‘పోలీస్‌’ పరీక్షలో 7 మార్కులు కలపడంపై హర్షం  BC Leader R Krishnaiah Appreciated High Court Verdict Over Police Exam Marks | Sakshi
Sakshi News home page

‘పోలీస్‌’ పరీక్షలో 7 మార్కులు కలపడంపై హర్షం 

Published Sat, Dec 10 2022 2:17 AM

BC Leader R Krishnaiah Appreciated High Court Verdict Over Police Exam Marks - Sakshi

ముషీరాబాద్‌ (హైదరాబాద్‌): ఇటీవల జరిగిన పోలీస్‌ కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమ్స్‌ పరీక్షలో అభ్యర్థులకు 7 మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య హర్షం వ్యక్తంచేశారు. ఇది పోలీస్‌ కానిస్టేబుళ్ల, ఎస్సై అభ్యర్థుల పోరాట ఫలితమేనని స్పష్టంచేశారు. మల్టిపుల్‌లోని 7 తప్పుడు ప్రశ్నలకు 7 మార్కులు కలపాలని హైకోర్టు జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.

దీంతో పలు కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు విద్యానగర్‌లోని బీసీ భవన్‌ వద్ద సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 6 లక్షల మంది రాసిన ఈ పరీక్షలో కేవలం 1,84,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారని, 4 లక్షల మందికి పైగా అర్హత సాధించలేకపోయారని తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, మాసం ప్రదీప్, రాజ్‌కుమార్, నీలం వెంకటేశ్, చందన, రాజా, సునీత, దివ్య, రాజమల్లేశ్, శివ, కల్యాణ్, సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement