చాగలమర్రిలో కానిస్టేబుల్ వీరంగం | constable hulchal in kurnool district | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 1 2016 12:33 PM | Last Updated on Fri, Mar 22 2024 11:31 AM

ఏటీఎంల వద్ద గంటల తరబడి క్యూలో ఉన్న ఓ ఖాతాదారుడిపై హెడ్‌కానిస్టేబుల్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన చాగలమర్రిలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌బీఐ వద్ద బుధవారం ఉదయం 9 గంటలకే జనం బారులుదీరారు. ఒక్కొక్కరు రెండు, మూడు కార్డులతో వచ్చి డబ్బులు డ్రా చేస్తుండటంతో క్యూ ముందుకు కదలక అప్పటికే ఖాతాదారులు విసిగిపోయారు. 11.30 గంటల సమయంలో హెడ్‌కానిస్టేబుల్‌ రాజాహుసేన్‌ క్యూను కాదని వెళ్లి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుని బయటకు వచ్చారు. అక్కడి నుంచి వెళ్లిపోతూ ఒక కార్డుతోనే విత్‌డ్రా చేయించాలని బందోబస్తుగా ఉన్న కానిస్టేబుల్‌ను ఆదేశించాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement