పళ్లిపట్టులో డీఎంకే ఆందోళన | - | Sakshi
Sakshi News home page

పళ్లిపట్టులో డీఎంకే ఆందోళన

Mar 30 2025 1:24 PM | Updated on Mar 30 2025 3:36 PM

పళ్లిపట్టులో డీఎంకే ఆందోళన

పళ్లిపట్టులో డీఎంకే ఆందోళన

పళ్లిపట్టు: ఉపాధి హామీ పనులకు సంబందించి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా డీఎంకే శనివారం ఆందోళన చేసింది. ఆర్కేపేట వెస్ట్‌ యూనియన్‌ డీఎంకే ఆధ్వర్యంలో అమ్మయార్‌కుప్పంలో ఆ పార్టీ మండల కార్యదర్శి షణ్ముగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రం వెంటనే రూ.4వేల కోట్ల ఉపాధి నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. పళ్లిపట్టు సౌత్‌ మండల డీఎంకే ఆధ్వర్యలో పళ్లిపట్టు తపాలా కార్యాలయం వద్ద ఆ పార్టీ మండల కార్యదర్శి సీజే.శ్రీనివాసన్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఇందులో వెయ్యికి పైగాఊపాధి కూలీలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేజీ.కండ్రిగలో తిరుత్తణి మండల డీఎంకే కార్యదర్శి రాజేంద్రన్‌, తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement