breaking news
Sri Sathya Sai District Latest News
-
కంది రైతు కుదేలు
ధర్మవరం రూరల్: ప్రకృతి విపత్తులు, మరో పక్క చీడపీడలను అధిగమించి అంతంత మాత్రంగా సాధించిన కంది దిగుబడులకు గిట్టుబాటు ధర లేక రైతులు కుదేలవుతున్నారు. ఎకరా విస్తీర్ణంలో కంది పంట సాగుకు దుక్కి, సేద్యం మొదలు పంటను మార్కెట్కు తరలించే వరకూ రూ.15 వేలకు పైగా రైతులు పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది పంట కీలకమైన పూత దశలో ఉన్నప్పుడు అల్పపీడనాలతో కురిసిన వర్షాలకు ఎక్కడికక్కడ పూత రాలిపోయింది. ఇది కాస్త దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం చేతికి అందిన అరకొర పంటను రైతులు నూర్పిడి చేస్తున్నారు. ఎకరానికి ఒకట్రెండు బస్తాలకు మించి దిగుబడి లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉచిత పంటల బీమాతో ఆదుకున్న వైఎస్ జగన్ గత ఏడాది ప్రారంభంలో మద్ధతు ధర కన్నా ఎక్కువగా మార్కెట్ ధరలు ఉండడంతో కంది రైతులు ఒకింత లాభపడ్డారు. దీంతో ఈ ఖరీఫ్లో అత్యధికంగా కంది పంటను సాగు చేశారు. పంట కీలక దశలో ఉన్నప్పుడు వరుస తుపానుల కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా రూ.5,500 నుంచి రూ. 6వేల వరకు ధర పలుకుతోంది. ఈ ధరతో పంటను విక్రయిస్తే పెట్టుబడులు సైతం చేతికి అందకుండా పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంది పంట క్వింటాకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా.. నిబంధనల కారణంగా పంటను విక్రయించుకోలేకపోతున్నామని వాపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాతో వేరుశనగ, కంది రైతులను అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకున్నారని, అదే తరహాలో ఈ ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని అన్నదాతులు విన్నవిస్తున్నారు. ఉచిత పంటల బీమా పథకం వర్తించకపోవడంతో రైతు వాటా ప్రీమియం చెల్లించామని, అయినా పరిహారం అందుతుందో.. లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో తగ్గిన దిగుబడి ఇన్పుట్ సబ్సిడీ, బీమాతో ఆదుకోవాలంటున్న అన్నదాతలు -
రోడ్డు నిర్మాణంలో ‘గిన్నిస్ రికార్డు’
● 7 రోజుల్లో 52 కి.మీ రోడ్డు నిర్మాణం పుట్టపర్తి అర్బన్: బెంగళూరు–విజయవాడ జాతీయ రహదారి 544–జీ రోడ్డు నిర్మాణంలో రాజ్పత్ ఇన్ఫ్రా కాన్ సంస్థ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. జిల్లాలోని పుట్టపర్తి మండలం సాతార్లపల్లి నుంచి ముదిగుబ్బ మండలం మలకవేముల క్రాస్ వరకూ 52 కిలోమీటర్ల తారు రోడ్డును కేవలం 7 రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో అనతికాలంలోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేసిన రాజ్పత్ ఇన్ఫ్రా కాన్ సంస్థ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్దన్రెడ్డి పుట్టపర్తి మండలం బొంతలపల్లికి విచ్చేసి సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. రాజ్పత్ ఇన్ఫ్రా కాన్ సంస్థ రోడ్డు నిర్మాణంలో నాణ్యతతో పాటు ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. రహదారులు అభివృద్ధి చెందితే పరిశ్రమలు వస్తాయని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద న్నారు. అనంతరం మంత్రి జనార్దన్రెడ్డి, ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే సింధూరరెడ్డి, నేషనల్ హైవేఅధికారులు నిర్మాణ సంస్థ సీఎండీ జగదీష్ కదంకు ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ పంపిన ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. మరోవైపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సైతం వర్చువల్గా కార్యక్రమంలో పాల్గొని రాజ్పత్ ఇన్ఫ్రా కాన్ సంస్థ ప్రతినిధులను అభినందించారు. -
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి
ప్రశాంతినిలయం: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే ప్రతి అర్జీకి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’లో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 256 అర్జీలు అందగా... వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. అర్జీలన్నీ గడువులోపు పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ అర్జీలపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు.పింఛన్ మంజూరు చేయండి నరాల బలహీనతతో చాలా కాలంగా నేను మంచానికే పరిమితమయ్యాను. 92 శాతం వైకల్యం ఉన్నట్లు అధికారులు ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారు. ఎలాంటి పని చేయడానికి వీలులేక కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. నా కుటుంబంపై దయచూపి నాకు వికలాంగ పింఛన్ మంజూరు చేయించి ఆదుకోండి. – బొంతల వెంకటేషు, లింగారెడ్డిపల్లి, బత్తలపల్లి మండలంధ్రువీకరణ పత్రం ఇప్పించండి మేము ఉపాధి కోసం కుటుంబంతో సహా కేరళకు వెళ్తుంటాం. మేము తండాలో స్థిర నివాసం లేమని ఇప్పటికే అధికారులు చేసిన సర్వేలోనూ తేలింది. దీన్ని ధ్రువీకరిస్తూ ఒక సర్టిఫికెట్ మంజూరు చేయించండి. దీనివల్ల వలస కూలీలమైన మా కుటుంబానికి మేలు జరుగుతుంది. – కేషూబాయి, నీరాలవంక తండా, నల్లమాడ మండలం ఎన్నిసార్లు తిరిగినా కాలేదు నాకు గ్రామంలోని సర్వే నంబర్ 102–1లో పొలం ఉంది. కానీ అధికారులు ఆన్లైన్లో 102–1–ఏ1 గా నమోదు చేశారు. ఆ నంబర్ను సరిదిద్దాలని ఎన్నిసార్లు మండల కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. నా సమస్య నేటికీ తీరలేదు. దయచేసి ఇప్పటికై నా నా భూ సమస్యను పరిష్కరించాలి. – భాగ్యమ్మ, బసవనపల్లి గ్రామం, అమరాపురం మండలం -
తప్పుల్లేని పాసు పుస్తకాలు అందించాలి
● జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశం ప్రశాంతినిలయం: రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు తప్పుల్లేని పాసుపుస్తకాలు వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని జేసీ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి సీఎం చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. జిల్లాలో జీఎస్డీపీకి అనుగుణంగా వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తప్పుల్లేని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. దీపికకు గణతంత్ర వేడుకల ఆహ్వానం హిందూపురం టౌన్: భారత అంధుల మహిళా క్రికెట్ టీ–20 జట్టు కెప్టెన్ దీపికకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు దీపికను ఆహ్వానిస్తూ రాష్ట్రపతి పంపిన పత్రిక సోమవారం దీపికకు అందింది. అమరాపురం మండలం తంబలహట్టి గ్రామానికి చెందిన తిమ్మప్ప కుమార్తె దీపిక భారత అంధుల మహిళల టీ–20 జట్టుకు నాయకత్వం వహించి ప్రపంచ కప్పును సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి నుంచి పంపిన ఆహ్వాన పత్రికను హిందూపురం తపాలా అధికారులు సోమవారం నేరుగా దీపిక స్వగ్రామానికి వెళ్లి అందజేశారు. ఐసీడీఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానంపుట్టపర్తి అర్బన్: ఐసీడీఎస్లో ఖాళీగా ఉన్న జిల్లా కో–ఆర్డినేటర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు ఐసీడీఎస్ పీడీ ప్రమీల సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికనా ఈ నియామకం ఉంటుంది. దరఖాస్తులను ఈ నెల 19వ తేదీలోపు అందజేయాలి. అభ్యర్థులకు వయస్సు.. ఇతర వివరాలకు ఐసీడీఎస్ కార్యాలయంలో సంప్రదించాలి. -
కార్మికుల పొట్టకొడితే సహించం
ఈ చిన్నారులు అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సిద్దరాంపురం విద్యార్థులు. వీరికి అనంతపురం నుంచి ఓ సంస్థ ద్వారా మధ్యాహ్న భోజనం అందుతుంది. ఈ నెల 5వ తేదీన వాహనం సమస్యతో గంట ఆలస్యంగా భోజనం పాఠశాలకు చేరింది. అప్పటికే ఆకలితో అల్లాడిపోయిన విద్యార్థులు చల్లారిపోయిన భోజనాన్ని హడావుడిగా తిన్నారు. తరచూ ఇలాగే జరుగుతూ ఉంటుందని ఇక్కడి విద్యార్థులు చెబుతున్నారు. అనంతపురం నుంచి 9 కి.మీ దూరంలోని సిద్దరాపురం గ్రామానికే రోజుకో సమస్యతో వారంలో కనీసం మూడు రోజులు భోజనం ఆలస్యంగా అందుతుంది. అలాంటిది స్థానికంగా ఉండే ఏజెన్సీలను తొలగించి ‘స్మార్ట్’ కిచెన్ల ద్వారా రోజూ 15 కి.మీ దూరంలోని పాఠశాలలకు భోజనం పంపుతామని ప్రభుత్వం చెబుతోంది. మధ్యాహ్న ఏజెన్సీ కార్మికుల పొట్టకొట్టి మధ్యాహ్నం భోజనం నిధులు తమ్ముళ్లకు దోచిపెట్టేందుకే ‘పచ్చ’ కుట్ర జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశాంతి నిలయం: ‘జగనన్న గోరుముద్ద’ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగన్ సర్కార్...మధ్యాహ్న వేళ పౌష్టికాహారం అందిస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు వంట వండిపెట్టడం ద్వారా స్థానిక మహిళలకు ఉపాధి కల్పించింది. పిల్లలకు రుచి, శుచికరమైన భోజనాన్ని వడ్డించింది. అయితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం పథకం పేరును ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’గా మార్చి అమలు తీరును ప్రశ్నార్థకం చేస్తోంది. వంట ఏజెన్సీల స్థానంలో ‘స్మార్ట్’ కిచెన్లకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వైఎస్సార్ కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ కిచెన్లను ప్రారంభించిన ప్రభుత్వం.. త్వరలోనే అన్ని జిల్లాల్లోనూ ఏజెన్సీలను తొలగించి తమ అనుయాయుల చేత స్మార్ట్కిచెన్లతో మధ్యాహ్న భోజన పథకాన్ని నడిపించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. జిల్లాలో 7 వేల మందికిపైగా కార్మికులు.. జిల్లాలో 1,983 ప్రభుత్వ పాఠశాలలుండగా... 1,16,137 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం పొందుతున్నారు. 1983 పాఠశాలలకు గాను ప్రతి పాఠశాలకు ఒక ఏజెన్సీ వంట పనులు నిర్వహిస్తుండగా.. విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో ఏజెన్సీలో ముగ్గురు నుంచి ఐదుగురు ఉపాధి పొందుతున్నారు. ఈ మేరకు జిల్లాలో సుమారు 7 వేల మంది మధ్యాహ్న భోజన ఏజెన్సీల ద్వారా పొట్ట పోసుకుంటున్నారు. ప్రభుత్వం స్మార్ట్ కిచెన్లు అమలు చేస్తే వీరందరూ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి తలెత్తనుంది. జిల్లాలో 10 పాఠశాలలు ఎంపిక.. జిల్లాలో తొలి దశలో స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు 10 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గొట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గోరంట్ల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, పెద్దచోళగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొట్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కదిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాల, మడకశిర ఉన్నత పాఠశాల, నసనకోట ఉన్నత పాఠశాల, తలుపుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. 12 కి.మీ దూరం పాఠశాలలకు సరఫరా.. అనువైన పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయనున్న చంద్రబాబు ప్రభుత్వం.. అక్కడి నుంచి 12 కిలోమీటర్ల పరిధిలోని మూడు రూట్ల ద్వారా 3 నుంచి 5 వేల మంది విద్యార్థులకు ఆహార పదార్థాలు సరఫరా చేయాలని భావిస్తోంది. తద్వారా ఏజెన్సీల నిర్వహణ భారం తగ్గించుకోవడంతో పాటు తమ అనుయాయులకు స్మార్ట్ కిచెన్ నిర్వహణ కాంట్రాక్ట్ను అప్పగించి దోచిపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. స్మార్ట్ కిచెన్ విధానం అమలైతే ఏజెన్సీల స్థానంలో కాంట్రాక్టర్లు మధ్యాహ్న భోజనం తయారు చేయనున్నారు. నాణ్యత గోవింద! స్మార్ట్కిచెన్ల ద్వారా మధ్యాహ్న భోజన పథకం అమలైతే విద్యార్థులకు శుచి, శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారం అందే పరిస్థితి ఉండదన్న విమర్శలు వినిపిస్తున్నారు. స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసి అక్కడ వండిన ఆహార పదార్థాలను వాహనాల ద్వారా 12 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలల పంపుతారు. ప్రస్తుతం మధ్యాహ్న భోజన ఏజెన్సీల పనితీరును, ఆహార పదార్థాల నాణ్యతను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పరిశీలి స్తున్నారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఆహారం సరఫరా చేయడం వల్ల పర్యవేక్షణ కొరవడుతుంది. సమయ పాలన కూడా సరిగా ఉండదు. ఫలితంగా మధ్యాహ్న భోజనం లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉందని, ప్రభుత్వం స్మార్ట్ ఆలోచనను విరమించుకోవాలని తల్లిదండ్రులు సైతం సూచిస్తున్నారు. వ్యయ ప్రయాసలతో కూడిన స్మార్ట్ కిచెన్ విధానం ఎవరిని సంతృప్తి పరిచేందుకు తీసుకువస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ మరో కుతంత్రం ‘స్మార్ట్’ కిచెన్ల పేరుతో పన్నాగం మధ్యాహ్న భోజన కార్మికుల నోట్లో మట్టి! ‘తమ్ముళ్ల’కు మధ్యాహ్న భోజనం బాధ్యతలు తొలి దశలో 10 స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం స్మార్ట్ కిచెన్లతో మధ్యాహ్న భోజన ఏజెన్సీల్లో పనిచేస్తున్న 7 వేల మంది కార్మికులు వీధిన పడతారు. స్మార్ట్ కిచెన్లను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఆందోళన చేశాం. చంద్రబాబు ప్రజా ధనాన్ని టీడీపీ నాయకులను దోచిపెట్టేందుకే స్మార్ట్ కిచెన్లను తీసుకు వస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు ఎలాంటి మేలు జరగదు. – లక్ష్మీనారాయణ, సీఐటీయూ జిల్లా కోశాధికారి -
అప్రెంటిస్షిప్కు ఎంపికై న అభ్యర్థులూ ఈ నెల19న హాజరుకండి
పుట్టపర్తి టౌన్: వివిధ ట్రేడ్లలో ఐటీఐ పూర్తి చేసి ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్షిప్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక తుది జాబితా వెల్లడైంది. ఎంపికై న అభ్యర్థులు మూడు ఫొటోలతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 19న కర్నూలులోని జోనల్ శిక్షణా కళాశాలకు ఉదయం 9 గంటలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డీజిల్ మెకానిక్ ట్రేడ్లో 57, 56, 32, 24, 60, 58, 4, 39, 42, 66, 45, 79, 49, 1, 33, 25, 10, 62, 84, 53, 52, 31 సీరియల్ నంబర్లు ఉన్నవారు అర్హులు. అలాగే డ్రాఫ్ట్మెన్ (సివిల్) విభాగంలో 7 సీరియల్ నంబర్ ఉన్నవారు హాజరు కావాలి. పీఆర్టీయూ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ పుట్టపర్తి టౌన్: స్థానిక ఎమ్మార్సీలో పీఆర్టీయూ క్యాలెండర్, డైరీని డీఈఓ క్రిష్టప్ప సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజినీకాంత్రెడ్డి, నాయకులు విజయ్కుమార్, రామిరెడ్డి, పుల్లారెడ్డి, మురళీమోహన్, శివకుమార్రెడ్డి, చంద్రమోహన్, నాగభూషణం, సతీష్, సంజీవరెడ్డి, గౌతమ్, వెంకట్, సాయినాథరెడ్డి, శివారెడ్డి, నారాయణస్వామి, ఎంఈఓలు ఖాదర్వలి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
తుపాన్లతో దెబ్బతిన్నాం
ఆరంభంలో కంది పంట ఏపుగా పెరిగి పూత బాగా వచ్చింది. ఆ సమయంలోనే వరుసగా వచ్చిన తుపానుల కారణంగా పూత రాలిపోయి పంట దిగుబడులపై ప్రభావం పడింది. ఆశించిన మేర దిగుబడులు రాలేదు. కనీసం పెట్టుబడులు కూడా చేతికి అందని పరిస్థితి. – నారాయణ, కంది రైతు, చిగిచెర్ల ప్రభుత్వం ఆదుకోవాలి వరుస అల్పపీడనాల కారణంగా కంది పంటలో పూత రాలి పోయింది. దిగుబడులపై ప్రభావం పడింది. రైతులకు కనీసం పెట్టుబడులు కూడా దక్క లేదు. ప్రభుత్వం స్పందించి కంది రైతులను ఆదుకోవాలి. – జంగాలపల్లి పెద్దన్న, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
సీడీపీఓపై విచారణకు డిమాండ్
పుట్టపర్తి టౌన్: హిందూపురం సీడీపీఓ వరలక్ష్మి అవినితిపై విచారణ చేపట్టాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్వోను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఐసీడీఎస్ పరిధిలో ఉద్యోగులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. మరో వైపు అంగన్వాడీ టీచర్ల నుంచి అక్రమ వసూళ్లకు తెరలేపి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. హిందూపురం ప్రాజెక్ట్లో సీడీపీఓ వరలక్ష్మి అవినీతి తారాస్థాయికి చేరుకుందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈఎస్ వెంకటేష్, ప్రాంతీయ కార్యదర్శి వినోద్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు పాల్గొన్నారు. 60 సేలం కోళ్ల అపహరణబత్తలపల్లి: స్థానిక వేల్పుమడుగు బైపాస్ రోడ్డు సమీపంలోని నాటుకోళ్ల ఫారం నుంచి సోమవారం తెల్లవారుజామున సినీఫక్కీలో 60 సేలం కోళ్లను దుండగులు అపహరించారు. బాధితుడు, బత్తలపల్లికి చెందిన రాజేష్ తెలిపిన మేరకు... వేల్పుమడుగు రహదారిలోని బైపాస్ వద్ద నాటు కోళ్ల ఫారంను ఏర్పాటు చేసి అందులో నాటు కోళ్లతో పాటు సేలం కోళ పెంపకాన్ని చేపట్టాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బొలెరో వాహనంలో వచ్చిన ఆరుగురు వ్యక్తులు ‘అన్నా యాక్సిడెంట్ అయింది, తాగేందుకు నీళ్లు కావాలి’ అంటూ రాజేష్ను పిలిచారు. వారి మాటలు విశ్వసించేలా లేకపోవడంతో సమీపంలోని ఆర్డీటీ ఆస్పత్రికి వెళ్లాలని రాజేష్ తెలిపాడు. ఆ సమయంలో దుండగులు గేటు ఎక్కి లోపలికి దూకి రాజేష్ అప్రమత్తమయ్యేలోపు కట్టెతో దాడికి ప్రయత్నించారు. తప్పించుకోవడంతో రాళ్లు రువ్వడంతో రాజేష్ వెంటనే గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు. ఇదే అదనుగా భావించిన దుండగులు రూ.2లక్షలు విలువ చేసే 60 సేలం కోళ్లను సంచుల్లో నింపుకుని బొలెరో వాహనంలో ఉడాయించారు. రాళ్ల దాడిలో గాయపడిన రాజేష్ ఫిర్యాదు మేరకు సోమవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
రెవెన్యూ సేవల్లో పారదర్శకత ముఖ్యం
● సమీక్షలో జేసీ మౌర్య భరద్వాజ్ ప్రశాంతి నిలయం: ప్రజలకు అందించే రెవెన్యూ సేవల్లో పారదర్శకత ముఖ్యమని జేసీ మౌర్య అన్నారు. సోమవారం రాత్రి ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ అధికారులతో సమావేశమయ్యారు. పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారం, రెవెన్యూ క్లినిక్ల నిర్వహణ, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, రీ సర్వే, జాయింట్ ఎల్పీఎంఎస్, పౌరసరఫరాల పంపిణీ, దీపం గ్యాస్ పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేర్చాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందన్నారు. రెవెన్యూ క్లినిక్లలో అందే అర్జీలను గడువులోగా పరిష్కరించాలన్నారు. రీ సర్వే పనులు నాణ్యతతో చేయాలన్నారు. గ్యాస్ పంపిణీ సజావుగా సాగేలా చూడాలన్నారు. సమీక్షలో డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ సువర్ణ, సర్వే శాఖ ఏడీ విజయశాంతి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణారెడ్డి, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
పరిష్కార వేదికకు 70 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కారవేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. జిల్లా అదనపు ఎస్పీ అంకితా సురానా స్వయంగా వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి, డీటీఆర్బీ సీఐ లక్ష్మీకాంతరెడ్డి, ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
చోరీ కేసులో ఇద్దరికి నాలుగేళ్ల జైలు
పుట్టపర్తి టౌన్: మామిళ్లకుంట క్రాస్ వద్ద ఆరేళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు ముద్దాయిలకు నాలుగేళ్ల జైలు శిక్ష రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ పుట్టపర్తి జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. వివరాల్లోకి వెళితే... కొత్తచెరువు మండలం మామిళ్లకుంట క్రాస్లో నివాసం ఉంటున్న శివయ్య 2019 ఫిబ్రవరి 17వ తేదీన ఇంటికి తాళం వేసి బెంగళూరులో ఉంటున్న తన కూతురును చూసేందుకు వెళ్లాడు. ఇది గమనించిన దొంగలు తాళం పగలగొట్టి మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇంటికి వచ్చి చూసుకున్న శివయ్య ఘటనపై కొత్తచెరువు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ధర్మవరం మండలం ఉప్పునేసినపల్లికి చెందిన భీమినేని అమరనాఽథ్, అనంతపురం జిల్లా మన్నీల గ్రామానికి చెందిన కరుణాకర్ నాయుడు దొంగతనం చేసినట్లు గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. వారి నుంచి సొమ్మును రికవరీ చేశారు. ఈ కేసు సోమవారం పుట్టపర్తి జ్యుడీషియల్ ఫ్లస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముందుకు రాగా... సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి... ఇద్దరు ముద్దాయిలకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 500 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి ముద్దాయిలకు శిక్షపడేలా చేసిన సీఐ మారుతీశంకర్, కోర్టు కానిస్టేబుల్ చంద్రానాయక్తోపాటు సిబ్బందిని ఎస్పీ సతీష్కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. -
ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద
హిందూపురం: అనంత మేధాశక్తితో యువతను మేల్కొల్పిన స్వామి వివేకానందుడు అందరికీ ఆదర్శప్రాయుడని అడిషనల్ జిల్లా జడ్జి కంపల్లె శైలజ పేర్కొన్నారు. సోమవారం ఏడీజే కోర్టు ఆవరణలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏడీజేతో పాటు పలువురు న్యాయవాదులు స్వామి వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏడీజే శైలజ మాట్లాడుతూ.. ఉన్నత భావాలతో సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు. ఓటమికి కుంగిపోకుండా మళ్లీ ప్రయత్నించినప్పుడే గెలుపు సాధ్యమవుతుందన్నారు. వివేకానందుడు చెప్పినట్లు కర్తవ్యాలు నిర్వహించాలే తప్ప.. ప్రతిఫలం ఆశించవద్దన్నారు. ప్రస్తుతం కొందరు యువకులు చెడు అలవాట్లకులోనై పెడదోవ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సమయాన్ని వృథా చేసుకోకుండా ఉన్నత ఆశయాలతో ముందుకు వెళుతూ సమాజహితం కోసం పాటుపడాలని సూచించారు. స్వామి వివేకానందుడు చెప్పినట్లు సత్యం, అహింస, ఆధ్యాత్మిక, మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు సుదర్శన్, సత్యనారాయణ, రాజశేఖర్, మురళీ, మనోహర్, కృష్ణమూర్తి, వర్షారెడ్డి, ఆంజనేయులు, వీరసేన, భాను ప్రకాష్, సందీప్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ -
మట్టి నుంచి బంగారం!
రామగిరి: మట్టిలోంచి మాణిక్యాలు పుడతాయంటారు. అతని చేయి పడితే మట్టి బంగారమవుతుందంటారు... అలాగే రామగిరి వాసులు మట్టి నుంచి బంగారాన్ని వెలికి తీస్తున్నారు. వినేందుకు విడ్డూరంగా ఉన్నా...ఇదే నిజం. ట్రాక్టర్ మట్టిని ఓ కుటుంబమంతా కలిసి ఓ 10 రోజుల్లో నీటితో కడిగితే తులం బంగారం దొరుకుతోంది. ప్రస్తుతం మార్కెట్లో తులం బంగారం రూ.లక్ష దాటగా...మట్టినే నమ్ముకున్న రామగిరి వాసుల జీవితాలు బంగారంగా మారాయి. కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్)కు అనుబంధంగా ఉండే భారత్ గోల్డ్మైన్స్ లిమిటెడ్ (బీజీఎంఎల్) కంపెనీ రామగిరి గనుల నుంచి బంగారాన్ని వెలికితీసేది. అయితే వివిధ కారణాలతో ఒకేసారి ఈ రెండు కంపెనీలు మూతపడ్డాయి. అనంతరం రామగిరి బంగారు గనులను తెరిపించేందుకు జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఖాయిలాపడ్డ ఈ పరిశ్రమలోని సామగ్రిని మహారాష్ట్రకు చెందిన నేషనల్ డైమండ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్డీసీఎల్) టెండర్ ద్వారా దక్కించుకుని గత ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో తరలించింది. దీంతో అక్కడ సెక్యూరిటీ కూడా లేదు. దీంతో ఖాళీగా ఉన్న ఆ ప్రాంతంలోని మట్టిని స్థానిక ప్రజలు తవ్వుకుని తమ ఇళ్లవద్దకు తరలించుకుంటున్నారు. ఆ మట్టిని నీటితో పలుమార్లు కడిగి, వడబోయగా చివరలో కొంత బంగారం లభిస్తోంది. ఇలా ట్రాక్టర్ మట్టికి పలుమార్లు కడిగి వడబోయగా...తులం దాకా బంగారం లభ్యమవుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఒకరిని చూసి మరొకరు..ఇలా గ్రామమంతా మట్టి నుంచి బంగారాన్ని వెలికి తీయడాన్నే ఉపాధిగా మలచుకుంది. మరికొందరు సమీపంలోనున్న ఆర్డీటి చెక్డ్యాం వద్దకు మట్టిని తరలించుకొని ఆ మట్టిని నీటిలో కడిగి... వడబోసి బంగారం వెలికి తీస్తున్నారు. గతమెంతో ఘనం.. రామగిరి బంగారు నిక్షేపాలకు నిలయం. అందుకే శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచీ ఈ ప్రాంతంలో బంగారాన్ని వెలికి తీసేవారు. కేంద్ర ప్రభుత్వం 1972లో రామగిరిలో భారత్ గోల్డ్మైన్స్ లిమిటెడ్ (బీజీఎంఎల్) పేరుతో పరిశ్రమను ప్రారంభించింది. 2001 వరకు ఇక్కడ బంగారాన్ని వెలికితీశారు. 1984లో ఏకంగా 13 కేజీల బంగారాన్ని రామగిరి గని నుంచే వెలికితీసినట్లు కార్మికులు చెబుతున్నారు. ఇక్కడ వేప మాను, జమ్మి మాను, చెన్నేబావి, జిప్టాల్, హరిహరరాయలు తదితర పేర్లతో ఐదు బంగారు గనులుండగా.. అప్పట్లో సరైన యంత్ర పరికరాలు లేక పదిశాతం బంగారాన్ని మాత్రమే వెలికి తీశారని, ఇంకా 90 శాతం బంగారం నిక్షేపాలు ఆయా గనుల్లో ఉన్నట్లు అప్పట్లో పనిచేసిన కార్మికులు చెబుతున్నారు. రామగిరిలోని బంగారు గని ప్రాంతం నుంచి మట్టి సేకరణ ఆ మట్టిని వివిధ రకాలుగా శుద్ధి చేసి బంగారం వెలికితీత ట్రాక్టర్ మట్టిలో తులం దాకా బంగారం ఉపాధిగా మలచుకున్న రామగిరి వాసులు -
బెల్టు దుకాణాలను అరికట్టండి
హిందూపురం టౌన్: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో బెల్టు షాపులను అరికట్టాలని సంబంధిత అధికారులను ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఆదేవించారు. సోమవారం స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ను అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్తో కలిసి ఆయన తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణా, ఎమ్మార్పీకి మద్యం విక్రయాలు తదితర అంశాలపై సీఐ లక్ష్మీదుర్గయ్యతో ఆరా తీశారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. మద్యం అక్రమ రవాణా కేసులలో పట్టుబడిన వాహనాలు త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు. కల్లు దుకాణల నుంచి శాంపిల్స్ సేకరించి చిత్తూరులోని ల్యాబ్కు పంపించాలన్నారు. కల్తీ కల్లు అరికట్టేలా అమ్మకందారులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, కల్తీ కల్లు విక్రయించేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, కర్ణాటక మద్యం అక్రమ రవాణాదారుల మీద కేసులు నమోదు చేసి, పాత నేరస్తులు, అనుమానితులను బైండోవర్ చేయాలని, రెండు అంతకుమించి కేసులు ఒక వ్యక్తి మీద నమోదైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని, ఎక్కువ కేసులు కలిగిన వారిని జిల్లా నుంచి బహిష్కరణకు సిఫారసు చేయాలని సూచించారు. అనంతరం మిథనాల్ యూనిట్లతో పాటు తూముకుంట చెక్ పోస్ట్ను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 2025లో నాటుసారాకు సంబంధించి 455 కేసులు నమోదు చేసి, 2,332 లీటర్ల నాటుసారా సీజ్ చేసినట్లు వివరించారు. 47,360 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు. కర్ణాటక మద్యానికి సంబందించి 1,253 కేసులు నమోదు చేసి, 1,284 మందిని అరెస్ట్ చేసి, 7,421 లీటర్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అనుమతులు లేకుండా కల్లు విక్రయాలు, కల్తీకల్లుకు సంబంధించి 1,886 కేసులు, కల్తీ కల్లుపై 4 కేసులు, కల్తీ కల్లు అమ్మిన 17 కల్లు దుకాణాల అనుమతులను రద్దు చేసినట్లు తెలిపారు. బెల్టు దుకాణాల నిర్వహణకకు సంబంధించి 1,.194 కేసులు నమోదు చేసి, 1,198 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య -
సన్మార్గదర్శి సత్యసాయి
ప్రశాంతి నిలయం: మానవాళికి మంచిని బోధించి సన్మార్గం వైపు నడిపిన మహనీయుడు సత్యసాయి అన్న సందేశాన్ని ఇస్తూ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శన భక్తులను మైమరపించింది. సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా ‘సన్మార్గ దర్శి.. సత్ చక్రవర్తి’ పేరుతో నాటిక ప్రదర్శించారు. ఆధునిక యువతలోని లోపాలను వాటి పరిష్కార మార్గంగా సత్యసాయి బోధనలను వివరిస్తూ గొప్ప సందేశం ఇచ్చారు. యువత సాయి బోధనల ద్వారా పటిష్ట నాయకత్వాన్ని పొంది ఉత్తమ పౌరులుగా తమను తాము ఏవిధంగా తీర్చిదిద్దుకోవచ్చో నాటిక ద్వారా వివరించారు. అనంతరం పాత్రధారులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
వైఫల్యాలను ఎండగడదాం
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూటమి పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కమిటీల ద్వారా టీడీపీ కుట్రలను తిప్పికొడదాం. గ్రామ స్థాయి నుంచి ఐకమత్యంగా ఉంటూ.. కమిటీల్లో చోటు సంపాదించిన వారందరూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్ద ఎండగట్టి వైఎస్సార్సీపీ బలోపేతానికి బాటలు వేయాలి. అక్రమ కేసులకు బెదరాల్సిన పని లేదు. – నరేశ్ కుమార్ రెడ్డి, వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంటు పరిశీలకుడు -
భవిష్యత్తు వైఎస్సార్సీపీదే
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా విభాగాల్లో కమిటీలు నియమించారు. అందులో 70 శాతం వరకు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది. మిగతా వాటిల్లో కూడా వీలైనంత తొందరగా నియామకాలు చేపట్టి డిజిటలైజేషన్ చేద్దాం. పార్టీ అధినేత సూచన మేరకు ఫిబ్రవరి 15 నాటికి కమిటీలు పూర్తి చేద్దాం. వైఎస్సార్సీపీ తరఫున పోరాటం చేస్తోన్న ప్రతి కార్యకర్తకు సభ్యత్వం చేయిద్దాం. పార్టీ తర ఫున బీమా సౌకర్యం ఉంటుంది. భవిష్యత్తు వైఎస్సార్సీపీదే. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉమ్మడి జిల్లాలో 14 స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ గెలవడం ఖాయం. –చల్లా మధుసూదన్రెడ్డి, వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ జోనల్ ఇన్చార్జ్ -
పోక్సో కేసులో ‘అనంత’ వాసికి రిమాండ్
బత్తలపల్లి: మండలంలోని ఓ గ్రామంలో గత ఏడాది నవంబర్ 15న ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసగించిన కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ధర్మవరం రూరల్ సీఐ ప్రభాకర్ తెలిపారు. వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. ప్రేమ పేరుతో మోసగించిన బాలికను యువకుడితో పాటు యువకుడి తండ్రి, ఆశ్రయం ఇచ్చిన మరో నిందితునిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే యువకుడితో పాటు అతని తండ్రిని అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపామన్నారు. ఆశ్రయం ఇచ్చిన అనంతపురంలోని కేకేపల్లి కాలనీకి చెందిన ఈడిగ ప్రదీప్కుమార్ను ఆదివారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు వివరించారు. వ్యక్తి బలవన్మరణం బత్తలపల్లి: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం ఉప్పర్లపల్లిలో నివాసముంటున్న కూరే ముత్యాలు(49) భార్య ఆర్థిక ఇబ్బందులు తాళలేక రెండు నెలల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో మనోవేదనకు లోనైన ముత్యాలు ఆదివారం తన పొలం వద్ద కానుగ చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు సంజీవరాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రెండిళ్లలో చోరీ చెన్నేకొత్తపల్లి: మండల కేంద్రంలో శనివారం రాత్రి రెండిళ్లలో చోరీ జరిగింది. గ్రామ సర్పంచ్ఽ ధనుశ్రీ అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని చూసేందుకు ఇంటికి తాళం వేసి కొత్తచెరువుకు వెళ్లారు. గుర్తించిన దుండగులు శనివారం రాత్రి తాళాన్ని బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించి, 6 తులాల బంగారు, 45 తులాల వెండి సామగ్రి అపహరించారు. అనంతరం వెంకటాంపల్లి రోడ్డు లో నివాసముంటున్న మోహన్ ఇంటికి సైతం తాళం వేసిన విషయాన్ని గుర్తించి బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించి రూ.5,800 నగదు అపహరించారు. మోహన్ తన ఇంటికి తాళం వేసి పక్కనే ఉన్న మరో ఇంట్లో నిద్రించిన సమయంలో అతని ఇంట్లో చోరీ జరిగింది. ఆదివారం ఉదయం చోరీలను గుర్తించిన బాధితుల సమాచారంతో పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి వేలిముద్రలను సేకరించారు. యువతి ఆత్మహత్యఎన్పీకుంట: మండలంలోని మండెంవారిపల్లికి చెందిన ఉషారాణి (20) ఆత్మహత్య చేసుకుంది. కడుపునొప్పి తాళలేక శనివారం రాత్రి విషపూరిత ద్రావకం తాగడంతో గమనించిన తల్లిదండ్రులు వెంటనే కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి శేఖరనాయుడు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ పి.కృష్ణమూర్తి తెలిపారు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
హిందూపురం/చిలమత్తూరు: అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున లేపాక్షి మండలం తిలక్నగర్లో 120 మంది పోలీసు సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్లు, రికార్డులు లేని 60 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను సీజ్ చేశారు. అనంతరం గ్రామసభ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ రౌడీ షీటర్లు, పాత నేరస్తులలో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరి నడవడికపై డేగకన్నుతో పరిశీలిస్తుంటామన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు కావడం, రైల్వేట్రాక్, జాతీయ రహదారి సమీపంలో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం నేరస్తులకు అనుకూలంగా మారే అవకాశం ఉందని, అందుకే ఇక్కడ ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. నైట్విజన్ డ్రోన్, సీసీ కెమెరాల నిఘా మరింత పెంచుతామన్నారు. రాజకీయ, కులాల పేరుతో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండాలని హితవు పలికారు. వాహనాలు కొనుగోలు చేసే ముందు పక్కాగా అన్ని రికార్డులు పరిశీలించుకోవాని సూచించారు. ఓ హత్య కేసులో నిందితులకు ఎస్పీ కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం చిలమత్తూరు పోలీసుస్టేషన్ను ఆయన పరిశీలించారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. కార్యక్రమంలో హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్, సీఐలు జనార్ధన్, రాజగోపాల్ నాయుడు, కరీం, రాజ్కుమార్ పాల్గొన్నారు. ఎస్పీ సతీష్ కుమార్ -
వైఎస్సార్టీఏ క్యాలెండర్లు, డైరీల ఆవిష్కరణ
పుట్టపర్తి టౌన్: వైఎస్సార్టీఏ క్యాలెండర్లు, డైరీలను వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ మిథున్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్, ప్రొద్దూటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, పార్టీ ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు ఆదివారం ఆవిష్కరించారు. పుట్టపర్తిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, వైఎస్సార్టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్, జిల్లా అధ్యక్షుడు పి.వి.రమణారెడ్డి, నాయకులు భాస్కర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ప్రతాప్రెడ్డి, శ్రీనాథ్రెడ్డి, జమీర్, హర్షవర్దన్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, మహమ్మద్అలి, కేశప్ప, శంకర్నాయక్, ప్రకాష్రెడ్డి, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులకు భయపడొద్దు
మన బలగం పెరగాలి. కష్టకాలంలో జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ న్యాయం జరుగుతుందని జగన్ భరోసా ఇచ్చారు. కమిటీలో సభ్యత్వం తీసుకుని డిజిటలైజేషన్ చేయించుకుంటే అమరావతిలోని మన పార్టీ కార్యాలయంలో బటన్ నొక్కినా వివరాలు కనిపిస్తాయి. వచ్చేది జగన్ ప్రభుత్వమే. జగన్ 2.0లో కష్టకాలంలో వెంట నడిచిన ప్రతి కార్యకర్తకూ పదవి ఖాయం. జగన్ మాట తప్పని మనిషి అనే విషయం అందరికీ తెలిసిందే. మూడు పార్టీలు కలిసి వచ్చి.. అబద్ధపు హామీలు గుప్పించి దొంగ దెబ్బ కొట్టారు. వచ్చే ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో మెజారిటీ సీట్లు సాధిద్దాం. జగన్ పేరు వింటే మూడు పార్టీల నాయకులకు నిద్ర పట్టదు. అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దు. జగన్ ప్రభుత్వం రాగానే కేసులన్నీ కొట్టిపారేస్తాం. – రాచమల్లు శివప్రసాద్రెడ్డి, వైఎస్సార్ సీపీ టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు -
పోరాట యోధుడు వడ్డె ఓబన్న
పుట్టపర్తి టౌన్: వడ్డె ఓబన్న పోరాట యోధుడని వైఎస్సార్సీపీ రాయలసీమ రీజినల్ కో ఆర్డినేటర్, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి కొనియాడారు. ఆదివారం వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా పుట్టపర్తి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద మిథున్ రెడ్డి ఘన నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్డె ఓబన్న ఓ కులానికో, ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అలుపెరగకుండా పోరాడి అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆయన త్యాగం భావితరాలకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీధర్రెడ్డి, శంకర నారాయణ, పార్టీ సమన్వయకర్తలు దీపిక, మక్బూల్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా వడ్డె ఓబన్న జయంతి ప్రశాంతినిలయం: స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలు ఆదివారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. జేసీ మౌర్య భరద్వాజ్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి తదితరులు వడ్డె ఓబన్న చిత్రపటానికి నివాళులర్పించారు. జేసీ మాట్లాడుతూ వడ్డె ఓబన్న దేశభక్తి భావితరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఆయన జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్రరెడ్డి తదితరులున్నారు. -
రెచ్చిపోయిన బీజేపీ నాయకులు
ధర్మవరం: బీజేపీ నాయకులు రెచ్చిపోయారు. పూటుగా మద్యం సేవించి వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి చేశారు. పట్టణంలోని టూ టౌన్ పోలీస్స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... ఆదివారం ఉదయం టూ టౌన్ పోలీస్స్టేషన్ సమీపంలోని ఓ చికెన్ సెంటర్ వద్ద చికెన్ కొనేందుకు వైఎస్సార్సీపీ నాయకుడు రెడ్డివారి రాజశేఖర్రెడ్డి వెళ్లాడు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో అక్కడకు చేరుకున్న బీజేపీ నాయకులు కాటమయ్య, డేరంగుల నారాయణస్వామిలు రాజశేఖర్ రెడ్డితో గొడవకు దిగారు. సోషల్ మీడియాలో బీజేపీ నాయకులు పెడుతున్న అసభ్యకర పోస్టులను ఖండిస్తావా అంటూ దాడికి దిగారు. పిడిగుద్దులు గుద్దారు. స్థానికులు వారి నుంచి రాజశేఖర్రెడ్డిని విడిపించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ విషయంపై టూ టౌన్ పోలీస్స్టేషన్లో రాజశేఖర్రెడ్డి ఫిర్యాదు చేశాడు. పూటుగా మద్యం సేవించి వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి -
కష్టపడే వారందరికీ గుర్తింపు
రానున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. మన జగనన్న మరోసారి సీఎం కావడం ఖాయం. అప్పటి వరకు పార్టీ బాధ్యతను ప్రతి ఒక్కరూ భుజాన వేసుకుని మోయాలి. కష్టపడిన ప్రతి ఒక్కరికీ పార్టీలో గుర్తింపు ఉంటుంది. కార్యకర్తల శ్రమ వృథా కాదు. జిల్లా స్థాయి నుంచి గ్రామ/వార్డు స్థాయి వరకు కమిటీలన్నీ త్వరలోనే పూర్తి చేస్తాం. జగనన్న 2.0 కోసం కష్టపడే వారందరికీ కమిటీల్లో చోటు ఉంటుంది. కూటమి పార్టీల కుట్రలకు ఎవరూ బెదరొద్దు. – కేవీ ఉషశ్రీచరణ్, వైఎస్సార్ సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు -
నికర జలాల సాధనే అంతిమ లక్ష్యం
కరువు పీడిత అనంతపురం జిల్లాకు తాగు, సాగు నీరు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న పాలకుల వైఖరిపై మేధావులు కన్నెర్ర చేశారు. రాయలసీమ నుంచి కరువును శాశ్వతంగా పారదోలేందుకు ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. ఇందుకు రాయలసీమ జన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు మేధావులు పాల్గొని మద్దతు తెలిపారు. అనారోగ్యం కారణంగానే ఆత్మహత్య హిందూపురం: స్థానిక కొట్నూరు సమీపంలోని రైల్వే బ్రిడ్జికి ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. పెనుకొండలోని కళాశాలలో డిగ్రీ చదువుతున్న భరత్(25) ఫిట్స్తో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకున్నా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో ఊటకూరులోని బంధువుల ఇంటికి వచ్చిన భరత్... శనివారం మధ్యాహ్నం రైల్వే బ్రిడ్జికి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ముత్యాలప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతపురం: రాయలసీమ జిల్లాల నుంచి కరువును శాశ్వతంగా పారదోలాలంటే నికర జలాల సాధనే అంతిమ లక్ష్యంగా ప్రజా ఉద్యమాలు చేపట్టడం ఒక్కటే మార్గమని మాజీ మంత్రి, రాయలసీమ జన సంఘం అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. రాయలసీమ జన సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలోని ప్రెస్క్లబ్లో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ వీరభద్రయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాదా గాంధీ, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి సురేష్, రాయలసీమ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఎం. వెంకటేశులు, న్యూడెమోక్రసీ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ఎస్యూసీఐ వ్యవస్థాపకుడు ఆంజనేయులు, వేమన, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ.. రాయలసీమలోని ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు, తెలుగుగంగకు 40 టీఎంసీలు, కేసీ కెనాల్కు 10 టీఎంసీలు, చైన్నె తాగునీటికి 15 టీఎంసీలు, గాలేరు–నగరికి 38 టీఎంసీలు, సోమశిలకు 78 టీఎంసీలు, కండలేరుకు 68 టీఎంసీల చొప్పున నీరు అవసరమవుతోందన్నారు. ఈ ప్రాజెక్ట్లకు శ్రీ శైలం జలాశయంలో 880 అడుగుల నీటి మట్టం ఉంటే తప్ప నీరు అందని పరిస్థితి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఒక్కటే సీమ సాగునీటి అవసరాలు తీర్చలేదని గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం జలాశయంలో 800 అడుగులకు నీటి మట్టం చేరుకోగానే ఫోర్షోర్ నుంచే రోజుకు మూడు టీఎంసీల చొప్పున నీటిని ఎత్తి పోసుకునేందుకు వీలుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టారని వివరించారు. ప్రభుత్వం మారిన తర్వాత తెలంగాణ ఒత్తిళ్లకు సీఎం చంద్రబాబు తలొగ్గి ఎత్తిపోతల పథకం పనులు ఆపేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా దిండి, పాలమూరు– రంగారెడ్డి పథకాలను చేపట్టి 100 టీఎంసీల కృష్ణా నీటిని తరలించుకెళుతోందని, అలాగే కల్వకుర్తిలో 25 టీఎంసీలకు గాను 50 టీఎంసీల నీటిని అక్కడి పాలకులు తోడేస్తున్నారని, కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్ట్ల నిర్మాణాలు చేపట్టడంతో ఇంతకు మునుపు ఉన్న 60 వరద రోజులు ప్రస్తుతం 30కి పడిపోయాయని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ జిల్లాల నుంచి కరువును శాశ్వతంగా పారదోలాలంటే నికర జలాల సాధన ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ఇందుకు పార్టీలకు అతీతంగా ప్రజా ఉద్యమాన్ని చేపడదామని పిలుపునిచ్చారు. అభివృద్ధి అక్కడ... ఆర్థిక భారం ఇక్కడ చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలకు అనాదిగా రాయలసీమ ప్రాంతం బలవుతూ వస్తోందని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతానికి కేటాయించిన ఎయిమ్స్, హైకోర్టును అమరావతికి తరలించుకెళ్లారన్నారు. అమరావతిలో ఎకరం భూమి అభివృద్ధికి రూ. 2 కోట్లు చొప్పున 50 వేల ఎకరాలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. భూ సమీకరణ ఇతర ఖర్చులు కలుపుకుని మొత్తం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. వీటికి సంబంధించి ఏటా రూ.16 వేల కోట్లు వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తోందన్నారు. ఈ భారాన్ని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు భరించాలని ప్రశ్నించారు. ఇదే ప్రశ్న ప్రస్తుతం రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసుల్లో వ్యక్తమవుతోందన్నారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి సురేష్ మాట్లాడుతూ.. రాయలసీమకు నీళ్లు రావడం కోసం చేపట్టే రాయలసీమ ఉద్యమానికి రచయితలు, కళాకారులు వెన్నంటే ఉంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత దాదా గాంధీ మాట్లాడుతూ.. రాయలసీమ పరిరక్షణకు పార్టీలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. చంద్రబాబు, రేవంత్రెడ్డి రహస్య ఒప్పందాలతో తమకు పనిలేదని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను పూర్తి చేసేలా ఉద్యమాన్ని ఏకతాటిపై నడిపిస్తామని అన్నారు. రాయలసీమ జన సంఘం అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ పిలుపు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి శాశ్వతంగా కరువును తరిమేయాలి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు యథాతథంగా కొనసాగాలి సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు రాయలసీమ విస్తీర్ణం ప్రకారం 666 టీఎంసీల నికర జలాలు రావాలి. కానీ, ప్రస్తుతం కేవలం 140 టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను పూర్తి చేసి 80 టీఎంసీలు అదనంగా ఇవ్వాలి. హంద్రీ–నీవా సుజల స్రవంతి, జీఎన్ఎస్ఎస్, వెలిగొండ ప్రాజెక్ట్లను జాతీయ ప్రాజెక్ట్లుగా ప్రకటించాలి. వాటికి నికర జలాలు కేటాయించాలి. పంట కాలువలు తీసి పొలాలకు నీళ్లు అందించాలి. పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ప్రజా చైతన్యం తీసుకురావాలి. రాయలసీమ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి నింపాలి. -
ప్రయాణం.. ప్రాణ సంకటం
బత్తలపల్లి: రహదారుల నిర్వహణపై ఎన్హెచ్ అధికారులు చూపుతున్న అంతులేని అలసత్వం సామాన్యుల ప్రాణాల మీదికొస్తోంది. తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రహదారిపైకి వచ్చాక గమ్యం చేరే వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందంటే అతిశయోక్తి కాదు. అధ్వానంగా జాతీయ రహదారి.. బత్తలపల్లి నుంచి అనంతపురం వరకు జాతీయ రహదారి అధ్వానంగా మారింది. రహదారికి ఇరువైపులే కాకుండా డివైడర్ వద్ద కూడా ముళ్ల చెట్లు ఏపుగా పెరిగాయి. ఈ రహదారి గుండా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బత్తలపల్లి నుంచి అనంతపురం నగరానికి వివిధ పనుల నిమిత్తం మండలంలోని పలు గ్రామాల వారు ద్విచక్రవాహనాల్లో వెళ్తుంటారు. ముళ్ల పొదల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కానరాకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించుకునేందుకు ద్విచక్రవాహన చోదకులు పక్కకు వెళ్తే ముళ్ల చెట్లు గీసుకుపోతుండడంతో అవస్థలు చెప్పనలవిగా మారాయి. రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలతో పాదచారులకు కూడా ఇబ్బందికరంగా ఉంటోంది. ప్రతి సంవత్సరం రోడ్డు మార్జిన్లలో జంగిల్ క్లియరెన్స్ పేరుతో తుప్పలు, పిచ్చిమొక్కలు తొలగించేవారని, ఈ ఏడాది అడవిలా పెరిగిపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత నేషనల్ హైవే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధ్వానంగా జాతీయ రహదారి ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు డివైడర్ మధ్యలోనూ ముళ్ల చెట్లు సామాన్యులకు శాపంగా ఎన్హెచ్ అధికారుల అలసత్వం -
తప్పక న్యాయం జరుగుతుంది
రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయి నుంచి వైఎస్సార్సీపీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పార్టీ కమిటీల్లో చేరి బలోపేతం కోసం కృషి చేయండి. జగన్ వెంట నడిచిన వారికి తప్పక న్యాయం జరుగుతుంది. అధినేత సూచన మేరకు అన్ని విభాగాల అనుబంధ కమిటీలను పూర్తి చేస్తాం. గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరు కమిటీలకు సహకరించాలి. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు -
గాలిపటం ఎగురవేస్తూ...
రాయదుర్గం టౌన్: గాలిపటం ఎగురవేస్తూ అదుపు తప్పి మిద్దైపె నుంచి ఓ బాలుడు కిందపడ్డాడు. రాయదుర్గంలోని కోట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాఘవేంద్ర స్వామి గుడి వద్ద నివాసముంటున్న పాలయ్య కుమారుడు ఉపేంద్ర.. జిల్లా సరిహద్దులోని కర్నాటకలో ఉన్న మొలకాల్మూరులో 6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం 11 గంటల సమయంలో గాలిపటం ఎగురవేసేందుకు ఇంటిపైకి చేరుకున్నాడు. ఈ క్రమంలో గాలిపటం ఎగురవేస్తూ మిద్దె చివరి ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని వెంటనే రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం 108 అంబులెన్స్లో బళ్లారిలోని విమ్స్కు తరలించారు. కాగా, బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి శెట్టిపి ధర్మవరం అర్బన్: యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ధర్మవరం పట్టణానికి చెందిన శెట్టిపి జయచంద్రారెడ్డి వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ నెల 10, 11 తేదీల్లో గుంటూరులో జరిగిన 51వ యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆయన ఎంపిక లాంఛనంగా జరిగింది. ఆయన ఎంపికపై యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్, కార్యదర్శి అమర్నారాయణరెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వరకుమారి, మహిళా విభాగం జిల్లా కార్యదర్శి నాగేంద్రమ్మ, పట్టణ నాయకులు జింకా హరికృష్ణ, రామాంజనేయులు, ఆంజనేయులు, వెంకట కిషోర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఇంటిపై దాడి కేసులో ఐదుగురి అరెస్ట్బత్తలపల్లి: యువకుడి ఇంటిపై చోటు చేసుకున్న దాడికి సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు బత్తలపల్లి పీఎస్ ఎస్ఐన సోమశేఖర్ తెలిపారు. వివరాలను ఆదివారం ఆయన వెల్లడించారు. గత ఏడాది నవంబర్ 15న రాత్రి దంపెట్ల గ్రామంలో ఓ యువతిని అపహరించుకుని వెళ్లాడంటూ యువతి తండ్రి, కుటుంబసభ్యులు సదరు యువకుడి ఇంటిపై దాడి చేశారు. బాధిత యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నిందితులు మల్లెల ఆదినారాయణ, మల్లెల హరిదాసు, మల్లెల మోహన్, మైత్రి, అనితను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతిచెన్నేకొత్తపల్లి: జీవితంపై విరక్తితో మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు.. సీకే పల్లి మండలం బసినేపల్లి గ్రామానికి చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి సుబ్బరాయుడు(75) పదేళ్లుగా గ్యాంగ్రీన్తో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆయన మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు బెంగళూరులోని ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆయన మృతిచెందాడు. -
ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు
పుట్టపర్తి అర్బన్: మండలంలోని పెడపల్లి వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పైపల్లి గ్రామం నుంచి పెడపల్లికి ఆదివారం టీవీఎస్ వాహనంపై వెళుతున్న వృద్ధుడు లక్ష్మయ్యను పుట్టపర్తి నుంచి కియా కంపెనీలో విధులకు వెళుతున్న పుట్టపర్తికి చెందిన యువకులు పల్సర్ బైకుతో ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రులు హరి, కృష్ణ, అజయ్కుమార్ను సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించింది. వృద్ధుడిని కుటుంబ సభ్యులు ఆటోలో అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువకుల్లో ఇద్దరికి తలకు, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మయ్యకు కాళ్లు, తలకు గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటనపై పుట్టపర్తి రూరల్ ఎస్ఐ క్రాంతి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదాలపై గ్రామస్తుల ధర్నా 342వ జాతీయ రహదారి నిర్మాణంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించక పోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక యువకులు గంట పాటు పెడపల్లి వద్ద జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. రోడ్డుకు అడ్డుగా మొద్దులు, రాళ్లు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కొన్ని రోజుల్లోనే ఐదు ప్రమాదాలు చోట చేసుకుని పలువురు గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పెడపల్లి నుంచి పెనుకొండ వరకూ సుమారు 20 గ్రామాలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో అండర్ పాస్ బ్రిడ్జి లేదా ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. -
భళా.. బాలకా
ప్రశాంతినిలయం: భారతీయ సనాతన సంస్కృతిని ప్రతిబింబిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాహస విన్యాసాలు భళా అనిపించాయి. ఆదివారం పుట్టపర్తిలోని సత్యసాయి హిల్వ్యూ స్టేడియంలో సత్యసాయి విద్యాసంస్థల సాంస్కృతిక క్రీడా సమ్మేళనం–2026 అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రశాంతి నిలయం నుంచి సత్యసాయి చిత్రపటాన్ని పండితుల వేద పఠనం, విద్యార్థుల బ్రాస్ బ్యాండ్ వాయిద్యం నడుమ హిల్వ్యూ స్టేడియంలోని శాంతివేదిక వద్దకు తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప విద్యార్థుల మార్చ్ఫాస్ట్తో వేడుకలను ప్రారంభించారు. విద్యా సంస్థల వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రాఘవేంద్ర ప్రసాద్ క్రీడా ప్రతిజ్ఞ అనంతరం జ్యోతిని వెలిగించి సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతపురం సత్యసాయి విద్యాసంస్థల క్యాంపస్, సత్యసాయి వైద్య సంస్థల అనుబంధ విభాగాల విద్యార్థులు, ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు ప్రదర్శించిన సాహస విన్యాసాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.జిమ్నాస్టిక్స్,భంగీజంప్, సైక్లింగ్, బైక్ రైడింగ్, కత్తి సాము, కర్ర సాము, యోగా, పాశ్చాత్య నృత్య ప్రదర్శనలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. పతంగుల నృత్య ప్రదర్శన, రోప్ వే విన్యాసాలు, అర్ధ నారీశ్వర ప్రదర్శనతో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఘనంగా చాటారు. ● సాయంత్రం వేడుకల్లో భాగంగా ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల విద్యార్థులు, సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్, ప్రశాంతి నిలయం, బృందావన్, నందగిరి క్యాంపస్ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి, ట్రస్ట్ సభ్యులు నాగానంద, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంబరాన్నంటిన సత్యసాయి సాంస్కృతిక క్రీడా సంబరం సాహస కృత్యాలతో ప్రేక్షకులను అబ్బుర పరచిన విద్యార్థులు -
రేనాటి యోధుడు వడ్డే ఓబన్న
అనంతపురం ఎడ్యుకేషన్: బ్రిటీష్ పాలనకు ఎదురొడ్డి ప్రజల హక్కుల కోసం పోరాడిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కొనియాడారు. వడ్డే ఓబన్న జయంతి రాష్ట్రస్థాయి వేడుకలు ఆదివారం అనంతపురంలోని లలిత కళా పరిషత్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సవిత మాట్లాడుతూ విద్యతోనే బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి చేరతారన్నారు. తొలి స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే బ్రిటీషర్ల దాష్టీకాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన యోధుడు వడ్డే ఓబన్న అని గుర్తు చేశారు. బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ వడ్డే ఓబన్న తొలితరం స్వాతంత్య్ర సమర యోధుడన్నారు. ఆయన త్యాగాలు, కృషిని గుర్తించి జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. వడ్డెర్లు ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి వేడుకలు జిల్లాలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి మాట్లాడుతూ వడ్లెర్ల యుగ పురుషుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు మాట్లాడుతూ ఓబన్నను స్ఫూర్తిగా తీసుకుందామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పూల నాగరాజు, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఆర్ఓ రామ్మోహన్, అహుడా సెక్రటరీ రామకృష్ణారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖుష్బూ కొఠారి, బీసీ కార్పొరేషన్ ఈడీరామసుబ్బారెడ్డి, వడ్డెర ప్రముఖులు దేవళ్ల మురళి, వడ్డే అంజనప్ప, మల్లెల జయరాం, వడ్డెర సంఘ ప్రతినిధులు, బీసీ కులాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విద్యతోనే బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి -
రీ సర్వేలో లోటుపాట్లను సరిదిద్దాలి
నల్లమాడ: భూముల రీ సర్వేలో ఏవైనా తప్పొప్పులు దొర్లి ఉంటే పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ముందే సరిదిద్దాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. శనివారం మండలంలోని వంకరకుంటలో జరిగిన రీ సర్వే గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గోపేపల్లి గ్రామంలో పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా... అంటూ ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, తహసీల్దార్ మనోజ్ కుమార్, వీఆర్ఓలు పాల్గొన్నారు. డిప్యూటీ తహసీల్దార్లకు పోస్టింగ్ అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖలో ఇటీవల డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి పొందిన 16 మందికి పోస్టింగ్ ఇస్తూ అనంతపురం ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. యు.రమాదేవి (జిల్లా కలెక్టరేట్లోని భూ సంస్కరణల విభాగం), కె.సుశీల (కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం), జి.రమాదేవి (సీపీడీటీ, డి.హీరేహాళ్), బి.షేక్షావలి (ఎంఎల్ఎస్ పాయింట్, ఉరవకొండ ), జె.కేశవరెడ్డి (సీఎస్డీటీ, వజ్రకరూరు), జి.బేబీసురేఖ (సీపీడీటీ, డి.హీరేహాళ్), పి.లక్ష్మికాంత్నాయక్ (ఈడీటీ, గుంతకల్లు), యు.ఆదినారాయణ (ఎంఎల్ఎస్ పాయింట్, గుత్తి), ఎస్.రఘు (డీటీ, బొమ్మనహాళ్), కె.నాగమణి (ఈడీటీ, అనంతపురం అర్బన్), జి.చాంద్బాషా (జేసీ క్యాంపు కార్యాలయం), ఏఎస్ ముక్తియార్ (ఎంఎల్ఎస్ పాయింట్, ఆత్మకూరు) పోస్టింగ్ దక్కించుకున్నారు. అలాగే కె.మహబూబ్బాషా, ఎస్.గణేష్బాబు, పీసీ కుళ్లాయప్ప, కేఆర్ చంద్రశేఖర్లను శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించారు. జిల్లావ్యాప్తంగా వర్షం పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా తుంపర వర్షం కురుస్తోంది. శనివారం సాయంత్రం నుంచి గోరంట్ల, పుట్టపర్తి, ఓడీసీ, కొత్తచెరువు తదితర మండలాలతో పాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మరో రెండు రోజులు జిల్లా వ్యాప్తంగా జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సంక్రాంతిని ప్రశాంతంగా జరుపుకోండి పుట్టపర్తి టౌన్: సంక్రాంతిని ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ సతీష్కుమార్ ప్రజలకు సూచించారు. పండుగ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పండుగను జరుపుకునేందుకు వేలాది మంది స్వగ్రామాలకు వస్తుండటం వల్ల అంతర్రాష్ట్ర రహదారులపై వాహనాల రద్దీ పెరిగిందన్నారు. ప్రజల భద్రత, వాహనాలు రాకపోకలు సాఫీగా సాగేందుకు సరిహద్దు పోలీసు స్టేషన్లలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా ఉంచామన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. వాహనదారులు ఏ సమయంలోనైనా ఎలాంటి అవసరమున్నా పోలీస్ శాఖను సంప్రదించాలన్నారు. అలాగే గ్రామాల్లో ఘర్షణలు చెలరేగితే 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ‘పుట్బాల్’ విన్నర్స్ నర్మదా వ్యాలీ ఎఫ్సీ అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ ఇన్స్పైర్ ఫుట్బాల్ టోర్నీ విన్నర్స్గా నర్మదా వ్యాలీ ఎఫ్సీ జట్టు నిలిచింది. శనివారం అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో నర్మదా వ్యాలీ ఎఫ్సీ, మగన్ సింగ్ రాజీవ్ ఎఫ్సీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. నర్మదా వ్యాలీ 2–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అండర్–20 ఉమెన్స్ ఇండియా జట్టు కోచ్ జోయాకిమ్ అలెగ్జాండర్సన్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఫుట్బాల్ క్రీడాభివృద్ధికి మరిన్ని టోర్నీలను నిర్వహిస్తామని ఆర్డీటీ ఉమెన్స్ డైరెక్టర్ విశా ఫెర్రర్ పేర్కొన్నారు. -
12 నుంచి అండర్ –12 మండల క్రికెట్ టోర్నీ
ఖాద్రీశా కరుణించు కదిరి టౌన్: ఓం నమో నారసింహ నామస్మరణతో ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రతిధ్వనించింది. స్వామి దర్శనం కోసం పోటెత్తిన భక్త జనంతో శనివారం ఆలయం కిటకిటలాడింది. ఆలయంలో ఖాద్రీశుని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యం పొందారు. భక్తులకు ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలు అందజేసి అన్నదానం చేశారు. అనంతపురం కార్పొరేషన్: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు అండర్ –12 మండల క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ, గుత్తి, తాడిపత్రి, ఆత్మకూరు, హిందూపురం, ధర్మవరంలో 30 జట్లు బరిలో దిగనున్నాయని, 25 ఓవర్ల మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
రెవెన్యూ ‘కుదేలు’
అనంతపురం అర్బన్: తహసీల్దార్ల కొరతతో రెవెన్యూ శాఖ కుదేలవుతోంది. మండల స్థాయిలో రెవెన్యూ శాఖ కీలకభూమిక పోషిస్తుంది. అయితే చాలా మండలాల్లో తహసీల్దార్లు లేక ఇన్చార్జ్లతో పాలన నెట్టుకొస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మండలాల్లో ఏకంగా 27 చోట్ల ఇన్చార్జ్ల పాలన సాగుతోంది. అనంతపురం జిల్లాలో ఎనిమిది మండలాల్లో, శ్రీసత్యసాయి జిల్లాలో 19 మండలాల్లో తహసీల్దార్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా అనంతపురం, పెనుకొండ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో పరిపాలనాధికారి (ఏఓ) స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మంత్రుల నియోజకవర్గాల్లో... రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని కూడేరు, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో ఇన్చార్జ్ల పాలన సాగుతోంది. అదే విధంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ నియోకవర్గం పరిధిలోని పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లోనూ ఇన్చార్జ్ల పాలన నడుస్తోంది పెనుకొండ ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి స్థానం కూడా ఖాళీగా ఉంది. అడహాక్ పదోన్నతులకు బ్రేక్.. పరిపాలనా సౌలభ్యం కోసం తహసీల్దార్లుగా పదోన్నతి జాబితాలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్లకు అడహాక్ పదోన్నతి కల్పించడం సర్వసాధారణం. గతంలో ఇలా డీటీలకు అడహాక్ పదోన్నతి కల్పించి మండలాలకు పోస్టింగ్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్లకు అడహాక్ పదోన్నతి కల్పించే అంశానికి ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఈ మేరకు సీసీఎల్ఏ ఆదేశాలివ్వడంతో కలెక్టర్ల చేతులు కట్టేసినట్లయ్యింది. ఇన్చార్జ్ల రూటే సప‘రేటు’.. ఇన్చార్జ్ తహసీల్దార్ పాలన సాగుతున్న మండలాల్లో కొన్నిచోట్ల అక్కడి ఇన్చార్జ్లు మా రూటే సప‘రేటు’ అంటూ తమదైన శైలిలో పాలన సాగిస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినవస్తున్నాయి. ఇలాంటి చోట కాసులు కొడితే కానీ పనులు జరగని పరిస్థితి నెలకొన్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని మండలాల్లో చోటు చేసుకుంటున్న అవినీతి, అక్కడి ఇన్చార్జ్లు, సిబ్బందిపై కలెక్టర్కు పలు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో 27 మండలాల్లో ఇన్చార్జ్ల పాలన డివిజన్ కేంద్రాల్లో రెండు ఏఓ స్థానాలూ ఖాళీనే అడహాక్ పదోన్నతుల కల్పనకు సర్కారు బ్రేక్ తహసీల్దార్లు లేరిక్కడ అనంతపురం జిల్లా: కూడేరు, విడపనకల్లు, వజ్రకరూరు, నార్పల, పుట్లూరు, తాడిపత్రి, యల్లనూరు, అనంతపురం అర్బన్ తహసీల్దార్లతో పాటు అనంతపురం ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి పోస్టు ఖాళీగా ఉంది. ఇక ఉరవకొండ, రాయదుర్గం తహసీల్దార్లు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందారు. వీరికి పోస్టింగ్ వస్తే ఈ రెండు చోట్ల ఖాళీ ఏర్పడుతుంది. శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరం, తాడిమర్రి, ముదిగుబ్బ, రామగిరి, కనగానపల్లి, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, ఓడీ చెరువు, పెనుకొండ, సోమందేపల్లి, ఎన్పీకుంట, గాండ్లపెంట, నల్లచెరువు, తలుపుల, మడకశిర, అమరాపురం, రొళ్ల, అగళి తహసీల్దార్లతో పాటు పెనుకొండ ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి పోస్టు ఖాళీగా ఉంది. -
నకిలీ పోలీస్ అరెస్ట్
తనకల్లు: పోలీసునంటూ రైలు ప్రయాణికులను బెదిరించి డబ్బులను వసూలు చేస్తున్న వ్యక్తిని తనకల్లు రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.కదిరి రైల్వే పోలీస్స్టేషన్ ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం...తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలం బోడేవాండ్లపల్లికి చెందిన ఈరిశెట్టి శివశంకర్ పీలేరులో నివాసం ఉంటున్నాడు. గతంలో అతను చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో హోంగార్డుగా పనిచేసేవాడు. అయితే మద్యపానం, ఇతర ఆరోపణలతో ఉన్నతాధికారులు సర్వీసు నుంచి తొలగించారు. ఉద్యోగం కోల్పోయిన శివశంకర్... నకిలీ పోలీస్ అవతారం ఎత్తాడు. పోలీస్ యూనిఫాం ధరించి పాకాల– చిత్తూరు మధ్య తిరిగే ప్యాసింజర్ ట్రైన్లలో ప్రయాణిస్తూ టికెట్ లేని ప్రయాణికులను బెదిరించి డబ్బులను వసూలు చేసేవాడు. రెండు వారాల క్రితం మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి పాకాల సమీపంలో ప్రయాణికుల నుంచి రూ. 25 వేలు వసూలు చేశాడు. ఈ నెల 8వ తేదీన పీలేరు రైల్వేస్టేషన్లో శివశంకర్ పోలీస్ డ్రస్సులోనూ మిగిలిన ఇద్దరు వ్యక్తులు సివిల్ డ్రస్సులో రైలు ఎక్కారు. కలికిరి– మదనపల్లి మధ్య ప్రయాణిస్తున్న కదిరికి చెందిన కంపా నారాయణస్వామి వద్దకు వెళ్లి తాను పోలీసునని చెప్పి... అతన్ని బెదిరించి అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చెంపపై కొట్టి షర్ట్ జేబులో ఉన్న రూ.1,500 బలవంతంగా లాక్కున్నాడు. అనంతరం నారాయణస్వామిని రైలు నుంచి కిందికి తోసి వేస్తానని బెదిరించి మరో రూ. 550 తీసుకున్నాడు. దీంతో బాధితుడు నకిలీ పోలీస్పై కదిరి ఆర్పీఎఫ్లో ఫిర్యాదు చేశాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన ఈడిశెట్టి శివశంకర్ తనకల్లు రైల్వేస్టేషన్ వద్ద ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ బాలకృష్ణ, ఏఎస్ఐ శివారెడ్డి నిందుతున్ని అరెస్టు చేసి నకిలీ నేమ్ ప్లేట్తో ఉన్న పోలీస్ యూనిఫాం, రూ.2,050 స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. పోలీసునంటూ రైలులో ప్రయాణికుల నుంచి డబ్బుల వసూలు అరెస్టు చేసి రిమాండ్కు పంపిన రైల్వే పోలీసులు -
జాతిపిత మూలాలను చెరిపే కుట్ర
హిందూపురం టౌన్: జాతిపిత మహాత్మా గాంధీ మూలాలను చెరిపేసే కుట్ర సాగుతోందని డీసీసీ అధ్యక్షుడు షానవాజ్ విమర్శించారు. శనివారం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం 2005లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసి ప్రతిష్టాత్మకమైన ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజల మద్దతుతో తిప్పికొడతామన్నారు. కార్యక్రమంలో నాయకులు సమద్ షాహీన్, శ్యాంకిరణ్, జమీల్, కలీం, సమీవుల్లా, హనుమంతరాయప్ప, షఫీ, యూనిస్, జియా, ఫయాజ్, అసద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు షానవాజ్ -
చార్జింగ్ స్టేషన్ల బాధ్యత మున్సిపాలిటీలదే
మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ కోసం ఈ–ఆటోల టెండర్ ప్రక్రియలో సర్కారు వింతాట ఆడింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1,910 ఈ–ఆటోల సరఫరా, నిర్వహణకు నాలుగు కంపెనీలకు ఒకే ధరకు కాంట్రాక్టులు కట్టబెట్టింది. ఒక్కో వాహనానికి నెలకు రూ.68,949 చొప్పున చెల్లిస్తూ ఐదేళ్ల కాలపరిమితితో రూ.790 కోట్లకు పైగా వ్యయం అయ్యే ఒప్పందంపై విస్తృత చర్చ జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కో వాహనానికి రూ.64 వేలలోపు మాత్రమే అద్దె చెల్లించేవారు. మనుషులనూ సదరు కంపెనీలే ఏర్పాటు చేసుకునేవి. పైగా అవి డీజిల్ వాహనాలు. ప్రస్తుతం ఈ–వాహనాలు కావడంతో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలం కూడా నగర పాలక సంస్థలే చూపించాలి. కంపెనీలు కోట్ చేసిన ఒకే రేటు చూస్తుంటే టెండర్ ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం క్రైం: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలలో ఇంటింటి చెత్త సేకరణ కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ – అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో చెత్త తరలింపు వాహనాల (ఫోర్ వీలర్ ఈ–ఆటోలు) సరఫరా, నిర్వహణ టెండర్కు సంబంధించి గత ఏడాది నవంబరు 12న ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. టెండర్ కమిటీ పరిశీలన అనంతరం డిసెంబరు 11న ఆమోదం తెలపగా, 12న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేస్తూ ఎంప్యానల్మెంట్ను ఖరారు చేశారు. ఈ టెండర్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19,10,000 గృహాలు, వాణిజ్య సంస్థల నుంచి చెత్త సేకరణ చేయడానికి 1,910 ఈ–ఆటో వాహనాలు అవసరమని అంచనా వేశారు. అదనంగా రెండు శాతం స్టాండ్బై వాహనాలు కూడా ఉండాలని షరతు విధించారు. ఒక్కో ఈ–ఆటో రోజుకు కనీసం వెయ్యి ఇళ్ల నుంచి చెత్త సేకరణ, రోజుకు కనీసం 45 కిలోమీటర్లు, ఏడు గంటల ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలన్న నిబంధన పెట్టారు. వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్ మాత్రమే ఉండాలి. ఒక్క ఈ–ఆటోకు నెలకు చెల్లించాల్సిన కనీస ఎల్ వన్ రేటును రూ.68,949 (జీఎస్టీతో సహా)గా నిర్ణయించారు. ఈ లెక్కన ఒక్క వాహనానికి ఏడాదికి సుమారు రూ.8.27 లక్షలు ఖర్చు అవుతుంది. మొత్తం 1,910 వాహనాలకు ఏడాదికి రూ.158 కోట్లకు పైగా వ్యయం అవుతుంది. ఐదేళ్ల ఒప్పంద కాలానికి ఈ మొత్తం రూ.790 కోట్లకు మించి ఉంటుందని అంచనా వేశారు. దీనికి అదనంగా ప్రతి ఏడాది 5 శాతం ధర పెంపు (ఎస్కలేషన్)ను కూడా ఒప్పందంలో చేర్చారు. టెండర్లలో క్యూబ్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (హిమాలయన్ ఇన్ఫ్రాకార్ప్, ఐవే అసోసియేట్స్తో జాయింట్ వెంచర్), గణేష్ శంకర్ ఎన్విరాన్న్మెంటల్ సొల్యూషన్న్స్ ప్రైవేట్ లిమిటెడ్ (హాస్పర్ ప్రైవేట్ లిమిటెడ్తో జేవీ), లయన్స్ సెక్యూరిటీ గార్డ్స్ సర్వీసెస్ (ఉత్తరప్రదేశ్), సాయి పావని కన్స్ట్రక్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఆంధ్రప్రదేశ్) కంపెనీలు పోటీ పడ్డాయి. ఇందులో గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ నాలుగు కంపెనీలూ క్యూబ్ బయో ఎనర్జీ కోట్ చేసిన ఎల్వన్ రేటు రూ.68,949కే అంగీకరించాయి. అంటే ధర విషయంలో పోటీ లేకుండా ఒకే రేటుకు ఒప్పందాలు జరిగాయి. అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు ఎంప్యానెల్ చేసిన ఈ కంపెనీలతో మాత్రమే ఒప్పందాలు చేసుకోవాలి. ఇతర ఏజెన్సీలను నియమించే అవకాశం లేదు. వాహనాల కొనుగోలు, బ్యాంకు రుణాలు, డ్రైవర్లు, వాహనాల మెయింటెనెన్స్, రిపేర్లు, జీపీఎస్, సీసీ కెమెరాలు, జీఐఎస్ ఆధారిత మానిటరింగ్ సిస్టమ్స్ బాధ్యత కంపెనీలదే. ఈ–ఆటోల ద్వారా చెత్త సేకరణ టెండర్లలో సర్కారు వింతాట రూ.790 కోట్లు.. నాలుగు కంపెనీలు ఒకే ధరతో నాలుగు కంపెనీలతో ఒప్పందాలు మున్సిపాలిటీలపై తీవ్ర ఆర్థిక భారం ఈ–ఆటోల చార్జింగ్ స్టేషన్ల కోసం అవసరమైన భూమి, విద్యుత్ కనెక్షన్, ట్రాన్స్ఫార్మర్లను మున్సిపాలిటీలే ఏర్పాటు చేయాలి. నెలనెలా బిల్లులు మున్సిపల్ నిధుల నుంచే చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా వాహనాల కేటాయింపులో విజయవాడకు 158 ఈ–ఆటోలు, విశాఖపట్నంకు 96, గుంటూరుకు 200, నెల్లూరుకు 200, కర్నూలుకు 91, అనంతపురం నగరానికి 62, గుంతకల్లుకు 20, రాయదుర్గానికి 9, గుత్తికి 5, కళ్యాణదుర్గానికి 7.. ఇలా ప్రతి మున్సిపాలిటీకి గృహాల సంఖ్య ఆధారంగా కేటాయించారు. వీటిని 2026 జనవరి 31లోపు సరఫరా చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా చెత్త సేకరణ వ్యవస్థను దీర్ఘకాలం పాటు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం, ఒకే రేటుకు అన్ని కంపెనీలు ఒప్పుకోవడం, వ్యయం వందల కోట్లకు చేరడం, మున్సిపాలిటీలపై దీర్ఘకాలిక ఆర్థిక భారం పడటం వంటి అంశాలు ఇప్పుడు విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి. -
క్రీడా వికాసం..సాంస్కృతిక వైభవం
ప్రశాంతినిలయం: క్రీడా వికాసంతో పాటు సాంస్కృతిక వైభవాన్ని చాటే సత్యసాయి సంస్థల సాంస్కృతిక క్రీడా సమ్మేళనానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ప్రారంభమై రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు సత్యసాయి హిల్వ్యూ స్టేడియం ముస్తాబైంది. క్రీడా, సాంస్కృతిక సమ్మేళనం కోసం సత్యసాయి విద్యాసంస్థల పరిధిలోని ప్రశాంతినిలయం, అనంతపురం మహిళా క్యాంపస్, బృందావన్, నందగిరి క్యాంపస్ల విద్యార్థులు వారం రోజులుగా సాధన చేస్తున్నారు. మార్చ్ ఫాస్ట్, జిమ్నాస్టిక్స్, ఆధునిక సంప్రదాయ నృత్య ప్రదర్శన, చైనీస్ డ్రాగన్ నృత్యం తదితర అంశాలపై కఠోర సాధన చేస్తున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు విద్యార్థుల మార్చ్ ఫాస్ట్తో హిల్వ్యూ స్టేడియంలో క్రీడా సమ్మేళనం ప్రారంభమవుతుంది. అనంతపురం క్యాంపస్, సత్యసాయి నర్సింగ్ కళాశాల, ప్రశాంతి నిలయం క్యాంపస్, బృందావన్, నందగిరి క్యాంపస్ విద్యార్థుల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను ఉంటాయి. సాయంత్రం పుట్టపర్తిలోని ఈశ్వరమ్మ హైస్కూల్, సత్యసాయి హయ్యర్ సెకెండరీ స్కూల్, ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. క్రీడా సమ్మేళనానికి విద్యార్థులు, వారి తల్లితండ్రులు స్థానిక ప్రజలు, పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆ మేరకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ స్టేడియంలో ఏర్పాట్లు చేసింది. నేడు సత్యసాయి క్రీడా సాంస్కృతిక సమ్మేళనం సుందరంగా ముస్తాబైన హిల్వ్యూ స్టేడియం -
తండాలకు కరెంటు కట్
కదిరి అర్బన్: సంక్రాంతికి స్వగ్రామాలకు వచ్చే వారితో పల్లెలన్నీ కళకళలాడుతుంటే గిరిజనులు ఉండే తండాల్లో చంద్రబాబు సర్కార్ అంధకారం నింపింది. కేవలం కనెక్షన్ తీసుకోలేదన్న కారణంతో మండల పరిధిలోని చిగురుమానుతండా, నల్లగుట్టతండా, చవిటితండాలకు శనివారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేసింది. మీటర్లు బిగించుకుంటేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారని చిగురుమానుతండా సర్పంచ్ నారాయణనాయక్తో పాటు గ్రామప్రజలు చెబుతున్నారు. 2004 నుంచి ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, ఇప్పుడు ఉన్నట్టుండి మీటర్లు బిగించుకోలేదన్న సాకుతో విద్యుత్ సరఫరా నిలిపేశారని వాపోతున్నారు. ఇప్పటి వరకూ తమకు ఆ విషయమే అధికారులు చెప్పలేదని వెల్లడించారు. ఉన్నట్టుండి విద్యుత్ మీటర్లు బిగించుకోవాలంటే కూలినాలి చేసుకునే గిరిజనులు ఎలా డబ్బు కడతారని ప్రశ్నించారు. కనీసం రెండు రోజులు గడువు ఇవ్వాలన్నా అధికారులు వినిపించుకోకుండా విద్యుత్ సరఫరా నిలిపివేశారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ తండాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖ రూరల్ ఏఈ శ్రీనివాసులు నాయక్ వివరణ కోరగా... తండాల్లో ఎవరూ విద్యుత్ కనెక్షన్ తీసుకోలేదని, అందుకే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సరఫరా నిలిపేశామన్నారు. ఉచిత విద్యుత్కు అర్హులైనప్పటికీ విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలన్నారు. మీటర్ ఉండి కరెంటు వాడుకుంటే సబ్సిడీ వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. కరెంటు సరఫరా నిలివేసిన చంద్రబాబు సర్కార్ పండగ వేళ అంధకారంలో గిరిజనులు కనీసం రెండు రోజులు సమయం ఇవ్వాలన్నా పట్టించుకోని విద్యుత్ అధికారులు -
కూతురి కోసం వెళ్లి.. కానరాని లోకాలకు!
తిరుపతి రూరల్/చెన్నేకొత్తపల్లి: సంక్రాంతి పండుగకు కూతురుని ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చిన ఓ తండ్రి ప్రమాదంలో మృతి చెందిన విషాద సంఘటన తిరుపతి శివార్లలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... చెన్నేకొత్తపల్లి మండలంలోని నామాల గ్రామానికి చెందిన పగిడి వెంకటేశ్వరరెడ్డి (38) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి భార్య వసుంధర, కుమార్తె లిఖిత, కుమారుడు ఉన్నారు. వెంకటేశ్వరరెడ్డి కుమార్తె లిఖిత తిరుపతి శివారులోని తణపల్లి వద్దనున్న శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ఆమెను ఇంటికి తీసుకొచ్చేందుకు శుక్రవారం రాత్రి బస్సులో తిరుపతి వచ్చిన వెంకటేశ్వరరెడ్డి తణపల్లి జంక్షన్ వద్ద నడుచుకుంటూ జాతీయ రహదారి దాటుతుండగా విజయవాడ నుంచి బెంగళూరు వెళుతున్న విజయానంద ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలపాలైన వెంకటేశ్వరరెడ్డిని స్థానికులు 108 ద్వారా చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు బస్సు డ్రైవర్ వినోద్ కుమార్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తన తండ్రి కాలేజీ వద్దకు వస్తాడని ఎదురుచూసిన కుమార్తె ఆయన మరణవార్త తెలిసి తల్లడిల్లింది. బంధువులు దుఖఃసాగరంలో మునిగారు. తిరుపతిలో బస్సు ఢీకొని సీకేపల్లి మండలవాసి దుర్మరణం -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
రొద్దం: ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న ఘటన మండల కేంద్రంలో జరిగింది. శనివారం ప్రయాణికులతో వస్తున్న బస్సు స్థానిక పావగడ–పెనుకొండ మార్గంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన స్తంభాన్ని ఢీకొంది. దీంతో విద్యుత్ స్తంభం లక్ష్మీనారాయణ గుప్తా అనే వ్యక్తి ఇంటిపై ఒరిగింది. ఈ క్రమంలోనే విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం కింది భాగంలో పూర్తిగా తుప్పుపట్టిందని, స్తంభాన్ని మార్చాలని పలు మార్లు ట్రాన్స్కో ఏఈకి విన్నవించినా ఆయన స్పందించలేదని వాపోయారు. ప్రజల ప్రాణాలంటే ఆయనకు లెక్కలేకుండా పోయిందన్నారు. ప్రాణాలు పోతేగాని స్పందించారా అంటూ మండిపడ్డారు. నీటి కుంటలో పడి బాలిక మృతి నల్లమాడ: నీటి కుంటలో పడి బాలిక మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన మేరకు... మండలంలోని కుటాలపల్లికి చెందిన రవిచంద్రారెడ్డి, ఉమాదేవి దంపతుల కుమార్తె సాయి సంకీర్తన (17) పదో తరగతి పూర్తి చేసింది. తల్లిదండ్రులు బెంగళూరుకు వలస వెళ్లడంతో నల్లసింగయ్యగారిపల్లిలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. శనివారం ఉదయాన్నే బయటకు వెళ్లిన సాయి సంకీర్తన ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో తాత వెంకట్రా మిరెడ్డి గ్రామంలో గాలించినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం గ్రామ సమీపంలోని సింగినేయ కుంటలో సాయి సంకీర్తన శవమై కనిపించింది. సమాచారం అందుకున్న ఎస్ఐ సతీష్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు బెంగళూరు నుంచి తిరిగి వచ్చి కుమార్తె మృతదేహం వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. కొన్ని రోజులుగా సాయి సంకీర్తన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టం
ధర్మవరం రూరల్: తప్పు చేసే వారు ఎవరైనా...ఎంతటి వారైనా వదిలేది లేదని ఎస్పీ సతీష్కుమార్ తేల్చి చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తప్పక కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. నేరాల్లో ముద్దాయిలుగా తేలిన వారి ఆస్తులను సైతం కోర్టులకు అటాచ్ చేస్తామని హెచ్చరించారు. శనివారం ఉదయం ధర్మవరం మండలం రావుల చెరువు గ్రామంలో నిర్వహించిన కార్డెన్ సెర్చ్లో ఎస్పీ స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 120 మంది పోలీస్ సిబ్బందితో గ్రామంలో సోదాలు నిర్వహించారు. ప్రతి ఇంటిని, పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ నాయకులకు, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సత్ప్రవర్తనతో నడుచుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఘర్షణలకు దిగుతూ గ్రామంలో అశాంతి కారణమయ్యే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారు. పదేపదే నేరాలకు పాల్పడితే నేరస్తుల ఆస్తులను కోర్టులకు అటాచ్ చేస్తామన్నారు. అంతేకాకుండా వారి పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా... ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్లు పోలీస్ శాఖ నుంచి మంజూరు చేయబోమన్నారు. దీనివల్ల పిల్లల భవిష్యత్ అంధకారంగా మారుతుందన్నారు. అందువల్ల గొడవలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో జీవించాలన్నారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్లు, రికార్డులు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ హేమంత్ కుమార్, సీఐలు ప్రభాకర్, శ్రీధర్, ఆర్ఐ రవికుమార్, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు ఉన్నారు. ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరిక -
యువకుడి అనుమానాస్పద మృతి
హిందూపురం: గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హిందూపురంలో జరిగింది. శనివారం స్థానిక కొట్నూరు సమీపంలోని రైల్వే బ్రిడ్జికి అచేతన స్థితిలో యువకుడు వేలాడుతుండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి వయసు 25 ఏళ్లలోపు ఉండవచ్చని తెలిసింది. అతడి వద్ద ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా హత్య చేసి వేలాడదీశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరు వివాదాస్పదం..మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడంలో హిందూపురం పోలీసులు, రైల్వే పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. తమ పరిధి కాదంటే తమది కాదంటూ రాత్రి 9 గంటలైనా శవాన్ని స్వాధీనం చేసుకోలేదు. చివరకు డీఎస్పీ మహేష్ ఆదేశాలతో హిందూపురం రూరల్, అప్గ్రేడ్ పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం హిందూపురం: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలైన ఘటన మండలంలోని గోళాపురం వద్ద జరిగింది. గోళాపురం సమీపంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీలో పనిచేయడానికి వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు వచ్చారు. ఇలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన ఫర్హాన్ (30), మరొక వ్యక్తితో కలిసి శనివారం సాయంత్రం బైకులో ఫ్యాక్టరీ వద్దకు వెళ్తుండగా గోళాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన ఫర్హన్ ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. గాయపడిన మరొక వ్యక్తిని బెంగ ళూరులోని ఆస్పత్రికి తరలించారు. హిందూపురం రూరల్ పోలీసులు మృతుడి కుటుంబీ కులను విచారిస్తున్నారు. ‘అమరాపురం’లో వ్యక్తి..అమరాపురం: మండల పరిధి లోని కమ్మరహట్టి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిట్నడకు గ్రామానికి చెందిన సురేష్ (30) మృతి చెందాడు. వివరాలు.. పని నిమిత్తం శనివారం సాయంత్రం అమరాపురం వచ్చిన సురేష్ అనంతరం చిట్నడకుకు ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. కమ్మరహట్టి సమీపంలో బైకు అదుపు తప్పి కిందపడడంతో తలకు తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ వలీభాష, ఏఎస్ఐ రామంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. -
అనుమతులు ఒకలా.. నిర్వహణ మరోలా..
ఓడీచెరువు (అమడగూరు): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలను మత్తులో ముంచేస్తోంది. ఎక్కడికక్కడ లీజును దక్కించుకున్న టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మద్యం దుకాణాల నిర్వహణలో నిబంధనలకు తిలోదాకాలిచ్చేశారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన ఎకై ్సజ్ అధికారులు కాస్త చోద్యం చూస్తుండడంతో మద్యం అక్రమ వ్యాపారం ఊపందుకుంది. అక్రమార్కులకు రాజకీయ రక్షణ.. టెండర్ల ద్వారా మండల కేంద్రానికి ఒకటి చొప్పున మద్యం దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ క్రమంలో అమడగూరు మండలంలో మద్యం దుకాణం నిర్వహణ లీజును దక్కించుకున్న స్థానిక టీడీపీ నేత.. నిబంధనలు తుంగలో తొక్కి ఏకంగా రెండు దుకాణాలు ఏర్పాటు చేశాడు. ఇందులో అమడగూరులో ఉన్న ఒక్క దుకాణానికే ప్రభుత్వ అనుమతి ఉంది. మహమ్మదాబాద్ పబ్లిక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుకాణానికి అనుమతులు లేవు. లీజు దక్కించుకున్న సదరు నేత మరో ముగ్గురు భాగస్వాములుగా కలుపుకుని రాజకీయ రక్షణతో అక్రమ దందాకు తెరలేపడం గమనార్హం. లాభాలు రావడం లేదనే నెపంతో ఎకై ్సజ్ అధికారులను లోబర్చుకుని అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నా ఎకై ్సజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అక్రమ దందాకు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. వీటికి తోడు అమడగూరు మండలంలోని ప్రతి పల్లెలోనూ బెల్ట్ షాపులను టీడీపీ నేతలు నిర్వహిస్తున్నారు. అప్పటికై నా అధికారులు స్పందించి మద్యం అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. అడ్డగోలుగా మద్యం దుకాణాల నిర్వహణ పట్టించుకోని ఎకై ్సజ్ శాఖ అధికారులు -
పనితీరు మెరుగుపడాలి
● సేవల్లో నిర్లక్ష్యం ఏ స్థాయిలోనూ పనికిరాదు ● సచివాలయ ఉద్యోగులతో కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రశాంతి నిలయం: ‘‘క్షేత్రస్థాయిలో ఉంటున్న సచివాలయ సిబ్బంది పనితీరు మరింత మెరుగుపడాలి. ప్రభుత్వ సేవల్లో ఎక్కడా ఆటంకం కలగకూడదు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవల్లో ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యం పనికిరాదు. మండల స్థాయి అధికారులు కూడా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందాలి’’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి ప్రభుత్వ పథకాల అమలు, సేవల మెరుగుదల తదితర అంశాలపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఈఓఆర్డీలు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలులో సిబ్బంది పారదర్శకంగా సంతృప్తి స్థాయిలో సేవలు అందించాలన్నారు. జిల్లా ర్యాంకింగ్ మెరుగుదలకు కృషి చేయాలన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ‘పరిష్కార వేదిక’కు వివిధ సమస్యలపై 300పైగా అర్జీలు అందుతున్నాయని, వాటి పరిష్కారానికి అంకిత భావంతో కృషి చేయాలన్నారు. రోజూ సచివాలయాల్లో సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకూ పీజీఆర్ఎస్ నిర్వహించాలన్నారు. ఎంపీడీఓలు, కమిషనర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. లేపాక్షి మండలం చోల సముద్రం, పుట్టపర్తి మండలం ఇరగరాజుపల్లి సచివాలయాల పనితీరు సరిగా లేదని తన దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ఉద్యోగులంతా తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందేనన్నారు. సేవలకు కుడా ప్రభుత్వం నిర్దేశించిన మొత్తానికి మించి రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. లేఅవుట్ల సందర్శన, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. వీసీలో డీపీఓ సమత, జీఎస్డబ్ల్యూఎస్ అధికారి సుధాకరరెడ్డి, డీఆర్డీఏ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు బస్సుల్లో టికెట్ల ధర పెంచితే చర్యలు ● ఆర్టీఓ కరుణసాగర్రెడ్డి పుట్టపర్తి టౌన్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేటు బస్సు యజమానులు అధిక ధరలకు టికెట్లు అమ్మితే చర్యలు తప్పవని ఆర్టీఓ కరుణసాగర్రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి పండుగను కుటుంబీకులతో కలిసి జరుపుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది స్వగ్రామాలకు వస్తారని, ఆ సమయంలో డిమాండ్ పెరుగుతుందన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు బస్సు యజమానులు టికెట్ ధరలు ఇష్టానుసారం పెంచితే చర్యలు తప్పవన్నారు. ఆర్టీసీ నిర్ణయించిన టికెట్ ధర కంటే అదనంగా 50 శాతం వరకు టికెట్ ధర పెంచుకోవచ్చని, అంతకుమించితే ఆయా బస్సుల యాజమాన్యలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి బస్సులోనూ రవాణా శాఖ హెల్ప్లైన్ నంబర్ 9281607001ను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. జనవరి 16వ తేదీ వరకు అన్ని ప్రైవేటు బస్సులను తనిఖీ చేస్తామని, ప్రయాణికులతో మాట్లాడి టికెట్ ధరలు ఆరా తీస్తామన్నారు. వీరభద్రుడి హుండీ ఆదాయం రూ.8.16 లక్షలు లేపాక్షి: స్థానిక వీరభద్రస్వామి దేవాలయ ఆవరణలో శుక్రవారం ఆలయ ఈఓ నరసింహమూర్తి ఆధ్వర్యంలో హుండీ కానుకలను లెక్కించారు. ఏడు నెలలకుగాను రూ.8,16,064 ఆదాయం వచ్చిందని ఈఓ పేర్కొన్నారు. అయితే ఆలయ కమిటీ చైర్మన్ కరణం రమానందన్తో పాటు అతని అనుచరవర్గంతో హుండీ కానుకలను లెక్కించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు హుండీ లెక్కింపునకు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
ప్రకృతి సేద్యాన్ని విస్తరించాలి
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు ప్రకృతి సేద్యాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనంత సుస్థిర వ్యవసాయ వేదిక కన్వీనర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి అన్నారు. రసాయనాలు, క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో పండించిన కల్తీలేని ఆహారోత్పత్తుల వినియోగంపై ప్రజలు దృష్టి సారిస్తే.., ప్రకృతి సేద్యం విస్తరిస్తుందని పేర్కొన్నారు. అనంత సుస్థిర వ్యవసాయ వేదిక’ ఆధ్వర్యంలో 18 స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా అనంతపురంలోని పోలీసు కాంప్లెక్స్లోని కల్యాణమంటపం వేదికగా ఏర్పాటు చేసిన ‘మిల్లెట్ మేళా’కు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రెండో రోజు శుక్రవారం జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది రైతులు, నగరవాసులు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తరలివచ్చారు. చిరుధాన్యాలు, వాటితో చేసిన తినుబండారాలు, సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, పండ్లు, పూల ప్రదర్శనశాలలు, విక్రయశాలలను ఆసక్తిగా గమనించి కావాల్సిన వాటిని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ వైవీ మల్లారెడ్డి, సీసీడీ ప్రతినిధి త్రిలోకనాథశాస్త్రి, ఏపీ మాస్ సీఈఓ సీఎస్ రెడ్డి, ప్రకృతి వ్యవసాయ విభాగం చీఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ (సీటీఐఓ) వి.లక్ష్మానాయక్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి, తెలంగాణాకు చెందిన రైతు నరసింహారెడ్డి తదితరులు మాట్లాడారు. కష్టం రైతుది అయితే సంపాదన మాత్రం దళారులు, వ్యాపారులకు దక్కుతోందన్నారు. మార్కెటింగ్ మెలకువలు పాటిస్తే రైతు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని తెలిపారు. ప్రజారోగ్యం మెరుగుపడి అనారోగ్యానికి వెచ్చించే ఖర్చులు తగ్గాలంటే సేంద్రియ పద్ధతుల పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రెడ్స్ ప్రతినిధి భానుజా, కార్డు ప్రతినిధి నిర్మలారెడ్డి, ఆర్ఆర్ఏ నెట్వర్క్ ప్రతినిధి సుజుల్ కులకర్ణి, ఎఫ్ఈఎస్ వ్యవస్థాపకులు భక్తర్వలీ, ఏఎఫ్ఈసీ చీఫ్ అపరేషన్స్ జే.మురళీకృష్ణ, రిడ్స్ పీడీ వి.కిష్టప్పతో పాటు సీసీడీ, వాసన్, టింబక్టు, ఏపీమాస్, సీఎస్ఏ, జనజాగృతి, యాపిల్, పాస్, గ్రామ్వికాస్, అనంత నాచురల్స్, తిరుమల ఆర్గానిక్స్, డిజిటల్ గ్రీన్ తదితర ఎన్జీఓ ప్రతినిధులు శంకర్, గోపాల్, సుకన్య, ఉత్తప్ప, రమణ, శ్రీనివాసరెడ్డి, హనుమంతరెడ్డి, రామప్ప, తిరుపాలు, నరేంద్ర, విజయభాస్కర్, నవీన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ‘మిల్లెట్ మేళా’లో సుస్థిర వ్యవసాయ వేదిక కన్వీనర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి -
441 మంది టీచర్లకు షోకాజ్
పుట్టపర్తి: ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు చంద్రబాబు సర్కారు పెద్ద షాక్ ఇచ్చింది. సాయంత్రం పూట ముఖ హాజరు (ఫేషియల్ అటెండెన్స్) సక్రమంగా వేయలేదని జిల్లాలోని 441 మంది టీచర్లకు డీఈఓ కృష్ణప్ప ద్వారా శుక్రవారం షోకాజ్ నోటీసులు ఇప్పించింది. ఈ నోటీసులపై ఉపాధ్యాయ లోకం భగ్గుమంటోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తోందని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అన్నారు. షోకాజ్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం... ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగిస్తూ, వారిలో ఒత్తిడి పెంచి మానసికంగా కుంగదీస్తోందని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గజ్జల హరి ప్రసాద్రెడ్డి, గోపాల్ నాయక్ అన్నారు. వెంటనే షోకాజ్ నోటీసులు ఉప సంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో నెట్వర్క్ సమస్య వల్ల అటెండెన్స్ వేసేందుకు ఇబ్బందులు పడుతున్నామని, అలాంటి పరిస్థితుల్లో ఫేషియల్ అటెండెన్స్ను ప్రామాణికంగా తీసుకోవటం అన్యాయమన్నారు. నోటీసులు ఉపసంహరించుకోవాలి.. చంద్రబాబు ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని వైఎస్సార్ టీఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, నీలా ఇంద్ర ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్య ఉందని, ఈ కారణంతో చాలా మంది ఫేషియల్ అటెండెన్స్ వేయక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ సమస్య గురించి ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు చెప్పామన్నారు. అయినా సాంకేతిక సమస్యలు పట్టించుకోకుండా ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులివ్వటం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయటమేనన్నారు. షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోక పోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఫేషియల్ అటెండెన్స్ వేయని ఫలితం సర్కార్ తీరుపై ఉపాధ్యాయ సంఘాల నేతల భగ్గు -
ఫైనల్ దశకు ఫుట్బాల్ టోర్నీ
అనంతపురం కార్పొరేషన్: అనంత స్పోర్ట్స్ అకాడమీలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఇన్స్పైర్ ఫుట్బాల్ టోర్నీ ఫైనల్ దశకు చేరింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ తొలి మ్యాచ్లో నర్మదా వాలీ జట్టు 9–0 గోల్స్ తేడాతో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీపై, రెండో సెమీఫైనల్లో మగన్ సింగ్ రాజీవ్ ఎఫ్సీ జట్టు 2–1 గోల్స్ తేడాతో పుదువాయ్ యూనికార్న్స్ జట్టుపై విజయం సాధించి ఫైనల్కు చేరుకున్నాయి. జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక బత్తలపల్లి: మండలంలోని రామాపురం గ్రామ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఎస్.ఇబ్రహీం, ఎస్.జస్విత జాతీయ స్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటనాయుడు, ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ శుక్రవారం వెల్లడించారు. ఎంపికై న విద్యార్థులు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు తమిళనాడులోని ఈరోడ్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ఏపీ తరఫున ప్రాతినిథ్యం వహించే జట్టులో పాల్గొంటారని వివరించారు. ఎంపికై న విద్యార్థులను ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు అభినందించారు. పట్టు గూళ్ల మార్కెట్లో ఈ–వేలం అమలు చేయాలి హిందూపురం: స్థానిక పట్టు గూళ్ల మార్కెట్లో ఈ–వేలం ప్రక్రియను వెంటనే చేపట్టాలంటూ పట్టు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అడిషనల్ డైరెక్టర్ రాజు, మార్కెట్ఽ అధికారి హంపయ్యను శుక్రవారం కలిసి వినతిపత్రాన్ని అందించి, మాట్లాడారు. ప్రతి రోజూరెండు విడతలుగా పట్టు గూళ్ల ఈ – వేలం నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకూ రైతులు విక్రయించిన తర్వాత పేమెంట్ పట్టీల్లో ఒక లాట్కు రూ.30 చొప్పున పట్టుకుని చెల్లిస్తున్నారని, అయితే దీనిని ఆన్లైన్ విధానంలో జమ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పశుగ్రాసం దగ్ధంరొద్దం: పొలంలో ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ తగిలి పశుగ్రాసం దగ్ధమైంది. రొద్దం మండలం ఆర్.మరువపల్లి సమీపాన శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు వరి గడ్డి కొనుగోలు ట్రాక్టర్లో తరలిస్తుండగా మార్గమధ్యంలో విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల కూలీలు కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే ట్రాలీని పెకెత్తి గడ్డిని కిందకు పడేశాడు. -
తోటలను కప్పేసిన దుమ్ము
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం, హిందూపురం, కదిరి ప్రాంతాల్లో మట్టి మాఫియా వెర్రితలలు వేస్తోంది. మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతుండడంతో రోడ్డు పక్కన ఉన్న తోటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. కొండలు, గుట్టల్లోకి దారులు ఏర్పాటు చేసుకుని మట్టిని తరలిస్తూ రూ.లక్షల్లో డబ్బు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ. 3 వేల నుంచి రూ.4 వేల వరకూ విక్రయిస్తున్నట్లు సమాచారం. ఒకపక్క చిత్రావతి, హగరి, పెన్నా ,భద్రావతి, వంగపేరు వంటి నదుల నుంచి ఇసుక అక్రమ తరలింపులతో పాటు మట్టిని కొల్లగొడుతుండడంతో ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. ధనార్జనే ధ్యేయంగా టీడీపీ నాయకులు సాగిస్తున్న ఈ అక్రమాలకు అమాయక రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. కనుమరుగవుతున్న గుట్టలు.. కొత్తచెరువు నల్లగుట్టలో మట్టిని అక్రమంగా తవ్వి తరలించి సొమ్ము చేసుకోవడంతో ఏకంగా రెండు కిలోమీటర్ల మేర గుట్ట మాయమైంది. అలాగే నాగులకనుమ నుంచి రైల్వే లైను సొరంగం వరకూ భారీగా మట్టిని తరలించారు. ఇదే మండలంలోని గంటల మారెమ్మ కనుమ వద్ద ఇటీవల భారీగా మట్టిని తరలించారు. ఈ మట్టిని కర్ణాటక వరకూ తరలించేందుకు సమీపంలోని గుట్టల్లో ప్రత్యేకంగా మట్టి దారిని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లు తిరుగుతుండడంతో రహదారికి ఇరువైపులా ఉన్న మామిడి, ఇతర తీగ జాతి పంటలు కాస్త మట్టి కొట్టుకుపోతున్నాయి. కీలకమైన దశలో మామిడి తోటలపై భారీగా దుమ్ము పడడంతో పూత, పిందె రాకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు, వీరాంజనేయపల్లి, కర్ణాటక నాగేపల్లి వద్ద తోటలు పూర్తిగా మట్టితో నిండిపోయాయి. హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు, కిరికెర కొండల్లోనూ భారీగా మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. అటువైపు ఉన్న నీలగిరి, మామిడి, మిరప, పత్తి పంటలు దెబ్బ తిన్నాయి. ధర్మవరం మండలంలోని ఓబుళనాయనిపల్లి ప్రాంతంలో మట్టిని భారీగా తరలించడంతో ఆ మార్గంలో ఉన్న అరటి, మామిడి, చీనీ తోటలు దెబ్బతిన్నాయి. కదిరిలోని బియ్యం గోదాము వెనుక ఉన్న కొండను ఇష్టరాజ్యంగా పెకలించి అక్రమంగా మట్టిని తరలిస్తుంటే ప్రజా వ్యతిరేకత వ్యక్తం కావడంతో రెవెన్యూ అధికారులు స్పందించి జేసీబీలు, టిప్పర్లను సీజ్ చేశారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు మేల్కోని మట్టి అక్రమ తరలింపులను అడ్డుకుంటే రైతులకు మేలు చేకూరుతుందని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలో మట్టి మాఫియా పేట్రేగిపోవడంతో అన్నదాతలకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కొండలు, గుట్టల్లోకి మట్టి దారులు ఏర్పాటు చేసుకున్న స్వార్థపరులు యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా చేపట్టారు. ఒకట్రెండు కాదు... రేయింబవళ్లూ పదుల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తుండడంతో రహదారులపై దుమ్ము ఎగిసి పడి పక్కనే ఉన్న మామిడి తోటలను కప్పేస్తోంది. దీంతో కీలకమైన దశలో పూత రాక మామిడి రైతులు నష్టాలను మూట గట్టుకుంటున్నారు. మట్టి అక్రమ రవాణాతో దెబ్బతింటున్న మామిడి తోటలు కీలకమైన దశలో పూత రాక ఇబ్బందులు మట్టి దోపిడీని అరికట్టాలంటున్న రైతులు -
‘డబుల్ ట్రబులర్’ రమణరావుకు పోస్టింగ్
అనంతపురం టౌన్: డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి అనంతపురం నగరంలో భూ వివాదాలకు ఆజ్యం పోసి సస్పెండ్ అయిన జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ రమణరావుకు ఉన్నతాధికారులు మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు. డబ్బులు ఇస్తే చాలు ఎలాంటి రిజిస్ట్రేషన్లనైనా రమణరావు ఇట్టే చేసేస్తారు. ఆయన చేసిన అక్రమ రిజిస్ట్రేషన్లపై గత ఏడాది సెప్టెంబర్ 29న సాక్షి దినపత్రికలో ‘డబుల్ ట్రబులర్ రమణే’ శీర్షికన కథనం వెలువడడంతో విచారణ చేపట్టిన రిజిస్ట్రేషన్శాఖ అధికారులు అక్టోబర్ 7న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురంలో ఇష్టారాజ్యంగా ఆయన చేసిన రిజిస్ట్రేషన్లతో నేటికీ నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సస్పెండ్ అయిన ఉద్యోగులకు ఆరు నెలలు దాటిన తర్వాతే ఏ శాఖలోనైనా పోస్టింగ్ ఇస్తారు. అలాంటిది మూడు నెలలకే సస్పెన్షన్ ఎత్తివేసి జనవరి 4న చిత్తూరు జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రమణరావుకు పోస్టింగ్ ఇవ్వడంపై ఆ శాఖ ఉద్యోగులే నివ్వెర పోతున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారిని ప్రసన్నం చేసుకోవడంతో మూడు నెలల కాలంలోనే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పోస్టింగ్ తెచ్చుకున్నాడంటూ ఉద్యోగులలో చర్చ జరుగుతోంది. ఈ విషయంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ విజయలక్ష్మిని వివరణ కోరగా ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు చిత్తూరు ఆర్ఓకు పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని ఆమె తేల్చి చెప్పారు. అనంతపురంలో ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు భూ వివాదాలకు ఆజ్యం పోసిన రమణరావు సస్పెండ్ అయిన మూడునెలలకే మళ్లీ విధుల్లోకి ఐజీ కార్యాలయంలో చక్రం తిప్పిన ఓ ఉన్నతాధికారి చిత్తూరు ఆర్ఓలో జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్గా పోస్టింగ్ -
బెదిరింపులకు తలొగ్గం
పుట్టపర్తి టౌన్: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టి రౌడీషీట్లు తెరుస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు తలొగ్గేది లేదని ప్రభుత్వాన్ని ఐక్య విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం పుట్టపర్తిలోని గణేష్ కూడలిలో విద్యార్థులతో కలసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్టనైజింగ్ కార్యదర్శి సంతోష్, వైఎస్సార్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శేషం మహేంద్ర మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రశించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశించిన విద్యార్థి సంఘం నాయకులపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, రౌడీ షీట్లను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం అధికారి ప్రతినిధి అమరనాథ్రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజేంద్ర, పుట్టపర్తి నియోజవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అజయ్ భార్గవరెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకాల రాజ, నాయకులు విజయకుమార్, అనిల్కుమార్, కమల్బాషా, నూర్మహమ్మద్, ఇబ్రహీం, జిలాన్, నాగేంద్ర, పవన్కుమార్రెడ్డి, అరుణ్ అదితరులు పాల్గొన్నారు. ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు -
ఆర్థిక లావాదేవీలే హత్యకు పురిగొల్పాయి
పుట్టపర్తి టౌన్: మాదినేని మహేష్ హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పుట్టపర్తి డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ విజయ్కుమార్, సీఐలు శివాంజనేయులు, మారుతీ శంకర్ వెల్లడించారు. ఈ నెల 1న కొత్తచెరువు మండలం తిప్పబాట్లపల్లికి చెందిన మహేష్ చౌదరి (31) మృతదేహం హంద్రీ–నీవా కాలువలో లభ్యమైందన్నారు. ఘటనపై మృతుడి తల్లి నాగరత్నమ్మ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో మారుతీ ప్రసాదరెడ్డి, వంశీకృష్ణ, లోకేష్, బాలమిత్ర, అభిషేక్ ను శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కొత్తచెరువులోని తలమర్ల క్రాస్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని వారు అంగీకరించడంతో హత్య సమయంలో వినియోగించిన ఇన్నోవా కారు, రెండు బైక్లు, ఇనుప పైపు, ఐదు సెల్ఫోన్లు, హతుడి ఈవీ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మారుతీప్రసాద రెడ్డి, వంశీకిషోర్పై ఇప్పటికే ఏడు క్రిమినల్ కేసులు, రౌడీ సీట్ ఉంది, లోకేష్ౖపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి. హత్య ఎలా చేశారంటే.. మారుతీ ప్రసాదరెడ్డి, లోకేష్, మహేష్చౌదరి ముగ్గురూ కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలోనే ఆర్థిక పరమైన అంశాల్లో విభేదాలు చోటు చేసుకున్నాయి. మహేష్, లోకేష్ మధ్య ఈ నెల 1న గొడవ చోటు చేసుకుంది. కొత్తచెరువు పీఎస్లో మహేష్పై లోకేష్ కేసు నమోదు చేయించాడు. అదే రోజు ప్రశాంతి గ్రాం వద్ద ఉన్న మారుతీరెడ్డి గెస్ట్ హౌస్లో ఐదుగురు నిందితులు ఉండగా మహేష్ అక్కడికెళ్లి వారితో గొడవపడ్డాడు. దీంతో ఇనుపరాడ్, కర్రలతో మహేష్పై దాడి చేయడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మహేష్ మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి ఇన్నోవా కారులో తీసుకెళ్లి సమీపంలోని హంద్రీ–నీవా కాలువలో పడేశారు. అనుమానం రాకుండా హతుడి ఎలక్రికల్ వాహనం, ఇనుప రాడ్ను అక్కడే పడేసి వెళ్లిపోయారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు భవిష్యత్తులో మరెవ్వరూ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండేలా కొత్తచెరువులో ఊరేగిస్తూ న్యాయస్థానానికి తీసుకెళ్లారు. మాదినేని మహేష్ హత్య కేసులో వీడిన మిస్టరీ నిందితుల అరెస్ట్ -
సరిహద్దున బ్లాక్ దందా
సాక్షి, పుట్టపర్తి కర్ణాటక సరిహద్దున నిఘా లేకపోవడంతో గుట్కా దందా, డీజిల్, పెట్రోల్ అక్రమ రవాణా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నాయి. రామగిరి, చెన్నేకొత్తపల్లి, తనకల్లు, గోరంట్ల, హిందూపురం, మడకశిర, చిలమత్తూరు తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. నెలవారీ ‘మామూళ్ల’తో అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పచ్చ నేతల సిండికేట్.. టీడీపీకి చెందిన కొందరు సిండికేటుగా మారి అక్రమ వ్యాపారాలకు తెరదీసినట్లు తెలుస్తోంది. కొందరు ఖాకీలు మామూళ్లకు అలవాటు పడటంతో అక్రమ వ్యాపారులు కాలర్ ఎగరేసి తిరుగుతున్నారు. ముఖ్యంగా నిషేధిత గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులు బెంగళూరు నుంచి నేరుగా హిందూపురం, మడకశిరకు వస్తున్నాయి. అక్కడి రహస్య ప్రాంతంలో సరుకు డంప్ చేసి గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. ఇక పెనుకొండ సమీపంలో ‘కియా’ కార్ల పరిశ్రమలో ఎక్కువగా ఉత్తరాది కార్మికులు పనిచేస్తుండటం...వారంతా గుట్కాలకు అలవాటు పడిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో గుట్కా విక్రయాలు విపరీతంగా జరుగుతున్నట్లు తెలిసింది. గుట్టుచప్పుడు కాకుండా డీజిల్ దందా.. పెట్రోలు, డీజిల్ ఆంధ్రాతో పోలిస్తే కర్ణాటకలో లీటరుపై కనీసం రూ.7 తక్కువగా ఉంటోంది. దీంతో అధికార పార్టీలోని కొందరు నేతలు కర్ణాటక నుంచి డీజిల్, పెట్రోల్ను జిల్లాకు తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు. డీజిల్ పావగడ నుంచి రామగిరికి ఎక్కువగా రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల సమయంలో పోలీసుల నిఘా ఉండదన్న ఉద్దేశంతో ఆ సమయంలోనే అక్రమ రవాణా ఎక్కువగా సాగిస్తున్నట్లు సమాచారం. కొడికొండ చెక్పోస్టు నుంచి జాతీయ రహదారి మీద పలు చోట్ల డీజిల్ దుకాణాలు వెలిశాయి. వాటన్నింటిలో కర్ణాటకకు చెందిన ఇంధనమే అమ్ముతున్నట్లు సమాచారం. నెలకు రూ.100 కోట్ల వ్యాపారం.. మత్తు పదార్థాలకు చాలా మంది బానిస కావడంతో గుట్టు చప్పుడు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో గుట్కాను అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. అదేవిధంగా కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఆంధ్ర కంటే తక్కువగా ఉండటంతో రాత్రిపూట తీసుకొచ్చి.. పగటి పూట అమ్ముతున్నట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా నెలకు రూ.100 కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు అంచనా. డిమాండ్కు అనుగుణంగా అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఇరుకు సందుల్లో అద్దెకు గదులు తీసుకుని గోదాములుగా వినియోగిస్తున్నారు. అక్కడి నుంచి ఏజెంట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల వరకు గుట్కా అక్రమంగా సరఫరా అవుతోంది. అదేవిధంగా కొడికొండ చెక్పోస్టు నుంచి పెనుకొండ, చెన్నేకొత్తపల్లి, ఎన్ఎస్ గేటు, మామిళ్లపల్లి వరకు డీజిల్ అమ్మకాల దుకాణాలు కనిపిస్తున్నాయి. ‘మామూళ్ల’ ముసుగులో అడ్డుకోకుండా.. నిషేధిత గుట్కా అక్రమ రవాణా జరుగుతున్నా.. పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నిందితులు పట్టుబడినప్పటికీ.. అరకొర జరిమానా విధించి వదిలేస్తున్నారు. దీనికి తోడు కొందరు అధికారులు మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు అధికారుల సహకారంతోనే గుట్కా అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నట్లు స్పష్టం అవుతోంది. అంతేకాకుండా కొన్ని చోట్ల సరుకు పట్టుబడినా.. అంతో ఇంతో డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారని ప్రజలే చెబుతున్నారు. రామగిరి ప్రాంతానికి చెందిన కొందరు టీడీపీ నేతలు సిండికేటుగా మారి డీజిల్, పెట్రోల్ అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. బెంగళూరు నుంచి విపరీతంగా గుట్కా దిగుమతి హిందూపురం, మడకశిర కేంద్రాలుగా విక్రయాలు కర్ణాటక నుంచి విచ్చలవిడిగా డీజిల్ దిగుమతి ‘పచ్చ’ నేతల ఆధ్వర్యంలో డీజిల్, పెట్రోల్ వ్యాపారం నెలకు రూ.కోట్లలో అక్రమ వ్యాపారం నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్న అధికారులు సరిహద్దులో ‘బ్లాక్’ దందా జోరుగా సాగుతోంది. జిల్లాలోని చాలా మండలాలు కర్ణాటక సరిహద్దులో ఉండటంతో పొరుగు రాష్ట్రంలోని సరుకు యథేచ్ఛగా జిల్లాలోకి వచ్చి చేరుతోంది. ముఖ్యంగా నిషేధిత గుట్కాతో పాటు డీజిల్, పెట్రోల్ సరిహద్దు మండలాలను ముంచెత్తుతోంది. ఈ దందా అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుండటంతో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. నామమాత్రపు జరిమానాతో సరి..నిషేధిత పొగాకు ఉత్పత్తులు, అక్రమ డీజిల్, పెట్రోల్ పట్టుబడితే అధికారులు కేసు నమోదు చేసి నామమాత్రపు జరిమానా విధించి వదిలేస్తున్నారు. దీంతో ఈ అక్రమ వ్యాపారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గుట్కా, ఖైనీ హోల్సేల్ వ్యాపారులు, డీజిల్ అక్రమంగా విక్రయించే వాళ్లు జిల్లా వ్యాప్తంగా సుమారు 70 మంది ఉన్నట్లు తెలిసింది. వీళ్లందరూ సరుకును కావాల్సిన ప్రాంతానికి పంపిస్తారు. అప్పుడప్పుడూ ఎవరైనా నిఘా పెట్టి పోలీసులకు ఫోన్ చేసినా.. ఏదో రూపంలో మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నారు. లేదంటే జరిమానా కట్టి వెళ్లిపోతున్నారు. అక్రమంగా సరుకు తరలిస్తూ ఎవరైనా పట్టుబడినా రూ.2 వేల నుంచి రూ.10 వేలలోపు జరిమానా విధిస్తున్నారు. దీంతో రూ.లక్షల్లో సంపాదించే వారికి రూ.వేలు లెక్క లేకుండా పోయింది. -
గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రశాంతి నిలయం: గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్డే) ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈనెల 26న నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఎస్పీ సతీష్ కుమార్తో వేడుకల నిర్వహణ, భద్రత, సాంస్కృతిక కార్యక్రమాలు, పరేడ్ మైదానంలో చేపట్టాల్సిన సన్నాహకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గణతంత్ర వేడుకల్లో పతాకావిష్కరణ, వేదిక ఏర్పాట్లు, అలంకరణ పనులు సుందరంగా చేపట్టాలన్నారు. పరేడ్ మైదానంలో బారికేడ్లు, వైట్ వాష్ తదితర పనులను పూర్తి చేయాలన్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల సభ్యులు, ప్రత్యేక అతిథులను గౌరవ ప్రదంగా ఆహ్వానించాలన్నారు. జిల్లా ప్రగతిని ప్రతిబింబించేలా శకటాలు రూపొందించాలని, ఎగ్జిబిషన్ స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. దేశభక్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఉద్యోగులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించేందుకు ప్రతిపాదిత జాబితాను గడువులోపు సమర్పించాలన్నారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ... జిల్లా యంత్రాంగం సమన్వయంతో పోలీసు శాఖ తరఫున చేపట్టాల్సిన అన్ని భద్రతా, పరేడ్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ సువర్ణ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ ఆదేశం -
జాతీయ రహదారిపై పల్టీ కొట్టిన కారు
పరిగి: మండలంలోని నేతులపల్లి సమీపంలో 544ఈ జాతీయ రహదారిపై ఓ కారు పల్టీ కొట్టి బ్రిడ్జి సైడ్ వాల్పైకి ఎక్కింది. వివరాల్లోకి వెళితే... బెంగళూరులో ఐటీ ఉద్యోగులుగా స్థిరపడిన విజయ్, రమేష్ మడకశిర వైపు నుండి కొడికొండ వైపుగా కారులో ప్రయాణిస్తూ శుక్రవారం వేకువజామున నేతులపల్లి సమీపంలోని జయమంగళి నది వంతెన సమీపంలోకి చేరుకున్నారు. ఆ సమయంలో కమ్ముకున్న మంచు తెరల కారణంగా వంతెనపై చేపట్టిన మరమ్మతు పనులను డ్రైవర్ ఆలస్యంగా గుర్తించి కారు వేగాన్ని నియంత్రించే క్రమంలో అదుపు తప్పి పల్టీలు కొడుతూ నేరుగా వెళ్లి బ్రిడ్జి సైడ్వాల్ పైకి ఎక్కింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విజయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఇద్దరు ఐటీ ఉద్యోగులకు తీవ్ర గాయాలు శుక్రవారం తెల్లవారుజామున నేతులపల్లి వద్ద ఘటన పొగమంచుతో రోడ్డు కనిపించక అనర్థం -
సెలవులు వచ్చాయోచ్!
● నేటి నుంచి 18వ తేదీ వరకూ సంక్రాంతి సెలవులు ● కేరింతలు కొడుతూ ఇళ్లకు పరుగులు తీసిన చిన్నారులు పుట్టపర్తి: ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)–3 పరీక్షల నేపథ్యంలో వారం రోజులుగా పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులు శుక్రవారం పరీక్ష ముగియగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. ఇక జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద పనిచేసే విద్యా సంస్థలకు శనివారం నుంచి 18వ తేదీ వరకూ సంక్రాంతి సెలవులిచ్చారు. దీంతో చిన్నారులంతా శుక్రవారం పాఠశాల, కళాశాలలు ముగియగానే ఉత్సాహంగా ఇళ్లకు పరుగులు తీశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి వసతి గృహాల్లో ఉంటున్న వారంతా శుక్రవారం సాయంత్రం సామగ్రి సర్దుకుని సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో జిల్ల్లాలోని ఆర్టీసీ బస్టాండులు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. కేరింతలు కొడుతూ ఇళ్లకు వెళ్తున్న బత్తలపల్లి మండలం మాల్యవంతం హైస్కూల్ విద్యార్థులు -
చెడ్డీ గ్యాంగ్తో జాగ్రత్త!
● ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు ● దుండగులు మడకశిర ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అనుమానం మడకశిర: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి లూటీ చేయడం... ఆర్ధరాత్రి వేళ కాలింగ్ బెల్ నొక్కి తలుపుతీయగానే ఇంట్లోకి దూరి ఇంటిని కొల్లగొట్టే చెడ్డీగ్యాంగ్ జిల్లాలో సంచరిస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మడకశిర పోలీసులు సూచిస్తున్నారు. ప్రధానంగా మడకశిర పట్టణ శివారు ప్రాంతంలో ముఠా సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మడకశిర అర్బన్ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ లావణ్య చెడ్డీగ్యాంగ్ సభ్యుల ఫొటోలను విడుదల చేశారు. గ్యాంగ్ సభ్యులు ఎక్కడ కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాత్రి వేళల్లో ఎవరైనా తలుపులు తట్టినా, కాలింగ్ బెల్ నొక్కినా, ప్రమాదంలో ఉన్నామని అరిచినా.... వెంటనే తలుపులు తీయవద్దన్నారు. అవతల వ్యక్తులు ఎవరని నిర్ధారించుకున్న తర్వాతే తలుపులు తీయాలన్నారు. అనుమానిత వ్యక్తులు కనబడినా, అనుమానం కలిగే విధంగా వ్యవహరించినా... వారి గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. వీలున్న వారు ఇళ్లవద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఇళ్లల్లో నగదు, విలువైన బంగారు, వెండి ఆభరణాలను ఉంచుకోకుండా... బ్యాంకుల్లోని లాకర్లలో ఉంచాలని సూచించారు. చెడ్డీ గ్యాంగ్ సభ్యులను ఎవరైనా గుర్తిస్తే వెంటనే 9490112475, 9440796820 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
రేషన్ బియ్యం పట్టివేత
సోమందేపల్లి: అక్రమంగా ఐచర్ వాహనంలో తరలిస్తున్న 68 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమందేపల్లిలో రెవెన్యూ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామ సమీపంలోని ఓ గోదాము నుంచి రేషన్ బియ్యాన్ని ఐచర్ వాహనంలో లోడు చేస్తున్నట్లుగా సమాచారం అందుకున్న ఇన్చార్జ్ తహసీల్దార్ మారుతి వెంటనే అప్రమత్తమై సిబ్బందిని రంగంలో దించారు. అప్పటికే సోమందేపల్లికి చేరుకున్న వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేయడంతో 136 బస్తాల్లో తరలిస్తున్న 68 క్వింటాళ్ల రేషన్ బియ్యం బయటపడింది. వాహనాన్ని సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం బియ్యం తరలిస్తున్న హుస్సేన్ పీరాపై పోలీసులు కేసు నమోదు చేశారు.వ్యక్తిపై కేసు నమోదుకదిరి టౌన్: మహిళలపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు కదిరి పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. కదిరి మున్సిపల్ పరిధిలోని పిల్లవంక కాలనీలో నివాసముంటున్న అంజినప్ప ఇంటి ఎదురుగా ఉంటున్న శాంతమ్మకు ఇంటి పక్కనే ఉన్న రమణతో గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో పాత కక్షలను మనస్సులో పెట్టుకున్న రమణ శుక్రవారం ఉదయం శాంతమ్మపై కట్టెతో దాడి చేశాడు. ఆ సమయంలో అడ్డుకోబోయిన అంజినప్ప భార్యపై కూడా దాడికి తెగబడ్డాడు. ఘటనపై అంజినప్ప ఫిర్యాదు మేరకు రమణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.యువకుడి దుర్మరణంకదిరి టౌన్: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం రామనూతనపల్లి గ్రామానికి చెందిన మజుల రామచంద్ర కుమారుడు అశోక్ (26) కదిరి మండలం యర్రదొడ్డి గంగమ్మ గుడి వద్దకు కూలి పని కోసం వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. కదిరి మున్సిపల్ పరిధిలోని పులివెందుల కొత్త బైపాస్ వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డుగా ఉన్నఫళంగా దూసుకొచ్చిన జింకను తప్పించే క్రమంలో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి చిన్నాన్న శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు.‘ఉచిత వైద్య సేవలుసద్వినియోగం చేసుకోండి’పుట్టపర్తి అర్బన్: రాష్ట్రీయ బాల స్వస్త్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు అందిస్తున్న ఉచిత వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 2,822 అంగన్వాడీ కేంద్రాల్లో 1,42,049 మంది పిల్లలకు గాను 1,28,730 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే 2,058 ప్రభుత్వ పాఠశాలల్లోని 1,60,040 మంది విద్యార్ధులకు గాను ఇప్పటి వరకూ 1,19,212 మందికి ఆరోగ్య స్క్రీనింగ్ ప్రక్రియ పూర్తయిందన్నారు. పుట్టుకతో వచ్చే లోపాలు, బాల్యంలో వచ్చే వ్యాధులు, పోషకాహార లోపాలు, ఎదుగుదల లోపాలు కలిపి ఇప్పటి వరకూ 541 కేసులను గుర్తించామన్నారు. వీరికి అవసరమైన చికిత్సలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.11న ధర్మవరంలోసంక్రాంతి క్రీడాపోటీలుపుట్టపర్తి టౌన్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 11న ధర్మవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో సంక్రాంతి క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఈ మేరకు డీఎస్డీఓ కిషోర్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తాడాట, తొక్కుడు బిళ్ల, కర్రసాము, ఏడు పెంకులాట, తాడులాగుడు, గాలిపటాల పోటీలను నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు 98481 87636లో సంప్రదించవచ్చు. -
బెల్ట్షాపు మూయమన్నందుకు కేసు
చిలమత్తూరు: రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న టీడీపీ నేతలు... ప్రతిపక్ష పార్టీల నేతలపై పోలీసులను ఉసిగొలిపి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారు. తామేం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే 544–ఈ జాతీయ రహదారి కొడికొండ చెక్పోస్ట్లో అక్రమంగా ఏర్పాటు చేసిన బెల్ట్ దుకాణం వద్ద ఈ నెల 6న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. నిరుపేదల జీవితాలను నాశనం చేస్తున్న బెల్టు దుకాణాన్ని సీజ్ చేయాలని నిరసన తెలిపారు. ఎంతసేపటికీ ఎకై ్సజ్శాఖ అధికారులు రాకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బలవంతంగా ఖాళీ చేయించి వైఎస్సార్ సీపీ నేత వేణురెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. బెల్ట్ షాపును సీఐ జనార్దన్ మూసివేయించారు. అనంతరం వేణురెడ్డితో పాటు 23 మందిపై 132, 126(2), రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసలు ధర్నాలో పాల్గొనని వారినీ కేసులో ఇరికించారు. బెల్టు దుకాణాన్ని మూయాలని న్యాయంగా పోరాడిన వారిపై ఇలా రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదు చేయడంపై ప్రజలు, వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడుతున్నారు. అక్రమ కేసులతో ఉద్యమాలను అణచలేరు.. అక్రమ కేసులు బనాయించి ప్రజా ఉద్యమాలను అణచలేరని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. బెల్ట్ దుకాణాన్ని తొలగించాలని శాంతియుత నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, తాము కూడా శాంతియుతంగానే నిరసన తెలిపామన్నారు. అయినా కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, అధికార టీడీపీ ఆడిచ్చినట్టు ఆడుతున్నారన్నారు. చేతనైతే అక్రమాలు చేస్తున్న టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలన్నారు. కేసులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడవద్దని... ఎవరెన్ని చేసినా ప్రజల కోసం పోరాటమే లక్ష్యంగా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. కేసుల సంగతి పార్టీ చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ నేత వేణురెడ్డితోపాటు 23 మందిపై కేసు నమోదు ధర్నాలో పాల్గొనని వారినీ కేసులో ఇరికించిన వైనం -
సాగులో రైతుకు తోడుగా నిలుద్దాం
ప్రశాంతి నిలయం: రైతులకు సాగులో సాయంగా నిలుద్దామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశం జరిగింది. 2026–27 సంవత్సరానికి జిల్లాలో సాగు చేయనున్న వివిధ పంటలకు అందించబోయే ఆర్థిక సాయం, పంటల వ్యయ అంచనాలు, రైతులకు అందాల్సిన రుణ పరిమాణం, వడ్డీ భారం తగ్గింపు తదితర అంశాలపై చర్చించారు. వ్యవసాయ పరిస్థితులు, పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు ఆధారంగా రూపొందించిన ప్రతిపాదనలను పరిశీలించి రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీకి పంపేందుకు ఆమోదం తెలిపారు. రైతులకు రుణాలు సకాలంలో అందించాలని బ్యాంకర్లకు సూచించారు. జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ సమావేశంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ -
సైబర్ వల.. విలవిల
● హిందూపురానికి చెందిన ఓ యువకుడు బెంగళూరులో బేల్దారిగా పనిచేసే వాడు. స్నేహితులను చూసి ఆన్లైన్లో బెట్టింగ్ అలవాటు చేసుకున్నాడు. ఇప్పటికే రూ.లక్షలు పోగొట్టుకున్నాడు. ఇటీవల అతను బెట్టింగ్ గెలిచాడు. అతని అకౌంట్కు రూ.50 వేలు నగదు బదిలీ అయ్యింది. కానీ విత్డ్రా చేసేందుకు వెళ్తే డబ్బు రావడం లేదు. బ్యాంకుకు వెళ్తే అది ఫ్రాండ్ మనీ అని, అందుకే ఫ్రీజ్ చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ● గతేడాది చిలమత్తూరు మండలం టేకులోడు గ్రామానికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. తాము ఇక్కడే కార్మికులుగా పనిచేస్తున్నామని, డబ్బుతో అర్జెంట్గా పని పడిందని క్యాష్ ఇస్తే ..అకౌంట్లో కాస్త ఎక్కువగానే నగదు జమ చేయిస్తామని రైతులకు తెలిపారు. దీంతో వారు క్యాష్ ఇవ్వగా.. వారి అకౌంట్లలోకి ఇతర రాష్ట్రాల్లోని అకౌంట్ నుంచి డబ్బు జమ అయ్యింది. అయితే ఈ సాయంత్రానికే ఆ ఖాతాలన్నీ ఫ్రీజ్ అయ్యాయి. రైతులు బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా.. అది ఫ్రాడ్ మనీ అని, సైబర్ క్రైమ్ కేసు కావడంతో ఫ్రీజ్ చేశామని తెలిపారు. ● కదిరికి చెందిన ఓ యువకుడికి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. భారీ ప్యాకేజీ లభించడంతో సదరు యువకుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఆ కంపెనీ అధికారుల కోరిక మేరకు ఆరునెలల బ్యాంకు స్టేట్మెంట్ ఇచ్చాడు. పరిశీలించిన అధికారులు ఉద్యోగం ఇవ్వలేమని చెప్పారు. కారణం ఆరా తీస్తే గుర్తుతెలియని ఖాతాల నుంచి ఖాతాలో నగదు జమైందని, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వ్యక్తులను ఉద్యోగంలోకి తీసుకోబోమన్నారు. అది తన స్నేహితుడి కోసం ఇతరులు పంపిన మొత్తమని చెప్పినా... వారు వినిపించుకోలేదు. ...ఇలా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను లూటీ చేస్తున్నారు. నేరుగా డబ్బు తీసుకుని ఇతర అకౌంట్ల నుంచి డబ్బులు వేయిస్తూ సైబర్ క్రైంలో ఇరికిస్తున్నారు. అప్పటికే డబ్బు పోగొట్టుకున్న వారు తాజాగా సైబర్ క్రైం కేసులతో సతమతమవుతున్నారు. చిలమత్తూరు: సమాజంలో రోజురోజుకూ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. కేటుగాళ్లు కొత్తరకం మోసాలతో నిరక్షరాస్యులనే కాదు విద్యావంతులను సైతం బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతూ సొమ్ము కాజేస్తున్నారు. ‘సైబర్’ దెబ్బకు బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మంతా ఖాళీ అవుతుండగా, ఫ్రాడ్ సొమ్ము వారికి తెలియకుండానే బ్యాంక్ ఖాతాలకు మళ్లడంతో సైబర్ కేసులు మీద పడుతున్నాయి. అంతేకాకుండా బ్యాంక్ ఖాతాలన్నీ ఫ్రీజ్ అవుతున్నాయి. యూపీఐ పేమెంట్లు వచ్చిన తర్వాత సైబర్ నేరాలు భారీగా పెరిగిపోయాయి. ఒకటి బయటపడేలోపే మరో తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. బెట్టింగ్ సైట్ల సొమ్మంతా ఫ్రాడ్.. దేశంలో ఆన్లైన్ ఫాంటసీ, గేమింగ్, బెట్టింగ్ యాప్లు, సైట్లపై కేంద్రం నిషేధించింది. కానీ ఇంకా చాలా బెట్టింగ్ యాప్లు చలామణిలోనే ఉన్నాయి. దీంతో బెట్టింగ్లకు అలవాటు పడిన వాళ్లు వాటి ద్వారా బెట్టింగ్ వేస్తూ డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఒక్కోసారి బెట్టింగ్లో గెలిచినా వారి ఖాతాలకు ఫ్రాడ్ నగదు వచ్చి చేరుతోంది. సైబర్ క్రైం రిపోర్ట్ అయిన తర్వాతే అసలు విషయం తెలుస్తోంది. నేరుగా అకౌంట్ నుంచి నగదు తీసుకునే వెబ్సైట్లు... తాము ఇవ్వాల్సి వచ్చినప్పుడు...ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న ఇతరుల ఖాతాల నుంచి నగదు పంపుతున్నారు. ఇది మరొకచోట సైబర్ మోసాలకు పాల్పడి నొక్కేసిన నగదు ఉంటుండటంతో బెట్టింగ్రాయుళ్ల ఖాతాలు ఫ్రీజ్ అవుతున్నాయి. దేశంలో నిషేధంలో ఉన్న ఫాంటసీ గేమింగ్ను వెబ్సైట్ల ద్వారా, టెలిగ్రాంల ద్వారా కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో మోసపోతున్న వారి జాబితా అంతకంతకూ పెరుగుతోంది. అమాయకులను టార్గెట్ చేసి.. జిల్లాలోని మారుమూల గ్రామాల్లోకి వస్తున్న సైబర్ నేరగాళ్లు..తమకు చాలా అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని, డబ్బులిస్తే అకౌంట్లో నగదు జమ చేయిస్తామని, ఇందుకు అదనంగా డబ్బు కూడా చెల్లిస్తామని ఆశలు కల్పిస్తున్నారు. నమ్మి డబ్బులిస్తే వెంటనే ఇతర రాష్ట్రాల అకౌంట్ల నుంచి నగదు జమ చేయిస్తారు. అయితే ఆ డబ్బు ఫ్రాడ్ మనీగా తేలి అకౌంట్ ఫ్రీజ్ అవుతుండగా బాధితులు లబోదిబోమంటున్నారు. పైగా సైబర్ క్రైం కేసులో ఇరుక్కుని రోజుల తరబడి పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఫ్రాడ్ మనీ అంటే సైబర్ నేరగాళ్లు అమాయకులకు డబ్బు ఆశ చూపి వారి బ్యాంకు అకౌంట్లను తీసుకుంటారు. ఆ అకౌంట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు నడుపుతారు. మిగతా వారికీ టోకరా వేసి డబ్బును సదరు అకౌంట్లకు జమ చేయించుకుంటారు. అరకొర డబ్బు పంపేందుకు ఆ బ్యాంకు ఖాతాలను వాడుకుంటారు. దీన్నే ఫ్రాడ్ మనీ అంటారు. అయితే అప్పటికే ఆ అకౌంట్లపై ఫిర్యాదులు అంది ఉండటం వల్ల సైబర్ క్రైం విభాగం ఫిర్యాదు మేరకు బ్యాంకు అధికారులు ఆ అకౌంట్ నుంచి ఏయే ఖాతాలకు నగదు బదిలీ అయ్యిందో ఆ ఖాతాలన్నీ బ్లాక్ చేస్తారు. ఎంత నగదు బదిలీ చేశారో అంత మొత్తం ‘మైనస్’ చేస్తారు. దీంతో నగదు జమ కాకపోగా.. ఎదురు చెల్లించాల్సి వస్తుంది. -
ఇష్టారాజ్యంగా పనిచేస్తే ఇంటికి పంపుతా
● బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్పై కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆగ్రహం పుట్టపర్తి అర్బన్: ‘‘మీ పనితీరుపై ప్రజల నుంచి ఫిర్యాదులు చాలా అందుతున్నాయి.. సేవ చేయాల్సిన మీరు ఇష్టారాజ్యంగా పనిచేస్తే చర్యలు తప్పవు. మరోసారి ఫిర్యాదులు అందితే ఇంటికి పంపుతా జాగ్రత్త’’ అంటూ బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ మురళీకృష్ణపై కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టర్ బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించారు. రిజిస్ట్రేషన్ పని మీద అక్కడికి వచ్చిన వారితో మాట్లాడి సమస్యలు ఆరా తీశారు. ఈ సందర్భంలోనే సబ్ రిజిస్ట్రార్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. అనంతరం ఆయన సబ్రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందితో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ప్రతి పని పారదర్శకంగా ఉండాలన్నారు. అనవసరంగా ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం మానుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేయాలన్నారు. కార్యాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, రికార్డులు భద్రంగా ఉంచాలని ఆదేశించారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ముదిగుబ్బ: రీసర్వే పూర్తయిన మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలోని రైతులకు గురువారం కలెక్టర్ శ్యాం ప్రసాద్ నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ రికార్డుల పారదర్శకతతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. పాసు పుస్తకాలతో రైతులకు ప్రభుత్వ పథకాలు సులభంగా అందుతాయన్నారు. అలాగే రీసర్వే పూర్తయి కచ్చితమైన హద్దులు చూపడం వల్ల భూతగాదాలకు ఆస్కారం ఉండదన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ నారాయణస్వామి, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. బ్రాహ్మణపల్లిలో పాసుపుస్తకాలు పంపిణీ చేసిన జేసీ సోమందేపల్లి: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గురువారం పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్నామన్నారు. అనంతరం జేసీ జూలకుంట గ్రామంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అంతకుముందు సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందించాలని సిబ్బందిని ఆదేశించారు. జేసీ వెంట ఆర్డీఓ ఆనంద్ కుమార్, ఏపీ మార్క్ఫెడ్ మేనేజర్ గీత, తహసీల్దార్ మారుతి, రైతులు తదితరులు ఉన్నారు. వీఆర్కు తనకల్లు ఎస్ఐ గోపి తనకల్లు: సబ్ఇన్స్పెక్టర్ గోపిని వీఆర్కు పంపుతూ పోలీసు ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. ఈ నెల 5వ తేదీ తెల్లవారుజూమున స్థానిక పోలీస్స్టేషన్ గేటు ముందు ఈశ్వరప్ప అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పోలీసులు ఎదుటే జరిగింది. ఇందుకు బాధ్యున్ని చేస్తూ ఎస్ఐ గోపీని వీఆర్కు పంపినట్లు తెలుస్తోంది. -
అప్రమత్తంగా ఉండాలి
సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ ఫోన్లకు వచ్చే తెలియని మెసేజ్లను వెంటనే తొలగించాలి. ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగినా చెప్పకూడదు. తెలియనివారు అకౌంట్కు డబ్బు వేస్తామంటే అస్సలు అంగీకరించకూడదు. అనుమానం వస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. ఆన్లైన్ బెట్టింగ్లు, ఆఫ్లైన్ బెట్టింగ్లు నిషేధంలో ఉన్నాయి. ఇతర మార్గాల్లో బెట్టింగ్ ఆడినా వారికి దక్కేది ఫ్రాడ్ మనీనే. అందుకే అప్రమత్తంగా ఉండాలి. – సతీష్ కుమార్, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ -
కోర్టుకు బాంబు బెదిరింపు
అనంతపురం: బాంబు బెదిరింపుల నేపథ్యంలో అనంతపురం జిల్లా కోర్టులో గురువారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా సుమారు 50 జిల్లా కోర్టులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపుల ఈ–మెయిల్స్ అందాయి. ‘మహమ్మద్ అస్లాం విక్రమ్ తమిళ లిబరేషన్ ఆర్గనైజేషన్ (టీఎల్ఓ)’ పేరిట ఈ–మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు. అనంతపురం జిల్లా కోర్టు, రికార్డుల రూంలో తనిఖీలు నిర్వహించారు. అవి ఉత్తుత్తి బెదిరింపులని తేలిందని అనంతపురం టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. కోర్టు ఆవరణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, బాంబు బెదిరింపుల నేపథ్యంలో గురువారం జిల్లా కోర్టులో కార్యకలాపాలన్నీ బంద్ చేశారు. కేసుల విచారణకు ఆటంకం ఏర్పడింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీల్లో ఇద్దరికి చోటు చిలమత్తూరు: వైఎస్సార్ సీపీ అనుబంధ కమిటీల్లో ఇద్దరు జిల్లావాసులకు చోటు దక్కింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు హిందూపురానికి చెందిన వాల్మీకి లోకేష్ను యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అలాగే పుట్టపర్తి నియోజకవర్గానికి చెందిన టి. చంద్రశేఖర్రెడ్డిని లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. తనపై నమ్మకం ఉంచి పదవి అప్పగించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి వాల్మీకి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన ఎంపికకు సహకరించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపికకు కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యా ప్రమాణాలు మెరుగు పడాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలోని కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గిరిజన సంక్షేమ వసతి పాఠశాలలు, మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ సంక్షేమ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగు పడేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సంక్షేమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై గురువారం సంబంధిత అధికారులతో జేసీ సమీక్షించారు. విద్యార్థులకు అందిస్తున్న వసతులు, భోజన నాణ్యత, బోధన, భద్రత, పారిశుధ్యం, విద్యుత్, తాగునీటి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బాలికల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదన్నారు. సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈఓ కిష్టప్ప, ఏపీసీ దేవరాజు, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్రెడ్డి, ఎంఈఓలు, వసతి గృహాల సిబ్బంది పాల్గొన్నారు. -
నల్లచెరువు వాసికి రూ.2 కోట్ల వార్షిక వేతనం
కదిరి టౌన్: నల్లచెరువు మండలం మారిశెట్టిపల్లిలో పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగించే రాధా, రమణ దంపతుల కుమారుడు ఎం.సాయిమురళి అమెరికాలో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సాధారణ కుటుంబంలో జన్మించిన సాయి మురళి 1 నుంచి 8 వరకు హైదరాబాదులోని కేంద్రీయ విద్యాలయంలో, 9, 10 తరగతులు బెంగళూరులోని కేంద్రీయ విద్యాలయంలో చదివాడు. ఇంటర్మీడియట్ తిరుపతిలోని శ్రీచైతన్య కళాశాలలో పూర్తి చేశాడు. తమిళనాడులోని కలసలింగం యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదివాడు. అమెరికాలోని స్టోనీ బ్రూక్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో ఎంఎస్ చదివాడు. అక్కడే రూ.2 కోట్ల వార్షిక వేతనంతో మైక్రోసాఫ్ట్ సంస్థలో ఉద్యోగానికి ఎంపికై .. ఈ నెల ఐదో తేదీన విధుల్లో చేరాడు. -
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం.. యువకుడి మృతి
బస్సు దిగి లగేజీ కోసం వెళ్లిన ప్రయాణికుడి కోసం ఒక్క క్షణం కూడా వేచి చూడకుండా ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వెనక నుంచి కేకలు వేస్తూ పరుగున వస్తున్న ప్రయాణికుడి గురించి ఏ మాత్రమూ పట్టించుకోకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో బస్సు వెనక పరుగు తీస్తూ ఎగశ్వాసతో గుండెపోటుకు గురై యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం ఉదయం కొత్తచెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. పుట్టపర్తి టౌన్: నల్లమాడ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం (33) పుట్టపర్తిలోని ఎస్బీఐ శాఖలో నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి విధులకు హాజరైన ఆయన గురువారం ఉదయం డ్యూటీ దిగి స్వగ్రామానికి వెళ్లేందుకు పుట్టపర్తి నుంచి బయలుదేరి కొత్తచెరువుకు చేరుకున్నాడు. నల్లమాడకు వెళ్లే ఆర్టీసీ బస్సు రాగానే బస్సులో కొంత లగేజీ ఉంచి, మిగిలిన లగేజీ తీసుకొస్తానంటూ డ్రైవర్కు తెలిపి బస్సు దిగి వెళ్లాడు. ఆ సమయంలో డ్రైవర్ వేచి చూడకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. గమనించిన పురుషోత్తం లగేజీతో బస్సు వెనకాల పరుగెడుతూ కేకలు వేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఎగశ్వాసతో ఇబ్బంది పడుతూ ఉన్నఫళంగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు గుండెపోటుకు గురైనట్లుగా నిర్ధారించుకుని సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదు. అతని వద్ద లభ్యమైన ఆధారాలను పరిశీలించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న కుమారుడి మృతితో తల్లిదండ్రుల వేదనకు అంతు లేకుండా పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిగులు లగేజీ తెచ్చేందుకు బస్సు దిగిన ప్రయాణికుడు క్షణం కూడా వేచి చూడకుండా బస్సును ముందుకు పోనిచ్చిన డ్రైవర్ లగేజీ ఎత్తుకుని బస్సు వెనుక పరుగెడుతూ గుండెపోటుకు గురైన వైనం స్థానికులు సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు -
ఆసక్తిగా పాల దిగుబడి పోటీలు
రాప్తాడు రూరల్: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ’అనంత పాల ధార’ జిల్లా స్థాయి పాల దిగుబడి పోటీలు అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లిలో గురువారం ఆసక్తిగా సాగాయి. ఉదయం 6 గంటల నుంచే శింగనమల, నార్పల, బుక్కరాయసముద్రం, రాప్తాడు, అనంతపురం రూరల్ తదితర మండలాల నుంచి 59 మంది పాడి రైతులు ఉత్సాహంగా తమ పశువులతో పోటీలకు తరలివచ్చారు. పారదర్శకత, శాసీ్త్రయ ప్రమాణాలకు అనుగుణంగా అనుభవజ్ఞులైన పశువైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు, పాల కొలతలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు మరోమారు పాల ఉత్పత్తి నమోదు చేశారు. ఉదయం, సాయంత్రం పాల దిగుబడుల ఆధారంగా విజేత పాడి పశువులను ఎంపిక చేశారు. ● దేశవాళీ ఆవుల విభాగంలో బీకేఎస్ మండలం ఎస్.కొండాపురానికి రైతు భరత్ ఆవు 10.58 కేజీలు, గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన రైతు మహాలక్ష్మి రమణ ఆవు 8.16 కేజీలు, అదే గ్రామానికి చెందిన మహాలక్ష్మి శ్రీనివాసులు ఆవు 6.94 కేజీలతో వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ● గేదెల కేటగిరీలో బీకేఎస్ మండలం ఎస్.కొండాపురం గ్రామానికి చెందిన రైతు బుగ్గ శ్రీనివాసులు గేదె 24.38 కేజీలు, అదే గ్రామానికి చెందిన పోతులయ్య గేదె 19.18 కేజీలు, అనంతపురం రూరల్ మండలం కామారుపల్లి రైతు శ్రావణ్కుమార్కు చెందిన గేదె 16.2 కేజీల పాలతో తొలి మూడు స్థానాలు దక్కించుకున్నాయి. ● సంకరజాతి ఆవుల కేటగిరీలో శింగనమల మండలం చక్రాయపేటకు చెందిన రైతు ఏలేటి మధుసూదన్ రెడ్డి ఆవు 29. 42 కేజీలు, అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లికి చెందిన మల్లె కృష్ణారెడ్డి ఆవు 27.04 కేజీలు, ఇటుకలపల్లికి చెందిన బండి ఉదయ్ కిరణ్ ఆవు 24.90 కేజీల పాలతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. దేశవాళీ ఆవులు, గేదెల కేటగిరీల పోటీల్లో ఎస్.కొండాపురం విజయం సంకరజాతి ఆవుల కేటగిరీలో చక్రాయపేట టాప్ -
విద్యుదాఘాతంతో రైతు మృతి
● అప్పటికే కరెంట్ షాక్తో మృతి చెందిన ఆవు ● ఆవుకు ఏమైందోనని ఆత్రుతతో వెళ్లి ముట్టుకున్న వైనం ● ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు మృతి శింగనమల: మండలంలోని కల్లుమడి గ్రామంలో విద్యుత్ షాక్కు గురై రైతు పట్రా నరేష్ (38) మృతి చెందాడు. వ్యవసాయంతో పాటు పాడిపోషణతో జీవనం సాగిస్తున్న ఆయన గురువారం తెల్లవారుజామున పశువుల షెడ్డును శుభ్రం చేసేందుకు వెళ్లాడు. అప్పటికే షెడ్డులో కిందకు వేలాడుతున్న కరెంట్ తీగ తగిలి ఓ ఆవు మృతి చెంది ఉంది. అయితే విద్యుత్ షాక్తో ఆవు మృతి చెందిన విషయం తెలియని పట్రా నరేష్ ఆత్రుతతో ఆవుకు ఏమైందోనని వెళ్లి ముట్టుకున్నాడు. దీంతో షాక్కు గురై గట్టిగా కేక వేసి కుప్పకూలాడు. అరుపు విన్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని అపస్మారకంగా పడి ఉన్న నరేష్ను వెంటనే పామిడిలోనీ సీహెచ్సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రైతు నరేష్కు భార్య ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ చితంబరయ్య తెలిపారు. మాతాశిశు మరణాలను అరికట్టాలి పుట్టపర్తి అర్బన్: జిల్లాలో మాతాశిశు మరణాలను పూర్తిగా అరికట్టాలని సంబంధిత అధికారులను డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం, డీసీహెచ్ఎస్ డాక్టర్ మధు సూదన్ సూచించారు. గత ఏడాది డిసెంబర్లో జిల్లాలో చోటు చేసుకున్న ఓ మాతృ, మరో 7 శిశు మరణాలపై సంబంధిత వైద్యాధికారులతో గురువారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో వారు సమీక్షించారు. మరణాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండడంతో ఇకపై ఒక్క మరణం కూడా సంభవించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గర్భస్థ సమయం నుంచి కాన్పు జరిగే వరకూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సురేష్బాబు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మంజువాణి, డాక్టర్ సునీల్కుమార్, డీపీహెచ్ఎన్ వీరమ్మ, చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ ముసిరా బేగం, ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ సులోచన, ఐసీడీఎస్ సీడీపీఓలు పాల్గొన్నారు. -
సీమ ఉద్యమాల ‘కదలిక’
● రేపు ‘ఇమామ్ ప్రస్థానం’ పుస్తకావిష్కరణ అనంతపురం కల్చరల్: రాయలసీమ ఉద్యకారునిగా.. రచయితగా.. వ్యాసకర్తగా.. జర్నలిస్టుగా సీమ వాసులకు ఇమామ్ చిరపరిచితుడు. సుదీర్ఘకాలం తన స్వీయ సంపాదకీయంలో కదలిక పేరుతో పత్రిక నడిపిన ఆయన కదలిక ఇమామ్గా ఖ్యాతిగాంచారు. ముఖ్యంగా సీమ ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన ఆయనకు వైఎస్సార్ కుటుంబంతో విడదీయలేని బాంధవ్యం ఉంది. నిఖార్సయిన జర్నలిస్టుగా, తన వాడి కలంతో ఎన్నో మెదళ్లను కదిలించారు. ప్రజా పోరాటాలలో నెలల తరబడి జైళ్లకూ వెళ్లారు. రాయలసీమలోని అన్ని జిల్లాల ఉద్యమకారులతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఇమామ్.. ఆరు దశాబ్దాల పాటూ ప్రజా ఉద్యమాలను ఎంతో ప్రభావితం చేశారు. ఈ క్రమంలో నేటి తరం గుర్తుంచుకునేలా ఆయన జీవితం అక్షర రూపం దాల్చి ‘ఇమామ్ ప్రస్థానం’ పేరిట రూపుదిద్దుకుంది. వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాలతో మమేకమైన ‘ఇమామ్ ప్రస్థానం’ శనివారం అనంతపురంలోని మూడో రోడ్డు జీఆర్ మినీ ఫంక్షన్ హాలు ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
సాయికాళేశ్వర్ ఆశయ సాధనే లక్ష్యం
పెనుకొండ: సాయికాళేశ్వర్ ఆశయ సాధనే షిర్డీ సాయి గ్లోబల్ ట్రస్ట్ లక్ష్యమని ట్రస్ట్ అధినేత శిల్పా అనుపాటి పేర్కొన్నారు. పెనుకొండలోని శివసాయి మందిరంలో గురువారం సాయికాళేశ్వర్ 53వ జయంతి సందర్భంగా శిల్పా అనుపాటి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సాయికాళేశ్వర్ ఘాట్ వద్ద శిల్ప, ఆమె కుమార్తె నవ్యశ్రీ, కుటుంబసభ్యులు మదన్మోహన్రెడ్డి, నాగిరెడ్డి, ఆశ్రమ సిబ్బంది చిట్టిబాబు, హరి, బాబు, ప్రగతి శ్రీనివాసులు, న్యాయవాది గురుప్రసాద్, జాన్ప్రియనాథ్, విదేశీ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పేదలకు ఉచిత కంటి, చెవి, నరాల జబ్బులకు సంబంధించి ప్రత్యేక వైద్యశిబిరాన్ని విదేశీ భక్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా అనుపాటి మాట్లాడారు. సాయి కాళేశ్వర్ సేవలను కొనియాడారు. ఆయన చూపిన బాటలోనే తాము కూడా నడుస్తూ వేలాది మంది పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఇది నిరవధిక ప్రక్రియగా కొనసాగుతుందని, భవిష్యత్తులో మరిన్ని సేవలు విస్తృతం చేస్తామన్నారు. అనంతరం పెనుకొండ మండలం కోనాపురం గ్రామంలో సప్పలమ్మ ఆలయ గోపురం నిర్మాణానికి ట్రస్ట్ తరఫున రూ. 4 లక్షలు విరాళాన్ని అందజేశారు. శిల్పా అనుపాటి -
సౌత్జోన్ హాకీ జట్టులో మంగళకర విద్యార్థి
పుట్టపర్తి అర్బన్: తమిళనాడులోని చైన్నైలో ఉన్న సత్యభామా యూనివర్సిటీ వేదికగా ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకూ జరిగే సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ హాకీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఎస్కేయూ జట్టులో పుట్టపర్తి మండలం జగరాజుపల్లి మంగళకర బీకాం మూడో సంవత్సర విద్యార్థి మహేష్కు చోటు దక్కింది. ఈ మేరకు మంగళకర మేనేజింగ్ ట్రస్టీ సురేష్ గురువారం వెల్లడించారు. ప్రతిభ చాటిన మహేష్ను అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ఆర్యా ప్రకాష్, ఏఓ జయచంద్రారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రమేష్బాబు, పీడీ శ్రీనివాసులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పీఏబీఆర్లో నిలకడగా నీటి నిల్వకూడేరు: మండలంలోని పెన్నహోబిల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో సమంగా ఉండడంతో నీటి నిల్వ నిలకడగా ఉంది. గురువారం నాటికి జలాశయంలో 5.09 టీఎంసీల నీరు నిల్వ ఉంది. హెచ్చెల్సీ ద్వారా 306 క్యూసెక్కులు, హంద్రీ నీవా ద్వారా 224 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి చేరుతోంది. ధర్మవరం కుడికాలువకు 380 క్యూసెక్కులు, తాగునీటి ప్రాజెక్టులకు, నీటి ఆవిరి, లీకేజీ రూపంలో మరో 160 క్యూసెక్కుల నీరు బయటకు వెళుతున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఉల్లి పంటపై విష ప్రయోగం చిలమత్తూరు: మండలంలోని చాగలేరు పంచాయతీ మరువపల్లి గ్రామంలో ఉల్లి పంటపై దుండగులు విషప్రయోగం చేశారు. గ్రామానికి చెందిన రైతు శ్రీరామప్ప తనకున్న మూడు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశాడు. మరో 20 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇలాంటి తరుణంలో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో పంట మొత్తం వాడిపోయింది. దీంతో రూ.2.50 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. విషయం తెలుసుకున్న సీపీఎం నేతలు వెంకటేష్, రామచంద్ర, తదితరులు కాలిపోయిన పంటను పరిశీలించారు. పంటపై విషప్రయోగం చేసిన వారిని గుర్తించి, బాధిత రైతుకు న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు ధర్మవరం అర్బన్: స్థానిక శివానగర్కు చెందిన 7వ తరగతి విద్యార్థి హర్షవర్దన్రెడ్డి కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. ఈనెల 4న మధ్యాహ్నం కదిరి గేట్ వద్ద ఉన్న వారి చికెన్ సెంటర్లో పనిచేసే ఇర్ఫాన్తో హోటల్కెళ్లి భోజనం చేసి వస్తానని చెప్పి హర్షవర్దన్ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇంటికి చేరుకోలేదు. తల్లిదండ్రులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బాలుడి తల్లి శివరత్నమ్మ ఫిర్యాదు మేరకు గురువారం మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లునట్లు పోలీసులు తెలిపారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు 94407 96830 (డీఎస్పీ), 94407 96831 (సీఐ), 79892 79912, 78939 27761 (బాలుడి బంధువులు) కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఊరేగింపుగా రిమాండ్కు! కదిరి టౌన్: తనకల్లు పోలీస్స్టేషన్ గేటు ఎదుట మార్పూరివాండ్లపల్లికి చెందిన ఈశ్వరయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో అరైస్టెన నిందితులను గురువారం కదిరి ఆర్అండ్బీ బంగ్లా నుంచి సబ్ జైలు వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంతకు ముందు నిందితులు ఎర్రి హరి, చిన్నప్ప, గంగులప్ప, శంకర్ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించాల్సి ఉండడంతో వారిని కదిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ఆధ్వర్యంలో ఆర్అండ్బీ బంగ్లా నుంచి సబ్ జైలు వరకూ నడిపించుకుంటూ వెళ్లి, జైలు అధికారికి అప్పగించారు. -
ఆత్మస్థైర్యం ముందు ఏదీ తక్కువ కాదు
హిందూపురం: ఆత్మసైర్యం ముందు ఏ వైకల్యం తక్కువ కాదని, పట్టుదలతో శ్రమిస్తే దేనినైనా సాధించవచ్చునని ఆపరేషన్ సిందూర్లో పాలు పంచుకున్న సైనికాధికారి బ్రిగేడియర్ రాజేష్ భాస్కర్ అన్నారు.గురువారం హిందూపురం భవిత కేంద్రంలోని దివ్యాంగ చిన్నారులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా యానకు భవిత కేంద్రంలో చేపట్టిన కార్యక్రమాలను ఎంఈఓ గంగప్ప వివరించారు. పిల్లలు దివ్యాంగులుగా పుట్టారని తల్లిదండ్రులు ఎవరూ బాధపడాల్సిన పనిలేదన్నారు. వారిలో ఆత్మస్థైర్యం నింపి, మేమున్నామని అంటే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని పేర్కొన్నారు. అనంతరం రాజేష్ భాస్కర్ను అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో భవిత కేంద్రం స్థల దాత బైసాని రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బ్రిగేడియర్ రాజేష్ భాస్కర్ -
ముద్దాయిలకు శిక్ష పడేలా చేస్తాం
● నేర ప్రాంతానికి వేగంగా చేరుకునేందుకు ప్రత్యేక వాహనాలు ● క్రైం స్పాట్ క్లూస్ టీం వాహనాల ప్రారంభంలో ఎస్పీ సతీష్కుమార్ ధర్మవరం అర్బన్: వివిధ కేసుల్లోని ముద్దాయిలకు శిక్ష పడేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. ఈ క్రమంలోనే ఏదైనా నేరం జరిగినప్పుడు వీలైనంత త్వరగా నేర ప్రాంతానికి చేరుకుని ఆధారాలు సేకరించేందుకు వీలుగా క్రైం స్పాట్ క్లూస్ టీం వాహనాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. బుధవారం ఆయన ఏఎస్పీ అంకిత సురానాతో కలిసి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో క్రైం స్పాట్ క్లూస్ టీం ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో ఎక్కడ నేరం జరిగినా ఆధారాల సేకరణ కోసం గతంలో జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీం రావాల్సి వచ్చేదని, ఆలోపు కీలకమైన ఆధారాలు చాలా వరకు కనుమరుగయ్యే పరిస్థితి ఉండేదన్నారు. ఈ లోపాన్ని పూర్తిగా తొలగించేందుకు ప్రతి సబ్ డివిజన్కు ఒక ప్రత్యేక క్రైం స్పాట్ క్లూస్ టీం వాహనాన్ని కేటాయించామని తెలిపారు. వేలిముద్రలు, భౌతిక ఆధారాలు, సాంకేతిక ఆధారాలను సేకరించేందుకు అవసరమైన ఆధునిక పరికరాలతో ఈ వాహనాలు పూర్తిగా సన్నద్ధంగా ఉంటాయని తెలిపారు. ప్రతి వాహనానికి ఒక ఇన్చార్జ్తో పాటు ఇద్దరు సిబ్బంది, డ్రైవర్ను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ కూడా అందించామన్నారు. అనంతరం అడిషనల్ ఎస్పీ అంకిత సురానా మాట్లాడారు. కార్యక్రమంలో ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్, సీఐలు రెడ్డెప్ప, ప్రభాకర్, శ్రీధర్, సునీత, క్లూస్టీం ఇన్స్పెక్టర్ అనిల్కుమార్, ఆర్ఐ వలి పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
తనకల్లు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి హత్య కేసులో కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తనకల్లు పీఎస్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి వెల్లడించారు. స్థానిక మండలంలోని రాగినేపల్లికి చెందిన ఎర్రి హరి తన భార్య నాగ శిరీష కనిపించడం లేదని ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మార్పురీవాండ్లపల్లికి చెందిన ఈశ్వరప్ప తన భార్యను ఏటో తీసుకెళ్లాడంటూ ఫిర్యాదులో అనుమానాలు వ్యక్తం చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో తిరుపతి జిల్లా గూడూరులో తలదాచుకున్న ఈశ్వరప్ప, నాగశిరీషతో పాటు రమ్య అనే యువతిని ఈ నెల 4న ఆధీనంలోకి తీసుకుని అదే రోజు రాత్రి అక్కడి నుంచి స్కార్పియో వాహనంలో తిరుగు ప్రయాణయ్యారు. నాగ శిరీషాను గుర్తు పట్టేందుకు భర్త ఎర్రి హరిని కూడా ఆ సమయంలో పోలీసులు తమ వెంట గూడూరుకు పిలుచుకెళ్లారు. స్టేషన్ ఎదుటనే దారుణం భార్య కనిపించకుండా పోవడం... ఈశ్వరప్పపై అనుమానాలు బలపడడంతో ఎర్రి హరి కక్షతో రగలిపోయాడు. ఈ నేపథ్యంలో తన అన్న చిన్నప్ప, దూరపు బంధువు శంకరప్ప, గంగులప్పతో కలసి ఎలాగైనా ఈశ్వరప్పను హతమార్చాలని పథకం సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులతో పాటు గూడూరుకు స్కార్పియో వాహన డ్రైవర్గా గంగులప్పను పిలుచుకెళ్లాడు. అక్కడ భార్యను గుర్తు పట్టిన అనంతరం ఆమెతో పాటు రమ్య, ఈశ్వరప్పను పోలీసులు ఆధీనంలోకి తీసుకుని అదే స్కార్పియో వాహనంలో తనకల్లుకు తిరుగు ప్రయాణయ్యారు. ఈ విషయాన్ని తన సోదరుడు చిన్నప్పకు ఎర్రి హరి తెలిపి ప్రణాళిక మేరకు సిద్ధంగా ఉండాలన్నాడు. దీంతో చిన్నప్ప, శంకరప్ప రెండు వేట కొడవళ్లతో పోలీస్స్టేషన్ వద్ద మాటు వేశారు. ఈ నెల 5న తెల్లవారుజామున తనకల్లు పీఎస్ ఎదుట వాహనం ఆగగానే హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు, హోంగార్డు కిందకు దిగి పోలీస్ స్టేషన్లోకి వెళుతుండగా వెనుకనే అనుసరిస్తున్న ఈశ్వరప్పను ఎర్రి హరి పక్కకు నెట్టేశాడు. అదే సమయంలో వేట కొడవళ్లతో చిన్నప్ప, శంకరప్ప అక్కడకు చేరుకోగానే ఓ కొడవలిని ఎర్రి హరి అందిపుచ్చుకుని అన్న చిన్నప్పతో కలసి ఈశ్వరప్పను చుట్టుముట్టాడు. ఇద్దరూ కలసి ఈశ్వరప్పను విచక్షణారహితంగా నరికి హతమార్చారు. ఆ సమయంలో అడ్డుకోబోయిన పోలీసులను బెదిరించి అక్కడి నుంచి ఉడాయించారు. ఈ కేసు దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్ఐ గోపి.. పక్కా ఆధారాలతో బుధవారం ఉదయం రాగినేపల్లి క్రాస్ వద్ద ఎర్రి హరి, చిన్నప్ప, శంకరప్ప, గంగులప్పను అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. విచారణలో నేరాన్ని వారు అంగీకరించడంతో స్కార్పియో వాహనంతో పాటు హత్యకు ఉపయోగించిన వేటకొడవళ్లను స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ఈ నెల 5న పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి దారుణ హత్య నలుగురి అరెస్ట్ -
ఉత్కంఠగా ఫుట్బాల్ పోటీలు
అనంతపురం కార్పొరేషన్: ఇన్స్పైర్ ఫుట్బాల్ పోటీలు అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో ఉత్కంఠగా సాగుతున్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్లో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు 1–0 గోల్స్ తేడాతో ఫజల్ ఎఫ్సీ జట్టుపై గెలుపొందింది. నర్మదావ్యాలీ ఎఫ్సీ జట్టు 9–0 గోల్స్ తేడాతో ఆస్కార్ ఫౌండేషన్ జట్టుపై, టర్న్ ప్రో జట్టు 5–0 గోల్స్ తేడాతో లైఫ్ స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై, ఫాల్కోన్ గర్ల్స్ 12–0 గోల్స్ తేడాతో నాందీ ఫౌండేషన్ జట్టుపై, యువ ఫౌండేషన్ జట్టు 6–0 గోల్స్ తేడాతో కెంప్ ఎఫ్సీ జట్టుపై గెలుపొందాయి. బెంగళూరు ఎఫ్సీ, పుదువయ్ యూనికార్న్ జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. గ్రంథాలయానికి ముగిసిన ఇన్చార్జ్ పాలన అనంతపురం కల్చరల్: గ్రంథాలయాలకు కొత్త చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం పాఠశాల విద్య విభాగం బుధవారం జీఓ జారీ చేసిన నేపథ్యంలో ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న జేసీ శివ్నారాయణ్ శర్మ పాలన ముగిసింది. నూతన చైర్మన్గా నియమితులైన వడ్డె వెంకట్ బాధ్యతలు స్వీకరించేంత వరకూ పాలనాపరమైన అంశాలను గురువారం నుంచి ఉమ్మడి జిల్లా గ్రంథాలయ కార్యదర్శి రమ పర్యవేక్షించనున్నారు. యువకుడి ఆత్మహత్యగుమ్మఘట్ట: రాయదుర్గం మండలం పల్లేపల్లి గ్రామానికి చెందిన బడెప్ప (22) ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన ముద్దప్ప, జడెక్కకు ముగ్గురు కుమారులు కాగా, ఇద్దరు కుమారులు విడిపోయి వేర్వేరుగా కాపురం ఉంటున్నారు. మూడేళ్ల క్రితం అనారోగ్యంతో ముద్దప్ప మృతిచెందాడు. అప్పటి నుంచి తాగుడుకు బానిసైన బడెప్ప.. బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లో ఉరి వేసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఉరవకొండ టౌన్ బ్యాంకు డిపాజిట్ దారులకు శుభవార్త ఉరవకొండ: లిక్విడేటర్ ఉరవకొండ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు డిపాజిట్దారులకు రెండో విడత నగదు చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు కో–పరేటివ్ బ్యాంకు జిల్లా అధికారి అరుణకుమారి తెలిపారు. బుధవారం స్థానిక గాంధీచౌక్ వద్ద ఉన్న టౌన్బ్యాంకు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టౌన్ బ్యాంకు పరిధిలో 4,811 మంది డిపాజిటర్లు ఉన్నారని వీరికి రూ 5,92,58,828 నగదు చెల్లించాల్సి ఉందన్నారు. తొలివిడతగా 1,110 మందికి రూ.4.20 కోట్ల డిపాజిట్లను చెల్లించినట్లు వివరించారు. ప్రస్తుతం రెండో విడతగా మిగిలిన 3,711 డిపాజిట్దారులకు రూ.1,72,27,983 చెల్లించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. డిపాజిట్ దారులు ఒరిజినల్ ఎఫ్డీ బాండ్లు, ఆధార్, పాస్ జిరాక్స్తో పాటు డిపాజిట్దారుడి ఇతర బ్యాంకులకు సంబందించిన ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను వెంటనే ఉరవకొండ కోఆపరేటివ్ బ్యాంక్లో అందజేయాలన్నారు. ఇంకా 3,665 మంది డిపాజిట్దారులు ఈకేవైసీ చేయించుకోలేదని, దీంతో వీరికి నగదు చెల్లింపుల్లో జాప్యం చోటు చేసుకుంటోందన్నారు. -
అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో వింత పోకడలు నెలకొన్నాయి. ఆర్ఎంగా బాధ్యతలు స్వీకరించిన ఓ మంత్రి గారి చెల్లెలు.. ఇప్పటి వరకూ అనంతపురం రీజియన్ కార్యాలయంలోకి అడుగు కూడా పెట్టలేదు. తన సోదరుడి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రీజయన్ మేనేజర్గా బాధ్యతలను ఆమె విజ
అనంతపురం క్రైం: అతి పెద్ద రవాణా సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దిక్కూమొక్కు లేనిదైంది. సర్కారు అనాలోచిత నిర్ణయాలతో సమస్యలు పరిష్కారం కాక సంస్థ ఉద్యోగులు సతమమవుతున్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. సీ్త్రశక్తి పేరుతో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించామంటూ గొప్పలకు పోతున్న ప్రభుత్వ పెద్దలు సగటు ప్రయాణికుడి ఇబ్బందులు పట్టించుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిపోల్లోనే ఆగిపోతున్న బస్సులు ఇప్పటికే అనంతపురం నుంచి హైదరాబాదుకు వెళ్లాల్సిన లాంగ్ సర్వీసు బస్సును గుత్తి డిపోకు బదిలీ చేసి ఆర్ఎం శ్రీలక్ష్మి చేతులు దులుపుకుంటే ఆ బస్సు డిపోకు మాత్రమే పరిమితం చేసి మేనేజరు పూర్తిగా తప్పుకున్నారు. తాజాగా నగరం నడిబొడ్డున ఆర్టీసీ బస్సు ఆగిపోతే దానిని వర్క్షాప్నకు తరలించేందుకు కొన్ని గంటల పాటు మెకానిక్లు శ్రమించాల్సి వచ్చింది. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకునే అధికారి లేకపోవడం, ఉన్నవారికి అనుభవం లేకపోవడంతో డిపోల్లోనే బస్సులు ఆగిపోతున్నాయి. దీనికి తోడు రూ.10 ఖర్చు పెట్టాల్సిన చోట రూ.100 ఖర్చు చేయాల్సి రావడంతో ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమవుతోంది. సెలవులో లేరు.. విధులకు రారు అనంతపురం ఆర్టీసీ రీజియన్ మేనేజర్గా విజయలక్ష్మి గత నెల 29న బాధ్యతలు స్వీకరించారు. అయితే ఎన్నడూ లేని విధంగా అనంతపురం నుంచి విజయవాడకు ఫైలు తెప్పించుకుని అక్కడే ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇదేమని ఆరా తీస్తే తాను ఓ మంత్రిగారికి చెల్లెలని తెలిపిందట. బాధ్యతలు స్వీకరించేదాకా అంతా బాగానే ఉన్నా.. ఇప్పటి వరకూ అనంతపురం రీజియన్ కార్యాలయంలోకి ఆమె కాలు కూడా మోపలేదు. అయితే ఆమె సెలవులో ఉన్నారనుకుంటే అది కూడా పొరబాటేనని ఉద్యోగులు అంటున్నారు. కనీసం ఇన్చార్జ్గాను ఎవరికీ బాధ్యతలు ఇవ్వలేదని దీంతో గతంలో ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తించిన డిప్యూటీ సీటీఎం శ్రీలక్ష్మినే అలాగే కొనసాగుతోంది. పూర్తి స్థాయి ఆర్ఎం ఎప్పుడొస్తారనే అంశంపై స్పష్టత లేదు. మంత్రి సోధరి అనే హోదానే ఆమెను ఇక్కడకు రాకుండా చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. ‘అనంత’ ఆర్టీసీలో వింత పోకడ విజయవాడలోనే అనంత ఆర్ఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వకపోయినా ఆర్ఎంగా కొనసాగుతున్న శ్రీలక్ష్మి సమస్యలు పరిష్కారం కాక ఉద్యోగుల సతమతం ఉరవకొండ అసిస్టెంట్ మేనేజర్కు గుత్తి, గుంతకల్లు డిపోల బాధ్యత అనంతపురం, తాడిపత్రి డిపోలకూ అసిస్టెంట్ డిపో మేనేజర్లే దిక్కు ఎక్కడికక్కడ డిపోల్లో ఆగిపోతున్న బస్సులు జోనల్ చైర్మన్కు పట్టని ఆర్టీసీ అభివృద్ధి సమస్యల సుడిగుండం అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఇన్చార్జ్ల పాలన ఎక్కువైంది. చివరకు జోనల్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన పూల నాగరాజుకు సైతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆర్టీసీ అభివృద్ధిని ఆయన పూర్తిగా అటకెక్కించేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. తాడిపత్రి డిపో అసిస్టెంట్ మేనేజరు మురళీధర్కు అనంతపురం డిపో ఇన్చార్జ్ మేనేజర్గా అదనపు బాధ్యతలిచ్చారు. ఉరవకొండ డిపో అసిస్టెంట్ మేనేజర్కు గుత్తి, గుంతకల్లు డిపోల బాధ్యత అప్పగించారు. ఇన్చార్జ్ల ఏలుబడిలో సమస్యలు పరిష్కారం కాక ఉద్యోగులు సతమతమవుతున్నారు. -
మామిడి పూతను నిలుపుకోవాలి
అనంతపురం అగ్రికల్చర్: కనిష్ట ఉష్ణోగ్రతలతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నందున పూత నిలబెట్టుకుంటే మామిడిలో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందని రైతులకు ఉభయ జిల్లాల ఉద్యాన అధికారులు డి.ఉమాదేవి, జి.చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురం జిల్లాలో 15 వేల హెక్టార్లు, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో 20 వేల హెక్టార్లలో విస్తరించిన మామిడి తోటల పరిస్థితి ప్రస్తుతానికి ఆశాజనకంగానే ఉన్నాయన్నారు. అయితే మరీ శీతల వాతావరణ పరిస్థితులు ఉన్నందున కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. కీలకదశలో మంచు తీవ్రత కారణంగా పూత, పిందెకు నష్టంతో పాటు చీడపీడల వ్యాప్తి కూడా ఉండవచ్చన్నారు. ప్రస్తుతం పచ్చిపూత దశలో ఉన్న తోటల్లో అల్టర్నేరియా శిలీంధ్రం వల్ల పూత నల్లబారిపోతుందని, నివారణకు లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజమ్ + 2.5 గ్రాముల ఎం–45 కలిపి పిచికారీ చేయాలన్నారు. ఇంకా పూత కనిపించని తోటల్లో లీటర్ నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ + 1.5 గ్రాముల సల్ఫర్ కలిపి పిచికారీ చేయాలన్నారు. వారం లేదా పది రోజుల తర్వాత లీటర్ నీటికి 1.2 మి.లీ బూప్రోఫిజిన్ + 2 మి.లీ హెక్సాకొనజోల్ కలిపి పిచికారీ చేయాలన్నారు. దీని వల్ల బూడిద తెగులు, ఇతర రసం పీల్చు పురుగుల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతానికి నీటి తడులు పెద్దగా అవసరం లేదన్నారు. పిందె తర్వాత ఉష్ణ్రోగతలు పెరిగితే నీటి యాజమాన్యంపై దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. ఉద్యానశాఖ అధికారులు ఉమాదేవి, చంద్రశేఖర్ -
రహదారి భద్రతా నియమాలు పాటించాలి
పుట్టపర్తి టౌన్: ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించి శ్రీసత్యసాయిని ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎంపీ పార్థసారథి, ఎస్పీ సతీష్కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ రహదారి రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పుట్టపర్తిలో రవాణా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎంపీ పార్థసారథి, ఎస్పీ సతీష్కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్థానిక సత్తెమ్మ గుడి నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ వరకూ సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజలందరూ బాధ్యతగా నిబంధనలు పాటించాలన్నారు. అనంతరం ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడుతూ.. రహదారి భద్కతా నియమాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ద్విచక్రవాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి కరుణసాగర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వెంకటేషులు, సమచార శాఖ ఏడి పురుషోత్తంతోపాటు ఎంవీఐలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎంపీ పార్థసారథి, ఎస్పీ సతీష్కుమార్ పిలుపు -
అబ్బుర పరిచిన ఎన్డీఆర్ఎఫ్ విన్యాసాలు
పరిగి: ప్రమాదాలు చోటు చేసుకున్నప్పడు సురక్షితంగా బయటపడే మార్గాలపై మాక్ డ్రిల్తో ఎన్డీఆర్ఎఫ్ ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. బుధవారం పరిగి మండలం కాలువపల్లిలోని టెక్స్పోర్ట్ గార్మెంట్ పరిశ్రమలో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని ఎన్టీఆర్ఎఫ్ బృందాలు చేపట్టాయి. వివిధ ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడేందుకు చేపట్టాల్సిన చర్యలను ప్రయోగాత్మకంగా చూపించారు. కార్యక్రమంలో తహసీల్దారు హసీనాసుల్తానా, ఎస్ఐ రంగడుయాదవ్, ఎంపీడీఓ రెడ్డెప్ప, ఎన్డీఆర్ఎఫ్ డీడీసీ అఖిలేష్, ఇన్స్పెక్టర్ హరీష్చంద్రపాండే, మునికృష్ణ, సుభాష్సింధు, గంగాధర్, ఎంఈఓ శేషాచలం, మెడికల్ ఆఫీసర్ నవీన, ఏఓ శ్రీకృష్ణ, ఏఈలు సునీత, ప్రత్యూష, ఐసీడీఎస్ సూపర్వైజర్ లలిత, డిప్యూటీ ఎంపీడీఓ విజయభాస్కర్, టెక్స్పోర్ట్ గార్మెంట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
వీధికుక్క దాడి.. ఆరుగురికి గాయాలు
అగళి: మండలంలోని మధూడి గ్రామంలో బుధవారం ఓ వీధి కుక్క రెచ్చిపోయింది. తొలుత ఓ చిన్నారిని, రక్షించేందుకు వచ్చిన మరో ఐదుగురిపై దాడి చేసింది. వివరాల్లోకి వెళితే...బుధధవారం ఉదయం మధూడి గ్రామంలోని ఎస్సీ కాలనిలో ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వీధి కుక్క దాడి చేసింది. చిన్నారిని రక్షించేందుకు వెళ్లిన నింగమ్మ, వీరభద్రప్ప, హనుమంతరాజు, తిమ్మక్క, నరసమ్మ,హేమంత్ తదితరులపైనా తీవ్రంగా దాడి చేసింది. దీంతో స్థానిక యువకులు కుక్కను కొట్టి చంపేశారు. పీహెచ్సీ వద్ద ఆందోళన.. కుక్కకాటు బాధితులంతా వ్యాక్సిన్ వేయించుకునేందుకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తే అక్కడ కుక్క కాటుకు మందు లేదు. వైద్య సిబ్బంది కేవలం రక్త గాయాలకు ప్రథమ చికిత్స చేశారు. దీంతో కుక్కకాటు బాధితుల్లో కొందరిని రొళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి, మరికొందరిని కర్ణాటక రాష్ట్రం శిర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం బాధితుల బంధువులు అగళి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని డాక్టర్ శివానందపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం కుక్కకాటుకు మందులు కూడా తెప్పించ లేరా... అంటూ మండిపడ్డారు. మందులు లేని ఆస్పత్రి ఎందుకంటూ ఆస్పత్రికి తాళం వేసి ఆవరణలో ఆందోళన చేశారు. వైద్యుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అగళి పీహెచ్సీలో అందుబాటులో లేని కుక్కకాటు మందు వైద్య సిబ్బందిపై బాధితుల ఆగ్రహం -
టీడీపీ నాయకుల కబ్జాపై ఫిర్యాదు
కనగానపల్లి: ప్రభుత్వం నుంచి పట్టా పొంది ఇల్లు నిర్మించుకున్న స్థలాన్ని స్థానిక టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు ఎరికల వెంకట్రాముడు వాపోయాడు. దీనిపై బుధవారం కనగానపల్లి రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ప్రసాద్కు ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడాడు. 15 సంవత్సరాల నుంచి గుంతపల్లిలోని ఎస్సీ కాలనీ పక్కన నివాసం ఉంటున్న తనకు సర్వే నంబర్ 487–2లో ఇంటి పట్టాతో పాటు పక్కా గృహాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం ఆ ఇంట్లోనే తాను నివాసముంటున్నానని పేర్కొన్నాడు. రెండు రోజుల క్రితం తాము గ్రామంలో లేని సమయంలో టీడీపీ నాయకులు డీలర్ బొజ్జన్న, నాగభూషణ, పోతుల సుధాకర్, గొల్ల ప్రసాద్, సుధాకర్ జేసీబీతో ఇంటి ఆవరణ చుట్టూ ఉన్న పచ్చని చెట్లను పీకి, అక్కడ ఉన్న సామగ్రిని ధ్వంసం చేసి నేలను చదును చేశారన్నారు. తాను గ్రామానికి వచ్చినప్పుడు వెళ్లి వారిని నిలదీయగా ‘నీకు ఇక్కడ ఎవరు పట్టా ఇచ్చారు’ అంటూ కులం పేరుతో దూషించారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టా చూపించేందుకు వెళితే అది నకిలీదని, కట్టెలతో దాడి చేసేందుకు ప్రయత్నించి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ అంశంపై ఇప్పటికే కనగానపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని రెవెన్యూ అధికారులు, పోలీసులను కోరినట్లు వివరించాడు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కలిసి పనిచేద్దాం
పుట్టపర్తి అర్బన్: జిల్లా సమగ్రాభివృద్ధికి జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేద్దామని జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) చైర్మన్, హిందూపురం ఎంపీ పార్థసారథి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో దిశ సమావేశం నిర్వహించారు. చైర్మన్ పార్థసారథి మాట్లాడుతూ... గత సమావేశాల్లో చర్చించిన అంశాలు, సమస్యలపై తీసుకున్న నిర్ణయాలపై తప్పనిసరిగా కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఎక్కడైనా లోపాలుంటే సరిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో పూర్తి చేసిన పనులకు బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. అనర్హుల పెన్షన్లను తొలగించి అర్హులకు మంజూరు చేయాలన్నారు. సోలార్ను ఎక్కుగా వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. ‘దిశ’ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని నోట్ చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఓ సారి తప్పకుండా ‘దిశ’ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే సింధూరరెడ్డి మాట్లాడుతూ.. హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వారికి అతి తక్కువ ధరతో అందజేసే టెర్బుటాలిన్ ఇంజక్షన్ను తప్పనిసరిగా జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే 2024–25 ‘పల్లె పండుగ’లో సీసీ రోడ్లు, మరుగుదొడ్లు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ వెంకటేషులు మాట్లాడుతూ... రైతు పరపతి సంఘాల ద్వారా కట్టిన గోడౌన్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రహదారి సౌకర్యం లేని గోడౌన్లకు ‘ఉపాధి’ ద్వారా రహదారి సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ‘దిశ’ సమావేశంలో చైర్మన్ పార్థసారధి, కలెక్టర్ శ్యాంప్రసాద్ -
35వ కి.మీ. దాటిన కుడి కాలువ నీరు
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) ఎస్కేప్ రెగ్యులేటర్ నుంచి కుడి కాలువకు మంగళవారం విడుదల చేసిన బుధవారం నాటికి 35వ కి.మీ.దాటి ఆత్మకూరు మండలంలోకి ప్రవేశించింది. పీఏబీఆర్ నుంచి ధర్మవరం నియోజకవర్గం అగ్రహారం చెరువు వరకు సుమారు 112 కి.మీ. పొడవునా ఈ కాలువ విస్తరించి ఉంది. కాలువ కింద ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లోని 49 చెరువులున్నాయి. సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం కుడి కాలువ ద్వారా ఈ చెరులను నింపుతుంటారు. ఈ క్రమంలో కాలువ చిట్టచివరి చెరువును తొలుత నింపి ఆ తర్వాత డ్యాం దిగువన ఉన్న మరుట్ల చెరువును నింపేలా అధికారులు నిర్ణయించారు. పాడి పోటీలకు సిద్ధం రాప్తాడురూరల్: పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి గ్రామంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ‘అనంత పాలధార’ పాల దిగుబడి జిల్లా స్థాయి పోటీలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా నలమూలల నుంచి సుమారు 70 పాడి పశువులను తీసుకుని బుధవారం సాయంత్రానికి రైతులు అక్కడకు చేరుకున్నారు. పాడిపశువులను జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ ప్రేమ్చంద్ పరిశీలించారు. గురువారం ఉదయం, సాయంత్రం రెండు పూటల పాలు తీసి కొలత లు వేయనున్నారు. ఎక్కువ శాతం పాలు ఇచ్చిన ఆవులను విజేతలుగా ప్రకటించనున్నారు. తర్వాత బహుమతులు అందజేయనున్నారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి● అడిషనల్ ఎస్పీ అంకిత సురానా కనగానపల్లి: గ్రామాల్లో శాంతి భద్రతలను పటిష్ట పరుస్తూ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని అడిషనల్ ఎస్పీ అంకిత సురానా ఆదేశించారు. బుధవారం కనగానపల్లి పీఎస్ను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు, లాకప్ గదులు, మహిళా హెల్ప్ డెస్కును పరిశీలించారు. ప్రజలతో మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని పాటించాలని సిబ్బందికి సూచించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి రాత్రి వేళల్లో గస్తీ చేపట్టాలన్నారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. పేకాట, గంజాయి, మద్యం అక్రమ విక్రయాలను నియంత్రించాలన్నారు. పిల్లలు, మహిళలపై జరిగే అకృత్యాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రామగిరి సీఐ శ్రీధర్, కనగానపల్లి ఎస్ఐ ఎం.రిజ్వాన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటి పన్ను చెల్లించిన వారికి మాత్రమే అనుమతి ● శింగనమల ఎంపీడీఓ కార్యాలయంలో నోటీసు.. విస్తుపోతున్న ప్రజలు శింగనమల: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల వద్దకు వెళ్లాలన్నా నిబంధనలు అమలు చేస్తున్నారు. అందుకు నిదర్శనమే అనంతపురం జిల్లా శింగనమల ఎంపీడీఓ కార్యాలయంలో అతికించిన నోటీసు. పనుల కోసం వచ్చే ప్రజలు ఇంటి పన్ను చెల్లించి ఉండాలని, ఇంటి పన్ను చెల్లించిన రశీదు జిరాక్స్ పత్రాన్ని తీసుకువస్తేనే అనుమతి ఇస్తామని ఇన్చార్జ్ ఎంపీడీఓ భాస్కర్ పేరిట కార్యాలయంలో నోటీసు అతికించారు. 2025–26 సంవత్సరం వరకు ఇంటి పన్ను చెల్లించి ఉండాలని, అలాంటి వారినే అనుమతిస్తామని, ఇది ప్రభుత్వ ఉత్తర్వు అని, ప్రజలందరూ గౌరవించి సహకరించాలని నోటీసులో పేర్కొన్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇదెక్కడి చోద్యం అంటూ ప్రజలు విస్తుపోతున్నారు. -
రైతుల కోసం కేతిరెడ్డి జలపోరాటం
ధర్మవరం: జలం కోసం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పోరుబాట పట్టారు. పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా నియోజకవర్గంలోని 24 చెరువులను నింపకుండా చోద్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్పై సమరశంఖం పూరించారు. పీఏబీఆర్ కుడికాలువ ద్వారా నీరు విడుదల చేసి నియోజకవర్గంలో 24 చెరువులు నింపాలన్న డిమాండ్తో బుధవారం రైతులతో కలిసి తాడిమర్రి మండలం మేడిమాకులపల్లి నుంచి ‘జల పోరాటం’ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మేడిమాకులపల్లి పీఏబీఆర్ కుడి కాలువ వద్ద నుంచి రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి బైక్లపై ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ అనంతపురం రూరల్ మండలం మన్నీల వరకూ సాగింది. మార్గమధ్యలో పీఏబీఆర్ కుడి కాలువ మొత్తం ముళ్లపొదలతో నిండిపోవడాన్ని చూసి కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. చెరువులను నింపే వరకు పోరాడతాం పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా నియోజకవర్గంలోని 24 చెరువులు నింపే వరకూ రైతుల తరఫున పోరాడతామని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. అనంతపురం రూరల్ మండలం మన్నీల పీఏబీఆర్ కెనాల్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా నీటిని విడుదల చేసి చెరువులను పూర్తి స్థాయిలో నింపిన విషయాన్ని గుర్తు చేశారు. ధర్మవరం నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధికి కాలువలు ఎక్కడ ఉన్నాయో.. ఏ గ్రామాల్లో చెరువులు నిండుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సర్కార్ నిర్లక్ష్యం వల్ల భూగర్భ జలమట్టం తగ్గి బోర్లు ఎండిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 24 చెరువులును నింపాలని కోరారు. అంతవరకూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రైతులతో నిరవధిక ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ తాడిమర్రి సుధాకర్రెడ్డిలతోపాటు ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాలకు చెందిన రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పీఏబీఆర్ కుడి కాలువకు నీరిచ్చి చెరువులు నింపాలని డిమాండ్ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాలువ వద్ద బైక్లతో ర్యాలీ భారీగా హాజరైన రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు నీరివ్వకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని కేతిరెడ్డి హెచ్చరిక -
ఎవరూ తప్పించుకోలేరు
సాక్షి, పుట్టపర్తి క్యాలెండర్ మారినా.. పోలీసు అధికారులు మారినా.. జిల్లాలో హత్యలు...హత్యాయత్నాలు మాత్రం ఆగడం లేదు. కొత్త ఏడాది ఆరంభం రోజు నుంచి ఇప్పటికే రెండు హత్యలు, రెండు హత్యాయత్నాలు వెలుగు చూశాయి. శాంతిభద్రతల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో మార్పు రాలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గొడవలు, భూ తగాదాలు, వివాహేతర సంబంధాల చిచ్చు, క్షణికావేశంలో మాటామాటా పెరిగి చెలరేగుతున్న వివాదాలు హత్యలకూ దారి తీస్తున్నాయి. హత్యలు, హత్యాయత్నాల్లో 90 శాతం ఘటనలు రాత్రి వేళల్లోనే జరగడం గమనార్హం. మద్యం మత్తులోనే... హత్యలు, హత్యాయత్నం కేసుల్లోని నిందితులంతా మద్యం మత్తులోనే ఘటనలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. మద్యం మత్తులో వాటి గురించి చర్చించడం.. అనంతరం ఆ మద్యం మత్తులో రెచ్చిపోయి ప్రాణాలు తీయడం..లేదా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మందుబాబులకు అలవాటుగా మారింది. యువకులే అధికంగా.. హత్యలు, హత్యాయత్నం కేసుల్లో నిందితులంతా 25 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు వారే ఉంటున్నారు. నలుగురు గుంపుగా చేరడం.. ప్లాన్ చేయడం..అంతమొందించడం...లేదా హత్యాయత్నం చేస్తూ సమాజంలో అశాంతికి కారణమవుతున్నారు. నిందితులకు వసతి కల్పించిన వారు సైతం కేసుల్లో ఇరుక్కున్న దాఖలాలున్నాయి. హత్య చేసిన తర్వాత క్షణికావేశంలో చేశామని.. చెబుతున్నా.. చట్టం ముందు శిక్షార్హులే కావడంతో చాలామంది యుక్త వయసులోనే కటకటాల పాలవుతున్నారు. ఏదైనా తగాదా ఉంటే.. పోలీస్ స్టేషన్కు వెళ్లడం.. లేదంటే కోర్టులను ఆశ్రయిస్తే ఫలితం ఉంటుందని అవగాహన కల్పిస్తున్నా.. మార్పు రావడం లేదు. పోలీసుల నిర్లక్ష్యమూ కారణమే.. ఫలానా వ్యక్తి నుంచి ప్రాణహాని ఉందని బాధితులు సమాచారం ఇచ్చినా.. పోలీసులు నిర్లక్ష్యంగా ఉండటంతోనే హత్యలకు దారి తీస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా జరిగిన హత్యలు కూడా జిల్లాలో వెలుగు చూశాయి. కొత్తచెరువు యువకుడి హత్య ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏదైనా తగాదా ఉన్నా.. గొడవ జరిగినా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుత స్మార్ట్ యుగంలో అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి. డయల్ 100కు కాల్ చేసినా పోలీసులు అందుబాటులోకి వస్తారు. హత్యలు, హత్యాయత్నాలు సరికాదు. కేసులు మోసుకున్నా.. నేరాలకు పాల్పడినా.. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. – ఎస్.సతీష్ కుమార్, ఎస్పీ -
పునరుత్పాదక ప్రాజెక్టులు వేగవంతం చేయాలి
పుట్టపర్తి అర్బన్: జిల్లాల ఏర్పాటవుతున్న పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు పూర్తయితే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. భూ సర్వేలు, సాంకేతిక అంశాలు, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓలు సువర్ణ, మహేష్, వీవీఎస్ శర్మ, ఆనంద్కుమార్ పాల్గొన్నారు . ‘మెప్మా’లో అవినీతిపై విచారణ ప్రారంభం హిందూపురం: మున్సిపాలిటీలోని ‘మెప్మా’ విభాగంలో చోటుచేసుకున్న అవినీతిపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. వివిధ పథకాల పేరిట డబ్బులు వసూలు చేశారని, రుణాలు మంజూరు చేయాలంటే మెప్మా అధికారికి ముడుపులు ఇవాల్సి వస్తోందని ఆరోపిస్తూ కొందరు ఆర్పీలు ప్రాజెక్టు డైరెక్టర్కు సమైఖ్య ద్వారా ఫిర్యాదు లేఖను పంపారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మెప్మా పీడీ నాగరాజు సమగ్ర విచారణకు ఆదేశించారు. మెప్మా అధికారులు వాసుదేవరెడ్డి, రమాదేవిలను విచారణ అధికారులుగా నియమించారు. దీంతో బుధవారం వారు హిందూపురం మున్సిపాల్టీలోని మెప్మా విభాగంలో పట్టణ రీసోర్స్ పర్సన్లతోపాటు మెప్మా సీఓలు, తెలుగుతల్లి పట్టణ సమాఖ్య, భరతమాత పట్టణ సమాఖ్య సభ్యులతో విడివిడిగా విచారించారు. విశ్వకర్మ రుణాల పేరుతో రూ.లక్షలు వసూలు చేశారన్న ఆరోపణలపై విచారించారు. విశ్వజ్యోతి సంఘంలో రూ.17 లక్షలు అవినీతి జరిగినట్లు టీఎల్ఎఫ్ ప్రతినిధులు అధికారులకు పంపిన ఫిర్యాదులో పేర్కొనగా...వాటిపై వివరాలు సేకరించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ, మెప్మా విభాగంలో వచ్చిన ఆరోపణలపై విచారణ చేశామని, నివేదికను పీడీకి అందజేస్తామన్నారు. అసాంఘిక శక్తులను అణచివేయాలి ● పోలీసులకు ఎస్పీ సతీష్కుమార్ ఆదేశం ముదిగుబ్బ: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులను అణచివేయాలని ఎస్పీ సతీష్కుమార్ పోలీసులను ఆదేశించారు. బుధవారం ఆయన ముదిగుబ్బ అప్గ్రేడ్ పోలీసు స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లాకప్ గది, రిసెప్షన్ కౌంటర్ పరిసరాలను పరిశీలించారు. మహిళల నుంచి అందే ఫిర్యాదులపై ఆరా తీశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. మద్యం, ఇసుక అక్రమ రవాణా, పేకాట, క్రికెట్ బెట్టింగ్, కోడి పందేలు తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా పనిచేయాలన్నారు. -
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ
పుట్టపర్తి: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న ఒకేషనల్, కంప్యూటర్ విద్య బోధన ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే ప్రక్రియ చేపట్టినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ దేవరాజ్ తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న వారి నుంచి మంగళవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 62 పోస్టులను రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సీటు కోసం బస్సులో కొట్టుకున్న మహిళలు ఉరవకొండ: ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం ఉరవకొండ ఆర్టీసీ డిపో నుంచి రాయదుర్గానికి వెళ్లే బస్సులో చోటు చేసుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉరవకొండ నుంచి కణేకల్లు మీదుగా రాయదుర్గం వెళుతున్న రాయదుర్గం డిపోకు చెందిన బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళ ప్రయాణికులు మధ్య గొడవ ప్రారంభమైంది. నింబగల్లు సమీపంలో గొడవ తీవ్ర రూపం దాల్చి ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ పరస్పరం కొట్టుకున్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్, తోటి ప్రయాణికులు ఎంతగా వారించినా వినిపించుకోలేదు. డ్రైవర్ బస్సును ఉరవకొండ పీఎస్కు తీసుకెళ్లి గొడవ పడుతున్న ఇద్దరు మహిళలను పోలీసులకు అప్పగించారు. మహిళలకు ఉరవకొండ సీఐ మహనంది కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
ధర్మవరం కుడి కాలువ రెడీ
కూడేరు: మండలంలోని జల్లిపల్లి వద్ద తెగిన ధర్మవరం కుడికాలువ గట్టుకు మరమ్మతు పనులు పూర్తయినట్లు డీఈ విశ్వనాథరెడ్డి, జేఈ సుబ్రహణ్యం తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్ 7న కుడి కాలువ గట్ట కోతకు గురై పూర్తిగా తెగిందన్నారు. దీంతో అదే నెల 16న రూ.90 లక్షల నిధులతో మరమ్మతు పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేయగలిగామన్నారు. ఈ క్రమంలోనే కాలువ గట్టు సామర్థ్యాన్ని పరీక్షించేందుకు పీఏబీఆర్ ఎస్కేప్ రెగ్యులేటర్ వద్ద మిడ్ పెన్నార్కు మళ్లించిన 400 క్యూసెక్కుల నీటిని కుడికాలువకు మళ్లించినట్లు వివరించారు. దీంతో ఎక్కువ నీరు విడుదల చేసిన సమస్య ఉండదని స్పష్టత వచ్చిందన్నారు. అడవిలో ఆరని మంటలుపెనుకొండ: స్థానిక అటవీ ప్రాంతంలో మంటలు ఆరడం లేదు. ఏదో ఒక ప్రాంతంలో మంటలు రగులుతూనే ఉన్నాయి. మంగళవారం స్థానిక దొడ్డికుంట సమీపంలో మంటలు ఎగిసి పడుతుండడంతో రోడ్డున వెళుతున్న ప్రతి ఒక్కరూ విచారం వ్యక్తం చేసారు. బంక్లోకి దూసుకెళ్లిన కారు రొళ్ల: మండలంలోని హొట్టేబెట్ట పంచాయతీ సమీపంలో కర్ణాటకలోని లక్ష్మీపురం వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా 544ఈ జాతీయ రహదారి పక్కన బతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకున్న బంక్లోకి ఓ కారు దూసుకెళ్లింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బంక్ వద్ద జనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బంక్ పక్కనే బండరాళ్లు పాతి ఉండడంతో కారు ఢీకొని ఆగిపోయింది. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లుగా స్థానికులు గుర్తించారు. ఘటనపై కర్ణాటకలోని మిడిగేశి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రతి బిడ్డకూ టీకా తప్పనిసరి పుట్టపర్తి అర్బన్: నవజాత శిశువు మొదలు మొదటి ఏడాది పూర్తయ్యే వరకూ ప్రతి బిడ్డకూ టీకా తప్పని సరిగా వేయాలని సిబ్బందికి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సురేష్బాబు సూచించారు. పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు పీహెచ్సీలో మంగళవారం నిర్వహించిన ఆశా డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యాధి నిరోధక టీకాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. అసంక్రమిత, సంక్రమిత వ్యాధుల సర్వే సక్రమంగా నిర్వహించాలన్నారు. క్షయ వ్యాధి లక్షణాలున్న వారికి గల్ల పరీక్ష నిర్వహించాలన్నారు. ఈ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ నివేదిత, సీహెచ్ఓలు వన్నప్ప, పార్వతి, హెల్త్ ఎడ్యుకేటర్ లక్ష్మి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు?పుట్టపర్తి టౌన్: స్థానిక హంద్రీ–నీవా కాలువలో కొత్తచెరువు మండలం తిప్పబాట్లపల్లికి చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగి మహేష్ చౌదరి (35) మృతదేహం లభ్యమైన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తన కుమారుడి మృతిపై తల్లి నాగరత్నమ్మ అనుమానాలు వ్యక్తం చేస్తూ చేసిన ఫిర్యాద మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం సాయంత్రం ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. నేడో, రేపో వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు. -
సీటీఎస్ కార్మికులను తొలగించరాదు
గుంతకల్లు: సీటీఎస్ కార్మికులను తొలగించారాదని సీఐటీయూ నాయకుడు సాకే నాగరాజు డిమాండ్ చేశారు. స్థానిక రైల్వేస్టేషన్లో పని చేస్తున్న సీటీఎస్ కార్మికులను ఉన్నఫలంగా తొలగించడాన్ని నిరసిస్తూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ నుంచి డీఆర్ఎం కార్యాలయం వరకు నిరసన రిలే నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు. 18 ఏళ్లుగా దాదాపు 85 మంది కార్మికులు సీటీఎస్ కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. కొత్తగా వచ్చిన సబ్ కాంట్రాక్టరు కేవలం 50 మందిని మాత్రమే పనిలో ఉంచుకుని మిగిలినవారిని తొలగించామని చెబుతుండడం దుర్మార్గమన్నారు. ఏ ఒక్క కార్మికుడినీ తొలగించరాదని, కనీస వేతనం కింద రూ.26 వేలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యం, చిరంజీవి, ఆంజనేయులు, జయరాజు, అలిగేరప్ప, వీరేష్, రత్నమయ్య తదితరులు పాల్గొన్నారు. రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ రాయదుర్గం టౌన్: స్థానిక జాతీయ రహదారి బైపాస్లో శ్మశాన వాటిక వద్ద ఉన్న వాహన సర్వీసింగ్ సెంటర్ షెడ్డు రేకులు కత్తిరించి దొంగతనానికి పాల్పడుతున్న ఓ యువకుడిని సోమవారం అర్ధరాత్రి స్థానికులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.తాళం వేసిన షెడ్డు పైభాగంలో రేకులు కత్తిరించి లోపలికి వెళ్లిన దుండగుడిని గమనించిన కొందరు అక్కడే కాపు కాశారు. కాసేపటి తర్వాత యువకుడు బయటకు రాగా వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తండ్రిబాటలోనే కుమార్తెలు
శాసీ్త్రయ నృత్యమే ఊపిరిగా జీవిస్తున్న మాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హర్షశ్రీ 25 ఏళ్లుగా 2 వేలకు పైగా నాట్య ప్రదర్శనలు ఇస్తూ 500కు పైగా అవార్డులు దక్కించుకుంది. 2010, డిసెంబరు 26న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రదర్శించిన అతిపెద్ద కూచిపూడి ప్రదర్శనకుగాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకుంది. నాట్యమయూరిగా బిరుదు దక్కించుకుంది. ఆమె ప్రతి విజయం వెనుక భర్త, అత్తమామ నిలవడం గర్వకారణం. ఇక రెండో కుమార్తె రామలాలిత్య కూడా కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యంలో ప్రతిభ చూపుతూ లెక్కలేనన్ని బహుమతులు గెలుచుకుంది. 2014, డిసెంబర్ 25న గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన నాట్య ప్రదర్శనలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సైతం సొంతం చేసుకుంది. 2023, డిసెంబర్ 23న గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కూచిపూడి కళావైభవంలో రామలాలిత్య నేతృత్యంలో మా శిక్షణా కేంద్రానికి చెందిన 12 మంది విద్యార్థులు పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్నారు.2025, డిసెంబర్ 27న గచ్చిబౌలి స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన కూచిపూడి కళావైభవంలో మా శిక్షణ కేంద్రం విద్యార్థులు 26 మంది పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్నారు. -
‘టెట్’ నుంచి మినహాయించాలి
పుట్టపర్తి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపునివ్వాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్టీఎఫ్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. కొత్తచెరువులోని డీఈఓ కార్యాలయం ఆవరణలో నూతన సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను డీఈఓ కృష్ణప్ప చేతుల మీదుగా వైఎస్సార్టీఎఫ్ నాయకులు మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి తదితరులు విలేకరులతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తున్న వారికి సైతం టెట్ పేరుతో ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే ఈ విధానాలను వీడాలని, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించాలన్నారు. సీపీఎస్ను రద్దు చేసి, మెరుగైన పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలా ఇంద్ర ప్రసాద్, నేతలు శ్రీనివాసరెడ్డి, గంగిశెట్టి, రాజేష్, మల్లికార్జున, రామమోహన్రెడ్డి, ప్రతాప్ రెడ్డి, హర్ష, రాజశేఖర్, సుబ్బారెడ్డి, ప్రకాష్రెడ్డి, సుభాష్ నాయక్, సునీత, సుధారాణి, రామిరెడ్డి, కృష్ణమ్మ, సుజాత, నర్మద, శమంతకమణి, ఇందిర, మహేశ్వరరెడ్డి, బయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్టీఎఫ్ డిమాండ్ -
జీవితమే నర్తనమాయే
ధర్మవరంలోని బ్రాహ్మణవీధిలో నివాసముంటున్నాం. మా అమ్మ, నాన్న లలితమ్మ, దుత్తలూరి రామారావుకు నాట్యం అంటే ఎంతో మక్కువ. నాన్న సినీ పరిశ్రమలోనూ రాణించారు. వారి స్ఫూర్తితోనే నా చిన్నప్పటి నుంచే మా అమ్మ దగ్గర నాట్యం అభ్యసిస్తూ వచ్చాను. 1985 నుంచి ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నా. నా భార్య కమలాబాలాజీ కూడా నాట్యాచార్యులే. ఇద్దరమూ కలసి ధర్మవంలోనే శ్రీలలిత నాట్య కళానికేతన్ పేరుతో శాసీ్త్రయ నృత్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకూ వేలాది మంది మా వద్ద శిక్షణ పొందారు. నేడు వారంతా నాట్యాచార్యులుగా రాణిస్తున్నారు. నావరకు సొంతంగా రచించుకున్న జానపద గేయాలు ఆలపిస్తూ నాట్యం చేస్తుంటా. దూరదర్శన్ చానల్లో భరతనాట్యం, కూచిపూడి, జానపద నాట్యంపై 40కి పైగా ప్రదర్శనలు ఇచ్చే అవకాశం దక్కింది. తల్లిదండ్రుల నుంచి అలవడిన ఈ కళ మా జీవితమైంది. నా భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలూ భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాల్లో సిద్దహస్తులు. లెక్కకు మంచి అవార్డులు సొంతమయ్యాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలువురి ప్రశంసలు అందుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ధర్మవరంలోనే కాకుండా చుట్టుపక్కల ఎక్కడ ఎవరికి ఆసక్తి ఉన్నా.. అక్కడికెళ్లి వారికి నాట్యంలో శిక్షణ ఇస్తున్నా. -
‘అనంత పాలధార’ను విజయవంతం చేయండి
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక రూరల్ మండలం ఆకుతోటలపల్లి గ్రామంలో ఈ నెల 7 (బుధవారం) నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘అనంత పాలధార’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పశుసంర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్చంద్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పశుశాఖ కార్యాలయంలో డీడీలు డాక్టర్ వై.రమేష్రెడ్డి, డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, ఏడీ డాక్టర్ ఏవీ రత్నకుమార్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని రాయలసీమలోనే తొలిసారిగా ‘అనంత’లో వినూత్నమైన కార్యక్రమం తలపెట్టామన్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తొలిరోజు బుధవారం మూడు విభాగాల పాల దిగుబడి పోటీలు ఉంటాయన్నారు. మూడు విభాగాల్లోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామన్నారు. రెండో రోజు గురువారం లేగదూడల ప్రదర్శన, వాటి అందాల పోటీలు, అలాగే గర్భకోశవ్యాధి శిబిరం ఉంటుందన్నారు. మూడో రోజు ముగింపు, బహుమతుల ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి మేలు జాతి పాడి ఆవులతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇది కేవలం పోటీ కాదని, పశుపోషకుల్లో ఆత్మవిశ్వాసం నింపే విప్లవాత్మక ఉద్యమమని తెలిపారు. శాసీ్త్రయ పద్ధతుల్లో పాడి పెంపకం, మెరుగైన పశుజాతులు, సమతుల్య పోషణ, పాల దిగుబడి పెంపు, కృత్రిమ గర్భధారణ తదితర అంశాలపై రైతుల్లో అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతిరాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురైన ఓ వృద్ధురాలు అనంతపురం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇటుకలపల్లి పోలీసులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన కోటా రాములమ్మ (74) కుమార్తె అనితకు కందుకూరు గ్రామానికి చెందిన నాగిరెడ్డితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. అనారోగ్యంతో బాధపడుతున్న అనితను చూసేందుకు ఈ నెల 2న రాములమ్మ వచ్చింది. 5వ తేదీ భర్తతో కలిసి అనిత అనంతపురంలో చికిత్స కోసం వెళ్లిన సమయంలో గీజరు సాయంతో నీళ్లు వేడి చేసుకునే క్రమంలో రాములమ్మ విద్యుత్ షాక్కు గురై బాత్రూంలో పడిపోయింది. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుమార్తె, అల్లుడు విషయాన్ని గుర్తించి వెంటనే సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం ఆమె మృతి చెందింది. ఘటనపై రూరల్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
గిన్నిస్ రికార్డు సాధించాలి
పుట్టపర్తి అర్బన్: నిర్ణీత సమయంలో జాతీయ రహదారి–544జీ పనులను పూర్తి చేసి గిన్నిస్ రికార్డు సాధించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. బెంగళూరు–విజయవాడ జాతీయ రహదారి–544జీ పనులను మంగళవారం ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి ఆయన పరిశీలించారు. పనులు చేపడుతున్న రాజ్ఫత్ ఇన్ఫ్రాక్రాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఎండీ జగదీష్ కదర్ పురోగతిని వారికి వివరించారు. 52 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రహదారిని వారం రోజుల్లో పూర్తి చేసేలా శరవేగంగా పనులు చేపడుతున్నామన్నారు. 11.5 మీటర్ల వెడల్పుతో రహదారి ఏర్పాటవుతోందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రహదారి నిర్మాణానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట తహసీల్దార్ కళ్యాణ చక్రవర్తి ఉన్నారు. ఖనిజాల గుర్తింపునకు హెలికాప్టర్ సర్వేకదిరి అర్బన్/ ముదిగుబ్బ: కదిరి పరిసర ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాలను గుర్తించేందుకు జీఎల్ఎఫ్సీ అనే సంస్థ మంగళవారం హెలికాప్టర్ ద్వారా సర్వే చేపట్టింది. ఈ క్రమంలో కదిరి మండలం వై. కొత్తపల్లి వద్ద ఎకరం భూమిలో హెలీప్యాడ్తో పాటు సర్వే సామగ్రిని భద్రపరచుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తహసీల్దార్ మురళీకృష్ణ తెలిపారు. రెండు నెలలపాటు కదిరితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సర్వే నిర్వహించేందుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారన్నారు. కాగా, హెలికాప్టర్ను చూసేందుకు సమీప గ్రామ ప్రజలు తరలిరావడంతో సందడి నెలకొంది. సెంట్రల్ వర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి! అనంతపురం: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ తొలి స్నాతకోత్సవానికి సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో జరిగే స్నాతకోత్సవానికి విజిటర్ హోదాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2018లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటైంది. వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి స్నాతకోత్సవం నిర్వహించలేదు. దీంతో 2018–20 పీజీ, 2018–21 డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలు అందజేస్తారు. మొత్తం 845 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. -
రాప్తాడులో మార్పు మొదలు
రాప్తాడు రూరల్: రాప్తాడు నియోజకవర్గంలో మార్పు మొదలైంది. పార్టీ కోసం రేయింబవళ్లు కష్టపడి జీవితాలను త్యాగం చేసిన కార్యకర్తలకు టీడీపీలో న్యాయం చేకూరలేదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే నేతల తీరుపై కార్యకర్తలు రగిలిపోతున్నారు. కొందరు బయటకు చెప్పుకోలేక లోలోన మదన పడుతుంటే, మరికొందరు పార్టీ మారి తమ అసహనాన్ని బయటపెట్టుకుంటున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల పంచాయతీ పరిధిలో టీడీపీకి చెందిన 20 కుటుంబాలు మంగళవారం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరాయి. అనంతపురంలోని తోపుదుర్తి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారందరికీ పార్టీ కండువాలు కప్పి తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో టీడీపీ సీనియర్ నాయకులు నాగేపల్లి శంకరప్ప, నాగేపల్లి సత్యనారాయణ, బూడిద అక్కులప్ప, బూడిద నాగరాజు, తలారి రంగప్ప, తలారి ఆంజనేయులు, తలారి మురళి, కోడిపల్లి ఈశ్వరప్ప, కట్టుబడి ఆంజనేయులు, పాతపాళ్యం అక్కులప్ప, నీళ్ల చిరంజీవి, కమ్మర శ్రీరాములు, కమ్మర అంజి, దాసరి కదిరప్ప, పల్లెన్న, కురుబ బోసే రామాంజి, తలారి సంజీవ, దళవాయిపల్లి చిరంజీవి, మేకల పోతన్న కుటుంబాలు ఉన్నాయి. టీడీపీలో సుదీర్ఘకాలంగా పని చేశామని, కష్టపడిన వారికి గుర్తింపు లేకపోవడంతో పార్టీని వీడాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. తాము పదవులు ఆశించి పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. తమ కష్టాన్ని గురిస్తే చాలని అన్నారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలకే టీడీపీని కార్యకర్తలు, నాయకులు వీడుతున్నారంటే వారిని పరిటాల కుటుంబం ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేసిందో అర్థమవుతోందన్నారు. కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందేందుకు పరిటాల సునీత ప్రయత్నిస్తోందన్నారు. పరిటాల కుటుంబం మాయలో పడి గ్రామాల్లో ఎట్టి పరిస్థితు ల్లోనూ కులాలు, వర్గాలుగా విడిపోవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ సీకేపల్లి మండల కన్వీనరు డోలా రామచంద్రారెడ్డి, ఎంపీపీ నారాయణస్వామి, వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి, పార్టీ వలంటీరు విభాగం జిల్లా అధ్యక్షుడు ఓబుగారి హరినాథరెడ్డి, నాయకులు మందల నరసింహులు, మనేరు నరసింహులు, వెంకటంపల్లి సత్తిరెడ్డి, ముష్టికోవెల పంచాయతీ సర్పంచు కోనప్ప పాల్గొన్నారు. పరిటాల కుటుంబానికి షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు చెన్నేకొత్తపల్లి మండలం ముష్టికోవెల పంచాయతీ నుంచి 20 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి చేరిక -
ఆయన
‘పైన పొత్తులు.. లోన కత్తులు’ అన్న చందాన తయారైంది జిల్లాలో కూటమి పరిస్థితి. ముఖ్య నేతలు పైన అంతా బాగుందనే కలరింగ్ ఇస్తున్నా కిందిస్థాయిలో ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరుకుంది. పార్టీలోనే ఉన్నా పనులు కాకపోవడంతో పలు చోట్ల ‘తమ్ముళ్లు’ బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ● పెనుకొండలో మంత్రి సవిత వర్సెస్ ఎంపీ పార్థసారథి ● ధర్మవరంలో అడకత్తెరలో పోక చెక్కలా ‘పచ్చ’ నాయకులు ● హిందూపురంలో బాలయ్య పీఏల మధ్య విభేదాలతో ‘తమ్ముళ్ల’ అవస్థలు ● మడకశిరలో ‘మూడు’ ముక్కలాట ● పనులు జరగక బహిరంగంగానే టీడీపీ కార్యకర్తల అసమ్మతి గళం సాక్షి, పుట్టపర్తి: తామందరూ ఒకే తాటిపై ఉంటా మని పెద్ద నాయకులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి పార్టీల నాయకుల మధ్య సమన్వయ లేమి నెలకొంది. జిల్లాలోని చాలా గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు, రేషన్ డీలర్ల పోస్టులు ఖాళీగా ఉండడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. అధికారం కోసం చంద్రబాబు ఇరు పార్టీలతో కలిసి నడుస్తున్నా కింది స్థాయిలో మాత్రం నాయకులు అధికార పెత్తనం కోసం పాకులాడుతుండడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరంభంలో ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ హవా నడిచింది. మంత్రి సత్యకుమార్ తెచ్చుకున్న మున్సిపల్ కమిషనర్ను మార్చే వరకు పట్టుబట్టి నెగ్గాడు. అయితే ఆ తర్వాత శ్రీరామ్ హవా తగ్గింది. మంత్రి అనుచరులు అన్నీ తామై వ్యవహరిస్తుండటంతో ఆయనకు దిక్కు తోచడం లేదు. అంతేకాకుండా ముదిగుబ్బలో ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకంలో ఇరు పార్టీల మధ్య పోటీ నెలకొని.. ఇప్పటికీ పెండింగులోనే ఉన్నాయి. అధికారుల నియామ కాల్లో కూడా మంత్రి పైచేయి సాధిస్తున్నారు. దీంతో ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని టీడీపీ నాయకులు వాపోతున్నారు. ముదిగుబ్బలో బీజేపీకి చెందిన ఎంపీపీ, టీడీపీకి చెందిన మండల కన్వీనర్ మధ్య ఆధిపత్య పోరు నెలకొనడంతో మండల వ్యాప్తంగా ఏ ఒక్క గ్రామంలో కూడా ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం జరగకపోవడంతో ‘తమ్ముళ్ల’ నుంచి అసమ్మతి గళం వినిపిస్తోంది. పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి వర్గాల నడుమ ఆధిపత్య పోరు తారస్థాయికి చేరినట్లు తెలిసింది. రొద్దం మండల ప్రజలపై మంత్రి సవిత కక్ష సాధిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసినప్పటికీ.. పెనుకొండలో చిన్న పని కూడా చేసుకోలేని స్థితిలో ఎంపీ పార్థసారథి అసంతృప్తిగా ఉన్నారు. అధికారులందరూ మంత్రి కనుసన్నల్లో పని చేస్తుండటంతో ఎంపీ వర్గీయుల మాట చెల్లడం లేదు. దీంతో తామందరం సీనియర్లు అంటూ బీకే వర్గీయులు చాలాసార్లు అధిష్టానం వద్ద విన్నవించినట్లు తెలిసింది. మంత్రి సవితకు తెలియకుండా ఎంపీ పార్థసారథి ఏ చిన్న పని కూడా చేయలేని స్థితిలో ఉన్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన మడకశిరలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. అధిష్టానం వద్ద ఈరన్న లాబీయింగ్ చేస్తున్నారు. స్థానికంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వద్ద గుండుమల తిప్పేస్వామి హవా నడిపిస్తున్నారని సమాచారం. అయితే స్థానికంగా ఏం చేయాలన్నా.. మాజీ ఎమ్మెల్సీ పెత్తనం ఏంటని ఎమ్మెల్యే వర్గం ఒకట్రెండు సార్లు చర్చించినట్లు తెలిసింది. దీంతోనే కొన్ని రోజులుగా గుండుమల ముభావంగా ఉన్నట్లు సమాచారం. ఇదే అదనుగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్కుమార్ మంత్రి నారా లోకేశ్తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల మధ్య విభేదాలతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ చుట్టపుచూపుగా హిందూపురం వస్తుంటారు. అయితే ఆయన స్థానంలో ఇన్చార్జ్ ఎమ్మెల్యేల తరహాలో సురేంద్ర, పి.శ్రీనివాసరావు వ్యవహరిస్తుంటారు. మరోవైపు బాలాజీ, వీరయ్య పీఏలుగా చెలామణి అవుతుంటారు. నియోజకవర్గ పాలన నలుగురు వ్యక్తుల చేతుల్లో నడుస్తోంది. కేటగిరీలుగా విభజించుకుని తలా ఓ విభాగంలో పెత్తనం చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఎన్నో ఏళ్లుగా పని చేసిన బాలాజీకి ప్రాధాన్యం ఇవ్వడం లేదని అలకబూనినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం సురేంద్రదే అన్న చందంగా మారింది. ‘పురం’లోపెనుకొండలో మంత్రి వర్సెస్ ఎంపీ దిక్కు తోచని పరిటాల శ్రీరామ్! -
పాల ఉత్పత్తి పెంచడమే లక్ష్యం
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో పాడి సంపద వృద్ధి చెందేలా చేసి పాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో అధికారులు పని చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పశు సంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పశు సంపద ద్వారా జిల్లా జీడీపీ వృద్ధికి విస్తృత అవకాశాలున్నాయన్నారు. మెరుగైన జాతి అభివృద్ధి, వ్యాధి నియంత్రణ, మార్కెట్ అనుసంధానం పెంచాలన్నారు. డెయిరీ అభివృద్ధి కోసం నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. సెర్ప్తో సమన్వయం చేసుకొని స్వయం సహాయ సంఘాలకు పశు సంపద ఆధారిత జీవనోపాధి యూనిట్లను వేగంగా మంజూరు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద మినీ గోకులాలు, పశుషెడ్లు, పశు మేత పంటలు, ఇంటిగ్రేటెడ్ అనిమల్ హాస్టళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శుభదాస్, డ్వామా పీడీ విజయ్ప్రసాద్, డీఆర్డీఏ పీడీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ‘పేద ఖైదీలకు సహాయం’ పక్కాగా అమలవ్వాలి పేద ఖైదీలకు న్యాయం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘పేద ఖైదీలకు సహాయం’ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సాధికార కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఒక్కో ఖైదీకి గరిష్టంగా రూ.50 వేల వరకూ ఆర్థిక సహాయం 5 రోజుల్లో ఫిక్స్డ్ డిపాజిట్, ఇతర విధానాల్లో న్యాయస్థానానికి అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. జరిమానా మొత్తాన్ని చెల్లించలేక దోషిగా తేలిన వ్యక్తి జైలు నుంచి విడుదల కాకుంటే జైలు సూపరింటెండెంట్ 7 రోజుల్లో డీఎల్ఎస్ఏ కార్యదర్శికి సమాచారం ఇవ్వాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జైలు సందర్శక న్యాయవాది, పారా లీగల్ వలంటీర్, జిల్లా ప్రొబేషన్ అధికారి తదితరుల సహకారంతో 7 రోజుల్లో పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ జైలు అధికారులు ఉమామహేశ్వర నాయుడు, శివరామకృష్ణ, హనుమప్ప, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్ -
మాతా శిశు మరణాలు నివారించండి
● జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి సురేష్బాబు నల్లమాడ: మాతా శిశు మరణాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కే.సురేష్బాబు సూచించారు. రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఆశా డే సమావేశంలో ఆయన పాల్గొని ఆరోగ్య, ఆశా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. చిన్న వయసులోనే బాలికలకు వివాహం చేయడం, పౌష్టికాహార లోపం, చిన్న వయసులోనే గర్భం దాల్చడం, కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడంతో పాటు అవగాహనా రాహిత్యంతో వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం తదితర కారణాల వల్ల మాతా శిశు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. వాటి నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడమే గాక పుట్టిన బిడ్డ మొదటి జన్మదినోత్సవం జరుపుకొనే వరకు అవసరమైన అన్ని వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా ఇవ్వాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. నేడు ‘దిశ’ సమావేశంఅనంతపురం టవర్క్లాక్: శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి ‘దిశ’ సమావేశం బుధవారం నిర్వహిస్తున్నామని జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ సత్యసాయి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. అధికారులు, కమిటీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. -
కోడిగుడ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ
అనంతపురం సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన కోడిగుడ్ల కుంభకోణం నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణ చేపట్టాలని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై సోమవారం జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ నిర్వహించిన పరిశీలనలో అక్రమాలు వెలుగు చూశాయి. ముద్ద అన్నం.. తక్కువ మోతాదులో ఆకుకూరలు, కూరగాయలు వినియోగించి చేసిన కూరలు, పరిమాణం తగ్గిపోయిన కోడిగుడ్లు, నిర్దేశించిన రోజుల్లో కోత విధిస్తూ సరఫరా చేసిన వైనం, చిక్కీల పరిమాణం కుదించడం వంటివి బయటపడ్డాయి. ఈ అంశంపై ‘డొక్క’లు ఎండబెట్టి.. నిధులు కొల్లగొట్టి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అనంతపురం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ శివ్నారాయణ్శర్మ స్పందించారు. కోడిగుడ్ల కుంభకోణంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ కోసం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునుడు, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి సహా మరో అధికారిణితో కూడిన త్రిసభ్య కమిటీని నియమించారు. శ్రీనందన ఎంటర్ప్రైజస్ దోపిడీ పర్వం అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,249 ప్రాథమిక, 63 ప్రాథమికోన్నత, 363 ఉన్నత పాఠశాలలతో పాటు 1,675 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు శ్రీనందన ఎంటర్ ప్రైజస్ అనే సంస్థ కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా చేస్తోంది. మొత్తం 3,55,418 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం కింద లబ్ధి పొందుతున్నారు. ఈ సంస్థ ఐసీడీఎస్లోని ఓ సీనియర్ ఉద్యోగికి చెందినదిగా తెలుస్తోంది. తను ప్రభుత్వోద్యోగి కావడంతో కుమారుడి పేరుతో సంస్థ నడుపుతున్నట్లు సమాచారం. ఈ సంస్థే జిల్లాలోని అన్ని అంగన్వాడీలకు కూడా కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా చేస్తోందని తెలిసింది. సదరు ఉద్యోగి ఈ ఒక్క జిల్లానే కాకుండా వేర్వేరు జిల్లాల్లో వేర్వేరు పేర్లతో, బినామీల పేర్లతో కాంట్రాక్ట్లు దక్కించుకొని అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఒక్కో ట్రిప్పులో ఒక్కో రంగు చొప్పున గుడ్ల మీద వేయాలి. అటువంటి పరిస్థితి లేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో గుడ్డుకు పావలా కమీషన్ ఒక గుడ్డు కనీసం 50 గ్రాముల పరిమాణంలో ఉండాలి. అయితే ఈ సంస్థ 25 నుంచి 30 గ్రాములు ఉన్న కోడిగుడ్లు మాత్రమే సరఫరా చేసి రూ.కోట్లు కొల్లగొడుతున్న తీరు విస్తుపోయేలా చేస్తోంది. విద్యాశాఖాధికారులకు గుడ్డుకు పావలా చొప్పున కమీషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో హెడ్మాస్టర్లు అన్నీ చూసుకోవాలి. సైజు తక్కువ ఉన్న కోడిగుడ్లు ఇస్తే వెనక్కు పంపాలి. అయితే అలా జరగడం లేదు. నెలకు ఒకట్రెండుసార్లు మాత్రమే స్టాకు ఇచ్చినా నిలదీయడం లేదు. ఇక మధ్యాహ్న భోజన పథకం తనిఖీ బాధ్యత ఎంఈఓ–2 చూడాలి. వారూ నోరెత్తరు. ఎందుకుంటే ఏదైనా ప్రశ్నిస్తే సదరు కాంట్రాక్టర్ ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు చేయిస్తున్నట్లు హెడ్మాస్టర్లు, ఎంఈఓల ద్వారా తెలిసింది. డీఈఓ కార్యాలయ అధికారులైతే హెడ్మాస్టర్లు, ఎంఈఓలపై సాకు నెట్టేస్తూ పబ్బం గడిపేస్తున్నారు. ప్రజలు, విద్యార్థులు ఫిర్యాదులు చేసినా బుట్టదాఖలే అవుతున్నాయి. పత్రికల్లో కథనాలు వచ్చిన రోజు హడావుడి చేస్తారు. అంతటితో మరచిపోతున్నారు. తాజాగా ముగ్గురు అధికారులతో కూడిన విచారణ కమిటీని ఇన్చార్జ్ కలెక్టర్ నియమించారు. ఈ కమిటీ అయినా నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజాలు నిగ్గుతేల్చి అక్రమార్కులను శిక్షిస్తారా లేక రక్షిస్తారా అనే సందేహాలు అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. అనంతపురం ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశం శ్రీసత్యసాయి జిల్లాలో ఇదీ పరిస్థితి.. శ్రీసత్యసాయి జిల్లాలోనూ మధ్యాహ్న భోజన పథకం కాంట్రాక్టర్లకు భోజ్యంగా మారింది. ఇక్కడ 32 మండలాలు ఉండగా, హనుమాన్ ట్రేడర్స్కు 22 మండలాలు, శ్రీలక్ష్మీవెంకటేశ్వర ట్రేడర్స్కు 11 మండలాల కోడిగుడ్ల సరఫరా బాధ్యతలు అప్పగించారు. ఇక అన్ని మండలాలకూ చిక్కీల సరఫరా హనుమాన్ ట్రేడర్స్కే కట్టబెట్టినట్లు సమాచారం. ఏ ఒక్క సంస్థ గానీ సక్రమంగా గుడ్లు, చిక్కీలు సరఫరా చేసిన దాఖలాల్లేవు. పట్టుమని ఒక నెల కూడా గుడ్లు, చిక్కీలు సరఫరా చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక విద్యా శాఖ అధికారులకు భారీగా కమీషన్లు అందడమేనని బలమైన ఆరోపణలు ఉన్నాయి. -
గుండుమల కేజీబీవీ ప్రిన్సిపాల్ అవుట్
మడకశిర: మండలంలోని గుండుమల కేజీబీవీ ప్రిన్సిపాల్గా పని చేస్తున్న ఎస్హెచ్ చాందినిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ మంగళవారం ఏపీ సమగ్రశిక్ష జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దేవరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ఉద్యోగానికి సంబంధించిన కాంట్రాక్ట్ అగ్రిమెంట్ను రద్దు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిబంధనలు ఉల్లంఘించడం తదితర కారణాలతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. వివరాలు.. గుండుమల కేజీబీవీని గత ఏడాది డిసెంబర్ 12న ఉదయం 8 గంటలకు స్థానిక ఎంఈఓ భాస్కర్ సందర్శించారు. టెన్త్ విద్యార్థుల వంద రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రిన్సిపాల్, పలువురు టీచర్లు లేని విషయాన్ని గుర్తించిన ఎంఈఓ వారికి షోకాజ్ జారీ చేశారు. ప్రిన్సిపాల్, టీచర్ల ద్వారా వివరణ తీసుకున్న ఎంఈఓ అనంతరం నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపారు. అయితే, ప్రిన్సిపాల్ ఇచ్చిన వివరణపై ఉన్నతాధికారులు సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే కలెక్టర్ శ్యాంప్రసాద్ కూడా గుండుమల కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. కలెక్టర్ పర్యటన అనంతరం సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ దేవరాజు కేజీబీవీని సందర్శించి విచారణ చేపట్టారు. ప్రిన్సిపాల్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సిబ్బందిలో కలవరం.. మడకశిర నియోజకవర్గంలో గుండుమలతో పాటు అమరాపురం,కరికెర,అగళి, రొళ్లలో కేజీబీవీలు ఉన్నాయి. వీటి నిర్వహణ కూడా అంతంత మాత్రంగానే ఉంది. గుండుమల కేజీబీవీ ప్రిన్సిపాల్ చాందినిని ఉద్యోగం నుంచి తొలగించిన నేపథ్యంలో ఆయా కేజీబీవీల్లో పని చేస్తున్న ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కలవరపాటుకు గురైనట్లు తెలుస్తోంది. గతంలోనే ‘సాక్షి’ కథనం.. నియోజకవర్గంలో కేజీబీవీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే విషయంపై గత ఏడాది డిసెంబర్ 10న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. ప్రధానంగా గుండుమల కేజీబీవీ నిర్వహణ తీరుపై ఫోకస్ చేసింది. ‘సాక్షి’ కథనంతో కింది స్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు విచారణ చేసి ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవడం గమనార్హం. విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉన్నతాధికారుల ఉత్తర్వులు నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలకు ఫలితం -
యువత మత్తుకు బానిసకారాదు
● క్రమశిక్షణతో చదువుకుని భవితకు బాటలు వేసుకోవాలి ● అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ హిందూపురం: యువత మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోరాదని అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ, ప్రభుత్వ ఆస్పత్రి మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ జీవన పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి నాయుడు అధ్యక్షతన జాతీయ యువ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి శైలజ మాట్లాడుతూ.. యువతపైనే దేశ భవిత ఆధారపడి ఉందన్నారు. అందువల్ల చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి మార్గంలో పయనించాలన్నారు. రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులను సద్వినియోగం చేసుకుంటూ చట్టాలపై అవగాహన పెంచుకుని దేశసంపదగా ఎదగాలన్నారు. క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ముందుకెళితే ఏదైనా సాధించవచ్చునన్నారు. మానసిక వైద్యనిపుణురాలు డాక్టర్ జీవన మాట్లాడుతూ... క్షణకాలం ఆనందంకోసం మత్తుకు బానిసలయ్యేవారు జీవితాలను దుర్భరం చేసుకుంటురన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల అవయవాల పనితీరు మందగించి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారన్నారు. ప్రతి ఒక్కరూ సరైన పోషకాహారం, శారీరక శ్రమ, యోగా, ధ్యానం వంటి అంశాలను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకుని నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. సమావేశంలో న్యాయవాదులు సుదర్శన్, శ్రీనివాసరెడ్డి, కళావతి, సంతోషి కుమారి, మురళి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఏపీఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడిగా లింగా రామ్మోహన్ ● జిల్లా కమిటీ ఎన్నిక ఏకగ్రీవం పుట్టపర్తి టౌన్: ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ సంఘం (ఏపీఎన్జీజీఓ) జిల్లా అధ్యక్షుడిగా లింగా రామ్మోహన్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీఎన్జిజిఓ జిల్లా ఎన్నికల షెడ్యూల్ మేరకు సోమవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో నామినేషన్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. అయితే ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవడంతో సభ్యులంతా కలిసి జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. దీంతో జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు వేణుగోపాల్రెడ్డి, సహాయ ఎన్నికల అధికారి శ్రీనివాస్ ప్రకటించారు. సంఘం జిల్లా అధ్యక్షులుగా లింగా రామ్మోహన్ (ఎంపీహెచ్ఈఓ, బుక్కపట్నం పీహెచ్సీ) గౌరవాధ్యక్షులుగా ఈశ్వరప్ప (సీనియర్ అసిస్టెంట్, సెరికల్చర్), ఉపాధ్యక్షులుగా గఫూర్, రామ్మోహన్ ప్రసాద్, రవీంద్రారెడ్డి, రమేష్, రమేష్బాబు, రాజేశ్వరి, సెక్రటరీగా ఈశ్వర్నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజు, జాయింట్ సెక్రటరీలుగా సాయి బహుతుల్య, హరీష్, పరమేశ్వర్రావ్, చంద్రమోహన్, శ్రీధర్, జయంతి, జనార్దన్, ట్రెజరర్గా జె. ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీని ఉద్యోగులు శాలువలు, పూలపూల మాలలతో సన్మానించారు. ఎన్నికల రాష్ట పరిశీలకులు ప్రసాద్యాదవ్ నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీజీజీఓ నూతన జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ..ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. అంతకుముందు గణేష్ కూడలి నుంచి సాయి ఆరామం వరకు ఉద్యోగులంతా ర్యాలీ నిర్వహించారు. జాతీయ స్థాయి జూడో పోటీలకు చిగిచెర్ల విద్యార్థులు ధర్మవరం రూరల్: జాతీయ స్థాయి జూడో పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ తరఫున ధర్మవరం మండలం చిగిచెర్ల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పాఠశాల పీడీ ప్రతాప్రెడ్డి సోమవారం వెల్లడించారు. ఎంపికై న వారిలో కావ్యశ్రీ, సంజన, వీక్షిత్ ఉన్నారు. వీరు ఈ నెల 6 నుంచి పంజాబ్లోని లుధియానాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ తరఫున పాల్గొననున్నారు. ఎంపికై న విద్యార్థులను ఆ పాఠశాల హెచ్ఎం తిమ్మారెడ్డి, పీడీ ప్రతాపరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. -
పురుగు మందు దెబ్బకు మోడువారిన చీనీ చెట్లు
పుట్టపర్తి అర్బన్: కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా తన పరిస్థితి మారిందని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎదుట ముదిగుబ్బ మండలం వలిమి చెర్లోపల్లి గ్రామానికి చెందిన రైతు దేవేంద్ర వాపోయాడు. తన సమస్యను కలెక్టర్కు వివరించిన అనంతరం కలెక్టరేట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడాడు. తనకున్న 5 ఎకరాల్లో చీనీ సాగు చేపట్టానని, 9 ఏళ్ల వయసున్న చీనీ చెట్లకు వ్యాధి సోకడంతో తాను మామూలుగా మందులు కొనుగోలులో చేసే ముదిగుబ్బలోని లక్ష్మీనరసింహ ట్రేడర్స్ ఫర్టిలైజర్ షాప్నకు గత ఏడాది నవంబర్ 26న వెళ్లి అక్కడి యజమాని చంద్రశేఖరనాయుడు సూచన మేరకు రూ.13,480 వెచ్చించి పురుగు నివారణ మందులు కొనుగోలు చేసినట్లు వివరించాడు. చంద్రశేఖర నాయుడు సూచించిన విధంగానే వాటిని చీనీ చెట్లపై పిచికారీ చేసిన నాలుగు రోజులకే చెట్లకు ఉన్న వందలాది టన్నుల చీనీ కాయలు, ఆకులు మొత్తం రాలిపోయాయన్నాడు. చెట్లు కూడా మోడువారి మరో రెండేళ్ల వరకూ పంట చేతికి అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని చంద్రశేఖరనాయుడు దృష్టికి తీసుకెళ్లి తనకు పరిహారం చెల్లించాలని కోరితే ఎలాంటి పరిస్థితుల్లోనూ పరిహారం చెల్లించేది లేదని బెదిరింపులకు దిగాడని వాపోయాడు. అంతేకాక తమకు యూనియన్ ఉందని, తాను చెప్పినట్లుగానే ఉద్యాన అధికారులు నడుచుకుంటారని, తననేమీ చేసుకోలేవంటూ హెచ్చరికలు చేశాడని తెలిపాడు దీంతో తనకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని వేడుకున్నట్లు వివరించాడు. సుమారు రూ.10 లక్షలకు పైగా నష్ట వాటిల్లిందని ఆదుకోవాలని విన్నవించినట్లుగా తెలిపాడు. నట్టేట ముంచిన ఫర్టిలైజర్ షాపు యజమాని కలెక్టర్ ఎదుట వాపోయిన బాధిత రైతు -
వ్యవసాయ పనిముట్లు ఇస్తామంటూ బురిడీ
బ్రహ్మసముద్రం: సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు ఇస్తామంటూ రైతులకు ఓ యువకుడు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత రైతులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం గుడిగానిపల్లికి చెందిన పోలేపల్లి నవీన్ తాను ఐసీఐసీఐ ఫౌండేషన్లో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నట్లు కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరి నియోజకవర్గాల్లో పలువురు రైతులతో పరిచయం పెంచుకున్నాడు. రోటోవేటర్, స్ప్రేయర్లు తదితర వ్యవసాయ పనిముట్లను 50 శాతం సబ్సిడీతో అందజేస్తున్నామని రైతు వాటా కింద మొత్తం చెల్లించాలని సూచించాడు. దీంతో అతని మాటలు నమ్మిన పలువురు రైతులు రూ.లక్షల్లో చెల్లించారు. ఒక్క బ్రహ్మసముద్రం మండలంలోనే రూ.5 లక్షలకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. రోజులు గడుస్తున్నా వ్యవసాయ పనిముట్లు అందకపోవడంతో రైతులకు అనుమానం వచ్చి మూడు నెలల క్రితం గట్టిగా నిలదీశారు. దీంతో రాత్రికి రాత్రే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఫోన్ కూడా పని చేయకపోవడంతో మూడు నెలలుగా అతని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే వనీన్తో పాటు అదే గ్రామానికి చెందిన రవి, మంజునాథ్ బెంగళూరు కేంద్రంగా రైతులను మోసం చేస్తున్నట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాజకీయ నాయకులతో సంప్రదింపులతో కాలయాపన చేస్తున్నారని బాధితులు వాపోయారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మోసగాడిని అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించడంతో పాటు తమ డబ్బు తమకు వెనక్కు ఇప్పించాలని కోరుతున్నారు. -
మెడికల్ షాపుల్లో తనిఖీలు
కదిరి టౌన్: స్థానిక 20 మెడికల్ షాపుల్లో అనంతపురం జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఓ.వీరకుమార్రెడ్డి, డ్రగ్ ఇన్స్పెక్టర్లు పి.కేశవరెడ్డి, జి.మాధవి, డీఎస్పీ శివనారాయణస్వామి సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మత్తు కలిగించే ఔషధాల విక్రయాలకు సంబంధించి రికార్డుల నిర్వహణ సక్రమంగా లేని ఐదు దుకాణాల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. కార్యక్రమంలో సీఐలు వి.నారాయణరెడ్డి, నిరంజన్రెడ్డి, ఎస్ఐలు బాబ్జాన్, ధనుంజయరెడ్డి, భువనేశ్వరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిష్కార వేదికకు 85 వినతులు పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 85 వినతులు అందాయి. ఎస్పీ సతీష్కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆంకిత సురాన మహవీర్, మహిళా పీఎస్ డీఎస్పీ ఇందిర, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అరటి ఎగుమతి సమస్యలపై అధ్యయనంఅనంతపురం అగ్రికల్చర్: జిల్లా నుంచి ముంబయి మీదుగా గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతులకు ఎదురవుతున్న సమస్యలపై ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎల్ఐడీసీ) అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం అనంతపురంలోని ఉద్యానశాఖ కార్యాలయంలో డీడీహెచ్ డి.ఉమాదేవి, ఏడీహెచ్ దేవానందకుమార్తో పాటు ఎక్స్పోర్టర్లు, ట్రేడర్లు, ఎఫ్పీఓలతో ఏపీఎల్ఐడీసీ అధికారులు పవన్కుమార్సాహు, రామనాథ్రెడ్డి సమావేశమై చర్చించారు. రైల్వే సహకారంతో ఏసీ రెఫ్రిజిరేటర్ కంటైనర్ల ద్వారా అరటి ఎగుమతికి ప్రణాళిక ఉన్నా రవాణా ఖర్చులు, ఇతరత్రా అనుమతుల్లో జాప్యం కారణంగా సమస్యలు తలెత్తుతున్నట్లు జిల్లా అధికారులు, ఎగుమతిదారులు తెలిపారు. తాడిపత్రి నుంచి రైలు మార్గం ద్వారా ముంబయికు వెళితే.. అక్కడి నుంచి పోర్టు (నౌకాశ్రయం)లోకి అరటిని చేర్చడానికి సమయం తీసుకుంటున్నారని, అనుమతులు తొందరగా ఇవ్వడం లేదని వివరించారు. కంటైనర్లు కూడా సక్రమంగా అందుబాటులోకి రావడం లేదన్నారు. క్వాలిటీ చెకింగ్, అనుమతులు, క్వారంటైన్ తదితర ప్రక్రియల్లో జాప్యం చోటు చేసుకుంటుండడంతో ఈ సమస్యకు పరిష్కారంగా ఇక్కడే ‘డ్రై పోర్టు’ ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అలాగే జిల్లాలో రెండు మూడు చోట్ల కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తే రైతులు లేదా కంపెనీలు అరటిని అక్కడికి తీసుకువచ్చి... అక్కడి నుంచి కంటైనర్లకు లోడ్ చేయడం సులభమవుతుందని వివరించారు. హోరాహోరీగా ఫుట్బాల్ పోటీలు అనంతపురం కార్పొరేషన్: అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న ఇన్స్పైర్ ఫుట్బాల్ కప్ టోర్నీ పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. తొలి మ్యాచ్లో మగన్సింగ్ రాజీవ్ ఎఫ్సీ జట్టు 5–0 గోల్స్ తేడాతో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై ఘనవిజయం సాధించింది. అలాగే నర్మద వాలీ ఎఫ్సీ జట్టు 6–0 గోల్స్ తేడాతో తాండమ్ ఫౌండేషన్ జట్టుపై విజయకేతనం ఎగురవేసింది. పదువయ్ యూనికార్న్ జట్టు ఏకంగా 18–0 గోల్స్ తేడాతో లైఫ్ స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై విజయఢంకా మోగించింది. ఫజల్ ఎఫ్సీ జట్టు 12–0 గోల్స్ తేడాతో నాంది ఫౌండేషన్ జట్టుపై, యువ ఫౌండేషన్ 3–0 గోల్స్ తేడాతో ఆస్కార్ ఫౌండేషన్ జట్టుపై గెలుపొందాయి. -
హెచ్ఎం అక్రమాలపై డీఈఓ విచారణ
చెన్నేకొత్తపల్లి: మండలంలోని న్యామద్దల ఉన్నత పాఠశాల పూర్వపు హెచ్ఎం అక్రమాలపై డీఈఓ క్రిష్టప్ప సోమవారం సాయంత్రం క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. 2022–25 సంవత్సరంలో ఫేజ్–1 నాడు–నేడు కింద రూ.59లక్షల నిధులతో పాఠశాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ సమయంలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన రామచంద్ర అక్రమాలకు పాల్పడినట్లుగా ఫిర్యాదులు అందాయి. దీంతో డీఈఓ క్రిష్టప్ప విచారణ చేపట్టారు. పనులకు సంబంధించిన రికార్డులు, బిల్లులు పరిశీలించారు. రామచంద్రతో పాటు ప్రస్తుత హెచ్ఎం ఆనందనాయక్, పలువురు ఉపాధ్యాయులను డీఈఓ విచారించారు. బిల్లుల మంజూరులో సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, దీనిపై విచారణ చేస్తున్నట్లు విలేకరులకు తెలిపారు. నివేదికను ఆర్జేడీకి పంపి తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిందితుల కోసం ముమ్మర గాలింపు పుట్టపర్తి టౌన్: స్థానిక హంద్రీ–నీవా కాలువలో కొత్తచెరువు మండలం తిప్పబాట్లపల్లికి చెందిన సాప్ట్వేర్ ఉద్యోగి మహేష్ చౌదరి (35) మృత దేహం లభ్యమైన కేసులో తల్లి ఫిర్యాదు మేరకు అనుమానిత నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. భూములు వ్యాపారం విషయంగా తలమర్ల మారుతీరెడ్డి, బాలమిత్ర, లోకేష్, కిషోర్తో తన కుమారుడికి గొడవలు ఉన్నాయని, ఈ వివాదంపై గతంలోనూ కొత్తచెరువు పీఎస్లో పంచాయితీలు జరిగాయని, ఈ క్రమంలోనే పథకం ప్రకారం తనకుమారుడిని హతమార్చి హంద్రీనీవా కాలువలో పడవేశారంటూ పుట్టపర్తి అర్బన్ పీఎస్లో తల్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు డీఎస్పీ విజయ్కుమార్ నేతృత్వంలో బృందాలుగా విడిపోయి అనుమానిత నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 8న కాకినాడలో ఖేలో ఇండియా ట్రైబల్ పోటీలు పుట్టపర్తి టౌన్: ఈ నెల 8న కాకినాడ వేదికగా ఖేలో ఇండియా ట్రైబల్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు డీఎస్డీఓ కిషోర్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓపెన్ ఏజ్ కేటగిరిలో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, హాకీ, ఫుట్బాల్ తదితర క్రీడల్లో ఎంపికలు ఉంటాయి. జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలకు ఏపీ తరఫున ప్రాతినిథ్యం వహించాలనే ఆసక్తి ఉన్న వారు ఈ నెల 8న ఉదయం 9 గంటలకు కాకినాడలోని క్రీడా ప్రాంగణంలో రిపోర్టు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎస్టీ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు, ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాలి. -
వికసిత్ భారత్ లక్ష్య సాధనకు గ్రామ సభలే పునాది
పుట్టపర్తి అర్బన్: వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ (వీబీ జీ రామ్జీ) కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో గ్రామ సభల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో వీబీ జీ రామ్ జీ గ్రామ సభలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలను భాగస్వాములను చేయాలన్నారు. మెరుగన హామీ, దృఢమైన నిబద్ధత, సమర్థ పాలన, ఇదే వికసిత్ భారత లక్ష్యమన్నారు. గ్రామ సభలు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రజల భాగస్వామ్యంతో సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ సువర్ణ, డ్వామా పీడీ విజయ్ప్రసాద్, ఏపీడీ రమేష్బాబు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
8 నుంచి ‘అనంత’లో మిల్లెట్ మేళా
అనంతపురం అగ్రికల్చర్: అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు అనంతపురంలోని పోలీస్ కాంప్లెక్స్లోని ఫంక్షన్ హాల్ వేదికగా ‘మిల్లెట్ మేళా’ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్జీఓ, ఎఫ్పీఓ ప్రతినిధులు సంయుక్తంగా వెల్లడించారు. సోమవారం స్థానిక ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేదిక తరపున ఆ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి మాట్లాడారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వ్యవసాయ, అనుబంధ రంగాలు, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎన్జీఓలు, ఎఫ్పీఓలు మొత్తం 18 సంస్థలు సంయుక్తంగా మిల్లెట్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ‘ప్రకృతి వ్యవసాయం, ఆహారోత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, వినియోగం’ అనే అంశాలను ప్రధానంగా తీసుకుని 20 వరకు ఆహారోత్పత్తుల ప్రదర్శన శాలలు, అమ్మకాలు చేపడుతున్నట్లు వివరించారు. అలాగే ఈ ఏడాది ‘అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం’, అంతర్జాతీయ ఉమ్మడి వనరులు, పశువులు, జీవాల పెంపకం సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి గుర్తించిన నేపథ్యంలో ‘మిల్లెట్ మేళా’లోనూ వాటికి ప్రాధాన్యతనిస్తూ రోజుకో అంశంపై చర్చలు, సమాలోచనలు, భవిష్యత్ కార్యాచరణ అంశాల గురించి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. రైతులు, మహిళలు, అలాగే నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎఫ్ఈఎస్ వ్యవస్థాపకులు భక్తర్వలి, ఏఎఫ్ఈసీ చీఫ్ ఆపరేషన్స్ జె.మురళీకృష్ణ, రిడ్స్ పీడీ వి.కిష్టప్ప, రెడ్స్ ఫౌండర్ భానుజాతో పాటు సీసీడీ, వాసన్, టింబక్టు, ఏపీ మాస్, సీఎస్ఏ, జనజాగృతి, యాపిల్, పాస్, కార్డు, గ్రామ్వికాస్, అనంత నాచురల్స్, తిరుమల ఆర్గానిక్స్, డిజిటల్ గ్రీన్ తదితర ఎన్జీఓ, ఎఫ్పీఓ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహణ జయప్రదం చేయాలని ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి పిలుపు -
సాగునీటి సంకటం తీర్చండి
అనంతపురం అర్బన్: ‘తుంపెర డీప్కట్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఆటంకం కల్పించిన కారణంగా ఏకంగా 883 ఎకరాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందికి గురవుతున్నారు. దీనిపై విచారణ చేసి రైతులకు నీరు అందేలా చర్యలు తీసుకోండి’ అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనంతపురం ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మను కోరారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఇన్చార్జ్ కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితి వివరించారు. అనంతరం కేతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తుంపెర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 11 క్యూసెక్కుల నీటిని తోడుకునేందుకు ప్రభుత్వం 1984లో జీఓ 443 జారీ చేసిందన్నారు. దీనిద్వారా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం రామాపురం గ్రామంలో 532 ఎకరాలు, అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పల మండలం ముచ్చుకుంటపల్లి గ్రామంలో 351 ఎకరాలకు నీరందించాల్సి ఉందన్నారు. యల్లనూరు, పుట్లూరు మండలాలకు ఇబ్బంది లేకుండా కొన్ని పైపులు ద్వారా నీటిని తరలించేవారమన్నారు. అయితే అక్కడి రైతులు ఈ పైపులను తొలగించడంతో లిఫ్ట్ను పూర్తిగా మూసి వేశారన్నారు. దీనివల్ల కింద ఉన్న రామాపురం, చిన్నకొండయ్యపల్లి, కునుకుంట్ల గ్రామాలకు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం నెలకొందన్నారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సాగునీరు సరఫరా అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి రెండు రోజుల్లోగా సమస్యను పరిష్కరించి నీరు సరఫరా చేయిస్తామన్నారని కేతిరెడ్డి వెల్లడించారు. చంద్రబాబు సర్కార్ అన్ని విధాలా విఫలమైంది.. రాష్ట్రంలోని చంద్రబాబు సర్కార్ అన్ని విధాలా విఫలమైందని కేతిరెడ్డి ధ్వజమెత్తారు. సాగునీటి విషయంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా.. ఇక్కడి ప్రజాప్రతినిధులు మాట్లాడలేని దయనీయస్థితిలో ఉన్నారన్నారు. ప్రజలను ఏదో ఒక విధంగా మభ్యపెట్టడం, మోసం చేయడం అనే ఆలోచనతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. చందబ్రాబు ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లవుతున్నా... ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ‘‘నేను, చంద్రబాబు ప్రత్యేకంగా ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాము’’ అని రేవంత్రెడ్డి చెప్పారని, అది కూడా కేంద్రంతో చెప్పించి ఆపించే కార్యక్రమం చేయించామని ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. మరి రాయలసీమ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ ఇక్కడి వారు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. త్వరలోనే ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’.. ప్రజా సమస్యలపై త్వరలోనే ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ చేపడతానని కేతిరెడ్డి వెల్లడించారు. ‘‘దాని మీద ఏడ్చేవాళ్లు కూడా ఉంటారు. అవీఇవీ అంటూ ఆరోపణలు చేస్తూ గతంలో ఏడ్చిన వాళ్లకి అప్పుడే చెప్పాను. మీవద్ద ఏమైనా ఉంటే చూపించండని. ఇప్పటి వరకు చూపించలేదు. వాళ్ల గురించి పట్టించుకోను. నేను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ప్రజల కోసం పనిచేస్తా’’ అని అన్నారు. కేతిరెడ్డి వెంట రామాపురం సర్పంచ్ పుల్లయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తాడిమర్రి చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎంపీపీ వడ్డి గోపాల్రెడ్డి, సల్లాపురం బాలరమణారెడ్డి, యలక శ్రీనివాసరెడ్డి, వడ్డి లింగారెడ్డి, వెంకటరెడ్డి, ఈశ్వరరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జొల్లిరెడ్డి అశ్వర్థ, తదితరులు పాల్గొన్నారు. అనంతపురం ఇన్చార్జ్ కలెక్టర్ను కోరిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 883 ఎకరాలకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారని వెల్లడి ప్రజా సమస్యలపై త్వరలోనే గుడ్ మార్నింగ్ ధర్మవరం’ తొడగొట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం.. ‘‘మన దగ్గర ఉన్న ఎయిమ్స్ పోయింది. కర్నూలుకు వచ్చిన లా యూనివర్సిటీ పోయింది. హైకోర్టు పోయింది. అన్నీ అమరావతిలో పెడుతున్నారు. మనమేమో రాయలసీమ.. రాయలసీమ అంటూ తొడగొట్టుకోవడం తప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. లేని పౌరుషాల పేరుచెప్పుకుని ఉప్పు కారం తింటున్నాం. ఇన్ని ప్రాజెక్టులు పోతున్నా, మనకు ఇంత అన్యాయం జరుగుతున్నా... మాట్లాడలేని దయనీయ పరిస్థితిలో ప్రజాప్రతినిధులు..అందరం ఉన్నాం.’’ అని కేతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అనవసర విషయాలపై గంటల తరబడి మాట్లాడే రాయలసీమ ప్రజాప్రతినిధులు...మనకు నీళ్లు రాకుండా ఆపుతున్నారనే అనేదాన్ని నోరు మెదపలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారన్నారు. -
మానవత్వంతో ప్రజా సమస్యలు పరిష్కరించండి
● అధికారులతో కలెక్టర్ శ్యాం ప్రసాద్ ● ‘పరిష్కార వేదిక’కు 492 అర్జీలు పుట్టపర్తి అర్బన్: ‘‘కలెక్టరేట్కు వెళ్లి అర్జీ ఇస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశతో జిల్లా నలుమూలల నుంచి జనం వ్యయ ప్రయాసలకోర్చి ఇక్కడి వరకూ వస్తారు. తమ సమస్యలపై అర్జీలిస్తారు. వాటిని మానవత్వంతో పరిశీలించి పరిష్కరించాలి’’ అని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 492 అర్జీలు అందాయి. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి పరిష్కరించాలన్నారు. అందిన అర్జీల్లో కొన్ని.. ● పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లిలో మురుగునీళ్లు రోడ్లపై పారుతున్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామానికి చెందిన గంగాధర్ కలెక్టర్కు విన్నవించారు. నెలల తరబడి అపరిశుభ్రత నెలకొని ఉండడంతో వృద్ధులు, చిన్నారులు జారి పడుతున్నారన్నారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ● టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తనకు వచ్చే పింఛన్ ఆగిపోయిందని తలుపుల మండలం సిద్దగూరిపల్లికి చెందిన మరియమ్మ కలెక్టర్కు విన్నవించారు. పింఛనే తనకు జీవనాధారమని, వెంటనే పునరుద్ధరించాలని కోరారు. మా స్థలాలను టీడీపీ నేతలు కబ్జా చేశారు ● రెవెన్యూ అధికారులకు గుంతపల్లి దళితుల ఫిర్యాదు కనగానపల్లి: ‘‘ఏళ్లుగా మా ఆధీనంలో ఉన్న భూములను టీడీపీ నేతలు కబ్జా చేశారు. జేసీబీలను దించి భూమిని చదును చేయిస్తున్నారు. మీరే మాకు న్యాయం చేయాలి’’ అని గుంతపల్లి ఎస్సీ కాలనీవాసులు సోమవారం తహసీల్దార్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిప్పన్న, సూరి, చిన్నప్ప, హనుమంతు మాట్లాడుతూ... 25 సంవత్సరాలు క్రితం ఏర్పడిన ఎస్సీ కాలనీకి పక్కనే సర్వే నంబరు 487–2లోని స్థలంలో దళితులు, గిరిజనులు, బీసీలు కల్లాలు, పశువుల పాకలు వేసుకొని జీవనం సాగిస్తున్నారన్నారు. ఆ స్థలాన్ని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆక్రమించి జేసీబీలతో చదును చేయిస్తున్నారని, అడ్డుకొనేందుకు వెళ్లిన తమను దుర్భాషలాడుతూ దాడికి దిగారన్నారు. స్థలాన్ని ఆక్రమణకు గురికాకుండా చూడాలని వారు కోరారు. -
నిధులివ్వలేదు.. నీరూ తేలేదు!
రామగిరి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేరోందిన అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ (పేరూరు డ్యాం)కు నీరొస్తే ఉభయ జిల్లా వాసులకు తాగు, సాగునీటికి ఢోకా ఉండదు. అయితే ఈ ప్రాజెక్ట్ను ఇప్పటి వరకూ కేవలం ఓటు బ్యాంక్గానే పరిటాల కుటుంబం వాడుకుంటూ పబ్బం గడుపుకుంటోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ పేరూరు డ్యాంకు నీరు తీసుకొస్తామని హామీనిచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిటాల సునీత... రెండేళ్లు పూర్తయినా నేటికీ ఆ హామీని నిలబెట్టుకోలేదు. డ్యాంకు చుక్కనీరు అందకపోవడంతో వట్టిపోయింది. అంతేకాక గేట్ల మరమ్మతు పేరుతో ఉన్న అర టీఎంసీ నీటిని కూడా వృధాగా దిగువకు వదిలేయడంతో పంటలు సాగుకు నీరందక రైతులు, తాగేందుకు నీరులేక పలు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పదేళ్లు దాటినా... అలాగే 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో పేరూరు డ్యాంకు హంద్రీ–నీవా కాలువ నుంచి కృష్ణా జలాలను తీసుకువస్తామని పరిటాల సునీత స్పష్టమైన హామీనిచ్చారు. గెలిచిన తర్వాత మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే డ్యాంకు నీటిని మళ్లించేందుకు అప్పట్లో హడావుడిగా రైతుల నుంచి బలవంతంగా వందల ఎకరాల భూమిని సేకరించారు. వీరిలో కొందరికి మాత్రమే పరిహారం అందింది. పదేళ్లు దాటినా కాలువ పూర్తి కాలేదు.. మిగులు నిర్వాసితులకు పరిహారమూ అందలేదు. చంద్రబాబు ప్రభుత్వం మొండి చెయ్యి చూపడంతో నిధులు అందక నిర్వాసితులకు పరిహారం అందకుండా పోయింది. దీంతో ఉన్న భూమిని కోల్పోయి చాలామంది రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రశ్నిస్తే ఎలాంటి దారుణాలను చవిచూడాల్సి వస్తోందోననే భయం అందరిలోనూ వెన్నాడుతుండడంతో ఆ సాహసం చేయలేక మౌనంగా ఉండిపోయారు. దుబ్బార్లపల్లివద్ద పేరూరు బ్రాంచ్ కెనాల్ కోసం రైతుల భూముల్లో తవ్విన కాలువ పేరూరు డ్యాంకు నీరందించేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో తవ్విన కాలువ ఉన్న నీటిని దిగువకు వదిలి.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో వరుణుడు కరుణించడంతో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దీనికి తోడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి నిలబెట్టుకుని కర్ణాటక మీదుగా పేరూరు డ్యాంను నీటితో నింపారు. 2023 నాటికి పేరూరు డ్యాం నీటితో నిండుకుండలా మారింది. డ్యాం ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో డ్యాంలోకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా వంద రోజుల పాటు డ్యాం 8 గేట్లనూ పైకెత్తి దిగువన పెన్నానదికి నీటిని వదలాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 2024లో ఎమ్మెల్యేగా ఎన్నికై న పరిటాల సునీత గత సెప్టెంబర్ మాసంలో డ్యాం గేట్ల మరమ్మతు పేరుతో ఉన్న నిటీని దిగువకు వదిలేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత డ్యాంకు చుక్క నీరు అందకుండా పోవడంతో ప్రస్తుతం డ్యాంలో నీరు పూర్తిగా అడుగంటింది. ఫలితంగా రానున్న వేసవిలో తాగేందుకు గుక్కెడు నీరు లేక గ్రామాలను వదలాల్సిన పరిస్థితులు నెలకొంటాయనే అనుమానాలను గ్రామీణులు వ్యక్తం చేస్తున్నారు. ‘పేరూరు’ నిర్వాసితులకు అందని పరిహారం 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో డ్యాం సబ్బ్రాంచ్ కాలువకు బలవంతపు భూసేకరణ పదేళ్లు దాటినా నేటికీ అందని పరిహారం ఆయకట్టుకు నీరివ్వడంలో ‘పరిటాల’ విఫలం -
పంచాయతీలకు నిధులివ్వండి
పుట్టపర్తి అర్బన్: ‘‘ఆర్థిక ఇబ్బందులతో పంచాయతీలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. కనీసం తాగునీటి సరఫరా, పారిశుధ్య చర్యలకూ డబ్బులు లేక సర్పంచ్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాజకీయ కక్షతో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు సర్పంచ్లుగా ఉన్న పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఇంతవరకూ విడుదల చేయలేదు. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు కూడా చెల్లించలేదు. ఇకనైనా నిధులు మంజూరు చేయండి’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ కలెక్టర్ శ్యాంప్రసాద్ను కోరారు. సోమవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆమె పలువురు సర్పంచులతో కలిసి కలెక్టర్ శ్యాం ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. అనంతకరం ఆమె మాట్లాడుతూ.. బాధ్యతగల మంత్రి స్థానంలో సవిత పెనుకొండ నియోజకవర్గంలోని పంచాయతీలకు నిధుల కాకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. సంబంధిత అధికారులను బెదిరించి వైఎస్సార్సీపీ సర్పంచులకు సంబంధించిన బిల్లులను నిలిపి వేయించారన్నారు. వైఎస్సార్సీపీ సర్పంచులు టీడీపీ కండువా వేసుకుంటే బిల్లులు చెల్లిస్తామని మంత్రి అనుచరులు చెబుతున్నారన్నారు. ఇందుకు నిదర్శనంగా పరిగి మండలం బీచిగానిపల్లిలో వర్క్ ఆమోదం లేకున్నా.. మంత్రికి అనుకూలంగా ఉండటంతో సదరు పంచాయతీలో బిల్లులు చెల్లించారన్నారు. మంత్రి చర్యలతో గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. సర్పంచుల నిధుల విషయంలో జోక్యం చేసుకుంటున్న మంత్రి సవిత, ఓఎస్డీ సుమన జయంతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఇప్పటికై నా కలెక్టర్, డీపీఓ స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు వెంటనే మంజూరు చేయాలి కలెక్టర్ను కోరిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ గురు శిష్యుల చీకటి ఒప్పందంతో సీమకు అన్యాయం గురుశిష్యులైన ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డి చీకటి ఒప్పందంతో రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. సోమవారం ఆమె కలెక్టరేట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. బాబు, రేవంత్ చీకటి ఒప్పందం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బహిర్గతమయినా.. ఇప్పటి వరకూ చంద్రబాబు నోరు మెదపలేదంటే సీమకు ఎంత ద్రోహం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మంగళం పాడిన చంద్రబాబును ఈ ప్రాంత ప్రజలు క్షమించరన్నారు. రాయలసీమను రతనాల సీమగా చూడాలన్న సంకల్పంతో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ రాయలసీమ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.7 వేల కోట్లు మంజూరు చేశారన్నారు. అయితే చంద్రబాబు సీమ నుంచి సీఎంగా ఉండి.. ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారన్నారు. పక్క రాష్ట్రం వద్ద సీమ ఎత్తిపోతల పథకాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. సీమకు ద్రోహం చేస్తే రైతులు క్షమించరన్నారు. దీన్ని ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళతామన్నారు. -
అండర్ –14 క్రికెట్ క్రీడాకారుల ఎంపికకు 95 మంది హాజరు
అనంతపురం కార్పొరేషన్: అండర్ –14 క్రికెట్ క్రీడాకారుల ఎంపికకు శ్రీసత్యసాయి జిల్లా నుంచి 95 మంది హాజరయ్యారు. సోమవారం అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో చేపట్టిన ఎంపిక ప్రక్రియను టాలెంట్ కమిటీ సభ్యులు షేక్ హుస్సేన్, శరత్ పర్యవేక్షించారు. ‘పురం’ వాసికి అంతర్జాతీయ ఫిడే రేటింగ్హిందూపురం టౌన్: స్థానిక పాంచజన్య పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న సాయిఈశ్వర్ చదరంగంలో అంతర్జాతీయ ఫిడే రేటింగ్ సాధించాడు. గత నెల కన్నూర్లో జరిగిన క్లాసిక్ చెస్ టోర్నీలో 1,569 రేటింగ్ సాధించినట్లు కోచ్ గోపీనాథ్ వెల్లడించారు. అలాగే తుముకూరు, బెంగళూరులో జరిగిన కలాంధ్రపన, మ్యాజిక్ స్క్వేర్, ఇంటర్నేషనల్ రాపిడ్ టోర్నమెంట్లలో పాల్గొని ఈఎల్ఓ 1,410 రేటింగ్ సాధించాడన్నారు. ఈ సందర్భంగా సాయి ఈశ్వర్ను పాఠశాల యాజమాన్యం, కోచ్, తల్లిదండ్రులు అభినందించారు. మెరుగు పేరుతో బంగారం అపహరణ గార్లదిన్నె: మెరుగు పెడతామని నమ్మించి మేలిమి బంగారాన్ని అపహరించుకెళ్లిన ఘటన గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... కృష్ణాపురంలో నివాసముంటున్న సుగుణమ్మ సోమవారం ఉదయం ఇంట్లో కోడలు, బావతో కలసి ఉన్న సమయంలో ఇద్దరు యువకులు చేరుకుని బంగారు, వెండి ఆభరణాలకు మెరుగు పెడతామని తెలిపారు. దీంతో మొదట ఇత్తడి దండ, వెండి కాలి పట్టీలు ఇవ్వడంతో వాటికి మెరుగుపట్టి ఇచ్చారు. అనంతరం వారి మాటలు నమ్మి తన మెడలోని బంగారు తాళిబొట్టు చైన్ ఇవ్వడంతో వారి ముందే గిన్నె నీటిలో మరిగించి తాళిబొట్టు చైన్ను అందులో వేసి కలకండ లాంటి పదార్థాన్ని కలిపారు. కొద్ది సేపటి తర్వాత మరిగే నీటిలోకి కొద్దిగా పసుపు వేయాలనడంతో సుగుణమ్మ అలాగే చేసింది. ఆ సమయంలో ఒక్కసారిగా పొగలు వ్యాపించి ఇంట్లో ఉన్న ముగ్గురూ స్పృహ కోల్పోయారు. అనంతరం యువకులు బంగారు తాళిబొట్టు చైన్ తీసుకుని తామొచ్చిన ద్విచక్ర వాహనంపై ఉడాయించారు. కొద్దిసేపటికి కోలుకున్న వారు తాము మోసపోయినట్లుగా నిర్దారించుకుని సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యపై హత్యాయత్నంపెద్దవడుగూరు: మండలంలోని భీమునిపల్లి గ్రామానికి చెందిన వివాహిత మాధవిపై ఆమె భర్త ఈశ్వరరెడ్డి ఆదివారం హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాయపడిన మాధవిని కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలను ఎస్ఐ ఆంజనేయులు తెలిపిన మేరకు.. భార్య ప్రవర్తనపై అనుమానాలు పెంచుకున్న ఈశ్వరరెడ్డి కొంత కాలంగా ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ సమయంలో కత్తితో భార్యను పొడిచి ఈశ్వరరెడ్డి పారిపోయాడు. ఈశ్వరరెడ్డిపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
వెన్నాడిన ‘తమ్ముళ్ల’ పాపం
శింగనమల: అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు సాగించిన ఇసుక తవ్వకాలు, అక్రమ తరలింపుల పాపం.. గొర్రెల కాపరుల పాలిట శాపంగా మారింది. వివరాల్లోకి వెళితే.. శింగనమల మండలం సలకంచెరువు గ్రామం వద్ద ఉన్న కూతలేరు వంక నుంచి ఇటీవల టీడీపీ నేతలు యథేచ్ఛగా ఇసుక తరలింపులు చేపట్టారు. ఈ క్రమంలో వంకలో పెద్ద ఎత్తున గోతులు ఏర్పడి అందులో నీరు చేరుకుంది. ఆదివారం మధ్యాహ్నం అటుగా వెళ్లిన గొర్రెలు దాహం తీర్చుకునే క్రమంలో అక్కడకు చేరుకోగానే ఇసుక దిన్నె కుప్పకూలి దాదాపు 25 గొర్రెలు నీటిలోకి పడి మృతి చెందాయి. ఘటనతో రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ఇరువెందల గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గంగరాజు కన్నీటి పర్యంతమయ్యాడు. ఇసుక గుంతల్లో పడి 25 జీవాల మృతి -
వీరభద్రుని సేవలో జేసీ దంపతులు
లేపాక్షి: ప్రముఖ పర్యాటక కేంద్రమైన లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ దంపతులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారి వెంట స్థానిక తహసీల్దార్ సౌజన్యలక్ష్మి ఉన్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికి, ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం విశిష్టతను వివరించారు. ఘనంగా ఏపీహెచ్ఎంఏ వేడుకలుహిందూపురం టౌన్: ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం (ఏపీహెచ్ఎంఏ) 75వ వార్షికోత్సవాన్ని ఆదివారం హిందూపురంలోని చిన్మయ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మనోజ్ ఆరాధ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల హెచ్ఎంలుగా పదోన్నతి పొందిన వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈఓలు నాగరాజు నాయక్, గంగప్ప, యూనియన్ నాయకులు జయరాం రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఫణి కుమార్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
చిలగడ సాగు.. లాభాలు బాగు
కనగానపల్లి: కారణాలు ఏవైనా కావచ్చు.. వ్యవసాయం భారంగా పరిణమిస్తున్న ప్రస్తుత రోజుల్లో వినూత్న పంటల సాగుపై రైతులు ప్రయోగాలు సాగిస్తూ లాభాలు గడిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలోనే కనగానపల్లి మండలం మద్దెలచెరువు తండాకు చెందిన రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టిన చిలగడదుంప సాగు సత్ఫలితాలను ఇస్తోంది. 50 కుటుంబాలు కూడా లేని ఈ గ్రామంలో 30 మంది రైతులు 50 ఎకరాల విస్తీర్ణంలో చిలగడదుంప సాగు చేపట్టడం గమనార్హం. పక్కనే ఉన్న అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రైతుల పొలాల్లో నుంచి తీగలను తీసుకువచ్చి ఈ పంటను సాగు చేస్తున్నారు. రూ. వేల పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలిక పంటలను సాగుచేసి ఎంతో నష్టపోయామని, తక్కువ కాలంలో చేతికి వచ్చే చిలగడదుంప సాగుతో మంచి ఆదాయం పొందుతున్నామని రైతులు సుబ్రహ్మణ్యం నాయక్, వెంకటేష్ నాయక్, రాజు నాయక్ తెలిపారు. అయితే పంటను విక్రయించేందుకు సమీపంలో మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడి తక్కువ.. చిలగడదుంప సాగుకు పెట్టుబడులు చాలా తక్కువగా ఉంటాయని రైతులు అంటున్నారు. గతంలో పంట సాగు చేసిన పొలాల్లో నుంచి రైతుల అనుమతితో ఉచితంగా తీగలను కత్తిరించుకుని వచ్చి బాగా వదులుగా ఉన్న భూమిలో నాటాల్సి ఉంటుందన్నారు. తీగ నాటిన 120 రోజుల్లోనే దుంపలు ఏర్పడి పంట కోతకు వస్తుందన్నారు. క్రిమిసంహారక మందులు కూడా పిచికారీ చేయాల్సిన అవసరం లేదని, దుంపలు ఏర్పడిన తర్వాత నేలను బాగా దున్ని కూలీలతో దుంపలను సేకరించి, శుభ్రం చేసిన తర్వాత మార్కెట్కు తరలించాల్సి ఉంటుందన్నారు. సేద్యం, కూలీల ఖర్చులన్నీ కలిపి ఎకరానికి రూ.20 వేల వరకు ఖర్చు వస్తుందని, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఎకరానికి ఆరు టన్నుల మేర దిగుబడి ఉంటుందని వివరిస్తున్నారు. మార్కెట్లో ఉన్న ప్రస్తుత ధర ప్రకారం టన్ను రూ.20 వేలకు అమ్మినా ఎకరానికి రూ.లక్ష వరకు నికర ఆదాయం ఉంటుందని పేర్కొంటున్నారు. తక్కువ శ్రమ, పెట్టుబడితో అధిక దిగుబడి పోషకాలు పుష్కలంగా ఉన్న చిలగడ దుంపల సాగుతో రైతులు గంపెడు లాభాలు సాధిస్తున్నారు. ఎక్కువ పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలిక పంటలు సాగు చేయలేని రైతులు తక్కువ శ్రమ, అంతే తక్కువ పెట్టుబడితో స్వల్ప కాలంలో చేతికి వచ్చే చిలగడదుంపల సాగు ప్రయోగాత్మకంగా చేపట్టి విజయం సాధించారు. 15 టన్నుల పంట దిగుబడి రెండున్నర ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ఎకరానికి రూ.20 వేల పెట్టుబడితో చిలగడదుంపల సాగు చేపట్టాను. సమీపంలోని గ్రామ రైతు పొలం నుంచి తీగలను తెచ్చి నాటాను. తక్కువ నీటితోనే 120 రోజుల్లో పంట చేతికి వచ్చింది. ఎకరానికి ఆరు టన్నులతో 15 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. మార్కెట్ సౌకర్యం లేకపోవటంతో తక్కువ ధరకే దళారులకు పంటను విక్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వం మార్కెట్ సౌకర్యం కల్పిస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. – సుబ్రహ్మణ్యం నాయక్, రైతు, మద్దెలచెరువు తండా, కనగానపల్లి మండలం -
బెంబేలెత్తించిన కొండచిలువ
పుట్టపర్తి అర్బన్:పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు సమీపంలో ఆదివారం ఓ కొండచిలువ రైతులు, గొర్రెల కాపర్లను బెంబేలెత్తించింది. గ్రామానికి చెందిన డీసీసీబీ మాజీ చైర్మన్ ఈశ్వరరెడ్డి పొలంలో కనిపించిన సుమారు 10 అడుగుల కొండచిలువ అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఫారెస్ట్ అధికారులు ఎంతకూ అటువైపు రాకపోవడంతో కాపర్లు దాన్ని కొండవైపు మళ్లించారు. సమీపంలోనే గొర్రెల మందలు తోలుతామని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నేడు పరిష్కార వేదిక పుట్టపర్తి టౌన్: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకనటలో తెలిపారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చునన్నారు. గతంలో అర్జీలు సమర్పించినా పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. కలెక్టరేట్కు రాకుండానే Meekosam.ap.gov.in వె బ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించుకొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లో కార్యక్రమం జరుగుతుందని, సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఉచిత గ్యాస్ కనెక్షన్ మాటున టీడీపీ నేత చేతి వాటం!పుట్టపర్తి: పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఉజ్వల’ పథకాన్ని కూడా కొందరు ‘పచ్చ’ నాయకులు ఉపాధిగా మార్చుకున్నారు. ఉచిత గ్యాస్ కనెక్షన్ పేరిట ఓ టీడీపీ నేత చేతివాటం ప్రదర్శించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవల పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి చేతుల మీదుగా పేద మహిళలకు ‘ఉజ్వల’ ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించారు. అయితే, 174 మందికి గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసేందుకు అమడగూరు మండలం కమ్మవారిపల్లికి చెందిన టీడీపీ నేత, ఇండియన్ గ్యాస్ డీలర్ అయిన శ్యాం నాయుడు ఒక్కొక్కరి నుంచి రూ.1,300 నుంచి రూ. 2,000 వేల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. గ్యాస్ కనెక్షన్ల అందజేత సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే సింధూర రెడ్డి ఉచితంగా అందిస్తున్నామని చెప్పగా, డబ్బు చెల్లించిన లబ్ధిదారులంతా ఆశ్చర్యపోయినట్లు తెలియవచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతిపుట్టపర్తి టౌన్: సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పుట్టపర్తిలో కలకలం రేపింది. పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు తెలిపిన మేరకు.. కొత్తచెరువు మండలం తిప్పబాట్ల పల్లికి చెందిన వెంకటరాముడు, నాగరత్నమ్మ దంపతుల కుమారుడు మహేష్ చౌదరి (35) సాఫ్ట్వేర్ ఉద్యోగి. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. మహేష్ చౌదరి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసేవాడు. వారం క్రితం స్నేహితులతో ఇతనికి గొడవ జరిగింది. దీనిపై కొత్తచెరువు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. డిసెంబర్ 31న స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన మహేష్ చౌదరి తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం పుట్టపర్తి పట్టణ సమీపంలో హంద్రీ–నీవా కాలువలో శవమై కనిపించాడు.గమనించిన స్థానికులు పుట్టపర్తి అర్బన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని బయటకు తీశారు. కర్రలు, రాళ్లతో కొట్టి చంపిన అనంతరం దుప్పట్లో కప్పి హంద్రీ–నీవా కాలువలో పడవేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ శివాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ చౌదరికి 8 నెలల క్రితమే వివాహమైంది. పిల్లలు లేరని తెలిసింది. -
ప్రజాస్వామ్యం అపహాస్యం
ధర్మవరం: ప్రస్తుతం ధర్మవరం మున్సిపల్ చైర్పర్సన్గా కాచర్ల లక్ష్మి ఉన్నారు. ఏడాది కాలంగా మున్సిపాలిటీలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఆమెకు కనీస ఆహ్వానం అందడం లేదు.ఇక వార్డుల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన పనులను మున్సిపల్ కౌన్సిల్లో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు వివరించినప్పటికీ కమిషనర్ సాయికృష్ణ కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు ఏది చెబితే అది అజెండాలో పొందుపరుస్తుండడం గమనార్హం. అక్కడా అంతే.. మండలాల్లో ఎంపీపీలకూ అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదు. ప్రస్తుతం ధర్మవరం ఎంపీపీగా వైఎస్సార్సీపీకి చెందిన గిరిక రమాదేవి, తాడిమర్రి ఎంపీపీగా పాటిల్ భువనేశ్వర్రెడ్డి, బత్తలపల్లి ఎంపీపీగా బగ్గిరి త్రివేణి ఉన్నారు. ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా వీరికి ఆహ్వానం అందించకుండా అధికారులు అవమానిస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ తరఫున గెలిచి ఎంపీపీగా ఎన్నికైన ఆదినారాయణయాదవ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు మాత్రం పెద్దపీట వేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇవేం రాచమర్యాదలు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికార పార్టీ నాయకులకు అధికారులు రాచమర్యాదలు చేస్తుండడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవల ‘యోగాంధ్ర’తో పాటు పలు కార్యక్రమాల్లో బీజేపీ నాయకులను సభావేదికలపై ఆర్డీఓ మహేష్ పక్కనే కూర్చోబెట్టుకోవడం చూసి మేథావులు నోరెళ్లబెట్టారు. పదవులు లేని వారికి, పార్టీ మారిన వారికి ప్రాధాన్యత ఇస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. వారి ఫ్లెక్సీలైతే ఓకే.. ధర్మవరం ప్రధాన కూడళ్లలో ఇష్టారాజ్యంగా ఇనుప తీర్లు వేసి మరీ కూటమి పార్టీల నాయకులు ఫ్లెక్సీలు వేస్తున్నారు. అయినా వాటిని అధికారులు పట్టించుకోవడం లేదు. వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, పార్టీ సానుభూతిపరులు ఫ్లెక్సీలు వేస్తే మాత్రం వెంటనే తొలగిస్తుండడం గమనార్హం. ఇలాంటి దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదని పట్టణవాసులు అంటున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులకు అధికారులు కనీసం గౌరవం ఇవ్వకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులు చూపుతున్న అంతులేని ‘పచ్చ’పాతం నియోజకవర్గ వాసులను విస్మయానికి గురి చేస్తోంది. ‘ధర్మవరం’లో విస్తుగొలుపుతున్న అధికారుల వైఖరి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వని వైనం అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వ కార్యక్రమాల్లో అందలం అంతులేని ‘పచ్చ’పాతంపై సర్వత్రా విమర్శలు -
‘పచ్చ’ పందేరం!
● రొళ్ల మండలం జీఎన్ పాళ్యం పరిసరాల్లో ఈనెల 1వ తేదీన కోడిపందెం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు కోడిపుంజులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన పలువురు అక్కడి నుంచి పరారీ అయ్యారు. ● తలుపుల మండలం ఎగువ నిగ్గిడి సమీపంలో ఈనెల 1న కోడిపందెం స్థావరాలపై పోలీసులు దాడి చేసి 9 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు పందెం కోళ్లతో పాటు రూ.2,290 నగదు స్వాధీనం చేసుకున్నారు. సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో కూటమి నేతలు బరి తెగించారు. గోదావరి జిల్లాల తరహాలో కోడిపందేల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి అనుమతులు లేకున్నా.. గుట్టు చప్పుడు కాకుండా కోడిపందేల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. పండుగ సమయంలో నాలుగైదు రోజులు నిరంతరంగా ఆడించేందుకు కోడిపుంజులను కూడా సిద్ధం చేశారు. బయటి ప్రాంతాల నుంచి పందెం పుంజులను రూ.వేలు ఖర్చు చేసి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. పందేల కోసం గ్రామ శివారుల్లో రూ.లక్షల్లో పందేలు నిర్వహించేందుకు ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అక్రమార్జనే ధ్యేయంగా సంక్రాంతి పండుగకు కోడిపందేలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిర్వాహకులకు ప్రతి బరి నుంచి 10 శాతం కమీషన్ ఇచ్చేలా వాటాలు ప్లాన్ చేసినట్లు సమాచారం. నిషేధం ఉన్నప్పటికీ.. మట్కా, పేకాట, గుట్కా, కోడి పందేలపై నిషేధం ఉన్నప్పటికీ జిల్లాలో ఏదో చోట నిత్యం కార్యకలాపాలు సాగుతున్నట్లు తెలిసింది. సీజనల్గా వచ్చే ఆటలను ‘క్యాష్’ చేసుకునేందుకు అక్రమార్కులు సిండికేటుగా మారినట్లు సమాచారం. తమకు తెలియకుండా నిర్వహించదలిచే స్థావరాలపై పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్నట్లు తెలిసింది. గ్రామాల్లోనే ఎక్కువగా.. ఏటా సంక్రాంతి పండుగ సమయంలో కోడిపందేలు నిర్వహించడం కొన్ని గ్రామాల్లో ఆనవాయితీగా వస్తోంది. పోలీసుల కళ్లుగప్పి శివారు ప్రాంతాలకు వెళ్లి ‘బరి’ నిర్వహిస్తారు. సంప్రదాయం, ఉల్లాసం నుంచి పందెం, వ్యాపారంలా మార్చుకున్నారు. గత ప్రభుత్వంలో పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో కోడిపందేలకు తావు లేకుండా పోయింది. ఈసారి మూడు పార్టీల నాయకులు ఉండటంతో ఒకరు ఔనంటూ.. ఇంకొకరు కాదంటూ ఉండటంతో కోడిపందేలు యథేచ్ఛగా సాగే అవకాశం ఉంది. జిల్లాలో కూటమి నాయకుల బరితెగింపు గ్రామాల్లో విచ్చలవిడిగా కోడిపందేలు గ్రామ శివారుల్లో ప్రత్యేక స్థావరాలు కట్టడి చేయాలంటున్న ప్రజానీకం వదిలే ప్రసక్తే లేదు కోడి పందేలకు అనుమతులు లేవు. ఎక్కడైనా నిర్వహించినా.. నిర్వహించనున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మట్కా, పేకాట, గుట్కా, గంజాయితో పాటు కోడి పందేలపై ప్రత్యేక దృష్టి సారించాం. – ఎస్.సతీశ్కుమార్, ఎస్పీ -
సీమకు చంద్రబాబు మరణ శాసనం
ధర్మవరం: తన శిష్యుడైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకొని రాయలసీమ ఎత్తిపోతల పనులను ఆపి సీఎం చంద్రబాబు ఈ ప్రాంత వాసులకు మరణ శాసనం రాశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వ యకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ చంద్రబాబు సీమకు అన్యాయమే చేస్తున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేసే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు పనులు ఆపిన విషయాన్ని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తూతూ మంత్రంగా ఓ ప్రకటన విడుదల చేసి ఎత్తిపోతల పథకం పనులు ఆపలేదని ప్రకటించడం గర్హనీయమని, స్వయంగా అక్కడికి వెళ్లి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం సాకారమైతే ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు ఎంతో మంచి జరిగేదని, తాగు, సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెంపొందేవన్నారు. ఓటుకు నోటు కేసులో శిష్యుడి చేతిలో బందీగా మారిన చంద్రబాబు రాయలసీమ ప్రజల భవిష్యత్ను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు.గతంలోనూ బాబు సీఎంగా ఉన్నప్పుడు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి రాయలసీమకు అన్యాయం చేసినా అప్పటి బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయకుండా మౌనంగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రజల అభీష్టానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నారన్నారు. గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటూ అన్యాయం చేయాలని చూస్తే పోలీసులను పంపి మరీ రాష్ట్రానికి రావాల్సిన వాటాను దక్కించుకున్న ఏకై క నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అభివృద్ధి మొత్తాన్ని అమరావతికి పరిమితం చేసి లక్ష ఎకరాల్లో రాజధాని అంటూ తన అనుయాయులకు మంచి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆ ప్రాంత రైతులకు కూడా ద్రోహం చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ కోసమే రాజధానిని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. అంతా ఒక్కటవ్వాలి జరుగుతున్న అన్యాయాన్ని రాయలసీమవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా ఖండించకపోతే భవిష్యత్లో మూల్యం చెల్లించుకోక తప్పదని కేతిరెడ్డి హెచ్చరించారు. రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులు, సాగునీటి రంగ నిపుణులు, మేథావులు, అఖిలపక్ష పార్టీల నాయకులు సీమకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద సీమకు రావాల్సిన నీళ్లను దక్కించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ‘రాయలసీమ ఎత్తిపోతల’ను ఆపి తీరని ద్రోహం చేసిన సీఎం దుర్మార్గపు చర్యలతో భవిష్యత్తులో ఎడారిగా ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపాటు -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
కదిరి టౌన్: రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని కదిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారీ రాయలసీమకు అన్యాయమే జరుగుతోందన్నారు. ఈ సారి కూడా రాయలసీమపై బాబు నిర్లక్ష్య వైఖరి బట్టబయలైందన్నారు. తన ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకై నా దిగజారుతారనేందుకు ఇదే ఉదాహరణ అని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆపేశారని, ఇదే విషయాన్ని తెలంగాణ అసెంబ్లీలో స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినే వెల్లడించారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయంలో అధికంగా కృష్ణా జలాలు ఆంద్రాకు తీసుకెళ్లారని,. తాను ఒక్క మాట చెబితే ఏపీ సీఎం చంద్రబాబు తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేస్తారని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. లేకపోతే చరిత్ర హీనులుగా ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతారని హెచ్చరించారు. కదిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ -
పామిడి సీహెచ్సీలో అరుదైన శస్త్రచికిత్స
పామిడి: స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో ఆదివారం వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ మహిళ ప్రాణాలు కాపాడారు. వివరాలు.. అనంతపురంలోని మరువకొమ్మ కాలనీకి చెందిన ఉన్నె సులేమా కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స కోసం పామిడి సీహెచ్సీ వైద్యులను సంప్రదించింది. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు ఎడమ అండాశయంలో 7 x 6 సెం.మీ. పరిమాణంలో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. విషయాన్ని వెంటనే ఆమెకు తెలిపి ఆదివారం వైద్యాధికారి శివకార్తీక్రెడ్డి ఆధ్వర్యంలో జనరల్ సర్జన్ కమలాధర్, అనస్తీషియా నిపుణులు వైఎస్ రాఘవేంద్రరెడ్డి, హెడ్నర్సు శివకుమారి బృందం శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం రోగి పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్పై ఉచిత శిక్షణ అనంతపురం టౌన్: దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ–జీకేవై) కింద గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీయువకులకు ఉచితంగా కంప్యూటర్ విద్య, స్పోకెన్ ఇంగ్లిష్పై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు డీఆర్డీఏ పీడీ టి.శైలజ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం నుంచి బుధవారం వరకూ అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. ఆసక్తి ఉన్న వారు విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు ఫొటోలతో అనంతపురంలోని పంగల్ రోడ్డులో ఉన్న టీటీడీసీ కార్యాలయంలో జరిగే ఎంపిక ప్రక్రియకు హాజరుకావాలి. పూర్తి సమాచారానికి 63005 99277 లో సంప్రదించవచ్చు. -
జిల్లా సర్వేయర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
పుట్టపర్తి అర్బన్: జిల్లా విలేజ్ సర్వేయర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఎన్నికల అధికారిగా మహేష్నాయుడు వ్యవహరించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా కార్తీక్, ఉపాధ్యక్షుడిగా సురేష్, కార్యదర్శిగా మనోహర్, సహాయ కార్యదర్శిగా బాలాజీ నాయక్, కోశాధికారిగా ఆనంద్, మహిళా విభాగం సెక్రెటరీగా రాధిక, ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ కార్యదర్శిగా రాజశేఖర్, వెల్ఫేర్ కార్యదర్శిగా చేతన్, స్పోర్ట్స్ అండ్ కల్చర్ కార్యదర్శిగా పవన్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా బాలచంద్ర, లీగల్ అండ్ డిసిప్లినరీ సెక్రెటరీగా ప్రదీప్కుమార్, జిల్లా సలహాదారుగా అశ్వత్థనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం బ్రహ్మసముద్రం: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో మాట్లాడి ప్రభుత్వ ఉధ్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి ఓ నిరుద్యోగిని కూటమి నాయకులు మోసగించి సొమ్ము చేసుకున్న వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం సంతే కొండాపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త హనుమంతరాయుడు పలువురు నిరుద్యోగులను కలసి ఎమ్మెల్యే అమిలినేనితో చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానమంటూ నమ్మబలుకుతూ వచ్చాడు. ఇతని మాయలో చిక్కుకున్న ఓ యువకుడు ప్రభుత్వాస్పత్రిలో అటెండర్ ఉద్యోగం కోసమని రూ.40 వేలను అప్పగించాడు. తన వద్ద అంత డబ్బు లేకపోయినా ఉద్యోగం వస్తుందన్న ఆశతో వడ్డీ వ్యాపారుల వద్ద రూ.5 వడ్డీ చెల్లించేలా అప్పు చేసి తీసుకువచ్చి ఇచ్చాడు. రోజులు గడుస్తున్న ఉద్యోగం రాకపోవడంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకుని తన డబ్బు వెనక్కు ఇవ్వాలని హనుమంతరాయుడిని అడిగాడు. డబ్బు వెనక్కు ఇవ్వడం కుదరని, ఉధ్యోగం ఇప్పించేలా ఇప్పటికే ఎమ్మెల్యే అల్లుడు ధర్మతేజతో మాట్లాడానని, త్వరలో పోస్టింగ్ ఆర్డర్ అందుతుందని ఆశలు కల్పించాడు. రెండు రోజులుగా హనుమంతరాయుడు పత్తాలేకుండా పోయాడు. అతనితో పాటు రోజూ తనతో ఫోన్లో మాట్లాడుతున్న దుర్గప్ప (హనుమంతరాయుడుకు బాస్గా) ను బాధితుడు ఆరా తీయగా.. రాయుడు చెప్పినట్లుగానే తాను ఫోన్లో మాట్లాడానని, ఈ మోసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని జారుకున్నాడు. దీంతో విషయాన్ని ఎస్పీ దృష్టికి సోమవారం తీసుకెళ్లి న్యాయం కోరనున్నట్లు బాధితుడు పేర్కొన్నాడు. గుట్టుగా కాలేజీల ఎగ్జిబిషన్ స్టాల్ ● పోలీసుల అదుపులో నిర్వాహకుడు అనంతపురం సెంట్రల్: దేశంలోని ప్రముఖ కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల కోసం అనంతపురంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్ వివాదాస్పదమైంది. మథర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ పేరుతో తాడిపత్రికి చెందిన జగదీష్ ఆదివారం విద్యుత్కళాభారతి ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ స్టాల్స్ను ఏర్పాటు చేసి వివిధ కళాశాలల ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఫొటో ఫ్లెక్సీలో ఉండడంతో ఫిర్యాదులు అందుకున్న త్రీటౌన్ పోలీసులు నిర్వాహకుడు జగదీష్ను అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించడంతో నిలిచిపోయింది. ఈ సందర్భంగా సీఐ రాజేంద్రనాథ్యాదవ్ మాట్లాడుతూ... ప్రస్తుతం ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు జరగడం లేదని, ఫలితాలు కూడా వెల్లడి కాలేదని, ఇలాంటి సమయంలో స్పాట్ అడ్మిషన్లంటూ ఎగ్జిబిషన్లు పెట్టడం అనుమానాలకు తావిచ్చిందన్నారు. విచారణలో విద్యాశాఖ, ఆర్ఐఓ నుంచి కూడా అనుమతి లేదనే విషయం నిర్ధారణ అయిందన్నారు. ఎగ్జిబిషన్కు వచ్చినవారు కళాశాలల ప్రతినిధులేనా అనే అనుమానాలున్నాయన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి, మోసం చేయాలనే ఉద్దేశంతో నిర్వహించి ఉంటే కేసు నమోదు చేస్తానని వివరించారు. -
యువకుడి దుర్మరణం
మడకశిర రూరల్: కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మడకశిర మండలం సి.రంగాపురం గ్రామానికి చెందిన రంగేగౌడ కుమారుడు ఈరేగౌడ (30) శనివారం వ్యక్తిగత పనిపై మడకశిరకు వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని అదే రోజు రాత్రి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. సి.రంగాపురం క్రాస్ వద్దకు చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడి తలకు తీవ్ర గాయమైన ఈరేగౌడను వెంటనే మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ లావణ్య తెలిపారు. ఓవరాల్ చాంపియన్గా ఆర్ట్స్ కళాశాల అనంతపురం సిటీ: జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానం వేదికగా రెండ్రోజుల పాటు జరిగిన శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయ అంతర్ కళాశాలల క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. 112 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్షిప్ను, 172 పాయింట్లతో ఆల్రౌండ్ చాంపియన్షిప్ను ఆర్ట్స్ కళాశాల దక్కించుకుంది. విజేతలకు ఎస్కేయూ స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ జేస్సీ, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.సహదేవుడు మెమొంటోలు బహూకరించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు శ్రీరాం, శత్రుజ్ఞ, నగేష్నాయక్, వివిధ కళాశాలల నుంచి వచ్చిన ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. డీపీఓలో నేడు పరిష్కార వేదికపుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫుట్బాల్ ఇన్స్పైర్ కప్ టోర్నీ ప్రారంభంఅనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి అనంత క్రీడాగ్రామంలో ఫుట్బాల్ ఇన్స్పైర్ ఇన్విటేషన్ కప్ టోర్నీ ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జట్లు బరిలో దిగాయి. దాదాపు 252 మంది మహిళా క్రీడాకారిణులు తరలివచ్చారు. ఆదివారం జరిగిన మ్యాచ్లో థాండమ్ ఫౌండేషన్, ఫజల్ ఎఫ్సీ, కెంప్ ఎఫ్సీ జట్లు తమ ప్రత్యర్థి జట్లపై సునాయాసంగా విజయం సాధించాయి. బెంగళూరు, టర్న్ ప్రో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నెల 10వ తేదీ వరకు టోర్నీ జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అండర్–14 క్రికెటర్ల ఎంపికకు స్పందనఅనంతపురం కార్పొరేషన్: అండర్ –14 క్రికెట్ జట్టు ఎంపికకు స్పందన వచ్చింది. ఆదివారం అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో చేపట్టిన ఈ ప్రక్రియకు అనంతపురం జిల్లా నుంచి 161, శ్రీసత్యసాయి జిల్లా నుంచి 95 మంది చొప్పున 255 మంది క్రీడాకారులు హాజరుకావడం విశేషం. జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్ రెడ్డి పర్యవేక్షణలో క్రీడాకారుల బ్యాటింగ్, బౌలింగ్, తదితర నైపుణ్యాలను టాలెంట్ కమిటీ సభ్యులు శరత్, షేక్ హుస్సేన్ పరిశీలించారు. తాడిపత్రిలో మట్కా నిర్వాహకుల గ్యాంగ్వార్ తాడిపత్రి టౌన్: స్థానిక గాంధీకట్ట సమీపంలో మట్కా నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం గ్యాంగ్వార్గా మారింది. కొంత కాలంగా తాడిపత్రిలో మట్కా నిర్వహణ విషయమై టీడీపీ నాయకుడు లప్పఖాజా, మరో టీడీపీ నాయకుడి ప్రధాన అనుచరుడు పండు మధ్య వివాదం నడుస్తోంది. ఆదివారం రాత్రి లప్పఖాజా, పండు వర్గాలు పరస్పర రాళ్ల దాడికి తెగబడడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గతంలోనూ ఈ రెండు వర్గాల మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో టీడీపీ పెద్దలు దుప్పటి పంచాయితీలతో సరిపెడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మరోసారి ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు గాయపడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న సీఐ ఆరోహణరావు అక్కడకు చేరుకుని పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
‘సడ్లపల్లి’ పురస్కారాలకు కథా సంపుటాల ఆహ్వానం
హిందూపురం: స్థానిక టీచర్స్ కాలనీలోని తపన సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అందజేస్తున్న సడ్లపల్లి పురస్కారాలకు తెలుగు కథా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకుడు సడ్లపల్లి చిదంబరరెడ్డి తెలిపారు. ఆదివారం తపన సాహిత్య వేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ మధ్య ప్రచురించిన తెలుగు కథా సంపుటాల నాలుగు ప్రతులను మార్చి 31లోపు ‘సడ్లపల్లె చిదంబరరెడ్డి, డోర్ నంబర్ 21–6–138, టీచర్స్ కాలనీ, హిందూపురం, సెల్.94400 73636’ కు పంపాలన్నారు. న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన రచయితకు పురస్కారంతో పాటు నగదు ప్రోత్సాహాకాన్ని అందజేసి సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో తపన సాహిత్య వేదిక ప్రతినిధులు ఏటిగడ్డ అశ్వత్థనారాయణ, సిద్ధగిరి శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి, యువకవి గంగాధర్ పాల్గొన్నారు. -
ఆహారం.. ఘోరాతిఘోరం!
● పుట్టగొడుగుల్లా వెలుస్తున్న రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు ● ఇష్టారాజ్యంగా వంటకాలు ● ప్రజారోగ్యంతో ఆటలు ● నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు పుట్టపర్తి టౌన్: జిల్లాలో పలు ధాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా హోటళ్లు, రెస్టారెంట్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలుస్తున్నా అధికారులు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా చిన్న, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, ఫాస్ట్ పుడ్ సెంటర్లు మూడు వేలకు పైగా ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.కోట్ల వ్యాపారం జరుగుతోంది. చర్యలేవీ..? ఎక్కడైనా హోటళ్లు ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ తప్పని సరిగా ఉండాలి. అందులో పనిచేసే వంట మాస్టర్లు, సర్వర్లకు ఎలాంటి రోగాలూ లేవని వైద్యులు ధ్రువీకరించినట్లు సర్టిఫికెట్లు ఉండాలి. అయితే, జిల్లాలో 20 శాతం పైగా హోటళ్లకు ఎలాంటి అనుమతులు లేవని తెలిసింది. అయినా, వాటిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు నిర్వహించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశమున్నా పట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. మరోవైపు, ఇష్టారాజ్యంగా నడుపుతున్న ఆహార శాలలపై ఎప్పుడైనా అధికారులు దాడులు చేసినా అధికార పార్టీ నేతలు ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తుండడంతో షరామామూలుగా మారుతోంది. సాధారణ ప్రజలకు శాపంగా మారుతోంది. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న ఆర్సెట్(రూరల్ ఎంప్లాయిమెంట్ ఇన్స్టిట్యూట్)లో శిక్షణ పొందుతున్న 12 మంది ఇటీవల ఓ బేకరీలో కేక్ తిని అస్వస్థతకు గురయ్యారు. వారిని ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించి చికిత్సఅందించారు. ఫుడ్ పాయిజన్ కావడంతోనే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సమీప ఎస్సీ కాలనీవాసులకు పంచిపెట్టారు. కేక్ తిన్న నిమిషాల్లోనే 15 మందికి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. వైద్య సిబ్బంది హుటాహుటిన కాలనీకి చేరుకుని చికిత్సలు అందించాక కానీ ఉపశమనం లభించలేదు. ఈ రెండే కాదు.. గడచిన నెలరోజుల్లోనే జిల్లాలో ఇలాంటి అనేక ఘటనలు వెలుగుచూశాయి. బయటి ఫుడ్కు దూరంగా ఉండాలి హానికరమైన రంగులు, రసాయనాలతో చేసిన ఆహార పదార్థాలు తినడం వలన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. గుండె, మూత్రపిండాలు, కాలేయం సక్రమంగా పనిచేయవు. ఫలితంగా ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని బయటి ఫుడ్కు దూరంగా ఉండాలి. – ఫైరోజా బేగం, డీఎంహెచ్ఓ చర్యలు తీసుకుంటాం నిబంధనలకు విరుద్ధంగా వెలసిన హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలపై చర్యలు తీసుకుంటాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించబోం. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలోని పలుచోట్ల బయటి ఫుడ్ తిని పలువురు అస్వస్థతకు గురైన విషయం మా దృష్టికి వచ్చింది. ఆయా బేకరీలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించి శ్యాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపించాం. నివేదిక రాగానే చర్యలు తీసుకొంటాం. – దేవరాజ్, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి -
వ్యక్తిపై దాడి
గుత్తి రూరల్: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన మోహన్పై అదే గ్రామానికి చెందిన కొందరు దాడికి తెగబడ్డారు. ఇటీవల మోహన్, ప్రత్యర్థుల మధ్య చిన్నపాటి వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఆదివారం గ్రామంలోని మసీదు వద్ద మోహన్ నడుచుకుంటూ వెళుతుండగా ప్రత్యర్థులు ఎదురుపడి గొడవపడ్డారు. మాటామాట పెరగడంతో విచక్షణా రహితంగా దాడి చేశారు. గ్రామస్తులు సర్దిచెప్పి మోహన్ను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కర్నూలు జిల్లా పోలీసులు విచారణ చేపట్టారు. సేవాగఢ్కు ఆర్టీసీ బస్సు ప్రారంభం గుత్తి రూరల్: మండలంలోని సేవాగఢ్కు ఏర్పాటు చేసిన నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఆర్టీసీ సూపరింటెండెంట్ కృష్ణానాయక్, కొర్ర జగన్నాథరావు ఆదివారం ప్రారంభించారు. ముందుగా సేవాగఢ్లోని సేవాలాల్ మహరాజ్, జగదాంబ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జెండా ఊపి ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం ఫిబ్రవరి 15వ తేదీ వరకూ బస్సు నడుస్తుందన్నారు. గుత్తి బస్టాండ్ నుంచి ఉదయం 8.20 నిమిషాలకు బయలు దేరుతుందన్నారు. ఫిబ్రవరి 13, 14, 15వ తేదీలలో జరిగే సేవాలాల్ మహారాజ్ జయంత్యుత్సవాల్లో కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త శ్రీమహారాజ్, రవీందర్ నాయక్, అశ్వర్థనాయక్, చక్రి నాయక్, బాలానాయక్, ఠాగూర్నాయక్ పాల్గొన్నారు. -
ఇల్లు దగ్ధం
గాండ్లపెంట: వంట గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి ఓ ఇల్లు దగ్ధమైంది. గాండ్లపెంట మండలం మలమీదపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జిలాన్ భార్య షంషాద్ ఆదివారం ఉదయం వంట చేసేందుకు గ్యాస్ స్టౌ వెలిగించిన సమయంలో వంట గ్యాస్ లీకేజీతో మంటలు వ్యాపించాయి. మంటల తాకిడికి విద్యుత్ తీగల ఇన్సులేషన్ దెబ్బతిని షార్ట్సర్క్యూట్ చోటు చేసుకుని మంటలు మరింతగా ఎగిసి పడ్డాయి. సమాచారం అందుకున్న కదిరి అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేలోపు నిత్యావసర సరుకులు, దుస్తులు, గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ. 3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ బాబురావు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఘటనపై బాధితులతో ఆరా తీశారు. అనంతరం నిత్యావసర సరుకులను అందజేశారు. జరిగిన నష్టంపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. కాగా, ఘటన జరిగిన అనంతరం భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంటలు ఆర్పే విధానంపై గ్రామస్తులకు ఫైర్ ఆఫీసర్ మహబుబ్సుబానీ ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆగ్నిమాపక సిబ్బంది దేవ్లానాయక్, ఉత్తమరెడ్డి, హరినాథరావు, పీవీ విజయ్భాస్కర్, అహమ్మద్ షా, షాషా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?
బాబు ‘బాండు’ ఉత్తిదేనా..? అనంతపురం టవర్క్లాక్: ‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లవుతున్నా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు’ అంటూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దీనికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. శనివారం జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన అనంతపురంలో ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీలు వై.శివరామిరెడ్డి, భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, కలెక్టర్ ఆనంద్, జెడ్పీ సీఈఓ శివశంకర్ హాజరయ్యారు. బుక్కరాయ సముద్రం జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లవుతున్నా కొత్తగా సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేయలేదన్నారు. దరఖాస్తుకు వెబ్సైట్ కూడా ఓపన్ కావడం లేదంటూ మండిపడ్డారు. దీనికి అధికారులు స్పందించకనే ఎంపీ బీకే పార్థసారథి కల్పించుకుని పింఛన్లపై విచారణ చేపట్టి బోగస్ ఏరివేసిన తర్వాత కొత్తవి ఇస్తామని బదులిచ్చారు. తొలగింపులు సరే కొత్తవి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని మిగతా సభ్యులు డిమాండ్ చేశారు. ఎంపీ పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో సభ్యులు వాగ్వాదానికి దిగారు. ప్రజారోగ్యం పట్టదా? రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజారోగ్యం గురించి పట్టదా అని పలువురు సభ్యులు నిలదీశారు. ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామని ఎంపీ బీకే పార్థసారథి తెలపగా.. క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేదల నుంచి బిల్లులు కట్టించుకుంటున్నారని శివరామిరెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు సభ్యులు 108 అంబులెన్సులు, పంచాయతీ కార్మికులకు వేతనాల అంశాన్ని సభ దృష్టికి తెచ్చారు. ‘ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగి ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ’ అంటూ ఊదరగొట్టారు. తాము గెలిస్తే అమలు చేసే సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి ఇంత లబ్ధి అంటూ లెక్కలేశారు. క్యూఆర్ కోడ్తో కూడిన బాండు ఇచ్చారు. ఇప్పటికి రెండేళ్లు అవుతోంది. ఎవ్వరికీ చెప్పినది చెప్పినట్టు ప్రభుత్వ సాయం అందింది లేదు. చంద్రబాబు రాసిచ్చిన బాండుకు విలువ లేదా..? ఇది ఎందుకూ పనికిరాని ఉత్తుత్తి బాండేనా’ అంటూ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులు ‘బాండు’ జిరాక్సు ప్రతులతో ఎంపీ బీకే పార్థసారథిని నిలదీయగా.. త్వరలో అన్నీ చేస్తామంటూ తప్పించుకున్నారు. 108 అంబులెన్సులు సకాలంలో రావడం లేదు ఆరోగ్యశ్రీ సేవలందక పేదల జేబులకు చిల్లు జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ధ్వజం ఆర్డీటీ రెన్యూవల్పై ఎంపీ తడబాటు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకపోవడంతో పేదలకు సేవా కార్యక్రమాలు అందడం లేదని పలువురు సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ ఎప్పు చేయిస్తారని ప్రశ్నిస్తే.. ఎంపీ బీకే పార్థసారథి స్పందిస్తూ గత ప్రభుత్వంలో ఆర్డీటీని నిర్వీర్యం చేస్తే తాము ఇప్పుడు రెన్యూవల్ చేయించామని చెప్పారు. ఆర్డీటీకి ఇప్పటి వరకూ రెన్యూవల్ ఉత్తర్వులు రాకపోతే తప్పుడు సమాధానం ఎలా చెప్తారని సభ్యులు నిలదీశారు. తడబాటుకు గురైన ఎంపీ.. త్వరలో రెన్యూవల్ చేయిస్తాం అంటూ పొంతన లేని సమాధానం చెప్పారు. కేరళలో పేదరిక నిర్మూలన విజయవంతంగా చేపట్టారని, అక్కడ అనుసరించిన విధానాలను ఏపీలోనూ అమలు చేయాలని నల్లమాడ జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి కోరారు. దీనికి ఎంపీ బీకే కల్పించుకొని గత ప్రభుత్వంపై అభాండాలు వేసేందుకు ప్రయత్నించగా.. సభ్యులు ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వంలో చేసిన అప్పులు ఎన్ని.. మీ రెండేళ్ల పాలనలో ఎంత అప్పు చేశారో మీకు తెలియదా అని చురకలంటించారు. -
నిషేధిత జాబితాలోని భూములకు మోక్షం
● తొలగించుకునేందుకు మార్గదర్శకాల విడుదల ప్రశాంతి నిలయం: నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపునకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో 22–ఏ జాబితాలోని భూములుకు మోక్షం లభించింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అవసరమైన పత్రాలు రైతులు సమర్పిస్తే నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తామని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. రెవెన్యూ అధికారులు కూడా వెంటనే ప్రక్రియ ప్రారంభిస్తారన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్ల రద్దు కూడా ఇప్పుడు కలెక్టర్ స్థాయిలోనే జరుగుతుందన్నారు. 5న రెవెన్యూ క్లినిక్లు నిర్వహించండి.. రెవెన్యూ సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఈనెల 5వ తేదీ సోమవారం జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆర్డీఓలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్జీజీఓ జిల్లా కమిటీ ఎన్నికకు రేపు నామినేషన్లు పుట్టపర్తి టౌన్: ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ (ఏపీ ఎన్జీజీఓ) అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎన్నిక ఈ నెల 5వ తేదీ సోమవారం నామినేషన్లు ఉంటాయని జిల్లా తాత్కాలిక అధ్యక్షుడు లింగా రామ్మోహన్, ఎన్నికల అధికారి వేణుగోపాల్రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఏడు తాలూకాల్లో ఇప్పటికే కార్యవర్గాల ఎన్నికలు ముగిశాయన్నారు. జిల్లా కార్యవర్గం ఎన్నికలు ఈనెల 15న నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికలో పోటీ చేయాలనుకునే సభ్యులు జనవరి 5 తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లు వేయవచ్చన్నారు. స్వీయ పరివర్తనతోనే నాయకత్వ లక్షణాలు ● సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ ప్రశాంతినిలయం: యువత సన్మార్గంలో పయనిస్తూ స్వీయపరివర్తన సాఽధించినప్పుడే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం సాధ్యమవుతుందని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు సూచించారు. యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోర్స్ పూర్తి చేసుకున్న ఆరో బ్యాచ్ విద్యార్థులకు శనివారం సర్టిఫికెట్ల అందజేశారు. కార్యక్రమానికి ఆర్జే రత్నాకర్ రాజు, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి, వైస్ చైర్మన్న్ నిమీష్ పాండ్య, ప్రోగ్రాం కన్వీనర్ యోగేంద్ర వర్మ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా రత్నాకర్ రాజు మాట్లాడుతూ... సత్యసాయి బాబా యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ద్వారా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపారన్నారు. యువత సత్యం, మానవతా విలువలతో తమను తాము మార్చుకుంటూ సమాజానికి దిశ నిర్దేశం చేసే నాయకులుగా ఎదగాలన్నారు. అనంతరం కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. సాయంత్రం విద్యార్థులు సత్యసాయి మహా సమాధి చెంత సంగీత కచేరీ నిర్వహించారు. చక్కటి భక్తి గీతాలు ఆలపిస్తూ భక్తులను అలరించారు. గుడిబండలో ఎలుగుబంట్ల సంచారం గుడిబండ: అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఎలుగుబంట్లు ఊళ్లలోకి వచ్చేశాయి. శుక్రవారం రాత్రి రెండు ఎలుగుబంట్లు గుడిబండలో హల్చల్ చేశాయి. పోలీస్ స్టేషన్ వద్దనున్న వాల్మీకి విగ్రహం వద్ద అటూ ఇటూ తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. స్థానికులు పెద్దపెద్ద శబ్దాలు చేయడంతో కొండ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. -
బాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పెనుకొండ రూరల్: చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్లో ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో విప్ జారీ చేసేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నేతలపై జరిగిన దాడి ఇందుకు నిదర్శనంగా నిలిచిందన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 5వ తేదీన బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నిక ఉండగా.. విప్ జారీ చేసేందుకు శనివారం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు దాడి చేశారన్నారు. అడ్డుకోబోయిన వైఎస్సార్సీపీ నాయకులపై కూడా విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారని ఉషశ్రీచరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బొమ్మనహాళ్ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలుండగా.. 15 మంది వైఎస్సార్సీపీ బీఫారంపై గెలిచారన్నారు. కేవలం ఒక ఎంపీటీసీతో ఎంపీపీ స్థానాన్ని కై వసం చేసుకునేందుకు టీడీపీ దిగజారుడు రాజకీయం చేస్తోందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక జరిపించాల్సిన పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర వహించడం రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు నిదర్శనమన్నారు. అధికారం ఉంది కదా అని టీడీపీ కొత్త సంస్కృతికి తెర తీసిందని, కానీ భవిష్యత్లో వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్న సంగతి గుర్తించాలన్నారు. -
నేర నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
పుట్టపర్తి టౌన్: నేర నియంత్రణే లక్ష్యంగా ప్రతి పోలీస్ పనిచేయాలని ఎస్పీ సతీష్కుమార్ ఆదేశించారు. శనివారం స్థానిక సాయి ఆరామంలో ఎస్పీ అధ్యక్షతన అన్ని సబ్డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో వార్షిక నేర సమీక్షా సమావేశం జరిగింది. 2024– 25 సంవత్సరంలో కేసుల నమోదు, దర్యాప్తు, పెండింగ్ కేసుల్లో పురోగతి గురించి చర్చించిన ఎస్పీ సతీష్కుమార్ సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు. అనంతరం 2025 సంవత్సరంలో అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 8 మంది పోలీసులకు నామినేషన్ అవార్డులు అందజేశారు. అలాగే సత్యసాయి బాబా శత జయంతి ఉతత్సవాల్లో బాగా పనిచేసిన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఐటీ కోర్టీం సిబ్బందికి షీల్డ్లు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... స్టేషన్ పరిధిలో చాలా కాలంగా పెడింగ్ ఉన్న వివిధ కేసుల్లో త్వరగా పురోగతి సాధించాలన్నారు. నేర నియంత్రణే ప్రథమ లక్ష్యంగా పనిచేస్తూ ప్రతి బాధితునికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. నూతన ఎస్ఐలు మరింత ఽబాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రాపర్టీ నేరాలు కట్టడి చేస్తూ... రికవరీ శాతం పెంచాలన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. చోరీల నివారణకు రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని, విజుబుల్ పోలీసింగ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామాలు సందర్శించండి.. గ్రామ సందర్శనలు, పల్లె నిద్రలతో ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. సీసీ కెమెరాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించి దేవాలయాల్లో, వీధుల్లో, ఇళ్లల్లో ఏర్పాటు చేసుకొనే విధంగా ప్రోత్సహించాలన్నారు. ఇప్పటికే వివిధ కేసుల్లో నిందితులుగా ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిస్తున్న వారిపై పీడీ యాక్టు ప్రయోగించి, జిల్లా బహిష్కరణ చేస్తామని, ఈ మేరకు వివరాలు సిద్ధం చేయాలని ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురాన మహవీర్, పోలీసు న్యాయ సలహాదారు సాయినాథ్రెడ్డి, డీఎస్పీలు విజయకుమార్, మహేష్, హేమంత్కుమార్, నర్సింగప్ప, శివన్నారాయణస్వామి, ఇందిర, డీసీఆర్బీ సీఐ నరేంద్రరెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్ సీఐ ఇస్మాయిల్, సీసీఎస్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి, ఐటీకోర్ టీమ్ ఇన్చార్జ్ సుదర్శన్రెడ్డి, ఏపీపీలు దుర్గాదేవి, అనురాధ, సుహాసిని, పద్మజతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సిబ్బందికి ఎస్పీ సతీష్కుమార్ ఆదేశం -
సస్యరక్షణతో అధిక దిగుబడులు
పుట్టపర్తి అర్బన్: సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక పంట దిగుబడులు సాధించవచ్చని ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ రామసుబ్బయ్య పేర్కొన్నారు. పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామంలో శనివారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రబీలో వేరుశనగ, మొక్కజొన్న, వరి పంటలతో పాటు శనగ పంటను విస్తారంగా సాగు చేశారన్నారు. వరి నాటేటప్పుడు ఎరువులు ఎకరాకు 200 కిలోల సూపర్ ఫాస్పేట్, 50 కిలోల యూరియా, 25 కిలోల పోటాష్ వినియోగించాలన్నారు. వరిలో రెండు మీటర్లకు ఓ చోట 20 సెంటీమీటర్లు ఉండేటట్టు కాలిబాటలు వదలాలని, దీంతో గాలి బాగా సోకి చీడ పీడలను నివారిస్తుందన్నారు. వేరుశనగలో రసం పీల్చే పురుగులు, పొగాకు లద్దె పురుగు నివారణకు ఇమిడా క్లోఫెడ్ 0.4 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. లద్దె పురుగు నివారణకు క్వినాల్ పాస్ 2.0 ఎంఎల్, తడియో కార్బ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. మొక్కజొన్న వివిధ దశల్లో సాగులో ఉందని, దీనికి 20–30 రోజుల మధ్యలో యూరియా వాడాలన్నారు. కత్తెర పురుగు ఆశించి ఉంటే ఇమామెక్కిన్ బెంజిట్ 0.3 గ్రాములు లేదా రీనాక్సాపీర్ 0.3 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. శనగ పంటకు ఎండు తెగులు, తుప్పు తెగులు ఆశించకుండా ఎక్సోకొనజోల్ 2 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. అనంతరం సొసైటీ పరిధిలోని రైతులకు 140 బస్తాల యూరియా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ డీఆర్సీ శైలకుమారి, ఏఓ నటరాజ్, చైతన్య, సొసైటీ సీఈఓ చెన్నారెడ్డి, రైతులు పాల్గొన్నారు. ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ రామసుబ్బయ్య -
గంజాయి బ్యాచ్కు నడిరోడ్డుపై శిక్ష!
అనంతపురం సెంట్రల్: గంజాయి విక్రయిస్తున్న ముఠాపై వన్టౌన్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నడిరోడ్డుపై నడిపించారు. పోలీసులు తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెలితే... నగరంలో అశోక్ నగర్లోని అలైఖ్య ఫంక్షన్హాల్ సమీపంలో గంజాయిని విక్రయిస్తున్న ముఠాను శనివారం వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాప్తాడు మండల పరిధిలోని మైనారిటీ కాలనీకి చెందిన సాయిప్రసాద్, రుద్రంపేటకు చెందిన శివ, స్టాలిన్నగర్కు చెందిన షేక్ ఇమ్రాన్, టీవీ టవర్ ప్రాంతానికి చెందిన షికారి జంపా అలియాస్ శివను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.2 కిలోల గంజాయి, ఆటో స్వాధీనం చేసుకున్నారు. వీరు రాప్తాడు మండలానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తి ద్వారా కిలోల చొప్పున గంజాయిని కొనుగోలు చేసి చిన్న చిన్న పొట్లాలుగా తయారు చేసి విక్రయిస్తున్నట్లు తేలింది. అనేక మందిని గంజాయి మత్తులోకి లాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గంజాయి ముఠాకు ఫయాజ్ అలియాస్ బిస్కెట్ ఫయాజ్ డాన్గా ఉంటున్నాడు. ఇటీవల గంజాయిపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ జగదీష్ ఆదేశించడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా నగరంలోకి గంజాయిని సరఫరా చేస్తున్న వీరిపై వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు కఠినంగా వ్యవహరించారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్య చికిత్సల అనంతరం అక్కడి నుంచి జిల్లా కోర్టు వరకూ నడిరోడ్డుపై ఊరేగించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి బానిసలుగా మారిన యువతను డీ అడిక్షన్ సెంటర్కు పంపుతున్నట్లు వివరించారు. -
పశుశాఖలో కొనసాగుతున్న ‘ఆడిట్’
అనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధక శాఖలో వెలుగుచూసిన సొమ్ము గోల్మాల్ వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చే పనిలో ఆ శాఖ రాష్ట్ర స్థాయి ఆడిట్ బృందం నిమగ్నమైంది. రెండోసారి జిల్లాకు వచ్చిన అధికారులు మురళీబాబు, ఎం.చక్రధర్, ఎన్.గంగాశేఖర్ రెండో రోజు శనివారం ప్రత్యేక గదిలో మకాం వేసి బ్యాంకు ఖాతాలు, స్టేట్ మెంట్లు, ఇతరత్రా రికార్డులు లోతుగా శోధిస్తున్నారు. ఆడిట్ అధికారులు అడిగిన రికార్డులు, ఇతరత్రా పత్రాలు కార్యాలయ మేనేజర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు అందిస్తున్నారు. పశుశాఖకు సంబంధించి వివిధ బ్యాంకు అకౌంట్లలో ఖర్చు చేయని దాదాపు రూ.1.03 కోట్ల సొమ్మును ఎలాంటి అనుమతులు లేకుండా ఇరువురు తమ సొంత ఖాతాలు, కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు అభియోగాలు నమోదు కావడంతో గత నెలన్నర రోజులుగా విచారణ, పరిశీలన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఒక సీనియర్ అసిస్టెంట్ను సస్పెండ్ చేయగా, విశ్రాంత అధికారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.42 లక్షల సొమ్మును నిలుపుదల చేసినట్లు చెబుతున్నారు. ప్రాథమికంగా గుర్తించిన అక్రమాలకు సంబంధించి రెండో సారి ఆడిట్ బృందం మరింత సమగ్రంగా పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. నివేదికను ముందుగా డైరెక్టరేట్కు అనంతరం ప్రభుత్వానికి పంపనున్నట్లు ఆడిట్ అధికారులు తెలిపారు. తర్వాత పూర్తి స్థాయి విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం. -
ప్రభుత్వ జాగా.. వేసెయ్ పాగా!
ధర్మవరం: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి సొంతింటి కల సాకారం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ధర్మవరం పట్టణంలో పోతులనాగేపల్లి, కుణుతూరు, రేగాటిపల్లి వద్ద జగనన్న లేఅవుట్లను ఏర్పాటు చేసి దాదాపు 13 వేల మంది పేదలకు ఇంటి పట్టాలను మంజూరు చేశారు. కాలనీల్లో ప్రజల సౌకర్యార్థం ఆసుపత్రులు, పాఠశాలలు, పార్కులు ఇతరత్రా నిర్మించేందుకు కొంత భూమి ఖాళీగా ఉంచారు. పలు ప్రాంతాల్లో ఒక్కో చోట రెండు లేదా మూడు ఎకరాల చొప్పున రిజర్వ్ చేశారు. కబ్జాదారుల కన్ను.. చంద్రబాబు ప్రభుత్వం రాగానే మున్సిపల్ రిజర్వ్డ్ స్థలాలపై కొందరు టీడీపీ నాయకులు కన్నేశారు. పోతులనాగేపల్లి లేఅవుట్కు సంబంధించి ధర్మవరం–పుట్టపర్తి ప్రధాన రహదారి పక్కన పార్క్ నిర్మించుకునేందుకు కేటాయించిన 3.19 ఎకరాలు కొట్టేసేందుకు పక్కా ప్లాన్ వేశారు. తొలుత జేసీబీలతో మట్టిని తవ్వి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇటీవల భూమికి సంబంధించి తమకు పట్టాలు మంజూరు చేశారంటూ ప్రచారం చేశారని ప్రచారం చేస్తూ అమాయకులను ముంచేందుకు యత్నిస్తున్నారు. 7.98 ఎకరాలు మింగేయాలని.. ధర్మవరం పట్టణానికి సమీపంలోని కుణుతూరు లేఅవుట్ సమీపంలో సర్వే నంబర్ 428లో 7.98 ఎకరాలను కబ్జా చేసేందుకు కూడా ‘పచ్చ’ నేతలు పథకం రచించారు. ఇప్పటికే కొంత భాగంలో గాఢీ కొట్టించారు. ఆలయాలు, జెండా కట్టల పేరుతో కొన్ని నిర్మాణాలు చేపట్టి ఆ తర్వాత ప్లాట్లు వేసి విక్రయించేలా పథకం రచిస్తున్నారు. ఈ విషయం తెలిసినా అధికారుల్లో చలనం లేకపోవడం గమనార్హం. ఇప్పటికై నా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ధర్మవరంవాసులు కోరుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘పచ్చ’ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేయడం.. ఆపై అమాయకులకు కట్టబెట్టి ముంచేయడం పరిపాటిగా మారింది. అంతా తెలిసినా మున్సిపల్, రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పేదలకు అన్యాయం చేయొద్దు ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మన్సిపల్ రిజర్వ్డ్ సైట్లను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది. స్థలాలను స్వాధీనం చేసుకుని కంచె వేయాలి. లేకపోతే పేదలకు అధికారులే అన్యాయం చేసినవారవుతారు. – ఎలకుంట్ల లక్ష్మీనారాయణ, ధర్మవరం మండలఽ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ కఠినంగా శిక్షించాలి గత ప్రభుత్వం ప్రజా ప్రయోజనార్థం జగనన్న లేఅవుట్లలో రిజర్వ్డ్ సైట్లను ఏర్పాటు చేస్తే నేడు వాటిని అన్యాక్రాంతం చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పందించి తక్షణం రిజర్వ్డ్ సైట్లను పరిరక్షించాలి. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – గోరకాటి పురుషోత్తం రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దానిమ్మ తోట దగ్ధం
కళ్యాణదుర్గం రూరల్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దానిమ్మ తోట దగ్ధమైన ఘటన మండల పరిధిలోని కోడిపల్లి వద్ద జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కోడిపల్లికి చెందిన రైతు శ్రీనివాసులు తన మూడెకరాల పొలంలో దానిమ్మ పంట సాగు చేశాడు. పంట సాగు కోసం రూ. 5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. రెండు రోజుల క్రితం తోట వద్ద విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తగులుకుని నిప్పురవ్వలు ఎగిశాయి. తోటలో పెరిగిన గడ్డిపై పడడంతో మంటలు రేగాయి. క్షణాల్లోనే దావానలంలా మారి దానిమ్మ చెట్లకు వ్యాపించాయి. దాదాపు 300 చెట్లు కాలిపోయాయి. దిగుబడి చేతికొచ్చే సమయంలో ఇలా జరగడంతో బాధిత రైతు లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. చెరువులో పడి వ్యక్తి మృతి ఓడీచెరువు: చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపిన మేరకు.. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన రామారావు (35) హమాలీ కూలీగా పనిచేస్తూ భార్య మమత, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. శనివారం స్థానిక చెరువు వద్దకు బహిర్భూమి కోసం వెళ్లిన రామారావు ప్రమాదవశాత్తు చెరువు తూములో పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మహిళ బలవన్మరణంపుట్టపర్తి అర్బన్: పేన్ల మందు తాగి మహిళ బలవన్మరణం పొందిన ఘటన పుట్టపర్తి మండలం పెడపల్లిలో జరిగింది. పుట్టపర్తి రూరల్ ఎస్ఐ క్రాంతి అందించిన సమాచారం మేరకు.. సంచార జాతికి చెందిన గణేష్, గంగమ్మ (25) దంపతులు. ఇటీవల పెడపల్లి సమీపంలో గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే గంగమ్మ అక్కడే ఉన్న పేన్ల మందు తాగింది. గణేష్ వెంటనే ఆమెను ధర్మవరం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. వారికి ఏడాది వయసున్న పాప ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ద్విచక్ర వాహనాల అపహరణ చెన్నేకొత్తపల్లి: మండల పరిధిలోని దామాజిపల్లి, చెన్నేకొత్తపల్లి గ్రామాల్లో శుక్రవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. చెన్నేకొత్తపల్లిలో జాతీయ రహదారి సమీపంలో తన ఎలక్ట్రికల్ దుకాణం వద్ద నిలిపి ఉంచిన తేజారామ్సమర్ ద్విచక్ర వాహనాన్ని అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఎత్తుకెళ్లినట్లు సీసీ ఫుటేజీలో నమోదైంది. ఇక.. దామాజిపల్లి దళితవాడలో నరసింహులు తన ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు చెన్నేకొత్తపల్లి పోలీస్స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రేషన్ దుకాణాలపై విజిలెన్స్ దాడులుగుడిబండ: మండల పరిధిలోని కొంకల్లు, కేఎన్ పల్లి, శంకరగల్లు గ్రామాల్లోని రేషన్ దుకాణాలపై శనివారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఆయా దుకాణాల్లో సరుకు నిల్వలు, రికార్డులను పరిశీలించారు. పేద ప్రజలకు సక్రమంగా సరుకులను అందించాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీలర్లను హెచ్చరించారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్ఐ నరేంద్ర, సీఎల్డీటీ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
మీ పిల్లలకూ ఇలాగే వండిపెడతారా?
ఆత్మకూరు: ‘అంగన్వాడీ కేంద్రాల్లో మిమ్మల్ని నమ్మి పిల్లల్ని వదిలి వెళ్తున్నాం. అలాంటి పిల్లలను పశువుల కంటే హీనంగా చూస్తున్నారు. ఎలా పడితే అలా వంటలు వండిపెడుతున్నారు. మీ పిల్లలైతే వారికీ ఇలాగే చేస్తారా..?’ అంటూ ఆత్మకూరు భగత్సింగ్ కాలనీ వాసులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 8వ అంగన్ వాడీ సెంటర్లో మెనూ అమలు చేయడం లేదని, సిబ్బంది సమయ పాలన పాటించలేదని స్థానికులు ఫిర్యాదు చేయడంతో శనివారం ఎంపీడీఓ లక్ష్మినరసింహ, సీపీడీఓ ఉమాశంకరమ్మ సదరు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లులు, లబ్ధిదారులు మాట్లాడుతూ రోజూ రూ.5 విలువ చేసే పులిహోర ప్యాకెట్ తీసుకువచ్చి వండుతున్నారని ఆరోపించారు. నిత్యం పులిహోర, చిత్రాన్నం తప్ప వేరేది వండడం లేదని, ఇలా అయితే పిల్లల్ని ఎందుకు అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని ప్రశ్నించారు. ఉదయం 9 గంటలకు తీయాల్సిన అంగన్వాడీ కేంద్రాలను 11 గంటలకు తీసి మధ్యాహ్నం 2 గంటలకే మూసేస్తున్నారని తెలిపారు. కుళ్లిపోయిన కూరగాయలతో వండుతున్నారన్నారు. మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో పిల్లల్ని బయటకు పంపుతున్నారని, ఈ క్రమంలో పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని మండిపడ్డారు. మరుగుదొడ్ల శుభ్రత, మరమ్మతులకు రూ.3 వేలు వస్తే ఏం చేశారు అని అంగన్వాడీ కార్యకర్తను ఎంపీడీఓ ప్రశ్నించగా, ఆమె సరైన సమాధానం చెప్పలేకపోయారు. రెండు రోజుల నుంచి తాను 8వ సెంటర్ను పరిశీలిస్తున్నానని గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంలో సగం సగం ఇస్తే ఎలా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పిల్లలకు అందించే సరుకులు లేకపోతే ఎలా వండిపెడతారని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఎస్డీటీ లక్ష్మిదేవి, సూపర్ వైజర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
నిధులు జేబులోకి.. పనులు గాలికి
పుట్టపర్తి అర్బన్: బాబా శత జయంతి ఉత్సవాలకు పర్యాటక శాఖ ద్వారా రూ.10 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అయితే ఈ నిధులు ఏ మేరకు అందిందీ పర్యాటక శాఖ అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీంతో మున్సిపాలిటీ, పుడా ఆధ్వర్యంలో రూ.4కోట్లకు పైగా నిధులతో పాటు పెద్ద మొత్తంలో భక్తులు అందించిన విరాళాలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ క్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భారీగా ఖర్చు చేసి ఉత్సవాలను విజయవంతం చేసింది. ఇవన్నీ ప్రభుత్వం ఖాతాలోకి వేసుకొని తామే ఉత్సవాలను గొప్పగా నిర్వహించామన్నట్లుగా ప్రభుత్వ పెద్దలు ప్రెస్మీట్లు పెట్టి మరీ బిల్డప్లిచ్చారు. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులు సేదతీరేలా చిత్రావతి నది ఒడ్డున సత్యసాయి పార్కు నిర్మాణానికి జోయాలుక్కాస్ యజమాని సుమారు రూ.1.20 కోట్లు విరాళమిచ్చి సహకరించారు. ఈ నిర్మాణ పనుల కాంట్రాక్టును టీడీపీ నాయకులు దక్కించుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. చివరకు ఉత్సవాలు సమీపిస్తుండడంతో హడావుడిగా జోయాలుక్కాస్ యజమాని, తదితరులతో కలసి పార్కును ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి ప్రారంబించారు. నేటికీ అసంపూర్తిగానే.. శత జయంతి ఉత్సవాలు ముగిసి నెలకు పైగా కావస్తోంది. అయినా అభివృద్ధి పనులు అసంపూర్తిగానే మిగిలి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. పార్కుకు సంబంధించి వంద శాతం పనులు అయిపోయినట్లుగా టీడీపీ నేతలు రికార్డులు చూపి మున్సిపాలిటీకి అప్పగించి బిల్లులు చేసుకున్నారు. అనంతరం మిగులు పనులు, నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో నాటిన మొక్కలు నీరందక చనిపోయాయి. మరుగుదొడ్లు కాస్త పాత సామగ్రి భద్రపరిచే గదుల్లా మారిపోయాయి. పార్కులో ఏర్పాటు చేసిన రెండు ఫౌంటెన్లలో ఐదు మోటార్లకు అనుసంధానించిన కేబుల్ను దుండగులు అపహరించుకెళ్లడంతో అవి కాస్త దిష్టిబొమ్మల్లా మిగిలిపోయాయి. నీరు అందకపోవడంతో పార్కులో పచ్చదనం కరువైంది. ఫలితంగా జోయాలుక్కాస్ యజమాని అందించిన రూ.1.20 కోట్ల విరాళం నిష్ప్రయోజనంగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణదశలోనే ఫుడ్కోర్టు.. పార్కు పక్కనే ఫుడ్ కోర్టు నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఇది నిర్మాణ దశలోనే ఉండిపోయింది. పనుల కోసం సమీకరించిన ఇటుకలు అక్కడే పడేశారు. దీనికి తోడు విరిగిన బండలు కూడా అక్కడే పడేయడంతో ఆ ప్రాంతంలో అపరిశుభ్రత తాండవిస్తోంది. నాసిరకం పనుల కారణంగా విద్యుత్ కేబుల్ ఎక్కడికక్కడ బయట పడింది. పిల్లలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వాటిని తాకితే ప్రమాదం చోటు చేసుకునే అవకాశముంది. పార్కు పక్కన ప్రధాన రోడ్డుపై భక్తులు నడవడానికి వేసిన టైల్స్ చాలా వరకూ పగిలి పోయాయి. నాసిరకం పనులతో పలువురు భక్తులు ఇచ్చిన విరాళాలను సైతం స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. ప్రపంచ దేశాల భక్తులు తమ ఆరాధ్యదైవంగా కొలిచే సత్యసాయి శత జయంతి ఉత్సవాలను సైతం టీడీపీ నేతలు తెలివిగా సొమ్ము చేసుకున్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సొంత ఖజానాకు మళ్లించి సొమ్ము చేసుకున్నారు. ఆనవాయితీగానే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భారీ ఖర్చుతో ఉత్సవాలను విజయవంతం చేసింది. ఇది జగమెరిగిన సత్యం. శతజయంతి వేడుకల సందర్భంగా సత్యసాయి పార్కు ఏర్పాటుకు చర్యలు పార్కులో అభివృద్ధి పనులకు విరాళమిచ్చిన జోయాలుక్కాస్ హడావుడి పనులతో మమ అనిపించిన టీడీపీ నాయకులు నిర్వహణకు తిలోదకాలివ్వడంతో ఎండిన మొక్కలు బిల్లులు చేసుకుని పని అటకెక్కించిన వైనం -
అర్ధరాత్రి హాహాకారాలు
● జాతీయ రహదారిపై పరస్పరం ఢీకొన్న వాహనాలు ● రెండు వాహనాల డ్రైవర్ల దుర్మరణం మడకశిర రూరల్: మండలంలోని అగ్రంపల్లి గ్రామ సమీపంలో 544వ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి హాహాకారాలు చెలరేగాయి. రెండు వాహనాలు పరస్సరం ఢీకొన్న ఘటనలో ఆయా వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. రెండు వాహనాలూ నుజ్జునుజ్జయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... ఐచర్ వాహన డ్రైవర్గా జీవనం సాగిస్తున్న కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మహమ్మద్ రఫీక్ (32) పెనుకొండ వద్ద కియా పరిశ్రమకు సంబంధించిన సామగ్రిని మహారాష్ట్రలోని పూణేలో అన్లోడ్ చేసి తిరుగు ప్రయాణమయ్యాడు. అలాగే బొలెరో వాహన డ్రైవర్గా జీవనం సాగిస్తున్న రఘురామ్ (19) గురువారం గుడిబండ నుంచి పశువులను బొలెరోలో ఎక్కించి హిందూపురంలో దించి వెనుతిరిగాడు. ఈ రెండు వాహనాలు గురువారం అర్ధరాత్రి 544వ జాతీయ రహదారిపై అగ్రంపల్లి గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో ఐచర్ వాహనం బోల్తాపడింది. బొలెరో నుజ్జునుజ్జయింది. రఘురామ్, మహమ్మద్ రఫీక్ అక్కడికక్కడే మృతి చెందారు. రఘురామ్తో పాటు ఉన్న భువనేశ్వర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనతో 544వ జాతీయ రహదారిపై కాసేపు స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమానికి గురైన వాహనాలను పక్కకు తొలగించారు. మృతుడు రఘురామ్ తండ్రి శివానంద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. -
ఇల్లు దగ్ధం
ఎన్పీకుంట: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైంది. వివరాలు.. ఎన్పీకుంట మండలం దిన్నిమీదపల్లి గ్రామ హరిజనవాడలో నివాసముంటున్న మల్లెం తిరుమల్లయ్యకు భార్య, పిల్లలు ఉన్నారు. కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం పిల్లలను బడికి పంపించి, దంపతులిద్దరూ కూలి పనులకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్ చోటు చేసుకుని నిప్పురవ్వలు ఎగిసి పడి మంటలు రాజుకున్నాయి. చుట్టుపక్కల వారి నుంచి సమాచారం అందుకుని ఇంటికి చేరుకుని మంటలు ఆర్పే లోపు నిత్యావసర సరుకులు, దుస్తులు, గృహోపకరణాలు, బీరువాలో దాచిన రూ.2.80 లక్షల నగదు, మూడు తులాల బంగారం. పట్టాదారు పాసుపుస్తకం, ఎల్ఐసీ బాండ్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్ దేవేంద్రనాయక్, ఎస్ఐ వలీబాషా, అగ్నిమాపక శాఖ ఇన్స్పెక్టర్ మహబూబ్ సుబహాని అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితుడికి నిత్యావసర సరుకులు అందజేశారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానికులకు ఫైర్ ఇన్స్పెక్టర్ అవగాహన కల్పించారు. -
స్వచ్ఛతా సేవలో సత్యసాయి భక్తులు
పుట్టపర్తి అర్బన్: ‘అందరినీ ప్రేమించు..అందరినీ సేవించు’ అన్న సత్యసాయి సూక్తిని ఆయన భక్తులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు పుట్టపర్తికి విచ్చేసిన పలువురు విదేశీయులు శుక్రవారం సామాజిక సేవలో తరించారు. సుమారు నెలన్నర నుంచి పుట్టపర్తిలోని వసతి గదుల్లో ఉంటున్న రష్యా, కజికిస్తాన్ తదితర దేశాలకు చెందిన 15 మంది బాబా భక్తులు సత్యసాయి బాబా నడయాడిన చిత్రావతి నదిని శుభ్రం చేశారు. చెత్తా చెదారం, ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, మురిగిపోయిన అట్టపెట్టెలు, కవర్లు తొలిగించారు. విదేశీయులు చేపట్టిన శ్రమదానాన్ని గమనించిన పలువురు స్థానికులు స్ఫూర్తి పొందారు. త్వరలో తాము కూడా స్వచ్ఛ చిత్రావతికి శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. చిత్రావతిని శుభ్రం చేసిన రష్యా, కజికిస్తాన్ దేశస్తులు -
వైభవంగా గిరి రఽథోత్సవం
పుట్టపర్తి టౌన్: పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం సత్యసాయి గిరిరథోత్సవం వైభవంగా సాగింది. అందంగా అలకరించిన రథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి ప్రశాంతి నిలయం ముఖ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విద్యాగిరి, గోకులం, ఎనుములపల్లి, గణేష్కూడలి,ె పెట్రోల్బంక్, చింతతోపు, శివాలయం వీధి, గోవిందయ్యపేట, పెద్దబజార్ మీదుగా రథాన్ని లాగుతూ ప్రశాంతినిలయానికి చేర్చారు. కార్యక్రమంలో దేశవిదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయండి : డీఎంహెచ్ఓ పుట్టపర్తి అర్బన్: వైద్య, ఆరోగ్య శాఖ కార్యక్రమాలకు సంబంధించి నిర్దేశిత లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం, జిల్లా జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సురేష్బాబు ఆదేశించారు. శుక్రవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆరోగ్య విస్తరణాధికారులు, సామాజిక ఆరోగ్యాధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సునీల్, డీపీఎంఓ నాగేంద్రనాయక్, ఎంపీహెచ్ఈఓ, సీహెచ్ఓ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పొరకల వన్నప్ప, రాష్ట్ర సహాయ అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మన్న, ప్రధాన కార్యదర్శి మోహన్బాబు, కోశాధికారి బాలాజీరావు, సహా అధ్యక్షురాలు సాంబశివమ్మ, నాయకులు శివరాం, నగేష్, రామచంద్రారెడ్డి, జయరాంనాయక్, రామాంజనేయులు. సరస్వతి తదితరులు పాల్గొన్నారు. టెట్ నుంచి మినహాయించాలి● ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ పుట్టపర్తి: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయింపునివ్వాలని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తచెరువులోని డీఈఓ కార్యాలయంలో ఎస్టీఏ, ఏపీటీఎఫ్ (1938) సంఘాల నేతలు వేర్వురుగా డీఈఓ కృష్ణప్పను కలిశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నూతన సంవత్సర క్యాలెండర్లను డీఈఓ ఆవిష్కరించారు. అనంతరం సంఘాల నేతలు విలేకరులతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు కూడా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాప్లతో బోధనేతర పనులు అప్పగిస్తున్నారని, దీంతో ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎస్టీఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారుతీ ప్రసాద్, జయకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, అసోసియేట్ ప్రెసిడెంట్ మక్కిశెట్టి కుమార్, కోశాధికారి ప్రదీప్, డివిజన్ నేతలు శ్రీనివాసులు, బాబు, రమేష్, సురేష్, లోకేష్, కృష్ణ, శ్రవణ్, రేవతి, రమేష్బాబు తదితరులు, ఏపీటీఎఫ్ (1938) జిల్లా అధ్యక్షుడు బడా హరి ప్రసాదరెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, గోపాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ బాబు, రాష్ట్ర కౌన్సిలర్ సాయి శంకర్, అలీముల్లా, జిల్లా కార్యదర్శులు జయరామిరెడ్డి, సుందర్రాజు, నరసింహప్ప తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వృద్ధురాలి దుర్మరణం ధర్మవరం అర్బన్: స్థానిక ఎర్రగుంట జంక్షన్లో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వృద్ధురాలు (75) దుర్మరణం పాలైంది. శుక్రవారం తెల్లవారుజామున అర్బన్ హెల్త్ సెంటర్ ఎదుట ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహన చక్రాల కింద పడడంతో శరీరం ఛిద్రమైపోయింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ముక్కలైన వృద్ధురాలి మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చరీకి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96831, 79810 45464కు సమాచారం ఇవ్వాలని వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ కోరారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రాష్ట్ర స్థాయి అంధుల క్రికెట్ పోటీలు ప్రారంభం
హిందూపురం టౌన్: లూయీ బ్రెయిలీ 217వ జయంతిని పురస్కరించుకుని జిల్లా అంధ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలోహిందూపురంలోని ఎంజీఎం పాఠశాల, ఎస్డీజీఎస్ కళాశాల మైదానాలు వేదికగా రాష్ట్ర స్థాయి అంధుల క్రికెట్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వివిధ జిల్లాలకు చెందిన 7 జట్లు పాల్గొన్నాయి. పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ డీఈ రమేష్కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో అంధ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రబాబు, జిల్లా సంఘం అధ్యక్షుడు విశ్వనాథనాయుడు, భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున పురస్కార గ్రహీత ఐ.అజయ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రగులుకున్న ‘బొగ్గుల’ కుంపటి
బత్తలపల్లి: పచ్చ పార్టీలో బొగ్గుల కుంపటి రగులుకుంది. మహారాష్ట్ర నుంచి వచ్చి మండలంలో బొగ్గు తయారు చేసి ఎగుమతి చేస్తున్న వ్యాపారులపై టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఇక్కడ వ్యాపారం చేయాలంటే తమకు కప్పం కట్టాల్సిందేనంటూ టీడీపీలోని రెండు వర్గాలు డిమాండ్ చేయడంతో దిక్కుతోచని వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు టీడీపీలోని ఓ వర్గంపై కేసు నమోదు చేయగా... టీడీపీ వారే తమను టార్గెట్ చేశారని నిందితులు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర వ్యాపారి ఫిర్యాదుతో కేసు.. మండలంలోని వేల్పుమడుగు గ్రామ వాగు సమీపంలో మహారాష్ట్రకు చెందిన బొగ్గుల మేసీ్త్ర పరశురాం రాథోడ్ కూలీలతో బొగ్గును తయారు చేయిస్తున్నాడు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో వేల్పుమడుగుకు చెందిన నాగార్జునరెడ్డి, బత్తలపల్లికి చెందిన అప్పస్వామి అలియాస్ జగ్గూ, అతని అనుచరులు నల్లబోయనపల్లికి చెందిన కౌశిక్, ఈదుల ముష్టూరుకు చెందిన సాంబ బొగ్గులు కాల్చే ప్రాంతానికి వెళ్లారు. ‘బొగ్గులు కాల్చుకోవాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి.. లేదంటే ఇక్కడున్న బొగ్గులను కూడా తీసుకుని పోలేవు’’ అని బెదిరించడంతో పాటు అతన్ని తీసుకువెళ్లి అప్పస్వామి ఇంట్లో నిర్బంధించి రాత్రి 12.10 గంటలకు పంపించారు. దీంతో బొగ్గుల తయారీదారుడు సహబ్రోలు పరశురాం గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్ఐ సోమశేఖర్ నలుగురు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. శుక్రవారం వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వాటాల్లో తేడాలతోనే కేసు.. బత్తలపల్లి మండలంలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. బొగ్గు, ఇసుక, మట్టి..ఇలా ఏది తరలించాలన్నా టీడీపీ నేతలకు కప్పం కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే టీడీపీలో రెండు వర్గాలు ఉండటంతో ఓ వర్గానికి డబ్బులిస్తే... మరోవర్గం వచ్చి బెదిరింపులకు దిగుతోంది. ఈక్రమంలోనే బొగ్గుల వ్యాపారికి బెదిరింపులు, కిడ్నాప్ తతంగం నడిచిందని టీడీపీ నాయకులే ఆరోపిస్తున్నారు. ఈ వాదనలకు బలం చేకూరుస్తూ తాజాగా అరెస్టయిన టీడీపీ నేతలు కూడా సొంత పార్టీ నేతలే కుట్ర చేసి తమను కేసులో ఇరికించారని ఆరోపించారు. కమీషన్ కోసం బొగ్గుల తయారీదారునిపై టీడీపీ నేతల దౌర్జన్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.. పచ్చ నేతల అరెస్ట్, రిమాండ్ టీడీపీలోని మరోవర్గమే తమపై కుట్ర చేసిందంటున్న నిందితులు పోలీసులే ఇసుక, బొగ్గు వ్యాపారులతో డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలు పోలీసులపై నిందితుల ఆరోపణలు.. బొగ్గుల వ్యాపారుల నుంచి కమీషన్ తీసుకునే విషయంలోనే కొన్నిరోజుల క్రితం మండలంలోని నల్లబోయనపల్లి సమీపంలో టీడీపీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి తమతో మాట్లాడగా.. పోలీసులు కొట్టి బలవంతంగా కేసు ఒప్పించారని చెప్పామని, దీన్ని మనసులో పెట్టుకుని పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టారని నిందితులు ఆరోపిస్తున్నారు. పోలీసులే ఇసుక, బొగ్గులు తరలింపులో డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఏదిఏమైనా అధికార పార్టీ నేతలు కమీషన్ల కోసం ఇలా ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకుంటూ రచ్చకెక్కడం జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతల దౌర్జన్యాలకు బొగ్గుల వ్యాపారి కిడ్నాప్ ఘటన అద్దం పట్టింది. -
ప్రాణాంతక వ్యాధులను సకాలంలో గుర్తించండి
అనంతపురం అగ్రికల్చర్: పశువుల్లో సంక్రమించే ఆంత్రాక్స్, లంపీస్కిన్, బర్డ్ఫ్లూ, స్వైన్ఫ్లూ, రేబీస్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో పాటు అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, ఇతరత్రా వ్యాధులు ప్రబలకుండా ప్రాథమిక స్థాయిలో గుర్తించేలా ప్రయోగశాలల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్చంద్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక సాయినగర్లో ఉన్న పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (అనియల్ డిసీసెస్ డయోగ్నస్టిక్ ల్యాబ్–ఏడీడీఎల్)లో ఏడీ డాక్టర్ జి.రవిబాబు, వీఏఎస్ డాక్టర్ శ్రుతితో కలిసి ఉమ్మడి జిల్లా పరిధిలోని నియోజక వర్గ స్థాయి వెటర్నరీ ల్యాబ్ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. పశువులు, జీవాలు, కోళ్లు, ఇతర మూగజీవాలకు వ్యాపించే వివిధ రకాల వ్యాధులు, వాటి నిర్ధారణకు సేకరించే రక్తం, పేడ, అవయవ నమూనాలు, వాటిని పరీక్షించే విధానం, వ్యాధిని ప్రాథమికంగా నిర్ధారించడం, తీసుకోవాల్సిన నివారణ చర్యలను వివరించారు. రక్తపరీక్షలు, బయోకెమికల్ పరీక్షలు, పాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆంత్రాక్స్ లాంటి బ్యాక్టీరియల్ ప్రాణాంతక, ప్రమాదకర వ్యాధులు, వైరల్ పరీక్షలపై ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. పశువులు, జీవాల్లో మరణాలు సంభవించకుండా రైతులు నష్టపోకుండా పకడ్భందీగా పనిచేయాలని ఆదేశించారు. ప్రయోగశాలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు సంబంధించి పరికరాలు అందజేశారు. ఇంకా అవసరమైన సామగ్రికి సంబంధించి ప్రతిపాదనలు పంపాలని ఏడీకి సూచించారు. ప్రయోగశాలల సిబ్బందికి పశుశాఖ జేడీ ప్రేమ్చంద్ ఆదేశం -
నలుగురు గంజాయి విక్రేతలకు రిమాండ్
కదిరి టౌన్: గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపడంతో పాటు గంజాయి సేవించిన 10 మందిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి శుక్రవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పక్కా సమాచారంతో దాడి.. పట్టణంలోని కోనేరుకు సమీపంలోని ఏటిగడ్డ వద్ద ఉన్న సమాధుల వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు శుక్రవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ నారాయణ రెడ్డి తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి గంజాయి విక్రయిస్తున్న బుక్కే ఆంజనేయులు నాయక్, దేవరకొండ పవన్కుమార్, సాకే సూరి, చాకలి ఆదినారాయణను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే సమీపంలోనే గంజాయి సేవిస్తూ దొరికిన శివాలయం వీధికి చెందిన వంశీ, రాజు, నవదీప్(డాన్)లోకేష్, మగ్గాల క్వార్వర్స్కు చెందిన దేవా, సోము, నల్లగుట్టవీధికి చెందిన మౌళి, సంగం హాల్ సమీపంలో నివాసం ఉంటున్న వడల బండి షబ్బీర్, నాగిరెడ్డిపల్లి ఏరియాకు చెందిన సౌకత్ తదితర పది మందిని కూడా అరెస్టు చేశారు. అనంతరం గంజాయి విక్రేతలు నలుగురిని పట్టణంలో నడిపించుకుంటూ స్టేషన్ వరకూ తీసుకువెళ్లారు. అనంతరం వారిని కదిరి ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా న్యాయమూర్తి లోకనాథం వారికి రిమాండ్కు పంపారు. ఇక గంజాయి సేవిస్తూ దొరికిన వారిపై కేసు నమోదు చేసిన సీఐ నారాయణరెడ్డి కౌన్సెలింగ్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అలాగే గతంలో గంజాయి కేసులున్న 15 మందిని స్టేషన్కు పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇక నుంచి మీపై నిరంతరం నిఘా ఉంచుతామని, ఎవరైనా గంజాయి సేవించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు డీఎస్పీ శివనారాయణస్వామి విలేకరులకు తెలిపారు. గంజాయి విక్రయాలు, వినియోగాన్ని ఇక సహించబోమన్నారు. సమావేశంలో పట్టణ సీఐ నారాయణరెడ్డి, పలువురు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 1.20 కేజీల గంజాయి స్వాధీనం గంజాయి సేవించిన మరో 10 మందిపై కేసు విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివనారాయణ స్వామి -
31,368 మంది రైతులకు పాసుపుస్తకాలు
సోమందేపల్లి: రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని 31,368 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేసినట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని నాగినాయని చెరువు గ్రామంలో మంత్రి సవితతో కలిసి రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో రీసర్వే పూర్తయిన 330 గ్రామాల్లో సభలు ఏర్పాటు చేస్తున్నామని, ఈ నెల 9వ తేదీ వరకూ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలో వీఆర్ఓలు అందుబాటులో ఉంటారన్నారు. రెవెన్యూ క్లినిక్ ద్వారా సమస్యలన్నీ సకాలంలో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో నగర కార్పొరేషన్ చైర్మన్ వెంకట రమణ, ఇన్చార్జ్ తహసీల్దార్ మారుతి తదితరులు పాల్గొన్నారు. నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం అనంతపురం టవర్క్లాక్: ఉమ్మడి అనంతపురం జిల్లా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10.30 గంటలకు జెడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు సీఈఓ శివశంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. దాదాపు 36 శాఖల ప్రగతి నివేదికలను సంబంధిత అధికారులు తీసుకురావాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలి ● అధికారులతో కలెక్టర్ శ్యాం ప్రసాద్ ప్రశాంతి నిలయం: సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా చూడాలని, పథకాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేస్తూ ప్రజల సంతృప్తి స్థాయి పెంచాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లా అధికారులకు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, ప్రజా సానుకూల అవగాహన, రైల్వే లెవెల్ క్రాసింగ్స్ తదితర అంశాలపై చర్చించారు. కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి కలెక్టర్ శ్యాం ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు జరిగే పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. వైద్య సేవలు, ఆలయాల నిర్వహణ, పారిశుధ్యం నిర్వహణపై అధిక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సరిహద్దులపై అపోహలొద్దు ● రీసర్వే పక్కాగా చేశామన్న జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ముదిగుబ్బ: రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సరిహద్దులు, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్పీఎం) పక్కాగా రూపొందించామని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. జాయింట్ ఎల్పీఎంలపై అపోహ వీడాలని రైతులకు సూచించారు. శుక్రవారం ఆయన మండల పరిధిలోని మర్తాడులో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆ సమయంలో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి అందుతున్న సేవలను తెలుసుకున్నారు. జేసీ వెంట ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ నారాయణస్వామి ఉన్నారు. -
మసకబారుతున్న రాయల వైభవం
పెనుకొండ: పురావస్తు శాఖ అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పెనుకొండలో రాయల వైభవం మసకబారుతోంది. శ్రీకృష్ణదేవరాయల వైభవానికి ప్రతీకగా పెనుకొండలో నేటికీ చెక్కుచెదరకుండా నిలిచిన గగన్ మహల్ పశువుల దొడ్డిగా మారింది. రోజూ గగన్మహల్లోకి పశువులు చొరబడి పర్యాటకులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కనీసం గగన్ మహల్ మెయిన్ గేటుకు తాళం వేసేవారు కూడా లేరు. ఇప్పటికే పెనుకొండలో ఎన్నో చారిత్రక కట్టడాలు సరైన ఆలనాపాలనా లేక కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇటీవల గగన్మహల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న విమర్శలు సైతం ఉన్నాయి. ఇప్పటికై నా పురావస్తు శాఖ అధికారులు స్పందించి గగన్మహల్ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆలయాలకు ‘నూతన’ శోభ
కదిరి టౌన్/లేపాక్షి: నూతన సంవత్సరం తొలిరోజు గురువారం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివార్ల దర్శనానికి ఉదయం నుంచే ఆలయాల ఎదుట బారులు తీరారు. ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలో వేచి ఉన్న భక్తులు నమో నారసింహ అంటూ శ్రీవారిని కీర్తించగా...శ్రీవారి నామంతో కదిరి పట్టణం ప్రతిధ్వనించింది. ఇక లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. నంది విగ్రహం, థీంపార్కు, జఠాయువు పక్షి విగ్రహం, ఏడుశిరస్సుల నాగేంద్రుని విగ్రహం, నాట్యమంపటం, కల్యాణ మంటపం తదితర ప్రాంతాలను తిలకించడానికి భక్తులు ఆసక్తి చూపారు.


