నగరంలోని మిథిలాపురంలోని ఓ ప్రైవేట్ ఇంటర్ కాలేజీలో తెలుగు విద్యార్థులపై శనివారం నార్త్ ఇండియా విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిలో 30 మంది తెలుగు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కాలేజీ వద్దకు చేరుకుని పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన విద్యార్థులను మధురవాడలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు కాలేజీ వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీకి చేరుకున్నారు. కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు.
Published Sat, Jun 20 2015 11:49 AM | Last Updated on Wed, Mar 20 2024 3:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement