యమైన వైద్యం అందించాలి
హిందూపురం టౌన్: నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ వైద్యులకు సూచించారు. శనివారం పట్టణంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని సమావేశ మందిరంలో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల కోఆర్డినేటర్ తిపేంద్ర నాయక్, హిందూపురం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ లింగన్న, హిందూపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, ఆర్ఎంఓ డేవిడ్ రాజ్, ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ శ్రీదేవి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శ్రీనివాస్రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రి అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపామని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. అత్యవసర చికిత్స విభాగంలో వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు.ప్రతి వైద్యుడూ సాయంత్రం 4 గంటల వరకు కచ్చితంగా విధుల్లో ఉండాల్సిందేనన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు, స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా ఇంకా మెరుగ్గా రోగులకు అందించాలని, వచ్చిన నిధులను ఆసుపత్రి అభివృద్ధి కోసం వినియోగించుకోవాలన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి, మాతా శిశు మరణాలు తగ్గించడంతో పాటు ఓపీ, ఐపీ సేవలు మెరుగుపరచాలన్నారు. ఆస్పత్రికి వచ్చే వారంతా నిరుపేదలేనన్న విషయాన్ని గుర్తుంచుకుని వీలైనంత వరకూ కేసులను ఇతర ప్రాంతాలకు సిఫారసు చేయకుండా ఇక్కడే వైద్యం అందించే అందించాలని సూచించారు. అలాగే క్రిటికల్ కేర్ బ్లాకు సివిల్ వర్స్స్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, నూతన భవనాన్ని సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి సమీపంలోని అన్న క్యాంటీన్ను కలెక్టర్ పరిశీలించారు. ఎన్టీఆర్ వైద్య సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి మాతా, శిశు మరణాల తగ్గింపునకు చర్యలు చేపట్టాలి ఆస్పత్రి కమిటీ సమావేశంలో కలెక్టర్ టీఎస్ చేతన్ -
కరువు, రైతు ఆత్మహత్యలకు కారకులెవరు?
హిందూపురం: రాయలసీమలో నిత్య కరువులు, వలసలు, రైతు ఆత్మహత్యలకు కారకులెవరని జలసాధన సమితి సభ్యులు ప్రశ్నించారు. హంద్రీ–నీవా ప్రాజెక్టు ప్రధాన కాలువ లైనింగ్ పనులు రద్దుచేసి కాలువ వెడల్పు చేయాలని కోరుతూ జలసాధన సమితి ఆధ్వర్యంలో శనివారం హిందూపురంలోని ఇందిరా పార్కు కల్లూరు సుబ్బారావు విగ్రహం వద్ద జలసాధన సమితి నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన కలెక్టర్ చేతన్ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జలసాధన సమితి గౌరవాధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ రామచంద్రారెడ్డి, అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి, ఓపిడిఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తున్నప్పటికీ ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదన్నారు. కొన్ని చెరువులు మాత్రమే నీరు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారన్నారు. వాస్తవంగా విడుదల అవుతున్న 27 టీఎంసీలు నీటిలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు 24 టీఎంసీలు వచ్చాయన్నారు. ఉమ్మడి జిల్లాలో 2,500 చెరువులు ఉండగా.. 89 చెరువులకు మాత్రమే నీరు ఇస్తున్నారన్నారు. హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేసి వంద టీఎంసీలను ఎత్తిపోతలతో కొత్త ఆయకట్టుకు నీరు ఇస్తే ఉమ్మడి జిల్లాలకు విస్తృత ప్రయోజనాలు ఉంటాయన్నారు. అలాకాకుండా కాలువను వెడల్పు చేయకుండా లైనింగ్ చేయటం వల్ల ప్రయోజనం లేకపోగా నష్టమే ఎక్కువగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జలసాధన సమితి ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, రచయిత సడ్లపల్లి చిదంబరరెడ్డి, రైతు సంఘం నాయకులు సిద్ధారెడ్డి, జలసాధన సమితి నాయకులు ఫరూక్, జమీల్, అమానుల్లా, దాసరి హరి, సీఐటీయూ నాయకులు రాము, పర్యావరణవేత్త భాస్కర్రెడ్డి, ఎస్యూసీఐ నాయకులు గిరీష్, తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వర్ ఆశయ సాధనకు కృషి
పెనుకొండ: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శివసాయి మందిరం వ్యవస్థాపకుడు, షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ అధినేత సాయి కాలేశ్వర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని ట్రస్ట్ నిర్వాహకురాలు శిల్ప తెలిపారు. శనివారం పెనుకొండలోని శివసాయి మందిరంలో సాయి కాళేశ్వర్ 13వ వర్ధంతి నిర్వహించారు. ఆయన సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శిల్ప నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకురాలు శిల్ప సీసీ కెమెరాల ఏర్పాటు కోసం పోలీసు శాఖకు రూ.28 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. సయికాళేశ్వర్ బాటలోనే గతంలో మాదిరిగా విద్య, వైద్యం, తాగునీరు తదితర సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. అనంతరం కంటి ఆపరేషన్లు చేయించుకున్న వృద్ధులకు, రోగులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెనుకొండలో నేరాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు అవసరమని ట్రస్ట్ నిర్వాహకురాలి దృష్టికి తీసుకురాగా.. ఆమె వెంటనే స్పందించి ఆర్థికసాయం అందించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ రాఘవన్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యాయవాది గురుప్రసాద్, మదన్మోహన్రెడ్డి, ప్రగతి శ్రీనివాసులు, జాన్ప్రియనాథ్, నాగిరెడ్డి, చిట్టిబాబు, హరి, బాబు ఇతర ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు. -
మడకశిరలో భారీ అగ్ని ప్రమాదం
మడకశిర: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వేలాది తాగునీటి సరఫరా పైపులు దగ్ధమయ్యాయి. రూ.కోట్లల్లో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో మంటలు వైఎస్సార్ సీపీ హయాంలో రూ.68 కోట్లతో మడకశిర మున్సిపాలిటీ పరిధిలోని ఏఐఐబీ (ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ స్కీం) కింద తాగునీటి పథకాన్ని చేపట్టారు. ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం ట్యాంకుల నుంచి పైప్లైన్లు ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మారడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన వేలాది ప్లాస్టిక్ పైపులు, ఇతర సామగ్రిని వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఓ రేకుల షెడ్లో నిల్వ ఉంచారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా మార్కెట్ యార్డులో మంటలు చెలరేగాయి. మార్కెట్ యార్డులోని రేకుల షెడ్లో నిల్వ ఉంచిన పైపులకు కూడా మంటలు వ్యాపించాయి. మార్కెట్ యార్డును పూర్తిగా పొగకమ్మేసింది. విషయం తెలుసుకున్న ట్రైనీ డీఎస్పీ ఉదయపావని, మున్సిపల్ కమిషనర్ రంగస్వామి, తహసీల్దార్ కరుణాకర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దింపారు. అగ్నిమాపక శాఖ అధికారులు కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు. మార్కెట్ యార్డులో తాగునీటి పైపుల దగ్ధం రూ.కోట్లలో ఆస్తినష్టం -
చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్
● రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ బత్తలపల్లి: ‘‘నేనూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నా. చదువుకుంటేనే పది మంది మనల్ని గౌరవిస్తారు. మంచి భవిష్యత్ ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా చదువును మాత్రం వీడకండి. ఏదైనా కష్టం వస్తే తెలపండి. పరిష్కారానికి చర్యలు తీసుకుంటా’’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ విద్యార్థులకు సూచించారు. అహర్నిశలు శ్రమిస్తూ లక్ష్యం దిశగా అడుగులేస్తూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థినుల సౌకర్యార్థం రూ.2 కోట్లతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీ బాలికల వసతి గృహాన్ని నిర్మించారు. శనివారం మంత్రి సత్యకుమార్ వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వసతి గృహంలోని గదులు, సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థినుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులతో ఆత్మీయంగా మాట్లాడారు. కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ మహేష్, ఎంపీడీఓ నరసింహనాయుడు, జెడ్పీటీసీ సుధ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయంతి, పాఠశాల సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు ప్రారంభం ముదిగుబ్బ: మండల పరిధిలోని మలకవేమల క్రాస్ యనుములవారిపల్లి దగ్గర శనివారం హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివివధ సమస్యలపై ప్రజల మంత్రికి అర్జీల సమర్పించారు. వాటిని స్వీకరించిన మంత్రి... వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తామన్నారు. కార్యక్రమంలో ధర్మవరం ఆర్డీఓ మహేష్, ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరావు, ఎంపీపీ ఆదినారాయణ, వైస్ ఎంపీపీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. కదిరి: ఖాద్రీ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. భక్తుల గోవింద నామస్మరణతో ఖాద్రీ క్షేత్రం మార్మోగిపోతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా శేష వాహనంపై తిరువీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్గించారు. స్వామివారి దివ్య మంగళరూపాన్ని భక్తులు దర్శించుకుని తన్మయత్వం చెందారు. వైకుంఠంలో స్వామి నిత్యం పవళించి ఉండే శేషతల్పం ఆ స్వామితో పాటే భువికి దిగి వచ్చిందని భక్తుల విశ్వాసం. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవాల్లో శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిస్తున్నారని వారి నమ్మకం. ‘శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి’ అని అర్చక పండితులు పేర్కొన్నారు. శేష వాహనంపై ఉన్న స్వామి వారిని దర్శించుకుంటే సర్పదోషం పోతుందని భక్తుల నమ్మకం. ఉత్సవ ఉభయదారులుగా యాదాలం శ్రీనివాసులు, బాలాజీ కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల కాలక్షేపం కోసం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరిస్తున్నాయి. అలాగే భక్తుల కోసం ఆలయంలో ఉదయం నుంచి రాత్రి 11 వరకూ నిత్యన్నదానం కొనసాగుతోంది. నేడు సూర్య, చంద్రప్రభ వాహనాల్లో విహారం పుట్టడం, జీవించడం, మరణించడం అనే మూడు ప్రక్రియలు కాలాఽధీనాలు. కాల స్వరూపుడిని తానేనంటూ భక్తులకు చాటి చెప్పేందుకు శ్రీవారు ఆదివారం పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై తిరువీధుల్లో విహరించనున్నారు. వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు గోవింద నామస్మరణతో మార్మోగుతున్న కదిరి -
కఠిన చర్యలు తీసుకోవాలి
ప్లాస్టిక్ను విక్రయించే బడా వ్యాపారులపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. తద్వారా ప్లాస్టిక్ నివారణ సాధ్యమవుతుంది. అలాకాకుండా చిరు వ్యాపారులకు జరిమానా విధించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మున్సిపాలిటిలో విపరీతంగా ప్లాస్టిక్ వినియోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటోంది. అధికారులు స్పందించి చర్యలు చేపట్టి ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. –చందమూరి నారాయణరెడ్డి, 37వ వార్డు కౌన్సిలర్, ధర్మవరం చర్యలు తీసుకుంటాం మున్సిపాలిటి పరిధిలో ప్లాస్టిక్ కట్టడి కోసం కృషి చేస్తున్నాం. ప్రజల్లోనూ అవగాహన పెంపొందిస్తున్నాం. ప్లాస్టిక్ను విక్రయించే వ్యాపారులు ఎంతటి వారైన ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు చేపడతాం. –ప్రమోద్కుమార్, మున్సిపల్ కమిషనర్, ధర్మవరం -
నీరు తరగని పాలబావి
కదిరి: ముత్యాలచెరువుకు సమీపంలో పాలబావి ఉంది. ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తురాలైన కర్ణాటకకు చెందిన సాసవుల చిన్నమ్మ దీన్ని రాత్రికి రాత్రి తవ్వించినట్లు బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఈ బావిని కొంత లోతు తవ్విన తర్వాత కింద నుంచి కోడికూతతో పాటు రోకలితో ధాన్యం దంచుతున్న శభ్దం వినబడింది. ఈ విషయాన్ని వారు సాసవుల చిన్నమ్మకు చెప్పడంతో కింద మరో లోకం ఉందని భావించి తవ్వడం ఆపేశారు. తర్వాత వచ్చే వేసవికి ఆ బావి పొంగి ప్రవహించడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. ఆ నీరు పాలవలె ఉండటం మరింత నివ్వెర పరిచింది. అప్పుడు ఈ ప్రాంత వాసులు సాసవుల చిన్నమ్మ భక్తిని మరింత మెచ్చుకున్నారు. ఎంతటి కరువు కాటకాలొచ్చినా ఈ పాలబావిలో మాత్రం నీళ్లు తగ్గవు. ఈ నీటిని నరసింహస్వామి భక్తులు పవిత్ర తీర్థంగా భావిస్తారు. శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ దక్షిణ గోపురాన్ని కూడా సాసవుల చిన్నమ్మే నిర్మించినట్లు బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే కర్ణాటకకు చెందిన భక్తులందరూ ఈ పాలబావిని చూసి వెళతారు. కాగా క్షీర కేతుడనే రాజు పుత్ర సంతానం కోసం ఈ పాలబావిలో స్నానమాచరించి తర్వాత నారసింహుని దర్శించుకున్నారని, అందుకే క్షీరతీర్థమని పిలుస్తున్నారని మరో కథనం. పులగం వండిన గ్రామమే పులగంపల్లి ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తురాలు సాసవుల చిన్నమ్మ తమ పరివారంతో కర్ణాటక నుంచి శ్రీవారి దర్శనం కోసం వస్తుండేది. దారి మధ్యలో మధ్యాహ్న సమయంలో తమ వెంట వచ్చిన వారి ఆకలి తీర్చేందుకు సాసవుల చిన్నమ్మ కదిరి–బెంగళూరు రహదారి పక్కన పులగం వండి వడ్డించడం మొదలెట్టింది. తమ వెంట వచ్చిన వారితో పాటు దారి వెంబడి వెళ్లే వారందరికీ వడ్డించినా ఆ పాత్రలోని పులగం తరగలేదు. సాసవుల చిన్నమ్మ పులగం వండిన ప్రాంతాన్ని పులగంపల్లిగా నామకరణం చేశారు. ఇప్పటికీ పులగంపల్లిగా పిలుస్తున్నారు. రాత్రికి రాత్రే తవ్వించిన సాసవుల చిన్నమ్మ -
అన్ని చెరువులూ నింపాల్సిందే
హంద్రీ–నీవా నీటితో హిందూపురం నియోజకవర్గంలోని 39 చెరువులనూ పూర్తిగా నింపాల్సిందే. అరకొర నీళ్లిచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తే ఊరుకోబోం. 10 రోజల నుంచి నీళ్లొస్తున్నాయని చెబుతున్నారు. మరి ఇప్పటి వరకు ఎన్ని చెరువులు నింపారో ఎమ్మెల్యే బాలకృష్ణ, అధికారులు సమాదానం చెప్పాలి. ఎమ్మెల్యేకు నియోజకవర్గ రైతులపై ప్రేమ ఉంటే ఈపాటికి అన్ని చెరువులకూ నీళ్లందేలా చూసేవారు. చెరువులకు పూర్తిస్థాయిలో నీరు ఎప్పుడు వదులుతారో అధికారులు స్పష్టత ఇవ్వాలి. – టీఎన్ దీపిక, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, హిందూపురం -
లైనింగ్ పనులు ఆపకపోతే ఉద్యమాలు తప్పవు
సోమందేపల్లి: హంద్రీ–నీవా పనులు రద్దు చేసి కాలువ వెడల్పు చేయకపోతే ఉద్యమాలు తప్పవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ తెలిపారు. శనివారం ఆయన సోమందేపల్లిలోని సీపీఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొంతమంది స్వార్ధం కోసం లైనింగ్ పనులపై ప్రభుత్వం మక్కువ చూపుతూ రైతులకు తీవ్ర నష్టం చేకూరుస్తోందన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వస్తున్న 40 టీఎంసీల కన్నా అదనంగా నీరు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా చెరువులకు సాగునీటిని విడుదల చేయాలన్నారు. లైనింగ్ వల్ల జిల్లాలోని ఏడు నియోజకవర్గాల రైతులు త్రీవంగా నష్టపోతారని, ప్రభుత్వ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకటేష్ రాజ్గోపాల్, రంగప్ప, హనుమయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బీటెక్ విద్యార్థి అదృశ్యం నల్లమాడ: ఎద్దులవాండ్లపల్లికి చెందిన లక్ష్మీకాంత్రెడ్డి అనే బీటెక్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. రామ్మోహన్రెడ్డికి ఇద్దరు సంతానం. వీరు కొన్నేళ్ల క్రితం బెంగళూరుకు వలస వెళ్లి స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు లక్ష్మీకాంత్రెడ్డి అనంతపురంలోని ప్రైవేట్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల ఏడో తేదీన లక్ష్మీకాంత్రెడ్డి బెంగళూరుకు వస్తున్నానని తండ్రికి ఫోన్లె చెప్పి స్వగ్రామం ఎద్దులవాండ్లపల్లి నుంచి ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. కొంతసేపటి తర్వాత తండ్రి ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది. అనుమానం వచ్చి అనంతపురం, బెంగళూరు ప్రాంతాల్లో గాలించినా కుమారుడి ఆచూకీ కన్పించలేదు. దీంతో రామ్మోహన్రెడ్డి శనివారం నల్లమాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరేంద్రరెడ్డి తెలిపారు. త్వరలో హెచ్చెల్సీలో అత్యవసర పనులు● హెచ్చెల్సీ కాలువను పరిశీలించిన ఎస్ఈ రాజశేఖర్ బొమ్మనహాళ్: తుంగభద్ర ఎగువ కాలవ (హెచ్చెల్సీ)కి త్వరలోనే అత్యవసర పనులు ప్రారంభిస్తున్నట్లు హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ తెలిపారు. శనివారం ఆయన మండల పరిధిలో హెచ్చెల్సీ కాలువను పరిశీలించారు. బొమ్మనహాళ్, కృష్ణాపురం, ఉంతకల్లు, మైలాపురం, ఉద్దేహాళ్ గ్రామాల సమీపంలోని 126,105,109వ కిలోమీటర్ల వద్ద కాలువ వంతెనలను పరిశీలించారు. నీటి ప్రవాహానికి అడ్డంగా లేకుండా కాలువలో ఉన్న వ్యర్థాలను తొలగించాలని స్థానిక అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. అనంతరం విలేకరులతో ఎస్ఈ మాట్లాడుతూ హెచ్చెల్సీ అత్యవసర పనుల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించిందన్నారు. 165 కిలోమీటర్ నుంచి 189 కిలోమీటర్ వరకు రూ.34.95 కోట్లతో పనులు జరుగుతాయని తెలిపారు. జూలై నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. బొమ్మనహాళ్ మండలంలో రూ.16 కోట్లతో వంతెన, లైనింగ్ పనులు జరుగుతాయని తెలిపారు. ఎప్పటికప్పుడు పనులు పరిశీలిస్తూ నాణ్యతగా ఉండేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో జేఈఈ అల్తాఫ్, హెచ్చెల్సీ సిబ్బంది పాల్గొన్నారు. -
చెరువులు నిండితేనే పంటలు
చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీలో కొర్లకుంట, దేమకేతేపల్లి చెరువులకు హంద్రీ–నీవా నీరు వదులుతారు. ప్రస్తుతం కొండూరు చెరువుకు నీళ్లు వదిలారని, అయితే అవి సరిగా రావడం లేదని అంటున్నారు. అదే నిండకపోతే ఇక మా చెరువులకు నీళ్లు ఎలా వస్తాయి? బోరుబావుల్లో నీరు తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి. చెరువులు నిండితేనే పెట్టిన పంటలు చేతికొస్తాయి. నీళ్లు త్వరగా వదలాలి. అధికారులు, పాలకులు స్పందించాలి. – చంద్రశేఖర్రెడ్డి, రైతు, డి.గొల్లపల్లి -
సెల్ఫోన్ చూడొద్దన్నందుకు టెన్త్ విద్యార్థి పరార్
● రైల్వే స్టేషన్లో గుర్తించిన పోలీసులు పెనుకొండ: పరీక్షల వేళ సెల్ఫోన్ చూడవద్దని తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థి ఇంటినుంచి పరారయ్యాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని నారాయణమ్మ కాలనీ సమీపాన నివాసముంటున్నా లికిరెడ్డి వాయునందన్రెడ్డి పదో తరగతి చదువుతున్నాడు. సోమవారం నుంచి పరీక్షలు మొదలవుతాయి. అయితే శుక్రవారం రాత్రి సెల్ఫోన్ చూస్తుండడంతో తండ్రి నాగార్జునరెడ్డి గమనించి గట్టిగా మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన వాయునందన్రెడ్డి ఇంటినుంచి పరారయ్యాడు. కుమారుడు ఎంత సేపైనా ఇంటికి రాకపోవడంతో పలు చోట్ల వెదికిన తండ్రి, ఇతర కుటుంబసభ్యులు అదేరోజు రాత్రి 11 గంటల తర్వాత ఎస్ఐ వెంకటేశ్వర్లును కలసి ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ వెంటనే పోలీసు సిబ్బందితో బస్టాండ్, రైల్వేస్టేషన్, జాతీయ రహదారి, పలు హోటళ్ల వద్ద గాలింపు చేపట్టారు. చివరకు రైల్వేస్టేషన్లో దాక్కుని ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని, విద్యార్థిని మందలించి చక్కగా చదువుకోవాలని, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం తల్లిదండ్రులకు బాలుడిని అప్పగించారు. చికిత్స పొందుతు చిన్నారి మృతిరొళ్ల: మడకశిర సమీపాన వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొడగార్లగుట్లకు చెందిన సన్నలింగప్ప కుమార్తె ప్రార్థన (3) శనివారం మృతి చెందింది. ఇదే ప్రమాదంలో సన్నలింగప్ప కుమారుడు గోకుల్ గాయపడి ఆస్పత్రిలో కోలుకుంటున్న విషయం విదితమే. కాగా ప్రార్థన అంత్యక్రియలు సాయంత్రం స్వగ్రామంలో పూర్తి చేశారు. గుప్తనిధి తవ్వకాల కేసులో ఐదుగురి అరెస్ట్ నల్లమాడ: గుప్త నిధి కోసం తవ్వకాలు చేపట్టిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నరేంద్రరెడ్డి శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. మండల కేంద్రానికి సమీపంలోని సుంకులమ్మ గుడి వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో తమ సిబ్బందితో హుటాహుటిన వెళ్లి ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు. గోరంట్లకు చెందిన మారుతీకుమార్, శ్రీరాములు, నరసింహులు, హారీఫుల్లా, గోపీ అరెస్టయిన వారిలో ఉన్నారు. వీరి నుంచి కారు, తవ్వకాలకు ఉపయోగించిన వస్తువులను సీజ్ చేశామన్నారు. చెట్టుపై నుంచి పడి కూలీ మృత్యువాతపావగడ: కుందుర్పి మండలం శ్రీమజ్జనపల్లికి చెందిన వ్యవసాయ కూలీ కెంచయ్య (42) శనివారం చింతచెట్టుపైనుంచి ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కెంచయ్య రోజువారీ కూలి పనుల్లో భాగంగా శనివారం ఉదయం చింతకాయలు కోయడానికి సమీపంలోని పుట్రాళ్లపల్లి వద్దకు వెళ్లాడు. అక్కడ చింతకాయలు కోసే క్రమంలో కాలుజారి చెట్టుపైనుంచి కింద పడ్డాడు. తలకు, మర్మావయవాలకు తీవ్రగాయాలవడంతో వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కెంచయ్యకు భార్య నేత్ర, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గరుడ వాహనంపై దేవ దేవుడు
కదిరి: అశేష భక్త జన గోవింద నామస్మరణ మధ్య ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి శుక్రవారం గరుడ వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలకు అధిపతి అయిన బ్రహ్మదేవుడు తన ఇష్ట వాహనమైన గరుత్మంతున్ని నారసింహుడికి వాహనంగా పంపుతారని, అందుకే ఈ ఉత్సవాన్ని బ్రహ్మ గరుడ సేవ అంటారని అర్చక పండితులు అంజన్ కుమార్ ఆచార్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సమస్త వాహనాల్లో సర్వ శ్రేష్ఠమైన గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే స్వర్గం ప్రాప్తిస్తుందని, బాధల నుంచి విముక్తి కల్గుతుందని భక్తుల నమ్మకం. నారసింహుని బ్రహ్మోత్సవాల సమయంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడే కాబట్టి ఈ వాహన సేవకు ప్రాధాన్యత ఉంది. రాజగోపుర దర్శనానికి పోటీ.. తమ ఇష్టదైవం ఖాద్రీశుడు తూర్పు రాజగోపురం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ‘ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా..గోవింద’ అంటూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. బ్రహ్మ గరుడ సేవలో తూర్పు రాజగోపురం వద్ద స్వామి వారిని దర్శించుకుంటే మరింత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు తమ ఇలవేల్పు అయిన నృసింహుడిని అక్కడ దర్శించుకోవడానికి పోటీ పడ్డారు. విద్యుత్ దీపాలంకరణ, కదిరి మల్లెలతో శ్రీవారిని విశేషంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉత్సవాలకు ఉభయదారులుగా కుటాగుళ్లకు చెందిన బేరి వర్తకులు బీపీ నారాయణప్ప శెట్టి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేడు శేష వాహనం.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం (నేడు) లక్ష్మీ నారసింహుడు శేషవాహనంపై తన భక్తులకు తిరువీధుల్లో దర్శనం ఇవ్వనున్నారు. భక్తులతో పోటెత్తిన నృసింహాలయం గోవింద నామస్మరణతో మార్మోగిన కదిరి -
చట్టంపై అవగాహన అవసరం..
సాక్షి, నెట్వర్క్: కొనే ప్రతి వస్తువులోనూ, సేవలోనూ లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగినవి పొందే హక్కు వినియోగదారులకు ఉంది. అయితే ప్రస్తుతం మోసాలు ఎక్కువైపోయాయి. తాగే పాలు, నీళ్లలో కూడా నాణ్యత ఉండటం లేదు. తూకాల్లో భారీగా తేడాలు ఉంటున్నాయి. బ్రాండ్ పేరుతో నకిలీ వస్తువులు రాజ్యమేలుతున్నా.. అధికారులు మౌనం వహిస్తున్నారు. ఫిర్యాదు వచ్చిన రోజు తూతూ మంత్రంగా తనిఖీ చేసి జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు కూడా మొక్కుబడిగా కార్యక్రమాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో శుక్రవారం ‘సాక్షి’ విజిట్లో పలు మోసాలు బయటపడ్డాయి. ‘మామూళ్ల మత్తు’లో వ్యవస్థలు.. కల్తీ, నాణ్యత, తూకాలు, గడువు మీరిన వస్తువులు. నకిలీ సరుకు, బ్రాండ్ పేరుతో దోపిడీ.. ఇలా ఇన్ని జరుగుతున్నా.. లీగల్ మెట్రాలజీ అధికారులు, డ్రగ్స్ కంట్రోలర్స్, ఫుడ్ ఇన్స్పెక్టర్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వినియోగదారులు ఫిర్యాదులు ఇస్తే.. కానీ తనిఖీలు చేయడం లేదు. చేసినా నివేదిక ఏం తెలుస్తారో బయటికి చెప్పరు. నెలవారీ మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇలా ఫిర్యాదు చేద్దాం.. వినియోగదారులు నష్టపోయామని భావిస్తే జిల్లాలో అయితే డీసీఐసీ, మండలాల్లో అయితే ఎంీసీఐసీ ద్వారా కేవలం తెల్లకాగితంపై రాసి ఇస్తే సరిపోతుంది. అయితే కచ్చితంగా రసీదు ఉండాలి. విక్రయించే ప్రతి వస్తువుపైనా ఎంఆర్పీ తయారు చేసిన తేదీ, ఎక్స్పైరీ డేట్, వినియోగదారుల హెల్ప్లైన్కు చెందిన నంబరు విధిగా ముద్రించి ఉండాలి. అలా లేకపోతే వస్తువుల విక్రయ దుకాణాలపై ప్రభుత్వం జరిమానా విధించాలి. అనుమతి లేకుండా సినిమా టికెట్లు అధిక ధరలకు అమ్మినా, తూకాల్లో తేడాలున్నా, సేవల్లో లోపాలను పసిగట్టినా ఫిర్యాదు చేయొచ్చు. నష్టపరిహారం కోరవచ్చు నాణ్యత లేని ఉత్పత్తులపై (ప్రాడక్ట్ లైబులిటీ) తయారీదారులు, విక్రయదారులు, సేవాదారులు అందరూ బాధ్యత వహించాలి. వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించాలి. రెండు సంవత్సరాల కాల పరిమితికి లోబడి కమిషన్ ఎదుట ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు. వినియోగదారుల్లో చైతన్యం రావాలి. అప్పుడే వినియోగదారుల రక్షణ చట్టం లక్ష్యం నెరవేరుతుంది. – ఎం.శ్రీలత, జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు ప్రజల్లో అవగాహన రావాలి వినియోగదారుల చట్టంపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తుండటంతో ప్రజలు నిత్యం మోసానికి గురి కావాల్సి వస్తోంది. ఎంఆర్పీకి మించి అమ్ముతున్నా.. పట్టించుకునే వారు లేకపోవడం దారుణం. జిల్లా కేంద్రంలో ఆహార పరీక్షల ల్యాబ్ ఏర్పాటు చేయాలని చాలాసార్లు విన్నవించాం. – సురేశ్బాబు, వినియోగదారుల సంఘం సభ్యుడు, పుట్టపర్తి వినియోగదారుల రక్షణ చట్టం–2019 ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. నాణ్యత లేని ఉత్పత్తులు, తప్పుడు ప్రకటనలు, అధిక ధరలు, సరైన సేవలు అందకపోవడం వంటి సమస్యల నుంచి పరిహారం కోసం వినియోగదారులకు రక్షణ చట్టం అమల్లో ఉంది. మారుతున్న కాలానికి, సాంకేతిక సౌలభ్యానికి అనుగుణంగా ఈ–కామర్స్, ఆన్లైన్ షాపింగ్పై నియంత్రణ ఈ చట్టంలో ఉంది. జిల్లా కమిషన్ ఎదుట కోటి రూపాయల లోపు రూ. కోటి నుంచి రూ.10 కోట్ల మధ్య రాష్ట్ర కమిషన్ ఎదుట రూ.10 కోట్ల పైబడిన కేసులు జాతీయ కమిషన్ ఎదుట దాఖలు చేయవచ్చు వినియోగదారులు ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. -
ఈ భవనాసిని తీర్థమే ఒకప్పటి కోనేరు
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని ఈశాన్య మూలలో ఉన్న ఈ భవనాసిని తీర్థంలోనే భక్తులు గతంలో స్నానమాచరించే వారు. భక్తులు తమ ఇలవేల్పు దేవుడు నారసింహుడికి తలనీలాలు సమర్పించిన మీదట ఇందులో స్నానం చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకునేవారు. అయితే లోతైన బావి తరహాలో ఉండటంతో చిన్న పిల్లలు, మహిళా భక్తులు ఇందులోకి దిగి స్నానం చేయడం కష్టంగా ఉండేది. అందుచేత ఆలయ అధికారులు కొన్నేళ్లుగా ఇందులో స్నానం చేయడానికి భక్తులను అనుమతించడం లేదు. కాగా ఇందులో ఏర్పాటు చేసిన ఆంజనేయుడి విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొట్టుకుపోయిన కోనేరు.. ఆలయానికి పడమటి వైపున అర్జున నదీ(మద్దిలేరు)తీరం ఉంది. అక్కడ భృగు మహర్షి తపస్సు చేసి స్వామి వారిని స్మరణం చేసుకున్నారు. ఆయన కోరిక మేరకు శ్రీవారు ప్రత్యక్షమై శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ విగ్రహాలను స్వయంగా అందించినట్లు బ్రహ్మాండ పురాణం చెబుతోంది. వాటినే ఏటా బ్రహ్మోత్సవాల్లో తిరువీధుల్లో ఊరేగిస్తున్నారు. వసంత రుతువులో శ్రీవారు అనుగ్రహించడంతో ఉత్సవ మూర్తులకు వసంత వల్లభులని పేరొచ్చింది. భృగు మహర్షి తపస్సు ఫలితంగా కోనేరును భృగుతీర్థం అని పిలుస్తున్నారు. అయితే 2022లో కురిసిన భారీ వర్షాలకు కోనేరు మొత్తం కొట్టుకు పోయింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. మరిన్ని తీర్థాలు.. శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా భృగుతీర్థం, భవనాసిని తీర్థాలతో పాటు మొత్తం 13 పవిత్ర తీర్థాలు ఉన్నట్లు బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోంది. 1 గజేంద్ర తీర్థం, 2 ఆళ్వారుల తీర్థం, 3 అచ్యుత తీర్థం, 4 భృగుతీర్థం, 5 అర్జున తీర్థం, 6 శ్వేత పుష్కరిణి తీర్థం, 7 భవనాసిని తీర్థం, 8 గరుడ తీర్థం, 9 నాగుల తీర్థం, 10 కూర్మతీర్థం, 11 స్వర్ణతీర్థం, 12 శ్రీ తీర్థం, 13 క్షీర తీర్థం..ప్రస్తుతం దీన్ని పాలబావిగా పిలుస్తున్నారు. -
రైలు కిందపడి వలస కార్మికుడి మృతి
హిందూపురం అర్బన్: హిందూపురం–మలుగూరు రైల్వేస్టేషన్ మధ్య శుక్రవారం ఓ వ్యక్తి రైలుకింద పడి మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపిన వివరాలు.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇస్రార్(35) హిందూపురం టీచర్స్ కాలనీలో ఓ బ్యూటీపార్లర్లో పని చేసేవాడు. సొంతూరుకు వెళ్లే క్రమంలో రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బ్యూటీపార్లర్ నిర్వాహకుడు సుధాకర్నాయుడు సహకారంతో మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. క్షుద్ర పూజలు చేశారంటూ వేధింపులు.. మహిళ ఆత్మహత్య మడకశిరరూరల్: క్షుద్ర పూజలు చేశారంటూ వేధింపులకు గురిచేయడంతో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పత్తికుంట గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప భార్య రత్నమ్మ అనారోగ్యంతో బాధపడుతుండేది. వివిధ ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా నయం కాలేదు. అదే గ్రామానికి చెందిన నాగమణి(39) క్షుద్ర పూజ చేయించడంతోనే తన భార్యకు నయం కాలేదని అనుమానంతో హనుమంతరాయప్ప, కుటుంబ సభ్యులు నాగమణిని వేధించేవారు. ఈక్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె శుక్రవారం గ్రామ సమీపంలోని చింత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త నరసింహమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వ్యక్తిపై హత్యాయత్నం తనకల్లు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డులో వలి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాలు..నల్లచెరువు మండలం మల్లిరెడ్డిపల్లికి చెందిన వలి బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వలి మూడు రోజులుగా తనకల్లులో ఉంటున్నాడు. అయితే శుక్రవారం రాత్రి రైల్వేస్టేషన్ రోడ్డులోని మోరీ వద్ద ఉన్న వలిపై బైక్పై వచ్చి అగంతకులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. అపస్మారక స్థితిలో రోడ్డుపక్కన పడిపోయాడు. ఎస్ఐ గోపి హుటాహుటినా బాధితుడిని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
వైభవంగా రొళ్ల లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం
రొళ్ల: మండల కేంద్రంలో శుక్రవారం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మరథోత్సవం వైభవంగా సాగింది. ఉదయాన్నే స్వామి మూలవిరాట్ను ప్రత్యేకంగా అలంకరించి వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణ ముందు భాగాన ఉన్న రథాన్ని వివిధ రకాల పూలతో అలంకరించారు. రథం ముందు భాగాన వేదపండితులు శాంతి, నవగ్రహ హోమం, యోగీశ్వరారాధన, గణపతి పూజ, బలిహరణ తదితర పూజలు చేశారు. తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రధాన ఆలయం నుంచి మేళతాళాలతో ఆంజనేయస్వామి ఆలయం వరకు ఊరేగించారు. అనంతరం అర్చకులు ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు రథంపైకి అరటి పండ్లు, పూలు, తమలపాకులు, బొరుగులు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. గోవింద నామ స్మరణతో రథాన్ని ఆలయ ప్రాంగణం నుంచి ఆంజనేయస్వామి ఆలయం వరకు లాగారు. భక్తులకు దాతల సహకారంతో మూడు చోట్ల అన్నదానం చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మడకశిర సీఐ రాజ్కుమార్ ఎస్ఐ వీరాంజనేయులు, అమరాపురం ఎస్ఐ ఇషాక్బాషాతో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు రొళ్లకొండ పై దివ్యజ్యోతి దర్శనం.. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం రొళ్లకొండ పై భాగాన వెలసిన ఉగ్రనరసింహస్వామి ఆలయంలో దివ్యజ్యోతి దర్శనం, వసంతోత్సవం, భక్తులతో ధాన్యం సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. -
కదిలింది.. కణివె నృసింహుడి బ్రహ్మరథం
పావగడ: స్థానిక కణివె లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఎండోమెంట్ అధికారి, స్థానిక తహసీల్దార్ వరద రాజు సమక్షంలో ఆలయం నుంచి లక్ష్మీదేవి సమేత నరసింహస్వామి ఉత్సవ మూర్తులను వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య అందంగా అలంకరించిన బ్రహ్మరథంలో ప్రతిష్టించారు. అనంతరం 12.45 గంటల సమయంలో ఎండోమెంట్ అధికారి వరదరాజు తదితర ప్రముఖులు లాంఛన ప్రాయంగా లాగి బ్రహ్మ రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి పాదాల గోవిందా గోవింద... అనే నామ స్మరణ మార్మోగింది. అనంతరం ఆలయం బయట నిలిపిన బ్రహ్మ రథానికి భక్తులు టెంకాయలు కొట్టి ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులకు భక్త మండలి పదాధికారులు అన్నదానం చేపట్టారు. సీఐ సురేశ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం
● నిందితులు టీడీపీ కార్యకర్తలు చిలమత్తూరు: హిందూపురం రూరల్ మండలం జంగాలపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాకర్తలపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశారు. గురువారం రాత్రి బాలంపల్లి వైపు నుంచి వస్తున్న అశ్వర్థ, దేవేగౌడలపై మార్గ మధ్యంలో కాపుకాచిన టీడీపీ కార్యకర్తలు సాయికుమార్, శ్రీనివాసులు, గోవిందప్ప మారణాయుధాలతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు వెంటనే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేత వేణురెడ్డి శుక్రవారం హిందూపురం జిల్లా సర్వజనాస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ఫోన్ ద్వారా బాధితులను పరామర్శించారు. అనంతరం వేణురెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ నేతల అరాచాకాలను ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా వ్యక్తిగత కక్షలే దాడులకు కారణమని, ఇరుపక్షాలపై కేసు నమోదు చేయనున్నట్లు సీఐ ఆంజనేయులు ప్రకటించారు. -
రాప్తాడులో రౌడీ రాజ్యం
అవసరమైతేనే సిజేరియన్ చేయండికదిరి టౌన్: పట్టణంలోని మూర్తిపల్లి, నిజాంవలీ కాలనీలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖధికారి డాక్టర్ ఫైరోజ్ బేగం, డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగేంద్రనాయక్ శుక్రవారం తనిఖీ చేశారు. కదిరి ఏరియా ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంక్ , లేబర్ వార్డును తనీఖీ చేశారు. ఏరియా ఆస్పత్రిలో అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రి తనిఖీలో భాగంగా శిల్పా నర్సింగ్ హామ్ను తనిఖీ చేశారు. స్కానింగ్ సెంటర్ను విజిట్ చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. చేనేత వ్యాపారుల భూమి కబ్జాకు ‘తమ్ముళ్ల’ యత్నం● కంచె ధ్వంసం చేసి బెదిరించారన్న వ్యాపారులు ధర్మవరం అర్బన్: తమ భూమిని టీడీపీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చేనేత వ్యాపారులు వాపోయారు. పట్టణంలోని తారకరామాపురంలోనున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పక్కనున్న సదరు భూమిలో శుక్రవారం వారు సమావేశం నిర్వహించారు. వ్యాపారులు పోలా వెంకటనారాయణ, పోలా ప్రభాకర్ మాట్లాడుతూ 2005లో 3.15 ఎకరాలు కొనుగోలు చేసి మగ్గాలు పెట్టామన్నారు. 2014లో కోర్టు కమిషనర్ ద్వారా సర్వే చేయించి కంచె వేయించామన్నారు. ఈనెల 5న టీడీపీ నేత కొత్తపేట ఆది, అతని అనుచరులు పది మంది వచ్చి జేసీబీతో భూమి చుట్టూ ఉన్న కంచెను తొలగించి దౌర్జన్యం చేశారన్నారు. బీరుసీసాలతో వచ్చి పొడిస్తే మీకు దిక్కు ఎవరంటూ బెదిరించారని తెలిపారు. దీనిపై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్లామని, తమకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారన్నారు. భవిష్యత్తులో చేనేతల జోలికి ఎవరొచ్చినా తిరగబడతామని హెచ్చరించారు. పట్టుచీరల వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గిర్రాజు రవి, మహిళా నేత జయశ్రీ, తొగటవీరక్షత్రీయ సంఘం అధ్యక్షుడు రాము, చేనేత ప్రముఖులు గడ్డం శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతపురం ఎడ్యుకేషన్: మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాప్తాడు నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఎక్కడా నిర్భందాలు చేయలేదు. అనవసరంగా ప్రతిపక్ష పార్టీ వారిని పిలిపించి అక్రమ కేసులు బనాయించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి పరిటాల సునీత ఎమ్మెల్యే అయిన తర్వాత రౌడీ రాజ్యం నడుస్తోంద’ని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నగర శివారులోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు మండలం సిద్ధరాంపురంలో కురుబ బాలన్న అనే యువకుడిని టీడీపీ వారు కట్టెలతో దాడి చేస్తే పరామర్శించడానికి వెళ్తానంటే పోలీసులు అనుమతులు ఇవ్వలేదన్నారు. సిద్ధరాంపురం ఏమైనా పాకిస్తాన్లో ఉందా? అందుకు ప్రత్యేక వీసాలు కావాలా? అని ప్రశ్నించారు. రామగిరి మండలం పోలేపల్లిలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవానికి వెళ్తుంటే దాదులూరు వద్ద డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు వచ్చి అడ్డుకుని బందోబస్తు ఇవ్వలేమని పర్యటన వాయిదా వేసుకోవాలంటూ చెప్పారన్నారు. పోలీసులు ప్రజల కోసమా.. సునీత కోసమా? పోలీసులు ప్రజల కోసం పని చేస్తున్నారా? లేదంటే పరిటాల సునీత కోసం పని చేస్తున్నారా? అని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా లా అండ్ ఆర్డర్ కోసం పని చేస్తున్నారా? లేదంటే టీడీపీని బలపరిచేందుకు పని చేస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలేపల్లికి వస్తే పెద్దపెద్ద గొడవలు అవుతాయని రామగిరి ఎస్ఐ సుధాకర్యాదవ్ చెబుతున్నారని, ఆయన టీడీపీ ఏజెంటుగా పని చేస్తున్నారా? అని నిలదీశారు. ఊరిలో లేని సమస్యను సృష్టిస్తూ పోలీసు వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఆ గ్రామంలో టీడీపీ వాళ్లకు లేని ఉద్దేశాలను ఎస్ఐ కల్పిస్తూ ఎస్పీ, డీఎస్పీని తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. తమ పార్టీ నేతలు స్టేషన్కు వెళ్తే అగౌరవంగా మాట్లాడటడంతోపాటు కింద కూర్చోమని చెబుతారని ఎస్ఐ సుధాకర్యాద్పై మండిపడ్డారు. సీఐ, ఎస్ఐలు పద్ధతులు మార్చుకోవాలి.. అనంతపురం రూరల్ మండలంలోని తమ పార్టీ నేతలను పోలీస్స్టేషన్కు పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆరోపించారు. పుట్టపర్తిలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున వాహనాల్లో వెళ్లడంతో వారికి కళ్లు ఎర్రబడ్డాయన్నారు. జనాలను బాగా పిలుచుకెళ్లిన లీడర్లను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని టీడీపీ చుట్టంగా మార్చొద్దని పోలీసులకు హితవు పలికారు. తాను గుండీలు ఇప్పుతా రా కొట్లాడదామని రాప్తాడు సీఐ పిలుస్తారని, ఆయన సీఐనా రౌడీనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో లాఅండ్ ఆర్డర్ సమస్యంతా ఇటుకలపల్లి సీఐతోనే ఉత్పన్నమవుతోందన్నారు. తోపుదుర్తిలో 30 మంది ఇంట్లోకి దూరి మహిళపై దాడి చేస్తే..బాధితులపైనే కేసు కడతాడన్నారు. వారి ఆగడాలు చూస్తూ ఊరుకున్నారంటే తాము సంయమనం పాటించమని చెప్పడమే కారణమనేది గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇప్పటికై నా ఇటుకులపల్లి, రాప్తాడు సీఐలు, రామగిరి ఎస్ఐ పద్ధతులు మార్చుకోవాలని హితవుపలికారు. చట్టాన్ని టీడీపీ చుట్టంగా మార్చుతున్న పోలీసులు ఏకపక్షంగా వె ళ్తామంటే చూస్తూ ఊరుకోం రైతుల సమస్యలపై రాజీ పడను.. జైలుకు వెళ్లేందుకూ సిద్ధం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి చంద్రబాబు, సునీత చరిత్రహీనులుగా నిలిచిపోతారు.. లైనింగ్పనులు జరిగితే రాప్తాడు నియోజకవర్గంలో లక్షల ఎకరాలు బీళ్లుగా మారే ప్రమాదం ఉందని, దీనిపై రైతులను చైతన్యం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ప్రకాష్రెడ్డి అన్నారు. ఈ పనులు జరిగితే చంద్రబాబు, పరిటాల సునీత చరిత్ర హీనులుగా నిలిచిపోతారన్నారు. నియోజకవర్గ రైతుల సమస్యలపై రాజీ పడననని, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు. సిద్ధరాంపురం గ్రామానికి చెందిన బాధితుడు కురుబ బాలన్నను పరామర్శించడానికి వెళ్లనీయకపోవడంతో ఇక్కడికే బాధితుడిని పిలిపించి మీడియాకు చూపించారు. అనంతపురం రూరల్ జెడ్పీటీసీ చంద్రకుమార్, ఆత్మకూరు ఎంపీపీ హేమలత, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేత కురుబ నాగిరెడ్డి, ఆత్మకూరు మండల కన్వీనరు బాలపోతన్న, నాయకులు నీరుగంటి నారాయణరెడ్డి, రామగిరి కన్వీనర్ మీనుగ నాగరాజు పాల్గొన్నారు. -
తాగునీళ్లివ్వాలని మహిళల ధర్నా
గుడిబండ: జిల్లాలో తాగునీటి సమస్యలపై రోజుకో ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం మండల పరిధిలోని సీసీ గిరి గ్రామంలోని ఎస్సీ కాలనీలోనీ మహిళలు రోడ్డెక్కారు. పీసీ గిరి పంచాయతీ సీసీ గిరి గ్రామం దళితకాలనీలోనీ ప్రజలకు వారం రోజులుగా తాగునీరు రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఇందులో భాగంగానే గ్రామస్తులు ఖాళీ బిందెలతో కర్ణాటక రాష్ట్రం శిరాకు వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నీటి సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు విన్నమించినా స్పందన కరువైందని మహిళలు మండిపడ్డారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ డీఎల్ యంజారేగౌడు, ఈఓఆర్డీ నాగరాజునాయక్, పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ ఘటనా స్థలానికి చేరుకుని గ్రామ ప్రజలు, మహిళలతో మాట్లాడారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు నిరసన విరమించారు. -
మము కరుణించు సాయీ ..
ప్రశాంతి నిలయం: హోలీ పర్వదిన వేడుకల్లో భాగంగా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల భక్తులు నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సత్యసాయి భక్తులను అలరించాయి. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేసిన ఇరు రాష్ట్రాల భక్తులు గురువారం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. ‘భరత్ మిలాప్’ పేరుతో రామాయణంలో రాముడి వనవాస సమయంలో రాముడిపై భక్తిభావన, వాత్సల్యాన్ని ప్రదర్శిస్తూ వనవాసం వెళ్లకూడదు అని భరతుడు వేడుకున్న అంశం ఇతివృత్తంగా ప్రదర్శించిన నాటిక ఆహుతులను ఆకట్టుకుంది. అనంతరం సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. -
పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రశాంతి నిలయం: జిల్లా వ్యాప్తంగా ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహణపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల విద్యాశాఖ అధికారులతో పరీక్షలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లుపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 17 నుంచి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో జిరాక్స్, నెట్ సెంటర్లను మూసి వేయించాలన్నారు. జిల్లాలో 23,730 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. అందులో 22,295 మంది రెగ్యూలర్, 1435 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 104 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ విద్యార్థులు 780 మంది 11 సెంటర్లలో పరీక్షలకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఒక్కో విడతలో 1186 మంది చొప్పున రెండు విడతలకు 2,372 మంది ఇన్విజిలేటర్లును నియమిస్తున్నట్లు వివరించారు. 6 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని, వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయసారథి, డీఈఓ కృష్టప్ప తదితరులు పాల్గొన్నారు. మొల్ల మాంబ జీవితం ఆదర్శం తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్ల మాంబ జయంతిని గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాల్లో ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా కలెక్టర్ టీఎస్ చేతన్ మొల్ల మాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొల్ల మాంబ జీవితం ఆదర్శనీయమన్నారు. 16వ శతాబ్దానికి చెందిన కవయిత్రి మొల్ల మాంబ రామాయణాన్ని సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రిగా గుర్తించబడ్డారన్నారు. జాతికి మొల్ల మాంబ చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమె జయంతిని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
ఖాద్రీశుడి దర్శనం.. భక్త పారవశ్యం
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. గురువారం ఖాద్రీశుడు హనుమద్వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఉత్సవాలకు ఉభయదారులుగా జొన్నా వీరయ్య, జొన్నా వీర శేషయ్య కుటుంబ సభ్యులు వ్యవహరించినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖాద్రీ లక్ష్మీనారసింహుడు శుక్రవారం (నేడు) గరుడ వాహనంపై తిరువీధుల్లో తన భక్తులకు దర్శనమివ్వనున్నారు. నృసింహస్వామిని ఇలవేల్పుగా కొలిచే భక్తులంతా బ్రహ్మగరుడు సేవ రోజునే ‘కదిరి పున్నమి’ పేరుతో పండుగ జరుపుకుంటారు. హనుమద్వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు భక్తులతో కిటకిట లాడిన ఆలయం -
కోడింగ్లో పొరబాట్లకు తావివ్వొద్దు
● పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి జవాబు పత్రాల కోడింగ్లో ఏ చిన్న పొరబాటుకు తావివ్వొద్దని పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ సూచించారు. గురువారం అనంతపురంలోని సైన్స్ కేంద్రంలో రాయలసీమ జిల్లాల్లోని కోడింగ్, అసిస్టెంట్ కోడింగ్ ఆఫీసర్లతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ శామ్యూల్ మాట్లాడుతూ కోడింగ్ ప్రక్రియ అత్యంత కీలకమైందన్నారు. ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగకూడదన్నారు. చదివేవాడికి, చదవలేనివాడికి ఒకే విధంగా మార్కులు వచ్చే పొరబాట్లు చేయొద్దన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్లు కీలకం అన్నారు. రెగ్యులర్ పరీక్షలతో పాటు ఓపెన్ పరీక్షలకు కూడా ఇదే విధంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, కడప డీఈఓలు, 8 జిల్లాల నుంచి ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్లు, 130 మంది కోడింగ్, అసిస్టెంట్ కోడింగ్ అధికారులు హాజరయ్యారు. 476 మంది విద్యార్థుల గైర్హాజరు పుట్టపర్తి: జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్–1 పరీక్షలకు 476 మంది గైర్హాజరయ్యారు. ఆర్జేడీ రవీంద్ర ఇంటర్ జిల్లా విద్యాశాఖ అధికారి రఘునాథరెడ్డితో కలిసి హిందూపురంలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. 11,766 మంది జనరల్ విద్యార్థులకు గాను 11,388 మంది విద్యార్థులు హాజరైనట్లు రఘునాథరెడ్డి తెలిపారు. అలాగే ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1156 మంది విద్యార్థులకుగాను 1068 మంది హాజరైనట్లు చెప్పారు. జిల్లా స్పెషలాఫీసర్ చెన్నకేశవప్రసాద్, కమిటీ సభ్యులు సురేష్, రామరాజు, శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ వెంకటేశ్వరప్రసాద్ తదితరులు పరీక్షలను పర్యవేక్షించారు. ‘పది’ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పుట్టపర్తి టౌన్: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) మదుసూధన్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈనెల 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ జరగనున్న పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఒరిజినల్ హాల్ టికెట్ కండెక్టర్కు చూపిస్తే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారన్నారు. ఈ అవకాశం అన్ని పల్లె వెలుగుల (ఆర్డినరీ) బస్సుల్లో ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు. హోలీ పండుగ ప్రశాంతంగా జరుపుకోండి పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా ఇతరులకు ఇబ్బందులు కలగకుండా హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ రత్న ప్రజలకు సూచించారు. గురువారం ఆమె జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ నేపథ్యంలో జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు, ప్రదేశాలు, కాలనీల్లో రహదారుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు డ్రోన్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఇతర వ్యక్తులకు భంగం కలిగించేలా ప్రవర్తించకూడదన్నారు. ప్రధానంగా మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లు తొలగించి పెద్ద శబ్దాలు చేసుకుంటూ వెళ్లరాదని సూచించారు. వేడుకల్లో పర్యావరణ హితమైన రంగులను వాడాలని కోరారు. ఉపాధ్యాయుడి సస్పెన్షన్ కదిరి అర్బన్: మండల పరిధిలోని దిగువపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న ఓబులేసును గురువారం జిల్లా విద్యాశాఖాధికారి కృష్టప్ప సస్పెండ్ చేశారు. మనబడి – మన భవిష్యత్తుకు కేటాయించిన నిధులు దుర్వినియోగం చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేసినట్లు తెలిసింది. -
రైతుల గోడు పట్టదా?
మడకశిర: నియోజకవర్గంలోని మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాల్లో దాదాపు 42 వేల మంది రైతులకు చింత చెట్లు ఉన్నాయి. 2 లక్షల వరకు చింత చెట్లు విస్తరించాయి. ఏడాది కొకసారి వచ్చే చింత ఫలసాయం ద్వారా రైతులు ఆర్థికంగా ఊరట చెందేవారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. రూ.6 కోట్ల నుంచి రూ.2 కోట్లకు.. నియోజకవర్గంలో గరిష్టంగా రూ.6 కోట్ల విలువ చేసే చింతపండు ఉత్పత్తి జరగాల్సి ఉంది. అయితే ఈ ఉత్పత్తి విలువ ప్రతి ఏడాది క్రమేణా తగ్గిపోతోంది. గత ఏడాది కూడా చింతపండు ఉత్పత్తి విలువ మడకశిర నియోజకవర్గంలో రూ.3 కోట్లకు చేరుకోలేదు. ఈ ఏడాది కూడా చింతపండు ఉత్పత్తి భారీగా పడిపోయింది. చింతపండు దిగుబడి నామమాత్రంగానే ఉంది. రూ.2 కోట్లు కూడా ఉత్పత్తి విలువ దాటే పరిస్థితి లేకుండా పోయింది. ధర బాగున్నా... ఈఏడాది చింతపండు ధర ఆశాజనకంగానే ఉంది. ప్రారంభం నుంచి చింతపండు ధరలు నిలకడగానే ఉన్నాయి. ఈ ఏడాది మొదటి రకం (కరిపుళి) చింతపండు గరిష్ట ధర క్వింటాలు రూ.40 వేల వరకూ పలికింది. అలాగే కనిష్ట ధర రూ.8 వేల వరకూ పలికింది. రెండో రకం (ఫ్లవర్) చింతపండు ధర గరిష్టంగా రూ.14 వేల వరకూ పలికింది. కనిష్ట ధర రూ.5 వేలకు దాకా పలికింది. అయినా రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాలేదు. ధర ఆశాజనకంగా ఉన్నా కూడా చింతపండు దిగుబడి 50 శాతం తగ్గడంతో రైతులకు నిరాశే మిగిలింది. పెరిగిన ఉత్పత్తి వ్యయం.. చింతపండు ఉత్పత్తి వ్యయం కూడా పెరగడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. కూలీల ఖర్చులు భారీగా పెరిగాయి. చింతకాయలను చెట్టు నుంచి కోయడానికి గతంలో ఒక మగ కూలీకి రోజుకు రూ.300 కూలీ ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ కూలీ రూ.800కు పెరిగింది. అదే విధంగా చెట్టు నుంచి కోసిన చింత కాయలు నేలపై పడతాయి. ఆ కాయలను ఏరడానికి గతంలో ఒక ఆడ కూలీకి రోజుకు రూ.100 చెల్లించే వారు. ప్రస్తుతం అది రూ.400 అయింది. చింతకాయల నుంచి చింతపండును శుద్ధి చేయడానికి రోజుకు ఓ ఆడ కూలీకి గతంలో రూ.150 చెల్లించే వారు ప్రస్తుతం రూ.400 పెరిగింది. గతానికి భిన్నంగా కూలీలకు భోజన సౌకర్యం కూడా కల్పించాల్సి వస్తోంది. కూలీల ఖర్చు పెరగడం కూడా చింతపండు రైతులకు భారంగా మారింది. మార్కెట్ సౌకర్యం కరువు.. జిల్లాలో మడకశిర నియోజకవర్గంలోనే 90 శాతం చింతపండును రైతులు పండిస్తున్నారు. మడకశిరకు ఆనుకుని ఉన్న సరిహద్దులోని కర్ణాటకకు చెందిన పావగడ, శిర, హిరియూర్, మధుగిరి, చళ్లకెర నియోజకవర్గాల్లో కూడా చింతపండు ఉత్పత్తి ఎక్కువగా ఉంది. అయినా మడకశిరలో చింతపండు మార్కెట్ లేదు. మడకశిర ప్రాంతం రైతులు చింతపండును హిందూపురం, శిర మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సి వస్తోంది. మడకశిరలో చింతపండు మార్కెట్ ఏర్పాటు చేయకపోవడం కూడా రైతులకు ఇబ్బందికరంగా మారింది. చింతపండు ఉత్పత్తిపై రైతులకు ఆసక్తి తగ్గేందుకు ఇది కూడా ఓ కారణంగా మారింది. చింతచెట్లను తొలగిస్తున్న రైతులు.. నియోజకవర్గంలో కొందరు రైతులు చింతచెట్లను ఇప్పటికే తొలగించారు. ఆశించిన స్థాయిలో రైతులకు ఆదాయం రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. చింతకట్టెలను ఇటుక బట్టీల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో చింత కట్టెలకు అధిక డిమాండ్ ఉంది. చింతచెట్లను తొలగించడానికి ఆదాయం తగ్గడం ఒక కారణమైతే....చింతచెట్లు ఉన్న భూమి వ్యవసాయం చేసుకోవడానికి పనికి రాదు. దీంతో చాలా మంది రైతులు వ్యవసాయ యోగ్యమైన భూమిలో ఉన్న చింతచెట్లను తొలగించి వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అమరాపురం, గుడిబండ, మడకశిర తదితర మండలాల్లో చింతచెట్లను తొలగించారు. ఇటుక బట్టీల నిర్వాహకులు చింతచెట్లను గ్రామాలకే వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. చింతపండు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మడకశిరలోనే మార్కెట్ సౌకర్యం కల్పించాలి. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా స్థానికంగానే మార్కెట్ సౌకర్యం కల్పించడానికి చొరవ తీసుకోవాలి. చింతపండు రైతులు నష్టపోతే నష్టరరిహారం చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. – హనుమంతరాయప్ప, అగళి -
స్వచ్ఛ మార్గంలో పయనిద్దాం
● కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రశాంతి నిలయం: రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర –స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ప్రభుత్వ అశయాల మేరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతా మార్గంలో పయనిద్దామని కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపునిచ్చారు. మూడో శనివారం నిర్వహించాల్సిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో గురువారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా క్రమం తప్పకుండా స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆస్పత్రులు, పారిశ్రామిక యూనిట్లు, పాఠశాలలు, కాలేజీలు, బస్టాండ్లు, మార్కెట్ యార్డులు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛతా పరిమళాలు వెల్లివిరియాలన్నారు. అయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర యాప్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలన్నారు. డీపీఓ సమత, డీఆర్డీఏ పీడీ నరసయ్య, గ్రామ వార్డు సచివాలయ నోడల్ అధికారి సుధాకర్రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వాములు కావాలి స్వర్ణాంధ్ర సాధనలో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వాములు కావాలని కలెక్టర్ టీఎస్ చేతన్ కోరారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సీఎస్ఆర్ నిధుల వినియోగంపై వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సీఎస్ఆర్ నిధుల వినియోగంపై ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సీపీఓ విజయ్కుమార్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, డీపీఓ సమత, పలు కంపెనీలు ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆదిశక్తికి ప్రతిరూపమే మహిళ
● ఎస్పీ రత్న హిందూపురం: ఆదిశక్తికి ప్రతిరూపమే మహిళ అని ఎస్పీ రత్న పేర్కొన్నారు. హిందూపురం డీఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో తూమకుంట సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఎస్పీతోపాటు హిందూపురం జిల్లా అదనపు జూనియర్ సివిల్ జడ్జి లలితలక్ష్మి, మెప్మా పీడీ విజయలక్ష్మి, సీడీపీఓ శాంతి హాజరయ్యారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం త్వరలో శక్తి టీఎం ఏర్పాటు చేయబోతోందన్నారు. శక్తి యాప్ కూడా ఏర్పాటు చేశామని ఆన్లైన్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏ ఆపద వచ్చినా సెల్ఫోన్ మూడుసార్లు ఊపినా లేదా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా వెంటనే రెస్క్యూ టీం ఘటనస్థలికి చేరుకుని రక్షిస్తుందన్నారు. హిందూపురం అదనపు జూనియర్ సివిల్ జడ్జి లలితలక్ష్మి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఆడపిల్లలను దేన్నయినా ధైర్యంగా ఎదుర్కొనేలా పెంచాలన్నారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలున్నాయని, వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. డాక్టర్లు జీవన, షమ్మిలా, సీఐలు జనార్దన్, ఆంజనేయులు, కరీం, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
పట్టణ ప్రాంతాలు, పల్లెలు అన్న తేడా లేని యువత సెల్ఫోన్ల ద్వారా బెట్టింగులకు పాల్పడటం ఎక్కువైంది. ప్రధానంగా కళాశాలలకు వెళ్లే వారిలో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను నిశితంగా గమనిస్తూ ఉండాలి. – బాలాజీ, హిందూపురం ఆన్లైన్ గేమ్లకు దూరంగా ఉండాలి ఆన్లైన్ గేమ్ల బారిన పడి ఎంతోమంది యువత తమ విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. సరదాలకు పోయి తర్వాత వ్యసనంగా మారుతోంది. యువత చేజేతులారా తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారంలో నెట్టుకుంటున్నారు. – కెవి. మహేష్, డీఎస్పీ, హిందూపురం -
కదిరి కొండపై శ్రీవారి పాద చిహ్నాలు
కదిరి: స్వామి వారి పాదాలు తాకితే ఈ జన్మకు ఇక చాలని ఏ భక్తుడైనా కోరుకుంటాడు. ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలు తాకాలంటే కదిరి కొండకు వెళ్లాల్సిందే. శ్రీవారి పాద చిహ్నాలను తాకిన వారు పాప విముక్తులవుతారని భక్తుల నమ్మకం. అందుకే వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తాదులు కదిరి కొండపై ఉన్న నృసింహుని పాద ముద్రికలను దర్శించుకుంటున్నారు. నిర్మలమైన మనస్సుతో స్వామివారి పాదాలను తాకి, మనసులో ఆరాధిస్తే ఈతి బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. చెరిగిపోని పాదముద్రలు.. హిరణ్య కశ్యపుడిని సంహరించేందుకు శ్రీ మహా విష్ణువు సగం మనిషి, సగం సింహం రూపంలో అంటే నరసింహావతారమెత్తారు. ఉగ్రరూపంతో స్తంభం నుంచి ఆవిర్భవించారు. హిరణ్య కశ్యపుడి సంహారం అనంతరం ఉగ్రరూపంలో ఉన్న నారసింహుని ఆ రూపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రహ్లాదుడు, దేవ దేవతలతో పాటు శ్రీదేవి, భూదేవిలు కదిరి కొండపై నుంచి ప్రార్థించారు. నృసింహుని మెప్పించేందుకు అక్కడి నుంచి వారంతా స్తోత్రం చేయడంతో స్వామి వారు అక్కడ దర్శనమిచ్చారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అందుకే ఆ పర్వతానికి ‘స్తోత్రాద్రి’ అనే పేరు వచ్చిందని అందులో పేర్కొన్నారు. ఆ సమయంలో స్వామి వారు అక్కడ మోపిన పాదాల గుర్తులు ఇప్పటికీ చెరిగిపోలేదు. భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో చిన్నారులకు తీవ్రగాయాలు
మడకశిర: పట్టణ సమీపాన వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాల పాలయ్యారు. రొళ్ల మండలం కొడగార్లగుట్ట గ్రామానికి చెందిన సన్నలింగప్ప తన కుమార్తె ప్రార్థన, కుమారుడు గోకుల్కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బైక్పై మడకశిరకు బయలుదేరాడు. ఈ క్రమంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల సమీపాన జాతీయ రహదారి పక్కన చెరుకు రసం తాగడానికి బైక్ను రోడ్డు పక్కన ఆపి ఇద్దరినీ అందులోనే కూర్చోబెట్టి చెరుకు రసం తేవడానికి వెళ్లాడు. ఈ సందర్భంలో మధుగిరి నుంచి పావగడ వైపు వెళుతున్న కేఎస్ ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి బైక్ను ఢీకొంది. ఘటనలో ప్రార్థన కుడి కాలు పూర్తిగా దెబ్బతింది. గోకుల్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని 108లో మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం హిందూపురం తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో మహిళ మృతి గోరంట్ల: మండలంలోని కరావులపల్లి తండాలో విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన తిప్పిబాయి (49) గురువారం ఉదయం ఇంటి వద్ద తాగునీటి సంపునకు అమర్చిన విద్యుత్ మోటార్ను ఆన్ చేసేందుకు యత్నించింది. విద్యుత్ షార్ట్సర్కూట్తో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త శ్రీరాములు ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
రూ.46 లక్షల విత్తనాలకు స్టాప్సేల్స్
అనంతపురం అగ్రికల్చర్: నాసిరకం కలింగర విత్తనాల వల్ల నష్టం వాటిల్లిందని బుధవారం స్థానిక శ్రావణి సీడ్స్ దుకాణం ఎదుట పురుగుల మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి రైతు మురళీ ఆరోగ్యం నిలకడగా ఉంది. గురువారం వ్యవసాయశాఖ ఏడీ ఎం.రవి, ఏవో జే.శశికళ స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లి రైతును పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తనం, పంట పెట్టుబడికి రూ.6.90 లక్షల వరకు ఖర్చు చేసినట్లు రైతు తెలిపారన్నారు. అందుకు సంబంధించి బిల్లులు సేకరించామన్నారు. బీఏఎస్ఎఫ్ కంపెనీకి చెందిన కళింగర విత్తనాలకు సంబంధించి వివిధ దుకాణాల్లో సోదాలు నిర్వహించి రూ.20 లక్షల విలువ చేసే విత్తనాలకు అమ్మకాల నిలిపివేత (స్టాప్సేల్స్) ఉత్తర్వులు ఇచ్చామన్నారు. అలాగే సాంయత్రం శ్రావణి సీడ్స్ దుకాణంను తెరపించి తనిఖీ చేశామన్నారు. స్టాకు, సేల్స్ మధ్య వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. బీఏఎస్ఎఫ్తో పాటు మరికొన్ని కంపెనీలకు చెందిన రూ.26 లక్షలు విలువ చేసే కళింగర, కర్భూజా విత్తనాలకు స్టాప్ సేల్స్ ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. మొత్తంగా రూ.46 లక్షల విలువ చేసే విత్తనాల అమ్మకాలు నిలిపివేశామన్నారు. కమిషనరేట్, జేడీఏ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ, నాసిరకకం, నిషేధిత విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అమ్మకాలపై నిఘా మరింత పెంచుతామని తెలిపారు. కళింగర పంట పరిశీలన బత్తలపల్లి: నకిలీ విత్తనాలతో మోసపోయి ఆత్మహత్యకు యత్నించిన గుజ్జల మురళి సాగు చేసిన కళింగర పంటను హార్టిక్చలర్ అధికారిణి అమరేశ్వరి, ఏఓ ఓబిరెడ్డి గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులు డి.చెర్లోపల్లిలో పంట సాగు, పెట్టుబడి వివరాలను సర్పంచు గుజ్జల రమాదేవి, ఇతర రైతులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మురళి 3.74 ఎకరాల్లో కళింగర పంట ‘మాక్స్’ రకంను నవంబర్ 27న నాటారన్నారు. పంట కాల పరిమితి 70–75 రోజులు దాటినా కాయ లోపల తెలుపు రంగులో ఉండడంతో వ్యాపారస్తులు ఎవ్వరూ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. నకిలీ విత్తనాలు అంటగట్టడం వల్లనే ఇలా జరిగిందని, తద్వారా పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని వారు పేర్కొన్నారు. వ్యవసాయశాఖ ఏడీ ఎం.రవి, ఏఓ జే.శశికళ ఆత్మహత్యకు యత్నించిన రైతుకు పరామర్శ -
రైలు కిందపడి లారీ క్లీనర్ ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: అనారోగ్యంతో రైలు కిందపడి లారీ క్లీనర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో జరిగింది. హిందూపురం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపిన వివరాలు.. పట్టణంలోని కేతిరెడ్డికాలనీలో నివసిస్తున్న అబ్దుల్ ఖాదర్వలి కుమారుడు షెక్షావలి(24) లారీ క్లీనర్గా పనిచేసేవాడు. నాలుగేళ్లుగా అల్సర్తోపాటు గడ్డలు ఉండటంతో తీవ్రనొప్పితో బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. నొప్పి ఎక్కువగా ఉండటంతో వారం రోజులుగా తాను రైలు కింద పడి చనిపోతానంటూ తల్లిదండ్రులతో చెబుతున్నాడు. ఈక్రమంలో గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నాందేడ్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ సమాచారం మేరకు హిందూపురం జీఆర్పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ ఎర్రిస్వామి తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య పరిగి: శాసనకోటలో కేశవయ్య(30) అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపిన వివరాలు.. సోమందేపల్లి మండలం నడింపల్లికి చెందిన కేశవయ్యకు శాసనకోట గ్రామానికి చెందిన స్నుతితో 2021లో వివాహమైంది. వీరికి విక్రాంత్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. వృత్తి రీత్యా కేశవయ్య బెంగళూరులో ఉంటున్నాడు. అయితే భార్య స్నుతి, ఆమె తల్లి పాపులమ్మ, బావమరిది సురేష్ తరచూ కేశవయ్యతో గొడవ పడేవారు. శాసనకోటలో కాపురముండాలని, సంపాదించినదంతా తమకే ఇవ్వాలని వేధించేవారు. ఈక్రమంలో గత బుధవారం అతడు శాసనకోటకు వచ్చాడు. కుటుంబ సభ్యులంతా లేపాక్షి మండలంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడు ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు స్నుతి, పాపులమ్మ, సురేష్పై కేసు నమోదు చేసనట్లు ఎస్ఐ పేర్కొన్నారు. బేల్దారి బలవన్మరణం పెనుకొండ: పెనుకొండ నగర పంచాయతీలోని తిమ్మాపురంలో బేల్దారి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు అందించిన సమాచారం.. గ్రామానికి చెందిన నంజుండ (33) బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే తన భార్య సీపీఎం నేత రమేష్తో సన్నిహితంగా ఉంటోందని మనోవేదనకు గురయ్యాడు. ఈక్రమంలో బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు ముత్యాలు ఫిర్యాదు మేరకు నాగమణితోపాటు రమేష్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నాడు. పట్టపగలే ఇంట్లో చోరీ తాడిపత్రి: సజ్జలదిన్నె గ్రామంలో చాంద్బాషా అనే వ్యక్తి ఇంటిలో గురువారం పట్టపగలే చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చాంద్బాషా, బీబీ దంపతులు సజ్జలదిన్నె పారిశ్రామిక వాడలోని ఓ బండల పాలిష్ పరిశ్రమలో కూలీలుగా పని చేస్తున్నారు. ఉదయం వారు పనులకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 2 తులాల బంగారు ఆభరణాలు, జత వెండి గొలుసులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వినూత్నంగా వివాహ వేడుక ● అతిథులకు మొక్కల పంపిణీ పావగడ: తాలూకాలోని భీమనకుంటె గ్రామం సముదాయ భవనంలో తాండ్ర కల్పన, వి గోకుల్ వివాహ వేడుక వినూత్నంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన వధూవరులు వివాహానికి వచ్చిన సుమారు 500 మంది అతిథులకు జామ, దానిమ్మ, నేరేడు, శ్రీగంధం తదితర మొక్కలను అందించి ప్రతి ఒక్కరూ చెట్ల పెంపకంతో పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ వేడుకల్లో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయ మూర్తి హెచ్ఎల్ దత్తు, భార్య గాయత్రి, విశ్రాంత విశేష జిల్లా కలెక్టర్ దొడ్డహళ్లి రామాంజనేయులు, భార్య శారద తదితర ప్రముఖులు మొక్కలను పంపిణీ చేసిన నూతన వధూవరులను ఆశీర్వదించారు. మొక్కలపై వారికి ఉన్న ఎనలేని మక్కువను ప్రశంసించారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం
బత్తలపల్లి: ప్రకృతి వ్యవసాయాన్ని పోత్సహిద్దామని సెర్ప్ ఏసీ సత్యనారాయణ, ఏపీఎం సుదర్శన్రాజు పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రమైన బత్తలపల్లిలోనూ, రాఘవంపల్లిలోనూ ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామన్నారు. అంతకు ముందు బత్తలపల్లిలో కాశప్ప పొలంలో ఏటీఎం మోడల్ ప్రకృతి వ్యవసాయం గురించి రైతులతో వేయించారు. ఈ విధానంలో రోజూ ఆదాయం పొందుతున్న పార్వతి, గంగమ్మ, నారాయణమ్మ ద్వారా తెలుసుకున్నారు. రాఘవంపల్లిలో శివప్రసాద్ చీనీ పీఎండీఎస్లో ఆరు రకాల ప్రధాన పంటలు ఆముదం, కంది, సజ్జ, అనుములు, అలసంద, గోరుచిక్కుడు, 23 రకాల జీవ వైవిధ్య పంటల విత్తనాలు, బీజామృతంతో విత్తనశుద్ధి చేసి, ఘన జీవామృతం పైడర్తో పాటు కలిపి విత్తినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్పీఓ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, మండల సమాఖ్య లీడర్లు, సంఘాల సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ
ప్రశాంతి నిలయం: అభాగ్యులకు సేవలు అందించడమే సత్యసాయి సేవా సంస్దల లక్ష్యమని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు అన్నారు. బుధవారం ప్రశాంతి నిలయంలోని నార్త్ బిల్డింగ్స్ వద్ద సత్యసాయి దివ్యాంగ్జన్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ప్రత్యేక అవసరాలున్న 113 మందికి కృత్రిమ అవయవాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ రాజు మాట్లాడుతూ.. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో సత్యసాయి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి దివ్యాంగ్జన్ ప్రాజెక్ట్ను చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్వశక్తితో జీవిస్తున్న దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. -
ఈ రస్తాలో తిరిగితే అంతు చూస్తా..
సాక్షి టాస్క్ఫోర్స్: ‘ఇది నా దారి. ఈ దారి గుండా ఎవరు వెళ్లినా వారి అంతు చూస్తా’ అంటూ కొంత కాలంగా గ్రామస్తులను ఓ కూటమి నేత బెంబేలెత్తిస్తున్నాడు. రహదారికి ఏకంగా మొద్దులు అడ్డుగా వేసి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. వివరాలు... ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామంలో శింగంశెట్టి వంశస్తులకు చెందిన 50 కుటుంబాల వారు ఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాలనీకి సమీపంలో ఓ ఆలయాన్ని నిర్మించాలని అప్పట్లో గ్రామ పెద్దలు తీర్మానించారు. అయితే స్థల వివాదం తలెత్తడంతో ఆలయ నిర్మాణాన్ని కొందరు వ్యతిరేకించారు. ఈ సమస్య ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. మరికొన్ని రోజుల్లో తీర్పు వెలువడే అవకాశం ఉండడంతో గ్రామానికి చెందిన కూటమి నాయకులు వర్గ కక్షలకు ఆజ్యం పోశారు. ఏళ్ల తరబడి ఆ కాలనీ నుంచి ప్రధాన రహదారికి ఉన్న రస్తా వెంట కాలనీ వాసులు తిరుగుతుండేవారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత గ్రామానికి చెందిన కూటమి నేత ఆధిపత్యం కోసం రస్తా విషయాన్ని తెరపైకి తెచ్చాడు. ఈ రస్తా స్థలం తనకు సంబంధించిందని, తన పట్టా భూమిలో ఉందని, ఆ రస్తా వెంట ఎవరూ వెళ్లకూడదంటూ వారం రోజులుగా గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ఉన్నఫలంగా బుధవారం రస్తాకు మొద్దులు అడ్డుగా పెట్టి అక్కడే కుర్చీలు వేసుకుని తన వర్గీయులతో కలసి కూర్చొన్నాడు. తన మాట బేఖాతరు చేసి రస్తాలో అడుగుపెడితే అంతు చూస్తానంటూ రెచ్చిపోయాడు. దీంతో కాలనీ వాసులు విషయాన్ని రెవెన్యూ, పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో సాయంత్రం అధికారులు వచ్చి రస్తాకు అడ్డుగా వేసిన మొద్దులను తొలగించారు. గ్రామస్తులను బెదిరించిన కూటమి నేత రహదారికి మొద్దులు అడ్డుగా వేసిన వైనం -
‘దుర్గం’లో దోపిడీ దొంగల బీభత్సం
కళ్యాణదుర్గం: పట్టణంలో మంగళవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. కత్తులు చేత పట్టుకుని హల్చల్ చేశారు. ఏకంగా రెండిళ్లలో చోరీలకు పాల్పడి, మరో ఇంట్లోకి చొరబడేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.... కళ్యాణదుర్గంలోని పార్వతీ నగర్ మొదటి కాలనీలో నివాసముంటున్న దీప, అనిల్ దంపతులు మంగళవారం రాత్రి భోజనం ముగించుకుని ఇంటికి తాళం వేసి పైకెళ్లి నిద్రించారు. విషయాన్ని గుర్తించిన దుండగులు లోపలకు చొరబడి బీరువాను ధ్వంసం చేసి, నాలుగు తులాల బంగారు నగలు, రూ.1.60 లక్షల నగదు అపహరించారు. అనంతరం పక్కనే ఉన్న శిల్ప అనే మహిళ ఇంట్లో చొరబడి బ్రాస్లైట్ను అపహరించారు. అక్కడి నుంచి ముదిగల్లు బైపాస్ సమీపానికి చేరుకుని శ్రీకాంత్ అనే వ్యక్తికి చెందిన నాలుగు గొర్రెలను ఎత్తుకెళ్లారు. ముసుగులు ధరించి.. కత్తులు చేతపట్టి పార్వతీనగర్ శివారు ప్రాంతంలోని అక్కమాంబ కొండ సమీపంలో నివాసముంటున్న మీ–సేవ కేంద్రం నిర్వాహకుడు బాబు ఇంటి వద్ద మంగళవారం అర్థరాత్రి 2.10 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, కత్తులు చేతపట్టుకుని హల్చల్ చేశారు. రెండు, మూడు నిమిషాల పాటు అటుఇటు కలియతిరిగి, ఒకరు కాంపౌండ్ వాల్ ఎక్కి లోపలికి చొరబడే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కుక్కలు మొరగడంతో అప్రమత్తమైన దుండగులు కాంపౌండ్లో నుంచి బయటపడి పారిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీకెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. ఘటన స్థలాలను పరిశీలించిన డీఎస్పీ రవిబాబు పార్వతీనగర్లో వరుస దోపిడీల సమాచారం అందుకున్న డీఎస్పీ రవిబాబు, అర్బన్ సీఐ యువరాజు, సిబ్బంది బుధవారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీంను రంగంలో దింపి నిందితుల ఆధారాలు సేకరించారు. కాగా, దుండగులు కత్తులు పట్టుకుని సంచరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వచ్చిన వారు దొంగలా లేక పార్థీ గ్యాంగ్ ముఠా సభ్యులనే అనుమానాలు స్థానికుల నుంచి వ్యక్తమయ్యాయి. రెండిళ్లలో వరుస చోరీలు ముదిగల్లు బైపాస్లో నాలుగు గొర్రెల అపహరణ అర్ధరాత్రి కత్తులతో హల్చల్ చేసిన దుండగులు -
76 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
ధర్మవరం రూరల్: మండలంలోని సీతారాంపల్లి వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా బెంగళూరు వైపు తరలిస్తున్న 76 బస్తాల (ఒక్కొక్కటి 50 కిలోలు) రేషన్ బియ్యాన్ని బుధవారం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్ఐ శ్రీనివాసులు వెల్లడించారు. పోలీసులను చూడగానే వాహనాన్ని ఆపి ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వెంబండించి అదుపులోకి తీసుకునానమన్నారు. పట్టుబడిన వారిని సోమందేపల్లికి చెందిన షేక్ బాబా, వడ్డె అజయ్గా గుర్తించామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించామన్నారు. -
ఈ–క్రాప్ నమోదు పరిశీలన
పుట్టపర్తి: బుక్కపట్నం మండలం సిద్దరాంపురం సమీపంలో రైతులు సాగు చేసిన వేరుశనగ పంటకు సంబంధించి ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను కలెక్టర్ టీఎస్ చేతన్ బుధవారం పరిశీలించారు. వేరుశనగ దిగుబడిపై రైతు కేశవతో ఆరా తీశారు. నిర్ణీత గడువులోపు ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావుకు సూచించారు. అనంతరం సమీపంలోని మునగ పంటను పరిశీలించారు. చింత పండు ధర తగ్గుముఖం హిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో బుధవారం 1573.50 క్వింటాళ్ల చింత పండు విక్రయానికి రాగా... మీడియం ప్లవర్ రకం క్వింటా గరిష్టం రూ. 13వేలు, కనిష్టం రూ.4,300 చొప్పున సగటున రూ.6వేలతో అమ్ముడుపోయింది. అలాగే కరిపులి (ఫైన్) క్వింటా గరిష్టం రూ.33వేలు, కనిష్టం రూ.8వేలు, సగటు రూ.15వేలు చొప్పున ధర పలికింది. గత సోమవారం క్వింటా కరిపులి గరిష్ట ధర రూ.40వేలు కాగా, బుధవారం రూ.33వేలకు చేరుకోవడం గమనార్హం. క్రయవిక్రయాలను మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి పర్యవేక్షించారు. ‘పీఎంఏవై’లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అదనపు లబ్ధి ప్రశాంతి నిలయం: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కింద బీసీ, ఎస్సీ, ఎస్టీల గృహ నిర్మాణాలకు అదనపు ఆర్థిక లబ్ధిని ప్రభుత్వం చేకూరుస్తోందని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీఎంఏవై 1.0 కింద జిల్లాకు 71,969 ఇళ్లు మంజూరు కాగా, ఇందులో 25,203 గృహాలు పూర్తయ్యాయని, మిగిలిన 40,024 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఇంటి నిర్మాణానికి యూనిట్ ధర రూ.1.80 లక్షలుగా నిర్దేశించినట్లు తెలిపారు. దీనికి అదనంగా బీసీ, ఎస్సీలకు రూ.50వేలు, ఎస్టీలకు రూ.70 వేలు ఆర్థిక లబ్ధి ఉంటుందన్నారు. ఇందులో నిబంధనలు వర్తిస్తాయన్నారు. తద్వారా జిల్లాలో 9.009 మంది బీసీలు, 1,548 మంది ఎస్సీలు, 548 మంది ఎస్టీలకు అదనపు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ నెల 15 నుంచి 23వ తేదీవరకు లబ్ధిదారుల ఇళ్లకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వెళ్లి అదనపు లబ్ధి గురించి వివరించి, వారి ఇంటిని ఫొటో తీసుకుంటారన్నారు. -
ప్రజలు తిరగబడే రోజులొచ్చాయి
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం అంటూ ఆశపెట్టిన చంద్రబాబు... ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. కానీ ఇప్పటికే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి నారా లోకేశ్ అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదం. పథకాలు అమలు చేయకుండా.. అబద్ధాలు చెబుతూ పబ్బం గడిపితే ప్రజలే తిరగబడతారు. బెల్టు షాపుల ద్వారా దొడ్డిదారిన ఉపాధి పొందేందుకు టీడీపీ కార్యకర్తలను ప్రోత్సహిస్తుండటం బాధాకరం. – తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే -
అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు
కూటమి ప్రభుత్వ నిర్వాకంతో ఫీజులు కట్టలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి సాయం అందక ఎంతోమంది రైతులు కాడెద్దులను.. భార్య తాళిబొట్టును.. అమ్ముకోవాల్సిన దయనీయ స్థితి నెలకొంది. చంద్రబాబు పాలన తీరు చూస్తుంటే.. రాష్ట్ర ప్రజలు పందెం గుర్రాన్ని అమ్ముకుని... ముసలి గాడిదను తెచ్చుకున్నట్లుగా ఉంది. విద్య, వైద్య రంగాలు బాగుండాలంటే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. – గోరంట్ల మాధవ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి -
డెంగీ లక్షణాలతో వ్యక్తి మృతి
చెన్నేకొత్తపల్లి: మండలంలోని న్యామద్దెల గ్రామానికి చెందిన సురేంద్ర (34) డెంగీ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. గత 15 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సురేంద్ర చెన్నేకొత్తపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే జ్వరం తగ్గక పోవడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమిస్తుండడంతో వైద్యుల సూచన మేరకు కర్నూలులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక మంగళవారం రాత్రి ఆయన మృతి చెందాడు. కాగా, డెంగీ లక్షణాలతో మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాలలపై లైంగిక వేధింపులు నివారించాలి ● డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజబేగం పుట్టపర్తి అర్బన్: జిల్లాలో బాలలపై లైంగిక వేధింపులను పూర్తిగా నివారించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం, రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ నివేదిత అన్నారు. బాలల లైంగిక వేధింపుల నివారణ అంశంపై బుధవారం స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో వారు మాట్లాడారు. లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ అత్యవసర సహాయ టోల్ ఫ్రీ నెంబర్లను గుర్తుంచుకోవాలన్నారు. వేధింపులు జరిగినప్పుడు వెంటనే 1098, 181, 100కి కాల్ చేసి సాయం పొందేలా చిన్నారుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే చెప్పుకునే సేచ్ఛను ఇవ్వాలన్నారు. అనంతరం డీఈఐసీ చైల్డ్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ సిరిగిరి సుందరరావు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్, విద్యాశాఖ, జువైనల్ శాఖ, ఒకేషనల్ విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. టీడీపీ నేతల దాష్టీకం ● వైఎస్సార్సీపీ కార్యకర్తపై కర్రలతో దాడి ఆత్మకూరు: వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన కురుబ చిక్కాల బాలన్నపై టీడీపీ నేతలు అతి కిరాతకంగా కర్రలతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన బుధవారం రాత్రి ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన మేరకు... బుధవారం సాయంత్రం తన పొలంలో పనులు చూసుకుని ఇంటికి వెళుతున్న బాలన్నపై కాపు కాచిన టీడీపీ నేతలు కర్రలతో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కురుబలపై దాడి చేయడం ద్వారా వారిలో అభద్రతా భావాన్ని పెంచేందుకు పన్నిన కుట్రలో భాగంగానే ఈ కుట్రకు తెరలేపినట్లుగా పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దాడి అనంతరం కురుబ చిక్కాల బాలన్న ఆత్మకూరుకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన నారాయణస్వామి, రమేష్, భరత్పై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఏపీఆర్ఎస్ ప్రవేశ పోస్టర్ల విడుదల పరిగి: ఆంధ్రప్రదేశ్ గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలతో పాటు మిగిలిన తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ పోస్టర్లను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి క్రిష్టప్ప విడుదల చేశారు.బుధవారం ఆయన పరిగి మండలంలోని కొడిగెనహళ్లి ఏపీఆర్ జేసీ కాలేజ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రిష్టప్ప మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్ర గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో 5వ తరగతిలో చేరే విద్యార్థులకు ఈనెల 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశముందన్నారు. అదేవిదంగా 6, 7, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లను నోటిపికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. -
ప్రజాహితమే వైఎస్సార్సీపీ ధ్యేయం
పుట్టపర్తి/పెనుకొండ రూరల్: ప్రజా సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఆయా నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ● పెనుకొండలో జరిగిన కార్యక్రమంలో ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. గత 15 సంవత్సరాలుగా జగన్కు అండగా ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు బోయ నరసింహులు, సుధాకరరెడ్డి, నగర పంచాయతీ వైస్ చైర్మెన్ సునీల్, వైశాలి జయశంకర్రెడ్డి, మాజీ కన్వీనర్ నాగలూరు బాబు, కౌన్సిలర్లు శేషాద్రి, యాసిన్, సద్దాం తదితరులు పాల్గొన్నారు. ● పుట్టపర్తిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణుల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగా ఓబులపతి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● ధర్మవరంలోమాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం పెద్ద ఎత్తున జరిగింది. పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆవిష్కరించారు. ● మడకశిరలో పార్టీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావం దినోత్సం ఘనంగా జరిగింది. అంతకు ముందు ఆయన వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గోవర్దన్రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ● కదిరిలో పార్టీ సమన్వయర్త మగ్బుల్ అహమ్మద్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కార్యాలయ ఆవరణలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా, వజ్ర భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ● హిందూపురంలో పార్టీ సమన్వయకర్త దీపిక ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత వేణురెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జనార్ధన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బలరామిరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
ఖాద్రీ ఉత్సవాలకు 30 ప్రత్యేక బస్సులు
పుట్టపర్తి టౌన్: కదిరిలో ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలకు సాధారణ చార్జీలతోనే 30 ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం మధుసూదన్ తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో జిల్లాలోని అన్ని డిపోల మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజ్ పర్సన్లు, అకౌంట్స్ విభాగం సూపర్వైజర్లతో సమావేశమై మాట్లాడారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్ స్టేషన్లలో తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే కదిరి బ్రహ్మోత్సవాలకు పొరుగు జిల్లాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ సాధారణ చార్జీలతో అన్ని డిపోల నుంచి 30 ప్రత్యేక బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల రద్దీని అంచనా వేసి సర్వీసులు తిప్పాలన్నారు. -
వైద్య రంగాన్ని కాపాడుకుందాం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి వైద్య రంగానికి పెద్దపీట వేశారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పాటు ఆరోగ్యశ్రీ జాబితాలో వేల సంఖ్యలో జబ్బులను చేర్చి.. పేదలకు ఉచితంగా వైద్యం అందించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి.. వ్యాపారం చేయాలని భావిస్తోంది. ప్రజలందరూ మేల్కొనాలి. వైఎస్సార్ సీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది. – టీఎన్ దీపిక, హిందూపురం సమన్వయకర్త -
●సింహ వాహనంపై దర్శనమిచ్చిన ఖాద్రీశుడు
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి నాల్గవ రోజైన బుధవారం సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సింహం శౌర్యానికి, గాంభీర్యానికి, పరాక్రమానికి ప్రతీక. స్వామివారికి ప్రీతి పాత్రమైన ఈ సింహ రూపంలోనే నర–సింహ అవతారమెత్తి హిరణ్య కశిపుడిని సంహరించారు. స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతుంటే ఎప్పటి లాగానే తమిళనాడుకు చెందిన నాదస్వరం, డోలు విద్వాంసులు శ్రీవారి వాహనం ముందు భక్తితో పాటు తమ కళను చాటుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కాలక్షేపం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం లక్ష్మీ నారసింహుడు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రశాంతి నిలయం: పదో తరగతి పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విజయవాడ నుంచి కలెక్టర్లు, జేసీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ, పీ–4 మోడల్ సర్వే, స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ చేతన్ జిల్లా అధికారులతో మాట్లాడారు. మార్చి 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షల ఏర్పాట్లలో లోపాలు ఉండకూడదన్నారు. పీ–4 సర్వే పక్కాగా చేసి నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలన్నారు. మార్చి 15న చేపట్టే స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. 232 మంది విద్యార్థుల గైర్హాజరు పుట్టపర్తి: ఇంటర్ పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఫిజిక్స్/ ఎకనామిక్స్ పేపర్–2 పరీక్షలకు జిల్లాలో 232 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 9,329 మందికి గాను 9,134 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 1,147 మందికి గాను 1,110 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఇంటర్ బోర్డ్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి రఘునాథరెడ్డి, జిల్లా స్పెషలాఫీసర్ చెన్నకేశవ ప్రసాద్, కమిటీ సభ్యులు పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. -
ప్రజల పక్షాన పోరాడతాం
వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఎందరికో మేలు చేశారు. నేడు చంద్రబాబు.. సర్కారు..ఆ రెండు రంగాలను నిర్వీర్యం చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. చివరకు ఆరోగ్యశ్రీకి కూడా ఆంక్షలు విధించడం బాధాకరం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నా.. పాలక పక్షంలో ఉన్నా.. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది. – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే -
సీఎంగా ఉండే అర్హత లేదు
సూపర్ సిక్స్ పేరుతో ఆరు పథకాలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. అందులో ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. మనిషి ఎదుగుదలకు అవసరమయ్యే విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేయడం బాధాకరం. కేవలం వారి కార్యకర్తల బాగోగులు మాత్రమే చూసే చంద్రబాబు రాష్ట్రానికి సీఎంగా ఉండటానికి ఏ మాత్రమూ అర్హుడు కాదు. ఓటేసిన ప్రజలే చంద్రబాబును తిట్టడం మొదలుపెట్టారు. బీజేపీ, జనసేనతో పొత్తుపెట్టుకోవడం వల్లే చంద్రబాబు సీఎం అయ్యారు. – ఈరలక్కప్ప, మడకశిర సమన్వయకర్త -
మోసం... చంద్రబాబు నైజం
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కళ్లబొల్లి కథలు చెప్పిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. చంద్రబాబు పాలన తీరును గమనిస్తే ప్రజలను మోసగించడమే ఆయన నైజమని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికైనాభావి తరం భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలి. నిరుద్యోగ భృతి ఇవ్వాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి. ‘యువత పోరు’ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. – ఉషశ్రీచరణ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు -
ప్రజలే బుద్ధి చెబుతారు
గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన ఏ ఒక్క పథకం ఇప్పుడు అమలులో లేదు. వైఎస్ జగన్ను టార్గెట్ చేసుకుని.. సంక్షేమ పథకాలను రద్దు చేసిన చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు. రాష్ట్రంలో 2.67 లక్షల మంది వలంటీర్లను నియమిస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక జీతం పెంచుతామని హామీ ఇచ్చి.. ఉన్న ఉద్యోగం కూడా ఊడగొట్టింది. కూటమి సర్కారు వచ్చి తొమ్మిది నెలలు గడిచిపోయాయి. ఇంకెన్నో రోజులు ఈ ప్రభుత్వం నిలవదు. – దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే -
సాయం చేసేందుకు వెళితే దగా చేశారు!
బత్తలపల్లి: ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కిందపడుతున్న యువకుడికి సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తి సెల్ఫోన్ను చాకచక్యంగా అపహరించడమే కాక, ఆ సెల్ఫోన్లోని యూపీఐ బదలాయింపుల ద్వారా రూ.1.82 లక్షలను కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లిలోని ధర్మవరం మార్గంలో శనివారం ఉదయం రాజారెడ్డి ఎలక్ట్రికల్ షాపు వద్ద ముళ్లగూరు అయ్యప్ప నిల్చొని ఉండగా... ధర్మవరం వైపు నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ యువకుడు బండి స్కిడ్ అవుతున్నట్లు నటించి, అక్కడే ఉన్న అయ్యప్పను సాయం కోరాడు. దీంతో అయ్యప్ప ద్విచక్ర వాహనాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తుండగా మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు చాకచక్యంగా అయ్యప్ప చొక్కాలోని సెల్ఫోన్ను అపహరించారు. అయితే తన సెల్ఫోన్ పోయిన విషయం ఆలస్యంగా గుర్తించిన అయ్యప్ప దాని గురించి రెండు రోజులుగా ఆరా తీశాడు. ఫలితం దక్కలేదు. ఈ లోపు ఆయన కుమారుడు తన తండ్రి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేసి, విషయాన్ని తెలపడంతో సోమవారం ఉదయం బ్యాంక్కు వెళ్లి పరిశీలించుకున్నాడు. అదులో రూ.1.82 లక్షలు తక్కువగా ఉన్నట్లుగా నిర్ధారించుకున్న వాటి గురించి బ్యాంక్ అధికారులను ఆరా తీయడంతో వివిధ రకాల వస్తు కొనుగోళ్లకు యూపీఐ బదలాయింపులు చేసినట్లుగా నిర్ధారించారు. దీంతో జరిగిన మోసాన్ని గ్రహించిన అయ్యప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.20 వేలు విలువ చేసే సెల్ఫోన్ను అపహరించడమే కాక, దానిని ఉపయోగించి రూ.1.82 లక్షలు కాజేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
● అల్లుడే కారణమని మృతురాలి తల్లి ఫిర్యాదు ధర్మవరం అర్బన్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ధర్మవరం వన్టౌన్ పోలీసులు తెలిపిన మేరకు... పట్టణంలోని నేసేపేటకు చెందిన లక్ష్మీపతి భార్య నీరుగంటి అఖిల(21) ఓ పైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం వివాహమైన వీరి సంసారం కొంత కాలం సజావుగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్థలు చోటు చేసుకుని తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లోనే ఉరి వేసుకుని అఖిల ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. అల్లుడు లక్ష్మీపతి, ఆయన కుటుంబ సభ్యుల వేధింపులే తమ కుమార్తె మృతికి కారణమంటూ మృతురాలి తల్లి కళావతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీపతిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విద్యార్ధిని బలవన్మరణం సోమందేపల్లి: స్థానిక పాతూరులో నివాసముంటున్న ఈడిగ సురేష్ కుమార్తె పూజిత (15) ఆత్మహత్య చేసుకుంది. కేజీబీవీలో పదో తరగతి చదువుతున్న పూజిత... తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని నోట్ రాసి మంగళవారం సాయంత్రం ఇంట్లోనే పైకప్పునకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. బాలిక మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ‘క్లస్టర్ సమావేశాన్ని రద్దు చేయాలి’ పుట్టపర్తి రూరల్: పదో తరగతి, ఇంటర్, ఓపెన్ స్కూల్ పరీక్షల నేపథ్యంలో బుధవారం నిర్వహించనున్న పాఠశాల క్లస్టర్ సమావేశాన్ని రద్దు చేయాలని ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వనాథ్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్లు జరుగుతున్నాయని, చాలామంది టీచర్లు ఇంటర్, ఓపెన్ స్కూల్ పరీక్షల విధుల్లో ఉన్నారన్నారు. ఈ పరిస్థితులో ఈ నెల జరగాల్సిన పాఠశాల క్లస్టర్ సమావేశాన్ని రద్దు చేయడం ఉత్తమమన్నారు. ఈ అంశంలో ఒంటెద్దు పోకడలకు పోకూడదని ప్రభుత్వానికి సూచించారు. ఆకట్టుకున్న కర్రసాము పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన కర్రసాము పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన యువకులు పోటీ పడగా, యాడికి గ్రామానికి చెందిన నాగార్జున ప్రథమ, శివకుమార్ ద్వితీయ, మహేష్ తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. విజేతలను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు. -
సాయం చేసేందుకు వెళితే దగా చేశారు!
బత్తలపల్లి: ద్విచక్ర వాహనంపై నుంచి అదుపు తప్పి కిందపడుతున్న యువకుడికి సాయం చేసేందుకు వెళ్లిన వ్యక్తి సెల్ఫోన్ను చాకచక్యంగా అపహరించడమే కాక, ఆ సెల్ఫోన్లోని యూపీఐ బదలాయింపుల ద్వారా రూ.1.82 లక్షలను కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లిలోని ధర్మవరం మార్గంలో శనివారం ఉదయం రాజారెడ్డి ఎలక్ట్రికల్ షాపు వద్ద ముళ్లగూరు అయ్యప్ప నిల్చొని ఉండగా... ధర్మవరం వైపు నుంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ యువకుడు బండి స్కిడ్ అవుతున్నట్లు నటించి, అక్కడే ఉన్న అయ్యప్పను సాయం కోరాడు. దీంతో అయ్యప్ప ద్విచక్ర వాహనాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తుండగా మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు యువకులు చాకచక్యంగా అయ్యప్ప చొక్కాలోని సెల్ఫోన్ను అపహరించారు. అయితే తన సెల్ఫోన్ పోయిన విషయం ఆలస్యంగా గుర్తించిన అయ్యప్ప దాని గురించి రెండు రోజులుగా ఆరా తీశాడు. ఫలితం దక్కలేదు. ఈ లోపు ఆయన కుమారుడు తన తండ్రి బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేసి, విషయాన్ని తెలపడంతో సోమవారం ఉదయం బ్యాంక్కు వెళ్లి పరిశీలించుకున్నాడు. అదులో రూ.1.82 లక్షలు తక్కువగా ఉన్నట్లుగా నిర్ధారించుకున్న వాటి గురించి బ్యాంక్ అధికారులను ఆరా తీయడంతో వివిధ రకాల వస్తు కొనుగోళ్లకు యూపీఐ బదలాయింపులు చేసినట్లుగా నిర్ధారించారు. దీంతో జరిగిన మోసాన్ని గ్రహించిన అయ్యప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.20 వేలు విలువ చేసే సెల్ఫోన్ను అపహరించడమే కాక, దానిని ఉపయోగించి రూ.1.82 లక్షలు కాజేసిన యువకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
సాంకేతికత నేర్పించడమే జీవాగ్రో ముఖ్య ఉద్దేశం
బత్తలపల్లి: మహిళా రైతులకు విలువ ఆధారిత సాంకేతికతను నేర్పించడమే జీవాగ్రో ముఖ్య ఉద్దేశమని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కేఎన్.నరసయ్య పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో గ్రాంట్ థార్న్టన్ ఆధ్వర్యంలో జీవాగ్రో ప్రాజెక్టులో భాగంగా సామూహిక సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీఆర్డీఏ పీడీతో పాటు జీవాగ్రో ప్రాజెక్టు అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ కుళ్లాయప్ప, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి, జిల్లా హార్టికల్చర్ అధికారి చంద్రశేఖర్, డాట్ టీసీ నుంచి డాక్టర్ రామసుబ్బయ్య, సీఎస్ఏ ఆదినారాయణ, గ్రాంట్ థార్న్టన్ రామాంజులు, రాధ, హరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాదిన్నరగా అనంతపురం రూరల్, ముదిగుబ్బ, బత్తలపల్లి ప్రాంతాల్లో గ్రాంట్ థార్న్టన్ అమలులో ఉందని, పండ్ల తోటల పెంపకంపై మహిళా రైతులు దృష్టి సారించేలా చేయడం, వారికి సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం, మార్కెటింగ్ పరంగా వారికి సహాయపడటం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ సత్యనారాయణ, ఏపీఎం సుదర్శన్రాజు, హరిప్రసాద్, శోభా, సీసీలు, బత్తలపల్లి ఎఫ్పీఓ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు నిలకడగా ఎండుమిర్చి ధర హిందూపురం అర్బన్: ఎండమిర్చి ధర నిలకడగా కొనసాగుతోంది. మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్కు మంగళవారం 120.05 క్వింటాళ్ల ఎండుమిర్చి రాగా, అధికారులు ఈ–నామ్ పద్ధతిలో వేలం పాట నిర్వహించారు. ఇందులో క్వింటా ఎండుమిర్చి గరిష్టంగా రూ.15 వేలు, కనిష్టంగా రూ.7 వేలు, సరాసరిన రూ.13,500 ప్రకారం ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. ధర్మవరం–మచిలీపట్నం ఎక్స్ప్రెస్ పాక్షికంగా రద్దు గుంతకల్లు: డివిజన్ పరిధిలోని ధర్మవరం రైల్వే జంక్షన్లో 5వ నంబర్ ప్లాట్ఫారం ఏర్పాటు పనుల్లో భాగంగా ధర్మవరం–మచిలీపట్నం మధ్య తిరుగుతున్న ఎక్స్ప్రెస్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం–మచిలీపట్నం మధ్య మాత్రమే నడుస్తున్నట్లు వెల్లడించారు. మచిలీపట్నం–ధర్మవరం (17215) ఎక్స్ప్రెస్ను ఈ నెల 12 నుంచి 30 వరకు, ధర్మవరం–మచిలీపట్నం (17216) ఎక్స్ప్రెస్ను 13 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు. ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
హంస వాహనంపై వీణాపాణి
కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు మంగళవారం రాత్రి వీణాపాణిగా హంసవాహనంపై చదువుల తల్లి సరస్వతి అవతారంలో తిరుమాడ వీధుల్లో దర్శనమిచ్చారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టు పీతాంబరాలు ధరించి తిరువీధుల్లో ఊరేగుతున్న శ్రీవారి దివ్యమంగళరూపాన్ని దర్శించుకుని భక్తజనం తన్మయత్వం చెందారు. నారసింహుడు హంస వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి శరణాగతిని కల్గిస్తాడని అర్చక పండితులు తెలిపారు. పరమాత్మ వేదోపదేశాన్ని హంస రూపంలోనే చేసినందున తుచ్ఛమైన కోర్కెల అంధకారం వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తిమార్గం వైపు నడవాలని ఈ హంసవాహనం ద్వారా స్వామివారు తన భక్తులకు చాటిచెబుతారని అర్చకులు వెల్లడించారు. ఉభయదారులుగా పట్టణానికి చెందిన తోటంశెట్టి రాజుగోపాల్శెట్టి కుటుంబీకులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాగా,బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాటమరాయుడు బుధవారం మాడవీధుల్లో సింహవాహనంపై దర్శనమివ్వనున్నారు. -
కార్మికులను మోసగిస్తున్న ప్రభుత్వం
అనంతపురం అర్బన్: వేలాది మంది ప్రజల దాహార్తిని తీరుస్తున్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులను ప్రభుత్వం దగా చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబుళు మండిపడ్డారు. కార్మికులకు 10 నెలల వేతనం, 35 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతన, పీఎఫ్ బకాయిల మంజూరుతో పాటు లీటర్ బేస్ విధానం రద్దు చేయాలనే డిమాండ్తో మంగళవారం కలెక్టరేట్ ఎదుట శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు నిరసన తెలిపారు. ఓబుళు మాట్లాడుతూ... శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కింద 600 మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వేతనాల కోసం ఏడాదిలో మూడు దఫాలు సమ్మెలు చేయాల్సి వస్తోందన్నారు. సరైన బడ్జెట్ కేటాయించి కార్మికులకు వేతనం, పీఎఫ్ సక్రమంగా చెల్లించాలన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన లీటర్ బేస్ విధానం కారణంగా నీటి సరఫరాలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. అయితే వీటికి కార్మికులను బాధ్యులను చేస్తూ ఒక్కొక్క కార్మికుడికి రూ.2,500 చొప్పున వేతనంలో కోత విధించడం సబబు కాదన్నారు. సరైన వసతులు కల్పించని కారణంగా తలెత్తుతున్న ఈ వైఫల్యానికి తొలుత ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఆ తరువాత చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఈఈలు, డీఈఈ వరకు అధికారులను ఎందుకు బాధ్యులను చేయడం లేదని ప్రశ్నించారు. పంపు హౌస్లో ఆపరేటర్లు, హెల్పర్లకు మూడు షిఫ్ట్లు ఉంటే... కార్మికులను తగ్గించి రెండు షిఫ్ట్గా పనిచేయించాలని టెండర్లలో పెట్టినట్లు తెలుస్తోందన్నారు. దీంతో వందల గ్రామాలకు నీరందిస్తున్న ఈ పథకం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందన్నారు. పథకాన్ని కాపాడుకునేందుకు పోరాటం సాగిస్తామని, ప్రజలు కూడా ముందుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలను ఆయన చాంబర్లో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శ్రీరామరెడ్డి నీటి సరఫరా పథకం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాము, నాయకులు హొన్నూరు స్వామి, ప్రభాకర్, సోము, చిక్కన్న, హనుమంతరాయ, నాగేంద్ర, కార్మికులు పాల్గొన్నారు. వేతన బకాయిల కోసం ఏడాదిలో మూడు సార్లు ధర్నాలు చేయాలా? సరైన బడ్జెట్ కేటాయించి జీతభత్యాలు సక్రమంగా చెల్లించాలి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుళు -
●గాలేరు–నగరి ద్వారా కుప్పంకు నీరు తీసుకెళ్లొచ్చు ●జిల్లా రైతులను ఇబ్బంది పెట్టేందుకే హంద్రీ–నీవాకు లైనింగ్ పనులు ●రైతు సదస్సులో విశ్వేశ్వరరెడ్డి
కూడేరు: ఉమ్మడి అనంత జిల్లా రైతులపై సీఎం చంద్రబాబు కక్షకట్టి హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. గ్రావిటీ ద్వారా కుప్పం ప్రాంతానికి గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను తీసుకెళ్లే అవకాశమున్నా... కాదనీ జిల్లా రైతాంగం సంక్షేమాన్ని కూటమి సర్కార్ కాలరాస్తోందన్నారు. మంగళవారం కూడేరులోని శివరావు కల్యాణమంటపం వేదికగా హంద్రీ–నీవా కాలువ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుడు, ఎంపీపీ నారాయణ రెడ్డి అధ్యక్షతన ‘రైతు సదస్సు’ జరిగింది. సదస్సులో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు స్వార్థానికి జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. గత ప్రభుత్వంలో గాలేరు–నగరి ద్వారా కుప్పం ప్రాంతానికి నీరందించేందుకు అప్పటి సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకుని 75 శాతం పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. మిగిలిన పనులు పూర్తి చేస్తే జగన్కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పనులకు టెండర్లు పిలిచారన్నారు. సుమారు రూ.736 కోట్లతో పూర్తయ్యే లైనింగ్ పనులకు రూ.200 కోట్లు అధికంగా పెంచి టెండర్లను తన అనుయాయులకు కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ పనులు పూర్తయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో హంద్రీ–నీవా కాలువ ద్వారా 3.5లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యం నీరుగారిపోతుందన్నారు. లైనింగ్ పనులతో కాలువ గుండా ప్రవహిస్తున్న నీరు భూమిలోకి ఇంకదన్నారు. పక్కలకు ఊట రాదన్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీటి లభ్యత పూర్తిగా తగ్గి పండ్ల తోటలు, ఇతర పంటలు సాగు చేసుకునే రైతులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. భూములు బీళ్లుగా మారుతాయన్నారు. భవిష్యత్లో కాలువ వెడల్పు చేయడానికి అవకాశముండదన్నారు. లైనింగ్ పనులు ఆపాలని రైతులే వేడుకుంటున్నా... ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం దుర్మార్గమన్నారు. కుప్పం ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారానే నీళ్లు తీసుకెళ్లాలనుకుంటే ముందుగా కాలువను వెడల్పు చేస్తే ఉమ్మడి అనంత జిల్లా రైతులు స్వాగతిస్తారన్నారు. జిల్లా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికై న లైనింగ్ పనులు ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి రాయుడు, అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమణ, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, వైఎస్సార్సీపీ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్ధార్థ, మండల అఽధ్యక్షుడు సిద్ధారెడ్డి, ఏపీ రైతు సంఘం మండల నేతలు నారాయణరెడ్డి, వీరప్ప, వెఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, నేతలు రామచంద్రారెడ్డి, రంగారెడ్డి, రామ్మోహన్, క్రిష్టప్ప, గంగాధర్, నరేష్, కేశన్న తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్యలే శరణ్యం హంద్రీ నీవా కాలువకు కాంక్రీట్తో లైనింగ్ పనులు పూర్తయితే ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదని రైతులు, రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సదస్సులో జయపురం, ఎంఎంహళ్లి, చోళసముద్రం, పి.నారాయణపురం, తిమ్మాపురం, కరుట్లపల్లితో పాటు మరికొన్ని గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. హంద్రీ నీవా కాలువ పరిధిలో రూ.లక్షల్లో పెట్టుబడితో వివిధ రకాల పంటలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నామన్నారు. కాలువకు లైనింగ్ పనులు చేపడితే భూగర్భ జలాలు అడుగంటి పోయి బోరు బావులో నీటి మట్టం తగ్గి పంటలు సాగు చేసుకోలేక నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ ప్రభుత్వం తమకు మేలు చేయకపోయిన పర్వాలేదని, నష్టం కల్గించే చర్యలు చేపట్టకుండా ఉంటే చాలన్నారు. హంద్రీ–నీవా కాలువ పరిరక్షణకు కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. -
‘మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి’
అనంతపురం అగ్రికల్చర్: మామిడి తోటలు పిందె దశలో ఉన్నందున మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయని ఉద్యానశాఖ ఉమ్మడి జిల్లా అధికారులు జి.చంద్రశేఖర్, బీఎంవీ నరసింహారావు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పిందె రాలడం, బంక కారడం, నల్లతామర, రసంపీల్చు పురుగులు, తేనె మంచు పురుగు ఆశించి నష్టం కలిగించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం వారం లేదా ఐదు రోజులకోసారి నీటి తడులు ఇవ్వాలన్నారు. రసంపీల్చుపురుగు జాతికి చెందిన నల్లతామరను సకాలంలో నివారించుకుంటే మంచి దిగుబడులు వస్తాయన్నారు. నివారణలో భాగంగా తోటలో కలుపు లేకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. ఎకరాకు 40 నుంచి 50 నీలి లేదా తెలుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పూత ప్రారంభ దశ నుంచి మొదట వేప సంబంధిత మందులు పిచికారీ చేయాలన్నారు. అందులో 2 మి.లీ అజాడిరక్టిన్ ( పది వేల పీపీఎం) లేదంటే 3 మి.లీ 1,500 పీపీఎం లేదా 3 వేల పీపీఎం ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. అలాగే 7.5 గ్రాములు పొంగానియా లేదా నీమ్ సోప్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. అలాగే 5 గ్రాములు బవేరియా బాసియానా లేదా లేకానిసిల్లియం లేకాని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. వీటన్నింటికీ నల్లతామర అదుపులోకి రాకపోతే చివరగా 2 మి.లీ పిప్రొనిల్ లేదా 0.3 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.3 గ్రాములు థయామిథాక్సామ్ లేదా 1 మి.లీ స్పైరోటేట్రామెట్ లేదా 1 మి.లీ స్పైనోటోరం లేదా 1 మి.లీ ఫ్లూక్సా మెటామైడ్ మందులు మార్చి మార్చి రెండు మూడు దఫాలుగా పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
అనంతపురం: ఆలయ నిర్మాణానికి పోగు చేసిన మొత్తాన్ని దొంగలించిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.10.05 లక్షల నగదు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి వెల్లడించారు. కణేకల్లు మండలం సొల్లాపురం గ్రామంలో సీతారామాంజినేయులు ఆలయ నిర్మాణం కోసం గ్రామస్తులు చందాల రూపంలో పోగు చేసిన రూ.12 లక్షలను గుర్రం లక్ష్మన్న అనే వ్యక్తి వద్ద భద్రపరిచిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని దుండగులు అపహరించారు. ఘటనపై ఈ నెల 4న కణేకల్లు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. పాములు పట్టుకుంటూ .. తమిళనాడుకు చెందిన గురునాథం రాజు.. బాతులు మేపుతో జీవనం సాగించేవాడు. గురునాథానికి వరుసకు మేనమామ అయిన జానయ్య ఇటుకల బట్టీలో పనిచేస్తుండేవాడు. వీరి తల్లిదండ్రులు ఊరారా తిరుగుతూ గ్రామాల్లో పాములు ఆడిస్తూ జీవనం సాగించేవారు. తమిళనాడు బాతులు మేపుతున్న సమయంలోనే అక్కడే వీరికి కార్తీక్ అనే యువకుడు పరిచయమై, మంచి స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో వలస వచ్చిన ముగ్గురూ గత 20 రోజులుగా కణేకల్లు మండలంలో మోటార్ సైకిల్పై గ్రామాల్లో సంచరిస్తూ ఊరు చివర గుడారాలు వేసుకుని రెండు, మూడు రోజులు అక్కడే ఉంటూ పాములు ఆడిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయాల్లో హుండీలను అపహరించి, అందులోని భక్తుల కానుకలనూ అపహరించేవారు. దారిన పోతూ చోరీ ఈ నెల 2న కర్ణాటక ప్రాంతానికి వెళ్లిన గురునాథం రాజు, జానయ్య, కార్తీక్... రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి సమయంలో సొల్లాపురం వద్దకు చేరుకున్న వారికి గుర్రం లక్ష్మన్న అనే వ్యక్తి తాళం వేసిన ఇల్లు కనిపించడంతో పథకం వేసి 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇనుపరాడ్తో తలుపు తాళాలు మెండి లోపలకు ప్రవేశించారు. స్క్రూడ్రైవర్ సాయంతో బీరువా తెరిచి అందులో ఉన్న రూ.12 లక్షల నగదు అపహరించారు. చోరీ అనంతరం జీడిపల్లి డ్యామ్ చేరుకుని రూ.50 వేలను జానయ్య తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. మిగిలిన డబ్బు తర్వాత పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో భయపడి కర్ణాటకలోని సిరిగుప్పకు మకాం మార్చేందుకు మంగళవారం జీడిపల్లి డ్యామ్ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పోలీసులు గుర్తించి కణేకల్లు క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. గురునాథం రాజుపై వైఎస్సారఱ్ జిల్లా యర్రగుంట్ల, కర్నూలు జిల్లా హాలహర్వి పీఎస్ల పరిధిల్లో చోరీ కేసులు ఉన్నాయి. తమిళనాడులోని పోలూరు, శ్రీపెరంబూరు పీఎస్ల పరిధిల్లోనూ ద్విచక్రవాహనాల అపహరణ కేసులు, కర్ణాటకలోని బొమ్మనహళ్లి, ఏపీలోని వి.కోట పీఎస్ పరిధిలోనూ మోటార్ సైకిళ్ల చోరీ కేసులు ఉన్నాయి. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన కళ్యాణదుర్గం డీఎస్పీ పి.రవిబాబు, రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, కణేకల్లు ఎస్ఐ నాగమధు, డి.హీరేహళ్ ఎస్ఐ గురుప్రసాద్రెడ్డిను ఏఎస్పీ అభినందించారు. రూ.10.05 లక్షల నగదు, పల్సర్ బైక్ స్వాధీనం -
బుల్లెట్ షెల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పరిశీలన
చెన్నేకొత్తపల్లి: మండలంలోని న్యామద్దెల సమీపంలో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ షెల్ (తుపాకులలో ఉపయోగించే) ఫ్యాక్టరీని జిల్లా ఎస్పీ రత్న మంగళవారం పరిశీలించారు. ఎంత విస్తీర్ణంలో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారంటూ యాజమాన్య ప్రతినిధులతో ఆరా తీశారు. కంపెనీ వివరాలు, చేపట్టిన పనులు ఎంత వరకూ పూర్తి అయింది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్, రామగిరి సీఐ శ్రీధర్, చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ, కంపెనీ సిబ్బంది ఉన్నారు. నేరాల నియంత్రణకు చొరవ తీసుకోండి పెనుకొండ రూరల్: అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ రత్న ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కియా పీఎస్ను ఆమె తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. ముఖ్యంగా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామ ప్రధాన కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ రాఘవన్, ఎస్ఐ రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : ఎస్పీ చెన్నేకొత్తపల్లి: మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎస్పీ రత్న అన్నారు. సీకేపల్లిలోని టింబక్టు కలెక్టివ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎస్పీ రత్న హాజరయ్యారు. అంతకు ముందు మహిళలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎస్పీతో పాటు టింబక్టు కలెక్టివ్ సంస్థ వ్యవస్థాపకురాలు మేరి మాట్లాడారు. మహిళల రక్షణకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ధర్మవరం డీఎస్పీ హేమంతకుమార్, సీఐ శ్రీధర్, ఎస్ఐ సత్యనారాయణ, సంస్థ ఏడీ సుకన్య, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ గొప్ప మనసు..
2019 మే నెలలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు విద్యార్థులకు రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచింది. 2017–19 మధ్య టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం చెల్లించి చేయూతనిచ్చింది. అలాగే నాలుగేళ్లలో జిల్లాలో 44,082 మంది ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఒక్క విద్యా దీవెన కిందే రూ.314 కోట్లు అందించింది. వసతి దీవెన కింద జిల్లాలోని 43,301 మంది విద్యార్థులకు జగన్ సర్కార్ రూ.162.38 కోట్ల అందించింది. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్.. ఫీజు రీయింబర్స్మెంట్కు నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. వసతి దీవెనకు కూడా రూపాయి కూడా విడుదల చేయలేదు. ● హిందూపురానికి చెందిన రమేష్కు అనంతపురంలోని కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ పూర్తి చేశాడు. బెంగళూరులోని ఓ ఎంఎన్సీ కంపెనీలో ఏడాదికి రూ.9 లక్షల వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. అయితే, ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కంపెనీ కోరగా.. రమేష్ కళాశాలలో సంప్రదించాడు. ప్రభుత్వం ఇంతవరకూ ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదని, సర్టిఫికెట్లు కావాలంటే ఫీజు చెల్లించాలని కళాశాల యాజమాన్యం చెప్పింది. దీంతో రమేష్ అప్పు చేసి ఫీజు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నాడు. ● నిరుపేద కుటుంబానికి చెందిన ధర్మవరానికి చెందిన మహిత అనంతపురం జిల్లాలోని ఓ కళాశాలలో ఎంసీఏ పూర్తి చేసింది. హైదరాబాద్లోని ఓ పేరొందిన కంపెనీలో ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. అయితే సర్టిఫికెట్లు సమర్పించాల్సి రావడంతో కళాశాలను వెళ్లగా...ఫీజు బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు అందిస్తామని నిర్వాహకులు తేల్చిచెప్పారు. దీంతో మహిత తండ్రి వడ్డీకి అప్పు తెచ్చి మరీ ఫీజు చెల్లించారు. ..ఇలా జిల్లాలోని వేలాది మంది విద్యార్థులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేయకపోవడంతో సర్టిఫికెట్లు కళాశాలల్లోనే ఉండిపోగా..చాలా మంది ఉద్యోగం సంపాదించినా అందులో చేరలేకపోయారు.పుట్టపర్తి: విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. అలాగే వసతి దీవెనకు కూడా పూర్తిగా మంగళవారం పాడింది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి ఊసే లేకుండా 9 నెలలుగా పాలన సాగిస్తోంది. నిధులు నిలిపిన కూటమి వాస్తవానికి గడిచిన విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన గత జూన్ నెలలో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ నిధులు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమయ్యేవి. కానీ, అధికారంలోకి వచ్చిన ‘కూటమి’ నిధులు చెల్లించకుండా నిలిపివేసింది. పాత విద్యా సంవత్సరంలో రెండు త్రైమాసికాలు, ఈ విద్యా సంవత్సరంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి రూ. 100 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఈ విద్యా సంవత్సరంలో ‘వసతి దీవెన’ పథకానికి కూడా చంద్రబాబు సర్కారు పూర్తిగా మంగళం పాడటం గమనార్హం. ఫీజు కడితేనే సర్టిఫికెట్లు.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి 5 త్రైమాసికాలుగా అన్ని రకాలు ఫీజులు పెండింగ్లో ఉంచి పేద విద్యార్థుల భవిష్యత్ను అంధకారం చేస్తోంది. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా విద్యార్థులను ఆదుకుంటామని ఎన్నికల వేళ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు.. అధికారం చేపట్టాక వాటన్నింటినీ తుంగలో తొక్కారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉన్నత విద్య, ఉద్యోగాల సమయంలో సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని కళాశాలల నిర్వాహకులు తేల్చి చెబుతుండటంతో బాధిత తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్నారు. పరిశ్రమల స్థాపన ఊసే లేదు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు చేసింది. దీంతో పరిపాలన సౌలభ్యం ఏర్పడింది. అలాగే హిందూపురం పారిశ్రామిక వాడతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. తద్వారా స్థానిక యువతకు ఉపాధి లభించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న జిల్లా కేంద్రంతో పాటు మిగిలిన ఏ ప్రాంతంలోను నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఒక్క పరిశ్రమ స్థాపించలేదు. నోటిఫికేషన్ లేదు... భృతి అందదు రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, లేకపోతే ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని 2024 ఎన్నికలప్పుడు కూటమి నేతలు నమ్మ బలికారు. ఉద్యోగల భర్తీకి ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దీంతో జిల్లాలోని సుమారు 2 లక్షల మంది నిరుద్యోగులు భృతి కోసం ఎదురుచూస్తున్నారు. నెలకు రూ.3 వేల చొప్పున ఇప్పటికి 10 నెలలకు ఒక్కొక్కరికి రూ.30 వేల కింద రూ.600 కోట్లు చంద్రబాబు సర్కార్ నిరుద్యోగులకు బకాయి ఉంది. మెడికల్ కళాశాలకు మొండి చేయి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలో ఏకై క ప్రభుత్వ మెడికల్ కళాశాలను పెనుకొండలో ఏర్పాటు చేసింది. ఈ భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు ఎక్కడికక్కడ నిలిపివేసింది. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమైంది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నా.. మెడికల్ కళాశాల పనులు ముందుకు సాగకపోవడం దురదృష్టకరమని జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. పెనుకొండలో ‘యువత పోరు’ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఉషశ్రీచరణ్10 నెలల భృతి ఇవ్వాల్సిందే గత జగన్ సర్కార్ తొలి రెండేళ్లలోనే ఏకంగా 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది. ప్రస్తుత కూటమి సర్కార్ అధికారం చేపట్టి 9 నెలలు పూర్తవుతున్నా... ఇప్పటి దాకా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి కూడా మంజూరు చేయలేదు. డీఎస్సీ నోటిఫికేషన్ అయినా విడుదల చేయాలి. లేకపోతే నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి 10 నెలల కాలానికి రూ.30 వేలు ఇవ్వాలి. – అనిల్, నిరుద్యోగి, బుక్కపట్నందీవెన అందలేదు గత ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకోసారి ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా పడేది. గతంలో బకాయిలు ఉన్నా ..వైఎస్ జగన్ చెల్లించారు. పేదింటి బిడ్డలను అక్కున చేర్చుకున్నారు. నేను బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము బకాయి ఉంది. వసతి దీవెన సొమ్ము రూ.20 వేలు జమ కాలేదు. వస్తుందో...రాదో తెలియని అయోమయం నెలకొంది. అప్పటికీ, ఇప్పటికీ తేడా తెలుస్తోంది. విద్యార్థులను రాజకీయాల్లోకి లాగకుండా దన్నుగా నిలవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. – విశ్వనాథ్, బీటెక్ విద్యార్థి, పుట్టపర్తి పుట్టపర్తి/పెనుకొండ రూరల్: విద్యార్థులు, యువతను దగా చేసిన కూటమి ప్రభుత్వం మెడలు వంచడమే ధ్యేయంగా బుధవారం వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’కు సిద్ధమైంది. విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్, వసతి దీవెన, నిరుద్యోగులకు భృతి మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కదం తొక్కనున్నాయి. ఉదయం 9.30 గంటలకు పుట్టపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ ఉంటుందని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువకులు, వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్రెడ్డి పిలుపునిచ్చారు. అంతకుముందు మంగళవారం ఉషశ్రీచరణ్ పెనుకొండలోని పార్టీ కార్యాలయంలో ‘యువత పోరు’ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులు, యువకుల భవిష్యత్ కోసమే వైఎస్సార్ సీపీ ఉద్యమానికి సిద్ధమైందన్నారు. -
ప్రతి నిత్యం.. ప్రజాపక్షం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. దేశాన్ని శాసించిన జాతీయ పార్టీలు సైతం ఏపీలో గల్లంతయ్యాయి. కానీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి నిలబడ్డ పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. ‘‘పార్టీ అంటే ప్రజలు.. పాలకులంటే ప్రజలే’’ అంటూ సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2011 మార్చి 12న ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రాంతీయ, జాతీయ పార్టీల ప్రజా వ్యతిరేక పాలనకు ఎదురొడ్డి పోరాడిన పార్టీగా వైఎస్సార్ సీపీ ముద్ర వేసుకుంది. కష్టాలొచ్చినా ఎదురొడ్డి.. పార్టీ అధ్యక్షుడి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచింది. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల తరఫున కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ‘అనంత’ రైతుల ఆక్రందనలపై 2014–19 కాలంలో అసెంబ్లీలో గళమెత్తారు. రీయింబర్స్ మెంట్ రాక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల తరఫున నిలబడ్డారు. డ్వాక్రా మహిళల అభ్యున్నతి కోసం శ్రమించారు. 2014లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం చేసిన కుట్రలను ధీటుగా ఎదుర్కొన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిన తీరును ఎండగట్టారు. చివరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. పాలన అంటే ఇలా ఉండాలని.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు గెలిచింది. సాధారణంగా ఎన్నికలముందు హామీలివ్వడం, ఆ తర్వాత తుంగలో తొక్కడం చూసి ఉంటాం. కానీ పాలన చేపట్టిన రోజు నుంచే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూ.చ.తప్పకుండా జగన్ అమలు చేశారు. జిల్లాలో లక్షలాది మంది రైతులకు చెప్పిన తేదీకే ‘రైతు భరోసా’ అందించారు. డ్వాక్రా మహిళలకు ఆసరా, ‘సున్నా వడ్డీ’తో అండగా నిలిచారు. ఫీజు రీయింబర్స్మెంట్తో పేద విద్యార్థులను ఆదుకున్నారు. ప్రాథమిక ఆరోగ్యానికి పునరుజ్జీవం పోశారు. పాలన వికేంద్రీకరణ జరిగితేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని గ్రామ వార్డు సచివాలయాలు తెచ్చారు. ఈ క్రమంలో జిల్లాలో వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే పెనుకొండకు మెడికల్ కాలేజీ, అనంతపురంలో ఎంసీహెచ్ బ్లాకు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, పీహెచ్సీకి ఇద్దరు డాక్టర్లు ఇలా ఒకటేమిటి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత జగన్దే. అయితే, ప్రజలను మభ్యపెట్టి 9 నెలల క్రితం గద్దెనెక్కిన చంద్రబాబు.. వచ్చీ రాగానే విద్యార్థులు, రైతులు, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నేడు ‘యువత పోరు’కు శ్రీకారం చుడుతున్నారు. ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలిచిన ‘వైఎస్సార్ సీపీ’ ఉమ్మడి అనంత జిల్లాలో రైతులు, మహిళల పక్షాన ఎనలేని పోరాటాలు 2019లో అత్యధిక మెజారిటీతో అధికారంలోకి.. సీఎంగా పాలన అంటే ఇలా ఉండాలని చూపించిన జగన్ నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం