Police Constable
-
ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
రాంగోపాల్పేట్: అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి లోనైన ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిటీ పోలీస్ ఐటీసెల్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రంగనాథ్రావు (36) కళాసీగూడ కామాక్షి దేవాలయం ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య గాజుల దాక్షాయణి, కుమార్తె ఉన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను అందు కు సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అ యినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో డిప్రెషన్కు లోనయ్యాడు. ఆదివారం కుమార్తెతో కలిసి బోయిన్పల్లిలోని పుట్టింటికి వెళ్లిన అతడి భార్య దాక్షాయణి అక్కడి నుంచి భర్తకు వీడియో కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో రాత్రి ఇంటికి వచ్చి చూడగా రంగనాథ్ వెంటిలేటర్ గ్రిల్కు ఉరివేసుకుని కనిపించాడు. స్థానికుల సహాయంతో అతడిని కిందకు దించి చూడ గా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీనిపై సమాచారం అందడంతో మహంకాళి ఇన్స్పెక్టర్ పరశురాం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఉగ్ర లింకులున్న ముగ్గురు ఉద్యోగుల తొలగింపు
జమ్మూ: ఉగ్ర మూకలతో సంబంధాలున్నట్లు తేలడంతో పోలీసు కానిస్టేబుల్ సహా ముగ్గురు ఉద్యోగులను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో పోలీస్ కానిస్టేబుల్ ఫిర్దౌస్ అహ్మద్ భట్, స్కూల్ టీచర్ అష్రాఫ్ భట్, అటవీ శాఖ ఉద్యోగి నిసార్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. నిసార్ అహ్మద్ ఖాన్ 2000వ సంవత్సరంలో నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన మంత్రి హత్య కేసులో అరెస్టయ్యాడు. ఇతడికి హిజ్బుల్ ముజాహిదీన్తో సంబంధాలున్నట్లు తేలింది. అదేవిధంగా, 2005లో స్పెషల్ పోలీస్ అధికారి(ఎస్పీవో)గా నియమితుడై, 2011లో కానిస్టేబుల్గా ప్రమోషన్ పొందిన ఫిర్దౌస్కు ఉగ్రలింకులున్నట్లు తేలడంతో గతేడాది సస్పెండ్ చేశారు. ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చేసే ఇతడు ప్రస్తుతం కొట్ భల్వాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అనంత్నాగ్ జిల్లాలో దాడులకు పథక రచన చేస్తుండగా మరో ఇద్దరు ఉగ్రవాదులతోపాటు పట్టుకున్నారు. రియాసికి చెందిన అష్రాఫ్ భట్ రెహ్బార్–ఇ–తలీం టీచర్గా 2008లో చేరాడు. ఇతడికి లష్కరేతోయిబాతో సంబంధాలున్నాయి. పాక్ కేంద్రంగా పనిచేసే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మహ్మద్ కాసిమ్ ఆదేశాల మేరకు ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతడిని పోలీసులు 2022లో అరెస్ట్ చేశారు. -
వయో పరిమితిలో ద్వంద్వ నీతి
సాక్షి, అమరావతి : పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల అభ్యర్థులతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షల నిర్వహణకు వచ్చేసరికి వయో నిబంధన అడ్డంకిగా చెబుతూ అడ్డుకోవడం విడ్డూరంగా ఉంది. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రీతిలో కాకుండా రేంజ్ కో రీతిలో వ్యవహరిస్తుండటం విస్మయ పరుస్తోంది. కర్నూలు రేంజ్ పరిధిలో కొందరు అభ్యర్థులకు అడ్డంకికానీ వయో నిబంధన.. ఇతర రేంజ్ల పరిధికి వచ్చే సరికి అడ్డంకిగా చూపిస్తుండటం ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా నిలుస్తోంది. 2022లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జనరల్, బీసీ అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లు.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య వయసు ఉండాలని వయో నిబంధన పెట్టారు. కానిస్టేబుల్ పోస్టులకు 5,03,487 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. రాష్ట్ర పోలీస్ నియామక మండలి (ఎస్ఎల్పీఆర్బీ) అధికారిక వెబ్సైట్ ద్వారా వచ్చిన ఆ దరఖాస్తులను ఆమోదించారు. అంటే అర్హత నిబంధనలు సరిపోబట్టే దరఖాస్తులను ఆమోదించినట్టుగా భావించాలి. ఇక 2023 జనవరి 22న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో 91,507 మంది అర్హత సాధించారు. అనంతరం తమ సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని హోమ్ గార్డులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించాల్సిన దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయే సరికి ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించలేకపోయారు. రేంజ్కో రీతా.. ఇదేం ద్వంద్వ నీతి? రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనవరిలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. నాలుగు కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు ఎన్నో ఆశలతో హాజరైన అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం వయో నిబంధన పేరిట సైంధవుడిలా అడ్డుకోవడం విభ్రాంతి కలిగించింది. రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసి, ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారిలో 1,500 మందికిపైగా అభ్యర్థుల వయసు పైబడిందని వారిని అనర్హులుగా ప్రకటించింది. జనరల్, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయసు 27 ఏళ్లు.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయసు 32 ఏళ్ల పరిమితి దాటిపోయిందని 1,500 మంది అభ్యర్థులను దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించ లేదు. దరఖాస్తు చేసే నాటికి తమకు తగిన అర్హతలు ఉన్నందునే ఎస్ఎల్పీఆర్బీ తమ దరఖాస్తులను ఆమోదించిందని అభ్యర్థులు ఎంతగా ప్రాథేయపడినా హోమ్ శాఖ పట్టించుకోలేదు. 1990, 1991లలో జన్మించిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట అర్హత వయసు దాటిపోయింది కాబట్టి వారిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించ లేదు. కానీ కర్నూలు రేంజ్ పరిధిలో 1989 మేలో జన్మించిన ఓ ఎస్సీ అభ్యర్థికి దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించిన విషయం వెలుగు చూసింది. ఆ అభ్యర్థి దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. అందులో అర్హత కూడా సాధించారు. మరి అదెలా సాధ్యమని కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఆ అభ్యర్థి ఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో చేసిన దరఖాస్తు, దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించిన పత్రం, ఆ పరీక్షల్లో అర్హత సాధించినట్టుగా ఇచ్చిన ధ్రువీకరణ పత్రం కాపీలను సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కొందరు అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబడుతున్నారు. తమను కూడా దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించాలని, ఈ ప్రక్రియను పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయ పోరాటం చేస్తామని కూడా చెబుతున్నారు. -
ఫిర్యాదు చేసేందుకు వస్తే.. గర్భవతిని చేశాడు
మేడ్చల్ రూరల్: సమస్య చెప్పుకునేందుకు పోలీస్స్టేషన్కు వచ్చిన యువతిని.. న్యాయం చేస్తానని లోబర్చుకుని గర్భవతిని చేశాడో కానిస్టేబుల్. ఆపై బెదిరింపులకు దిగాడు. బాధితురాలు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా కేసు నమోదు చేసిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా సదరు కానిస్టేబుల్ను రిమాండ్ చేశారు.పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ ఇందిరానగర్ కాలనీలో ఉండే యువతి (31) డబ్బుల విషయమై తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు గతేడాది మార్చి 21న తన తల్లితో కలిసి మేడ్చల్ పోలీస్స్టేషన్కు వెళ్లింది. క్రైమ్ విభాగం కానిస్టేబుల్ సుధాకర్రెడ్డి వారి సమస్య పరిష్కరిస్తానంటూ హామీఇచ్చి తన సెల్ఫోన్ నంబర్ను యువతికి ఇచ్చాడు. ఇంటికి పిలిచి అఘాయిత్యం మర్నాడు తన కేసు విషయమై యువతి కానిస్టేబుల్కు ఫోన్ చేసింది. లాయర్తో మాట్లాడదామంటూ ఆమెను తన ఇంటికి రప్పించి ఆమెను మాటల్లో పెట్టి, తనకు పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడ్డాడు. మరోసారి కూడా ఇంటికి రప్పించుకుని ఇలాగే చేశాడు. యువతి గతేడాది జూలైలో గర్భం దాల్చడంతో ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ఈ క్రమంలో ఆగస్టు 15న యువతి సుధాకర్రెడ్డికి ఫోన్ చేయగా అతని భార్య ఫోన్ లిఫ్ట్ చేసింది. దీంతో అతడికి పెళ్లయిన విషయం తెలియడంతో యువతి కానిస్టేబుల్ను నిలదీసింది. ఆమె కారణంగా తన కుటుంబంలో గొడవలు తలెత్తాయని భావించిన సుధాకర్రెడ్డి యువతి అడ్డు తొలగించుకునేందుకు మేడ్చల్లోని ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా ఫినాయిల్ తాగించాడు. అనంతరం సుధాకర్రెడ్డి దంపతులు సదరు యువతిని ఇంటికి పిలిపించుకుని దాడి చేశారు. అలాగే, తన మిత్రుడైన మరో కానిస్టేబుల్ ద్వారా సుధాకర్రెడ్డి యువతిని బెదిరింపులకు గురిచేశాడు. డిసెంబర్ 16న సుధాకర్రెడ్డి తన బండిపై యువతిని తీసుకెళ్లి గిర్మాపూర్ సమీపంలో కిందికి తోసేయడంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు కానిస్టేబుల్ వ్యవహారం గురించి తెలిసి మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ.. అతడిని సైబరాబాద్ కమిషనరేట్కు బదిలీ చేయించారు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో ఆ యువతి ఈ నెల 3న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేసింది. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి సుధాకర్రెడ్డిని రిమాండ్కు తరలించారు. -
షేర్ మార్కెట్లో కోటి రూపాయలు లాస్.. కానిస్టేబుల్ బలవన్మరణం
అంబర్పేట: ఆర్థిక ఇబ్బందు ల కారణంగా ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ అశోక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సూర్యాపేట జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు (42) మదన్నపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తూ అంబర్పేట, దుర్గానగర్లో నివాసం ఉంటున్నాడు. గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అత ను గురువారం ఇంట్లో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వెంకటే శ్వర్లుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పుట్టిన రోజే కబళించిన మృత్యువు
ఆరిలోవ: ఉద్యోగ సాధనలో విజయం సాధించి సాయంత్రం పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్న ఆ యువకుడి జీవనయానం హఠాత్తుగా ముగిసింది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం జరిగిన పరుగు పోటీలో పాల్గొన్న ఆ యవకుడు అనూహ్యంగా తనువు చాలించాడు. ఓ దశ పరుగు పందెం నెగ్గి, రెండో దశ కోసం వేచి ఉన్న సమయంలో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. విశాఖ నగరంలోని కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. గురువారమే అతని పుట్టిన రోజు కూడా. కానిస్టేబుల్ నియామక పరీక్షలకు వెళ్లి వచ్చి సాయంత్రం స్నేహితులు, కుటుంబ సభ్యులతో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనుకున్న యువకుడి ఆశల్ని మృత్యువు చిదిమేసింది. పోలీసులు, బంధువు కథనం ప్రకారం.. విశాఖ నగరం పదో వార్డు రవీంద్రనగర్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి కె.ఎ.శ్రావణ్కుమార్ (24) పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ మైదానంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పర్యవేక్షణలో జరుగుతన్న దేహదారుఢ్య పరీక్షలకు శ్రావణ్కుమార్ గురువారం హాజరయ్యాడు. మొదట జరిగిన 1,600 మీటర్ల పరుగులో పాల్గొన్నాడు. 8 నిమిషాలలో పూర్తి చేయాల్సిన పరుగును 7.1 నిముషాల్లోనే పూర్తి చేసి తదుపరి పరీక్షలకు అర్హత సాధించాడు. మరికొద్ది సమయంలో తదుపరి పరీక్షల్లో పాల్గొనాల్సి ఉంది. ఇంతలో కూర్చున్న చోటే అస్వస్థతకు గురై కుప్పకూలిపోయి, అపస్మారకస్థితికి చేరాడు. దీన్ని గమనించిన పోలీసులు అంబులెన్స్లో విమ్స్కు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అపోలో అస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న శ్రావణ్కుమార్ తల్లి, కుటుంబ సభ్యులు, బంధువులు అస్పత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. శ్రావణ్కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. 8 నెలల క్రితం తండ్రి మృతి శ్రావణ్కుమార్ తండ్రి కె.అర్జునరావు ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. ఆయన 8 నెలల క్రితం అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆ కుటుంబానికి ఇంజినీరింగ్ చదువుతున్న శ్రవణ్కుమారే పెద్దదిక్కుగా నిలుస్తాడని తల్లి కనకమహాలక్ష్మి ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు అతను కూడా మరణించడంతో తల్లి, చెల్లికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. -
నాడు అర్హులు.. నేడు అనర్హులట!
అనంతపురం : పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులపట్ల టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్దయతో వ్యవహరిస్తోంది. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన పలువురిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించకుండా తీరని అన్యాయం చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ నాటికి వారు వయసు రీత్యా అర్హులే. కానీ.. కోర్టు కేసు, ఎన్నికల కారణంగా గతంలో దేహదారుఢ్య పరీక్షలు ఆగిపోయాయి. ఎన్నికల అనంతరం« అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే ఈవెంట్స్ పెట్టి, నియామకాలు చేపట్టకుండా ఐదు నెలలపాటు కాలయాపన చేసింది. ఇప్పుడు వయసు మీరిపోయిందంటూ అనేకమందిని ఇళ్లకు పంపేస్తోంది.వారు అర్హులైనప్పటికీ, వారి తప్పేమీ లేకపోయినప్పటికీ నిర్దయగా తిరస్కరిస్తోంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదేమిటని సెలక్షన్ అధికారులను అడిగితే.. తామేమీ చేయలేమని, ఏదైనా ఉంటే రిక్రూట్మెంట్ బోర్డుకు విన్నవించుకోవాలని సూచిస్తున్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్ఐ, 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్ఐ పోస్టులకు ప్రిలిమ్స్, దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. కానిస్టేబుల్ పోస్టులకు 2023 జనవరి 22న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. తమ సర్వీసును సైతం పరిగణనలోకి తీసుకోవాలని హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈవెంట్స్ (దేహదారుఢ్య పరీక్షలు) బ్రేక్పడింది. అనంతరం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.అనంతరం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదునెలల పాటు ఈ పోస్టుల భర్తీని పట్టించుకోలేదు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులంతా మళ్లీ ఆన్లైన్లో ఈవెంట్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని రెండునెలల క్రితం ప్రకటించింది. అప్పట్నుంచి కష్టపడి దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమైన పలువురు అభ్యర్థులను వయసు మీరిందంటూ అనుమతించకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.అన్యాయమైన నిర్ణయందేహదారుఢ్య పరీక్షలు జనవరి 17న నిర్వహిస్తున్నట్లు హాల్టికెట్ ఇచ్చారు. అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియానికి వెళ్లాక.. ‘మీకు వయసు అయిపోయింది. అర్హతలేద’ని చెప్పారు. నోటిఫికేషన్ జారీ సమయానికి వయసును పరిగణనలోకి తీసుకోవాలిగానీ అందుకు విరుద్ధంగా తీసుకుంటున్నారు. ఈ పరీక్షలకు నెలన్నర నుంచి సిద్ధమయ్యాను. తీరా ఇప్పుడు అర్హతలేదనడంతో కానిస్టేబుల్ కల చెదిరిపోతోంది. నాలాగ ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 100 మంది వరకు అన్యాయానికి గురయ్యారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మా విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలి. – ఎన్. చంద్రశేఖర్, కానిస్టేబుల్ అభ్యర్థి, అనంతపురం -
‘ఖాకీ’ కొలువుల్లో ‘ఏజ్’ మెలిక!
చిత్తూరు అర్బన్: పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల పట్ల కూటమి సర్కారు నిర్దయతో వ్యవహరిస్తోంది. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన పలువురిని దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించకుండా తీరని అన్యాయం చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్నాటికి వారు వయసు రీత్యా కూడా అర్హులే. కానీ, కోర్టులో కేసు, ఎన్నికల కారణంగా దేహదారుఢ్య పరీక్షలు ఆగిపోయాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వెంటనే ఈవెంట్స్ పెట్టి, నియామకాలు చేపట్టకుండా ఆరు నెలలు సాగదీసి, ఇప్పుడు వయసు పెరిగిందంటూ అనేక మందిని ఇళ్లకు పంపేస్తోంది. వారి తప్పేమీ లేకపోయినా నిర్దయగా తిరస్కరిస్తోంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఇదేమిటని అభ్యర్థులు అడిగితే తామేమీ చేయలేమని, ఏదైనా ఉంటే రిక్రూట్మెంట్ బోర్డుతో తేల్చుకోండని జిల్లా ఎస్పీలు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 2022లో రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్ఐ పోస్టులకు ప్రిలిమ్స్, దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. కానిస్టేబుల్ పోస్టులకు 5,03,487 మంది దరఖాస్తు చేసుకోగా 4,58,219 మంది ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరయ్యారు. 2023 జనవరి 22న జరిగిన ప్రిలిమ్స్లో 91,507 మంది అర్హత సాధించారు. తమ సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలంటూ హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈవెంట్స్ నిలిచిపోయాయి. తరువాత రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలలు ఈ పోస్టులను పట్టించుకోలేదు. ప్రిలిమ్స్లో అర్హత పొందిన అభ్యర్థులంతా మళ్లీ ఆన్లైన్లో ఈవెంట్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని రెండు నెలల క్రితం ప్రకటించింది. రెండేళ్లుగా రన్నింగ్, హైజంప్పై దృష్టి సారించిన అభ్యర్థులు తుది ఈవెంట్స్కు సిద్ధమయ్యారు. అందరికీ కాల్ లెటర్లు వచ్చాయి. వారంతా చిత్తూరులో దేహదారుఢ్య పరీక్షలకు హాజరవుతున్నారు. నోటిఫికేషన్ నాటికి, ఇప్పటికి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. దీంతో వయస్సు పైబడిందంటూ కొందరిని ఈవెంట్స్కు అనుమతించడంలేదు. వీరిని గ్రౌండ్లో ఓ పక్కన కూర్చోబెట్టి, ఈవెంట్స్ ముగిసిన తర్వాత వయసు పెరిగినందున మీరు అర్హులు కారంటూ ఓ కాగితం చేతిలో పెడుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది ఉద్యోగార్హత కోల్పోయారు. రెండేళ్ల కిందట ఇచ్చిన నోటిఫికేషన్ సమయంలో తాము అర్హులమేనని, ఇప్పుడు కాదనడం అన్యాయమని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా కష్టపడి దేహదారుఢ్య పరీక్షలకు సిద్ధమైన తమను అనుమతించకపోవడం ఏమి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.ఇది దారుణం.. నోటిఫికేషన్ ఇచ్చేనాటికి నాకు ఏజ్ సరిపోయింది. ప్రిలిమ్స్లో అర్హత సాధించి రెండేళ్లుగా ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు వయస్సు పైబడి 33 రోజులైపోయింది, ఈవెంట్స్లో అనుమతించడం కుదరదని అంటున్నారు. ఇది దారుణం. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం. – వి.రాజేష్, పుత్తూరు, తిరుపతి జిల్లా తప్పు మాదికాదు.. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యాక ఫిజికల్ ఈవెంట్స్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోమన్నారు. అప్పుడే ఏజ్ లేదని చెబితే సైలెంట్ అయిపోదుము. కానీ కాల్ లెటర్ కూడా పంపించి, ఇప్పుడు ఫిజికల్స్కు పంపబోమంటున్నారు. అసలు టైమ్లో ఈవెంట్స్ పెట్టకపోవడం మా తప్పా? బోర్డు తప్పా? – కె.కన్యాకుమారి, అనంతపురం ఏడాది ముందే పెట్టుంటే.. నాకు ఇప్పుడు 32 ఏళ్లు. ఫిజికల్ ఈవెంట్స్కు అనుమతించలేదు. అడిగితే ఏజ్ పైబడి ఏడాది అయ్యిందన్నారు. ఏడాది ముందే ఈవెంట్స్ పెట్టొచ్చు కదా? కాల్ లెటర్లు పంపిన ప్రతి ఒక్కరినీ ఈవెంట్స్కు అనుమతించాలి. – కె.దిలీప్కుమార్, శ్రీకాకుళం జిల్లా -
విధుల్లో ఉండగా.. కానిస్టేబుల్కు గుండెపోటు
మహబూబ్నగర్ క్రైం: విధుల్లో ఉన్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ గుండెపోటు రాగా.. ఆస్పత్రితో చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని మర్లులో నివాసం ఉంటూ హెడ్క్వార్టర్లో ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తున్న వెంకటేష్(50)కు సోమవారం ఎస్కాట్ డ్యూటీ పడింది. ఈక్రమంలో సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా జైలుకు వెళ్లి అక్కడ ఖైదీలను వాహనంలో తీసుకుని కోర్టులో హాజరుపరిచి మళ్లీ మధ్యాహ్నం సమయంలో జైలులో ఖైదీలను అప్పగించి తిరిగి బయట వచ్చాడు. ఆ సమయంలో చాతీలో నొప్పి వస్తున్నట్లు వెంకటేష్ తోటి కానిస్టేబుల్స్కు చెప్పి కింద కూర్చుకున్నాడు. వెంటనే వారు చికిత్స కోసం జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు సీపీఆర్ చేయడంతో పాటు చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతి చెందాడు. క్యాజువాలిటీలో ఉన్న వెంకటేష్ మృతదేహన్ని ఎస్పీ డి.జానకి పరిశీలించి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడు వెంకటేష్కు భార్య వనీత, ఇద్దరూ కొడుకులు అభినవ్, వర్షవర్ధన్లు ఉన్నారు. మృతదేహన్ని అతని స్వస్థలం సీసీకుంటకు తరలించారు. -
హిమాచల్ పోలీసుల అకృత్యం
బనీఖేత్(హిమాచల్ ప్రదేశ్): నూతన సంవత్సర వేడుకల వేళ అర్ధరాత్రి దాటాక తాము అడిగిన మద్యం, ఆహారం ఇవ్వలేదన్న అక్కసుతో రిసార్ట్ మేనేజర్ను పోలీసులు కొట్టి చంపేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్లో చోటుచేసుకుంది. రిసార్ట్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు, నమోదైన ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రిదాటాక పర్వతమయ పర్యాటక ప్రాంతం డల్హౌసీ దగ్గర్లోని బనీఖేత్లోని ఒక ప్రైవేట్ రిసార్ట్కు ముగ్గురు కానిస్టేబుళ్లు వచ్చారు. రాత్రి రెండు గంటల సమయంలో తాము అడిగిన భోజనం, మద్యం ఏర్పాట్లు చేయాలని రిసార్ట్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. రాత్రి సమయంలో తాము చేయాల్సిన ‘సర్వీస్’సమయం మించిపోయిందని, ఇప్పుడు నిబంధనలు ఒప్పుకోవని, ఈ సమయంలో సర్వీస్ చేయడం కుదరని అక్కడి రిసెప్షనిస్ట్ సచిన్ చెప్పాడు. దీంతో పట్టరాని ఆవేశంతో కానిస్టేబుల్స్ అనూప్, అమిత్లు రిసెప్షనిస్ట్ను చితకబాదారు. ఇదంతా చూసిన రిసార్ట్ మేనేజర్ రాజీందర్ హుటాహుటిన అక్కడికొచ్చి కానిస్టేబుళ్లను నిలువరించబోయారు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న కానిస్టేబుళ్లు రాజీందర్పైనా దాడికి తెగించారు. ఈ దాడిలో రాజీందర్ అక్కడికక్కడే చనిపోయారు. దాడి సమయంలో కానిస్టేబుళ్లు పూటుగా మద్యం తాగి ఉన్నారని వార్తలొచ్చాయి. విషయం తెల్సుకున్న స్థానికులు వెంటనే చంబా–పఠాన్కోట్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రాజీందర్ మృతికి కారణమైన కానిస్టేబుళ్లను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్చేశారు. ఇద్దరినీ విధుల నుంచి తప్పించి దర్యాప్తు మొదలుపెట్టామని చంబా ఎస్పీ గురువారం చెప్పారు. తీవ్రంగా గాయపడిన రిసెప్షనిస్ట్ను ఆస్పత్రిలో చేర్పించారు. -
ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
మలక్పేట: భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం..సైదాబాద్ డివిజన్ ఆస్మాన్ఘడ్ ఎస్టీ బస్తీకి చెందిన జాతావత్ కిరణ్ (36) ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న అతడు భార్యతో గొడవపడేవాడు. ఉద్యోగానికి సెలవు పెట్టి నాలుగైదు రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. బుధవారం సాయంత్రం ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. ఇరుగు పొరుగు వారు, బంధువులు అతన్ని మలక్పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కానిస్టేబుల్ తో ఎస్సై వివాహేతర సంబంధం.. న్యాయం కావాలంటూ భార్య ఆందోళన
-
ఈతరాక.. ఊపిరాడక..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ఎస్సై, కానిస్టేబుల్, మరో యువకుడు మునిగి చనిపోయిన సంఘటనకు సంబంధించి పోలీసు అధికారులు విచారణ ముమ్మరం చేశారు. వారి మరణానికి గల కారణాలతో పాటు ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చెరువు నీటిలో ముగ్గురు పడిపోవడంతో జాలర్ల సాయంతో గాలించి వారి మృతదేహాలను బయటకు తీసిన విషయం తెలిసిందే. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లను పరిశీలించిన అధికారులు.. శ్రుతి, నిఖిల్లు పెళ్లి చేసుకోవాలనుకున్నారని గుర్తించారు. తర్వాత వారి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయోనన్న దాని గురించి ఆరా తీస్తున్నారు. వారు చెరువు వద్దకు వెళ్లి అక్కడ చర్చించుకున్న సమయంలో, చెరువులో దూకినపుడు ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో అక్కడ ఏం జరిగిందన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవైన చెరువు కావడంతో ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా ఎక్కడా లేవు. ఆ రోజు చేపల వేటకు ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లకపోవడంతో ఈ ఘటన ఎవరి కంటా పడలేదని భావిస్తున్నారు.ఎస్సై ఐ ఫోన్ వాట్సాప్ చాటింగ్లో ఏముందో..వివిధ కోణాల్లో దర్యాప్తుముగ్గురి మరణాలపై పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. కాల్డేటాను పరిశీలించిన అధికారులు వాట్సాప్ చాటింగ్లపై దృష్టి సారించారు. అయితే ఫోన్లు లాక్ అయి ఉండడంతో వాటిలో నుంచి సమాచారం తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ సింధుశర్మ కేసు పరిశోధన గురించి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా కేసు దర్యాప్తు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో సాంకేతిక అంశాల ఆధారంగా కేసును కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కేసు కొలిక్కి రావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.నీరు మింగి..భిక్కనూరు ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, అలాగే నిఖిల్ నీట మునిగింది లోతైన ప్రదేశంలో కావడంతో అందులో పడగానే లోపలికి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. ముగ్గురి మృతదేహాలు దొరికిన ప్రదేశం దాదాపు పదిమీటర్ల లోతు ఉంటుందని అంటున్నారు. ముందు ఎవరో ఒకరు దూకి ఉంటారని, వారిని కాపాడే క్రమంలో మి గతా ఇద్దరూ ఒకరి వెంట ఒకరు దూకి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే ముగ్గురికీ ఈత రాదని తెలుస్తోంది. లోతైన ప్రాంతంలో దూక డంతో ముగ్గురూ నీట మునిగి చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టుల్లో నీళ్లు మింగే చనిపోయారని వెల్లడైంది.ఆత్మహత్యలా.. హత్యలా? -
కామారెడ్డి మిస్టరీ డెత్స్ కేసులో కొత్త కోణాలు.. జరిగింది ఇదేనా?
సాక్షి, కామారెడ్డి జిల్లా: ట్రిపుల్ డెత్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎస్ఐ సాయి, మహిళా కానిస్టేబుల్ శ్రుతి మరో యువకుడు నిఖిల్ మృతదేహాలు చెరువులో ఒకే చోట లభ్యం కాగా, ముగ్గురు కుటుంబాల నుంచి ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల బంధువులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.ఎస్ఐ సాయి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మహిళా కానిస్టేబుల్ శ్రుతి, నిఖిల్లు ట్రాప్ చేసి పిలిచి ఉంటారంటూ ఎస్ఐ సాయి బంధువుల ఆరోపిస్తున్నారు. మరోవైపు, శ్రుతి ధైర్యవంతురాలని ఆమెను చంపి ఉంటారని కానిస్టేబుల్ బంధువులు ఆరోపిస్తున్నారు. నిఖిల్ బంధువుల నుంచి కూడా ఎస్ఐ, కానిస్టేబుల్ వైపు ఆరోపణలు చేస్తున్నారు. అసలు వారు చెరువు వద్దకు ఎందుకు వచ్చారు? ఆత్మహత్య నేపథ్యంలో కాపాడబోయి చనిపోయారా? లేక ముగ్గురివి ఆత్మహత్యలేనా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఎస్ఐ సాయి, కానిస్టేబుల్ శ్రుతి మరో వ్యక్తి నిఖిల్ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేయించిన పోలీసులు.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో శాఖాపరమైన దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు.. మరోవైపు.. మృతులు ముగ్గురి కాల్ లిస్ట్లు, సిగ్నల్స్ ఆధారంగా ఎప్పటినుంచి మాట్లాడుతున్నారు.. ఎక్కడ కలిశారు.. ఎటువైపు నుంచి ఎక్కడెక్కడికి వెళ్లారనే కోణంలో ఎంక్వైరీ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వివరాలు బయటకు వస్తాయని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు.. కాగా, భిక్కనూరులో పనిచేస్తున్న ఎస్ఐ సాయికుమార్, బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు బీబీపేటకు చెందిన యువకుడు నిఖిల్ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రానికి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు సమీపంలో ఎస్ఐ కారు లభ్యం కావడం, చెరువు వద్ద చెప్పులు ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు అధికారులు భావించారు. బుధవారం సాయంత్రం నుంచి శవాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది చెరువులో దిగి మృతదేహాలను బయటకు తీశారు.అర్ధరాత్రి 12.30 గంటలకు కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్ మృతదేహాలు దొరికాయి. గురువారం ఉదయం ఎస్ఐ మృతేదేహాన్ని వెలికితీశారు. ఇక, ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్యన ఉన్న గొడవలేంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారు? అన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎస్ఐ సాయికుమార్ గతంలో బీబీపేట పోలీసు స్టేషన్లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది.బీబీపేటకు చెందిన నిఖిల్ సొసైటీలో ఆపరేటర్గా పనిచేస్తూనే, కంప్యూటర్లు మరమ్మతులు చేస్తుంటాడని తెలుస్తోంది. పోలీసు స్టేషన్లోని కంప్యూటర్లకు ఏదైనా సమస్య వస్తే నిఖిల్ వచ్చి సరి చేసి వెళతాడని చెబుతున్నారు. అయితే ఈ ముగ్గురి మధ్యన ఉన్న గొడవలేంటి అన్నది సస్పెన్స్గా మారింది. -
బళ్లారిలో కీచక ఖాకీలు
సాక్షి,బళ్లారి: భర్త వేధింపుల నుంచి రక్షణ కోరుతూ పోలీసు స్టేషన్ గడప తొక్కిందామె. కానీ, అక్కడ రక్షక భటులే కీచకులయ్యారు. ఆమెను భర్త నుంచి విడగొట్టి.. ఒంటరిని చేసి మరీ లైంగిక దాడుకు దిగారు. బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ఇద్దరు కీచక కానిస్టేబుళ్ల గుట్టు రట్టయింది. నగరంలోని బండిహట్టిలోని పద్మశ్రీ కాలనీకి చెందిన ఓ మహిళ 2023 ఏప్రిల్లో తన భర్త ప్రతి రోజు చిత్రహింసకు గురి చేస్తున్నారని, అతని బారి నుంచి రక్షణ కల్పించాలని కౌల్బజార్ పోలీసు స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ అనే కానిస్టేబుల్ సానుభూతిగా మాట్లాడుతూ ఫోన్ నంబరు తీసుకున్నాడు. మరుసటి రోజు భర్త సతాయించడంతో ఆమె ఇమ్రాన్ఖాన్కి కాల్ చేసి చెప్పింది. అతడు ఫోన్ చేసి ఆమె భర్తను గదమాయించాడు. అప్పటినుంచి ఆమెతో తరచూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆమెకు డబ్బులు ఆశ చూపి, ప్రత్యేకంగా ఓ ఇల్లు బాడుగకు ఇప్పించి సహ జీవనం ప్రారంభించాడు. కొన్నాళ్లపాటు వ్యవహారం సాగించిన ఇమ్రాన్ఖాన్ తప్పుకున్నాడు. కేసు నమోదు, ఒకరి అరెస్టు హిళ విషయం తెలిసి ఆజాద్ అనే మరో కానిస్టేబుల్.. ఆమెకు దగ్గరయ్యాడు. ఇంతలో ఇమ్రాన్ఖాన్ కూడా వారి మధ్యకు వచ్చాడు. తాము చెప్పినట్లు వినకపోతే యాసిడ్తో దాడి చేస్తామని కూడా బెదిరించారట. చివరకు వారి నరకయాతనను తట్టుకోలేని బాధితురాలు ఇద్దరు కానిస్టేబుళ్లు తనను నమ్మించి మోసం చేశారని మహిళా పోలీసు స్టేషన్లో లైంగికదాడి కేసు పెట్టింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేసి, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి ఒకరిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఈ బాగోతం నగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది. -
30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించాలని రాష్ట్ర పోలీసు నియామక మండలి నిర్ణయించింది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. కానిస్టేబుల్ పరీక్షల(స్టేజ్–2) కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్టికెట్లనువెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని పోలీసు నియామక మండలి గురువారం ఓ ప్రకటనలో సూచించింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు డౌన్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేసింది. సందేహాల నివృత్తి కోసం హెల్ప్లైన్ నంబర్లు 9441450639, 9100203323ను సంప్రదించాలని సూచించింది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్ల దుర్మరణం
గజ్వేల్రూరల్: మారథాన్ పోటీలో పాల్గొనేందుకు వెళుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటుచేసుకుంది. హిట్ అండ్ రన్ ఘటనతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద విషాదకర వాతావరణం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన వర్కల్ పరంధాములు(46) రాయపోల్ ఠాణాలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తుండగా, గాడిచర్లపల్లికి చెందిన పూసల వెంకటేశ్(38) దౌల్తాబాద్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు హైదరాబాద్లోని ఈసీఎల్ ప్రాంతంలో మారథాన్(రన్) కార్యక్రమం ఉండడంతో వీరు ఆదివారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.ఈ క్రమంలో పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డు మార్గంలో రాంగ్రూట్లో వెళుతుండగా, ఇదే సమయంలో గజ్వేల్ నుంచి దౌల్తాబాద్ వైపు వెళుతున్న బొలెరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు హెల్మెట్లు ధరించినా, తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మరణవార్త తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీశ్రావులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం విచారకరమని, బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. మరణంలోనూ వీడని స్నేహం: మరణంలోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ మృతుల కుటుంబసభ్యులు చెప్పారు. పరంధాములుది 2004 బ్యాచ్ కాగా, వెంకటేష్ 2007 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్. ఎక్కడ మారథాన్ పోటీలు జరిగినా పోలీస్శాఖ తరపున వెళ్లి పాల్గొనే వారని తోటి పోలీసు సిబ్బంది పేర్కొన్నారు. పోలీస్శాఖలో మారథాన్ పోటీల్లో పాల్గొనేవారు ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అందులో సభ్యులుగా ఉన్న వెంకటే‹Ù, పరంధాముల మధ్య స్నేహం ఏర్పడింది. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్తోపాటు ముంబయి, న్యూఢిల్లీలో సైతం జరిగిన మారథాన్ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందారని గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -
పరువు, ఆస్తి కోసమే హత్య
ఇబ్రహీంపట్నం: కులాంతర వివాహం చేసుకోవడంతో పాటు ఆస్తి కోసం బెదిరిస్తోందనే కారణంతో సొంత అక్కను చంపిన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. వివరాలను సీఐ సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కులాంతర వివాహం, ఆస్తి వ్యవహారంతోనే కానిస్టేబుల్ నాగమణిని ఆమె సొంత తమ్ముడు కొంగర పరమేశ్(26) హత్య చేశాడని పేర్కొన్నారు. నాగమణి కదలికలపై నిందితుడికి సమాచారం ఇచ్చిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. మృతురాలు నాగమణికి అక్క హైమావతి, తమ్ముడు పరమేశ్ ఉన్నారు. 2009లో అక్క వివాహం జరగ్గా ఆమె భర్తతో కలిసి తుర్కయంజాల్లో నివసిస్తోంది. పదేళ్ల క్రితమే తల్లిదండ్రులు చనిపోవడంతో నాగమణి, పరమేశ్ రాయపోల్లోని పెద్దనాన్న సంరక్షణలో పెరిగారు. 2014లో నాగమణికి పటేల్గూడ వాసితో వివాహం జరిగింది. ఈ సమయంలో పసుపుకుంకుమల కింద ఎకరా భూమి రాసిచ్చారు. అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో నాగమణి అతన్ని వదిలేసి, రాయపోల్ వచ్చేసింది. హయత్నగర్లోని హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమైంది. ఈ క్రమంలో 2020లో కానిస్టేబుల్గా ఎంపికై కుషాయిగూడ, హయత్నగర్ పీఎస్లలో పనిచేసింది. 2022లో మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. రాయపోల్లో ఉన్నప్పుడే ఆ గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్తో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా ఆమె వినలేదు. దీంతో మొదటి పెళ్లి జరిగిన సమయంలో ఆమెకు ఇచ్చిన ఎకరా భూమిని తిరిగి ఇచ్చేసింది. గత నెల 10న యాదగిరిగుట్టలో శ్రీకాంత్ను కులాంతర వివాహం చేసుకుంది. ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్గా పనిచేసే శ్రీకాంత్తో కలిసి వనస్థలిపురం సహారా ఎస్టేట్స్లోని ఓ అద్దెంట్లో కాపు రం పెట్టారు. ఈ క్రమంలో తన ఎకరం తనకు తిరిగివ్వాలని తమ్ముడిని డిమాండ్ చేసింది. కులాంతర వివాహం చేసుకొని తమ పరువు తీయడమేగాకుండా, భూమి ఇవ్వాలని పేచీ పెడుతోందని పరమేశ్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఓ కత్తి (కమ్మ కత్తి)కొని కారులో దాచిపెట్టి అవకాశం కోసం ఎదురుచూడసా గాడు. ఆదివారం భర్తతో కలిసి వచి్చందని తెలియడంతో హత్యకు సిద్ధమయ్యాడు. నాగమణి కదలికలను తెలిపేందుకు స్నేహితుడు అచ్చన శివను ఉపయోగించుకున్నాడు. సోమవారం ఉదయం స్కూటీపై విధులకు బయలుదేరిన విషయాన్ని శివ ఫోన్లో చేరవేశాడు. దీంతో పరమేశ్ కారులో ఆమెను వెంబడించాడు. మన్నె గూడ రోడ్డు జంక్షన్ వద్ద వెనకనుంచి ఢీకొట్టి, కిందపడగానే∙వెంటనే కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు మంగళవారం రాయపోల్ సమీపంలోని జనహర్ష వద్ద పరమేశ్ను పట్టుకున్నారు. అతని నుంచి కారుతోపాటు ఐ ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు. ఇతనికి సహకరించిన శివ కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు. -
హగ్ ఇస్తేనే పాస్పోర్టు ఇస్తా: కానిస్టేబుల్ వేధింపులు
బొమ్మనహళ్లి: యువతి పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకోగా, తనిఖీ కోసం ఆమె ఇంటికి వెళ్ళిన కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె షాకైంది. ఫిర్యాదు చేయడంతో అతనిని సస్పెండ్ చేసిన ఘటన బెంగళూరు నగరంలోని బ్యాటరాయనపుర ఠాణా పరిధిలో జరిగింది.కోరిక తీర్చమంటూ..ఫిర్యాదు మేరకు వివరాలు.. ఠాణా పరిధిలోని బాపూజీ నగరలో ఉండే ఓ యువతి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంది. ఇందుకోసం పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకుంది. ఆమె గురించి తనిఖీ చేయాలని పాస్పోర్టు ఆఫీసు నుంచి ఠాణాకు సిఫార్సు వచ్చింది. దీంతో కానిస్టేబుల్ కిరణ్ యువతి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి చొరబడి తలుపులు మూసి, నీ సోదరునిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందువలన నీకు పాస్పోర్టు రాదు. నీవు నాకు సహకరిస్తే చాలు అని ఒత్తిడి చేశాడు. ఆమె ససేమిరా అనడంతో ఒక్కసారి కౌగిలించుకుంటా అని వేధించాడని యువతి ఆరోపించింది. మరో గదిలో ఉన్న సోదరుడు ఏమిటీ గొడవ అని రాగా, కానిస్టేబుల్ మాట మార్చి అక్కడి నుంచి జారుకున్నాడు. మరోవైపు వెరిఫికేషన్ నంబర్ ఇవ్వకుండా బ్లాక్ చేశాడు. దాంతో బాధితురాలు పశ్చిమ డీసీపీ ఎస్. గిరీష్ని కలిసి గోడు వెళ్లబోసుకుంది. పోలీసు తప్పు చేసినట్లు గమనించి అతన్ని సస్పెండ్ చేశారు.ముడుపుల గోలకాగా, నగరమే కాకుండా రాష్ట్రమంతటా పాస్పోర్టు కోసం పెద్దసంఖ్యలో ప్రజలు దరఖాస్తులు చేస్తుంటారు. తనిఖీల సమయంలో పెద్దమొత్తంలో ముడుపులు అడుగుతారని, ఇవ్వకపోతే ఏదో ఒక సాకుతో పెండింగ్లో పెడతారని ఆరోపణలు ఉన్నాయి. గొడవ ఎందుకని చాలామంది డబ్బులు ఇచ్చేస్తారు. -
హయత్ నగర్ పీఎస్ కానిస్టేబుల్ నాగమణి హత్య
-
తల్లిని హత్య చేసిన కానిస్టేబుల్
చిత్తూరు అర్బన్: నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లిని ఓ కుమారుడు హత్య చేశాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని ఉన్మాదంలో తల్లిని కాలితో తన్నడంతో ఆమె పక్కటెముకలు విరిగిపోయాయి. తలను గోడకేసి కొట్టడంతో మెదడులో రక్తం గడ్డకట్టి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ తల్లి... మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు విడిచింది. చిత్తూరు నగరంలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలు... చిత్తూరు దుర్గానగర్ సమీపంలోని రోసీనగర్లో ఉంటున్న వసంతమ్మ (63)కు ఇద్దరు కుమారులు.భర్త పోలీసుశాఖలో హెడ్కానిస్టేబుల్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. పెద్ద కొడుకు శంకర్ చిత్తూరు పోలీసు శాఖలో కానిస్టేబుల్గా, మరో కొడుకు జ్యోతికుమార్ ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. శంకర్ ప్రవర్తన నచ్చని తండ్రి బాలసుబ్రమణ్యం రెండేళ్ల క్రితం తన సోదరి ఊరికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. పనిచేసిన స్టేషన్లో ఆరోపణలు రావడంతో శంకర్ కొన్నాళ్లుగా వేకెంట్ రిజర్వు (ఏఆర్)లో ఉన్నాడు. ఈక్రమంలో బుధవారం సాయంత్రం శంకర్ మద్యం మత్తులో తన తల్లితో గొడవకు దిగాడు. మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని సతాయించాడు. తల్లితో మాటా మాటా పెరిగి వాగ్వావాదానికి దిగాడు. ఒక్కసారిగా కోపానికిలోనైన శంకర్.. వసంతమ్మను చావ బాదాడు. తలను గోడకేసి కొట్టాడు. కింద పడేసి కాలితో తన్నుతూ, మొహంపై దాడి చేశాడు. ఒక్కసారిగా స్పృహతప్పిన వసంతమ్మ కిందపడిపోయింది. అప్పటికే కేకలు విన్న ఇరుగుపొరుగువాళ్లు ఆమెను హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షల అనంతరం వసంతమ్మ మెదడులో రక్తం గడ్డకట్టిందని, కాలుతో తన్నడంతో పక్కటెముకలు విరిగినట్లు గుర్తించారు.ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూలోనే ఉంచి వైద్యం అందించారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆమె మృతి చెందారు. వసంతమ్మ రెండో కుమారుడు జ్యోతికుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు తొలుత దాడి కేసు నమోదుచేసి, ఆపై హత్య కేసుగా మార్చారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. -
TGSP: ఎందుకీ వివాదం.. ఏమిటీ ‘ఏక్ పోలీస్’?
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగంలో కొనసాగుతూ ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఆర్టికల్ 311ను తెలంగాణ పోలీస్ శాఖ ప్రయోగించింది. 39 మంది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఏక్ పోలీస్’? అంటే ఏంటి? అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి ఒకసారి పరిశీలిస్తే.. రాష్ట్రంలో మొత్తం 13 బెటాలియన్లు ఉన్నాయి. వాటిలో అధికారులు, సిబ్బంది కలిపి ఒక్కో బెటాలియన్లో వెయ్యి మంది వరకు ఉంటారు. సాధారణంగా పోలీస్శాఖలో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), స్పెషల్ పోలీస్ విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేస్తుంటారు. పోలీస్స్టేషన్లలో ఉంటూ శాంతిభద్రతల పర్యవేక్షణ, నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం వంటి విధులను సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుండగా వారికి బందోబస్తు తదితర విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు సహాయపడుతుంటారు. కానీ టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది శాంతిభద్రతల విధులు నిర్వహిస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లోనూ పనిచేస్తారు. అయితే తమను ఐదేళ్లలో ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్)లోకి, ఆ తర్వాత ఐదేళ్లకు సివిల్ కానిస్టేబుల్గా మార్చాలని టీజీఎస్పీ కానిస్టేబుళ్లు కోరుతున్నారు. అయితే ఇందుకు రాష్ట్ర సర్వీస్ నిబంధనలు అంగీకరించవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుందంటూ డీజీపీ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు కొన్ని దశాబ్దాల నుంచి అమలు జరుగుతున్నాయి. జిల్లాల స్థాయిలో నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం వంటి విధులను సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుంటారు. బందోబస్తు తదితర విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు సహాయపడుతుంటారు. కానీ, టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శాంతి భద్రతల అంశాలలో విధులు నిర్వహిస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లో అప్పగించిన బాధ్యతలను సైతం అద్భుతంగా నిర్వహించిన ఘనత టీజీఎస్పీ సిబ్బందికి ఉంది.దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఈ రకమైన విధానాలనే అమలు చేస్తున్నాయి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలను మెరిట్ ప్రాతిపదికన సానుభూతితో పోలీస్ శాఖ పరిశీలిస్తుంది. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఎవరికీ లేని విధంగా టీజీఎస్పీ సిబ్బందికి సరెండర్ లీవ్లు, అడిషనల్ సరెండర్ లీవులు మంజూరు చేశాము. పండుగలు, సెలవుల సందర్భాలలో టీజీఎస్పీ సిబ్బంది నిర్వహించే విధులను దృష్టిలో ఉంచుకొని వారికి ఈ సౌకర్యం కల్పిస్తున్నాము. వేతనాలు, భత్యాలు ఇతర రాష్ట్రాల పోలీస్ సిబ్బందితో పోలిస్తే అధికంగా ఉన్నాయి. భద్రత, ఆరోగ్య భద్రత వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది. ఈ పరిస్థితుల్లో టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం సమంజసం కాదు’’ అంటూ ప్రకటనలో డీజీపీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: కులగణనకు ఇంటింటి సర్వే‘‘యూనిఫామ్ ధరించే టీజీఎస్పీ సిబ్బంది అత్యంత క్రమశిక్షణ తో విధులను నిర్వహించాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ట ను పెంచాలి.. కానీ సిబ్బంది పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించకూడదు. సమస్యలను సరైన పద్ధతిలో పరిశీలిస్తామని టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. యథావిధిగా టీజీపీఎస్పీ సిబ్బంది వారి సాధారణ విధులను నిర్వహించాలి. సమస్యలు ఏమైనా ఉంటే వారి కోసం నిర్వహిస్తున్న "దర్బార్" కార్యక్రమం ద్వారా వారి అధికారులకు తెలియజేయాలి. యూనిఫామ్ సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడం, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుంది’’ అంటూ డీజీపీ హెచ్చరించారు. -
బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై పోలీసు శాఖ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ బెటాలియన్లలో పనిచేసే కానిస్టేబుళ్ల ఆందోళనలపై రాష్ట్ర పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. విధులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి పోలీసులు ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా భావిస్తున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించమని హెచ్చరించారు. పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సామాన్య జనానికి ఇబ్బంది కలిగేలా రోడ్లపై వచ్చిన పోలీసులపై చట్టపరమైన, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సెలవుల విషయంలో పాత పద్ధతినే అనుసరిస్తామని ఇప్పటికే చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళన చేయడంపై సరికాదన్నారు. ఆగ్రహం వ్యక్తం చేసింది. బెటాలియన్స్లో ఆందోళన చేస్తున్న వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానిస్టేబుళ్ల ఆందోళన వెనక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తముందని అనుమానం ఉందన్నారు.కాగా తెలంగాణలో ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అన్ని జిల్లాలోలనూ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారువరంగల్ జిల్లా మమూనూరు క్యాంపులో మొదలైన ఆందోళన సెక్రటేరియట్ చేరింది. క్రమంగా రాష్ట్రంలోని అన్ని బెటాలియన్లకు పాకింది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, నల్గొండ రూరల్, మంచిర్యాలలో నిరసనలు చేపట్టారు. అయితే మామునూరు బెటాలియన్ ఆవరణలో ఏకంగా యూనిఫాం ధరించిన పోలీసులే నిరసనకు దిగారు. టీజీఎస్పీ వద్దు ఏక్ పోలీస్ ముద్దు, టీజీఎస్పీకో హఠావో.. ఏక్ పోలీస్ బనావో అంటూ నినాదాలు చేశారు. -
రౌడీ షీటర్ కిరాతకం: కానిస్టేబుల్ భార్య, కుమార్తె హత్య
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని దారుణం చోటు చేసుకుంది. బెయిల్పై విడుదలైన ఓ రౌడీ షీటర్.. సూరజ్పూర్ జిల్లాలోని మార్కెట్ ఏరియాలో ఓ కానిస్టేబుల్పై మరుగుతున్న నూనె పోసి దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఓ హెడ్ కానిస్టేబుల్ ఇంటిలోకి చొరబడ్డాడు. హెడ కానిస్టేబుల్ భార్య, మైనర్ కుమార్తెను హత్యచేశారు. సూరజ్పూర్ ఎస్పీ ఎంఆర్ అహిరే తెలిపిన వివారాల ప్రకారం.. ‘‘హత్య, దోపిడీ కేసుల్లో నిందితుడైన హిస్టరీ-షీటర్ కుల్దీప్ సాహు. ఆదివారం సాయంత్రం మార్కెట్ ప్రాంతంలో కానిస్టేబుల్ ఘన్శ్యాం సోన్వానీతో వాగ్వాదానికి దిగాడు. అక్కడితో ఆగకుండా ఆ కానిస్టేబుల్పై మరుగుతున్న నూనె పోసి దాడి చేశాడు. సోన్వానీకి కాలిన గాయాలయ్యాయి. ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. తర్వాత నిందితుడు దుర్గా ఊరేగింపులో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ తాలిబ్ షేక్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆయన మైనర్ కుమార్తె , భార్యను హత్య చేశాడు. షేక్ తన ఇంటికి అర్థరాత్రి చేరుకొని చూడగా.. ఇంట్లో దోపిడి జరిగినట్లు, భార్య, కుమార్తె మృతి చెంది కనిపించారు. దీంతో తాలిబ్ పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సోమవారం ఉదయం పిధా గ్రామంలో పోలీసులు మహిళ హెడ్ కానిస్టేబుల్ కుమార్తె, భార్య మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు’’ అని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. సూరజ్పూర్ పట్టణంలోని హెడ్ కానిస్టేబుల్ భార్య, కుమార్తె హత్యలను నిరసిస్తూ నిందితుడు సాహు నివాసం, బయట ఉన్న వాహనాలకు స్థానికులు నిప్పు పెట్టారు. ఈ హత్య ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్ స్పందిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. -
Police Constable suicide: ఇద్దరు పోలీసుల ఆత్మహత్య
బూర్గంపాడు/ఏన్కూరు/మహబూబాబాద్ రూరల్: ఓ కేసులో ఉన్నతాధికారులు తనను బలి పశువును చేశారన్న ఆవేదనతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోగా, కుటుంబ కలహాలతో మరో కాని స్టేబుల్ తుపాకీతో కాల్చుకుని తనువు చాలించాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన భూక్యా సాగర్ (34) భద్రాద్రి జిల్లా బూర్గంపాడు పోలీస్స్టేషన్లో గతంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహించాడు. ఆ సమయంలో, ఆ తర్వాత లక్ష్మీదేవిపల్లి పోలీస్స్టేషన్లో పని చేసినప్పుడు గంజాయి అక్రమ రవాణా కేసులో సాగర్ ప్రమేయం ఉందంటూ ఉన్నతాధికారులు ఆయనను అరెస్ట్ చేసి, సస్పెండ్ చేశారు. ఇటీవలే సస్పెన్షన్ ఎత్తివేసి ఏడూళ్ల బయ్యారంలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన తప్పు లేకున్నా ఎస్సైలు సంతోష్, రాజ్కుమా ర్, బీఆర్ఎస్ నాయకుడు నాని తనను గంజాయి కేసులో ఇరికించారని.. ఆ నింద మోయలేకపోతున్నా.. చచి్చపోతున్నా అంటూ సాగర్ ఏన్కూరులోని ఎన్ఎస్పీ ప్రధాన కాల్వ వద్ద పురుగు మందు తాగి సెల్ఫీ వీడియో తీసి శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయిని బయట విక్రయించేందుకు ఎస్సైలు త నపై ఒత్తిడి చేశారని, తన సెల్ నుంచే గంజాయి కొనుగోలుదారులకు ఫోన్లు చేయించారని తెలిపాడు. ఇది బయటపడుతుందన్న భయంతోనే తనను అరెస్ట్ చేయించారని ఆరోపించాడు. కాగా, పురుగు మందు తాగిన సాగర్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సా యంత్రం మృతిచెందాడు. చికిత్స పొందుతున్న సమయంలో కూడా ‘రేవంతన్నా.. నా కుటుంబానికి న్యాయం చేయండి’అని మరో సెల్ఫీ వీడియో తీశాడు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు ఎస్సైలు, ఒక సీఐ, బీఆర్ఎస్ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఏన్కూరు ఎస్సై రఫీ తెలిపారు. కుటుంబ విభేదాలతో.. మరో ఘటనలో తుపాకీతో కాల్చుకుని ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఎన్జీఓస్ కాలనీకి చెందిన గుడిబోయిన శ్రీనివాస్ (59)కు భార్య, కుమారుడు ఉన్నారు. అయితే, విబేధాల కారణంగా ఐదేళ్ల నుంచి వారికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ ఐడీఓసీ ఆవరణలోని స్ట్రాంగ్రూం వద్ద ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో తన ఎస్ఎల్ఆర్ తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం నల్లబెల్లి: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పెంబర్తికి చెందిన ధరణికి 2020లో కానిస్టేబుల్ ఉద్యోగం రాగా, వరంగల్ జిల్లా నల్లబెల్లి లోని పోలీస్ క్వార్టర్స్లో నివనిస్తోంది. నాలుగు నెలల క్రితం తన పెద్దన్నకు వివాహం అయింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు తన పెళ్లి విషయమై తరచుగా ఆలోచిస్తూ మనస్తాపానికి గురైన ధరణి.. పోలీస్ క్వార్టర్స్లోని తన నివాసంలో ఆదివారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన పోలీసులు మంటలార్పి.. చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
దసరా వేడుకల్లో వీరకుమార్ అనే ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం...
-
‘అందరూ ఒక్కటై నన్ను బలిపశువును చేశారు’.. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలిస్కానిస్టేబుల్ బుక్యా సాగర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతుంది.జిల్లాలోని బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో బుక్యాసాగర్ విధులు నిర్వహించారు. అయితే గంజాయి కేసులో తనని బలిపశువుని చేశారని, చేయని నేరాన్ని తనపై మోపారని, నిందను భరించలేక పురుగులు మంది తాగి చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో వాపోయాడు కానిస్టేబుల్ బుక్యా సాగర్. గతంలో బూర్గంపాడులో పనిచేసిన ఇద్దరు ఎస్ఐలు సంతోష్ ,రాజకుమార్,బీఆర్ఎస్ నాయకుడు నాని తనని బలిపశువుని చేశాడని వాపోయాడు. పురుగులు మందు తాగిన తర్వాత సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపాడు బుక్యాసాగర్. దీంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు సాగర్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధిత కానిస్టేబుల్. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
రంగారెడ్డి: తుపాకీతో కాల్చుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొంగరకలాన్లో విషాదం చోటుచేసుకుంది. కలెక్టరేట్ కార్యాలయంలోని గ్రౌండ్ఫ్లోర్లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మంచాల కాగా, 2018 బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వివాదాస్పదమైన ‘మధురానగర్ ఠాణా’ వ్యవహారం
సాక్షి, హైదరాబాద్: ‘చట్టం ముందు అంతా సమానులే... కొందరు మాత్రం ఎక్కువ సమానులు’ ఈ మాటను తరచూ వింటూనే ఉంటాం. ప్రస్తుతం నగర కమిషనరేట్లో మరో మాట జోరుగా వినిపిస్తోంది. అదే ‘పోలీసు విభాగం క్రమశిక్షణ కలిగిన ఫోర్స్... ఆ క్రమశిక్షణ కింది స్థాయి వారికే పరిమితం’. 👉పశ్చిమ మండల పరిధిలోని మధురానగర్ ఠాణాలో గత నెల 28న చోటు చేసుకున్న పరిణామం, దీనిపై అత్యున్నతాధికారి వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. దీనిపై కింది స్థాయి సిబ్బంది తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఉన్నతాధికారి–కానిస్టేబుల్ పరస్పరం దూషించుకుంటే కేవలం కింది స్థాయి సిబ్బంది పైనే చర్యలు తీసుకున్నా పోలీసు అధికారుల సంఘం పట్టించుకోకపోవడాన్ని తప్పు పడుతున్నారు. కొత్త కొత్వాల్ సీవీ ఆనంద్ మధురానగర్ ఠాణా కానిస్టేబుల్తో పాటు ఇలా అన్యాయమైన ఇతర సిబ్బంది, అధికారులకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారి విధులూ ఆయనే నిర్వర్తిస్తూ... వెస్ట్జోన్కు చెందిన ఓ ఉన్నతాధికారి ‘అన్ని హోదాల ఉద్యోగాలూ’ ఆయనే చేస్తున్నారనే ఆరోపణ ఉంది. ఇందులో భాగంగా మధురానగర్ పోలీస్ స్టేషన్లో గత నెలలో రోల్కాల్ నిర్వహించారు. సాధారణంగా ఇలాంటివి ఆ ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసర్గా (ఎస్హెచ్ఓ) ఉండే ఇన్స్పెక్టర్.. కీలక సందర్భాల్లో డివిజన్ ఏసీపీ నిర్వహిస్తుంటారు. దీనికి భిన్నంగా ఈ డ్యూటీ చేయడానికీ రంగంలోకి దిగిన ఉన్నతాధికారి ఆ రోజు ఉదయం 10.30 గంటలకు రోల్కాల్ అంటూ సిబ్బందికి ఉదయం 9.19 నిమిషాలకు సమాచారం పంపారు. నిర్దేశిత సమయానికి ఉన్నతాధికారి ఠాణాకు చేరుకున్నారు. అయితే డి.తిరుపాల్ నాయక్ అనే కానిస్టేబుల్ మాత్రం అనివార్య కారణాల వల్ల కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు ఉన్నతాధికారి ‘యూజ్ లెస్ ఫెలో... డ్యూటీ ఇలాగేనా చేసేది.. పోలీసు డ్యూటీ అనుకున్నావా..? గాడిదలు కాసే పని అనుకున్నావా..?’ అంటూ తనదైన పంథాలో ఊగిపోతూ దూషించారు. పేరుకు విచారణ... వేటు కానిస్టేబుల్ పైనే... ఈ వ్యవహారం అప్పటి అత్యున్నత అధికారి దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. అయితే ఈ విచారణ మొత్తం ఏకపక్షంగా జరిగిందని సిబ్బంది వాపోతున్నారు. తిరుపాల్ను మొదట ఉన్నతాధికారి దూషించారని, ఆ తర్వాతే తిరుపాల్ ఎదురు తిరిగాడని తెలిసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. కేవలం కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం మొత్తం తెలిసినప్పటికీ నగర పోలీసు అధికారుల సంఘం కూడా పట్టించుకోలేదు. కేవలం ఉన్నతాధికారులను అభినందించడానికి, అత్యున్నతాధికారికి బొకేలు ఇవ్వడానికే సంఘం నేతలు పరిమితం అయ్యారని విమర్శిస్తున్నారు. కనీసం కానిస్టేబుల్కు మద్దతుగా ఒక్క ప్రకటన కూడా చేయని సంఘం నేతల వ్యవహారశైలిని తప్పుపడుతున్నారు. ఈ వ్యవహారంపై కొత్త కమిషనర్ అయినా దృష్టి పెట్టాలని, కానిస్టేబుల్ తిరుపాల్తో పాటు ఇలా ఇబ్బందులు పాలైన అనేక మంది సిబ్బంది, అధికారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సంజాయిషీ ఇస్తున్నా పట్టించుకోకుండా... అప్పటి వరకు సాధారణ దుస్తుల్లో ఉన్న సదరు కానిస్టేబుల్ సంజాయిషీ ఇవ్వడానికి ప్రయతి్నంచినా ఆయన పట్టించుకోలేదు. దీంతో తిరుపాల్ నాయక్ స్టేషన్ గదిలోకి వెళ్లి యూనిఫాం వేసుకుని బయటకు వచ్చారు. అప్పటికే ఆ ఉన్నతాధికారి వ్యవహారశైలిపై అనేక విమర్శలు ఉన్నాయి. వెస్ట్జోన్లో కానిస్టేబుల్ నుంచి అదనపు డీసీపీ వరకు ఆయన పేరు చెప్తే హడలిపోతారు. ఈ పరిణామాలకు తోడు తీవ్ర ఆవేదనలో ఉన్న తిరుపాల్... ‘నువ్వే యూజ్లెస్ ఫెలోరా..! ఎన్ని మాటలు అంటావురా నన్ను... బయట పని చేస్తే ఇంత కంటే ఎక్కువ జీతం వస్తుందిరా.. నా భార్యకు డెలివరీ అయితే ఆమెను చూసుకుంటున్నారా. ఆమెను నేను కాకుంటే ఎవరు చూసుకుంటార్రా..? చెప్తే అర్థం చేసుకోకుండా దూషిస్తున్నావు’ అంటూ తిరిగి ఘాటుగా సమాధానం ఇచ్చారు. -
కానిస్టేబుల్ నిర్వాకం అడ్డంగా దొరికిపోయాడు
-
యువతితో షీటీమ్ వాహన డ్రైవర్ అసభ్య ప్రవర్తన
మూసాపేట: మహిళలకు రక్షణ కలి్పంచే షీటీమ్ వృత్తిలో ఉంటూ.. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఏఆర్ కానిస్టేబుల్, షీ టీమ్ డ్రైవర్పై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్లో ఉంటున్న 36 ఏళ్ల నర్సింగ్ బాలానగర్ షీటీమ్ కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి వివేకానందనగర్లోని బంధువు ఇంటికి దశదిన కర్మ కోసం నర్సింగ్ వెళ్లాడు. సెల్లార్లో మద్యం తాగుతూ అక్కడి బాత్రూంను ఉపయోగించుకున్నాడు. సెల్లార్లోనే ఇద్దరు యువతులు కిరాయికి ఉంటున్నారు. బాత్రూమ్ వాసన వస్తోందని సర్ఫ్ నీళ్లు చల్లడంతో నర్సింగ్ ఆ యువతులతో వాదనకు దిగాడు. మద్యం మత్తులో యువతిని చెంపపై కొట్టి, భుజంపై చేయి వేసి నెట్టి అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్ జిల్లా: రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య
వైఎస్సార్ జిల్లా: వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలు పట్టాలపై పడి ఏఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కమలాపురం పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైగా పని చేస్తున్న నాగార్జునరెడ్డిగా గుర్తించారు. నైట్ డ్యూటీ ముగించుకొని తెల్లవారుజామున వెళ్లి రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. కుటుంబకలహాలతో ఏఎస్సై నాగార్జున రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్యను కత్తితో పొడిచిన కానిస్టేబుల్
దొడ్డబళ్లాపురం: ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఓ పోలీస్ కానిస్టేబుల్ భార్యను హత్య చేసిన ఘోర సంఘటన హాసన్లో చోటుచేసుకుంది. హాసన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసే లోకనాథ్ తన భార్య మమతను కత్తితో పొడిచి హత్య చేసి పరారయ్యాడు. దంపతుల మధ్య గత నాలుగైదు రోజులుగా గొడవలు జరుగుతుండగా ఆదివారం ఉదయం మమత ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి ఎస్పీ కార్యాలయానికి వచ్చింది. దీంతో ఆగ్రహం పట్టలేని లోకనాథ్ భార్యపై కత్తితో దాడిచేసి ప్రాణాలు తీశాడు. 17 ఏళ్ల క్రితం హాసన్ శివారులోని చెన్నపట్టణ కాలసీ నివాసి అయిన మమతను కేఆర్పుర నివాసి లోకనాథ్ ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కట్నం కింద అరకేజీ బంగారం, రూ.50 లక్షలు నగదు ఇచ్చినా లోకనాథ్ తరచూ అదనపు కట్నం కోసం మమతను వేధించేవాడని, అయితే ఆమె కట్నం తీసుకురావడానికి నిరాకరించేదని అందుకే లోకనాథ్ ఈ హత్యకు పాల్పడ్డాడని మమత తల్లిదండ్రులు ఆరోపించారు. హాసన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎస్పీ ఆఫీసులోనే, పోలీసు హత్య చేయడంపై విమర్శలు వెల్లువత్తాయి. -
ఆల్ ఇండియా రైఫిల్ షూటింగ్కు ‘ఇందూరు’ రేఖారాణి
నిజామాబాద్, నాగారం/సాక్షి: ఆల్ ఇండియా పోలీస్ రైఫిల్ షూటింగ్ పోటీలకు ఇందూరు(నిజామాబాద్)వాసి ఎంపికైంది. నిజామాబాద్ నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రేఖారాణి (డబ్ల్యూ పీసీ 325) ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో రేఖారాణి రాణించారు. ఈనెల 15 నుంచి తమిళనాడులోని ఒతీవాకం ఫైరింగ్ రేంజ్లో నిర్వహించనున్న ఆలిండియా పోలీస్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో రాష్ట్ర పోలీస్ జట్టు తరఫున రేఖారాణి పాల్గొననున్నారు. 2002 లో ఉద్యోగంలో చేరిన రేఖారాణి.. ఫుట్బాల్, మాస్టర్ అథ్లెటిక్స్లో సైతం రాణించి పతకాలు సాధించారు. ఆమె ఎంపికపై పోలీసు యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. -
కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అండ
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. తెలంగాణ కోసం కిష్టయ్య ప్రాణత్యాగం చేసిన విషయం తెలిసిందే. పెద్దను కోల్పోయిన కుటుంబానికి నేనున్నానంటూ కేసీఆర్ ఆనాడే అండగా నిలిచారు. కిష్టయ్య మరణించిన నాటికి, ఆయన కొడుకు, కూతురు చిన్నపిల్లలు కావడంతో వారి చదువుతో సహా కుటుంబానికి వెన్నుదన్నుగా ఉన్నారు. కిష్టయ్య బిడ్డ ప్రియాంక ఎంబీబీఎస్ చేయడానికి అవసరమైన ఆర్థికసాయం కేసీఆర్ గతంలోనే అందించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ప్రియాంక ఇప్పుడు పీజీ చదువుతోంది. మెడికల్ కాలేజీలో కట్టాల్సిన ఫీజుకు అవసరమైన రూ.24 లక్షలను చెక్కురూపంలో ఆదివారం నందినగర్లోని తన నివాసంలో కిష్టయ్య కుటుంబానికి కేసీఆర్ అందించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కిష్టయ్య కొడుకు రాహుల్ చేస్తున్న ఉద్యోగం గురించి కేసీఆర్ ఆరా తీశారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. అమ్మకు కష్టం కలిగించొద్దు : కేసీఆర్ ‘రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేస్తూ నాయిన చనిపోయినప్పుడు మీరు చిన్నపిల్లలు. కష్టకాలంలో కూడా అమ్మ మిమ్ములను ఎంతో కష్టపడి సాదుకుంది..చదివించింది. ఇప్పుడు మీరు ప్రయోజకులయ్యారు. అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. మీకు ఏ సమయంలోనైనా నా సహకారం ఉంటుంది.’అని కేసీఆర్ వారికి భరోసా ఇస్తూ బాధ్యతలను గుర్తు చేశారు. నా కుటుంబానికి అండగా ఉన్న దేవుడు కేసీఆర్ :కిష్టయ్య భార్య పద్మావతి ‘నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి 10 సంవత్సరాలు పూర్తయ్యింది. నా భర్త పోలీస్ కిష్టయ్య దూరమై 15 సంవత్సరాలు గడిచాయి. ఆనాడు చిన్న పిల్లలను పట్టుకొని తండ్రిలాంటి కేసీఆర్ సార్ దగ్గరకు వచ్చాను. మీ కుటుంబానికి నేనున్నానని ఆనాడు కేసీఆర్ మాట ఇచ్చాడు. నువ్వు బాధపడకమ్మా... నీ పిల్లలను నేను చూసుకుంటా అని ఇచ్చిన మాట ప్రకారమే, మా పిల్లలు, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉన్నారు. 6వ తరగతి నుంచి ఇప్పటివరకు అన్ని విధాలా ఆసరా అందిస్తున్నారు’అని భావోద్వేగంతో కేసీఆర్ను దేవుడంటూ కొనియాడారు. -
పేదరికాన్ని జయించి.. ప్రభుత్వ కొలువులు సాధించి..
పేదరికం.. చదువుకు అడ్డుకాదని నిరూపించారు. విద్యే ఆయుధంగా చేసుకొని జీవితంపై పోరాడారు. చదువులు పూర్తయిన వెంటనే పోటీ పరీక్షలకు సిద్ధమై ముగ్గురు కూడా.. ఒకరి తర్వాత మరొకరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వారే హుస్నాబాద్ పట్టణానికి చెందిన రాజ్కుమార్, శ్వేత, శ్రీకాంత్. తండ్రి హమాలీ కారి్మకుడిగా పడిన కష్టానికి న్యాయం చేకూర్చారు. పట్టణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హుస్నాబాద్: పట్టణానికి చెందిన చేర్యాల మైసయ్య, స్వరూప దంపతులు. వీరికి రాజ్కుమార్, శ్వేత, శ్రీకాంత్ సంతానం. పెద్ద కుమారుడు రాజ్కుమార్ అక్కన్నపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నారు. కూతురు శ్వేత గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుంది. చిన్న కుమారుడు శ్రీకాంత్ నెల రోజుల క్రితం ఫైర్స్టేషన్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. కాల్ లెటర్ రాగానే జూలైలో ఫైర్ కానిస్టేబుల్గా శిక్షణ పొందనున్నాడు. తండ్రి మైసయ్య రోజు వారి హమాలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంటిని చక్కదిద్దుకుంటూనే సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని సంకలి్పంచారు. భవిష్యత్లో తన పిల్లలు ఉన్నతమైన స్ధానంలో ఉండాలని ఆకాంక్షించారు. కష్టాన్ని పంటి కింద భరిస్తూనే కూలీ పనులు చేస్తూ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించారు. అనంతరం ఉద్యోగులు సాధించాలని భావించాడు. తండ్రి కష్టాన్ని చూసిన వారు కూడా ఆయన నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. -
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
మంచిర్యాలక్రైం/నస్పూర్: తమ ఇద్దరు కుమారులకు ఈతనేర్పించేందుకు స్విమ్మింగ్ పూల్కు తీసుకెళ్లిన ఆ తండ్రి అదే స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ ఊపిరాడక కొడుకుల కళ్లెదుటే మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. నస్పూర్ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల మేరకు గద్దెరాగడికి చెందిన పంజాల సతీష్గౌడ్ (41) మంచిర్యాల పోలీస్ స్టేషన్లో బ్లూకోర్ట్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజులుగా తన ఇద్దరు కుమారులతో కలిసి సీసీసీలోని సింగరేణి స్విమ్మింగ్పూల్కు వెళ్తున్నాడు. ఆదివారం స్విమ్మింగ్ చేస్తుండగా అధిక రక్తపోటుకు గురికావడంతో నీటిలో మునిగిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి స్విమ్మర్లు, సిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు యశ్వంత్(12) వేయాన్(10) ఉన్నారు. స్పప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నివాళులర్పించిన డీసీపీ అశోక్ కుమార్ కానిస్టేబుల్ సతీష్ మృతిని జిల్లా పోలీస్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం రాత్రి తమతో కలిసి బ్లూకోర్ట్ పెట్రోలింగ్ విధుల్లో ఉత్సాహంగా పాల్గొన్న సతీష్ మృతి చెందిన వార్త తెలియగానే డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ ప్రకాశ్, ఎస్సైలు, సీఐలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం కొత్తగా ఇంటిని నిర్మించుకున్న సతీష్ ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం కూడా చేశాడు. కొత్త ఇంట్లోకి ప్రవేశించి ఏడాది కూడా పూర్తికాకముందే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో మృతుని కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. స్విమ్మింగ్ పూల్లో ఈతకొడుతూ కానిస్టేబుల్ మృతి నివాళులర్పించిన డీసీపీ అశోక్కుమార్ -
2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ వస్తే 22 నెలలుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ముఖ్యమంతి రేవంత్రెడ్డి అన్నారు. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. నూతనంగా నియమించబడిన పోలీసు కానిస్టేబుల్స్కు నియామక పత్రాలు జారీచేసే కార్యక్రమంలో రేవంత్రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘టీఎస్పీఎస్సీని ప్రక్షాలన చేశాం. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. ప్రజల సమస్యలను పరిష్కరిస్తుంది. రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది. బీఆర్ఎస్ పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగింది. పదేళ్లు అధికారంలో ఉంటూ.. ప్రజలు ఆమోదిస్తే మరో 10 ఏళ్లుగా అధికారంలో ఉంటాం. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేసీఆర్ రారు. కానీ.. నల్గొండలో సభకు మాత్రం కేసీఆర్ వెళ్లారు. .. అసెంబ్లీ రానివారికి అధికారం ఎందుకు? ఇంటికే నియామక పత్రాలు పంపొచ్చు కదా అని హరీశ్రావు అంటున్నారు. కేసీఆర్.. తన బంధువులకు అనే పదవులు కట్టబెట్టారు’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. -
ఏబీవీపీ కార్యకర్తను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన ఘటన.. కానిస్టేబుల్ సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యురాలైన మహిళా కానిస్టేబుల్ను సస్పెండ్ చేసింది. ఏబీవీపీ కార్యకర్తపై అమనుషంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ ఫాతిమాను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్లో ఉన్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల భూమిని రాష్ట్ర సర్కారు కొత్త హైకోర్టు నిర్మాణం కోసం కేటాయించిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ ఏబీవీపీ కొన్నిరోజులుగా వ్యవసాయ వర్సిటీ వద్ద ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. హైకోర్టుకు భూకేటాయింపు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 23న వర్సిటీలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనకు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ హాజరయ్యారు. ఆందోళన విషయం తెలిసిన రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని, నిరసన తెలుపుతున్నవారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఝాన్సీ పోలీసుల నుంచి తప్పించుకుని ముందుకు పరుగెత్తారు. స్కూటీపై వచ్చిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు.. ఝాన్సీ జుట్టుపట్టుకుని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కిందపడిపోయింది. చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు ఝాన్సీతోపాటు 15మంది ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకొని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కూడా స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించి.. ఘటనపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. యువతి ఆరోగ్య పరిస్థితి సహా పూర్తి వివరాలతో నాలుగు వారాల్లోగా నివేదిక అందించాలని సీఎస్, డీజీపీకి నోటీసులు ఇచ్చింది. -
విచారణకు వెళ్లిబాలికతో అసభ్య ప్రవర్తన
ఖలీల్వాడి (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మహేశ్పై పోక్సో కేసు నమోదైంది. కానిస్టేబుల్ మహేశ్ ఓ కేసు విషయమై నిందితుడికి సమన్లు అందించడానికి ఆదివారం నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామానికి వెళ్లాడు. ఇంట్లో నిందితుడు లేకపోవడంతో పక్కింట్లో ఉన్న బాలికతో మాట్లాడి నిందితుడి వివరాలను తెలుసుకున్నాడు. ఈ క్రమంలో బాలికతో మహేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రులు రాత్రి ఇంటికి వచ్చాక బాలిక వారికి విషయం చెప్పింది. దీంతో వారు సోమవారం ఉదయం రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ వ్యవహారాన్ని ఎస్సై మహేశ్ నిజామాబాద్ సౌత్ సీఐ వెంకటనారాయణకు వివరించారు. ఆయన సీపీ కల్మేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. సీపీ ఆదేశాల మేరకు పోలీసులు శుక్రవారం మహేశ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మహేశ్ గతంలో ఓ కేసు విషయంలో సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ ఎత్తేశాక మళ్లీ అదే స్టేషన్లో విధుల్లో కొనసాగుతున్నారు. పోక్సో కింద కేసు నమోదు కావడంతో సదరు కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు. -
నాన్నా.. ఉరేసుకుని చనిపోతున్నా..
పెన్పహాడ్: ‘నాన్నా.. బాధలు భరించలేకపోతున్నా.. అందుకే ఉరేసుకుని చనిపోతున్నా’అని తండ్రికి ఫోన్లో చెప్పి ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది. పెన్పహాడ్ మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన అర్రూరి జానకిరాములు, జానకమ్మ దంపతుల కుమారుడు సైదులు (41) 2009లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ఆయనకు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన పార్వతితో వివాహం జరిగింది. వీరికి హైదరాబాద్లో బీటెక్ సెకండియర్ చదువుతున్న సాయి భవన్, మహబూబ్నగర్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన సాయిపూజిత సంతానం. సైదులు ప్రస్తుతం సూర్యాపేటలో ఉద్యోగం చేస్తూ అక్కడే అంజనాపురి కాలనీలో భార్యతో కలసి ఉంటున్నాడు. పది రోజుల క్రితం గొడవ కొంతకాలంగా సైదులు కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం గొడవ తారస్థాయికి చేరడంతో పార్వతి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన సైదులు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో స్వగ్రామంలోని పొలంవద్దనుంచి తండ్రికి ఫోన్ చేసి ఉరేసుకుని చనిపోతున్నానని చెప్పాడు. జానకిరాములు ఉదయం గ్రామంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా చెట్టుకు ఉరేసుకుని వేలాడుతున్న కుమారుడు కనిపించాడు. సమీపంలోని రైతులు వచ్చి సైదులును కిందికి దించి చూడగా అప్పటికే మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ నాగేశ్వర్రావు, ఎస్ఐ వెంకన్నగౌడ్ ఇతర పోలీస్ సిబ్బంది పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. -
అబ్బాయిగా మారిన లేడి కానిస్టేబుల్.. తండ్రిగా ప్రమోషన్
మహారాష్ట్రకు చెందిన మహిళా కానిస్టేబుల్. ఎన్నో కష్టాలు పడి మగవాడిలా మారింది. కుటుంబాన్ని, సమాజాన్ని ఎదురించి పురుషుడిగా సర్జరీ చేయించుకుంది. తర్వాత కొన్నాళ్లకు ఓ యుతిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ జంట బిడ్డకు జన్మనివ్వడంతో.. కానిస్టేబుల్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. వివరాలు.. బీద్ జిల్లా రాజేగాన్ గ్రామానికి చెందిన లలితా సాల్వే(35) కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తోంది. 25 ఏళ్ల వయసులో (2013) తన శరీరంలో మార్పులు రావడాన్ని గమనించింది. ఆసుప్రతికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోగా.. ఆమెలో మగవారిలో ఉండే వై క్రోమోజోమ్లు ఉన్నట్లు తేలింది. (ఆడవారిలో రెండు ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి). జెండర్ డిస్ఫోరియాతో బాధపడుతున్న ఆమెకు లింగ మార్పిడి సర్జరీ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో లలితా సాల్వే 2017లో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. బాంబే హైకోర్టుతోపాటు 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతివ్వడంతో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. 2018 నుంచి 2020 వరకు మూడు సర్జరీల ద్వారా పురుషుడిగా మారింది. దీంతో లలితా నుంచి తన పేరును లలిత్ కుమార్ సాల్వేగా మార్చుకుంది. అనంతరం 2020లో ఛత్రపతి శంభాజీనగర్కు (ఔరంగాబాద్) చెందిన సీమాను పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. వివాహమైన నాలుగేళ్ల తర్వాత జనవరి 15న ఆ జంటకు బాబు పుట్టాడు. చదవండి: Video: అకస్మాత్తుగా కూలిన అయిదు అంతస్తుల భవనం లలిత్ సాల్వే మాట్లాడుతూ.. స్త్రీ నుంచి పురుషుడిగా మారిన తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అనేక పోరాటాలు చేసి చివరికి తన జెండర్ మార్చుకునట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. -
దిశ కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): భార్యను వేధిస్తున్న ఓ కానిస్టేబుల్పై చిలకలపూడి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. అతడిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ పి.జాషువా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల కథనం మేరకు.. దిశ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కోలా రవికిరణ్ 2018లో జరిగిన ఎలక్షన్ బందోబస్తు నిమిత్తం మండవల్లి వెళ్లాడు. అక్కడ వీఆర్ఏగా పనిచేస్తున్న పూజితవిమలాదేవితో అతడికి పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అప్పటికే వివాహం చేసుకున్న విమలాదేవి భర్తకు ఈ విషయం తెలిసి ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. దీంతో 2020లో విమలాదేవిని రవికిరణ్ వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజుల పాటు భార్యతో ప్రేమగా ఉన్న రవికిరణ్ ఆ తరువాత ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించటం మొదలుపెట్టాడు. వేధింపులు తట్టుకోలేని భార్య రవికిరణ్పై చిలకలపూడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దిశ పోలీస్స్టేషన్లో పనిచేస్తూ మహిళలకు రక్షణగా నిలవాల్సిన కానిస్టేబుల్ భార్యను వేధిస్తున్నాడని తెలుసుకున్న ఎస్పీ పి.జాషువా అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
కానిస్టేబుల్పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే
పుణె: మహారాష్ట్రకు చెందిన బీజేపీ శాసనసభ్యుడు సునిల్ కాంబ్లే విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్పై చేయి చేసుకున్నారు. శుక్రవారం పుణె కంటోన్మెంట్లోని సస్సూన్ జనరల్ ఆస్పత్రిలో ఓ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎమ్మెల్యే సునిల్ కాంబ్లే హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం మెట్లు దిగి వస్తున్న ఎమ్మెల్యే కాంబ్లేకి కానిస్టేబుల్ ఎదురయ్యారు. దీంతో, ఎమ్మెల్యే ఆగ్రహంతో కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. శనివారం బాధిత కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే కాంబ్లే ఘటనపై స్పందిస్తూ.. నేను ఎవరిపైనా దాడి చేయలేదు. మెట్లుదిగి వస్తుండగా అడ్డుగా వచ్చిన ఒక వ్యక్తిని పక్కకు తోసేసి, ముందుకు వెళ్లానంతే’అని చెప్పారు. -
కానిస్టేబుల్ సత్యకుమార్ కుటుంబానికి 30 లక్షల ఎక్స్ గ్రేషియా
-
కానిస్టేబుల్ కుటుంబానికి చెక్ అందించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: విధి నిర్వహణలో.. అనూహ్యంగా ప్రాణాలు పొగొట్టుకున్న ఏపీ కానిస్టేబుల్ సత్యకుమార్ కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. సత్యకుమార్ కుటుంబానికి స్వయంగా పరిహారం అందజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అంతేకాదు పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా సీఎం జగన్ అన్నారు. కానిస్టేబుల్ సత్య కుమార్ డిసెంబర్ 5వ తేదీన డ్యూటీకి వెళ్తుండగా.. కడప-చెన్నై జాతీయ రహదారిపై జరిగిన యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ విషయాన్ని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సత్యకుమార్ కుటుంబానికి సానుభూతి తెలియజేయడంతో పాటు ప్రభుత్వం తరఫు నుంచి ఎక్స్గ్రేషియాగా రూ.30 లక్షలను ప్రకటించారాయన. శుక్రవారం సాయంత్రం సీఎం క్యాంప్ కార్యాలయానికి సత్యకుమార్ కుటుంబ సభ్యుల్ని డీజీపీ తీసుకెళ్లి సీఎం జగన్ను కలిపించారు. సత్యకుమార్ భార్యా కొడుకుకి సీఎం జగన్ స్వయంగా చెక్ అందించారు. అంతేకాదు సత్యకుమార్ కొడుకు ప్రస్తుతం ఇంటర్ చదువుకున్నట్లు తెలియడంతో.. డిగ్రీ పూర్తైన వెంటనే అతనికి ప్రభుత్వం తరఫున ఉద్యోగం ఇప్పించాలని, అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పుడే జారీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సత్యకుమార్ది 2004 ఏపీఎస్పీ బ్యాచ్. డిసెంబర్ 5వ తేదీన భాకరాపేట సమీపంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. మిచాంగ్ తుఫాన్ బీభత్సంతో చెట్టు విరిగి బైక్పై వెళ్తున్న ఆయన మీద పడడంతో దుర్మరణం పాలయ్యారు. -
సీఐ రఘువీర్రెడ్డిపై చర్యలు తీసుకోండి
ఇబ్రహీంపట్నం రూరల్: ఎన్నికల విధుల్లో భాగంగా ఏఆర్ కానిస్టేబుల్ యాదగిరిపై లాఠీతో దాడిచేసిన ఆదిబట్ల సీఐ రఘువీర్రెడ్డిపై చర్యలు తీసుకొవాలని కోరుతూ అతడి తోటి ఏఆర్ కానిస్టేబుళ్లు గురువారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 30న జరిగిన మహేశ్వరం నియోజకవర్గంలోని పోలింగ్లో భాగంగా నాదర్గుల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములకు గన్మెన్గా ఉన్న యాదగిరిపై దాడి చేయడంతో పాటు అవమానపర్చిన ఆదిబట్ల సీఐ రఘువీర్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ, మానవ హక్కుల సంఘం, చీఫ్ ఎన్నికల అధికారులకు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్స్ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీసుల పరువు, ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న యాదగిరిపై అకారణంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. -
ఇక్కడ నీకేం పని.. కానిస్టేబుల్పై సీఐ లాఠీఛార్జ్
హైదరాబాద్: ఆదిభట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని నాదర్గుల్లోని పోలింగ్ కేంద్రం ఓ సీఐ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై లాఠీ ఝులిపించారు.మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ నాదర్గుల్లోని జిల్లా పరిషత్తు పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఏఆర్ కానిస్టేబుల్ యాదగిరి పోలింగ్ కేంద్రం బయట ఎదురుచూస్తున్నారు. పెట్రోలింగ్ వాహనంలో ఆదిభట్ల ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి అక్కడకు వచ్చారు. ఇన్స్పెక్టర్ను చూసిన కానిస్టేబుల్ సెల్యూట్ చేసేందుకు ప్రయత్నించారు.. అంతలోనే సీఐ 'ఇక్కడ నీకేం పని' అని ప్రశ్నిస్తూ కానిస్టేబుల్ను లాఠీతో కొట్టారు. దాంతో కానిస్టేబుల్ అక్కడి నుంచి పరుగులు తీశారు. -
భారతీయ యాసను వెక్కిరించిన కానిస్టేబుల్
లండన్: ఫిర్యాదు చేసేందుకు ఫోన్ చేసిన ఒక మహిళ భారతీయ యాసను వెక్కిరించిన పోలీస్ కానిస్టేబుల్ను బ్రిటన్ క్రమశిక్షణా ట్రిబ్యూనల్ విధుల నుంచి తప్పించింది. గత ఏడాది నవంబర్ 29వ తేదీ జరిగిన ఘటన తాలూకు కేసులో పోలీసు ప్యాట్రిక్ హ్యారిసన్ను దోషిగా తేలుస్తూ లండన్లోని ట్రిబ్యూనల్ తీర్పుచెప్పింది. గత నెలలో తీర్పువెలువగా వివరాలు తాజాగా బహిర్గతమయ్యాయి. వెస్ట్ యార్క్షైర్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేసే ప్యాట్రిక్ ఘటన జరిగిన రోజు లండన్లోని ఫోర్స్ కాల్సెంటర్లో విధుల్లో ఉన్నాడు. తనపై ఒకరు విద్వేష నేరానికి పాల్పడ్డారంటూ ఒక మహిళ ఈ కాల్సెంటర్కు ఫోన్చేసి ఫిర్యాదుచేసింది. ఫిర్యాదును పట్టించుకోకుండా ప్యాట్రిక్ ఆమె మాట్లాడే భారతీయ యాసను వెక్కిరించడం మొదలెట్టాడు. అసలది విద్వేష నేరమని ఎందుకు అనుకుంటున్నావ్? అని భారతీయ యాసను అనుకరిస్తూ వెటకారంగా మాట్లాడాడు. ఫోన్ కట్చేశాక ఆమె ఫిర్యాదుచేస్తుందేమోనని భయపడ్డాడు. ఆమెకు వేరే నంబర్ నుంచి ఫోన్ చేసి ఆమె ఏం అనుకుందోనని ఆరాతీశాడు. ప్యాట్రక్ చర్యతో విసిగిపోయిన ఆమె ‘టెల్ మామా’కు ఫిర్యాదుచేసింది. బ్రిటన్లో ముస్లింవ్యతిరేక ఘటనలపై ప్రభుత్వం ‘టెల్ మామా(ఎంఏఎంఏ–మెజరింగ్ యాంటీ ముస్లిం అటాక్స్) ప్రాజెక్ట కింద చర్యలు తీసుకుంటోంది. ఈ ఉదంతంలో ప్యాట్రిక్ వైఖరిని ట్రిబ్యూనల్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘15 ఏళ్లపాటు విధుల్లో ఉంటూ కూడా అధికారం, హోదాను మరిచి మహిళతో అనుచితంగా మాట్లాడాడు. ఈయన వైఖరితో ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం, విశ్వాసం తగ్గిపోతాయి. ఇది మొత్తం పోలీసు వ్యవస్థకే అప్రతిష్ట. జాతి వివక్ష, ఇస్లామోఫోబియా దేశవ్యాప్తంగా పోలీసుల్లో గూడుకట్టుకోవడం ఆందోళనకరం’’ అని ట్రిబ్యూనల్ ఆగ్రహం వ్యక్తంచేసింది. అతడిని విధుల నుంచి తప్పించింది. -
సీఐ హత్య కేసు.. కానిస్టేబుల్ దంపతులకు రిమాండ్
మహబూబ్నగర్ క్రైం: పోలీస్శాఖలో సంచలనం సృష్టించిన సీసీఎస్ సీఐ ఇఫ్తికార్ అహ్మద్ హత్య కేసులో ఇద్దరు నేరుస్తులను పోలీసులు రిమాండ్కు తరలించగా మరొకరు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ కార్యాలయంలో బుధవారం రాత్రి డీఎస్పీ టి.మహేష్ వెల్లడించారు. బోయ జగ దీష్, శకుంతల ఇద్దరూ 2009 బ్యాచ్కు చెందిన కానిస్టేబుళ్లు. వీరు 2011లో ప్రేమ వివాహం చేసుకోగా.. ఇద్దరు కుమారులు సంతానం. మొదట భార్యాభర్తలు ఇద్దరు అచ్చంపేటలో పనిచేశారు. ఆ తర్వాత మహబూబ్నగర్కు బదిలీ అయ్యారు. అయితే సీఐ ఇఫ్తికార్ అహ్మద్ 2018లో మహబూబ్నగర్ డీసీఆర్బీ సీఐగా ఉన్న సమయంలో శకుంతల మహిళా పోలీస్స్టేషన్లో కోర్టు విధులు నిర్వహిస్తుంది. ఆ సమయంలో ఇద్దరూ కేసుల వ్యవహారంలో తరచుగా కోర్టు దగ్గర కలవడం, రెగ్యులర్గా మాట్లాడుకోవడం, ఆ తర్వాత సీఐ నిత్యం ఆమెతో వాట్సాప్ చాట్, మెసేజ్లు చేశాడు. అక్కడి నుంచి మరికల్ సీఐగా వెళ్లిన తర్వాత కూడా తరచుగా మాట్లాడటం, చాట్ చేశాడు. ఈ విషయం భర్త జగదీష్కు తెలియడంతో అప్పటి మహబూబ్నగర్లో ఓ సీఐ దగ్గర కౌన్సెలింగ్ ఇప్పించి పేపర్ రాసుకోవడం జరిగింది. ఆ తర్వాత సీఐ మరికల్ నుంచి కొడ ంగల్కు బదిలీ కావడం, ఆ తర్వాత సస్పెండ్ కావడంతో కొన్ని రోజులు దూరంగా ఉన్నాడు. దాడి చేసి వార్నింగ్ ఇచ్చినా.. తీరు మారలే.. ఇఫ్తికార్ అహ్మద్ 2022 డిసెంబర్ 10న తిరిగి సీసీఎస్ సీఐగా మహబూబ్నగర్కు వచ్చాడు. ఈ క్రమంలో పాత పరిచయం మళ్లీ మొదలై.. కొత్త నంబర్స్తో చాట్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ భర్త 2023 మార్చి 8న ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో సీఐ ఇఫ్తికార్ అహ్మద్, శకుంతలను ఇలాంటి వ్యవహారం మానుకోవాలని హెచ్చరిండంతో పాటు సీఐపై దాడి చేసి వార్నింగ్ సైతం ఇచ్చాడు. ఈ విషయాన్ని మరో వ్యక్తితో సెల్ఫోన్లో వీడియో కూడా తీయించాడు. ఆ తర్వాత కూడా సీఐ ఇఫ్తికార్ అహ్మద్ తరచుగా ఎంవీఎస్ కళాశాల వైపు వెళ్లడం, శకుంతల వెళ్లే సమయంలో వెంట వెళ్లి మాట్లాడటం చేశాడు. అప్పటికే సీఐ ప్రవర్తనపై నిఘా పెట్టిన కానిస్టేబుల్ జగదీష్ 11 ఏళ్లుగా వాళ్ల ఇంట్లో పనిచేసే కృష్ణ అనే యువకుడికి సీఐ గురించి మొత్తం వివరాలు చెప్పి అతను ఆ రూట్లో తిరిగినా.. ఇంటికి వచ్చినా తనకు చెప్పాలని సూచించాడు. ఈ క్రమంలో ఈ నెల 1న రాత్రికి సీఐ మళ్లీ శకుంతలకు మెసేజ్ చేసి మీ ఆయన డ్యూటీలో ఉన్నాడని అతను డ్యూటీలో ఉన్న ఫొటో ఆమెకు పెట్టాడు. తాను వస్తానని చెప్పి రాత్రి 11.20 ప్రాంతంలో శకుంతల ఇంటికి వెళ్లాడు. సీఐ వచ్చిన విషయం గమనించిన కృష్ణ వెంటనే కానిస్టేబుల్ జగదీష్కు ఫోన్ చేసి సమాచారం చెప్పడంతో నైట్ డ్యూటీలో ఉన్న అతను రాత్రి 11.35 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే సీఐ ఇఫ్తికార్ అహ్మద్పై జగదీష్తో పాటు కృష్ణ దాడి చేసి మెడ, ముఖంపై తీవ్రంగా కొట్టి సీఐని అతని కారు మధ్య సీటులో వేశాడు. అప్పటికే కృష్ణకు ఇంటి నుంచి దూరంగా ఖాళీ స్థలం ఎక్కడ ఉందో చూసి రావాలని పంపించి ఇతను మళ్లీ రాత్రి 2 గంటల ప్రాంతంలో వన్టౌన్ చౌరస్తాకు వచ్చి డ్యూటీలో ఉన్నట్లు ఓ ఫొటో దిగి పోలీస్స్టేషన్ వాట్సాప్ పంపాడు. ► ఆ తర్వాత మళ్లీ ఇంటి దగ్గరకు వెళ్లగా అప్పటికే కృష్ణ కారును తీసుకువెళ్లి మర్లు పాలకొండ రూట్లో నిలిపాడు. తెల్లవారుజామున 3.36 గంటల ప్రాంతంలో జగదీష్ అక్కడికి చేరుకుని ఇఫ్తికార్ అహ్మద్పై బండరాయితో తలపై దాడి చేయడం, అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తితో శరీర భాగాలను కట్ చేశాడు. ఈ క్రమంలోనే సీఐ మర్మాంగం సైతం కొంత భాగం కట్ అయింది. ఆ తర్వాత కానిస్టేబుల్ జగదీష్ సీఐ ప్యాంట్ తీసి.. అతని చేతులకు ఉన్న రక్తం శుభ్రం చేసి ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో జగదీష్, కృష్ణ ఇద్దరూ నడుచుకుంటూ ఇంటికి వస్తున్న క్రమంలో కత్తి అక్కడే ఉన్న మురుగు కాల్వలో పడేశాడు. ఆ తర్వాత జగదీష్ ఒంటిపై ఉన్న దుస్తులు, ఇంట్లో రక్తం శుభ్రం చేసిన దుస్తులు తగలబెట్టాడు. అప్పటికే శకుంతల ఇంట్లో పడిన రక్తం నీటితో శుభ్రం చేయడంతో పాటు అక్కడే పడిపోయిన సీఐ టీషర్ట్ తీసి ఇంటిపై పారేసింది. ఈ విషయాన్ని శకుంతల ఆమె బంధువుకు ఫోన్ చేసి చెప్పగా.. సదరు వ్యక్తి వెంటనే ఉన్నతాధికారులకు చెప్పాలని సూచించడంతో ఆ తర్వాత శకుంతల పోలీసులకు ఫోన్ చేసి సీఐని తన భర్త కారులో బైపాస్ వైపు తీసుకువెళ్లాడని చెప్పింది. అప్పటికే తెల్లవారుజామున ఆ రోడ్డుపై వెళ్తున్న వాకర్ వంశీ అనే వ్యక్తి సమాచారం ఇవ్వడంతో రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సీఐని చికిత్స కోసం ఎస్వీఎస్కు, అక్కడి నుంచి హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ నెల 7న ఉదయం 11.13 గంటలకు మృతి చెందాడని డీఎస్పీ తెలిపారు. మొదట ఎఫ్ఐఆర్లో 307, 201 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశాడమని, సీఐ మృతి చెందిన తర్వాత 302, 201 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి ఏ1 జగదీష్, ఏ2 శకుంతలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఏ3 కృష్ణ పరారీలో ఉన్నాడని చెప్పారు. వారి నుంచి రెండు సెల్ఫోన్లు, హత్య చేయడానికి వాడిన బండరాయి, టీషర్ట్, రికవరీ చేసినట్లు వివరించారు. -
వివాహేతర సంబంధం.. సీఐపై కానిస్టేబుల్ దాడి!
సాక్షి, మహబూబ్ నగర్: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్, సీఐపై దాడికి పాల్పడ్డాడు. మర్మాంగాలు కొసేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి అతని భార్య, తోటి కానిస్టేబుళ్లు సైతం సాయం చేయడం గమనార్హం. మహబూబ్ నగర్ జిల్లా సీసీఎస్(సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్) సీఐ ఇఫ్తేకార్ హమ్మద్పై గురువారం ఉదయం హత్యాయత్నం జరిగింది. జిల్లా కేంద్రంలో పని చేసే కానిస్టేబుల్ జగదీష్, సీఐకి దాడికి పాల్పడ్డాడు. కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడిన సీఐని స్థానికులు జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. సీఐ పరిస్ధితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. తన భార్యతో సీఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణతోనే జగదీష్ ఈ దాడికి తెగబడినట్లు సమాచారం. ఘటనాస్థలానికి డీఐజీ చౌహన్, ఎస్పీ హర్షవర్ధన్ చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. సాయంత్రంకల్లా పూర్తి వివరాలు తెలియజేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
దేవుడి దయతో బయటపడ్డాం
రాయగడ: విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దేవుడి దయతో బయటపడ్డామని, అసలు బతుకుతామని అనుకోలేదని ప్రమాదం నుంచి బయటపడిన ఒక కుటుంబం పేర్కొంది. ఇప్పటికీ ప్రమాద సంఘటన తలుచుకుంటే నిద్ర పట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక పయికొవీధిలో నివాసముంటున్న ఒడిశా పోలీసు విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న దిలీప్ కుమార్ పాత్రో (41), అతని భార్య సుజాత స్వాయి (40), ఎనిమిదేళ్ల కూతురు సుదీక్ష పాత్రో, మేనకోడలు అనన్య గంతాయిత్ (7), అతని తల్లి సుక్షా కుమారి పాత్రోలు సరదాగా గడపడానికి శనివారం విశాఖపట్నం వెళ్లారు. అనంతరం ఆదివారం విశాఖపట్నం–రాయగడ ప్యాసింజర్ ట్రైన్కు తిరుగు ప్రయాణం కోసం రిజర్వేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో విశాఖ–రాయగడ ప్యాసింజర్ ట్రైన్లో బోగీ నంబర్ డీ–1లో తమకు కేటాయించిన బెర్తుల్లో కూర్చున్నారు. అంతలోనే ప్రమాదం ఎంతో సరదాగా రెండు రోజులు గడిపిన విషయాలను కుటుంబమంతా చర్చించుకుంటున్న సమయంలో, ట్రైన్ కంటకాపల్లి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా తాము కూర్చున్న బోగి ఎగిరిపడింది. సుమారు రెండు అడుగుల ఎత్తుకు ఎగరడంతో తామంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డామని దిలీప్ అన్నారు. తమ పిల్లలు పైబెర్తులో ఉండడంతో పైనుంచి కిందికి పడిపోయారు. లగేజీలు చెల్లాచెదురయ్యాయి. ఇంతలో తామ ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురయ్యిందని తెలుసుకున్నామని పాత్రో తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. చుట్టూ చీకటిమయం ప్రమాదం జరిగిన ప్రాంతమంతా చీకటిమయంగా ఉందని ఆయన తెలియజేశారు. బోగి మెయిన్ డోర్ కొద్దిగానే తెరిచి ఉంది. దీంతో అతికష్టం మీద అక్కడకు వెళ్లి చూసేసరికి ప్రయాణికులు పరుగులు తీస్తుండడం కనిపించింది. ఆర్తనాదాలు వినిపించాయి. అరగంట వ్యవధిలో సంఘటన స్థలానికి అంబులెన్స్ల సైరన్లు వినిపించాయి. దీంతో భయాందోళనకు గురైన తామంతా కష్టం మీద బోగి నుంచి కిందికు దిగి అరగంట సమయం రైలు ట్రాక్పై నడుచుకుంటూ అతికష్టం మీద కంటకాపల్లి రోడ్డుకు చేరుకున్నామన్నారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బస్సు రావడంతో అందరం ఎక్కి విజయనగరం చేరుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ఒక ట్యాక్సీ బుక్ చేసుకొని సుమారు రాత్రి మూడు గంటలకు రాయగడ చేరుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ తమ పిల్లలు ఆ భయం నుంచి బయటపడలేదని సుజాత స్వాయి అన్నారు. రైలు ప్రయాణం సురక్షితంగా భావిస్తున్నప్పటికీ, కొద్ది నెలలుగా తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాలను చూస్తే అసలు ప్రయాణించేందుకు ఇష్టపడడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
అరరే... ఎంత పనైపాయే!
ఉత్తర్ప్రదేశ్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రియాంక మిశ్రా ఊరకనే ఉండి ఉంటే వైరల్ అయ్యేది కాదు. సదరు కానిస్టేబుల్ ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి వైరల్ అయింది. ఈ రీల్లో ప్రియాంక మిశ్ర ‘కర్తవ్యం’ సినిమాలో విజయశాంతిని గుర్తు తెచ్చేలా ఓ లెవెల్లో నటించింది. సహజత్వం కోసం సర్వీస్ గన్ను ఉపయోగించి మరీ నటించింది. ఈ వీడియో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ‘చాల్లేండి సంబడం’ అంటూ ఆమెను సస్పెండ్ చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మళ్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయడానికి ప్రియాంక దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తు ఆమోదం పొందింది. ఆగ్రాలో పోస్టింగ్ కూడా ఇచ్చారు. అయితే 48 గంటల్లోనే ఆమె నియామకాన్ని పోలీస్ కమిషనర్ ప్రీతిందర్సింగ్ రద్దు చేశారు. ప్రియాంక మిశ్రాపై సోషల్ మీడియాలో సానుభూతి చూపుతున్నవారితో పాటు, సానుభూతి చూపుతూనే ‘స్వయంకృతాపరాధం’ అని విమర్శించిన వాళ్లు కూడా ఉన్నారు. -
50 దాటిన పోలీసులకు రిటైర్మెంట్.. యూపీ ప్రభుత్వ నిర్ణయం
పోలీసుల రిటైర్మెంట్ విషయంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్లు దాటిన పోలీసుల నిర్బంధ పదవీ విరమణ కోసం స్క్రీనింగ్కు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. 50 ఏళ్లు నిండిన పోలీసుల ట్రాక్ రికార్డును పరిశీలించి, తప్పనిసరి పదవీ విరమణ చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పోలీసుల జాబితాను నవంబర్ 30లోగా ఇవ్వాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2023, మార్చి 31 నాటికి 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సిబ్బందికి తప్పనిసరిగా పదవీ విరమణ కోసం స్క్రీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం తన ఆదేశాలలో పేర్కొంది. 50 ఏళ్లు పైబడిన పోలీసుల ట్రాక్ రికార్డును పరిశీలించిన తర్వాత, నిర్ణీత తేదీలోగా నిర్బంధ పదవీ విరమణ చేయాల్సిన పోలీసుల జాబితాను అధికారులు ప్రధాన కార్యాలయానికి పంపించనున్నారు. తమ సర్వీసులో అవినీతికి పాల్పడినట్లు లేదా చెడు ప్రవర్తన ఉన్నట్లు తేలితే అతనిని రిటైర్ చేయనున్నారు. పోలీసుల స్క్రీనింగ్లో వారి వార్షిక కాన్ఫిడెన్షియల్ రిపోర్టును పరిశీలించనున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరిచే లక్ష్యంతో యోగి ప్రభుత్వం పనిచేస్తోంది. కొన్ని రోజుల క్రితం పోలీసుశాఖలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేని అధికారులు, ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో సమర్థవంతులైన వారికి బాధ్యతలు అప్పగించాలని సీఎం యోగి ఆదేశించారు. ఇది కూడా చదవండి: గీతా ప్రెస్ ట్రస్టీ బైజ్నాథ్ అగర్వాల్ కన్నుమూత! -
పండుగ పూట విషాదం.. కానిస్టేబుల్ మృతి
మామునూరు: దసరా పండుగ సందర్భంగా ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ఓ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన టీఎస్ఎస్పీ ప్రాంగణంలోని విజయ దుర్గమ్మ గుడి వద్ద జరిగింది. రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్సై గూడెల్లి యాకయ్య, సుమతి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు రాజేష్ (32) మామునూరు టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్లో స్పెషల్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో దసరా సందర్భంగా టీఎస్ఎస్పీ ప్రాంగణంలోని విజయ దుర్గమ్మ గుడి వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం తెల్లవారు జామున బండలు జారీ కింద పడిపోయే క్రమంలో రాజేష్ అక్కడే ఉన్న జీరో బల్బు వైర్ను చేతితో అందుకున్నాడు. దీంతో షాక్కు గురై కేకలు వేశాడు. గమనించిన సిబ్బంది విద్యుత్ సరఫరాను నిలిపివేసే లోపు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో వెంటనే ఎంజీఎం తరలించారు. అక్కడ పరీక్షించగా రాజేష్ అప్పటికే మృతి చెందారని వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కమాండెంట్ శివప్రసాద్రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి ఎంజీఎం చేరుకుని మృతదేహన్ని సందర్శించి నివాళులర్పించారు. దీంతో రాయపర్తి మండలం మైలారం గ్రామం, టీఎస్ ఎస్పీ బెటాలియన్లో విషాదం అలుముకుంది. మృతుడి తండ్రి యాకయ్య, టీఎస్ఎస్పీ బెటాలియన్ అధికారుల ఫిర్యాదు మేకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణవేణి తెలిపారు. కాగా, మృతుడికి భార్య గౌతమి, కుమారుడు ఉన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు రాయపర్తి : మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గూడెల్లి రాజేష్ మామునూరులో టీఎస్ ఎస్పీ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్ర మంలో సోమవారం విద్యుత్షాక్కు గురై మృతిచెందాడు. ఈ సందర్భంగా బెటాలియన్ ఎస్పీతోపాటు పోలీసులు గ్రామానికి చేరుకుని అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి గ్రామానికి చేరుకుని రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. -
ప్రియురాలితో లాడ్జిలో దొరికిన కానిస్టేబుల్
గుంటూరు రూరల్: ఓ కానిస్టేబుల్ ప్రియురాలితో లాడ్జిలో ఉండగా అతడి భార్య రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. పనిచేస్తున్న స్టేషన్లోనే అతడిని ముద్దాయిగా నిలబెట్టింది. ఈ ఘటన గురువారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నల్లపాడు పోలీసుల కథనం ప్రకారం.. నాదెండ్ల గ్రామానికి చెందిన కత్తి శ్రీనివాసరావు నల్లపాడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన దివ్యతో అతనికి 2016లో పెళ్లయింది. వీరికి ఓ బాబు. ఇద్దరి మధ్యన వివాదాలు తలెత్తడంతో దివ్య పుట్టింటికి వెళ్లింది. దీంతో శ్రీనివాసరావు రెండు రోజలుగా నల్లపాడులోని యాపిల్ లాడ్జిలో రూం తీసుకుని తన ప్రియురాలితో కలిసి ఉంటున్నాడు. ఈ విషయం తెలిసిన దివ్య మీడియాను, పోలీసులను వెంట తీసుకుని ఆ లాడ్జికి వెళ్లింది. విషయం తెలిసిన శ్రీనివాసరావు ప్రియురాలితో కలిసి రూం తలుపులు తీయకుండా భీష్మించుకు కూర్చున్నాడు. సుమారు గంట తరువాత చేసేదిలేక తలుపులు తీయటంతో దివ్య అందరిముందే ఇద్దరికీ దేహశుద్ధి చేసింది. మీడియా, పోలీసుల ఎదుట భర్త రాసలీలల బండారం బయటపెట్టింది. అనంతరం నల్లపాడు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించి ఇద్దరూ మేజర్లే కావటంతో హెచ్చరించి వదిలివేశారు. ఇద్దరు మేజర్లు ఇష్టంతో కలిసి ఉండొచ్చని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు కానిస్టేబుల్ను వదిలివేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో దివ్య నాదెండ్ల పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ దుర్మరణం
నల్గొండ: బైక్ వెళ్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన అనుముల మండలంలోని పులిమామిడి స్టేజీ సమీపంలో నల్లగొండ–హాలియా రహదారిపై సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని సుదర్శనపురం గ్రామానికి చెందిన బుసిపాక మధు(30) కొంతకాలంగా నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఎస్పీఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల తన చెల్లెలు పెళ్లి పనుల కోసం నాలుగు రోజులు సెలవు పెట్టి మధు తన స్వగ్రామానికి వెళ్లాడు. తిరిగి విధుల్లో చేరేందుకు సోమవారం బైక్పై మధు నాగార్జునసాగర్కు వెళ్తుండగా మార్గమధ్యలో అనుముల మండలంలోని పులిమామిడి స్టేజీ వద్దకు రాగానే బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న హాలియా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నాగార్జునసాగర్లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుడి భార్య సుమలత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శోభన్బాబు తెలిపారు. -
మళ్లీ ప్రకటించండి
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి.. మార్కులను లెక్కించి, మళ్లీ ఫలితాలు వెల్లడించాలని రాష్ట్ర పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. 122, 130, 144వ నంబర్ ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని, 57వ ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని తొలగించాలని తేల్చిచెప్పింది. 2022, ఆగస్టు 30న జరిగిన కానిస్టేబుల్ నియామక తుది రాత పరీక్షలో 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు వినతిపత్రం సమర్పించినా ఎలాంటి బదులివ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్లు తెలిపారు. తప్పుగా రూపొందించిన ప్రశ్నలు, ఇచ్చిన తప్పు సమాధానాలను తొలగించాలని కోరడంతో పాటు తెలుగులోకి అనువదించని కొన్ని ప్రశ్నలను సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు రమేశ్ చిల్ల, ఎన్ఎస్ అర్జున్ వాదనలు వినిపించారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వు చేసిన న్యాయమూర్తి.. సోమవారం తీర్పు వెలువరించారు. ‘పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కోసం నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో 4 ప్రశ్నలను మినహాయించి, అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు ఇవ్వాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుని ఆదేశిస్తున్నాం. పేపర్లను మూల్యాంకనం చేసి, ఆ తర్వాత ఫలితాలను ప్రచురించి, తదుపరి నియామక ప్రక్రియ కొనసాగించాలి’అని తీర్పులో పేర్కొన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థుల్లోనూ గందరగోళం.... కానిస్టేబుల్ నియామక పరీక్షల తుది ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గత బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. 15,750 మంది పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. అయి తే తాజా తీర్పు మళ్లీ ఫలితాలు వెల్లడించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫలితాల్లో కానిస్టేబుల్గా ఎంపికైన అభ్యర్థుల్లో ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. నాలుగు మార్కులు కలిపి మళ్లీ ఫలితాలు వెల్లడిస్తే ఉద్యోగాలు ఉంటాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే గ్రూప్–1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దు కాగా, ఇప్పుడు కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు మళ్లీ వెల్లడించే అవకాశం రావడంతో నియామక బోర్డుల తీరుపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
TS: ఆ గ్రామం నుంచే కానిస్టేబుల్కు 17 మంది ఎంపిక
రంగారెడ్డి: ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీసుకానిస్టేబుల్ ఉద్యోగాల్లో మారుమూల ప్రాంత మైన మంచాల మండలం నుంచి 76 మంది ఉద్యోగాలు సాధించారు. వీరిలో చాలామంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఒక్క మంచాల గ్రామం నుంచే 17 మంది ఎంపిక కావడం విశేషం. ఆరుట్ల పంచాయతీ పరిధిలో 11 మంది ఉద్యో గాలు సాధించారు. అన్నదమ్ములు పృథ్వీధర్రెడ్డి, శరత్చంద్రారెడ్డిని సత్కరించిన కౌన్సిలర్ చల్లూరి మురళీధర్రెడ్డి ఆగాపల్లి నుంచి నలుగురు, బండలేమూర్ నుంచి నలుగురు, అజ్జిన తండా నుంచి ఇద్దరు, చెన్నారెడ్డిగూడ నుంచి ఇద్దరు, లోయపల్లి నుంచి నలుగురు, ఎల్లమ్మ తండా నుంచి ముగ్గురు, బోడకొండ నుంచి ఐదుగురు ఉన్నారు. సత్తి తండా నుంచి ఇద్దరు, కొర్రం తండా నుంచి ఇద్దరు, చీదేడ్ నుంచి ముగ్గురు, రంగాపూర్ నుంచి ముగ్గురు, వెంకటేశ్వర తండా నుంచి ఒకరు చొప్పున ఎంపికయ్యారు. లింగంపల్లి నుంచి ఒకరు, నోముల నుంచి ఇద్దరు, తిప్పాయిగూడ నుంచి ముగ్గురు, తాళ్లపల్లి గూడ నుంచి నలుగురు, చిత్తాపూర్ నుంచి ముగ్గురు చొప్పున ఉన్నారు. అన్నదమ్ముల ఎంపిక అబ్దుల్లాపూర్మెట్: పెద్దఅంబర్పేట పురపాలక సంఘం 9వ వార్డుకు చెందిన కర్తాల కృష్ణారెడ్డి, సుజాత దంపతుల ఇద్దరు కుమారులు పృథ్వీధర్రెడ్డి, శరత్ చంద్రారెడ్డి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. స్థానిక వార్డు కౌన్సిలర్ చల్లూరి మురళీధర్రెడ్డి శుక్రవారం వారిని అభినందించి సత్కరించారు. సంతోషంగా ఉంది మాది మధ్యతరగతి కుటు ంబం. కష్టపడి చదివాను. పోలీసు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. పట్టుదలతో మరింత కష్టపడి ఉద్యోగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాను. – చెనమోని సందీప్, మంచాల, ఏఆర్ కానిస్టేబుల్ కష్టానికి ఫలితం మాది నిరుపేద కుటుంబం.రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. కష్టపడి చదివాను. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను. చాలా ఆనందంగా ఉంది. – కుండె పల్లవి, మంచాల, సివిల్ కానిస్టేబుల్ -
కానిస్టేబుల్ చెంపచెల్లుమనిపించిన హోంమంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. సహనం కోల్పోయిన హోంమత్రి.. తన వ్యక్తిగత సహాయకుడు, గన్మెన్ అయిన కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించారు. మంత్రి తలసాని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతుండగా ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. అమీర్పేటల డీకే రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. నేడు మంత్రి తలసాని జన్మదినం సందర్భంగా మంత్రి మహమూద్ అలీ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమయంలో బోకే ఎక్కడ అంటూ తన సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు. అయితే బోకే గురించి తెలియదని సిబ్బంది చెప్పడంతో సహనం కోల్పోయిన హోంమంత్రి మహమూద్ అలీ కానిస్టేబుల్ను చెంప దెబ్బ కొట్టారు. దీంతో షాక్ అయిన సదరు గన్మెన్ మంత్రిని అలాగే చూస్తుండిపోయారు. ఆకస్మిక ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఈ క్రమంలో మంత్రి తలసాని.. మహమూద్ అలీకి సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. తరువాత వెనకాల ఉన్న వ్యక్తుల దగ్గరి నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహమూద్ అలీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోంమంత్రి అయినంత మాత్రాన సిబ్బందిపై ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Telangana Home Minister Mahamood Ali raises his hand on security for not bringing a bouquet to greet Minister Talasani Srinivas Yadav on his birthday pic.twitter.com/PDUFNcdUnP — Naveena (@TheNaveena) October 6, 2023 -
కడప రూరల్ సర్కిల్ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య
చింతకొమ్మదిన్నె/కడప అర్బన్ : చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్ పైభాగాన ఉన్న కడప రూరల్ సర్కిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విజయ్ రాముడు (39)(పీసీ నంబర్:2876) ఫ్యాన్కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య భానుశ్రీ ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. 2011 బ్యాచ్కు చెందిన విజయ్రాముడు జిల్లాలోని పలు పోలీ స్స్టేషన్లలో పనిచేశాడు. కడపలోని అక్కాయపల్లిలో నివాసం ఉండేవాడు. చెన్నూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ డిప్యుటేషన్పై కడప రూరల్ సర్కిల్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్లో పని చేస్తుండగా సస్పెన్షన్కు గురయ్యాడు. ఆ సమయంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాడు. తరువాత సస్పెన్షన్ ఎత్తివేయగా విధుల్లో చేరాడు. అంతేగాక అతని తండ్రి అయోధ్యరాముడు తాను సంపాదించిన స్థిరాస్థులను తన కుమారుడికి ఇవ్వకుండా, కుమార్తెలకే ఇచ్చాడు. తద్వారా కుటుంబంలో మనస్ఫర్థలు ఏర్పడి, తీవ్రమానసిక ఆవేదనకు గురయ్యాడు. ఇతనికి భార్య భానుశ్రీ, కుమారుడు హర్షిత్ ఉన్నారు. ఆర్థిక సమస్యలు, మానసిక వేదనతో ఈ చర్యకు పాల్పడ్డాడని మృతుని భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 23వ తేదీన శనివారం సాయంత్రం సెల్ఫోన్, పర్సు, తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అన్నీ ఇంట్లోనే ఉంచేసి విధులకు వెళ్లిపోయాడు. ఉదయం ఎంతసేపటికి ఇంటికి రాకపోవడం, సెల్ఫోన్ ఇంటిలోనే ఉంచి వెళ్లిపోవడంతో అతని భార్య హుటాహుటిన తన భర్త పనిచేస్తున్న కడప రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఓ మూలన ఉన్న గదిలో ఫ్యాన్కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి వేలాడుతున్నాడు. అతని భార్య బోరున విలపిస్తూ పోలీస్స్టేషన్ వారి సహకారంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని కడప రిమ్స్ మార్చురికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చింతకొమ్మదిన్నె ఎస్ఐ భూమా అరుణ్రెడ్డి తెలిపారు. -
లంచం తీసుకొని పట్టుబడిన పోలీసులు
బరంపురం: లంచం తీసుకున్న ఇద్దరు ఏఎస్ఐలు, ఒక కానిస్టేబుల్ను అరెస్టు చేసిన ఘట న శనివారం చోటుచేసుకుంది. బరంపురం ఎస్పీ సార్వణ్ వివేక్ తెలిపిన వివరాలు మే రకు.. గొళంతరా పోలీసుస్టేషన్ పరిధి హోల్ధియాపదర్ ఓవర్ బిడ్జి దగ్గర వారం రోజుల క్రితం రెండు పికప్ వ్యాన్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకు తరలిస్తున్న ఆవులను సరిహద్దు గిరిసిల చెక్పోస్టు వద్ద గొళంతరా పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. అయితే కేసు లేకుండా ఉండాలంటే రూ.50 వేల లంచం ఇవ్వాలని ఏఎస్ఐలు సంతోషిని సాహు, రోనలి పాణిగ్రహిలు వ్యాన్ డ్రైవర్ పి.నాగభూషణంకు డిమాండ్ చేశారు. దీంతో సంతో షిని సాహు బ్యాంక్ అకౌంట్కు తొలుత రూ.30 వేలు అనంతరం మరో రూ.10 వేలు పంపాడు. అయితే మరో రూ.10 వేలు ఇవ్వాల్సిందేనని ఏఎస్ఐలు ఒత్తిడి చేయడంతో వ్యాన్ డ్రైవర్ పి.నాగభూషణం ఎస్పీ సార్వణ్ వివేక్కి ఫిర్యాదు చేశాడు. ఎస్పీ పక్కాగా దర్యాప్తు చేసి సాక్ష్యాలు సేకరించి ఏఎస్ఐలు సంతోషిని సాహు, రోనలి పాణిగ్రహిలతో పాటు ఒక కానిస్టేబుల్ను అరెస్టు చేశారు. -
అదనపు కట్నం కోసం పోలీస్ అకృత్యాలు.. భార్యపై లాఠీచార్జీ
కర్ణాటక: పుట్టింటి నుంచి మరింత కట్నం తేవాలని వేధిస్తూ లాఠీతో కొడుతున్న పోలీసు కానిస్టేబుల్ ఉదంతమిది. వివరాలు.. బాధితురాలు సహన భర్త సునీల్ కుమార్ తుమకూరు ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. అరసికెరెకు చెందిన సహనకు ఏడాదిన్నర క్రితం సునీల్కుమార్తో పెద్దలు పెళ్లి చేశారు. 67 గ్రాముల బంగారం ఇచ్చి, అలాగే రూ. 18 లక్షలు ఇచ్చి అరసికెరె వీరశైవ కళ్యాణ మండపంలో ఘనంగా వివాహం చేశారు. పెళ్లయిన రెండు నెలల తర్వాత సహనకు బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసి బెంగళూరు నిమ్హాన్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంది. మరోవైపు అదనపు కట్నం కోసం సునీల్ కుమార్ వేధిస్తున్నాడు. ఇల్లు కట్టాలని, కారు కొనాలని, రూ. 20 లక్షలు తీసుకుని రావాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. అంతేకాక లాఠీతో తరచూ కొడుతున్నాడని విలపించింది. తుమకూరు ఎస్పీని కలిసి అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు తుమకూరు మహిళ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
వైఎస్ఆర్ సీపీ నేతలను లాఠీలతో కొట్టిన సెబ్ సిబ్బంది
-
టీడీపీ మూకల దాడిలో ఒక కంటి చూపు కోల్పోయిన రణధీర్
-
పోలీసులే ఫస్ట్ టార్గెట్!
సాక్షి, అమరావతి/ చిత్తూరు రూరల్/ నెట్వర్క్:‘చంద్రబాబు పర్యటన సజావుగా సాగేలా బందోబస్తు విధులు నిర్వహించడానికి మేం వచ్చాం. మా అధికారులు, సహోద్యోగులం అంతా బందోబస్తు విధుల్లో ఉన్నాం. ఇంతలో దూరం నుంచే టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మావైపు దూసుకువచ్చారు. అసలు వాళ్లు ఎందుకు అంత ఆగ్రహంతో వస్తున్నారో.. ఏం చేయడానికి వస్తున్నారో కూడా మాకు ఎవరికీ అర్థం కాలేదు. ఏమిటి విషయం అని మేము ఆలోచించే లోగానే వాళ్లు రాళ్లతో మాపై దాడులు చేయడం మొదలు పెట్టారు. పెద్ద పెద్ద రాళ్లు, కర్రలు, పదునైన వస్తువులు పోలీసులపై విసరడం మొదలు పెట్టడంతో అంతా గందరగోళంగా తయారైంది. నా ముందు ఉన్న డీఎస్పీ తలకు ఓ రాయి వచ్చి తగలడంతో రక్తం బొటబొటా కారింది. మా ఎస్.ఐ మేడంపై రాళ్లు, కర్రలు విసరడంతో ఆమె గాయపడ్డారు. ఇంతలోనే నా తల వెనుక భాగాన ఓ రాయి గట్టిగా తగిలింది. కానీ నేను హెల్మెట్ ధరించి ఉండటంతో ఏమీ కాలేదు. తలతిప్పి వెనక్కు చూశాను. నా హెల్మెట్ గ్రిల్స్ మధ్య ఉన్న ఖాళీ నుంచి ఒక రాయి దూసుకొచ్చి బలంగా కంటిపై తగిలింది. దాంతో అమ్మా అని గట్టిగా అరచి నేను కుప్పకూలిపోయాను. రాళ్ల దెబ్బలతో నా ముఖం మొత్తం రక్తసిక్తం అయ్యింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. మా వాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత పరీక్షించిన వైద్యులు ఒక కంటికి చూపు పోయిందని చెప్పారు. మరో కంటి చూపు కూడా కోల్పోవచ్చని డాక్టర్లు అంటున్నారు’ అని కానిస్టేబుల్ రణధీర్ ఆవేదనగా చెప్పుకొచ్చారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా శుక్రవారం టీడీపీ కుట్ర పూరితంగా ముందస్తు పన్నాగంతో పోలీసులపై జరిపిన దాడికి ప్రత్యక్ష సాక్షి అయిన రణధీర్ ఆ సంఘటనను కళ్లకు కట్టినట్టుగా చిత్తూరులో మంగళవారం మీడియాకు వివరించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు టీడీపీ నేతలు ఎంత కుట్రపూరితంగా వ్యవహరించారన్నది ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ముందస్తు కుట్రే.. రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలో ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో టీడీపీ ఆందోళనలో కూరుకుపోయింది. దాంతో ఆయన పర్యటనలకు లేని ఇమేజ్ తీసుకు వచ్చేందుకు అల్లర్ల కుట్రకు పథక రచన చేసింది. ఇందులో భాగంగా పుంగనూరు వద్ద భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా రౌడీ మూకలను ముందుగానే తెప్పించారు. పుంగనూరు బైపాస్ నుంచి వెళ్లేందుకు ముందుగా టీడీపీ నేతలు అనుమతి కోరితే పోలీసులు సమ్మతించారు. అందుకే బైపాస్ రోడ్డులో తగిన పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కానీ పోలీసుల అనుమతికి విరుద్ధంగా పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబు ప్రవేశించేటట్టుగా చేయాలని టీడీపీ నేతలు భావించారు. అలా పుంగనూరు పట్టణంలో పర్యటన సందర్భంగా భారీ ఎత్తున అల్లర్లు సృష్టించాలన్నది వారి పన్నాగం. ముందస్తు అనుమతికి విరుద్ధంగా పుంగనూరు పట్టణంలోకి చంద్రబాబు పర్యటనను పోలీసులు అనుమతించకపోతే బైపాస్ రోడ్డు వద్దే విధ్వంసకాండ సృష్టించాలని కూడా ప్లాన్ బి రెడీ చేసుకున్నారు. అందుకోసమే భారీ సంఖ్యలో అల్లరి మూకలను బైపాస్ రోడ్డు వద్ద ముందుగానే మోహరించారు. కాగా చంద్రబాబు కాన్వాయ్ ఇక పుంగనూరు బైపాస్కు సమీపిస్తుందనగానే టీడీపీ రౌడీలు రంగంలోకి దిగారు. బందోబస్తు విధుల కోసం అక్కడ ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందిపై హఠాత్తుగా రాళ్లతో దాడి చేశారు. సాధారణంగా పోలీసులు అనుమతి లేకుండా మోహరించిన వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో కొంత వాగ్వాదం, తోపులాటల అనంతరం పరిస్థితి అదుపు తప్పితే కొందరు పోలీసులకు ఎదురుదిరిగే అవకాశం ఉంటుంది. కానీ పుంగనూరులో అందుకు విరుద్ధంగా టీడీపీ మూకలు కుట్రపూరితంగా పోలీసులపై మూకుమ్మడి దాడికి తెగించడం గమనార్హం. శాంతియుతంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులపై ఒక్కసారిగా రెండు వేల మందికి పైగా ఉన్న టీడీపీ అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయి. పోలీసుల నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే.. కవ్వింపు చర్యలు లేకుండానే.. టీడీపీ గూండాలు పోలీసులపై భారీ ఎత్తున రాళ్లదాడికి తెగబడి బీభత్సం సృష్టించారు. ఈ పచ్చ మూకల దాడిలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. కానిస్టేబుల్ రణధీర్ కంటి చూపు కోల్పోవడం బాధాకరం. రణధీర్కు అండగా ప్రభుత్వం టీడీపీ గూండాల దాడిలో గాయపడిన కానిస్టేబుల్ రణధీర్కు ప్రభుత్వం పూర్తి అండగా నిలిచింది. ‘సాక్షి’ దినపత్రికలో మంగళవారం ‘ఈ దారుణానికి బాధ్యులెవరు?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందిస్తూ బాధిత కానిస్టేబుల్ రణధీర్కు ప్రభుత్వం రూ.10 లక్షల సాయం ప్రకటించింది. ఆయనకు మినిస్టీరియల్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. రణధీర్కే కాదు యావత్ పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేసింది. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, శాసనసభలో ప్రభుత్వ విప్ జి. శ్రీకాంత్రెడ్డి తదితరులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ గూండాలు అంతగా బరితెగించి పోలీసులపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి చిత్తూరులో మంగళవారం పర్యటించారు. కానిస్టేబుల్ రణధీర్ను పరామర్శించారు. మెరుగైన వైద్యంతో పాటు అతని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రణధీర్ కుటుంబానికి అండగా ఉంటాం పుంగనూరు రాళ్ల దాడిలో గాయపడ్డ రణధీర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చిత్తూరు ఎస్పీ రిషాంత్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన చిత్తూరు పోలీసు అతిథి గృహంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, కలెక్టర్ సగిలి షణ్మోహన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. అల్లరి మూకల దాడిలో ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ రణధీర్ ఒక కంటి చూపు పొగొట్టుకున్నారని, మరో కన్ను కూడా చూపును కోల్పోవచ్చని వైద్యులు చెప్పారన్నారు. దాతల సాయంతో అతనికి మళ్లీ కంటి చూపు తెప్పించే ప్రయత్నం చేస్తామన్నారు. రణధీర్కు కంటి చూపు పోవడంపై కొందరు విష ప్రచారం చేస్తుండటం తగదన్నారు. అల్లరి మూకలను కట్టడి చేయడంలో పోలీసులు చక్కగా విధులు నిర్వర్తించారని కొనియాడారు. పోలీసు శాఖ నిత్యం నిష్పక్షపాతంగా పనిచేస్తూ శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం పని చేస్తోందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వ సాయం మరువలేను ఆ రోజు జరిగిన ఘటన ఇంకా నా మదిలో తిరుగుతూనే ఉంది. ఆస్పత్రిలో చేర్చిన మరుసటి రోజు డాక్టర్ వచ్చి ‘నల్లగుడ్డు, తెల్ల గుడ్డు చెదిరిపోయింది. నీకు ఒక కన్ను జీవితాంతం కనబడదు’ అని చెప్పగానే కాళ్ల కింద భూకంపం వచ్చినట్టు అయ్యింది. మా అమ్మా నాన్నకు ఏం చెప్పాలో తెలియలేదు. కట్టుకున్న భార్యకి చెప్పే ధైర్యం ఉన్నా.. ఆరో తరగతి, రెండో తరగతి చదువే నా పిల్లలకు ఏం చెప్పాలని తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నా. కన్ను పోయిన నాకు పోలీసు ఉద్యోగం ఉంటాదో ఊడతాదో తెలియలేదు. ఆ సమయంలో చాలా భయమేసింది. నా బాధను ‘సాక్షి’ పత్రిక తప్ప మరే పేపర్ రాయలేదు. నేను పోలీసుని. రాజకీయ కార్యకర్తను కాదు. నాకు జరిగిన అన్యాయం ఎందుకు రాయలేదో కూడా నాకు తెలియదు. కానీ ఈరోజు సీఎం జగన్ సార్ నా గురించి ఆరా తీసి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు ప్రకటించారు. నా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసులో మినిస్టీరియల్ స్టాఫ్గా ఉద్యోగం ఇస్తామన్నారు. రాష్ట్ర మొత్తం నాకు అండగా నిలబడిందని సంతోషంగా ఉండాది. ఇది చాలు. – రణధీర్, కంటి చూపు కోల్పోయిన కానిస్టేబుల్ దాడులు చేయించింది బాబే పుంగనూరులో దాడులు చేయించింది టీడీపీ అధినేత చంద్రబాబే. బాబుకు కుట్ర రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య. పుంగనూరులో ఆయనలోని టెర్రరిజాన్ని చూపించాడు. రాష్ట్రంలో మరిన్ని అల్లర్లకు వ్యూహాలు రచిస్తున్నారు. పుంగనూరు దాడులపై చంద్రబాబుపై ఏ–1గా కేసు నమోదు చేయాలి. – నారాయణస్వామి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబుపై రౌడీషీట్ తెరవాలి పుంగనూరులో హింసాత్మక ఘటనకు సూత్రధారి చంద్రబాబే. ఆయనపై రౌడీషీట్ తెరవాలి. పుంగనూరులో టీడీపీ వాళ్లు రెక్కీ నిర్వహించి, ఎవరెవరు ఏ విధంగా దాడులు జరపాలో స్కెచ్ వేసుకున్నారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంతకు ముందెన్నడూ జరగని దుర్మార్గమైన దాడి ఇది. ఈ దాడిలో పోలీసులను చంపాలనుకోవడం దుర్మార్గం. 40 మందికి పైగా పోలీసుల రక్తం కళ్ల చూశారు. సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నందున చంద్రబాబును ఉపేక్షించకూడదు. – గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీడీపీ నేతలూ.. బాబును నమ్మొద్దు పుంగనూరులో హింసకు ప్రధాన కారకుడు ప్రతిపక్షనేత చంద్రబాబే. ఈ కేసులో ఆయన్ను ఏ–1గా చేర్చి రౌడీషీట్ తెరవాలి. ప్రాజెక్టుల యాత్ర పేరిట చంద్రబాబు.. టీడీపీ గూండాలు, రౌడీలతో ప్రజలపై దండయాత్ర చేస్తున్నారు. అల్లర్లు సృష్టిస్తే పోలీసులు కాల్పులు జరుపుతారని, ఆ కాల్పుల్లో టీడీపీ కార్యకర్తలు చనిపోతే రాజకీయంగా వాడుకోవాలన్నది చంద్రబాబు పన్నాగం. ఇలాంటి వ్యక్తి కోసం టీడీపీ కార్యకర్తలు బలికావద్దు. బాబును నమ్మకండి. కందుకూరులో ఇరుకు సందులో మీటింగ్ పెట్టి 8 మంది చనిపోవడానికి కారకుడైన బాబు గురించి ఎవరికి తెలియదు? – గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ 72 మందికి రిమాండ్ పరారీలో కీలక సూత్రధారి చల్లా బాబు పుంగనూరు (చిత్తూరు జిల్లా): పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల దాడి ఘటనలో 72 మంది నిందితులను సోమవారం రాత్రి కడప సెంట్రల్ జైలుకు తరలిస్తూ అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి సింధు ఉత్తర్వులు జారీ చేశారు. పలమనేరు డీఎస్పీ సుధాకర్రెడ్డి, పుంగనూరు సీఐ అశోక్కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి అయిన నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయన పీఏ గోవర్ధన్రెడ్డి పోలీసులకు చిక్కాడు. పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని అతడు తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీకి చెందిన చిత్తూరు, పలమనేరు, పుంగనూరుకు చెందిన న్యాయవాదులు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపిన సెక్షన్లు నిందితులకు వర్తించవని కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీపీ రామకృష్ణ సాక్ష్యాధారాలను కోర్టుముందు ఉంచి, సుదీర్ఘంగా వివరించారు. దీంతో న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ 72 మంది నిందితులను రిమాండ్కు తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారిని సోమవారం అర్ధరాత్రి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, పుంగనూరులో పోలీసులపై టీడీపీ శ్రేణుల దాడికి నిరసనగా మంగళవారం విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు అక్కరమాని రోహిణి, కెల్లా సునీత, గేదెల లావణ్య, మువ్వ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలోని కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో పురోగతి
-
వైజాగ్ కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: కానిస్టేబుల్ రమేష్ మర్డర్ కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తెరపైకి కొత్త వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరో కాదు శివాని పెద్దమ్మ కూతురు పైడమ్మ.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. పైడమ్మే.. రామారావుతో కలవడానికి కారణమని పోలీసులకు శివాని తెలిపింది. ఫోన్ కాల్ డేటా పరిశీలించిన ఎంవీపీ పోలీసులు.. వందల సార్లు కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. పైడమ్మ, శివాని, రామారావు ముగ్గురం కలిసే బయటకు వెళ్లే వాళ్లమని శివాని చెప్పింది. పైడమ్మాను ఏ4గా చేర్చే అవకాశం ఉంది. తనకు అసలు సంబంధం లేదంటున్నా శివాని అక్క పైడమ్మా.. కావాలనే ఇరికిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. శివాని.. రామారావు ఒక ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి పరిచయం చేసిందని పైడమ్మా తెలిపింది. కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడినట్లు నిర్థారించిన పోలీసులు. పైడమ్మను విచారిస్తున్నారు. ఆమె ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంవీపీ పోలీసుల అదుపులోనే A1 భార్య శివాని, A2 ప్రియుడు రామారావు, A3 నీలా ఉన్నారు. వారిని రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. చదవండి: తహసీల్దార్ వేధింపులు... మహిళా ఉద్యోగి ఆత్మహత్య కాగా, వన్టౌన్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ మృతి విషయంలో తొలి నుంచి అనుమానిస్తున్నదే జరిగింది. శివజ్యోతి అలియాస్ శివానీయే ఆమె ప్రియుడితో కలిసి తన భర్త రమేష్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. 2009 బ్యాచ్కు చెందిన బర్రి రమేష్(35) ఆదర్శనగర్లో ఉంటూ వన్టౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్పై విగతజీవిగా ఉన్న రమేష్ ను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. తొలి నుంచి శివానీది నేర స్వభావమే.. రమేష్ భార్య శివానీది తొలి నుంచి నేర స్వభావమే అని సీపీ తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఆమె పలుమార్లు గొడవ పడినట్లు చెప్పారు. ప్రియుడి విషయంలో భార్యను పలుమార్లు రమేష్ మందలించాడని వెల్లడించారు. ఆమె తీరు కారణంగా విసిగిపోయి ఒక దశలో ఇద్దరు కుమార్తెలను తన వద్ద వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని కూడా ఆమెకు చెప్పాడన్నారు. అయితే పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనే ఉద్దేశంతో శివాని రమేష్ హత్యకు కుట్ర పన్నింది. ఈ హత్యలో సహకారానికి శివానీ, ప్రియుడు రామారావు అతని స్నేహితుడు నీలాకు రూ.లక్ష సుపారి కూడా ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. -
రమేష్ హత్య కేసును చేధించిన పోలీసులు.. సినిమాను మించిన ట్విస్ట్!
సాక్షి, విశాఖపట్నం: వన్టౌన్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ బర్రి రమేష్ మృతికేసును పోలీసులు చేధించారు. రమేష్ మృతి కేసులో అతడి భార్య శివజ్యోతి అలియాస్ శివానినే హంతకురాలిగా పోలీసులు తేల్చారు. ప్రియుడి మోజులో పడి శివాని.. రమేష్ను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు విశాఖ నగర కమిషనర్ త్రివిక్రమ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో సీపీ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కానిస్టేబుల్ రమేష్ను అతడి భార్య శివాని హత్య చేయించింది. మూడు రోజుల క్రితం రమేష్ అనుమానాస్పదంగా మృతిచెందాడని శివాని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రమేష్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో డెడ్బాడీని పోస్టుమార్టంకు పంపించాం. రిపోర్టులో రమేష్.. ఊపిరాడక చనిపోయినట్టు తేలింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో లోతుగా విచారణ చేపట్టాం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా భార్య శివానినే ప్రియుడి కోసం భర్త రమేష్ను చంపించింది. మూడు రోజుల క్రితం రమేష్తో మద్యం తాగించి వీడియో తీసింది. ఆ తర్వాత రమేష్ పడుకునే వరకు ప్రియుడు రామారావు బయటే ఉన్నాడు. అనంతరం, ఇంట్లోకి వెళ్లిన రామారావు, అతడి స్నేహితుడు రమేష్ను దిండుతో నొక్కి చంపాడు. ఆ సమయంలో రమేష్ కాళ్లు కదలకుండా భార్య శివానీ అతడిని పట్టుకుంది. కాగా, రమేష్ను చంపేందుకు నీలా అనే వ్యక్తికి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చారు. అయితే.. రమేష్, శివానీ ప్రేమ వ్యవహారంపై గతంలో అనేక గొడవలు జరిగాయి. పిల్లల్ని వదిలి ప్రియుడితో వెళ్లిపోవాలని రమేష్ కోరాడు. కాగా, తమ వ్యవహారానికి రమేష్ అడ్డుగా ఉన్నారని వారిని చంపేశారు. ఇక, శివాని.. రామారావుకు బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర ఇచ్చింది. శివానికి నేర స్వభావం ఉంది. ఆమె తల్లిదండ్రులతో సైతం గొడవలు ఉన్నాయి. ఈ కేసులో ఏ1గా భార్య శివాని, ఏ2గా ప్రియుడు రామారావు, ఏ3గా నీలాను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: యువతిని రూమ్కు తీసుకెళ్లి.. కూల్డ్రింక్లో మద్యం కలిపి ఫొటోలు.. ఆపై.. -
కానిస్టేబుల్ భార్య పైశాచికం.. ప్రియుడి మోజులో పడి, ఇంటికి పిలిచి..
ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): వన్టౌన్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రియుడితో కలిసి భార్యే అతన్ని హత్య చేసినట్లు తెలిసింది. 2009 బ్యాచ్కు చెందిన బర్రి రమేష్ (35) ఆదర్శనగర్లో ఉంటూ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బెడ్పై విగతజీవిగా ఉన్న రమేష్ను పరిశీలించారు. అనంతరం భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య బుధవారం పోలీసులకు తెలిపింది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా.. రమేష్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. అతని అన్నయ్య బర్రి అప్పలరాజు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆ దిశగా ప్రారంభమైన పోలీసుల విచారణలో అవాక్కయ్యే వాస్తవాలు వెలుగుచూసినట్లు సమాచారం. ప్రియుడిపై మోజుతో కానిస్టేబుల్ రమేష్ భార్య శివజ్యోతి అలియాస్ శివాని.. భర్త హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిసింది. టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్న రామారావు అనే వ్యక్తితో ఆమెకు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రమేష్ను అడ్డు తొలగించుకునే క్రమంలో హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం రాత్రి రమేష్ మద్యం తాగి పడుకున్న సమయంలో హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రియుడితో కలిసి తలగడతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపినట్లు ప్రచారం జరుగుతోంది. భర్త బెడ్పై గిలగిల కొట్టుకుంటుప్పుడు భార్య శివాని సెల్ఫోన్లో తీసిన వీడియో పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. అయితే ఆ వీడియో ఎందుకు తీసింది? హత్యకు దారి తీసిన పరిణామాలు ఏంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఆమె వద్ద లభించిన వీడియోలో దృశ్యాలు నేపథ్యంలో అతనిని తలగడతో నొక్కి చంపి ఉంటారా? లేదా విష ప్రయోగం చేశారా అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఆమె ప్రియుడు రామారావును, గురువారం ఆమెను ఎంవీపీ పోలీసులు పూర్తిస్థాయిలో విచారించినట్లు సమాచారం. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు పోలీసులు అందుబాటులోకి రాలేదు. దర్యాప్తు పట్ల పూర్తి గోప్యత పాటిస్తున్నారు. వీరు వెల్లడించిన వివరాలతో పాటు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు మరింత లోతైన విచారణ చేపట్టి.. అనంతరం ఈ కేసు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత
-
అప్పు చేసి నా భార్యను చదివించా.. జాబ్లో చేరగానే అసలు కథ మొదలు
లక్నో: ప్రభుత్వం ఉద్యోగం చేయాలనే కొందరు కలల కంటారు. ఈ జాబితాలో ఆడపిల్లలు ఉండగా.. వాళ్లకు పెళ్లి కాగానే వారి కలలు కలలుగానే మిగిలిపోతుంటాయి. అయితే ఇటీవల ట్రెండ్ మారుతోంది. భర్తలు భార్యలను అర్థం చేసుకుంటూ వాళ్ల లక్ష్యాలను చేరుకోవడంలో సహాయం చేస్తున్నారు. అయితే... కొందరు దీన్ని పూర్తిగా మిస్ యూస్ చేస్తున్నారు. ఉద్యోగంలో చేరగానే.. తమ కలల కోసం కష్టపడిన భర్తలకు షాక్కిస్తూ ఇతరులతో వివాహతర సంబంధం పెట్టుకుంటున్నారు. ఇటీవల ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా, యూపీలోని ఉన్నావ్ లో కూడా ఇలాంటి ఘటన వెలుగులోనికి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ఎస్డీఎం జ్యోతి మౌర్య స్టోరీ గుర్తుందా. సరిగ్గా అలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్లో ఒకటి వెలుగు చూసింది. భౌనిఖేడా గ్రామానికి చెందిన విజయపాల్ సింగ్, బెల్సి గ్రామానికి చెందిన ఛాయా సింగ్ను 2010లో వివాహం చేసుకున్నాడు. అయితే ఛాయా సింగ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కనేది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త భర్త విజయపాల్ సింగ్ ముందుకు వచ్చాడు. తన కుటుంబం నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, అతను తన భార్య కలను తనదిగా భావించాడు. ఉన్నావ్ నగరంలో మంచి కోచింగ్ సెంటర్లో కూడా చేర్పించాడు. మధ్య తరగతి కుటుంబం కావడంతో అతను కష్టపడి ప్రతి పైసా కూడబెట్టి ఆమెను చదివించాడు. చివరకు ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరుకగా.. ఆమె 2016లో మహిళా కానిస్టేబుల్గా నియమితులైంది. శిక్షణ సమయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదని భర్త రూ.50 వేలు అప్పు తీసుకుని భార్యకు ఇచ్చాడు. చివరికి బారాబంకి జిల్లాలో కానిస్టేబుల్గా విధుల్లో కూడా చేరింది. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. జాబ్లో చేరగానే ఆమె మరొకడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఇంట్లో తెలిసేసరికి ప్రియుడితో పెళ్లి సిద్ధమైంది. ఆమె భర్త తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 16న ప్రియుడితో తన భార్య నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని..తన భార్యపై చర్యలు తీసుకోవాలని బాధితుడు విజయ్పాల్ ఎస్పీ ఉన్నావ్కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై దృష్టి సారించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు. చదవండి ఉచితంగా టమాటాలు.. ఆటోవాలా సరికొత్త ఆఫర్.. కానీ.. -
అక్కా నేను చూసుకుంటా.. ఏడ్చిన పిల్లాడు ఎంచక్కా నవ్వాడు
ఇంట్లో చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో ఒక మహిళ తన ఆరునెలల పిల్లాడిని ఎత్తుకొని అహ్మదాబాద్(గుజరాత్)లోని పరీక్షాకేంద్రానికి వచ్చింది. ఇంకొద్దిసేపట్లో పరీక్ష ప్రారంభం అవుతుందనగా పిల్లాడు ఏడుపు లంకించుకున్నాడు. ఎంతకీ ఏడుపు ఆపడం లేదు. ‘వెనక్కి తిరిగి పోవాలా? పరీక్ష రాయాలా?’ అనే డైలామాలో ఉన్నప్పుడు ‘నేనున్నాను’ అంటూ సీన్లోకి వచ్చింది కానిస్టేబుల్ దయాబెన్. ‘అక్కా, నేను పిల్లాడిని చూసుకుంటాను. నువ్వెళ్లి హాయిగా పరీక్ష రాయ్’ అని చెప్పింది. ఆ పిల్లాడి తల్లి దయాబెన్కు థ్యాంక్స్ చెప్పి ఎగ్జామ్హాల్లోకి వెళ్లింది. దయాబెన్ తన హావభావాలతో పిల్లాడిని ఏడుపు నుంచి నవ్వుల్లోకి జంప్ చేయించింది. ‘నన్ను నవ్వించినందుకు థ్యాంక్స్’ అని పిల్లాడు దయాబెన్ కళ్లలోకి చూస్తూ చెబుతున్నట్లుగా ఉన్న ఫొటోలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. కానిస్టేబుల్ దయాబెన్ దయాగుణాన్ని నెటిజనులు వేనోళ్ల పొగిడారు. -
తోడి కోడళ్ల సిగపట్లు.. మధ్యలోకి వెళ్లిన మామ, చిన్నకోడలు కాలితో తన్నడంతో
ఆగ్రా: అత్తింటిలో దీపం పెట్టడానికి వచ్చిన తోడి కోడళ్ళు పందెం కోళ్లలా గొడవపడుతుంటే విడదీసే ప్రయత్నంలో మామగారు చిన్న కోడలి తల నరికేశాడు. అనంతరం ఆగ్రా జిల్లాలోని కిరావాలి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. హంతకుడి చిన్నకొడుకు, మృతురాలి భర్త ఫరూఖాబాద్లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన రఘువీర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఆగ్రాలోని మాలిక్ పూర్ గ్రామంలో నివాసముండే రఘువీర్ (62)కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు చనిపోగా అతని భార్య తమతోనే ఉంటోందని.. ఆమెతో చిన్న కోడలు ప్రియాంక సింగ్ (28) తరచూ గొడవపడుతూ ఉండేదని చెప్పాడు. వారిని కలిసి ఉండాలని ఎంత చెప్పినా వినేవారు కాదని పోలీసులకు తెలిపాడు రఘువీర్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఇద్దరి కోడళ్ల మధ్య వాగ్వాదం చెలరేగిందని, ఇద్దరూ సిగపట్లు పట్టుకున్నారని.. విడదీసేందుకు మధ్యలోకి వెళ్లిన రఘువీర్ ను ప్రియాంక కాలితో తన్నగా.. దూరాన పడిన మామగారు కోపోద్రిక్తుడై గొడ్డలి అందిపుచ్చుకుని చిన్న కోడలి మెడ మీద వేటు వేశాడని.. దాంతో ఆమె తల మొండెం రెండూ వేరై అక్కడికక్కడే చనిపోయిందని తెలిపారు. మృతురాలు ప్రియాంక సింగ్ తండ్రి ఫిర్యాదు ప్రకారం తండ్రీ, కొడుకులు ఇద్దరి పైనా కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇది కూడా చదవండి: 5 గంటల్లో రూ.40.. కర్ణాటక ఆటో డ్రైవర్ల దయనీయ స్థితి.. -
పోలీస్ నకిలీ ఐడీ కార్డుతో.. ముగ్గురి వ్యక్తులతో ప్రేమాయణం
హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ అంటూ ఏకంగా నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం కేంద్రంగా ఓ యువతి అనేక మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేసింది. అంతేకాకుండా ముగ్గురిని ప్రేమించి పెళ్లి చేసుకుని వారితో బలవంతంగా చోరీలు చేయిస్తోంది. ఈ మాయలేడీని టాస్క్ఫోర్స్ పోలీసులు లంగర్హౌస్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్హౌస్లో నివాసం ఉండే అశ్విని ఇంటర్ వరకు చదువుకుంది. జల్సాలకు అలవాటు పడిన ఈ యువతి తన పేరును అశ్వినిరెడ్డిగా మార్చుకోని తాను హైదరాబాద్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తున్నట్లు ఫేక్ ఐడీ కార్డును తయారు చేసింది. అనంతరం ఈసీఐఎల్లో నివాసముండే రోహిత్కిషోర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఒక కూతురు, కుమారుడు సంతానం. నాలుగేళ్ల తర్వాత మరో యువకుడు రోహిత్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. మొదటి భర్తను చంపాలని ప్రయత్నం చేసింది. డబ్బుల కోసం ఈ ఇద్దరినీ చోరీలు చేయాల్సిందిగా బలవంతపెట్టసాగింది. ఈ క్రమంలో చోరీలకు పాల్పడి రోహిత్ జైలు పాలయ్యాడు. ప్రస్తుతం అశ్విని మెహిదీపట్నంలో నివా సం ఉంటూ అభిషేక్తో సహజీవనం కొనసాగింది. పోలీస్ కమిషనర్ కార్యాలయం కేంద్రంగా.. పోలీసు నకిలీ ఐడీ కార్డును తయారు చేయించిన అశ్విని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అనేక మంది వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసింది. దీనికి రాపిడో ఎంచుకోని ఆ వాహనంపై ప్రయాణిస్తూ యువకులను వలలో వేసుకుంది. వారి వాహనంపై బషీర్బాగ్లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్దకు వెళ్లేది అక్కడ ఆ యువకులను బయట ఉంచి లోపలికి వెళ్లేది. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి పని పూర్తయియిందని లేదా సార్ బయటకు వెళ్లాడని చెబుతూ వచ్చేది. ఒక్కొక్కరికి వద్ద వేలాది రూపాయలు వసూలు చేసిన ఈ కిలేడీ చివరకు టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కింది. తనకు పెళ్లి కాలేదని అశ్విని మోసం చేసిందంటూ అభిషేక్ కొద్ది రోజుల క్రితం పోలీసుల సమక్షంలో చెప్పి వెళ్లిపోయాడు. ప్రస్తుతం తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తనతో ఉండట్లేదు అంటూ అశ్విని అతనిపై ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడం గమనార్హం. -
అనారోగ్యం తట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మహత్య
రంగారెడ్డి: అనారోగ్యం తట్టుకోలేక ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలివీ.. మండల పరిధిలోని గడ్డమల్లయ్యగూడకు చెందిన ఆర్ల బుచ్చయ్య, మణెమ్మ దంపతుల కుమా రుడు వినోద్కుమార్(25) మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తు న్నాడు. గత కొన్ని నెలలుగా సోరియాసిస్ వ్యాధి బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన వినోద్కుమార్ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గడ్డమల్లయ్యగూడలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికందివచ్చిన కొడుకు ఆసరా అయ్యే సమయానికే ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
TS: ఎస్సై, కానిస్టేబుల్ తుది రాతపరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ నియామక తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాత పరీక్షల్లో 84 శాతం మంది అర్హత సాధించినట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్పోర్టు, ఎక్సైజ్ పోస్టులకు 98,218 మంది, కానిస్టేబుల్ ఐటీ అండ్ కమ్యునికేషన్కు 4,564మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. సివిల్ ఎస్సై 43,708 మంది, ఐటీ అండ్ కమ్యునికేషన్ ఎస్సై పోస్టులకు 729 మంది, డ్రైవర్, ఆపరేటర్ కానిస్టేబుల్ పోస్టులకు 1,779 మంది, ఫింగర్ ఫ్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు 1,153 మంది, పోలీస్ ట్రాన్స్పోర్టు ఎస్సై పోస్టులకు 463 మంది, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్కు 283 మంది ఎంపికయినట్టు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి అభ్యర్ధులు సాధించిన మర్కుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లు వెబ్ సైట్లో తమ వ్యక్తిగత లాగిన్లో చూసుకోవచ్చని పేర్కొంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 2 వేలు, ఇతర కమ్యూనిటీలు, నాన్ లోకల్ అభ్యర్థులు రూ. 3 వేలు చెల్లించి రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవచ్చని సూచించారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ జూన్ 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు.. -
కానిస్టేబుల్కు సివిల్స్లో 667 ర్యాంకు..
ఢిల్లీ: ఢిల్లీ పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న రామ్భజన్ కుమార్ సివిల్స్లో 667వ ర్యాంకు సాధించి, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆయన వయసు 34 ఏళ్లు. ఎనిమిదో ప్రయత్నంలో ర్యాంకు సాధించడం గమనార్హం. ప్రస్తుతం సైబర్ సెల్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్స్ ఫలితాలు వెలువడిన తర్వాత రామ్భజన్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులు, సీనియర్ అధికారులు ఆయనను అభినందించారు. ఓబీసీ కేటగిరీకి చెందిన రామ్భజన్కు తొమ్మిది సార్లు సివిల్స్ రాసేందుకు అనుమతి ఉంది. ఎట్టకేలకు ర్యాంకు సాధించడం ద్వారా తన కల నెరవేర్చుకున్నానని ఆయన చెప్పారు. ఒకవేళ ఈసారి విఫలమైనా తొమ్మిదోసారి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇప్పటిదాకా ఏడు ప్రయత్నాలు సఫలం కాకపోయినా నిరాశ పడలేదని అన్నారు. తన భార్య అందించిన అండదండలతో ముందుకు సాగానని వివరించారు. తాను రాజస్తాన్ నుంచి వచ్చానని, అక్కడ తన తండ్రి కూలీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. కష్టాల్లోనే పుట్టి పెరిగానని పేర్కొన్నారు. అంకితభావం, కఠోర శ్రమ, సహనంతో అనుకున్న లక్ష్యం సాధించడం సులువేనని సూచించారు. కానిస్టేబుల్గా పనిచేస్తూ 2019లో యూపీఎస్సీ పరీక్షలో ర్యాంకు సాధించిన ఫిరోజ్ ఆలం తనకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. రామ్భజన్ 2009లో పోలీసు శాఖలో కానిస్టేబుల్గా చేరారు. ఇది కూడా చదవండి: సివిల్స్లో నారీ భేరి -
వెనుక నుంచి ఫాలో అవుతూ.. బ్యూటీ పార్లర్లో వధువుపై కాల్పులు జరిపిన పోలీస్!
పాట్నా: మేకప్ కోసం బ్యూటీ పార్లర్కు వెళ్లిన ఓ వధువుపై కానిస్టేబుల్ తుపాకీతో కాల్పులు జరిపాడు. పార్లర్ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ దారుణ ఘటన బీహార్లోని ముంగేర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తారాపూర్ డయారాలోని మహేశ్పూర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల అపూర్వ కుమారికి ఇటీవల ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి రోజు దగ్గర పడడంతో ఆమె మేకప్ కోసం బ్యూటీ పార్లర్కు వెళ్లింది. అయితే ఓ వ్యక్తి రహస్యంగా ఆమెను ఫాలో అవుతూ బ్యూటీ పార్లర్కు చేరుకున్నాడు. యువతి మేకప్ వేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా వెనుక నుంచి ఓ వ్యక్తి పిస్టల్తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక బుల్లెట్ కుమారి భుజం నుంచి దూసుకెళ్లి ఛాతీ నుంచి బయటకు వచ్చింది. కుమారిపై కాల్పులు అనంతరం.. కానిస్టేబుల్ ఆ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, భయంతో పిస్టల్ అతని చేతిలో నుంచి జారిపోవడంతో అతను అలా చేయలేకపోయాడు.పార్లర్ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇదంతా బ్యూటీపార్లర్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. గాయపడిన యువతిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమెదు చేసుకుని ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. ‘నిందితుడు పాట్నాలో పోలీస్ కానిస్టేబుల్గా పని చేస్తున్నట్లు గుర్తించాం. అతను మహేశ్పూర్ గ్రామానికి చెందినవాడు, అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించాం. త్వరలో అరెస్టు చేస్తామని’ డీఎస్పీ తెలిపారు. వధువుకి, అతనికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు కాల్పులు జరిపాడు? అన్న ప్రశ్నలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు. చదవండి: ప్రేమ పెళ్లి.. భర్తకు షాకిచ్చిన స్కూల్ టీచర్ భార్య, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్తో కలిసి... -
పోలీసుల నీచ బుద్ధి.. యువతిపై ఇద్దరు కానిస్టేబుళ్ల అత్యాచారం
లక్నో: ఉత్తర ప్రదేశ్లో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. న్యాయం కోసం వచ్చిన వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే నీచానికి పాల్పడ్డారు. చట్టాన్ని కాపాడల్సిన వారే వక్ర బుద్ధి చూపించారు. 23 ఓ ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం షమ్లీ జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. వివరాలు.. ఇమ్రాన్ మీర్జా అనే వ్యక్తి పిలిభిత్ జిల్లాలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2021 మార్చిలో ఫేస్బుక్ ద్వారా యువతి పరిచయమైంది. వీరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు హోటళ్లకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం షమ్లీలో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఆమెకు వసతి కల్పించాడు. అయితే అక్కడ నివసించే సమయంలో మీర్జా సోదరుడు ఫుర్కాన్(కానిస్టేబుల్) కూడా తనపై అత్యాచారం చేశాడని యువతి ఆరోపించింది. ఇద్దరు సోదరులైన కానిస్టేబుళ్లు తనను రోజుల తరబడి నిర్భంధంలో ఉంచి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాక రెండుసార్లు గర్భవతి కాగా.. బలవంతంగా అబార్షన్ చేయించినట్లు ఆరోపించింది. ఈ విషయాన్ని బయటికి చెప్పేందుకు ప్రయత్నించగా.. ఇమ్రాన్ తనను దారుణంగా కొట్టారని తెలిపింది. దీంతో రెండేళ్ల నుంచి వారి అరాచకాలు భరిస్తూ మైనంగా ఉన్నట్లు చెప్పింది. ఇటీవల కామాంధుడి వేధింపులు ఎక్కువయ్యాయని, తరుచూ తనపై చేయిచేసుకున్నట్లు తెలపింది. ఈ క్రమంలోనే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకొని.. కేసు నమోదు చేసినట్లు పేర్కొంది.. అయితే ఇప్పుడు కూడా కేసును ఉపసంహరించుకోవాలని ఇమ్రా,న్ అతని సోదరుడు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వాపోయింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పిలిభిత్ ఎస్పీ అతుల్ శర్మ తెలిపారు. ఇద్దరు కానిస్టేబుళ్లు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చదవండి: రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్ దుర్మరణం..