breaking news
Hyderabad
-
నేడు పరేడ్గ్రౌండ్స్లో ‘హైదరాబాద్ లిబరేషన్ డే’
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో బుధవారం ‘హైదరాబాద్ లిబరేషన్ డే’జరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 8.55 గంటలకు పరేడ్ గ్రౌండ్కు ఆయన చేరుకుంటారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. సీఆర్పీఎఫ్, ఇతర బలగాలు నిర్వహించే పరేడ్ను వీక్షిస్తారు. పారామిలటరీ దళాల ప్రత్యేక పరేడ్ కూడా ఉంటుంది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక (పూర్వ హైదరాబాద్ స్టేట్)లకు చెందిన సాంస్కృతిక బృందాల ప్రదర్శన, థీమ్ ఆధారిత బ్యాలె, దేశభక్తితో కూడిన ప్రదర్శనలు ఉంటాయి. ఈ సందర్భంగా సభికులను ఉద్ధేశించి రాజ్నాథ్సింగ్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గజేంద్ర చౌహాన్, జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక జూబ్లీ బస్టాండ్కు సమీపంలోని కంటోన్మెంట్ పార్క్లో ఏర్పాటు చేసిన భారతరత్న, మాజీ ప్రధాని ఏబీ వాజ్పేయి విగ్రహాన్ని రాజ్నాథ్సింగ్ ఆవిష్కరి స్తారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళతారు. హైదరాబాద్ లిబరేషన్డేను పురస్కరించుకొని ఉదయం 6.30 గంటలకు అసెంబ్లీ వద్దనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అంజలి ఘటిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. -
నిజాం రాజు.. తలొగ్గిన రోజు
సాక్షి, హైదరాబాద్ : అదిగో సుశిక్షితులైన సైనికుల కవాతు.. వినీలాకాశంలో సమున్నతంగా రెపరెపలాడిన త్రివర్ణ పతాక దృశ్యం అదిగో.. హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన భారత సైనికులకు నీరాజనాలు పలుకుతున్న జనుల జయజయ ధ్వానాలవిగో.. 1948 సెప్టెంబరు 17న భాగ్యనగరంలో కనువిందు చేసిన దృశ్యం ఇది. నిజాం నిరంకుశ, రాచరిక పాలనకు చరమగీతం పాడిన రోజు ఇది. రజాకారుల అకృత్యాలతో నలిగిపోయిన ప్రజలు ఈ రో జు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఆనందోత్సాహాలతో వేడుకలు చేసుకున్నారు. భారత యూనియన్ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ విజయవంతమై నిజాం నిరంకుశ పాలన అంతమైన ఆ రోజుపై భిన్నాభిప్రాయాలు, విభిన్న దృక్పథాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ సంస్థానం సువిశాలమైన భారత యూనియన్లో భాగమైంది. ఒక నవ శకం ప్రారంభమైంది. ఆ రోజు ఏం జరిగిందంటే.. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిణామాలు వేగంగా జరిగాయి. భారత సైన్యం అన్ని వైపుల నుంచి నగరానికి చేరువైంది. హైదరాబాద్ ప్రధాని లియాఖత్ ఉదయమే తన పదవికి రాజీనామా చేశారు. ఓటమి అనివార్యమని నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్కు తెలిసిపోయింది. కేఎం మున్షీని కింగ్కోఠికి పిలిపించాడు. ‘పోలీసు చర్యను ఆహ్వానిస్తూ భద్రతా సమితికి ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని’ మున్షీ సూచించారు. ఈ మేరకు రేడియోలో ప్రసంగించాలని కోరారు. అందుకు నిజాం అంగీకరించాడు. కానీ.. అప్పటి వరకు రేడియోలో ప్రసంగించిన అనుభవం లేని నిజాం నవాబు దక్కన్ రేడియో స్టేషన్కు వెళ్లి తన లొంగుబాటును ప్రకటించాడు. అదే రోజు నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్, భారత సైనిక బలగాల కమాండర్ జేఎన్ చౌధురి ఒక నిర్ణీత ప్రదేశంలో కలుసుకున్నారు. ‘బేషరతుగా లొంగిపోతున్నట్లు’ ఇద్రూస్ ప్రకటించాడు. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. చౌధురి జట్కా బండి నగరంలోకి పరుగులు తీసింది. జనం జేజేలు.. నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు ఉదయం నుంచే వార్తలు వెలువడ్డాయి. అప్పటి వరకు ఏ క్షణంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో గడిపిన నగరవాసులు.. నెమ్మదిగా వీధుల్లోకి వచ్చారు. సికింద్రాబాద్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. భారత సైనికులకు స్వాగతం పలుకుతూ జేజేలు పలికారు. వేలాదిగా తరలి వచ్చిన జనంతో పరేడ్ గ్రౌండ్స్ జనసంద్రమైంది. త్రివర్ణ పతాకలు రెపరెపలాడాయి. ‘మహాత్మా గాందీకి జై’, పండిట్ నెహ్రూ జిందాబాద్, సర్దార్ పటేల్ జిందాబాద్, భారత్మాతాకీ జై’ అంటూ జనం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘రజాకార్ ముర్దాబాద్’ అనే నినాదాలు ప్రతిధ్వనించాయి. బొల్లారం నుంచి భారత సైనిక బలగాలు పరేడ్ గ్రౌండ్స్కు చేరుకున్నాయి. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాచరిక పాలన 1948 సెప్టెంబరు 17వ తేదీతో అంతమైంది. ఐదు రోజుల పోలీసుచర్య... హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య సెప్టెంబరు 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. లెఫ్ట్నెంట్ జనరల్ మేజర్ రాజేంద్రసింగ్ నేతత్వంలో మేజర్ జనల్ జె.ఎన్.చౌధురి దీనికి సారథ్యం వహించారు. భారత సైన్యం నలు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్దుర్గ్ కోటను స్వాదీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపునకు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ. రుద్ర విజయవాడ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్ను ముట్టడించింది. భారత వైమానిక ఎయిర్ మార్షల్ ముఖర్జీ సైతం తన సేవలను అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో నిజాం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1948 సెప్టెంబరు 14న దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను సైన్యం తన స్వాదీనంలోకి తీసుకుంది. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాల్లో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. సెప్టెంబరు 16న రాంసింగ్ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్ సైనికుల పాదాక్రాంతమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో మందుపాతరలు పేల్చి సైన్యాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్లోకి ప్రవేశించారు. ఇదీ హైదరాబాద్ సంస్థానం..» ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటకలోని హైదరాబాద్ సంస్థానం విస్తీర్ణం సుమారు 1,41,133 చదరపు కిలోమీటర్లు. » చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆయన కింద 975 మంది జాగీర్దార్లు ఉండేవారు. వీరి అ«దీనంలో సాగుకు అనుకూలమైన 53,106 చదరపు కిలోమీటర్ల భూమి ఉండేది. » 1921 నవంబర్లో ఆంధ్ర మహాసభ ఏర్పాటైంది. రాజకీయ సంబంధమైన ఒక సంస్థ నిజాం సంస్థానంలో ఏర్పడడం ఇదే మొదటిసారి. 1923లో ఆర్య సమాజ్ హైదరాబాద్ శాఖ ఏర్పాటు చేశారు. » గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం 1937లో అనేక ప్రావిన్స్లలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రభావం హైదరాబాద్ సంస్థానంపై పడింది. ‘బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని’ ఆంధ్ర మహాసభ మొదటిసారిగా రాజకీయ డిమాండ్ను బాహాటంగా ప్రకటించింది. ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో కన్నడ పరిషత్, మహారాష్ట్ర పరిషత్ కూడా ఏర్పడ్డాయి. హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ ప్రారంభమైంది. -
ఇది విమోచనమే!
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తిన సాహితీ యోధుడు స్వర్గీయ దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవం ఇటీవలే జరుపుకొన్నాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ను ‘విమోచన దినోత్సవం’గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏడాది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా రానుండటం కోట్లాది తెలంగాణ రతనాలతో దాశరథికి నివాళులు అర్పించడమే అవుతుంది. వీరులను స్మరించుకోవడానికి...1998 సెప్టెంబర్ 17న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో భార తీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, నాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన సమర యోధులను సత్కరించి వారి సమక్షంలోనే సెప్టెంబర్ 17ను ‘హైదరాబాద్ విమోచన దినం’గా ప్రకటించి, ప్రభుత్వమే అధికారిక ఉత్సవాలను నిర్వహించాలనీ, ప్రధాన కూడళ్లలో పోరాట యోధుల విగ్రహాలను ప్రతిష్ఠించాలనీ డిమాండ్ చేశాం. అది మొదలు బీజేపీ ఈ అంశంపై నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉంది. ఇకపై ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విముక్తి దినం’ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించిందంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2024 మార్చ్ 12న ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘‘1947 ఆగస్ట్ 15న భారతదేశం స్వాతంత్య్రం పొందిన 13 నెలల వరకూ హైదరాబాద్కు స్వేచ్ఛ లభించలేదు. అది నిజాం పాలనలో ఉంది. ‘ఆపరేషన్ పోలో’ పేరిట పోలీస్ చర్య తర్వాత 1948 సెప్టెంబర్ 17న ఈ ప్రాంతం నిజాం పాలన నుండి విముక్తి పొందింది. అయితే, సెప్టెంబర్ 17ను ‘హైదరాబాద్ విముక్తి దినం’గా జరపాలని ఈ ప్రాంత ప్రజల నుండి డిమాండ్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ను విముక్తి చేసిన మర వీరులను స్మరించుకోవడానికీ, యువత మనస్సులో దేశభక్తి జ్వాలను నింపడానికీ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విముక్తి దినం’ జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ఆ గెజిట్లో పేర్కొన్నారు. అసంబద్ధమైన పేర్లుగతంలో హైదరాబాద్ సంస్థానంలో ఉండి... మహారాష్ట్ర, కర్ణాటకల్లో కలిసిన జిల్లాల్లో ఆ ప్రాంత ప్రజల ఒత్తిడి మేరకు అక్కడ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. 2001 నుంచి మహా రాష్ట్రలో, 2009 నుంచి కర్ణాటకలో అక్కడి ప్రభుత్వాలు అధికారిక విమోచన ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ నిర్ణయాలు తీసుకున్నవి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాలే కావడం విశేషం. తెలంగాణలో మాత్రం ప్రజలు ఎన్ని ఉద్య మాలు చేసినా ప్రభుత్వాలు మాత్రం అధికారికంగా విమోచన ఉత్సవాలు నిర్వహించేది లేదని భీష్మించుకు కూచున్నాయి. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో చివరకు ఒక మెట్టు దిగి గత మూడు సంవత్సరాలుగా అధికారిక వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేడుకలను ‘విమోచన దినోత్సవం’గా కాకుండా ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’, ‘ప్రజా పాలనా దినోత్సవం’ అంటూ సంబంధం లేని పేర్లతో సెప్టెంబర్ 17 ఉద్దేశ్యాన్ని నీరుగార్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత రాజ్యాంగం స్వభావ రీత్యా సమాఖ్యగా ఉన్నా... ఆత్మ ఒక్కటే అని సాధారణంగా చెప్పుకొంటాం. అందుకే, రాజ్యాంగంలో ఈ దేశాన్ని ‘రాష్ట్రాల సమాఖ్య’గా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ ప్రచురించి సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అధికారిక వేడుకలు నిర్వహిస్తుంటే... దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వేరే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం అసంబద్ధంగా ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి హైదరాబాద్ సంస్థానం దేశంలోని సంస్థానాల్లో చాలా పెద్దది. బ్రిటిష్ అండదండలతో అరాచకాలు సాగిస్తున్న నిజాం నవాబుపై తెలంగాణ ప్రజలు పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావుతో పాటు ఎంతో మందిని ఉస్మానియా యూనివర్సిటీ నుండి బహిష్కరిస్తే ఇతర రాష్ట్రాల్లో చదువు కొనసాగించి విద్యావంతులుగా విలసిల్లారు. పరకాల, బైరాన్పల్లిల్లో వెలుగు చూసిన దారుణ కృత్యాలు హైదరాబాద్ సంస్థానంలో అడుగడుగునా జరిగాయి. తెలంగాణ విమోచన కోసం ఆనాడు ప్రతి గ్రామంలో పోరాటాలు జరిగాయి. అతి సామన్యులైన మహిళలు, పురుషులు దృఢ చిత్తంతో సైనికులై పోరాడిన ఘటనలు కోకొల్లలు. వారి త్యాగాలు అనన్య సామాన్యం, అనితర సాధ్యం. రాబోవు తరాలకు వారి చరిత్ర ప్రేరణ దాయకం. ఒళ్లుగగుర్పొడిచే సాహస ఘట్టాలెన్నో ఉద్యమ చరిత్రలో కనిపిస్తాయి. ఆ ప్రజా పోరాటమే పోలీసు చర్యకు మార్గం సుగమం చేసింది. అందుకే 1948 సెప్టెంబర్ 17 ‘హైదరాబాద్ విమోచన పొందిన రోజు’ తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం విమోచన దినంగా అధికారిక ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విమోచన దినంపేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించి, అమర వీరులకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత ఉంది.సీహెచ్. విద్యాసాగర్ రావు వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్ -
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్రెడ్డి నియమితులయ్యారు. అర్బన్ ట్రాన్స్పోర్ట్ సలహాదారుగా రెండేళ్లపాటు ఆయన కొనసాగనున్నారు.హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, ఉమెన్ అండ్ చైల్డ్వెల్ఫైర్ డైరెక్టర్గా శ్రుతి ఓజా, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య, హెచ్ఎండీఏ సెక్రటరీగా కోటా శ్రీవాత్స, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా ఎం.రాజారెడ్డి నియమితులయ్యారు. -
తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు దాడులు జరిపారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా 809 మెడికల్ షాపులు,అనధికార వైద్యులకు సంబంధించిన ఆస్పత్రులలో డీసీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 234 మెడికల్ షాపుల్లో అబార్షన్ కిట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా మైఫెప్రిస్టోన్, మిసోప్రోస్టాల్ వంటి మందులు లైసెన్స్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నట్లుగా పలు ఆధారాల్ని సేకరించారు. దీంతో సదరు మెడికల్ షాపులను సీజ్ చేస్తూ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరు 234 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 165 మెడికల్ షాపుల లైసెన్సులు సస్పెండ్ చేయడంతోపాటు ఏడు మెడికల్ షాపుల లైసెన్సులు పూర్తిగా రద్దు చేశారు. అక్రమంగా అబార్షన్ కిట్లు మహిళలకు ప్రమాదం. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ దాడులు కొనసాగుతాయి అధికారులు తెలిపారు. అనధికార మెడికల్ షాపుల వద్ద అబార్షన్ కిట్లు, మందులు కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి హానికరం. ప్రజలు నిబంధనల ప్రకారం మాత్రమే మందులు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. -
కాలి నరం ద్వారా 600 గ్రాముల బరువుగల చిన్నారికి గుండె చికిత్స
హైదరాబాద్: ఏడు నెలలకే.. అంటే నెలలు నిండకముందే పుట్టిన ఒక శిశువుకు గుండెకు సంబంధించిన సమస్య వచ్చింది. అతడికి గచ్చిబౌలి కిమ్స్ వైద్యులు అత్యాధునిక పద్ధతిలో, శస్త్రచికిత్స అవసరం లేకుండా నయం చేసి ప్రాణం పోశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ నియోనాటాజిస్ట్ డా. భవాని దీప్తి మరియు కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుదీప్ వర్మ తెలిపారు.“నగరంలోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన దంపతులకు నెలలు నిండకముందే ఏడు నెలలకే ఒక బాబు పుట్టాడు. దీంతో అత్యవసర పరిస్థిత్తుల్లో 97 రోజుల పాటు బాబును ఎన్ఐసియూ లో ఉంచాల్సి వచ్చింది. ఈ సమయంలో ఊపిరితిత్తుల నుండి రక్తం రావడం మరియు గుండె సంబంధిచిన పీడిఏ సమస్య వల్ల వెంటి లేటర్ అవసరం పడింది.తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఊపిరితిత్తులకు, మిగిలిన శరీరానికి, రక్త సరఫరా చేసే రక్తనాళాలకు మధ్య ఒక గొట్టం లాంటిది ఉంటుంది. పుట్టిన 7 నుంచి 10 రోజుల్లో అది మూసుకుపోతుంది. కానీ, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు అది మూసుకోవడం కష్టం అవుతుంది. దీనినే పీడిఏ అంటారు. ఈ సమస్య వల్ల ఊపిరితిత్తులకు రక్తం ఎక్కువగా వెళ్లి ఒత్తిడి పెరుగుతుంది. గుండె పనితీరు దెబ్బతింటుంది. నెలలు నిండని శిశువుల్లో 80% మందికి ఈ తరహా సమస్య ఉంటుంది. అప్పుడు ఊపిరితిత్తులు పనిచేయకపోవడం, గుండె కూడా దెబ్బతినడంతో వెంటిలేటర్ పెట్టాల్సి వస్తుంది.ఈ సమస్యకు ముందుగా మందులు వాడి చూస్తారు. వాటితో నయమైతే పర్వాలేదు. లేకపోతే మాత్రం తప్పనిసరిగా శస్త్రచికిత్స గానీ, ఇలాంటి డివైస్ తో మూసేయడం గానీ చేయాలి. లేకపోతే ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. ఇంతకాలం ఎదభాగానికి ఒక పక్క నుంచి శస్త్రచికిత్స చేసి ఆ రంధ్రాన్ని మూసేసేవారు. కానీ, ఈ కేసులో బాబు అతి తక్కువ బరువు ఉండడం, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో శస్త్రచికిత్స చేయడం అంత సురక్షితం కాదని భావించాం. అందుకే అత్యాధునిక పరికరంతో ఆ రంధ్రాన్ని మూసేయాలని నిర్ణయించాం. సర్జరీ చేసే సమయానికి అతడి బరువు కేవలం 600 గ్రాములు మాత్రమే ఉన్నాడు.1.2 మిల్లీమీటర్లు చుట్టుకొలత ఉన్న పికోలో అనే అత్యాధునిక పరికరాన్ని కాలి నరం ద్వారా లోపలకు పంపి, దాని సాయంతో రంధ్రాన్ని మూసేశాం. ఈ డివైస్ అమర్చి కోలుకున్న శిశువుల్లో దేశంలోనే అతి తక్కువ బరువు గల చిన్నారిగా రికార్డు సృష్టించాడు. దీంతో రంధ్రం పూడుకుపోయి, బాబుకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ నయమయ్యాయి. ఈ ప్రొసీజర్ తర్వాత ఎన్ఐసీయూలో డాక్టర్ భవానీ దీప్తి, డాక్టర్ సింధు మారు బృందం బాబును కంటికి రెప్పలా కాపాడుకున్నారు.శస్త్రచికిత్స అవసరం లేకుండానే పీడీఏ మూయడానికి ఈ పరికరం గేమ్ఛేంజర్ అవుతుంది. బాబుకు ఇక ఎలాంటి సమస్యలు లేకపోవడంతో పాలు కూడా తాగడం మొదలుపెట్టాడు. తర్వాత 2.45 కిలోలకు బరువు పెరగడంతో డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ భవనీ దీప్తి మరియు డా.సుదీప్ వర్మ వివరించారు. -
ఏసీబీకి ఏకంగా డైనోసార్ చిక్కింది.. ఏడీఈ అంబేద్కర్ ఆస్తులు 300కోట్లు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం కాదు.. ఏకంగా డైనోసార్ చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్శాఖ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.గత కొంతకాలంగా ఏడీఈ అంబేద్కర్కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్లలో నగదును స్వాధీనం చేసుకున్నారు. మణికొండలోని ఏడీఈ ఇల్లు,బంధువులు,కుటుంబసభ్యుల ఇళ్లతో పాటు గచ్చిబౌలి,మాదాపూర్ సహా 15 చోట్ల ఏసీబీ సోదాలు జరిపింది. విద్యుత్శాఖ ఏడీఈ అంబేద్కర్ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఇతర జిల్లాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు అంబేద్కర్ రూ.300కోట్లకుపైగా ఆస్తిపాస్తులున్నట్లు గుర్తించారు.పదెకరాల స్థలంలో పెద్ద కంపెనీ ఏర్పాటు చేసినట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో తేలింది. -
మెట్రో రైళ్లలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్జెండర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో రైళ్లలో 20 మంది ట్రాన్స్జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా ప్రభుత్వం నియమించింది. మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డులుగా వారికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియామక పత్రాలు అందించారు. సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ప్రభుత్వం ఎంపిక చేసింది.ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్ల అభ్యున్నతి, వారు ఆత్మగౌరంతో జీవించాలన్నదే సీఎం సంకల్పమన్నారు. ట్రాన్స్జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించామన్నారు. కష్టపడి పనిచేస్తే మీకే కాకుండా, ఇతర ట్రాన్స్జెండర్లకు కూడా మంచి భవిష్యత్తు ఏర్పడుతుందన్నారు. ట్రాన్స్జెండర్లు.. ఈ సమాజానికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలి. ట్రాన్స్జెండర్లకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి కచ్చితంగా అమలు చేస్తారు’’ అని మంత్రి పేర్కొన్నారు. -
కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్కు అస్వస్థత
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ సచివాయలయంలో మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయ్యేందుకు వెళ్లారు. అయితే శ్రీధర్ బాబును కలిసేందుకు వెళ్లిన మధుయాష్కీ స్పృహతప్పి కిందపడిపోయారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసర చికిత్స నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మధుయాష్కీకి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్ లో మెట్రో సేవలు బంద్?
-
అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయి.. ఆటోను తగులపెట్టిన వ్యక్తి
మహబూబ్ నగర్ క్రైం: తనకు వారసత్వంగా వచ్చిన భూమికి విరాసత్ చేయకుండా గత కొన్ని రోజుల నుంచి రెవెన్యూ అధికారులు వేధింపులకు గురి చేయడంతో విసిగిపోయిన ఓ ఆటో డ్రైవర్ మొదట ఆటోపై పెట్రోల్ పోసి తగలపెట్టాడు. ఆ తర్వాత భార్యాపిల్లలపై పెట్రోల్ పోయడానికి యత్నించే క్రమంలో రోడ్డుపై ఉన్న ఇతర వాహన దారులు పెట్రోల్ బాటిల్ను తీసుకున్నారు. వివ రాల్లోకి వెళితే... దేవరకద్ర మండలం బస్వాయిప ల్లికి చెందిన మాల శంకర్కు తన తండ్రి నుంచి 1ఎకరం 3 గుంటల భూమి వారసత్వంగా వచ్చిం ది. ఈ భూమిని విరాసత్ చేయడానికి 5 ఏళ్ల కిందట నుంచి దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. అయినా అధికారులు నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి చేశారు. ఈ ఏడాది మార్చిలో భూమికి సంబంధించిన ఓఆర్సీ హక్కులు సైతం శంకర్కు వచ్చాయి. దీనిని ఆన్లైన్ నమోదు చేసి మ్యాన్వల్ గా ఓఆర్సీ సర్టిఫికెట్, పట్ట దారు పాస్పుస్తకం ఇవ్వాలని మూడు నెలల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి అలతగలబడిన ఆటోసిపోయాడు. చివరకు సోమవారం సాయంత్రం తనకు సంబంధించిన ఆటోను పాలమూరు పట్ట ణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో పెట్రోల్ పోసి తగ లబెట్టాడు. ఆ తర్వాత కొంత పెట్రోల్ను భార్య, ముగ్గురు అమ్మాయిలపై పోయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో రోడ్డుపై ఉన్న ఇతర వాహనదా రులు అడ్డుకున్నారు. మొదట ఆటోలో ఉన్న కుటుం బ సభ్యులను బయటకు దించి వెంట తెచ్చుకున్న పెట్రోలు ఆటో పై పోసి ఆ తర్వాత నిప్పు అంటిం చడంతో ఆటో పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలా నికి టూటౌన్ పోలీసులు, మహబూబ్నగర్ రెవెన్యూ అధికారులు చేరుకుని వివరాలు సేకరిం చారు. మహబూబ్నగర్ ఆర్బన్ డీటీ దేవేందర్ఐదేళ్లుగా తిరుగుతున్నాడుమాల శంకరు వారసత్వంగా వచ్చిన భూమిని విరాసత్ చేయడం కోసం ఐదేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరిగాడు. ఇటీవల ధరణిలో రావడంతో అప్పటి నుంచి పాసు పుస్తకంతో పాటు ఓఆర్సీ సర్టిఫికెట్ కోసం దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఎంతో డబ్బులు ఖర్చు చేసుకు న్నాడు. ఇటీవల ధరణిలో నమోదు కావడం తో ఓఆర్సీ, పట్టాదారుపాస్ పుస్తకం మ్యాన్ వల్ గా ఇవ్వడానికి దేవరకద్ర తహసీల్దార్. కార్యాలయంలో అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని విసిగిపోయాడు. ఈ ఘట సపై దేవరకద్ర ఆరని 'సాక్షి' వివరణ కోరగా మాల శంకర్ 45రోజుల కిందట భూ భారతిలో దరఖాస్తు చేసుకున్నాడని. దీనిపై విచారణచేసి ఫైల్ తహసీల్దారు ఇచ్చినట్లు తెలిపారు. తహసీల్దార్ సంత కాలు చేసి ఫైల్ ఆర్డీఓ కార్యాలయానికి పార్వర్డ్ చేయడం జరిగిందని, ప్రస్తుతం ఫైల్ అక్కడే ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మహబూబ్ నగర్ ఆర్డీఓకు ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన అందుబా టులోకి రాలేదు.ఆధ్వర్యంలో రిపోర్ట్ తయారు చేసి జిల్లా కలెక్టర్కు అందించారు. -
ఏ ప్రాంతం ఏ జోన్లోనో..?
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ఆర్ వరకు భవన నిర్మాణాలు, లే అవుట్ల కోసం హెచ్ఎండీఏ అనుమతులను అందజేస్తోంది. కానీ ఈ అనుమతులపైన నిర్మాణసంస్థలు, ‘రియల్’ వర్గాలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి.‘మాస్టర్ప్లాన్–2050 ’రూపొందించకుండానే ఇస్తున్న అనుమతుల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటే ఆర్థికంగా భారీగా నష్టపోవలసి రావచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అందజేస్తున్న అనుమతులకు భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు ఉండబోవని, కొత్తగా తయారుచేస్తున్న మాస్టర్ప్లాన్కు అనుగుణంగానే అనుమతులను ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా జోన్ల మార్పుపైన వివిధ వర్గాల నుంచి ఆందోళన వెల్లువెత్తుతోంది. అప్పటి మాస్టర్ప్లాన్ అమల్లోకి రావడానికి ముందే కొన్ని ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్లుగా భావించి అపార్ట్మెంట్లు, భవన నిర్మాణ లే అవుట్లకు అనుమతులను ఇచ్చారు. కానీ ఆ తరువాత వివిధ ప్రాంతాల్లోని నివాసిత స్థలాలు కన్జర్వేషన్ జోన్లోకి మారాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు మొదలుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పటి మాస్టర్ప్లాన్ ప్రకారం నివాసిత మండలాల జాబితా లోంచి కన్జర్వేషన్ జోన్లోకి మారిన ప్రాంతాలను తిరిగి నివాసిత జోన్లోకి మార్చేందుకు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించవలసి వచ్చిందని,ప్రస్తుతం మాస్టర్ప్లాన్–2050 అమల్లోకి రాకుండానే ఇప్పుడు ఇచ్చే అనుమతుల వల్ల మరోసారి అలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని నిర్మాణ రంగానికి చెందిన నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకీ సమస్య.. మాస్టర్ప్లాన్–2050కి అనుగుణంగానే ప్రస్తుతం అనుమతులను అందజేస్తున్నట్లు అధికారులు భరోసాను ఇస్తున్నారు. కానీ వివిధ వర్గాలకు చెందిన ప్రజల నుంచి రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ అంశంపైన కొంత గందరగోళం నెలకొంది. అప్పట్లో రంగారెడ్డి జిల్లా పులిమామిడి ప్రాంతంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఓ బడా నిర్మాణ సంస్థ వేసిన లే అవుట్లకు హెచ్ఎండీఏ అనుమతులను అందజేసింది. కానీ ఆ తరువాత అమల్లోకి వచ్చిన మాస్టర్ప్లాన్ ప్రకారం ఆ ప్రాంతమంతా కన్జర్వేషన్ జోన్లోకి మారిపోయింది. దీంతో అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. కన్జర్వేషన్ నుంచి మరోసారి రెసిడెన్షియల్ జోన్లోకి మార్చుకొనేందుకు స్థలాల కొనుగోలుదార్లు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించవలసి వచ్చింది. ఒక్క పులిమామిడి ప్రాంతంలోనే కాకుండా అనేక చోట్ల ఇలాంటి సమస్యలు తలెత్తాయి. చాలా ప్రాంతాల్లో అప్పటి మాస్టర్ప్లాన్లోని లోపాలపైన ఇప్పటికీ దిద్దుబాటు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చెరువులు, కుంటలు, తదితర జలవనరులకు సమీపంలో ఉన్న రెసిడెన్షియల్ జోన్లలోని స్థలాల మార్పు కోసం హెచ్ఎండీఏ అధికారులు దిద్దుబాటు చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల జలవనరులు ఉన్న ప్రాంతాలు కూడా నివాసిత మండలాల జాబితాలోకి మారిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాస్టర్ప్లాన్–2030 స్థానంలో కొత్తగా రానున్న మాస్టర్ప్లాన్–2050 నేపథ్యంలో హెచ్ఎండీఏ అనుమతులపైన గందరగోళం నెలకొంది. మాస్టర్ప్లాన్ లక్ష్యం ఏంటి.. హైదరాబాద్ మహానగరాభివృద్ధి కోసం రాబోయే ఇరువై ఐదు సంవత్సరాలను లక్ష్యంగా చేసుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) కోసం మాస్టర్ప్లాన్–2050 ను రూపొందిస్తున్నారు. హైదరాబాద్నగరాన్ని ప్రపంచంలోని 10 అగ్రగామి గ్లోబల్నగరాల పక్కన నిలిపే లక్ష్యంతో రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అభివృద్ధికి అనుగుణంగా మెగామాస్టర్ప్లాన్కు కసరత్తు చేపట్టారు. హైదరాబాద్ మహానగర పరిధి 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472.723 చదరపు కిలోమీటర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. నగరం చుట్టూ సుమారు 354 కిలోమీటర్ల పరిధిలోనిర్మించనున్న రీజనల్రింగ్రోడ్డు వరకు అభివృద్ధి ప్రణాళికల కోసం హెచ్ఎండీఏ ఈ కసరత్తు చేపట్టింది. ఈ మెగామాస్టర్ప్లాన్ మూడు విభాగాలుగా ఉంటుంది. మొదటిది ఆర్థికమండళ్లు, పారిశ్రామిక ప్రాంతాలు, అంతర్జాతీయ బహుళ జాతి సంస్థల వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం ఆర్థికాభివృద్ధి ప్రణాళిక (ఎకనమిక్ డెవలప్మెంట్ ప్లాన్) కాగా, రెండోది హైదరాబాద్ మెట్రో ఏరియా వరకు రహదారులు, మౌలిక సదుపాయలు, ప్రజారవాణా సదుపాయాల విస్తరణ కోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్, జలనరులు, అర్బన్ఫారెస్ట్లు, పచ్చదనం అభివృద్ధి లక్ష్యంగా మూడో ప్రణాళిక బ్లూగ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ ఉంటుంది. ప్రస్తుతం ఈ మూడు వివిధ దశల్లో ఉన్నాయి. అనుమతులు తారుమారైతే ఎలా..‘వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న కొత్త మాస్టర్ప్లాన్ ప్రకారమే ఇప్పుడు అనుమతులను ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ అనుమతులు తారుమారైతే పరిష్కారమేంటనే దానిపైన మాత్రం స్పష్టత లేదు.’ అని షాద్నగర్ ప్రాంతానికి చెందిన రియల్టర్ ఒకరు తెలిపారు. ఇటీవల తాము 10 ఎకరాల్లో లే అవుట్ అనుమతులు తీసుకున్నామని, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఏ జోన్లోకి మారుతుందో తెలియడం లేదని పేర్కొన్నారు. ఒకవేళ ఈ ప్రాంతం ఆర్ధిక మండలాల జాబితాలోకి, లేదా బ్లూగ్రీన్ జోన్లోకి మారినా తాము పెద్ద మొత్తంలో నష్టపోవలసి వస్తుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త మాస్టర్ప్లాన్ను రూపొందిస్తున్నారు. అడవులు, జలవనరుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. 2050 నాటికి హైదరాబాద్ జనాభా 3.5 కోట్లు దాటే అవకాశం ఉంటుందనే అంచనాలతో ఈ విస్తరణ ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడిస్తోన్న నిర్మాణరంగ అనుమతులపైన మరింత స్పష్టత రావలసి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
జూబ్లీహిల్స్తో ‘బిహార్’ మెలిక..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో ‘బిహార్ కూటమి’కి మెలిక పెట్టేందుకు ఆల్ ఇండియా మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) సిద్ధమవుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో మజ్లిస్ గత మూడు పర్యాయాలుగా అక్కడ పాగా వేసేందుకు ప్రయతి్నస్తూనే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్కు మిత్ర పక్షం కానప్పటికీ... ప్రభుత్వ నిర్ణయాలకు సహకరిస్తూ వస్తోంది. అయితే తాజాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్, ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి(ఇండియా)లో చేరేందుకు అసక్తి చూపుతున్నా....కూటమి నుంచి సానుకూల స్పందన రాక పోవడాన్ని మజ్లిస్ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో కాంగ్రెస్ పాలిత ప్రాంతమైన తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలను సాకుగా చూపించి మహా కూటమిపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవేళ అక్కడ కూటమిలో అవకాశం దక్కని పక్షంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్కు గుణ పాఠం చెప్పాలా..? లేక స్థానిక అవసరాల కోసం సహకరించాలా? అని సందిగ్దంలో పడినట్లు కనిపిస్తోంది. మజ్లిస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో దిగితే అధికార కాంగ్రెస్కు గెలుపు అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ముస్లిం ఓటర్లు అధికం.. గత మూడు పర్యాయాలుగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో పాగా వేసేందుకు మజ్లిస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో సగానికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. తొలిసారిగా 2014లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బరిలో దిగి ఢీ.. అంటే ఢీ అనే విధంగా పోటీ పడి స్పల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన మజ్లిస్... ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్ దోస్తీ కోసం బరిలో దిగకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. కాగా 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి జూబ్లీహిల్స్ (Jubilee Hills) మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్నేహపూర్వక పోటీకి దిగి పరాజయం పాలైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్కు అధికారం చేజారగా, కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో అధికార కాంగ్రెస్తో మజ్లిస్ స్నేహం కుదిరింది. తాజాగా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.ఆ దిశగా ప్రయత్నాలుత్వరలో జరుగనున్న బిహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు కాంగ్రెస్, ఆర్జేడీ సారథ్యంలోని మహా కూటమి(మహా ఘట్బంధన్) లో చేరేందుకు ఏఐఎంఐఎం శతవిధాల ప్రయత్నిస్తోంది. సంస్థాగతంగా బలంగా ఉన్న సీమాంచల్లో ఆరు స్థానాలు కేటాయిస్తే కలిసి వస్తామని ఇప్పటికే ప్రకటించింది. మహా కూటమి తమతో కలిసిరాని పక్షంలో బిహార్లోని అన్ని నియోజకవర్గాల్లో మజ్లిస్ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆ పార్టీ అధినేత ఒవైసీ ఇప్పటికే స్పష్టం చేశారు. వాస్తవంగా తెలంగాణ, మహారాష్ట్ర తర్వాత బిహార్ను పార్టీ విస్తరణకు అనుకూలంగా మజ్లిస్ భావిస్తోంది. తొలిసారిగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంచల్లోని ఆరు స్థానాల్లో తొలిసారి పోటీ చేసి విజయం సాధించలేక పోయినప్పటికి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లలో పోటీ చేసి ఐదు సీట్లను దక్కించుకుంది. ఐదుగురు శాసనసభ్యుల్లో నలుగురు పార్టీని వీడి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసినా.. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇటీవల మహాకూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తూ ఇటీవల సాక్షాత్తు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తరుల్ ఇమాన్న్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు లేఖ రాశారు. రాబోయే ఎన్నికల్లో లౌకిక ఓట్లు చీలిపోయి మతతత్వ శక్తులు అధికారంలోకి వచ్చే అవకాశం ఇవ్వకూడదనే కూటమిలో చేరేందుకు ముందుకు వస్తున్నట్లు, గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సమయంలో మహా కూటమిలో చేరాలనే ఆసక్తి కనబర్చామని కానీ తమ ప్రయత్నాలు ఫలించలేదు‘ అని లేఖలో పేర్కొన్నారు అయితే మహా కూటమి నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం వైపు నుంచి ఒత్తిడి తెచ్చేందుకు మజ్లిస్ సిద్దమైనట్లు సమాచారం. -
ప్రమాదకరంగా మూసాపేట్ మైసమ్మ చెరువు (ఫొటోలు)
-
హైదరాబాద్లో అంతర్జాతీయ యుఎక్స్ఇండియా సదస్సు
మరో అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. 21వ అంతర్జాతీయ యూఎక్స్ఇండియా25 సదస్సు (UXINDIA 2025) ఈ నెల 18 నుంచి 20 వరకు హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో జరుగనుంది. ఈ సదస్సులో 1,400 మందికి పైగా ప్రతినిధులు, 80 మందికి పైగా నిపుణులు, 10 మంది ప్రధాన వక్తలు పాల్గొననున్నారు.బెంగళూరులో రెండు ఎడిషన్స్ తర్వాత, యుఎక్స్ఇండియా హైదరాబాద్ను డిజైన్ సంభాషణ, ఆవిష్కరణల ప్రపంచ కేంద్రంగా మార్చడానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం థీమ్, ‘డిజైన్: ఒక జీవన విధానం’ వ్యవస్థాపకత భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఉత్పత్తులు, వెంచర్లను రూపొందించడంలో డిజైన్, కృత్రిమ మేధస్సుల శక్తివంతమైన కలయికను ఇది తెలియజేస్తుంది.ఈ కార్యక్రమంలో డిజైన్ ప్రదర్శనలు ఉంటాయి. వీటిలో కొత్త ఆవిష్కరణలతో కూడిన వ్యాపార ఆలోచనలను యువ వ్యాపారవేత్తలు పెట్టుబడిదారుల ముందు ప్రవేశపెట్టనున్నారు. అలాగే, ప్రపంచ నాయకులు మాత్రమే పాల్గొనే ప్రత్యేక వేదికలో వ్యూహాత్మక చర్చలు జరగనున్నాయి. అదేవిధంగా 2030 నాటికి ఒక మిలియన్ మహిళలకు డిజైన్ విద్య అందించాలన్న యూఎంఓ లక్ష్యం దిశగా, మహిళా డిజైనర్ల పాత్రపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు.మైక్రోసాఫ్ట్, క్యాండెసెంట్, కాగ్నిజెంట్, ఫ్రెష్వర్క్స్, ఫిలిప్స్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు డిజైన్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై చర్చించనున్నారు. అలాగే, ఉత్పత్తులు, ఆవిష్కరణలలో వేగంగా ఎదుగుతున్న కేంద్రంగా హైదరాబాద్ ప్రాధాన్యం పొందనుంది. “ఈ ఏడాది యూఎక్స్ ఇండియా సదస్సు మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు,” అని యూఎంఓ డిజైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాపు కలాధర్ అన్నారు. -
బండి సంజయ్పై కేటీఆర్ పరువు నష్టం దావా
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ అంశానికి తనపై ఆరోపణల చేసిన బండి సంజయ్పై చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనపై చేసిన ఆరోపణలకు గాను బండి సంజయ్పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఫోన్ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత నెలలోనే లీగల్ నోటీసులు పంపారు. బండి సంజయ్ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగా కేటీఆర్ మంగళవారం పంపిన నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించిన పత్రికా సమావేశంలో బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు ఈ తరహా ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు.మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్నారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా, కేంద్రమంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉంటూ ప్రజాజీవితంలో ఉన్న మరో శాసనసభ్యుడిపై అసత్యాలతో కూడిన అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని చెప్పారు. బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు అందిన వారంలోపు బండి సంజయ్ స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే తాజాగా పరువు నష్టం దావా పిటిషన్ను దాఖలు చేశారు కేటీఆర్. -
అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యహహారంపై అటు అధికారం కాంగ్రెస్- ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తమ పార్టీ నుంచి గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, ఆ ఎమ్మెల్యేలు మాత్రం తాము పార్టీ మారలేదని అంంటున్నారు. తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్రను కలిశామని వారు అందుకున్న నోటీసులకు సమాధానంగా పేర్కొన్నారు. అయితే తమ పార్టీ నుంచి గెలిస్తే బీఆర్ఎస్ చేపట్టే కార్యక్రమిలకు వారు ఎందుకు దూరంగా ఉంటున్నారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. దీన్ని సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లో భాగంగా ఆ ఎమ్మెల్యేల సమాధానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ అదనపు కార్యదర్శికి వివరణ ఇచ్చారు. దీనిలో భాగంగా ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 15వ తేదీ) అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి పలు ఆదారాలు సమర్పించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికారిక కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆధారాలు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పాల్గొన్న మరిన్ని ఆధారాలను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో జగదీష్రెడ్డి, వివేక్ గౌడ్ చింతా ప్రభాకర్ తదితరులు ఉన్నారు.అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ‘ వాళ్లు బీఆర్ఎస్లో ఉంటే ాపార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వాళ్లు బీఆర్ఎస్లో ఉంటే రాహుల్ గాంధీని ఎందుకు కలిశారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరుగుతూ జాతీయ జెండా అని చెబుతున్నారు. బీఆర్ఎస్లో ఉంటే కేసీఆర్తో ఉండాలి కదా?’ అని ప్రశ్నించారు. -
తెలంగాణలో ఆరోగ్య సేవలు బంద్..ఎప్పటినుంచంటే?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేయాలని ప్రైవేట్ ఆస్పత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రైవేట్ ఆస్పత్రి సంఘాలు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వం తమకు వందల కోట్లలో బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటిని తక్షణమే చెల్లించాలని ప్రైవేట్ ఆస్పత్రి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంగా తమ ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. -
Road Accident: ఇన్ఫోసిస్ ఎంప్లాయ్ సౌమ్య రెడ్డి మృతి
-
హైదరాబాద్: కారు బోల్తా.. ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి
సాక్షి, హైదరాబాద్: స్నేహితులంతా కలిసి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగ్రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సంగారెడ్డి జిల్లా, వావిలాల గ్రామానికి చెందిన రాళ్లకత్వ వెంకటేశ్వర్ రెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి (25) నగరంలోని ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. తన స్నేహితులైన నందకిషోర్, వీరేంద్ర, ప్రణీష్, సాగర్, అరవింద్, ఝాన్సీ, శృతితో కలిసి ఆదివారం కారులో రాచకొండ సమీపంలోని సరళ మైసమ్మ దేవాలయానికి వెళ్లారు. రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న వారు బొంగ్లూర్ వద్ద ఔటర్పై నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తుండగా బలిజగూడ సమీపంలో భారీ వర్షం కారణంగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది.ఈ ఘటనలో సౌమ్యారెడ్డితో పాటు పలువురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వారికి చికిత్స నిమిత్తం వివిధ ఆస్పత్రులకు తరలించారు. సౌమ్యారెడ్డి చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందింది. మరో ముగ్గురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వర్షంలో కొట్టుకుపోయిన మామాఅల్లుళ్లు
-
అడ్డగోలుగా కత్తిరింపులు.. రోడ్లపైనే కేబుళ్ల గుట్టలు
సాక్షి, హైదరాబాద్: ‘ఆవుల కుమ్ములాటలో దూడలు బలైనట్లు’ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ–ఇంటర్నెట్ ఆప్టికల్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ), ఎంఎస్ఓలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లు (ఎల్సీఓలు) మధ్య నెలకొన్న పోరులో అమాయక వినియోగదారులు బలవుతున్నారు. మూడు వారాలు దాటినా ఇంటర్నెట్ సేవలు, టీవీ ప్రసారాలను పునరుద్ధరించకపోవడంతో.. ఇంటి నుంచి విధులు నిర్వహించే ఐటీ, అనుబంధ రంగాల ఉద్యోగులు సహా పిల్లలకు ఆన్లైన్ తరగతులు బోధించే తల్లిదండ్రులు ఇబ్బందిపడాల్సి వస్తోంది. వివిధ ఆఫర్లలో భాగంగా ముందే ఏడాది/ఆరు నెలల చార్జీలు చెల్లించిన వినియోగదారులు సైతం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఆగస్టు 17న రామంతాపూర్ గోఖలేనగర్ ఘటనతో విద్యుత్శాఖ అప్రమత్తమైంది. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు, కారి్మకులు, సాధారణ పౌరుల మృత్యువాతకు కారణమవుతున్న ఈ ప్రమాదకరమైన ఆప్టికల్ కేబుల్ వైర్ల తొలగించాలని నిర్ణయించింది. ఆ మేరకు కొద్ది రోజులుగా గ్రేటర్ జిల్లాల్లో ఎక్కడికక్కడే కేబుళ్లను కట్ చేస్తోంది. స్తంభాలపై లైన్లు వేస్తున్నప్పుడు మిన్నకుండిపోయి.. తీరా వేసిన తర్వాత కట్ చేయడం ఏమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఐఎస్పీలు, ఎంఎస్ఓలు, ఎల్సీఓలు తప్పు చేస్తే.. వినియోగదారులకు శిక్ష వేయడం ఎంత వరకు సబబు అనే ప్రశ్న తలెత్తుతోంది. రూ.100 కోట్లకుపైగా నష్టం గ్రేటర్ పరిధిలో ఐదు లక్షలకుపైగా విద్యుత్ స్తంభాలు ఉన్నట్లు అంచనా. ఏదైనా విద్యుత్ స్తంభంపై కేబుల్ వేయాలంటే ముందస్తుగా ఆ శాఖ అనుమతి తీసుకోవాలి. ఇందుకు ఒక్కో స్తంభానికి ఏటా రూ.50 నుంచి రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంది. 15 మీటర్ల ఎత్తులోనే కేబుల్ అమర్చుకోవాలి. మెజారిటీ కేబుళ్లు ఆరేడు అడుగుల ఎత్తులోనే వేలాడుతున్నాయి. ఒక స్తంభానికి, మరో స్తంభానికి మధ్య 50 మీటర్లకు మించరాదు.. కానీ మెజార్టీ స్తంభాలకు టన్నుల కొద్దీ బరువైన కేబుల్ ఉండలు వేలాడుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి మధ్యలో ఏదైనా చెట్టు కొమ్మ విరిగి లైన్పై పడితే.. ఆ బరువుకు రెండు వైపులా ఉన్న స్తంభాలు నేలకూలుతున్నాయి. దెబ్బతిన్న ఇన్సులేటర్లు, జాయింట్లను పునరుద్ధరించేందుకు లైన్మెన్లు స్తంభాలపైకి ఎక్కడం చాలా కష్టంగా మారింది. కేబుళ్ల నుంచి ఎర్తింగ్ రివర్స్ వల్ల షాక్తో కిందపడి పోతున్న ఘటనలు లేకపోలేదు. కనీస అనుమతులే కాదు కనెక్షన్, మీటర్ తీసుకోకుండా ఏకంగా కేబుల్ జంక్షన్ బాక్సులకు కరెంట్ను వినియోగిస్తున్నారు. ఏళ్ల తరబడి కళ్లముందే ఈ చౌర్యం జరుగుతున్నా.. క్షేత్రస్థాయి ఇంజినీర్లు పట్టించుకోలేదు. కొత్తగా అనేక ఇంటర్నెట్ సరీ్వసు ప్రొవైడర్లు (ఐఎస్పీ), ఎంఎస్ఓలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లు (ఎల్సీఓలు) పుట్టుకురావడం, వ్యాపారంలో పోటీతో ఎవరికి వారు స్తంభాలపై కేబుళ్లను వేసుకుంటూ ముందుకెళ్లడం, ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తినప్పడు పాత వైర్లను అలాగే వదిలేసి, కొత్తగా మరో ఆప్టికల్ కేబుల్ను అమర్చుతుండటం, తాజాగా వాటన్నింటినీ తొలగిస్తుండటంతో ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా నష్టపోవాల్సి వచి్చందని ఆయా సరీ్వసు ప్రొవైడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఫోన్లకూ తప్పని సిగ్నల్ సమస్యకేవలం ఆపరేటర్లే కాదు సేవల వినియోగంలో భాగంగా ముందే ఆఫర్ల పేరుతో (సంవత్సరం/ఆరు నెలలు) చార్జీలు చెల్లించిన గృహ, వ్యాపార, వాణిజ్య సంస్థల వినియోగదారులు సైతం ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. మూడు వారాలైనా ఆయా సర్వీసులు పునరుద్ధరించపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక..ఆయా సర్వీసు ప్రొవైడర్లు కాల్ సెంటర్లు/ వ్యక్తిగత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. మెజార్టీ ప్రజలు గృహ, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో వైఫై సరీ్వసులను వాడుతున్నారు. ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాల్లోనూ ఈ తరహా సేవలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఆప్టికల్ కేబుళ్లన్నింటినీ కట్ చేయడంతో సరీ్వసులు నిలిచిపోయి సిగ్నల్ సమస్యలు తలెత్తుతున్నాయి. రోజంతా టీవీ సీరియల్స్, ఓటీసీ సినిమాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ సర్వీసులకు అలవాటు పడిన గృహిణులు.. ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడ్డారు. కట్ చేసిన కేబుళ్లను అక్కడే రోడ్లపైనే గుట్టలుగా వదిలేసి వెళ్లుండటం, అటుగా వచ్చిపోయే వాహనదారులు ఆయా వైర్ల మధ్య చిక్కుకుని ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనాల రాకపోకల సమయంలో కేబుళ్లు టైర్ల మధ్య చిక్కుకుపోయి ప్రమాదాలకు కారణమవుతోంది. -
భారీ వర్షానికి భాగ్యనగరం జలమయం
-
వానొస్తే ప్రాణాలు గల్లంతే!
హైదరాబాద్: నగరంలో వానొస్తే ప్రాణాలు గల్లంతే అనే దుస్థితి నెలకొంది. ఆదివారం సాయంత్రం గంటసేపు వర్షం దంచికొట్టడంతో రహదారులు చెరువులను తలపించాయి. నాలాలు ఉప్పొంగాయి. ముషీరాబాద్తో పాటు తట్టి అన్నారంలో 12.8 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వరద ప్రవాహంలో నాంపల్లి పరిధి హబీబ్నగర్లోని అఫ్జల్సాగర్లో ఇద్దరు, ముషీరాబాద్లో మరొకరు కొట్టుకుపోయారు. కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాయి. Heavy Rains In Hyderabad Three People Missing After Falling Into A DrainageHeavy Rains In Hyderabad Three People Missing After Falling Into A Drainage -
హైదరాబాద్ : రాత్రి అతలాకుతలం.. గంటపాటు కుండపోత వర్షం (ఫొటోలు)
-
హైదరాబాద్కు ఎల్లో అలర్ట్.. భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇవాళ కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఉత్తర తెలంగాణ, విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వివరించింది.దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ మొదలైంది. సాధారణంగా సెప్టెంబర్ మూడో వారం చివరలో మొదలవ్వాల్సిన ఈ ప్రక్రియకు ఈసారి సానుకూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ముందే ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. రానున్న రెండు రోజుల్లో రాజస్తాన్, పంజాబ్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు క్రమంగా నిష్క్రమిస్తూ అక్టోబర్ రెండో వారాంతానికి దేశం నుంచి పూర్తిస్థాయిలో నిష్క్రమిస్తాయని వివరించింది.ఈ సమయంలోనూ చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు గతేడాది కంటే మూడు రోజుల ముందే.. మే 23న కేరళను తాకాయి. ఆ తర్వాత మూడు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించాయి. జూలై రెండో వారం నాటికి దేశమంతా విస్తరించాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో రాష్ట్రంలో సగటున 74.06 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటికే 83.02 సెం.మీ. మేర వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతంకన్నా 12 శాతం అధికం. -
భారీ వర్షానికి అతలాకుతలమైన హైదరాబాద్
-
హైదరాబాద్లో కుండపోత వాన
సాక్షి,హైదరాబాద్: నగరంలో కుండపోత వాన కురుస్తోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఉప్పల్ టూ వరంగల్ రహదారి మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆదివారం సాయంత్రం నుంచి మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, ఉప్పల్, హయత్నగర్, టోలీచౌకీ, మియాపూర్, అమీర్పేట్, పంజాగుట్ట, అబ్ధుల్లాపూర్మెట్, పెద్దఅంబర్పేట్లలో భారీ వర్షపాతం నమోదైంది. కుషాయిగూడా, కాప్రా, ఏఎస్రావు నగర్, చర్లపల్లి, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయాణగూడ, అంబర్పేట్, నల్లకుంటలలో వర్ష పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. -
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక ఏఐసీసీ చూసుకుంటుంది: సీఎం రేవంత్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశానికి సంబంధించి సీఎం రేవంత్రెడ్డి తన నివాసంలో సమీక్ష చేపట్టారు. ఆదివారం(సెప్టెంబర్ 14వ తేదీ) జూబ్లీహిల్స్ ఎన్నికపై పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చిస్తున్నారు. దీనికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ ఇంచార్జ్ మంతరులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లతో సర్వే ఏజెన్సీల నుంచి పలువురు హాజరయ్యారు. ఈ నెలాఖరులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్లో అభివృద్ధి పనులు , అభ్యర్థి ఎంపిక పై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. జూబ్లీహిల్స్ రేసులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్లు పోటీలు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై సీక్రెట్ సర్వే రిపోర్ట్ను సీఎంకు అందజేశారు పీసీసీ చీఫ్దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రతీ ఒక్కరు పని చేయాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి. పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలి.కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుంది. అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉంది. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటా. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి’ అని పేర్కొన్నారు.కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభవృద్ధి కోసం కృషి చేశానన్నారు. ఎంపీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశానన్నారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా తన మనసులోని మాటను వెల్లడించారు అంజన్ కుమార్ యాదవ్. ‘నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. అందులో భాగంగా నాకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలిఉమ్మడి ఏపీ నుండి యాదవ సామాజికవర్గంకి మంత్రి పదవి కేటాయించారు. నాకన్న సీనియర్లు ఎవరు లేరు....నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రాతినిథ్యం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చి మంత్రి ఇవ్వాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నేను ఉన్న ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. జూబ్లీహిల్స్లో సర్వే చేస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు వస్తుంది’ అని పేర్కొన్నారు. -
Hyd: ఓల్డ్ బోయిన్పల్లిలోని మేధా స్కూల్ సీజ్
హైదారాబాద్: సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లిలో డ్రగ్స్ తయారు చేస్తున్న మేధా హైస్కూల్పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ స్కూల్ను సీజ్ చేసింది. మేధా స్కూల్ అనుమతులు సైతం రద్దు చేసింది విద్యా శాఖ. ఇక ఆ స్కూల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అసలు ఏం జరిగిందంటే..!విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలనే మ త్తుమందు తయారీ ఫ్యాక్టరీగా మార్చేశారు. ఉదయం పాఠశాల తరగతులు నిర్వహిస్తూనే గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళల్లో ఆ్రల్ఫాజోలం అనే మత్తుపదార్థాన్ని తయారు చేస్తున్నారు. స్వయంగా పాఠశాల కరస్పాండెంటే ఈ దందాకు తెరతీయడం గమనార్హం. సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లిలో మేధా హైస్కూల్ కరస్పాండెంట్ మల్లేల జయప్రకాశ్గౌడ్ పాఠశాలలోనే ఆ్రల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) బృందం నిఘా పెట్టింది. శనివారం మధ్యాహ్నం జయప్రకాశ్గౌడ్ ఆ్రల్ఫాజోలంను కస్టమర్లకు విక్రయించేందుకు తీసుకెళ్తుండగా అప్పటికే మాటువేసి ఉన్న ఈగల్ బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నుంచి 3.5 కిలోల ఆ్రల్ఫాజోలంను స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. పాఠశాలలో తనిఖీ చేయగా.. రెండు గదుల్లో ఆల్ఫ్రాజోలం తయారీ పరికరాలు గుర్తించారు. ఈ సోదాల్లో తయారీలో ఉన్న 4.3 కిలోల ఆ్రల్ఫాజోలం, రూ.20 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నారు. జయప్రకాశ్గౌడ్కు సహకరిస్తున్న ఓల్డ్ బోయినపల్లి గంగపుత్ర కాలనీకి చెందిన గౌటె మురళీసాయి, బోయినపల్లి హస్మత్పేటకు చెందిన పెంటమోల్ ఉదయ్ సాయిని అరెస్టు చేశారు. పట్టుబడిన ఆల్ఫ్రాజోలం విలువ బహిరంగ మార్కెట్లో రూ. 50 లక్షల వరకు ఉంటుందని తెలిసింది. ఓల్డ్ బోయినపల్లిలో.. బీటెక్ డిస్కంటిన్యూ చేసిన జయప్రకాశ్గౌడ్ హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని తొమ్మిదేళ్లుగా మేధ హైస్కూల్ నడుపుతున్నాడు. పాఠశాల కరస్పాండెంట్గా పనిచేస్తూనే మత్తుపదార్థాల తయారీ దందాకు తెరతీశాడు. వనపర్తి ప్రాంతానికి చెందిన జయప్రకాశ్... మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో కల్లు దుకాణాలకు ఆ్రల్ఫాజోలం సరఫరా చేయడం ప్రారంభించాడు. ఆల్ఫ్రాజోలం తయారీ ఫార్ములాను ఒకరి నుంచి నేర్చుకున్న తర్వాత తానే స్వయంగా తయారీ ప్రారంభించాడు. ఇందుకు తాను నడుపుతున్న పాఠశాల అయితే ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో ఇక్కడే రెండు పెద్ద గదుల్లో ఆ్రల్ఫాజోలం తయారీ మొదలుపెట్టాడు. అవసరమైన కెమికల్స్. ఇతర పదార్థాలను రాత్రి సమయాల్లో తెచ్చేవాడు. ఉదయం పాఠశాల నడిచే సమయంలో ఆ రెండు గదులకు తాళం వేసి ఉంచేవాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా వెళ్లిన తర్వాత ఆ్రల్ఫాజోలం తయారీ మొదలుపెట్టేవాడు. ఈ విషయం పాఠశాల సిబ్బందికి, ఇతరులకు తెలియకుండా పాఠశాలతో సంబంధం లేని మురళీసాయి, ఉదయ్ సాయిలను తనతోపాటు చేర్చుకున్నాడు. గత ఆరు నెలలుగా ఇక్కడ ఆ్రల్ఫాజోలం తయారు చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? ఈ ఆ్రల్ఫాజోలంను ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయిస్తున్నారా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
రేపటి నుంచి తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు బంద్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపటి(సోమవారం, సెప్టెంబర్ 15వ తేదీ) నుంచి ఉన్నత విద్యాసంస్థలను బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర హయ్యర్ ఇన్స్టిట్యూషన్ అసోసియేషన్ వెల్లడించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి విద్యార్థులు ఎవరూ కాలేజీలకు రావొద్దని పిలుపునిచ్చింది. డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, నర్సింగ్ సహా అన్ని కాలేజీల బంద్కు పిలుపునిచ్చింది. టెన్త్ తర్వాత ఉన్న అన్ని కళాశాలల విద్యార్థుల తరగతులకు రావొద్దని పేర్కొంది. అదే సమయంలో రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలను సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీనిలో భాగంగా పరీక్షలను వాయిదా వేయాలని వర్సిటీలను కోరినట్లు తెలిపింది. విద్యార్థులు రేపటి నుంచి కళాశాలకు రావొద్దని, వాటికి తాళాలు వేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఫీజు రీయయింబర్స్మెంట్ బకాయిల నిలిపివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన అసోసియేషన్.. 23, 24 తేదీల్లో హైదరాబాద్లో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయనుంది. 20 రోజుల క్రితమే కాలేజీల బంద్పై సీఎస్కు నోటీస్ ఇచ్చామని, కనీసం 21లోగా రూ. 1800 కోట్ల బకాయిలు చెల్లించాలని పేర్కొంది. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని, అక్టోబర్ 31వ తేదీ నాటికి రెండో విడత బకాయిలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేసింది. ఇక డిసెంబర్ 31వ తేదీ నాటికి మొత్తం బకాయిలు చెల్లించాల్సిందేనని తమ డిమాండ్లో పేర్కొంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రతీ ఏడాది మార్చి 30లోగా చెల్లించేలా జీవో ఇవ్వాలని అసోసియేషన్ పేర్కొంది. -
నాగోల్లో దారుణం.. భార్య గొంతు కోసిన భర్త
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం జరిగింది. భర్త తన భార్య గొంతును కోసిన ఘటన నాగోల్లో చోటు చేసుకుంది. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.గత యాడాది క్రితమే మహాలక్ష్మి(20)కి వేణుగోపాల్తో వివాహమైంది. అదనపు కట్నం తేవాలంటూ పెళ్ళైన నెల నుండే భార్యపై భర్త పలుమార్లు దాడి చేశాడు. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చినా భర్త తీర మారలేదు. వేణుగోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
'టీ బ్రేక్' ఎలా వచ్చిందో తెలుసా..!
సంస్కృతి పరంగా ఎన్నో రకాల గొప్పతనాన్ని కలిగి ఉన్న మన నగరం, చక్కని చిక్కని చాయ్ సంస్కృతికి కూడా ప్రసిద్ధి చెందింది. నగర రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారింది. కాసిన్ని కబుర్లు కలబోసుకునే స్నేహితుల కోసం కావొచ్చు.. కాస్ట్లీ లావాదేవీలు నిర్వహించే కార్పొరేట్స్కి కావొచ్చు.. టీ బ్రేక్స్ ఉండాల్సిందే.. ఇంత బలంగా సిటీ లైఫ్లోకి చొచ్చుకుపోయిన చాయ్ పునాదులు కూడా అంతే బలమైనవి అంటోంది చరిత్ర. మొఘలుల కాలంలో, ఇది పాలకవర్గానికి చెందిన ఒక ఫ్యాషన్ పానీయంగా చరిత్రకారులు పేర్కొంటారు. ఈ ప్రాంతాన్ని శతాబ్దాల తరబడి పాలించిన నిజాంలు టీ తాగడాన్ని తాము ఆస్వాదించడంతో పాటు ప్రజలనూ ప్రోత్సహించారు. అదే చేత్తో వారు దక్షిణాదికి తీసుకువచ్చిన పర్షియన్ ప్రభావాలు టీ చుట్టూ ఒక అధునాతన మర్యాద వ్యవస్థను రూపొందించడంలో సహాయపడ్డాయి. పర్షియన్ టీ హౌస్ల స్ఫూర్తితో నగరంలో తొలిదశ ఇరానీ కేఫ్లను జొరాస్ట్రియన్ వలసదారులు ప్రారంభించారని చెబుతారు. ఇవి తొలినాళ్లలో కేవలం పురుషుల రాజకీయ చర్చలకే పరిమితమై ఉండేవట.ఏదేమైనా నేడు అది ఒక అందమైన శక్తివంతమైన చాయ్ కల్చర్గా నగరంలో స్థిరపడింది. ప్రస్తుతం నగరంలో చాయ్ ఒక పానీయం మాత్రమే కాదు.. ఉల్లాసమైన సంభాషణలతో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన సామాజిక అనుభవం కూడా. టీ సంస్కృతి నగరంలో వరి్థల్లడానికి బాటలు వేసిన వాటిలో ఇరానీ కేఫ్స్దే ప్రధాన పాత్ర కాగా మిగిలినవి కూడా తమవంతు పాత్ర పోషించాయి.రుచికరమైన వంటకాలతో పాటు చాలా చరిత్ర కలిగిన అత్యంత ప్రజాదరణ పొందాయి ఇరానీ కేఫ్లు ‘ఇరానీ చాయ్’ సహా వివిధ రకాల టీలను ఇవి అందిస్తాయి.స్నేహపూర్వక చాయ్ వాలాలు నిర్వహించే స్ట్రీట్ చాయ్ స్టాల్స్ కూడా సిటీలో టీ కల్చర్కు తమవంతు బలాన్ని అందించాయి. తక్కువ, సరసమైన ధరలకు పొగలు వచ్చే ఛాయ్లను ఇవి అందిస్తాయి.ఇటీవల వినూత్న మిశ్రమాలు ఫ్యూజన్ పానీయాలను అందించే ఆధునిక కేఫ్ సంస్కృతిని సైతం నగరం స్వీకరిస్తోంది. చాయ్ పాయింట్, చాయ్ షాయ్ మసాలా, చాయ్ లాట్టే, ఐస్డ్ చాయ్ వంటివి విభిన్న రుచులతో ప్రయోగాలు చేసే యువతను ఆహా్వనిస్తున్నాయి. సిటీలో చాయ్ వ్యాపారం ఒక భారీ పరిశ్రమగా మారింది. అనేక మంది వ్యవస్థాపకులు తమ సొంత టీ బ్రాండ్లు కేఫ్లను ప్రారంభించారు. చాయ్ సబ్స్క్రిప్షన్ సేవలను ప్రారంభించి, తాజా మిశ్రమ టీలను వినియోగదారుల ఇంటికే అందించే వారు కూడా ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న తరాన్ని చేరుకోవడానికి ఆన్లైన్లో చాయ్ని ఆర్డర్ చేసే యాప్లు ప్లాట్ఫారమ్లు కూడా ఉద్భవించాయి. చాయ్ రుచి కోసం ఎక్కువ మంది వినియోగిస్తుండగా, ఆరోగ్యం కోసం కూడా కొందరు ఎంచుకుంటున్నారు. దీని తయారీలో అల్లం ఏలకులు మిరియాలు తదితర సుగంధ ద్రవ్యాలు సైతం మేళవిస్తూ ఆరోగ్యార్థులను ఆకట్టుకుంటున్నారు.నగరంలో చాయ్ మాత్రమే కాదు దానికి తోడుగా తీసుకునే సైడ్ డిష్లూ అంతే ఫేమస్. తేలికపాటి తీపి, ఉప్పదనాల కలయికగా ఉండే ఉస్మానియా బిస్కెట్లు ఇరానీ చాయ్తో శతాబ్దాలుగా జట్టు కట్టాయి. అలాగే టీతో జత కట్టడంలో ఖారా బిస్కెట్స్ కూడా వీటితో పోటీపడుతున్నాయి. మరోవైపు మసాలా దినుసులతో నిండిన త్రిభుజాకారపు పట్టి సమోసా కూడా క్లాసిక్ కాంబినేషన్స్లో ఒకటిగా కొనసాగుతోంది. ఉల్లి సమోసాలతో పాటు ఇప్పుడు పోహా సమోసా దాకా భిన్న రకాలు వచ్చేశాయి. మలైబన్, బన్మస్కా వంటి బన్స్ క్లాసిక్ ఆధునిక కేఫ్లు అందించే ఇరానీ చాయ్కి ప్రసిద్ధ అనుబంధంగా పేరొందాయి.కేఫ్ నీలోఫర్: నగరంలోని అత్యంత ప్రసిద్ధ ఐకానిక్ టీ హౌస్లలో ఒకటి, ఇది ఒక సాధారణ స్టాల్ నుంచి బహుళ అవుట్లెట్ బ్రాండ్గా విస్తరించింది. మార్చి 2025లో, ఇది రాయదుర్గంలో 40,000 చదరపు అడుగుల దేశంలోనే అతిపెద్ద కేఫ్ను ఏర్పాటు చేసింది.చార్మినార్ సమీపంలో ఉన్న నిమ్రా కేఫ్ బేకరీ, తాజా బిస్కెట్లు స్ట్రాంగ్ చాయ్లతో స్థానికులతో పాటు పర్యాటకులనూ స్వాగతిస్తుంది.జూబ్లీహిల్స్లోని చాయ్ పానీ కేఫ్ భిన్న రకాల చాయ్ వెరైటీలకు పేరొందింది. ఇది చాయ్తో పాటు వైవిధ్యభరిత రెట్రో వాతావరణాన్ని అందించే ప్లేస్. దీని అల్లం టీ బాగా ఫేమస్..బ్లూ సీ: సికింద్రాబాద్లో పేరొందిన ఇరానీ చాయ్ సెంటర్ ఇది. టీతో పాటు ఎగ్ పఫ్లు, దిల్ఖుష్(తీపి బన్)లకు ప్రసిద్ధి.రోస్ట్ సిసికె: బంజారాహిల్స్లోని ఈ కేఫ్ వివిధ రకాల బేకరీ ఉత్పత్తులను అందిస్తుంది. ఇక్కడి మసాలా చాయ్కి ఫ్యాన్స్ ఉన్నారు.కాఫీ సంగమ్: 90ల నాటి క్లాసిక్ తెలుగు స్నాక్స్ను తిరిగి గుర్తు చేసే కేఫ్, కడక్ చాయ్తో పాటు పామ్ షుగర్ బన్ శాండ్విచ్లు వంటి ప్రత్యేకమైన కాంబినేషన్కు పేరొందింది.అబిడ్స్లో 1935లో ఏర్పాటైన గ్రాండ్ హోటల్ సిసలైన హైదరాబాదీ చాయ్ను అందిస్తుంది. సోమాజిగూడలోని రెడ్ రోజ్ రెస్టారెంట్ విద్యార్థులు యువతను ఆకట్టుకుంటుంది. ఇన్స్ట్రాగామ్లో సైతం ఈ కేఫ్ యాక్టివ్గా ఉండటం విశేషం.అఫ్జల్గంజ్లోని గ్రాండ్ ఓవెన్ బేకరీ/ కేఫ్ గ్రాండ్ ఓవెన్ అనేది ఇరానీ కేఫ్ ఆధునిక కేఫ్ సంస్కృతుల మేళవింపుగా టేస్టీ చాయ్లకు పేరొందింది. -
వెయ్యి టన్నుల నిమజ్జన వ్యర్థాల తొలగింపు
బంజారాహిల్స్: వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత హుస్సేన్సాగర్తో పాటు చుట్టూ ఉన్న రోడ్లు, ఫుట్ఫాత్ల నుంచి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సిబ్బంది వెయ్యి టన్నుల నిమజ్జన వ్యర్థాలు, చెత్తాచెదారం తొలగించారు. ఈ నెల 6వ తేదీ విగ్రహాల నిమజ్జనం నుంచే హుస్సేన్సాగర్లో నుంచి, రోడ్లు, ఫుట్పాత్ల నుంచి వ్యర్థాల తొలగింపు పనులను జీహెచ్ఎంసీ సర్కిల్–17 సిబ్బంది ముమ్మరం చేశారు. హుస్సేన్సాగర్ చుట్టూ 500 మంది పారిశుద్ధ్య కారి్మకులు ఈ చెత్త తొలగింపులో పాల్పంచుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నిమజ్జన వ్యర్థాలు 150 టన్నుల మేర అదనంగా తొలగించినట్లు అధికారులు తెలిపారు. గతేడాది 850 టన్నుల వ్యర్థాలు తొలగించగా ఈ ఏడాది వెయ్యి టన్నులకు చేరింది. సుమారుగా అయిదున్నర లక్షల మంది భక్తులు ఈ సారి నిమజ్జన వేడుకలను తిలకించడానికి వచ్చారు. 40 వేల పెద్ద వినాయక విగ్రహాలు ఈ సారి నిమజ్జనం చేయగా గతేడాది కంటే 5 వేల విగ్రహాలు అదనంగా పెరిగాయి. నిమజ్జనానికి తిలకించడానికి వచి్చన భక్తుల ద్వారా టన్నుల కొద్ది పేపర్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాస్లు, ప్లాస్టిక్ సంచులు, విగ్రహాల అలంకరణ, పూజా సామగ్రి పెద్ద సంఖ్యలో పేరుకుపోవడమే కాకుండా వీటి తొలగింపు కూడా సిబ్బందికి సవాల్గా మారింది. విగ్రహాల నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరగడంతో పాటు ఈ సారి చెత్తా చెదారం తొలగింపు కూడా ప్రణాళికాబద్ధంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పండుగ తర్వాత మూడో రోజు నుంచి మొదలైన చెత్తాచెదారం తొలగింపు నిమజ్జనం అనంతరం వారం రోజుల వరకు కొనసాగింది. దీంతో హుస్సేన్సాగర్ చుట్టూ శుక్రవారం నుంచి పూర్తి క్లీన్ అండ్ గ్రీన్ చోటు చేసుకుంది. ఓ వైపు జీహెచ్ఎంసీ ప్రణాళికాబద్ధంగా షిఫ్ట్ల వారీగా సిబ్బందిని నియమించి వ్యర్థాల తొలగింపు చేపట్టగా హెచ్ఎండీఏ కూడా హుస్సేన్సాగర్లో నుంచి 11 టన్నుల వేస్ట్ను తొలగించింది. ఇంకా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది 12 వేల టనుల నిమజ్జన వ్యర్థాలు తొలగించగా ఈ సారి కొంత మేర తగ్గుముఖం పట్టింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో ఐరన్ మెటీరియల్ కూడా పెద్ద మొత్తంలో ఈ సారి తొలగించి హుస్సేన్సాగర్ను క్లీన్ చేశారు. హుస్సేన్సాగర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఎవరికి వారే వ్యర్థాలు, ఇనుప చువ్వలు, ఇతరత్రా వేస్ట్ మెటీరియల్ను తొలగించి ఇప్పుడిప్పుడే ప్రాంతాన్ని కుదుటపడేలా చేశారు. మొత్తానికి గతేడాదితో పోలిస్తే ఈ సారి నిమజ్జన వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగవడమే కాకుండా వాటిని తొలగించడంలో జీహెచ్ఎంసీ పారిశుద్ద్య కారి్మకులు అదనంగా మూడు రోజుల కష్టపడాల్సి వచ్చింది. తొలగించిన వ్యర్థాలను డంపింగ్ యార్డ్కు తరలించినా కూడా జీహెచ్ఎంసీకి ఒక సవాల్గా మారింది. మొత్తానికి పది రోజులుగా దృష్టి పెట్టిన సిబ్బంది ఇప్పుడిప్పుడే సమస్యను కొలిక్కి తీసుకొచ్చారు. -
Hyderabad: ఈ క్యూ రేషన్ కోసం కాదు, బంగారం కోసం!
హైదరాబాద్: రేషన్ షాపులో సరుకులు తీసుకునేందుకు వచ్చినవారు కాదు వీరంతా. బంగారం కొనేందుకు వీరు ఇలా బారులు తీరారు. పసిడి 10 గ్రాముల ధర రూ.లక్ష దాటి పరుగులు తీస్తున్నా.. గిరాకీ మాత్రం తగ్గలేదనడానికి ఈ క్యూలైన్ చూస్తేనే తెలుస్తోంది. శనివారం అఫ్జల్గంజ్లోని ఓ జ్యువెలరీ షాపు ముందు బంగారం కొనుగోలు చేసేందుకు నగర వాసులు ఇలా క్యూ కట్టిన చిత్రం కనిపించింది. -
రసూల్పురా రద్దీకి చెక్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రసూల్పురా జంక్షన్ ఒకటి. ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి పంజగుట్ట, అమీర్పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలకు వెళ్లేవారు రసూల్పురా జంక్షన్ నుంచే వెళ్తుంటారు. ఆయా ప్రాంతాల నుంచి మినిస్టర్ రోడ్, కిమ్స్, కవాడిగూడ, ముషీరాబాద్, ట్యాంక్బండ్ తదితర ప్రాంతాలకు వెళ్లేవారూ ఈ జంక్షన్ నుంచే ప్రయాణిస్తారు. సికింద్రాబాద్ నుంచి బంజారాహిల్స్ వైపు ఎన్ని ఫ్లై ఓవర్లు ఉన్నా రసూల్పురా జంక్షన్లో మాత్రం ఆగిపోక తప్పడం లేదు. ట్రాఫిక్ ఇబ్బందులతో ఎంతో సమయం వృథా అవుతోంది. వాహనాలకు ఇంధన వ్యయం అధికమవుతోంది. రసూల్పురా జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మిస్తే ఈ ఇక్కట్లు తగ్గుతాయని భావించిన జీహెచ్ఎంసీ సర్వే, ఇన్వెస్టిగేషన్, డీటెయిల్డ్ డిజైన్లతో సహా ఫ్లై ఓవర్ నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. నాలుగు లేన్లతో.. నాలుగు లేన్లతో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.150 కోట్లు. ఇందులో భూ సేకరణ అంచనా వ్యయమే దాదాపు రూ.70 కోట్లు. వై ఆకారంలో రానున్న ఈ ఫ్లై ఓవర్ అప్రోచ్ మార్గం హెచ్ఎంఆర్ఎల్ బిల్డింగ్ ఉత్తరం వైపు నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభంలో నాలుగులేన్లుగా ఉండే ఫ్లై ఓవర్ క్యారేజ్వే 14 మీటర్లుగా ఉంటుంది. రసూల్పురా జంక్షన్ దగ్గర నుంచి మినిస్టర్ రోడ్వైపు, పాటిగడ్డ రోడ్ వైపు రెండు ఆర్మ్లతో వై ఆకారంలో విడిపోతుంది. మినిస్టర్ రోడ్వైపు వెళ్లే ఆర్మ్ మూడు లేన్లతో ఉంటుంది. దీని క్యారేజ్వే వెడల్పు 11 మీటర్లు, పాటిగడ్డవైపు వెళ్లే మార్గం రెండు లేన్లతో ఉంటుంది. దీని క్యారేజ్వే వెడల్పు 7.5 మీటర్లు. రెండేళ్లలో పూర్తి చేయాలి.. పనులకు ఎంపికయ్యే ఏజెన్సీ పనులు రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చాక వాహన ప్రయాణ వేగం కనీసం 40 కేఎంపీహెచ్ నుంచి 65 కేఎంపీహెచ్కు పెరగవచ్చని అధికారులు తెలిపారు. ప్రయాణ మార్గం ఒకే వైపు ఉండే ఈ ఫ్లై ఓవర్ను హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్ట్ కింద ఈపీసీ (ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో చేపడుతున్నారు. -
Hyderabad: నేడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. మిలాద్– ఉన్– నబీ ఊరేగింపు సందర్భంగా ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. మిలాద్–ఉన్–నబీ ఊరేగింపుల దృష్ట్యా ఫలక్నుమా, ఇంజన్ బౌలి, నాగుల్చింత ఎక్స్ రోడ్, హిమ్మత్పురా జంక్షన్, ఓల్గా, హరిబౌలి, పంచ్ మొహల్లా, చార్మినార్, గుల్జార్ హౌజ్, మదీనా జంక్షన్, పత్తర్గట్టి, మీరాలం మండీ, ఎతేబార్ చౌక్, అలీజా కోట్లా, బీబీ బజార్, వాల్టా హోటల్, అఫ్జల్గంజ్ టీ జంక్షన్, ఉస్మాన్ గంజ్, ఎంజే మార్కెట్ జంక్షన్, తాజ్ ఐలాండ్, నాంపల్లి టీ జంక్షన్, హజ్ హౌస్, ఏఆర్ పెట్రోల్ పంప్, నాంపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాయని చెప్పారు. మిలాద్–ఉన్–నబీ ఊరేగింపు కారణంగా ఆదివారం ఓల్డ్ సిటీలోని పర్యాటక ప్రదేశాలను మూసివేయనున్నట్లు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి వెల్లడించారు. చార్మినార్తో పాటు పాతబస్తీలోని స్మారక చిహ్నాలు, పలు పర్యాటక ప్రదేశాలను క్లోజ్ చేయనున్నట్లు ఆయన తెలిపార -
మాట తప్పాడని మట్టుబెట్టారు
కుషాయిగూడ: కొన్నేళ్ల పాటు తమను వెంట తిప్పుకున్నాడని.. మీ లైఫ్ సెట్ చేస్తా.. మంచి జీవితాన్నిస్తానని.. తీరా పక్కకు తప్పించాడని కక్ష పెంచుకున్నవారు శుక్రవారం నడిరోడ్డుపై ఓ రియల్టర్ను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. నమ్మినవారే హత్యకు పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది. హత్యకు వ్యాపార లావాదేవీలే కారణమని కొందరు, వాటాల పంచాయితీ అని మరికొందరు అంటుండగా.. అసలు విషయం మరోవిధంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మీర్పేట్– హెచ్బీకాలనీ డివిజన్ పరిధిలోని మంగాపురం కాలనీలో నివసించే శ్రీకాంత్రెడ్డి రియల్ ఎస్టేట్తో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేసేవారు. లాలాపేట్కు చెందిన ఓ రౌడీషిటర్.. శ్రీకాంత్రెడ్డితో కలిసి వ్యాపారం చేసేందుకు రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈ క్రమంలో కొంత కాలం క్రితం పెట్టుబడి పెట్టిన రౌడీషిటర్ చనిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు డబ్బుల కోసం శ్రీకాంత్రెడ్డిని అడగసాగారు. తనకు వ్యాపారంలో నష్టం వచి్చందని నెట్టుకువచ్చాడు. విసిగి వేసారిపోయిన రౌడీషిటర్ సంబంధీకులు మిన్నకుండిపోయినట్లు తెలిసింది. రూ.2 కోట్ల పెట్టుబడి, మిగిలిపోయిన విషయాలు శ్రీకాంత్రెడ్డి వెంట ఉండేæ ధన్రాజ్, జోసెఫ్లకు కూడా తెలుసు. ఈ విషయంపై పలుమార్లు మాట్లాడుకున్నారు. రూ.2 కోట్లు మిగిలాయి కదా.. తమకు రూ.10 లక్షలు ఇవ్వాలని వారు అడిగినట్లు సమాచారం. ఆ సమయంలో శ్రీకాంత్రెడ్డి సరే అనడంతో వారు ఆశలు పెంచుకున్నారు. బీరు తాగించి.. రూ.10 లక్షల విషయాన్ని ధన్రాజ్, జోసెఫ్లు పలుమార్లు ప్రస్తావించడంతో విసుగుచెందిన శ్రీకాంత్రెడ్డి.. మీతో నాకు సంబంధం లేదంటూ వారిని పక్కకు పెట్టినట్లు తెలిసింది. దీంతో వారు పగ పెంచుకున్నారు. పది రోజుల క్రితం మరోసారి శ్రీకాంత్రెడ్డిని ఆశ్రయించారు. డబ్బుల కోసం వేడుకున్నారు. అయినా శ్రీకాంత్రెడ్డి తీరులో మార్పు రాకపోవడంతో «ధన్రాజ్, జోసెఫ్లు శుక్రవారం మధ్యాహ్నం నుంచే మద్యం తాగారు. మద్యం మత్తులో హెచ్బీకాలనీ, మంగాపురంలోని శ్రీకాంత్రెడ్డి ఆఫీసుకు వెళ్లారు. వారితో పాటు తీసుకువచి్చన బీరులోంచి ఓ గ్లాసు శ్రీకాంత్రెడ్డికి పోసి తాగించారు. చివరి ప్రయత్నంగా మరోసారి డబ్బులు ఇవ్వాలని బతిమిలాడారు. అప్పటికీ శ్రీకాంత్రెడ్డి మాట తీరులో ఏ మాత్రం మార్పు కనిపించకపోవడంతో ఆగ్రహానికి లోనై అతడి గల్లా పట్టుకొని ఆఫీసు బయటికి ఈడ్చుకు వచ్చి కాలనీలో అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి హత్య చేశారు. వీరిద్దరితో పాటు మూడో వ్యక్తి సైతం శ్రీకాంత్రెడ్డి ఆఫీసుకు వచి్చనట్లు తెలిసింది. ఆ మూడో వ్యక్తి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. శ్రీకాంత్రెడ్డి హత్య కేసు నిందితులు ధన్రాజ్, జోసెఫ్తో పాటు మరో వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
‘నాకు టికెట్తో పాటు మంత్రి పదవి కూడా ఇవ్వాలి’
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభవృద్ధి కోసం కృషి చేశానన్నారు. ఎంపీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశానన్నారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా తన మనసులోని మాటను వెల్లడించారు అంజన్ కుమార్ యాదవ్. ‘నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. అందులో భాగంగా నాకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలిఉమ్మడి ఏపీ నుండి యాదవ సామాజికవర్గంకి మంత్రి పదవి కేటాయించారు. నాకన్న సీనియర్లు ఎవరు లేరు....నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రాతినిథ్యం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చి మంత్రి ఇవ్వాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నేను ఉన్న ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. జూబ్లీహిల్స్లో సర్వే చేస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు వస్తుంది’ అని పేర్కొన్నారు. -
పానీపూరీ తిని నెల రోజులు ఆస్పత్రిపాలైన సాఫ్ట్వేర్ ఇంజినీర్
హైదరాబాద్: రోడ్డుపక్కన పానీపూరీ బండి కనపడగానే నోరు ఊరుతుంది. కానీ, అందులో వాడే నీళ్ల నాణ్యత గానీ, అమ్మే వ్యక్తి పాటించే పరిశుభ్రత గానీ పట్టించుకోకుండా తినడానికి వెళ్తే ఒక్కోసారి పెనుముప్పు వాటిల్లుతుంది. నగరానికి చెందిన 22 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ విషయంలో ఇలాగే జరిగింది. పానీపూరీ తిని, తీవ్రమైన హెపటైటిస్ ఎ ఇన్ఫెక్షన్ బారిన పడిన ఆ యువకుడు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. దాంతో అన్నాళ్లూ ఉద్యోగానికి దూరం కావడమే కాక, చికిత్స ఖర్చు భారం కూడా అతడి మీద పడింది. నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి వైద్యులు సకాలంలో చికిత్స చేసి అతడి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్. కలువల హర్ష తేజ తెలిపారు. “కళ్లు, చర్మం పసుపుపచ్చగా అయిపోవడం (కామెర్లు), కడుపులో ఏదో ఇబ్బంది, వికారం, వాంతులు, నీరసం, మూత్రం బాగా ముదురు రంగులో ఉండడం లాంటి సమస్యలతో ఆ యువకుడు ఆస్పత్రికి వచ్చాడు. ఏం జరిగిందని లోతుగా ప్రశ్నిస్తే, తాను రెండు వారాల క్రితం రోడ్డుపక్కన పానీపూరీ తిని, అక్కడ డబ్బాలో మంచినీళ్లు తాగానని చెప్పాడు. రక్తపరీక్షలు చేయడా హెపటైటిస్ ఎ తీవ్రంగా ఉందని, దాంతోపాటే కాలేయంలోని ఎంజైమ్లు పెరిగాయని, యాంటీ-హెచ్ఏవీ ఐజీఎం యాంటీబాడీలు పాజిటివ్ అని తేలింది.చాలామంది యువతలో హెపటైటిట్ ఎ దానంతట అదే తగ్గిపోతుంది. కానీ, నిర్లక్ష్యం చేస్తే అది చాలా ఇబ్బంది, సమస్యలు తెస్తుంది. వీధుల్లో అపరిశుభ్రంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎంత తీవ్రమైన కాలేయ ఇన్ఫెక్షన్లు వస్తాయో ఈ కేసు వల్ల తెలుస్తుంది. ఆ యువకుడికి ముందుగా హైడ్రేషన్ ఇచ్చి, కాలేయాన్ని కాపాడే మందులు, ఇతర చికిత్సలతో 2-3 వారాలు పూర్తిగా విశ్రాంతి ఇచ్చాం. ఎప్పటికప్పుడు పరీక్షలు చేశాం. కాలేయం క్రమంగా మెరుగుపడింది. నాలుగు వారాలకు అతడు పూర్తిగా కోలుకున్నాడు. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌన్సెలింగ్ ఇచ్చి, భవిష్యత్తులో రక్షణ కోసం హెపటైటిస్ ఎ టీకా తీసుకోవాలని సూచించాం" అని తెలిపారు.మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అనే రోజువారీ పనుల్లో జాగ్రత్తలు పాటిస్తే మన కాలేయం భద్రంగా ఉంటుందని, పాటించకపోతే ముప్పులో పడుతుందని వైద్యులు చెబుతున్నారు. తగిన అవగాహన, నిరోధక టీకాలు అందించడం ద్వారా ఇలాంటి నిరోధించగల వ్యాధుల నుంచి సమాజాన్ని రక్షించవచ్చు.-డాక్టర్. కలువల హర్ష తేజ, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ -
హైదరాబాద్లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)
-
తెలంగాణలో ఐదు జిల్లాలకు హెచ్చరిక.. అతి భారీ వర్షసూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం ఐదు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరో 19 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఇక, అంతకుముందు.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. ఆదివారం మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని తెలిపింది.LOCALISED HEAVY THUNDERSTORMS ALERT TODAY ⚠️⛈️ Today, the Upper air circulation (UAC) centre is falling right on Telangana Scattered SEVERE THUNDERSTORMS expected in North, West, Central TG districts like Adilabad, Asifabad, Nirmal, Nizamabad, Karimnagar, Jagitial,…— Telangana Weatherman (@balaji25_t) September 13, 2025 Today’s Forecast (Sept 13, 2025) ⛈️⛈️Heavy to Very Heavy Rains likely across North, West, Central TG at few places. Moderate Rains in South, East TG‼️Hyderabad : Intense Spell at few places— Weatherman Karthikk (@telangana_rains) September 13, 2025 -
రేణు అగర్వాల్ కేసు.. పోలీసులు అదుపులో నిందితులు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులను స్పెషల్ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితుల్లో ఒకరిని ఢిల్లీలో, మరో ఇద్దరిని జార్ఖండ్లో పట్టుకున్నారు. దీంతో, వారిని హైదరాబాద్కు తరలిస్తున్నారు.వివరాల ప్రకారం.. రాకేష్, రేణు అగర్వాల్కు ఫతేనగర్లో స్టీల్ దుకాణం ఉంది. కూతురు తమన్నా చదువు నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉంది. కొడుకు శుభం వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. స్పాన్ లేక్లోనే మరో అపార్ట్మెంట్లో రాకేష్ బంధువులు నివసిస్తున్నారు. ఆ ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ అనే యువకుడు పని చేస్తున్నాడు. అయితే.. రోషన్ తన స్నేహితుడు హర్షను జార్ఖండ్ నుంచి రప్పించి.. 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనిలో కుదిర్చాడు. ఈ ఇద్దరికీ రూ.15వేల జీతంతో పాటు అక్కడే ఆశ్రయం కల్పించారు.బుధవారం ఉదయం రాకేష్, శుభం స్టీల్ దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదు ఇంటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. రాత్రి 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టిన రేణు తీయలేదు. దీంతో ప్లంబర్ని పిలిపించి వెనుకవైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. లోపలికి వెళ్లి చూడగా.. హాల్లో రేణు కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపుమడుగులో కనిపించడంతో తండ్రికి, పోలీసులకు శుభం సమాచారమిచ్చాడు.ప్రాథమిక విచారణలో.. వేలిముద్రలో సరిపోలడంతో రోషన్, హర్షలే రేణు అగర్వాల్ను హతమార్చినట్లు తేలింది. ఆమె కాళ్లు చేతులు కట్టేసి తలపై కుక్కర్తో కొడుతూ బంగారం, నగదు కోసం చిత్రహింసలకు గురి చేశారు. ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె ఒంటిపై నగలను సూట్ కేసులో సర్దేసుకున్నారు. రక్తపు మరకలున్న దుస్తులను అక్కడే వదిలేసి.. శుభ్రంగా స్నానం చేసి సూట్కేసుతో బయటకు వచ్చేశారు. ఈ సమయంలో సీసీటీవీల్లో దృశ్యాలు నమోదు అయ్యాయి. చివరకు.. ఓనర్కు చెందిన స్కూటీపైనే ఇద్దరూ పరారయ్యారు. కూకట్పల్లి పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి.. నిందితుల కోసం గాలించారు. తాజాగా నిందితులు ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. -
శ్మశానంలో వ్యభిచారం నిర్వహిస్తున్న మాధవి..!
హైదరాబాద్: శ్మశానవాటికలో అయితే ఎలాంటి అనుమానం రాదనుకున్నదో ఏమో..ఓ మహిళ ఆ ప్రాంతాన్ని వ్యభిచార కేంద్రంగా మార్చింది. యువతులను తీసుకువచ్చి విటులను ఆహా్వనించి ఆమె కొనసాగిస్తున్న వ్యభిచార గృహం గుట్టురట్టయ్యింది. నిర్వాహకురాలితో పాటు ఓ మహిళ, విటుడిని పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. బేగంపేట శ్యాంలాల్బిల్డింగ్స్ సమీపంలోని ధనియాలగుట్ట శ్మశానవాటికలోని ఓ గదిలో వ్యభిచార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ఓ మహిళతో పాటు విటుడు గదిలో ఉండడాన్ని గుర్తించారు. మారీ మాధవి (39) అనే మహిళ ఇక్కడి గదిని వ్యభిచార గృహంగా మార్చినట్లు గుర్తించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి మహిళలను, యువతులను తీసుకువచ్చి విటులకు సమాచారం అందించి రప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో మాధవి ఒప్పుకుంది. దీంతో నిర్వాహకురాలు మాధవితో పాటు గదిలో ఉన్న మహిళ, విటుడిగా వచ్చిన బాలానగర్కు చెందిన ఓ సివిల్ కాంట్రాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1600 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కళ్లల్లో కారం కొట్టి.. కత్తులతో బెదిరించి..హైదరాబాద్లో దారిదోపిడీ..
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో దారిదోపిడీ కలకలం రేపుతోంది.హైదరాబాద్కు చెందిన స్టీలు వ్యాపారి రాకేష్ అగర్వాల్.. తన కారు డ్రైవర్..వ్యాపార భాగస్వామిని వికారాబాద్ నుంచి రూ.40లక్షల నగదు తీసుకుని రావాలని పురమాయించారు.అయితే, కారు డ్రైవర్,పార్టనర్ ఇద్దరు కలిసి వికారాబాద్ నుంచి రూ.40లక్షల నగదు తీసుకుని శంకర్పల్లి మీదిగా కీసర బయల్దేరారు. శంకర్పల్లి మండలం పర్వేడ వద్దకు రాగానే.. ఆ కారును వెనుక నుంచి ఓ స్విప్ట్ వాహనం ఢీకొట్టింది.వెంటనే మెరుపు వేగంతో రాకేష్ అగర్వాల్ మనుషులపై కారంపొడి చల్లి, నకిలీ గన్నుతో బెదిరించారు. రూ40లక్షలు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ కొత్తపల్లి గ్రామం వద్ద నిందితుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వాహనం బోల్తా పడడంతో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్థానికులు నిందితుల్ని ప్రశ్నించడంతో భయాందోళనకు గురైన నిందితులు రూ.40లక్షల నగదులో కొంతమొత్తాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు.దోచుకున్న మొత్తాన్నికారులో వదిలేసి పారిపోయారు. వాహనం బోల్తాపై సమాచారం అందుకున్న శంకర్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.స్పాట్లో రూ.8లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దోపిడికి వినియోగించిన పిస్తోల్ డమ్మీదని గుర్తించారు. నెంబర్ ప్లేటుకూడా డమ్మీదని తేల్చారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్ అగర్వాల్ మనుషులు రూ.40లక్షల తీసుకువస్తున్నారని దుండగులకు ఎవరు సమాచారం ఇచ్చారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. -
హైదరాబాద్ 4.0 దిశగా శరవేగంగా అడుగులు
నిజాం కాలంలో 1591లో పురుడు పోసుకున్న హైదరాబాద్ నగరం అభివృద్ధి ప్రస్థానం నేడు శరవేగంగా సాగుతోంది. తాజాగా ఫ్యూచర్ సిటీ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 1998లో ఐటీ రాకతో హైదరాబాద్ వేగం మరింత పుంజుకుంది. అప్పటివరకు హైదరాబాద్, సికింద్రాబాద్లకే పరిమితమైన అభివృద్ధి సైబరాబాద్కు విస్తరించింది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్రోడ్డు, మెట్రోల ఏర్పాటుతో నగర రూపురేఖలే మారిపోయాయి. అంతర్జాతీయ మౌలిక వసతులు, నైపుణ్య కారి్మకుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, కాస్మోపాలిటన్ కల్చర్, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలతో ప్రపంచ దిగ్గజసంస్థలు నగరంలో కొలువుదీరాయి. అయితే గ్రేటర్పై ఒత్తిడి పెరగడంతో దానికి అనుబంధంగా నాలుగో నగరం అనివార్యమైపోయింది. ప్రధాన నగరంలో రద్దీని తగ్గించడంతోపాటు భవిష్యత్తు అవసరాల కోసం ఫ్యూచర్ సిటీ ఏర్పాటు తప్పనిసరైంది. –సాక్షి, సిటీబ్యూరోప్రపంచంలో కోటి జనాభా ఉన్న 37 మెగా నగరాల్లో ఆరు ఇండియాలోనే ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా నగరాలు కేవలం జనాభా సెంటర్లు మాత్రమే కాదు. ప్రధాన ఆరి్థక, ఉద్యోగ కేంద్రాలు కూడా. 146 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో దాదాపు 37 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 53 శాతానికి, 87.6 కోట్ల జనాభాకు చేరుతుందని అంచనా. మన మెట్రో నగరాలు ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నాయి. విధానపరమైన మార్పులు, స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రపంచీకరణ, శ్రామిక జనాభా పెరుగుదల వంటివి నగరాల అభివృద్ధి, విస్తరణకు ప్రధాన కారణాలు.మహానగరం మనదే.. ప్రపంచవ్యాప్తంగా నగరాలు ఆర్థిక వృద్ధికి ఇంజిన్లు అని చెప్పవచ్చు. ప్రపంచ జీడీపీలో 80 శాతం కంటే ఎక్కువ వాటా నగరాలదే. ఉత్పాదకత, ఆవిష్కరణ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధిని సాధించడంలో నగరాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాలు 4,308 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్నాయి. 1995 నుంచి 2025 మధ్య కాలంలో ఈ నగరాలు ఏకంగా 2,136 చ.కి.మీ. విస్తరించాయి. గత మూడు దశాబ్దాల్లో విస్తీర్ణాలు 98 శాతం పెరిగాయి. ఇందులో అత్యధిక విస్తీర్ణం హైదరాబాద్దే. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ 7,257 చదరపు కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది.వృద్ధి ఎక్కడ్నుంచి ఎక్కడికి.. 1990 చివర్లో హైదరాబాద్లో ఫార్మాతోపాటు ఐటీ, ఐటీఈఎస్ రంగం జోరందుకుంది. దీంతో 2000 సంవత్సరాంతంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ అప్గ్రేడ్ అయ్యాయి. 2008లో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ప్రపంచ ప్రయాణికులు, కార్గో సేవలతో వృద్ధి రెండింతలైంది. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనతో నగరం పశి్చమ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్ను విమానాశ్రయానికి అనుసంధానించింది. దీంతో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నైపుణ్య కారి్మకులకు నగరం వేదికైంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు చేసిన వ్యాపార అనుకూల విధానాలతో ఆరి్థక, సాంకేతిక కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత బలోపేతమైంది. ఔటర్, మెట్రోలు అందుబాటులోకి రావడంతో నగరంలో కనెక్టివిటీ మరింత పెరిగింది. దీంతో నగరాభివృద్ధి పశి్చమం వైపు నుంచి దక్షిణం దిశగా విస్తరించింది.గ్రేటరే..7,257 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో పట్టణ ప్రాంతం 519 చ.కి.మీ. 1995లో 267 చ.కి.మీ.లుగా ఉన్న నగర అర్బన్ ఏరియా 2005లో 319 చ.కి.మీ. 2015లో 407 చ.కి.మీ.లకు విస్తరించింది. గత మూడు దశాబ్దాల్లో గ్రేటర్ పట్టణ ప్రాంతం 252 చ.కి.మీ. పెరిగింది. 95 శాతం మేర వృద్ధి చెందింది. 1995లో 49 లక్షలుగా ఉన్న గ్రేటర్ జనాభా 2015 నాటికి 87 లక్షలు, ఇప్పుడు 1.13 కోట్లకు చేరింది. గత 30 ఏళ్లలో జనాభా 131 శాతం పెరిగింది. ఐటీ, ఐటీఈఎస్, ఫార్మాసూటికల్స్, బయో టెక్నాలజీ, టూరిజం ఇదే నగరాభివృద్ధికి చోదకాలు.హెచ్ఎంఆర్ దిశగా.. దేశానికే తలమానికంగా నిలిచేలా తెలంగాణలో ఒక ప్రధాన పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్, యాదాద్రి–భువనగిరి, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను కలుపుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్(హెచ్ఎంఆర్)ను ప్రతిపాదించింది. 10,472.723 చ.కి.మీ. మేర విస్తరించి ఉండే హెచ్ఎంఆర్.. రీజినల్ రింగ్ రోడ్డుతో అనుసంధానమై ఉంటుంది. దీంతో హైదరాబాద్తోపాటు పొరుగు జిల్లాల అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది.మాస్టర్ ప్లాన్ తప్పనిసరి ఏ నగరానికైనా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అవసరం. మౌలిక వసతుల కల్పనతోపాటు పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చే మాస్టర్ప్లాన్ ప్రకారమే అభివృద్ధి జరగాలి. సిటికీ వలసలు పెరుగుతుండటంతో పట్టణ ప్రాంతం విస్తరిస్తుంది. – కె.విద్యాధర్, డైరెక్టర్, హెచ్ఎండీఏఉద్యోగ అవకాశాల గని ఉద్యోగ, ఉపాధి అవకాశాల పుష్కలంగా ఉండటమే హైదరాబాద్ అభివృద్ధికి కారణం. పటిష్టమైన లా అండ్ ఆర్డర్, నైపుణ్య కార్మికుల లభ్యత, కాస్మోపాలిటన్ కల్చర్ వంటి వాటితో నగరంలోకి జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి.–కె.ఇంద్రసేనారెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ -
ఎఫ్డీడీఐ-హైదరాబాద్లో కొత్త కోర్సులు
రాయదుర్గం: ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్–హైదరాబాద్ క్యాంపస్లో కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఫుట్వేర్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్, రిటైల్ అండ్ డిజిటల్ ఫ్యాషన్ వ్యాపారం, లెదర్ యాక్సెసరీస్, బ్యాగ్ల అభివృద్ధి రంగాల్లో పరిశ్రమలు, సిద్ధంగా ఉన్న విద్యార్థుల నైపుణ్యాలను బలోపేతం చేయడానికి, ఉపాధిని పెంచడానికి దోహదం చేసేలా డిప్లొమో కోర్సుల ముఖ్య లక్షణంగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కోర్సులను ఆరు నెలల వ్యవధి గల రెండు మాడ్యూల్లుగా విభజించారు. అభ్యాసకులు ఒక మాడ్యూల్ను అనుసరించి సర్టిఫికెట్ పొందవచ్చు. రెండు మాడ్యూల్లను పూర్తి చేసి పూర్తి సంవత్సరం డిప్లొమో పొందడానికి అవకాశం కల్పిస్తారు. అందుబాటులోకి వచ్చే కోర్సులు ఇవే.. మొదటి విడతలో నూతనంగా డిప్లొమో ఇన్ ఫ్యాషన్ డిజైన్, డిప్లొమో ఇన్ ఫుట్వేర్ టెక్నాలజీ, డిప్లొమో ఇన్ లెదర్ యాక్సెసరీస్ అండ్ బ్యాగ్ డెవలప్మెంట్, డిప్లొమో ఇన్ రిటైల్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో డిప్లొమో ఇన్ ఫ్యాషన్ డిజైన్, డిప్లొమో ఇన్ ఫుట్వేర్ టెక్నాలజీ, డిప్లొమో ఇన్ లెదర్ యాక్సెసరీస్ అండ్ బ్యాగ్ డెవలప్మెంట్ కోర్సులకు ఒక్కోదానికి ఒక్క మాడ్యూల్కు రూ.45 వేలు, డిప్లొమో ఇన్ రిటైల్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ ఒక్క మాడ్యూల్కు రూ.40 వేలను చెల్లించాల్సి ఉంటుంది.ఈ కోర్సుల కోసం దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. కోర్సులను అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తులు వెబ్సైట్ www.fddiindia.comలో అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 94404 71336, 99667 55563, 99667 55536లలో సంçప్రదించాలని అధికారులు సూచించారు. ఇతర వివరాలకు రాయదుర్గంలోని ఎఫ్డీడీఐ–హైదరాబాద్ క్యాంపస్లో సంప్రదించాలని సూచించారు. -
నన్హీ పరీ
ఈ రోజుల్లో పిల్లలందరూ ప్రతిభాఘనులే! అయితే చదువు ఒత్తిడిలో అది మసకబారుతోంది! అలాంటి పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు తమ ప్రజ్ఞను ప్రదర్శించడానికి భువనేశ్వర్లోని కిట్స్ (కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వేదిక కల్పిస్తోంది.. ‘నన్హీ పరీ లిటిల్ మిస్ ఇండియా’ పేరుతో!ఈ పోటీల్లో పదమూడేళ్ల నుంచి పదిహేనేళ్ల బాలికలందరూ పాల్గొనవచ్చు! విజేతలకు క్యాష్ప్రైజ్తోపాటు గెలుపొందిన స్థానాన్ని బట్టి కిట్స్లో తమకు ఇష్టమైన కోర్స్లో ఉచిత, భారీ రాయితీలతో విద్యనూ అందిస్తోంది. ఆ వివరాలు.. టాలెంట్ లేని పిల్లలు కనపడట్లేదిప్పుడు. ఇంజినీరింగ్, మెడిసిన్ చదువులకు స్కూల్ నుంచే పునాది వేస్తూ పిల్లల్లోని సహజమైన ప్రతిభను బయటకు రానీకుండా చేస్తున్నాం. దానివల్ల వాళ్లు తమకు పరిచయంలేని పదిమంది ముందుకు రావడానికి జంకుతున్నారు. మాట్లాడ్డానికి వణుకుతున్నారు. వేదికెక్కడానికి వెనుకాడుతున్నారు. దాన్ని గమనించింది.. ఆడపిల్లల చదువు కోసం కొన్ని దశాబ్దాలుగా పాటుపడుతున్న కిట్స్. ఒక్క చదువుకే కాదు బాలికల ప్రతిభాపాటవాలకూ ప్లాట్ఫామ్ కావాలని నిశ్చయించుకుంది. 2001లో ఒడిశాలో ‘నన్హీ పరీ లిటిల్ మిస్ ఇండియా’ పోటీలను మొదలుపెట్టింది. 2004కల్లా ఉత్తర భారతంలోని ప్రతి రాష్ట్రం పాల్గొనే స్థాయికి ఎదిగింది. 2015లో దక్షిణాది రాష్ట్రాలకూ చేరిన ఈ పోటీలు ఇప్పుడు జాతీయ స్థాయిని అందుకున్నాయి. ఈ ఏడు పాతికేళ్ల సంబరాన్ని జరుపుకోనున్నాయి. వీటి కోసం తెలుగు రాష్ట్రాల బాలికలకు ఈ నెల 20న హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీలో ఆడిషన్స్ జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 13–15 ఏళ్ల బాలికలు తమ పరిచయంతోపాటు తమ ప్రతిభను చూపే వన్ మినిట్ వీడియోను https://forms.gle/ 1QzSwfVcuPy5jTto8 అనే లింక్కి గానీ, 8790161155/ 8790163355 నంబర్లకు వాట్సాప్ గానీ, kiitnanhipari.hyd@ gmail.comకి మెయిల్ గానీ చేయొచ్చు. ఆఖరు తేదీ 15 సెప్టెంబర్. 20వ తేదీన జరిగే ఆడిషన్స్లో ఇంట్రడక్షన్, పెర్ఫార్మెన్స్ అనే రెండు రౌండ్లు ఉంటాయి. ఇందులోంచి ఇద్దరు భువనేశ్వర్లో జరిగే ఫైనల్స్కి ఎంపిక అవుతారు. అలా దేశమంతటా ఆడిషన్స్ జరిగి.. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికై ఫైనల్ పోటీలకు వస్తారు. రెండు రోజులు జరిగే ఈ పోటీల్లోంచి ముగ్గురు విజేతలను ఎంపికచేస్తారు. మొదటి బహుమతిగా పదిలక్షల క్యాష్ ప్రైజ్, కళింగ ఇన్స్టిట్యూట్లో ఉచిత విద్య, ఫస్ట్ రన్నరప్కి రూ. అయిదు లక్షల క్యాష్ ప్రైజ్, కిట్స్లో యాభై శాతం ఫీజు డిస్కౌంట్, సెకండ్ రన్నరప్కి రూ. మూడు లక్షల క్యాష్ ప్రైజ్, కిట్స్లో యాభై శాతం ఫీజు డిస్కౌంట్ ఉంటుంది. ఇవికాక మరో పది కేటగిరీల్లో కేటగిరీకి రూ. 20 వేల చొప్పున మొత్తం రూ. 2 లక్షల క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఇలా ఈ పోటీలు భవిష్యత్లో అమ్మాయిలు పలు అంతర్జాతీయ వేదికల మీద బెరుకు లేకుండా పెర్ఫార్మెన్స్ ఇచ్చేలా... ఇలాంటి పోటీల్లో నిర్భయంగా పాల్గొనేలా తర్ఫీదునిస్తున్నాయి. -
దంచికొట్టిన వాన
సాక్షి, హైదరాబాద్/మెదక్ మున్సిపాలిటీ/తాండూరు రూరల్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి. హైదరాబాద్తోపాటు మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. మెదక్లో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 3 గంటలపాటు కుండపోత వాన కురిసింది. దీంతో మెదక్ పట్టణం అతలాకుతలమైంది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 17.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ చెరువులను తలపించగా, పట్టణంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరింది. పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోవడంతో విద్యా ర్థులు అవస్థలు పడ్డారు. మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో 13 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాజధానిలో... హైదరాబాద్లో ఉదయం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా కన్పించిన వాతావరణం మధ్యాహ్నం మూడు తర్వాత ఆకాశంలో ఒక్కసారిగా దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. హయత్నగర్లో 11.2 సెం.మీ., డిఫెన్స్ కాలనీ కమాన్ వద్ద 10.2 సెం.మీ, వర్షపాతం నమోదైంది. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపైకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్దుపై నాలుగు అడుగుల ఎత్తు మేర వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఎల్బీనగర్ నుంచి మెహిదీపట్నం వరకు ఉన్న ఇన్నర్ రింగ్రోడ్డు సహా ఇతర మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. వాగులో ఒకరి గల్లంతు వాగు దాటుతుండగా ఓ వ్యక్తి గల్లంతైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెంకలాన్లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భుక్తంపల్లి మొగులప్ప(40) ఆవుల కాపరిగా పని చేస్తున్నాడు. గురువారం అతను ఊరి శివారులోని చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో వృథాగా పడేసిన టార్ఫాలిన్, ప్లాస్టిక్ కవర్ల కోసం దిడ్డివాగు దాటి వెళ్లాడు. ఎగువ ప్రాంతంలో కరిసిన వర్షానికి వరద ఉధృతమైంది. అవతలి ఒడ్డున ఉన్న గ్రామస్తులు వద్దని వారిస్తున్నా వినకుండా కవర్ల మూటను నెత్తిపై పెట్టుకుని వాగు దాటుతూ కొట్టుకుపోయాడు. అతని భార్య లలితమ్మ, ఇద్దరు కొడుకులు అక్కడికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. మొగులప్ప ఆచూకీ కోసం చేపట్టిన సహాయక చర్యలకు వర్షం ఆటంకం కలిగించింది. రెండ్రోజులు మోస్తరు వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాత ఆవర్తనం గురువారం కూడా కొనసాగింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 4.5 కి.మీ. ఎత్తువరకు కొనసాగుతోంది. మరో ద్రోణి సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కిం ప్రాంతం నుంచి జార్ఖండ్, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది. ప్రస్తుత నైరుతి సీజన్లో ఇప్పటివరకు సగటున 64.05 సెం.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 78.52 సెం.మీ. నమోదైంది. -
Hyderabad: హైదరాబాద్లో పలుచోట్ల వర్షం (ఫోటోలు)
-
హైదరాబాద్లో DESRI కొత్త ఆఫీస్
ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ అయిన DESRI.. హైదరాబాద్లోని ఆర్ఎంజెడ్ నెక్సిటీలో తన కొత్త కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. భారతదేశంలోని అత్యంత నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల నుంచి ప్రయోజనం పొందుతూ, హైదరాబాద్ను తన ప్రపంచ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో కంపెనీ దీనిని ప్రారంభించింది.2014లో హైదరాబాద్లో మొదటిసారి కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి.. కౌంటింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్స్, లీగల్, పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్తో సహా వివిధ రంగాలలో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. నేడు కంపెనీ అనేక కీలకమైన కార్యకలాపాలలో కీలక పాత్రను పోషిస్తోంది.కొత్త కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా.. DESRI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ జ్విల్లింగర్ మాట్లాడుతూ, హైదరాబాద్ DESRIకి వ్యూహాత్మక కేంద్రంగా మారింది. అంతే కాకుండా ఆధునిక మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ఆర్ఎంజెడ్ నెక్సిటీలో మా కొత్త కార్యాలయం ప్రారంభం, భారతదేశంలో మా ఉనికిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అన్నారు. -
వారసత్వం.. జవసత్వం!
హైదరాబాద్ నగరంలోని వారసత్వ కట్టడాలను ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నగరంలో చాలా చారిత్రక భవనాలు, ప్రదేశాలు, స్మారక చిహ్నాలు తదితర వారసత్వ కట్టడాలు ఉన్నాయి. పట్టించుకునేవారు లేక అవి మరుగున పడిపోతున్నాయి. వాటిని పరిరక్షించి నేటి ప్రజలకు, సందర్శకులకు నచ్చేవిధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా వాటికి తగిన గుర్తింపు లభించడమేకాక పర్యాటక ప్రాంతాలుగానూ అభివృద్ధి చెందుతాయని భావిస్తోంది. తొలిదశలో 12 ప్రాంతాల్లోని కట్టడాలను తీర్చిదిద్దాలనుకుంటోంది.అందుకుగాను ఆయా ప్రాంతాల్లోని వనరులు, సదుపాయాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక మ్యూజియాలను ఏర్పాటు చేయాలని, లేదంటే కల్చరల్ సెంటర్లుగా మార్చాలని యోచిస్తోంది. ఈ రెండూ కుదరకుంటే ప్రజలకు ఉపయోపడే మరో రూపంలోనైనా అభివృద్ధి చేయాలనుకుంటోంది. తద్వారా ఓ వైపు చారిత్రక, వారసత్వ ప్రదేశాల పరిరక్షణతోపాటు సందర్శకులతో అవి పర్యాటక ప్రాంతాలుగానూ అభివృద్ధి చెందుతాయని భావిస్తోంది. ఈ దిశగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ల రూపకల్పనకుగాను టెండర్లు ఆహ్వానించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. ఆ యా కట్టడాలు, ప్రదేశాల పరిరక్షణ, పునర్వినియోగం, అభివృద్ధి అంశాల ప్రాతిపదికన ఆయా ఏజెన్సీ డీపీఆర్లు రూపొందించాల్సి ఉంటుందన్నారు. వారసత్వ పరిరక్షణ.. పర్యాటక ఆకర్షణ పాత కట్టడాలను కొత్తగా తీర్చిదిద్దడం ద్వారా సద రు నిర్మాణాల జీవితకాలాన్ని పెంచడం, నగర సాంస్కృతిక వారసత్వాన్ని, శిల్పకళా వైశిష్ట్యాన్ని కాపాడినట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు.టెండర్లు పిలిచిన కట్టడాలు⇒ రోనాల్డ్ రోస్ భవనం, సికింద్రాబాద్ ⇒ చెన్నకేశవస్వామి ఆలయం, చాంద్రాయణగుట్ట ⇒ రేమండ్ సమాధి, మూసారాంబాగ్ ⇒ పురానాపూల్ దర్వాజా, హుస్సేనీ ఆలమ్ ⇒ ఖజానా భవనం, గోల్కొండ ⇒ షంషీర్ కోట, గోల్కొండ ⇒ గగన్ఫౌండ్రీ, అబిడ్స్ ⇒ మసీద్–ఇ–మియాన్ మిష్క్, జుమ్మెరాత్ బజార్ ⇒ టోలి మసీద్, కార్వాన్ ⇒ హయత్ బక్షి బేగం మసీద్, హయత్నగర్ ⇒ షేక్పేట్ మసీద్, షేక్పేట్ ⇒ ఖైరతాబాద్ మసీదు, సమాధి, ఖైరతాబాద్ఎంపికయ్యే ఏజెన్సీ ప్రతి స్థలాన్ని సమగ్రంగా పరిశీలించి, చారిత్రక ప్రాముఖ్యత, ప్రస్తుత పరిస్థితులను డాక్యుమెంట్ చేయాలి. ప్రతి స్థలానికి సంబంధించిన సాంస్కృతిక, చారిత్రక, శిల్పకళ, పర్యావరణ ప్రాముఖ్యతను వివరించాలి. ప్రాజెక్ట్ నిర్వహణ, డిజైన్, పర్యవేక్షణ, చారిత్రక నేపథ్యం, భౌతిక సంరక్షణ, ప్రజల సందర్శన.. ఆర్థిక అవకాశాలు వంటి అంశాలను డీపీఆర్లో పొందుపరచాలి. చదవండి: సరదా కారాదు విషాదం.. మనకు ఇదో హెచ్చరిక! -
సుప్రీంకోర్టు నోటీసులు.. యూటర్న్ తీసుకున్న తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు
సాక్షి,హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు యూ టర్న్ తీసుకున్నారు. తాము కాంగ్రెస్లో చేరలేదని బీఆర్ఎస్లోనే ఉన్నామని స్పష్టం చేశారు.బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇదే అంశంపై తెలంగాణ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు. స్పీకర్ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేశారు.కాంగ్రెస్లో చేరలేదు.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ను కలిశా.బీఆర్ఎస్కు నేను రాజీనామా చేయలేదు-పోచారం శ్రీనివాస్ రెడ్డిమా ఫోటోలను మార్ఫ్ చేశారు. నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా.నాది బీఆర్ఎస్ ఐడియాలజీ- బండ్ల కృష్ణ మోహన్ రెడ్డినేను బీఆర్ఎస్లోనే ఉన్నా.కాంగ్రెస్లో చేరానన్నది అబద్ధం- కాలే యాదయ్యనేను బీఆర్ఎస్లో కొనసాగుతున్నా. కాంగ్రెస్లో చేరలేదు. ఇప్పటికి బీఆర్ఎస్కే నా మద్దతు- గూడెం మహిపాల్ఇప్పటికి బీఆర్ఎస్లోనే ఉన్నా. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశా- అరికెపూడి గాంధీ వివరణిచ్చారు. -
గ్లాస్గో నుంచి డాక్టర్ రఘురాంకు అరుదైన గుర్తింపు
కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ స్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటన్లోని గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ (RCPSG) వారు ఆయనకు గౌరవప్రదమైన ఎఫ్ఆర్సీఎస్(గ్లాస్గో) ను ప్రదానం చేశారు. ఈ గౌరవం పొందిన దక్షిణాసియాలోని అతి పిన్న వయస్కుడైన శస్త్రవైద్యుడిగా ఆయన చరిత్రలో నిలిచారు. ఇది మాత్రమే కాకుండా డాక్టర్ రఘురామ్ 1997లో ఇదే కాలేజ్ నుంచి ఎస్ఆర్సీఎస్ ద్వారా (గ్లాస్గో) పరీక్ష ద్వారా అర్హత పొందారు. ఇప్పుడు అదే కాలేజ్ నుంచి గౌరవ ఫెలోషిప్ పొందిన ప్రపంచంలో ఏకైక శస్త్రవైద్యుడు అయారు.ఈ అత్యున్నత గౌరవం 425 ఏళ్ల పురాతనమైన గ్లాస్గో రాయల్ కాలేజ్ తరఫున, 2025 సెప్టెంబర్ 10న, గ్లాస్గోలోని చారిత్రాత్మక కాలేజ్ హాల్లో జరిగిన ప్రత్యేక్ష కార్యక్రమంలో, కాలేజ్ అధ్యక్షుడు ప్రొఫెసర్ హనీ ఎటీబా డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టికి అధికారికంగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ అధ్యక్షుడు ప్రొఫెసర్ హనీ ఎటీబా మాట్లాడుతూ..డాక్టర్ పిల్లరిశెట్టికి మా కాలేజ్ తరఫున అత్యున్నత గౌరవమైన హానరరీ ఫెలోషిప్ అందించడంలో నాకు ఎంతో ఆనందంగా ఉంది. గత రెండు దశాబ్దాలుగా, ఆయన తన సమస్త జీవనాన్ని రొమ్ము క్యాన్సర్తో పోరాటంలో ప్రజలకు ఆశనిస్తూ, సేవలో నిమగ్నమయ్యారు. బ్రిటన్, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా శస్త్రవైద్యుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించడంలో ఆయన పాత్ర అస్తాధారణం. శస్త్రచికిత్సలో నాణ్యతా ప్రమాణాలు, ప్రజారోగ్యం అభివృద్ధి పరంగా మేము తీసుకుంటున్న మిషన్లో ఆయన ఓ ముఖ్య భాగస్వామిగా మారారు. మా కాలేజ్ కుటుంబంలో ఆయనను ఆహ్వానించడంపై మాకు ఎంతో గర్వంగా ఉంది. భారత్ బ్రిటన్ల మధ్య సంబంధాలను మరింత బలపరిచే దిశగా ఈ కలయిక పనిచేస్తుందని మా విశ్వాసమని పేర్కొన్నారు.గౌరవ ఫెలోషిప్ ప్రదానోత్సవ సందర్భంగా గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ రిజిస్ట్రార్, ట్రస్టీ ప్రొఫెసర్ అభయ్ రేన్ చదివారు. దాదాపు రెండు దశాబ్దాలుగా భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చికిత్సలో డాక్టర్. రఘురామ్ చేసిన విప్లవాత్మక మార్పులు అమూల్యమైనవని ప్రశంసించారు. హైదరాబాద్లో నిర్వహించిన 12 అంతర్జాతీయ ఎస్ఆర్సిఎస్/ఎంఆర్సిఎస్ ప్రిపరేటరీ కోర్సులకు ఆయనే ముందుండి నాయకత్వం వహించారని, వాటి ద్వారా దక్షిణాసియాలోని 2,000 మందికి పైగా వైద్య విద్యార్థులు ప్రతిష్టాత్మక పరీక్షల్లో విజయవంతం అయ్యే అవకాశం పొందారన్నారు. అంతేకాకుండా, భారతదేశంలో కాలేజ్ చేపట్టిన విద్యా కార్యక్రమాలకు డాక్టర్ రఘురామ్ అందించిన వ్యూహాత్మక మార్గనిర్దేశనం ఎంతో కీలకమైందని, అది కాలేజ్ విద్యా ప్రమాణాల బలోపేతానికి దోహదపడిందని ఆయన పేర్కొన్నారు.డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టి మాట్లాడుతూ 'ఈ అత్యున్నత గౌరవాన్ని ప్రదానం చేసినందుకు ఆర్సిపి ఎన్జీ అధ్యక్షుడికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రత్యేక గుర్తింపును నా కుటుంబం, నా రోగులు, నా తల్లితండడ్రులకు ఈ నేలకి అంకితం చేస్తున్నాను.1599లో స్థాపించబడిన గ్లాసో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఇప్పటివరకు 425 సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. బ్రిటిష్ దీవుల్లో ఏకైక బహుళ శాఖా వైద్య కళాశాలగా ఇది ఉన్నది. ప్రపంచంలోని 97 దేశాల నుంచి వచ్చిన 15,000కి పైగా శస్త్రవైద్యులు, దంతవైద్యులు, పొడియాట్రీ మరియు ట్రావెల్ మెడిసిన్ రంగాల్లో పని చేసే నిపుణులను ఇది ప్రతినిధ్యం వహిస్తోంది. తర్వాత, కాలేజ్ అధ్యక్షుడు ప్రఖ్యాత ‘ఎంఆర్సీఎస్’, ఎఫ్ఆర్సీఎస్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సర్టిఫికెట్లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవి. ఇవి ఇంటర్కలేజియేట్ పరీక్షలో ఉత్తీరులు అయిన,శిక్షణ అవసరాలను పూర్తి చేసిన వైద్యులకు మాత్రమే ఇస్తారు.డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టికి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన మరో 7 శస్త్రచికిత్స కళాశాలల నుండి హానర్జరీ ఫెలోషిప్లు ప్రదానం చేయబడ్డాయి. పద్మశ్రీ, డాక్టర్ బీసీ రాయ్ జాతీయ అవార్డు గ్రహీత అయిన ఆయన, బ్రిటన్లోని మూడు శస్త్రచికిత్స రాయల్ కాలేజ్ నుండి, బ్రిటిష్ ప్రభుత్వ నుండి అత్యున్నత గౌరవాలు అందుకున్న ఏకైక శస్త్రవైద్యుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన వ్యక్తిడాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టికి లభించిన ప్రధాన గౌరవాలు ఇవీ:బ్రిటిష్ సామ్రాజ్య గౌరవ విధాన అధికారి (ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ 2020) నైట్హుడ్ను తప్పిస్తే బ్రిటిష్ సామ్రాజ్యంలో రెండో స్థాయి అత్యున్నత అవార్డు.హానరరీ ఎస్ఆర్సీఎస్ (ఇంగ్లాండ్), 2022- రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్లు ఆఫ్ ఇంగ్లాండ్ యొక్క అత్యున్నత గౌరవం.హానరరీ ఎస్ఆర్సీఎస్ (గ్లాస్గో), 2025 - రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో అత్యున్నత గౌరవం. యూకే వెలుపల ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ (ఆర్సీఎస్ ఎడిన్బర్), 2013 నివసిస్తున్న రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ల ఎడిన్బర్గ్ ఫెలోకు లభించే అత్యున్నత గౌరవం. డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టి గత 18 సంవత్సరాలలో భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చికిత్స రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆయన దక్షిణాసియాలోని మొదటి సమగ్ర బ్రెస్ట్ హెల్త్ సెంటర్ ని స్థాపించి, దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ అవగాహన పెంపొందించడానికి ఓ చారిటబుల్ ఫౌండేషన్ కూడా ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభించిన దక్షిణాసియాలోనే అతిపెద్ద జనాభాపరమైన స్క్రీనింగ్ కార్యక్కరమాలు ఆయన అమలు చేశారు. ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించబడుతోంది. భారతదేశంలో రొమ్ము శస్త్రచికిత్స చేసే శస్త్రవైద్యులను ప్రతినిధ్యం వహించే దక్షిణాసియాలోని మొదటి మరియు ఏకైక సంస్థ, "అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా" ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. తన తల్లిప్రేము మరియు సామాజిక సేవా పట్ల ఉన్న అభిమానం ఆయన వ్యక్తిత్వ లక్షణాలు. తెలంగాణలోని ఒక దూర ప్రాంత గ్రామమైన ఇబ్రాహింపూర్ను ఆయన దత్తత తీసుకుని, వ్యక్తిగత దాతృత్వం ద్వారా అక్కడ జీవనోపాధి మార్పులు తేవడమైన పరికరాలు, సౌకర్యాలు అందించారు. ఈ సేవలకు స్థానిక, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో గౌరవాలు లభించాయి.చారిత్రాత్మక ఈ కాలేజ్ తో సన్నిహితంగా సంబంధం కలిగిన కొన్ని ప్రముఖ శస్త్రవైద్యుల్లో ప్రొఫెసర్ పీటర్ లోని ఉన్నారు. ఆయన ఆర్సీపిఎస్టీ స్థాపకుడు కాగా, 1597లో ఇంగ్లీష్ లో తొలి శస్త్రచికిత్స పుస్తకాన్ని ప్రచురించారు. సర్ విలియమ్ మేస్వాన్, 'న్యూరో శస్త్రచికిత్స తండ్రి"గా ప్రసిద్ధి పొందిన ఆయన, మొదటి మెదడు కణితిని తొలగించిన శస్త్రవైద్యుడిగా గుర్తింపు పొందారు. ప్రొఫెసర్ జోసెఫ్ లిస్టర్ శస్త్రచికిత్సలో శుద్ధి పద్దతుల పితామహుడిగా పేరుగాంచారు. ప్రొఫెసర్ సర్ గ్రీమ్ టీస్ డేల్ మరియు ప్రొఫెసర్ బ్రయాన్ బెనెట్ గ్లాస్గో కోమా స్కేల్ను స్థాపించారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అవగాహన స్థాయిని అంచనా వేయడానికి ఉపయోగించే ప్రసిద్ధ పరికరం, అలాగే, ప్రొఫెసర్ జమిని సేన్ భారతీయ శస్త్రవైద్యురాలు మరియు 1912లో ఈ కాలేజ్లో తొలి మహిళా ఫెలోగా ఎంపికైన వ్యక్తి -
స్కూల్ కి వెళ్తూ మ్యాన్ హోల్ లో పడిపోయిన బాలిక
-
హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం
-
హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం(సెప్టెంబర్ 11వ తేదీ) సాయంత్రం సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట్, ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్, శామీర్పేట్, అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెట్, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. హయత్ నగర్-విజయవాడ రహదారిపై చేరిన వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హయత్నగర్ కోర్టు, ఆర్టీసీ డిపోలోకి వరద నీరు చేరింది. ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.ఇక మెదక్ జిల్లాలో ఈరోజు మూడు గంటల వ్యవధిలో భారీ నుంచి అతి భారీ వర్షంపడింది. మూడున్నర గంటల వ్యవధిలో 13 సెం.మీ అతి భారీ వర్షం పడింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాజీపల్లి 9.2, పాతుర్ 8 సెం. మీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరింది. గాంధీ నగర్ కాలనీని రోడ్డు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రామ్ దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద పోటెత్తింది. మెదక్-హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో మధ్యలో ఉన్న డివైడర్ను అధికారులు తొలగించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో మొన్నటి పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
అన్ని పార్టీలకూ సవాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని పార్టీలూ సవాల్గా తీసుకోవడంతో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. బుధవారం నియోజకవర్గంలోని రహ్మత్నగర్ డివిజన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు ముఖ్య నాయకులతో పాటు మాగంటి గోపీనాథ్ భార్య సునీత కూడా పాల్గొన్నారు. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ స్థానం ఖాళీ అయినందునే ఈ ఉప ఎన్నిక జరుగుతుండటం తెలిసిందే. గోపీనాథ్ ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎవరికే ఆపద వచ్చినా అండగా ఉండేవారని, ఆయన మరణంతో అనుకోకుండా వచి్చన ఈ ఎన్నికలో మాగంటి కుటుంబానికి ప్రజలంతా అండగా ఉండాలని కేటీఆర్ పిలువపునివ్వడంతో పాటు, తనకు అండగా నిలవాలని సునీత కూడా కోరడంతో ఇక ఆ నియోజకవర్గ అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించడం లాంఛనప్రాయమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గోపీనాథ్ మరణం వల్ల సానుభూతి పవనాలు బీఆర్ఎస్కు ఉపకరించగలవా అనే చర్చలు జరుగుతున్నాయి. సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్ గెలవడంతో, బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కోల్పోయింది. ఇప్పుడు గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఎన్నికలో ఘన విజయంతో ప్రజలు తమ వెంటే ఉన్నారని, తిరిగి జైత్రయాత్ర ప్రారంభించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలు, హైడ్రా కూల్చివేతలవంటివి అస్త్రాలుగా మలచుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్కు రెఫరెండం ఇక ఈ ఎన్నికలో గెలుపు కాంగ్రెస్కు రెఫరెండంగా పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి త్వరలో రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఇతర ప్రతిపక్ష పారీ్టలు సైతం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడం ద్వారా రాబోయే రోజుల్లో గెలిచేది తామేనని చెప్పేందుకు ఎవరి వ్యూహాల్లో వారున్నారు. పార్టీల వ్యూహం ఇలా.. కాంగ్రెస్: ఈ ఎన్నికలో గెలుపు ద్వారా తమ పాలన కు ప్రజల రెఫరెండం అని బలంగా చెప్పవచ్చని భా విస్తూ ఇప్పటికే కొన్ని వ్యూహాలు అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీఅధ్యక్షుడు మహేశ్గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్చార్జిమీనాక్షి నటరాజన్ వంటి నేతలు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్లకు నియోజకవర్గంలోని డివిజన్ల బాధ్యతలు అప్పగించి, బూత్ స్థాయి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు, పేదలకు సన్నబియ్యం సహా ఇతర హామీల అమలు వంటి అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. బీజేపీ: ఈ ఎన్నికలో గెలవడం ద్వారా పజ్రలు తమవైపు మొగ్గుచూపుతున్నారని చెప్పడంతో పాటు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారం తమదేనని బీజేపీ చెప్పాలనుకుంటోంది. కేంద్రమంత్రి కిషన్రెడ్డి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దాకా నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేటర్లతోనూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తోంది. ఈ ఎన్నిక కోసం మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి బూత్స్థాయిలో సమన్వయం చేస్తోంది. బీఆర్ఎస్: సిట్టింగ్ సీటు కావడంతో బీఆర్ఎస్ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం కృషి చేస్తోంది. గోపీనాథ్ మరణంతో ప్రజల్లో ఏర్పడిన సానుభూతి ఉపకరిస్తుందనే మాగంటి సునీత తమ అభ్యర్థి అనే సంకేతాలిచ్చింది. మాగంటి గోపీనాథ్ వరుసగా మూడు పర్యాయాలు గెలిచిన నేపథ్యం ఉంది. మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభల ద్వారా పార్టీ ఐక్యతను చాటుతోంది. సునీత ఇప్పటికే ఇంటింటి ప్రచారం ప్రారంభించి, తన భర్త చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రజలతో మమేకమవుతోంది. తాజాగా తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేటీఆర్ స్వయంగా పాల్గొనడం, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశంతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న వారిని గుర్తించి తమవైపు తిప్పుకోవాలనే యోచనలో ఉంది. మజ్లిస్: జూబ్లీహిల్స్లో మైనారిటీ ఓటర్లు కీలకంగా ఉండటంతో, మజ్లిస్ మద్దతు పెను ప్రభావం చూపనుంది. మజ్లిస్ పోటీ చేస్తుందా, కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తుందా చూడాల్సి ఉంది. -
అసలేం జరిగిందంటే..? కూకట్ పల్లి ఘటనపై ACP క్లారిటీ
-
అధికారుల నిర్లక్ష్యం.. మ్యాన్ హోల్ లో చిన్నారి
-
Kukatpally: బంగారం కోసం మహిళా దారుణ హత్య
-
కూకట్పల్లి రేణు కేసు.. ఆ ఇద్దరూ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన రేణు అగర్వాల్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వంట మనిషి, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెను కిరాతకంగా హత్య చేసి.. ఆపై ఇంట్లోని నగదుతో అక్కడి నుంచి పారిపోయారు. ఇద్దరు నిందితులూ జార్ఖండ్కు చెందిన వాళ్లుగా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. కూకట్పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటిలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. రేణు అగర్వాల్ అనే మహిళ ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా.. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్తో పాటు క్లూస్ టీం ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన బాలనగర్ డీసీపీ దర్యాప్తు బృందం నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ, వేలి ముద్రలు ఇతరత్ర సాక్ష్యాల ఆధారంగా హత్య జరిగిన తీరుపై ఓ నిర్ధారణకు వచ్చారు. రాకేష్,రేణు అగర్వాల్కు ఫతేనగర్ లో స్టీల్ దుకాణం ఉంది. కూతురు తమన్నా చదువు నిమిత్తం వేరే రాష్ట్రంలో ఉంది. కొడుకు శుభం వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. స్పాన్ లేక్లోనే మరో అపార్ట్మెంట్లో రాకేష్ బంధువులు నివసిస్తున్నారు. ఆ ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ అనే యువకుడు పని చేస్తున్నాడు. అయితే.. రోషన్ తన స్నేహితుడు హర్షను జార్ఖండ్ నుంచి రప్పించి.. 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనిలో కుదిర్చాడు. ఈ ఇద్దరికీ రూ.15వేల జీతంతో పాటు అక్కడే ఆశ్రయం కల్పించారు.బుధవారం ఉదయం రాకేష్,శుభం స్టీల్ దుకాణానికి వెళ్లగా ఇంట్లో రేణు ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఐదు ఇంటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు.రాత్రి 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టిన రేణు తీయలేదు. దీంతో ప్లంబర్ని పిలిపించి వెనుకవైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు. లోపలికి వెళ్లి చూడగా.. హాల్లో రేణు కాళ్లు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపుమడుగులో కనిపించడంతో తండ్రికి, పోలీసులకు శుభం సమాచారమిచ్చాడు. ప్రాథమిక విచారణలో.. వేలిముద్రలో సరిపోలడంతో రోషన్, హర్షలే రేణు అగర్వాల్ను హతమార్చినట్లు తేలింది. ఆమె కాళ్లు చేతులు కట్టేసి తలపై కుక్కర్తో కొడుతూ బంగారం, నగదు కోసం చిత్రహింసలకు గురి చేశారు. ఆపై కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె ఒంటిపై నగలను సూట్ కేసులో సర్దేసుకున్నారు. రక్తపు మరకలున్న దుస్తులను అక్కడే వదిలేసి.. శుభ్రంగా స్నానం చేసి సూట్కేసుతో బయటకు వచ్చేశారు. ఈ సమయంలో సీసీటీవీల్లో దృశ్యాలు నమోదు అయ్యాయి. చివరకు.. ఓనర్కు చెందిన స్కూటీపైనే ఇద్దరూ పరారయ్యారు. కూకట్పల్లి పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి.. నిందితుల కోసం గాలిస్తున్నారు. పారిపోయేందుకు ఉపయోగించిన స్కూటీ జాడ కూడా ఇంకా లభ్యం కాలేదు.బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శకూకట్పల్లిలో పనిమనుషుల చేతుల్లో దారుణ హత్యకు రేణు అగర్వాల్ కుటుంబాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. రాకేష్, శుభంలను ఓదార్చారాయన. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీస్ అధికారులతో ఆయన కేసు స్టేటస్ గురించి ఆరా తీశారు. -
కూకట్ పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో మహిళ దారుణ హత్య
-
ప్రేమకథ షురూ
దుల్కర్ సల్మాన్ని ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని రయ్ రయ్మంటూ పూజా హెగ్డే బండి నడిపారు. ఇద్దరూ ఎలా చిరునవ్వులు చిందించారో ఇక్కడున్న ఫొటోలో చూడొచ్చు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్గా ఓ ప్రేమకథా చిత్రం షురూ అయింది. రవి నెలకుదిటి దర్శకునిగా పరిచయం చేస్తూ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డేని కథానాయికగా ప్రకటించి, బుధవారం ఆమె షూట్లో పాల్గొన్న విషయాన్ని చిత్రబృందం తెలియ జేసింది. ‘‘రవి నెలకుదిటి చక్కని ప్రేమకథ రాశారు. ఈ కథలో మంచి హ్యూమన్ డ్రామా, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు ఉన్నాయి’’ అని కూడా యూనిట్ పేర్కొంది. పాన్–ఇండియా మూవీగా ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్, కెమెరా: అనయ్ ఓం గోస్వామి. -
కూకట్పల్లిలో దారుణం.. అపార్ట్మెంట్లో మహిళ హత్య
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో దారుణం జరిగింది. రేణు అగర్వాల్(50) అనే మహిళ హత్యకు గురయ్యారు. కాళ్లు, చేతులు కట్టేసిన దుండగులు.. ఆ మహిళను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు.ఇంట్లో పనిచేసే వ్యక్తులే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సరదా కారాదు విషాదం.. మనకిదొక హెచ్చరిక!
సాక్షి, హైదరాబాద్: ‘‘బెంగళూరులో ఓ బాలుడు కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. సన్రూఫ్లోంచి తల బయటికి పెట్టి వెళ్తుండగా.. డ్రైవర్ రోడ్డుపై ఉన్న ఓవర్ హెడ్ బారికేడ్ను గమనించకుండా అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అంతే అకస్మాత్తుగా బారికేడ్ బాలుడికి తగిలి తల పగిలిపోయింది.’’ అయితే ఈ ఘటన పొరుగు రాష్ట్రంలో జరిగినప్పటికీ.. మనకిదొక హెచ్చరిక! ఈ రోజుల్లో ప్రతి మోడ్రన్ కారుకు సన్రూఫ్ (Sunroof) తప్పనిసరి అయిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ సన్రూఫ్ అనుభూతిని పొందాలని భావిస్తున్నారు. అయితే ఆనందం మాటున ప్రమాదం కూడా పొంచి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చాలామంది యువతీ యువకులు సన్రూఫ్లోంచి బయటికి చూస్తూ వికృత చేష్టలకు పాల్పడుతుంటారు. సెల్ఫీలు దిగుతూ, రీల్స్ చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు. పిల్లలను తిప్పడం, తిరగడం పేరెంట్స్కు ఓ సరదా, స్టేటస్ సింబల్. అయితే ఈ సరదా విషాదం కాకూడదని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.సరదా కారాదు విషాదం..ఇరుకు, బిజీ రోడ్లలో ఎత్తయిన వాహనాలు వెళ్లకుండా పోలీసులు ఓవర్ హెడ్ బారికేడ్లను ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి రోడ్లలో సన్రూఫ్ నుంచి వేలాడుతూ ప్రయాణించకూడదు. విద్యుత్ వైర్లు, టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు, పతంగుల దారాలు, మాంజా, ఇతరత్రా సన్నని తీగలు రోడ్లపై వేలాడుతుంటాయి. ఇది సాధారణంగా డ్రైవర్లకు కనిపించవు. దీంతో సన్రూఫ్లో ప్రయాణించే వారికి ఇవి తగిలి మెడ, తల, మొండెం భాగాలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంది. అలాగే నడుం భాగం వరకూ బయట పెట్టి చేతులను ఊపుతూ ప్రయాణిస్తున్న క్రమంలో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే సన్రూఫ్లో ఉన్నవారికి పట్టు ఉండదు. దీంతో సన్రూఫ్ ఫ్రేమ్ తగిలి పక్కటెముకలు, ఊపిరితిత్తులకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. పొత్తి కడుపులో బలంగా తగిలితే తీవ్ర రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. వంకలు, మూల వంపులు అధికంగా ఉన్న రోడ్లలో అయితే ఏకంగా కార్లో నుంచి కిందపడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.సహజ కాంతి కోసమే..సన్రూఫ్ అనేది కేవలం వెంటిలేషన్ కోసమే ఉద్దేశించబడింది. కారు క్యాబిన్ స్పేస్ విశాలంగా అనిపించడంతో అత్యవసర పరిస్థితుల్లో కారు డోర్లు లాక్ అయిపోతే సన్రూఫ్ నుంచి బయటికి వెళ్లిపోవచ్చు. అంతేకాకుండా వేసవి కాలంలో ఎండలో కార్ పార్కింగ్ చేసినప్పుడు క్యాబిన్ చాలా వేడెక్కిపోతుంది. ఇలాంటి సమయంలో ఏసీ ఆన్ చేసి, సన్రూఫ్ను తెరిస్తే కారులోని వేడి గాలి బయటికి వెళ్లి, కార్ క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది. ఇరుకైన రహదారులు, బిజీ రోడ్లలో సన్రూఫ్లను వినియోగించకూడదు. వీటిని హైవేలు, వెడల్పాటి రోడ్లపై మాత్రమే వినియోగించాలి.జైలు, జరిమానా..ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ ఉల్లంఘనల తరహాలోనే బిజీ రోడ్లపై సన్రూఫ్ వినియోగాన్ని కూడా తీవ్రమైన నేరంగా పరిగణించాలని ట్రాఫిక్ నిపుణులు సూచిస్తున్నారు. సన్రూఫ్లతో వ్యక్తిగతంగా ప్రాణాంతకమే కాకుండా రోడ్లపై ఇతర వాహనదారులకు అంతరాయం కలిగిస్తుంది. సన్రూఫ్, కారు కిటికీల నుంచి తలను బయటికి వేలాడుతూ ప్రయాణం చేస్తే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్–281 కింద కేసులు నమోదు చేస్తారు. ఈ కేసులలో ఆరు నెలల వరకు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా లేదా రెండూ విధించవచ్చు. అలాగే ఇతర వాహనాల నుంచి వెళువడే పొగ, దుమ్ము ధూళి నేరుగా ముక్కులోకి వెళ్లి రోగాలకు కారణమవుతాయి.చదవండి: జేఈఈ అడ్వాన్స్డ్ లేకుండానే.. ఐఐటీలో అడ్మిషన్!ఆలోచింపజేసిన రాచకొండ పోస్టుసన్రూఫ్ ప్రయాణం చాలా ప్రమాదం అంటూ రాచకొండ పోలీసులు అవగాహన కోసం సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు అందరినీ ఆలో చింపజేస్తోంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఆనందం కోసం ఇలా ప్రమాదకరంగా స్టంట్లు చేయొద్దంటూ బెంగళూరులో జరిగిన సన్రూఫ్ ప్రమాద ఘటన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లతో ఈ వీడియో హల్చల్ చేస్తుంది. -
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో వర్షం పడుతోంది. గచ్చిబౌలి, కొండాపూర్, షేక్పేటలో కుండపోత వర్షం కురిసింది.తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొన్ని చోట్ల కుండపోత వర్షం కురిసింది. సెప్టెంబర్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడంతో పాటు.. వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది. కామారెడ్డి, జనగామ, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం అసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. -
శిల్పారామం వేదికగా ఛాప్..!
చేనేత, హస్తకళలు.. వీటి కొనసాగింపులో ఆధునిక ఫ్యాషన్, టెక్నాలజీ వంటి అంశాలతో దేశంలోనే అతిపెద్ద కార్యక్రమ నిర్వహణకు కేంద్ర టెక్స్టైల్ మినిస్ట్రీ, నేషనల్ ఇన్ష్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ శాఖ భాగస్వామ్యంతో ‘ఛాప్’ నిర్వహించనున్నారు. నగరంలోని శిల్పారామం వేదికగా ఈ నెల 12 నుంచి 17 వరకూ జరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలను ప్రతినిధులు నిఫ్ట్ వేదికగా మంగళవారం వెల్లడించారు. ఛాప్ 2025లో భాగంగా భారతదేశపు చేనేత, హస్తకళల వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు సమకాలీన డిజైన్ల ఆవిష్కరణ, వ్యవస్థాపకత ప్రాధాన్యతను తెలియజేసేలా భిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. శిల్పారామం వేదికగా నిర్వహించే స్టాల్స్లో హస్తకళాకారులు, నిఫ్ట్ పూర్వ విద్యార్థులు, వ్యవస్థాపకులు, డిజైనర్లు, పరిశ్రమల ప్రముఖులు భాగస్వామ్యం కానున్నారు. రాష్ట్రంలోని టూరిజం డెస్టినేషన్ ప్రాధాన్యతను ప్రదర్శించి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని క్లస్టర్ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ పూర్వ ఖురానా పేర్కొన్నారు. ఫ్యాషన్ షోలు, మాస్టర్ క్లాసులు.. దేశవ్యాప్తంగా 19 నిఫ్ట్ క్యాంపస్లు ఉన్నాయని, హైదరాబాద్ క్యాంపస్ భాగస్వామ్యంతో ఈ ప్రదర్శనలో 60 క్రాఫ్టŠస్, 40 అలుమ్ని బృందాలు పాల్గొంటాయి. ఆరు రోజుల కార్యక్రమంలో దేశవ్యాప్తంగా చేనేత, హస్త కళాకారుల ప్రదర్శనలతో పాటు ఫ్యాషన్ షోలు, మాస్టర్ క్లాసులు, 6 ప్రధాన క్రాఫ్ట్ ప్రదర్శనలు చేపట్టామని, విద్యార్థుల పరిశోధనాత్మక డాక్యుమెంటేషన్స్ కూడా ప్రదర్శిస్తాం. తెలంగాణలోని తోలుబొమ్మలాట లాంటి అరుదైన కళల ప్రాధాన్యత తెలియజేసి, పలు అరుదైన కళలకు పేటెంట్స్, జీయో ట్యాగ్ ప్రాధాన్యత వంటి అంశాలపై అవగాహన కలి్పంచనున్నాం. – డా.మాలిని, నిఫ్ట్ డైరెక్టర్ (చదవండి: సౌకర్యం + సంతోషం = కవాయి) -
సన్నగా బియ్యం.. తిన్నగా నల్లబజార్కు!
పాతబస్తీకి చెందిన మహమూద్కు కొత్త రేషన్ కార్డు మంజూరైంది. సెప్టెంబర్ నెలవారీ రేషన్ కోటా విడుదలైంది. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ జరుగుతుండటంతో కోటా డ్రా చేసి తెచ్చుకునేందుకు డీలర్ వద్దకు హుషారుగా వెళ్లాడు. కార్డు నెంబర్ చెప్పి ఈ–పాస్ యంత్రంపై బయోమెట్రిక్ పెట్టాడు. కార్డులో నలుగురు సభ్యులు ఉండటంతో 24 కిలోల బియ్యంపై తీసుకొవచ్చని భావించాడు. కానీ, డీలరు అందరి మాదిరిగానే నగదు కావాలా? బియ్యం కావాలా? అడిగాడు. అలోచిస్తున్న లోపే ‘బియ్యం వండుకొని తినలేరు. ముద్దముద్ద అవుతుంది. వృథా ఎందుకు? నగదు తీసుకోండి’అంటూ కిలోకు రూ.12ల చొప్పున లెక్కకట్టి రూ.288 చేతిలో పెట్టాడు. నెలవారీ కోటా డ్రా కోసం వచ్చిన మిగతా కార్డుదారుల్లో మెజార్టీ పరిస్థితి ఇదే. చేసేదేమీ లేక చేతిలో పెట్టిన నగదును జేబులో పెట్టుకొని ఇంటిముఖం పట్టక తప్పడంలేదు. ఇలాంటి ఉదంతాలు ప్రతిరేషన్ షాపులో నిత్యకృత్యం.సాక్షి, హైదరబాద్: ఇది రేషన్ బియ్యం కథ.. బియ్యం మారినా డీలర్ల తీరు మారలేదు. అదే చేతివాటం.. అదే తప్పుదారి.. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న ‘ఉచిత సన్న బియ్యం’నగదు దందా బాహాటంగా కొనసాగుతోంది. ఆహార భద్రత (రేషన్) కార్డుదారులు సన్న బియ్యంపై కూడా అనాసక్తి కనబర్చడం డీలర్లకు కలిసివస్తోంది. కొందరు కార్డుదారులు ఈ–పాస్ యంత్రంపై బయోమెట్రిక్ (వేలిముద్ర) పెట్టి నెలవారీ బియ్యం కోటాను డీల్లకు అప్పగించి నగదు పుచ్చుకోవడం, డీలర్లు కూడా కిలో ఒక్కంటికి రూ.12ల చొప్పున లెక్క కట్టి నగదు అందించడం సర్వసాధారణమైంది. సన్నబియ్యంపై కూడా.. పూట గడవని అత్యంత నిరుపేద కుటుంబాలు మినహా మిగతా కుటుంబాలు పీడీఎస్ బియ్యం వండుకొని తినడానికి పెద్దగా ఆసక్తి కనబర్చరు. మొన్నటి వరకు బియ్యం దొడ్డుగా, నాసిరకం, ముక్కి పోయి ఉండటం, వండి తిన్న తర్వాత జీర్ణం కాకపోవడం లాంటి కారణాలతో పెద్దగా ఆసక్తి కనబర్చేవారు కాదు. కొన్ని కుటుంబాలు మాత్రం రేషన్ బియ్యాన్ని కేవలం ఇడ్లీ, దశలు, పిండి వంటలకు వినియోగిస్తున్నారు. ప్రతినెలా ఉచితంగా అందుతుండటం, అవసరానికి మించి వస్తుండటంతో డీలర్లకు అప్పగిస్తూ వచ్చేవారు. తాజాగా సన్నబియ్యం పంపిణీ జరుగుతున్నా లబి్ధదారులను డీలర్లు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక యూనిట్ బియ్యమే... కొందరు కార్డుదారులు తమ నెలవారీ కోటాలో ఒక యూనిట్ బియ్యమే తీసుకొని మిగతా యూనిట్ల కోటాను డీలర్ల వద్ద నగదు రూపంలో బదిలీ చేసుకుంటున్నారు. వాస్తవంగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ఈ–పాస్ (బయోమెట్రిక్) అమలు కంటే ముందు రేషన్ డీలర్లు చేతివాటం ప్రదర్శించి డ్రా చేయని లబి్ధదారుల సబ్సిడీ సరుకులు గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకునేవారు. సంస్కరణలో భాగంగా ఈ– పాస్ అమలుతో లబ్ధిదారులు బయోమెట్రిక్, ఐరిస్, ఓటీపీ తప్పనిసరి కావడంతో డీలర్లు లబి్ధదారుల ప్రమేయంతో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యం పీడీఎస్ బియ్యం అక్రమ దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అడపాదడప విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసుల దాడుల్లో పీడీఎస్ బియ్యం క్వింటాళ్ల కొద్దీ పట్టుబడుతోంది. స్పెషల్ డ్రెవ్ సమయంలో బియ్యం వ్యాపారులు ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్గా.. మౌనం దాల్చుతున్నారు. అ తర్వాత తిరిగి దందాను కొనసాగించడం సర్వసాధారణంగా మారింది. -
కూటమి వేధింపులు.. వైఎస్సార్సీపీ వెన్న రాజశేఖర రెడ్డి అరెస్ట్
సాక్షి, పల్నాడు: ఏపీలో వైఎస్సార్సీపీ నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపుల పర్వం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయిస్తూ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్సీపీ స్టేట్ సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీని పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. కూటమి సర్కార్ పాలనలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై వేధింపులు ఆగడం లేదు. తాజాగా పిడుగురాళ్ల పోలీసులు హైదరాబాద్కు వెళ్లారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ స్టేట్ సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీ వెన్న రాజశేఖర రెడ్డిని తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ కేసులు పెట్టి అదుపులోకి తీసుకున్నారు. -
చాంపియన్ హైదరాబాద్
చెన్నై: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన హైదరాబాద్ జట్టు... వరుసగా రెండో ఏడాది ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్సీఏ) ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో జరిగిన ఫైనల్ ‘డ్రా’గా ముగియగా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్కు టైటిల్ ఖాయమైంది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులు చేయగా... టీఎన్సీఏ జట్టు 353 పరుగులకు పరిమితమైంది. దీంతో హైదరాబాద్ జట్టుకు 23 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఓవర్నైట్ స్కోరు 14/1తో మంగళవారం అఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు... చివరకు 70 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వరుణ్ గౌడ్ (122 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... రాహుల్ రాధేశ్ (133 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు), రవితేజ (87 బంతుల్లో 30; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. వరుణ్ గౌడ్, రాహుల్ రాధేశ్ అబేధ్యమైన ఆరో వికెట్కు 85 పరుగులు జోడించారు. ప్రత్యర్థి బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జంట అలవోకగా పరుగులు రాబట్టింది. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్, డబుల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేసింది. అమన్ రావు (19), హిమతేజ (11), కెపె్టన్ రాహుల్ సింగ్ (2) ఎక్కువసేపు నిలవలేకపోయారు. టీఎన్సీఏ బౌలర్లలో విద్యుత్, హేమచుడేశన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని హైదరాబాద్ జట్టు ఓవరాల్గా 178 పరుగుల ముందంజలో నిలిచింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెపె్టన్లు నిర్ణీత సమయం కంటే ముందే ‘డ్రా’కు అంగీకరించారు. ఆట చివరి రోజు హైదరాబాద్ ప్లేయర్లు సాధికారికంగా ఆడారు. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా... వరుసగా రెండో ఏడాది ట్రోఫీ చేజిక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో భారీ హాఫ్సెంచరీ బాదిన హైదరాబాద్ ప్లేయర్ హిమతేజకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, టోర్నీ ఆసాంతం రాణించిన ఆల్రౌండర్ వరుణ్ గౌడ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డులు దక్కాయి. విజేత హైదరాబాద్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ. 3 లక్షల నగదు బహుమతి దక్కింది. విజేతలకు భారత మాజీ ఆటగాడు రాబిన్ సింగ్, తమిళనాడు క్రికెట్ సంఘం ప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు. -
ఇంతకీ ఆ ఎమ్మెల్యేది ఏ పార్టీ : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: కొందరు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేదని దుస్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మీటింగ్లకు ఎందుకు రావడం లేదు?.కాంగ్రెస్ కండువా వేసుకుని సిగ్గులేకుండా బీఆర్ఎస్లో ఉన్నానంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటువేయాలి’అని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం చర్చాంశనీయంగా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో గత వారం తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. వీరి భేటీలో ఏం చర్చించారనే అంశం గురించి తెలియాల్సి ఉంది.‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ అంటే ఒప్పుకోం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.మూడు నెలల్లోగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్కు ఆదేశించింది. పదో షెడ్యూల్ ప్రకారం, స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదని పేర్కొంది. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. తద్వారా స్పీకర్ నిర్ణయం ఆలస్యం చేయడం సరికాదని స్పష్టం చేసింది. ‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ అనే పరిస్థితిని అంగీకరించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హత పిటిషన్లను సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచడం సమంజసం కాదని పేర్కొంది.పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సూచించింది.ఫిరాయింపులు ఎమ్మెల్యేలు వీళ్లేనా? 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్లో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్లు ఉన్నారు.వీరిలో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ఏ పార్టీలో ఉన్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. తాను ఇప్పటికీ గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని కృష్ణమోహన్రెడ్డి అంటుంటే.. కేటీఆర్ మాత్రం గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్నని చెప్పుకుని.. పార్టీ కార్యక్రమాలకు ఎందుకు గైర్హాజరవుతున్నారని ప్రశ్నిస్తున్నారు. -
కొద్దిసేపు ఆనందం..డిప్రెషన్ జీవితాంతం..!
నగరం మత్తెక్కుతోంది.. మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన కొందరు వాటిని తరలించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మత్తులో జోగుతూ వారి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. ఫామ్ హౌస్లు, పబ్బులు దాటి పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం మత్తు పదార్థాల అమ్మకాలకు అడ్డాలుగా మారుతున్నాయి.. ఇదేదో ఉత్తిగనే చెప్పే మాటలు కావు.. ఇటీవల జరిగిన ఘటనలే దీనికి బలమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పలు రకాల డ్రగ్స్తో పాటు మనిషి జీవితాన్ని సర్వనాశనం చేసే గంజాయి వ్యర్థాలు గుప్పుమంటున్నాయి.! వరుస ఘటనల్లో విద్యార్థులు కేసుల్లో ఇరుక్కుంటూ వెలుగు చూస్తున్న వాస్తవాలు తల్లిదండ్రులకు వణుకు పుట్టిస్తున్నాయి. ఇలాంటి డ్రగ్స్కు చెక్ పెట్టేదెలా..? విద్యార్థులకు డ్రగ్స్ దూరం చేసేదెలా..? అనే అంశాలపై తలలు పట్టుకుంటున్నారు అధికారులు. ‘ఓపెన్ చేస్తే’.. నగరంలో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు నిఘా పటిష్టం చేశారు. హైదరాబాద్కు చెందిన కొందరు విద్యార్థులు డ్రగ్స్ సరఫరాలో భాగస్వాములైనట్లు గుర్తించారు. ఏకంగా యూనివర్సిటీకి సరఫరా చేసే డిక్షనరీ మధ్యలో, మట్టిగాజుల మాటున డ్రగ్స్ సరఫరా చేయడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. అయితే కొన్ని కొరియర్ సంస్థల నుంచి రెండేళ్లలో సుమారు వంద కోట్లకుపైగా విలువైన డ్రగ్స్ తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విష సంస్కృతి విద్యార్థులను ఆకర్షించడం, భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆందోళన కలిగించేలా.. నగర యువత గంజాయి, డ్రగ్స్ బాధితులగా మారిపోతున్నారన్న అంశం ఆందోళన కలిగిస్తోంది. పబ్స్ మొదలు ఇంటర్, డిగ్రీ, వర్సిటీ హాస్టల్స్ను డ్రగ్స్ అడ్డాలుగా మార్చేస్తున్నారు. విద్యార్థి దశ నుంచి ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తున్న యువత వరకూ ఎంతో మంది మత్తుకు బానిసైపోతున్నారు. స్టైల్, ఫ్యాషన్ అంటూ మద్యం సేవించడం మొదలు డగ్స్ర్ వైపు అడుగులు వేసే విషసంస్కృతి వేళ్లూనుకుంటోంది. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడితే సమాజంలో తలెత్తుకోలేని విధంగా, నేరస్తులుగా ముద్ర వేసుకుంటున్నారు. పని ప్రదేశాల్లో, తరగతిగదుల్లో స్వేచ్ఛగా ఉండాల్సిన యువత కటకటాల వెనుక ఊచలు లెక్కబెడుతున్నారు. సమాజానికి, కుటుంబానికి శత్రువులుగా మారిపోతున్నారు. క్షణికానందం కోసం జీవితాంతం పలు మానసిక రుగ్మతలకు, రోగాలకు, మెదడు సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. నగరంలో పెరుగుతున్న డ్రగ్ అడిక్షన్స్ డీ–అడిక్షన్ సెంటర్లకు.. ఒక దఫా అలవాటుపడితే డ్రగ్స్ మహమ్మారి నుంచి తప్పించుకోవడం అంత సులువేంకాదని నిపుణులు చెబుతున్నారు. దీనిని నుండి బయట పడడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఇటీవల కాలంలో ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలోని డీ–అడిక్షన్ సెంటర్కు భారీ సంఖ్యలో బాధితులు చేరుతున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే మద్యం, గంజాయి, మత్తు పదార్థాల భారి నుంచి విముక్తి కోసం 612 మంది డీ–అడిక్షన్ కేంద్రానికి వచ్చారని అధికారిక నివేదికలు చెబుతున్నాయంటే మహమ్మారి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.యాంటీ సోషల్ పర్సన్గా మారతారు.. మద్యం తాగే వారితో పోలి్చతే డ్రగ్స్, గంజాయి బాధితులు వేంగంగా బానిసలైపోతారు. మానసిక ఆస్పత్రికి పాలీసబ్స్టెన్స్ కేసులు అధికంగా వస్తున్నాయి. సమయానికి డ్రగ్స్ దొరక్కపోతే పిచి్చవారిగా ప్రవర్తిస్తారు. విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఏమీ లేకున్నా ఎవరో వస్తున్నారని భయపడటం, ఆందోళన, అనుమానాలు, అపోహలు ఎక్కువగా ఉంటాయి. నిద్ర పట్టదు. ఇటువంటి వారి కుటుంబాల్లో గృహ హింస ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాలకే అబద్దాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, నిబంధనలు పాటించకపోవడం, రఫ్గా వ్యవహరించడం, వైలెంట్గా మారిపోవడం జరుగుతుంది. ఇటువంటి వారితో చాలా ప్రమాదం. సామాజిక వ్యతిరేక వక్తిత్వానికి అలవాటుపడతారు. – డాక్టర్ ఆర్ అనిత, ఎర్రగడ్డమానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్అవార్డింగ్ హార్మోన్స్తో ప్రమాదం.. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు ఆ వ్యక్తిలో అవార్డింగ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీంతో వ్యక్తి నేను చాలా గొప్పవాడిననే ఫీలింగ్లో ఉంటాడు. నేను ఏం చేసినా, ఏం మాట్లాడినా నాకు ఎదురు లేదనే ఓవర్ కాని్ఫడెన్స్లోకి వెళతాడు. ప్రవర్తనలోనూ విపరీత ధోరణి కనిపిస్తుంది. క్షణికానందం కోసం వెంపర్లాడతాడు. ఆ వెంటనే డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు. డ్రగ్స్లో ఉండే కెమికల్స్ మెదడులోని న్యూరాన్స్పై తీవ్రపభ్రావం చూపిస్తాయి. నెమ్మదిగా జ్ఞాపకశక్తి నశిస్తుంది. తీవ్ర ఒత్తిడి, భయం, ఆందోళనకు గురవుతాడు. హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతాయి. ఫిట్స్, బీపీ వంటివి వచ్చే అవకాశం ఉంది. స్నేహితులతో కలసి తొలిసారి ఏదో సరదాగా రుచి చూద్దామనుకుంటే.. చివరికి మానుకోలేని వ్యసనంగా మారిపోతుంది. ఇటువంటి వాటిపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు సైతం పిల్లల ప్రవర్తన, నడవడికపై దృష్టిసారించాలి. డగ్ర్ దొరక్కపోతే ఆత్మహత్య ఆలోచనలకు వెళ్లిపోతారు. ప్రతి ఒక్కరినీ అనుమానించడం, పరిస్థితులను సక్రమంగా అర్థం చేసుకోలేకపోవడం, ఎదుటివారి మాటలను అంచనా వేయలేకపోవడం, సెల్ఫ్ జడ్జిమెంట్ చేకపోవడం దీని ప్రధాన లక్షణాలు. – డాక్టర్ బీ వెంకట నాని కుమార్, జనరల్ సర్జన్ (చదవండి: ఇండో వెస్ట్రన్ అంటే ఇష్టం: అనుపమ పరమేశ్వరన్) -
హైదరాబాద్ : ఖైరతాబాద్లో మదర్ మేరీ వార్షిక పండుగ (ఫోటోలు)
-
రండి.. హైదరాబాద్ను అభివృద్ధి చేద్దాం: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధికి అందరూ కలిసి రావాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ను డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ సమాజానికి అంకితం ఇవ్వబోతున్నామన్నారు సీఎం రేవంత్. ఎవరెన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వం తిప్పికొడుతుందన్నారు సీఎం రేవంత్. ఇది ఇందిరమ్మ రాజ్యమని, ఈ రాజ్యంలో పేదోళ్లకు న్యాయం జరుగుతుందన్నారు. గోదావరి ఫేజ్ 2&3 శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లడారు. గంగా నదీ, యమునా, సబర్మతీ నదులు ప్రక్షాళన చేయొచ్చని, కానీ తాము మూసీని ప్రక్షాళన చయొద్దా? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేపట్టలేదని నిలదీశారు. ‘1908 లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలను వరదల నుంచి కాపాడింది. వందేళ్లకు పైగా ఈ నగరానికి తాగు నీరు అందుతున్నాయంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టినే కారణం. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయి. 1965 లో మంజీరా నది నుంచి నగరానికి తాగు నీరు అందించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 2002 లో కృష్ణా నదీ జలాలను మూడు దశల్లో నగరానికి తరలించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారు. నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడింది. కాలుష్యమయమైన మూసీతో నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషతుల్యమైన మూసీని ప్రక్షాళన చేస్తానని నల్లగొండ జిల్లా ప్రజలకు ఆనాడే మాట ఇచ్చా. 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్కు తరలించబోతున్నాం. ఇందులో 16 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి కోసం వినియోగించబోతున్నాం. చెరువులను నింపుకుంటూ 4 టీఎంసీలను మూసీకి తరలించి మూసీని ప్రక్షాళన చేస్తాం. శ్రీపాద ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాలను హైదరాబాద్ తరలిస్తున్నాం. ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారు. చేవెళ్లలో వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాసుల కక్కుర్తితో తలను తొలగించింది మీరు కాదా?, చేవెళ్ల, తాండూరు, పరిగికి సాగునీరు అందకపోవడానికి కారణం మీరు కాదా?, తుమ్మిడిహెట్టీ దగ్గర ప్రాణహిత చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తాం’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
‘రండి.. మా పార్టీలో చేరండి’
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల నేతల్ని చేర్చుకునేందుకు పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయంటూ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామన్న ఆమె.. త్వరలోనే నామినేటెడ్,కార్పొరేషన్ పోస్టులు భర్తీ చేస్తామని సూచించారు. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆమె పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చేసిన ప్రకటనల ఆధారంగా, ఇది కేవలం నేతలను చేర్చుకోవడమే కాకుండా, పార్టీలో అంతర్గత సమీకరణలను సమతుల్యం చేయడానికి కూడా ఒక వ్యూహంగా కనిపిస్తోంది. ఇందుకోసంపార్టీలోని నేతలను మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నవారు,ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చినవారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరినవారు ఇలా మూడు వర్గాలుగా విభజించారు.వాటి ఆధారంగా పదేళ్లుగా పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత, కేటగిరీల వారీగా నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుంది. అంటే పార్టీలో ఉన్న కాలం, నిబద్ధత ఆధారంగా అవకాశాలు కల్పించనున్నారు. -
హైదరాబాద్లో టీవీఎస్ ఎన్టార్క్ 150 లాంచ్
-
బర్డ్ ‘హిట్’!
సాక్షి, సిటీబ్యూరో: ఆకాశం ఈ పేరు చెప్పగానే మేఘాలతో పాటు విమానాలు, పక్షులు గుర్తుకు వస్తాయి. రైట్ సోదరులు సైతం పక్షులను చూసి స్ఫూర్తి పొందే విమానాన్ని కనిపెట్టారు. అయితే ఇప్పుడు ఆ పక్షుల పేరు చెబితే విమానయాన సంస్థలు హడలిపోతున్నాయి. బర్డ్ హిట్స్ గణనీయంగా పెరిగిపోవడం, ఈ విహంగాల వల్ల విమానాలను ఎనలేని నష్టం జరుగుతుండటమే దీనికి కారణం. విమానం ఎగిరే, కిందికి దిగే సమయంలో దాని ఇంజన్ లేదా ఇతర భాగాలను పక్షులు ఢీకొట్టడాన్ని బర్డ్ హిట్ అంటారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2020 నుంచి ఈ ఏడాది జూన్ వరకు దేశ వ్యాప్తంగా 2807 బర్డ్ హిట్స్ నమోదు కాగా.. వీటిలో 207 హైదరాబాద్కు సంబంధించినవే. 695 ఉదంతాలతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రథమ స్థానంలో ఉండగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఐదో స్థానంలో ఉంది. సాధారణ వ్యక్తులకు చిన్న విషయంగా కనిపించే, వినిపించే బర్డ్ హిట్ విమానాలకు అపారమైన నష్టం కలిగిస్తుంది. ప్రధానంగా గద్దలు, రాబందులు తదితరాలే విమానాలకు తగులుతూ ఉంటాయి. ఇంజిన్లోకి పక్షి చొచ్చుకుపోవడం వల్ల అది ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. ముందు భాగంలో ఉండే నాసెల్ (నోస్ కోన్), వింగ్స్, విండ్ ల్డ్స్కు తాకితే ఆయా భాగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. బర్డ్ హిట్ వల్ల ఇంజిన్ బ్లేడ్స్ విరిగిపోతే పెను ప్రమాదానికి ఆస్కారం ఉంటుంది. అనేక సందర్భాల్లో బర్డ్ హిట్ వల్ల పరిస్థితులు అత్యవసర ల్యాండింగ్ వరకు వెళ్లాయి. ఈ కారణాల వల్లే విమానయాన రంగంలో బర్డ్ హిట్ను తీవ్రంగా పరిగణిస్తారు. ప్రతి ఉదంతాన్నీ కచి్చతంగా నమోదు చేస్తుంటారు. ప్రాణనష్టం లేనప్పటికీ బర్డ్ హిట్ వల్ల నష్టం జరిగితే ఆ విమానాల మరమ్మతు కోసం భారీ మొత్తం వెచి్చంచాల్సి వస్తుంది. టేకాఫ్ సమయంలో ఇలాంటి జరిగితే వెంటనే ల్యాండింగ్ చేయడంతో పాటు ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేయడం తదితరాల వల్ల, విమాన సేవలకు అంతరాయం, ఆలస్యంతో పాటు విలువైన పని గంటలు వృథా అవుతుంటాయి. విమానాశ్రయం చుట్టూ జనావాసాలు పెరిగిపోడం ఈ బర్డ్ హిట్స్ చోటు చేసుకోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పడేసే ఆహార వ్యర్థాల వల్లా ఈ ఉదంతాలు పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. పక్షుల కదలికల్ని గుర్తించడానికి విమానాశ్రయాల్లో ప్రత్యేక రాడార్ వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విమానాశ్రయాల వద్ద, రన్వేల పైనా బర్డ్ కంట్రోల్ కోసం ప్రత్యేకంగా బర్డ్ కంట్రోల్ టీమ్స్ పేరుతో ఉద్యోగులను నియమిస్తుంటారు. వీళ్లు టపాసులు, ఫ్లాషింగ్ లైట్లు తదితరాలు వాడుతూ పక్షులను ఆ ప్రాంతాల నుంచి వీలైనంత దూరం తరిమేస్తుంటారు. విమానాశ్రయంతో పాటు ఆ చుట్టు పక్కల ఉన్న పక్షి గూళ్లను గుర్తించి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు. విమానాల్లోనూ యాంటీ బర్డ్ హిట్ టెక్నాలజీని, ఈ బర్డ్ హిట్స్ను తట్టుకునే సామర్థ్యాన్నీ అభివృద్ధి చేసే ప్రయోగాలు జరుగుతున్నాయి. -
గ్రహణం రోజు.. గుప్త నిధులు తీస్తా..
హైదరాబాద్: పట్టణంలో పట్టపగలే గుప్త నిధుల తవ్వ కాలు కలకలం రేపాయి. దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐదుగురు ప ట్టుబడగా ప్రధాన మాంత్రి కుడు పరారయ్యాడు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ ఎస్ఐ నుమాన్అలీ తెలిపి న ప్రకారం.. గ్రామానికి చెందిన యాగ ప్రశాంత్కు పాడుబడిన ఇల్లు ఉంది. 15 ఏళ్లుగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇటీవల ఆ ఇంటి నుంచి రాత్రివేళ శబ్దాలు వస్తున్నాయని.. అక్కడ గుప్త నిధులు ఉన్నాయంటూ ప్రచారం సాగింది. ఈ విషయాన్ని ప్రశాంత్ క్యాద్గిరాకు చెందిన తన స్నేహితుడు పట్నం శ్రీనివాస్కు చెప్పాడు. వీరిద్దరూ బషీరాబాద్కు చెందిన మోహిజ్, మహేశ్, శివకుమార్తో కలిసి గుప్తనిధుల వెలికితీతకు పథకం రచించారు. వారం క్రితం శ్రీనివాస్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాంత్రికుడు మొల్లను కలిసి గుప్తనిధుల విషయం వివరించాడు. దీంతో సదరు మాంత్రికుడు సెప్టెంబర్ 9వ తేదీన ఆదివారం పౌర్ణమితో పాటు గ్రహణం ఉందని, అదే రోజు నిధులు వెలికితీస్తానని, సామగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించాడు. ఆదివారం బషీరాబాద్కు వచ్చిన మాంత్రికుడు ఉదయం 10.30 గంటలకు పాడుబడిన ఇంటికి చేరుకున్నాడు. ప్రశాంత్, శ్రీనివాస్, మోహిజ్, మహేశ్, శివకుమార్తో కలిసి ప్రత్యేక పూజలు చేశాడు. అనంతరం తవ్వకాలు ప్రారంభించారు. ఇంట్లో శబ్దాలు బయటకు రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. అప్పటికే మాంత్రికుడు అక్కడి నుంచి పరారవ్వగా తవ్వకాలు జరుపుతున్న ప్రశాంత్, శ్రీనివాస్, మోహిజ్, మహేశ్, శివకుమార్ను పోలీసులు పట్టుకుని ఠాణాకు తరలించారు. సాయంత్రం తాండూరు రూరల్ సీఐ నగేశ్ తవ్వకాలు జరిపిన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పరారైన వ్యక్తినే ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. -
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ..సీఎం రేవంత్తో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ
సాక్షి,తెలంగాణ: సీఎం రేవంత్రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటికే నోటీసులు పంపించారు. తాజా సీఎం రేవంత్ ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీలో సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
సీఎం విజిట్ మంచిదే.. నిమజ్జనాలపై ఫోకస్ పెట్టాం: సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు సీపీ సీవీ ఆనంద్. హైదరాబాదులో 1,40,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని చెప్పుకొచ్చారు. గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగియడానికి పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుందని తెలిపారు.హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈరోజు సాయంత్రం వరకు 900 విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంటుంది. ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం నిమజ్జనం త్వరగా చేపట్టడంతో మిగతా గణేష్ నిమజ్జన కార్యక్రమాలపై ఫోకస్ పెట్టాం. ఈసారి హైదరాబాదులో ఎక్కువ గణేష్ విగ్రహాలు ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. కొన్ని విగ్రహాలు 40 అడుగుల వరకు ఎత్తులో ఉన్నాయి. గణేష్ నిమజ్జనం కార్యక్రమాలకు ప్రశాంతంగా కొనసాగడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు, వాటర్ బోర్డ్ అధికారులు బాగా సహకరించారు.గణేష్ విగ్రహాల దగ్గర ఆకతాయిల ఆట కట్టించడానికి ఈసారి షీ టీమ్స్ బాగా పనిచేశాయి. 170 మందిపై కేసులు నమోదు చేశాం. గణేష్ మండపాల దగ్గర అక్కడక్కడ గొడవలు జరిగాయి. ఐదుగురిపై కేసులు నమోదు చేశాం. హై రైజెడ్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ను కంట్రోల్ చేయగలిగాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన చేయడం మంచిదే’ అని చెప్పుకొచ్చారు. -
హైదరాబాద్ లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు
-
ట్యాంక్ బండ్ ఫుల్.. రెండో రోజు కొనసాగుతున్న నిమజ్జనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో రెండో రోజు వినాయక నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతోంది. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ దారులన్నీ గణేశుడి ప్రతిమలతో నిండిపోయాయి. మొదటి రోజు నుండి ఇప్పటి వరకూ గ్రేటర్ హైదరాబాద్లో రెండు లక్షల 61 వేలకు పైగా గణేష్ ప్రతిమల నిమజ్జనం జరిగింది.ఇక, ఒక్క హుస్సేన్ సాగర్లో 11 వేల గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగినట్టు పోలీసులు తెలిపారు. నిమజ్జన పాయింట్లు, నిమజ్జన ఊరేగింపు మార్గాలలో వ్యర్థాల తొలగింపును జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. ఇక, టాంక్ బండ్ పరిసరాల్లో ఇంకా సందడి కొనసాగుతోంది. గణేష్ ప్రతిమలు బారులు తీరడంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కాగా, ఎల్బీనగర్ పరిధిలో 35,994, చార్మినార్ 22,304, ఖైరతాబాద్ 63,019, శేరిలింగంపల్లి 41,360, కూకట్ పల్లి 62,405, సికింద్రాబాద్ పరిధిలో 36,251 విగ్రహాలను నిమజ్జనం చేశారు. మరోవైపు.. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ కారిడార్లోని మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. నగరంలో వినాయక నిమజ్జనం కారణంగా ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఎల్బీనగర్ వద్ద మెట్రో స్టేషన్లో ప్రయాణికులు కిక్కిరిసి కనిపించారు. -
ఆలస్యమైనా.. త్వరగా ముగిశాయి!
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ వినాయకుడి శోభాయాత్రలు ప్రశాంతంగా ముగిశాయి. ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ఉదయం 6.30కి ప్రారంభించాల్సి ఉండగా, 7.30కి ప్రారంభమైంది. ని మజ్జనం మధ్యాహ్నం 1.30కి పూర్తికావాలని టార్గెట్గా పెట్టుకున్నా 1:05 గంటలకే పూర్తి చేయగలిగారు. ఇక, బాలాపూర్ గణపతి శోభాయాత్ర కొన్ని అడ్డంకుల వల్ల రెండు గంటలు ఆలస్యమైనా సాయంత్రం 6:11 గంటలకు నిమజ్జనం పూర్తి చేశారు. నగరంలో మొత్తం 12,030 విగ్రహాలు నమోదు కాగా శుక్రవారం వరకు 7,500, శనివారం సాయంత్రానికి మరో 650 నిమజ్జనమయ్యాయి. పెద్ద విగ్రహాల్లో ఇంకా 4,500 విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉంది. ప్రశాంతంగా నిమజ్జనాలు: డీజీపీ రాష్ట్రంలో గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుగుతోందని డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న వి నాయక విగ్రహాల నిమజ్జనాల ప్రక్రియను.. శనివారం డీజీపీ తన కార్యాలయంలో ప్రత్యే కంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో సమీక్షించారు. అనంతరం శాంతి భద్రతల అదనపు డీజీ మహేశ్ ఎం భగవత్, పీఅండ్ ఎల్ఐజీ ఎం.రమేశ్, శాంతి భద్రతల ఏఐజీ రమణకుమార్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో నిమజ్జనోత్సవాలను సీనియర్ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే చేస్తూ, డీజీపీ కార్యాలయం, బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. భద్రత విధుల్లో పోలీసులతో పాటు ఎక్సైజ్, అటవీ, ఆరీ్పఎఫ్, టీజీఎస్పీ బెటాలియన్లు తదితర శాఖల సిబ్బంది కూడా పాల్గొంటున్నారని చెప్పారు. ఈసారి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా నిమజ్జనం విధులు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసులు సూచిస్తున్న భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని డీజీపీ కోరారు. బాలాపూర్ లడ్డూ రూ.35 లక్షలుసొంతం చేసుకున్న దశరథ్గౌడ్ బడంగ్పేట్: ఎంతో ఉత్కంఠగా ఎ దురు చూసిన బా లాపూర్ గణనాథు డి లడ్డూను కర్మన్ ఘాట్కు చెందిన చైతన్య స్టీల్, సి మెంట్ వ్యాపారి లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలకు వేలంపాటలో సొంతం చేసుకున్నారు. గతేడాది కన్నా ఈసారి రూ.5 లక్షలు అధికంగా పలకడం విశేషం. ఈ సందర్భంగా బాలాపూర్ ఉత్సవ సమితి అధ్య క్షుడు కళ్లెం నిరంజన్రెడ్డి.. లడ్డూ గ్రహీతను ఘనంగా సన్మానించారు. -
సీఎం రేవంత్ సడన్ ఎంట్రీ.. ట్యాంక్బండ్పై ప్రత్యక్షం
హైదరాబాద్: ఒకవైపు నగరంలో గణేశ్ నిమజ్జనం కోలాహలంగా సాగుతున్న వేళ.. సీఎం రేవంత్రెడ్డి ఉన్న పళంగా ట్యాంక్ బండ్ను సందర్శించారు. ఎలాంటి సమాచారం లేకుండా ఎటువంటి ఆర్భాటం లేకుండా ట్యాంక్ బండ్కు వచ్చారు. పూర్తిస్థాయి భద్రత లేకుండా నలుగురైదుగురు వ్యక్తిగత సిబ్బందితో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చారు సీఎం రేవంత్. అసలు నిమజ్జన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో స్వయంగా వచ్చి పరిశీలించారు. అక్కడకు వచ్చిన భక్తులతో సీఎం రేవంత్ మాట్లాడారు. గణేష్ నిమజ్జనంకు సంబంధించి ఏమైనా ఇబ్బందులున్నాయో అని అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్. -
వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య.. హైదరాబాద్లో కోలాహలంగా నిమజ్జనాలు (ఫోటోలు)
-
హైదరాబాద్లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా భారీగా డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టయ్యింది. 30 వేల కోట్లు విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో తయారు చేస్తున్న డ్రగ్స్ను దేశ, విదేశాలను సరఫరా చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. మేడ్చల్ కేంద్రంగా డ్రగ్స్ తయారుచేస్తున్న13 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్లోని ఎండీ డ్రగ్స్ కంపెనీని పోలీసులు సీజ్ చేశారు. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్టీసీ, ఎక్స్టీసీ మోలీ డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.32 వేల లీటర్ల రా మెటీరియల్ను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో మహారాష్ట్ర పోలీసులకు విదేశీయుడు పట్టుబడ్డాడు. విదేశీయుడు ఇచ్చిన సమాచారంతో మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విదేశీయుడి నుంచి రూ.25 లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో మేడ్చల్లో క్రైమ్ బ్రాంచ్ దాడులు చేసింది. వెయ్యి కిలోల కెమికల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సప్లయర్లు, మాన్యుఫాక్చరర్లు , డిస్ట్రిబ్యూటర్లు కలిసిన భారీ నెట్వర్క్ని మహారాష్ట్ర పోలీసులు చేధించారు. -
టీపీసీసీ లీగల్, హ్యూమన్ రైట్స్ & ఆర్టీఐ విభాగ కోఆర్డినేటర్గా శశాంక్
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తమ లీగల్, హ్యూమన్ రైట్స్ & ఆర్టీఐ విభాగంలో కీలక నియామకం చేపట్టింది. ఈ విభాగానికి కోఆర్డినేటర్గా శశాంక్ పసుపులేటి ని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ నియామకాన్ని ధృవీకరిస్తూ టీపీసీసీ లీగల్, హ్యూమన్ రైట్స్ & ఆర్టీఐ విభాగం ఛైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఒక లేఖను విడుదల చేశారు. శశాంక్ నియామకంతో న్యాయం, పారదర్శకత, బాధ్యతా సూత్రాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ దృష్టిని ముందుకు తీసుకువెళ్లడంలో శశాంక్ గారి పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.శశాంక్ పసుపులేటి మాట్లాడుతూ, మహిళల భద్రత, మానవ హక్కుల పరిరక్షణ, ఆర్టీఐ అవగాహన పెంపొందించడం కోసం తాను కృషి చేస్తానని పునరుద్ఘాటించారు. ఈ నియామకానికి సహకరించిన టీపీసీసీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా డాక్టర్ కోట నీలిమ, పొన్నం అశోక్ గౌడ్ తమకు సరైన మార్గదర్శనం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.పొన్నం అశోక్ గౌడ్ కూడా శశాంక్ను అంకితభావం కలిగిన యువ నాయకుడిగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను యువతకు చేరువ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ప్రశంసించారు. ఈ నియామకం టీపీసీసీ లీగల్ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు
-
బియ్యం సరే.. సంచి ఏది?
హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మూడు నెలల తర్వాత ఈ నెల కోటా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం లబ్ధిదారుకు బియ్యంతోపాటు సంచి ఇవ్వాలని నిర్ణయించింది. సరిపడా సంచులు జిల్లాకు సరఫరా చేసింది. అయితే సన్నబియ్యం పంపిణీ ప్రారంభమై ఐదురోజులైనా ఎక్కడా సంచులు పంపిణీ చేయలేదు. లబ్ధిదారులు ఇంటి నుంచి తెచ్చుకు న్న సంచుల్లోనే బియ్యం తీసుకెళ్తున్నారు. కొన్ని చోట్ల సంచి కోసం డీలర్లను ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లా పౌర సరఫరాల అధికారి వాజిద్ అలీని సంప్రదించగా సంచుల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. -
ట్యాంక్ బండ్ చేరుకున్న బడా గణేష్
-
35 లక్షలకు బాలాపూర్ లడ్డూ.. కొన్నది ఇతనే..
-
రికార్డ్ ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ
-
తేజస్ విమానానికి హైదరాబాదీ కంపెనీ దన్ను!
సాక్షి, హైదరాబాద్: భారతదేశం సొంతంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ విమానాలను పెద్దస్థాయిలో తయారు చేసేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాదీ కంపెనీ వెమ్ టెక్నాలజీస్ ఇందుకు దన్నుగా నిలుస్తోంది. తేజస్ విమానంలో అత్యంత కీలకమైన సెంట్రల్ ఫ్యూసలాజ్ను ఈ సంస్థ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. మూడు నెలల క్రితమే తొలి ఫ్యూసలాజ్ను తేజస్ను నిర్మిస్తున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు అందించిన వెమ్ టెక్నాలజీస్ శుక్రవారం రెండో యూనిట్ డెలివిరిని పూర్తి చేసింది. అంతేకాదు.. ఆరు నెలల్లోపు మరో మూడు ఫ్యూసలాజ్లను సిద్ధం చేసి అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు ఈ పరిణామం ఎంతో కీలకమైంది. యుద్ధ విమానంలో సెంట్రల్ ఫ్యూసలాజ్ అనేది చాలా కీలకమైన భాగం. తేజస్ మార్క్1ఏలోని ఫ్యూసలాజ్ సుమారు 478 కిలోల బరువు ఉంటుంది. అత్యంత కచ్చితత్వంతో తయారు చేసిన సుమారు 1560 విడిభాగాలతో ఈ ఫ్యూసలాజ్ తయారవుతుంది. యుద్ధ విమానాన్ని నడిపైవారు కూర్చునే కాక్పిట్, విమానపు రెక్కలు, తోకలన్నింటిని కలిపే ఈ ఫ్యూసలాజ్లోనే ల్యాండింగ్ గేర్, ఫ్యూయెల్ ట్యాంక్లు ఉంటాయి.వెమ్ టెక్నాలజీస్కు చెందిన సుమారు 122 మంది ఇంజినీర్లు కొన్ని నెలలపాటు శ్రమించి ఈ ఫ్యూసలాజ్ను తయారు చేశారు ప్రతిదశలోనూ రక్షణ రంగం ప్రమాణాలకు అనుగుణంగా పనిచేశారు. రక్షణ రంగంలో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యంలో వెమ్ టెక్నాలజీస్ ఈ సాధనకు ప్రాముఖ్యత ఏర్పడుతోంది. రక్షణ రంగానికి సంబంధించిన సంక్లిష్టమైన ప్రాజెక్టులను కూడా ప్రైవేట్ రంగం సమర్థంగా చేపట్టగలదని వెమ్ టెక్నాలజీస్ నిరూపిస్తోందని విశ్లేషకుల అంచనా.భారతదేశం పూర్తిగా దేశీయంగా సిద్ధం చేస్తున్న తేజస్ యుద్ధ విమానాన్ని హెచ్ఏఎల్ నాశిక్లోని ఫ్యాక్టరీలో తయారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు సెంట్రల్ ఫ్యూసలాజ్ల డెలివరీని పూర్తి చేసిన వెమ్ టెక్నాలజీస్ వచ్చే ఏడాది మార్చిలోగా మరో మూడింటిని అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తేజస్ సెంట్రల్ ఫ్యూసలాజ్తోపాటు వెమ్ టెక్నాలజీస్ అత్యాధునిక మధ్యమశ్రేణి యుద్ధ విమానం (ఏఎంసీఏ) భాగాలను కూడా తయారు చేస్తోంది. వచ్చే ఏడాది నుంచి దేశీ క్షిపణులు, రాకెట్లు, లాంచర్ల తయారీకి సిద్ధమవుతోంది. -
Watch Live: బాలాపూర్ లడ్డూ వేలం 2025
-
లండన్ నుంచి బాలాపూర్ లడ్డూ కోసం !!
-
గణేశ్ నిమజ్జనాలు.. ట్రాఫిక్ మళ్లింపు..
-
ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జన కోలాహలం
-
శోభా యాత్రకు సిద్ధమైన బాలాపూర్ బొజ్జ గణపయ్య
-
కుటుంబాన్ని వదిలి.. ప్రియుడితో కదిలి..
బెంగళూరు: భర్త, ముగ్గురు పిల్లలను వదిలి మహిళ ఒకరు తన ప్రియుడితో కలిసి పారిపోయిన ఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని బన్నేరుఘట్ట సమీపంలో ఉన్న బసవనపుర గ్రామంలో గత నెల 31వ తేదీన జరిగింది. మహిళ తన ప్రియుడితో వెళ్లిపోవడంతో తల్లి లేక ముగ్గురు పిల్లలు, భార్య పోయిన బాధలో భర్త కన్నీరుమున్నీరవుతున్నారు.మంజునాథ్, లీలావతి దంపతులు 11 ఏళ్ల క్రితం పరస్పరం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి కుటుంబంలోకి సంతోష్ అనే వ్యక్తి చొరబడి చిచ్చురేపాడు. లీలావతి సంతోష్తో వివాహేతర సంబంధం పెట్టుకొని గత నెల 31వ తేదీన ఇంటిలో నుంచి వెళ్లిపోయింది. లీలావతి భర్త మంజునాథ్ బన్నేరుఘట్ట పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యను తనకు అప్పగించాలని భోరున విలపిస్తున్నాడు. పిల్లలను చూసుకునేవారు లేరు ముగ్గురు పిల్లలు కూడా చిన్నవారని, వారిని చూసుకునే వారు ఎవరూ లేరని, తన భార్య తనకు కావాలని మంజునాథ్ బోరుమంటున్నాడు. లీలావతి వెళ్లిపోయి ఆరు రోజులైనా పిల్లలకు ఒక ఫోన్ కూడా చేయలేదు. దీంతో తమకు అమ్మ కావాలని చిన్నారులు విలపిస్తున్నారు. -
బాలాపూర్ లడ్డూ వేలానికి సర్వం సిద్ధం
-
గణపతి బప్పా మోరియా.. ట్యాంక్ బండ్ వద్ద కోలాహలం (ఫొటోలు)
-
Watch Live: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం
-
శోభాయాత్రకు సిద్ధం.. టస్కర్ పైకి ఖైరతాబాద్ మహాగణపతి
-
సిటీ పోలీసులోకి ‘లాడెన్ జాగిలాలు’
సాక్షి, సిటీబ్యూరో: పాకిస్థాన్లోని అబోటాబాద్లో దాక్కున్న అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనటం కోసం అమెరికన్ నేవీ సీల్స్ 2011లో వినియోగించిన బెల్జియం మలినాయిస్ జాతి జాగిలాలు నగర పోలీసు విభాగంలో అందుబాటులోకి రానున్నాయి. సిటీ పోలీసులు కొత్తగా ఖరీదు చేసిన 12 జాగిలాల పిల్లల్లో ఆరు బెల్జియం మలినాయిస్ జాతివే ఉన్నాయి. దేశంలోనే ఈ తరహా జాగిలాలను నేరుగా ఎంపిక చేసి, అందుబాటులోకి తీసుకువస్తున్న తొలి పోలీసు విభాగంగా హైదరాబాద్ కమిషనరేట్ కావడం గమనార్హం. పోలీసు విభాగం సుదీర్ఘకాలం జర్మన్ షెపర్డ్, లాబ్రెడార్ తదితర జాతి జాగిలాలకు శిక్షణ ఇచ్చి వినియోగించింది. అయితే మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆరీ్పఎఫ్) కొన్నేళ్ల క్రితం 300 బెల్జియం మలినాయిస్ జాగిలాలను ఖరీదు చేసి వినియోగించడం ప్రారంభించింది. 2015లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషనల్ విభాగమైన ఆక్టోపస్లో వినియోగించడానికి ప్రయోగాత్మకంగా మూడు (రెండు మగ, ఒక ఆడ) బెల్జియం మలినాయిస్ జాగిలాలను ఖరీదు చేశారు. వీటి పనితీరును అధ్యయనం చేసిన నగర పోలీసు అధికారులతో కూడిన కమిటీ సర్వకాల సర్వావస్థల్లోనూ విసుకు, విరామం లేకుండా ఏకధాటిగా పని చేయడం, పౌరుషం తదితర లక్షణాలను పరిగణలోకి తీసుకుంది. దశల వారీగా నగర పోలీసు విభాగంలో బెల్జియం మలినాయిస్, బీగల్ జాతి జాగిలాల సంఖ్యను పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. బెల్జియం మలినాయిస్ జాతి జాగిలం గరిష్టంగా 12 ఏళ్లు జీవిస్తుంది. ఇది 22 నుంచి 26 అంగుళాల వరకు ఎత్తు పెరుగుతుంది. 20 నుంచి 30 కేజీల బరువు కలిగి ఉంటుంది. పౌరుషం, సంగ్రహణ శక్తుల్లో ఉత్తమమైన వీటికి శిక్షణ ఇవ్వడం కూడా చాలా తేలిక.త్వరలో నిర్మాణాలు ప్రారంభిస్తాంగోషామహల్లోని పోలీసుస్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకోగా మిగిలిన 11.5 ఎకరాల్లో త్వరలో నిర్మాణాలు ప్రారంభించనున్నాం. వీటిలో ఓపక్క అశ్వకదళం (మౌంటెడ్ పోలీసు) కోసం స్టేబుల్స్, మరోపక్క జాగిలాల కోసం కెన్నెల్ నిరి్మంచనున్నాం. ప్రస్తుతం సిటీ పోలీసు విభాగంలో ఉన్న 50 గుర్రాల్లో మూడు తప్ప మిలినవి అన్నీ యాక్టివ్గా ఉన్నాయి. కీలక సందర్భాల్లో క్రౌడ్కంట్రోల్కు ఇవి అత్యంత కీలకం. 2003లో నేను సెంట్రల్ జోన్ డీసీపీగా ఉండగా చేప ప్రసాదం పంపిణీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రోగులు రావడంతో తొక్కిసలాట వరకు విషయం వెళ్లినా... అక్కడ ఉన్న మౌంటెడ్ పోలీసు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచి్చంది. – సీవీ ఆనంద్, నగర కొత్వాల్ -
మహాగణపతి నిమజ్జనానికి..
ఖైరతాబాద్: ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి మహా నిమజ్జనానికి పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేపడుతున్నారు. గురువారం అర్ధరాత్రి వరకే దర్శనాలు నిలిపివేయడంతో శుక్రవారం ఉదయం నుంచే షెడ్డు తొలగించే పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహాగణపతి దర్శనం సందర్భంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనులను ఆపివేశారు. ఆ తరువాత షెడ్డు తొలగించే పనులు ప్రారంభించారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల దాటగానే అనంత చతుర్ధశిలో కలశాన్ని కదిలించి, ఆ తరువాత మహాగణపతిని వాహనంపైకి ఎక్కిస్తా రు. ఇరువైపులా ఉన్న విగ్రహాలను కూడా మరో వా హనంపై ఉంచి శనివారం ఉదయం 6.30 గంటలకు శోభాయాత్రను ప్రారంభించి మధ్యాహ్నం 1.30 కల్లా నిమజ్జనం చేసేందుకు ప్రణాళిక సిద్దం చేశారు. మహాగణపతి కోసం భారీ వాహనం.. 50 టన్నుల బరువు, 69 అడుగుల ఎత్తు ఉన్న మహాగణపతిని సాగర తీరానికి తీసుకెళ్లేందుకు ఎస్టీసీ ట్రాన్స్పోర్ట్కు చెందిన భారీ ట్రాయిలర్ వాహనం సిద్ధం చేశారు. 75 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు, 26 టైర్లు ఉన్న వాహనం బరువు 28 టన్నులు. ఈ వాహనం 100 టన్నుల బరువును మోస్తుంది. రథసార«థి మందాటి వెంకట్ రెడ్డి ఖైరతాబాద్ మహాగణపతిని సాగర తీరానికి చేర్చేందుకు రథసారధిగా ఈ సంవత్సరం సూర్యాపేట జిల్లాకు చెందిన మందాటి వెంకట్రెడ్డి వచ్చాడు. గతంలో వెంకట్రెడ్డి 2015, 2017, 2022లో మహాగణపతిని నిమజ్జనానికి నిర్విఘ్నంగా తరలించాడు. ఈ సంవత్సరం మరోసారి ఆయనకు అవకాశం దక్కింది. రూట్ మ్యాప్ ఖైరతాబాద్ నుంచి మొదలై రాజ్దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలుగుతల్లి ప్లై ఓవర్, సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 4 వరకు చేరుకుంటుంది. మహాగణపతిని ఖైరతాబాద్ మంటపం వద్ద అత్యాధునిక సాకేంతిక పరిజ్ఞానంతో రూపొందిన క్రేన్ సాయంతో వాహనంపైకి తరలిస్తారు. నిమజ్జన సమయంలో హైడ్రాలిక్ భారీ సూపర్ క్రేన్ సాయంతో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. సొంత వాహనాలొద్దు... హుస్సేన్సాగర్ వద్ద సామూహిక నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులు సొంత వాహనాల్లో కాకుండా సిటీ బస్సులు, మెట్రోరైల్, ఎంఎంటీఎస్ వంటి ప్రజారవాణా వ్యవస్థల్ని వినియోగించాలి. శనివారం ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. బాలాపూర్ నుంచి చార్మినార్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్ మీదుగా హుస్సేన్సాగర్ వరకు శోభాయాత్ర జరుగుతుంది. ఈ మార్గంలో ఇటు నుంచి అటు వెళ్లడానికి కేవలం రాజేష్ మెడికల్ హాల్, బషీర్బాగ్ చౌరస్తాల వద్దే అవకాశం ఉంది. 3200 మంది ట్రాఫిక్ సిబ్బంది రెండు షిఫ్టుల్లో పని చేస్తారు. విమానాశ్రయానికి వెళ్లాల్సిన వాళ్లు ఓఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్, పీవీ నర్సింహ్మారావు ఎక్స్ప్రెస్ వే వాడుకోవాలి. ట్రాఫిక్కు సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్నా 040–27852482, 8712660600, 9010203626 నెంబర్లలో సంప్రదించవచ్చు. – జోయల్ డెవిస్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
అర్ధరాత్రి వరకు మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు
నిమజ్జన ఘట్టం సందర్భంగా ఆరీ్టసీ, రైల్వే, మెట్రో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి అర్ధర్రాతి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడుపనున్నట్లు ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెట్రో స్టేషన్ల వద్ద భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసినట్లు హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్ స్టేషన్లలో అదనపు టిక్కెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు .. సికింద్రాబాద్–నాంపల్లి, లింగంపల్లి –సికింద్రాబాద్, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్నుమా, నాంపల్లి–ఫలక్నుమా స్టేషన్ల మధ్య శనివారం అర్ధరాత్రి వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. -
Ganesh Nimajjanam: 600 ప్రత్యేక బస్సులు
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్బండ్కు చేరుకొనేందుకు 600 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాచిగూడ, రాంనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులతోపాటు హయత్నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను హిమాయత్నగర్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు నడుపుతారు. ఉప్పల్, సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే బస్సులను ఇందిరాపార్కు వరకు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేశారు. బీహెచ్ఈఎల్, పటాన్చెరు, మియాపూర్, కూకట్పల్లి, తదితర ప్రాంతాల నుంచి నడిచే బస్సులు ఖైరతాబాద్ వరకు రాకపోకలు సాగిస్తాయి. బోడుప్పల్ వైపు నుంచి వచ్చే కొన్ని బస్సులను లిబర్టీ వరకు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మెహదీపట్నం వైపు నుంచి వచ్చే వాటిని లక్డీకాపూల్ వరకు నడుపుతారు. సమాచారం కోసం 99592 26160, 99592 26154 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. ఏర్పాట్ల వివరాలు నగరంలోని మండపాలు దాదాపు 50 వేలు (రిజిస్టర్ అయినవి 11,850) శుక్రవారం నాటికి నిమజ్జనమైనవి: 9 వేలకు పైగా ఊరేగింపు మార్గం: 303 కిమీఇందులో పాల్గొనే భక్తులు 10 లక్షల నుంచి 15 లక్షలు నిమజ్జనం జరిగే ప్రధాన ట్యాంకులుట్యాంక్బండ్, రాజన్న బౌలి, మీరాలం ట్యాంక్, ఎర్రకుంట చెరువు, షేక్పేట చెరువు, సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్, సఫిల్గూడ/మల్కాజ్గిరి చెరువులు, హస్మత్పేట చెరువుహుస్సేన్సాగర్కు వచ్చేవి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలతో పాటు మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన విగ్రహాలు.బందోబస్తులో పాల్గొనే విభాగాలు శాంతి భద్రతలు, టాస్్కఫోర్స్, ఎస్బీ, సీఏఆర్, సీఎస్డబ్ల్యూ, హోంగార్డ్స్, ఇతర జిల్లాల అధికారులు, పొరుగు రాష్ట్రాల పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, టీజీఎస్స్పీ, ఏఆర్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆరు యూనిట్ల గ్రేహౌండ్స్, మూడు యూనిట్ల ఆక్టోపస్ బలగాలు అందుబాటులో ఉంటాయి. పికెట్ల వివరాలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 310 సమస్యాత్మక ప్రాంతాల్లో 605 మొబైల్ పెట్రోలింగ్ యూనిట్లు: 410నిఘా కోసం కెమెరాలు12 వేల కమ్యూనిటీ సీసీ కెమెరాలు, అదనంగా 2 వేల సీసీ కెమెరాలు, 250 అద్దె కెమెరాలతో పాటు మరో 600 హ్యాండ్హెల్డ్ కెమెరాలు సీసీ కెమెరాల కనెక్టివిటీని డీజీపీ కార్యాలయంతో పాటు ఐసీసీసీకి ఇచ్చారు. బాంబు నిరీ్వర్య బృందాలు: 16యాక్సెస్ కంట్రోల్ టీమ్స్: 2 పోలీసు జాగిలాలు: 34 అదనపు వైర్లెస్ సెట్లు: 600 (ప్రస్తుతం ఉన్నవి 4 వేలు) డ్రోన్లు: 9క్రేన్ల మోహరింపు ఇలా విగ్రహాలను వాహనాలు ఎక్కించడానికి, అవసరమైన చోట్ల వాడటానికి 108 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. కంట్రోల్ రూమ్స్ పాతబస్తీలోని సర్దార్ మహల్లో జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు కమిషనరేట్, ఎనీ్టఆర్ మార్గ్, గాం«దీనగర్ ఔట్పోస్ట్ వద్ద మరో మూడు ఏర్పాటు. -
హైదరాబాద్: రూ.2.30 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిదిలో గణపతి లడ్డూ వేలం రికార్డు సృష్టించింది. బండ్లగూడ కీర్తి రిచ్మండ్ విల్లాలో రూ.2 కోట్ల 30 లక్షల రికార్డు ధర పలికింది. శుక్రవారం రాత్రి జరిగిన వేలం పాటలో 10 కేజీల లడ్డును బాలాగణేష్ టీం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఇదే విల్లాలో జరిగిన వేలంపాటలో రూ.1.87 కోట్లకు లడ్డూ పోగా.. ఈసారి రూ.45 లక్షలు అదనంగా వెళ్లింది. మొత్తం 80 విల్లా ఓనర్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి 500కి పైగా బిడ్లతో ఈ వేలంపాటలో పాల్గొన్నారు. సుమారు రెండున్నర గంటలపాటు ఈ వేలంపాట సాగడం గమనార్హం. 42 ఎన్జీవోలను నిర్వహించే ఓ ట్రస్టుకు ఈ డబ్బును విరాళంగా ఇవ్వబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తిగా వలంటీర్లతో నడిచే ఈ ట్రస్ట్ ద్వారా 10 వేల మందికి సాయం అందుతోంది, ప్రతీ పైసా నేరుగా క్షేత్రస్థాయిలోకే వెళ్తుందని అంటున్నారు. ఈ విల్లాలో 2018 నుంచి లడ్డూ వేలంపాట నడుస్తోంది. ఆ టైంలో రూ.25 వేలకు లడ్డూ పోయింది. 2019లో రూ. 18.75, 2020లో రూ.27.3లక్షలు, 2021లో రూ. 41 లక్షలు, 2022లో రూ.60 లక్షలు, 2023లో రూ.1.26 కోట్లకు పోయింది. మనస్పర్థలు రాకూడదనే గ్రూపులుగా విడిపోయి లడ్డూ వేలంపాటలో పాల్గొంటున్నారు. అయితే లడ్డూను మాత్రం అన్ని కుటుంబాలు కలిసే పంచుకుంటాయని చెబుతున్నారు. -
Watch Live: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర
-
హైదరాబాద్లో వినాయక నిమజ్జనాల సందడి (ఫోటోలు)
-
జరిమానానా?దారి దోపీడీనా?
గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలలో ట్రాఫిక్ ఉల్లంఘనలతో పాటు ఇదే సందు అదే సందు అన్నట్టుగా పెరుగుతున్న చలానాల వడ్డింపు కూడా తరచు చర్చనీయాంశంగా మారుతోంది. డ్రంకెన్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, హెల్మ్ట్ రహిత డ్రైవింగ్.... తదితర ఉల్లంఘనల పట్ల బాగా కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. కేసులు రాయడంతో పాటు భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా ఈ పరిస్థితి ద్విచక్రవాహనదారులకు తీవ్ర సంకటంగా మారింది. మోటార్ సైక్లిస్ట్స్ లలో సాధారణంగా దిగువ మధ్య తరగతివారే అధికం కావడంతో భారీ మొత్తంలో జరిమానాలను భరించలేక తరచుగా వారు గొడవలకు నిరసనలకు దిగుతుండడం అలాంటి ఘర్షణల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుండడం కూడా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదుర్కున్న ఒక ద్విచక్ర వాహనదారుడు తనకు విధించిన జరిమానాపై ఏకంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఇలా పెద్ద మొత్తంలో ఇష్టా రాజ్యంగా జరిమానాలు విధించడం అంటే అది మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనే అని పిటిషనర్ ఆరోపించారు.హైదరాబాద్ నగరానికి చెందిన రాఘవేంద్ర చారి అనే ప్రైవేట్ ఉద్యోగి 2025 నంబర్ 26655న ఓ రిట్ పిటిషన్ దాఖలు చేశారు, గత మార్చి 17న ఇద్దరు అదనపు రైడర్లతో (ట్రిపుల్ రైడింగ్) కలిసి ప్రయాణించిన కారణంగా తనకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు) విధించిన జరిమానాను ఆయన కోర్టులో సవాల్ చేశారు. చట్టంలో అనుమతించబడిన జరిమానాలకు మించి చలాన్లు జారీ చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి ద్విచక్ర వాహన నేరానికి మోటారు వాహనాల చట్టం ప్రకారం రూ. 100–రూ. 300 మాత్రమే జరిమానా విధించాల్సి ఉండగా రూ. 1,200 కట్టమని ఆదేశించడాన్ని ఆయన తప్పు పట్టారు. తనకు రూ. 1,200 మొత్తం జరిమానాగా విధించారని అయితే మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 177 అటువంటి నేరానికి చాలా తక్కువ జరిమానాను నిర్దేశిస్తుందని, కాబట్టి ఈ జరిమానా చట్టవిరుద్ధమని ఆయన వాదిస్తున్నారు. ‘వాహనదారులలో భయాన్ని కలిగించే ఉద్దేశ్యంతో వేల రూపాయల చట్టవిరుద్ధ చలాన్లు విధించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది అని పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ గోపాల్ ఆక్షేపించారు.‘‘చట్టం ద్వారా అనుమతించబడిన జరిమానాలకు మించి ఏ పౌరుడిని శిక్షించలేం. అయితే ఆదాయాన్ని సంపాదించాలనే దురుద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించడం మర్చిపోయి వ్యవహరిస్తున్నారు’’ అని ఆయన విమర్శిస్తున్నారు. ఈ పిటిషన్ను పురస్కరించుకుని ట్రాఫిక్ పోలీసులు చట్టబద్ధమైన పరిమితులను మించి జరిమానాలు ఎందుకు విధిస్తున్నారో వివరణ సమర్పించడానికి హోంశాఖకు, ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఒక వారం గడువు ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఇలాంటి అధిక జరిమానాల పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్న పలువురు వాహనదారుల ను ఈ పిటిషన్ ఆకర్షిస్తోంది. తెలంగాణలో ట్రాఫిక్ జరిమానాలు అమలు తీరుతెన్నులపై హైకోర్టు నుంచి భవిష్యత్తు రాబోయే నిర్ణయం ప్రభావితం చేయనుందని చెప్పొచ్చు. -
హైడ్రా పేరు చెప్పి.. రూ. 50 లక్షలు వసూలు!
హైదరాబాద్: ఇటీవల నగరంలో తరుచు వినిపిస్తున్న పేరు హైడ్రా. అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి హైడ్రా పేరు బాగా హైలైట్ అయ్యింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు.. తమకు హైడ్రా అధికారులు బాగా తెలుసని ఓ మహిళన మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హయత్నగర్లో కొంతమంది ముఠాగా ఏర్పడి హైడ్రా అధికారులతో పనిచేయిస్తామని చెప్పి స్థానిక మహిళను ప్రలోభాలకు గురి చేశారు. హయత్నగర్లోని ల్యాండ్ ఇష్యూకు సంబంధించి సదరు మహిళ రూ. 50 లక్షలను ఆ ముఠాకు అప్పగించింది. వివరాల్లోకి వెళితే.. హయత్నగర్లో ఉన్న ల్యాండ్ ఇష్యూపై హైడ్రాకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. ఇదే విషయాన్ని స్నేహితుల వద్ద కూడా చెప్పింది. అయితే తమకు హైడ్రా అధికారులు తెలుసని, ఈ విషయాన్ని తాము చూసుకుంటామని పలువురు వ్యక్తులు నమ్మబలికారు. దాంతో రూ. 50 లక్షలను ఆ మహిళను నుంచి తీసుకుంది ముఠా. ఇది హైడ్రా కమిషనర్ వరకూ వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. దీంతో విచారణ చేయగా వారిపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. పరిధి విస్తరించి ఉన్న ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా. ఫిర్యాదు చేయాలన్నా నేరుగా తమనే సంప్రదించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ కోరారు. ప్రతి సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వ హించే ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేయవచ్చని సూచిం చారు. హైడ్రా అధికారులు తమ బంధువులని, మిత్రులని, తమకు బాగా తెలుసంటూ ఎవరైనా చెబితే నమ్మి మోస పోవద్దని హెచ్చరించారు. హైడ్రాకు సంబంధించి ఫిర్యాదులు ఉన్నా తనను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. -
రక్తమూలుగ మార్పిడితో వందల మందికి కొత్త జీవితం
హైదరాబాద్: రక్తానికి సంబంధించి అనేక సమస్యలుంటాయి. రక్త క్యాన్సర్తో పాటు సికిల్ సెల్ డిసీజ్, థలసీమియా, ఎప్లాస్టిక్ ఎనీమియా.. ఇలాంటి అనేక సమస్యలకు రక్తమూలుగను (బోన్ మ్యారో) మార్చడం ఒక్కటే పరిష్కారం. అయితే అందులో చాలా సమస్యలుంటాయి. గతంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, పెద్ద కుటుంబాలు ఉండడంతో ఎక్కువమంది పిల్లలు ఉండేవారు. అందువల్ల రక్తమూలుగ దాతల విషయంలో ఇబ్బంది అయ్యేది కాదు.కానీ ఇప్పుడు చిన్న కుటుంబాలు కావడంతో ఎవరికైనా అవసరమైతే అదే కుటుంబానికి చెందిన దాతలు దొరకడం కష్టం అవుతోంది. అలాంటప్పుడు 50 శాతం మ్యాచ్ ఉన్నా కూడా వైద్యరంగంలో వచ్చిన సరికొత్త పరిజ్ఞానంతో మూలుగ మార్పిడి విజయవంతంగా చేయొచ్చు. అలాంటి పరిజ్ఞానాన్ని కూడా కిమ్స్ ఆస్పత్రి సమకూర్చుకుంది. ఈ విషయాలను ఆస్పత్రికి చెందిన హెమటో ఆంకాలజీ, స్టెమ్ సెల్, బోన్మారో ట్రాన్స్ప్లాంట్ విభాగాధిపతి డాక్టర్ నరేందర్ కుమార్ తోట ఆస్పత్రిలో జరిగిన 10 ఏళ్ల విజయోత్సవ కార్యక్రమంలో వివరించారు.ఈ పదేళ్ల విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, ఫిలాన్తరోపిస్ట్ లు శ్రీమతి సుధారెడ్డి, శ్రీమతి పింకీ రెడ్డిలు, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డా. భాస్కర్ రావు, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈఓ డా. అభినయ్, మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు లు హాజరయ్యారు.ఈ సందర్భంగా డా. నరేంద్ర కుమార్ తోట మాట్లాడుతూ ‘‘రక్తమూలుగ మార్పిడి విషయంలో కిమ్స్ ఆస్పత్రి గణనీయమైన విజయాలు సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఈ తరహా చికిత్సలు మొదలుపెట్టిన మొట్టమొదటి ఆస్పత్రి ఇదే కావడం మా అందరికీ గర్వకారణం. రక్తమూలుగను మార్చడమే కాకుండా, ఆ తర్వాత కూడా రోగిని అత్యంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ చికిత్స విజయవంతం అయ్యేలా చూడడంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటన్నింటినీ అధిగమిస్తూ పదేళ్లుగా అత్యంత ఎక్కువ విజయాల శాతంతో ముందడుగు వేస్తున్నాం. ఈ విషయంలో జాతీయ సగటు కంటే కూడా కిమ్స్ ఆస్పత్రిలో విజయాల రేటు ఎక్కువ ఉండడం మాకు గర్వకారణం. ఇక్కడ ఉన్న నిపుణులు, ఉన్న అత్యాధునిక సదుపాయాలే అందుకు కారణం.ఒకప్పుడు రక్తక్యాన్సర్ వచ్చినా, మరే సమస్య వచ్చినా రక్తమూలుగ మార్పించుకోవాలంటే రాయవెల్లూరులోని సీఎంసీకి, ముంబైలోని టాటా మెమోరియల్ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్లోనే అందుబాటులో అన్నిరకాల ఆధునిక చికిత్సలు వచ్చాయి. గడిచిన పదేళ్లలో 150 మందికి పైగా రోగులకు రక్తమూలుగ మార్పిడి చేసి, వారికి సత్ఫలితాలు అందించాం.క్యాన్సర్ కేసుల్లో రక్తమూలుగ మార్పిడి 50 శాతం మ్యాచ్ అయినా చేయడం చాలా సులభమే. కానీ, సికిల్ సెల్ ఎనీమియా, థలసీమియా, ఎప్లాస్టిక్ ఎనీమియా లాంటి కేసుల్లో అది చాలా కష్టం. మంచిఫలితాలు ఒక పట్టాన రావు. అయినా కూడా అలాంటి కేసులకు సైతం ఈ ఆస్పత్రిలో విజయవంతంగా రక్తమూలుగను మార్పిడి చేశాం. పెద్దలతో పాటు పిల్లలకూ ఇలాంటివి చేసి, మంచి ఫలితాలు సాధించాం. కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా పలు ఆఫ్రికన్ దేశాలు, గల్ఫ్ దేశాల రోగులకు కూడా ఇలాంటి 50% మ్యాచ్ ఉన్నప్పుడూ మార్పిడి చేశాం.అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలోనే ఇక్కడ కూడా మార్పిడి చికిత్స చేస్తున్నా, ఇక్కడ ఇన్ఫెక్షన్ల రేటు ఎక్కువ ఉండడం అతిపెద్ద సమస్యగా ఉంటోంది. చికిత్స చేయించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ల బారిన పడితే కోలుకోవడం కష్టమవుతుంది. వాటి బారిన పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు కార్యక్రమానికి గతంలో బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నవారితో పాటు వారికి రక్తమూలుగను దానం చేసిన దాతలు కూడా రావడం ఎంతో సంతోషకరం. వీరంతా ముందుకొచ్చి మూలుగ దానం చేయడం వల్లే ఇంతమంది జీవితాలు ఇప్పుడు బాగున్నాయి. మరింతమంది ఈ విషయంలో అవగాహన పెంపొందించుకుని, రక్తమూలుగను దానం చేయడం ద్వారా మరికొందరి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాం’’ అని డాక్టర్ నరేందర్ కుమార్ తోట తెలిపారు. -
అందుకే విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. విద్యాశాఖ ముఖ్యమైందని.. అందుకే తన దగ్గర పెట్టుకున్నానని తెలిపారు. శుక్రవారం ఆయన శిల్పకళా వేదికలో టీచర్స్ డే వేడుకల్లో మాట్లాడుతూ.. విద్యాశాఖలో చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయన్నారు. పదేళ్ల పాటు టీచర్ల నియామకాలు జరగలేదని.. మేం వచ్చాక ఉపాధ్యాయులు నియామకాలు చేపట్టామని ఆయన తెలిపారు.కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ అమలు జరిగిందా? అంటూ ప్రశ్నించిన రేవంత్.. విద్యాశాఖలో ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వంలో విద్యను వ్యాపారంగా మార్చి సొమ్మును చేసుకున్నారు. ఉస్మానియా వర్శిటీని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చారు. విద్యను వ్యాపారంగా మార్చి సొమ్మును చేసుకున్నారు. పేదల తలరాత మార్చేది చదువు ఒక్కటే. ఫుడ్ పాయిజన్ వార్తలు చూస్తే బాధేస్తుంది. టీచర్లు కూడా పిల్లలతో కలిసి భోజనం చేయాలి’’ అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, యూనివర్సిటీ వీసీలు, ఉన్నతాధికారులు, పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. -
సీబీఐ చేతికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎపిసోడ్లో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: సీబీఐ చేతికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని కోఠి సీబీఐ కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యటనపై ప్రాధాన్యత నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఈ నెల 1న సీబీఐ డైరెక్టర్కు, కేంద్ర హోంశాఖకు పంపారు. ఈ క్రమంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ రావడం చర్చాంశనీయంగా మారింది. -
ఖైరతాబాద్ గణేష్ దర్శనం నిలిపివేత
-
Watch Live: ఖైరతాబాద్ గణేష్ నిమర్జనానికి సర్వం సిద్ధం...
-
శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధం.. ప్రత్యేకతలు ఇవే!
-
హుస్సేన్ సాగర్ చుట్టూ ఘనంగా వినాయక నిమజ్జనాలు (ఫొటోలు)
-
‘మై హోమ్ భుజ’ లడ్డూ రూ.51 లక్షలు
రాయదుర్గం: హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని మైహోమ్ భుజ గేటెడ్ కమ్యూనిటీ గణేశ్ లడ్డూ వేలం పోటాపోటీగా, ఉత్కంఠభరితంగా సాగింది. చివరకు ఖమ్మం జిల్లా ఇల్లందు రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేశ్ రూ.51,07,777 లకు పాడుకొని రికార్డును నెలకొల్పారు. గత ఏడాది మైహోమ్ భుజ లడ్డూను ఆయనే రూ.29 లక్షలకు పాడారు. అది ఈ ఏడాది రూ. 51 లక్షలు దాటడం విశేషం. పోటాపోటీగా గణేష్, శ్రీకాంత్ ఇద్దరూ వేలంపాటలో కొనసాగుతూ అందరినీ ఉత్కంఠకు గురిచేశారు. భక్తి, సెంటిమెంట్ వల్లే వేలంలో పాల్గొన్నా.. ‘గణేశుడిపై ఉండే భక్తి, సెంటిమెంట్ వల్లే వేలం పాటలో పాల్గొన్నాను’ అని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇల్లందు గణేశ్ తెలిపారు. ‘మొదటిసారిగా రూ.29 లక్షలకు లడ్డూను గెలుచుకోగా నాకు వ్యాపారపరంగా ఎంతో లాభించింది. అందుకే సెంటిమెంట్తో ఈసారి మళ్ళీ వేలంపాటలో పాల్గొన్నాను. 25 ఏళ్ళుగా లడ్డూ వేలంపాటలో పాల్గొంటున్నా. ఇల్లందు (Yellandu) స్టేషన్బస్తీలో వినాయక ఆలయాన్ని కట్టించాం. మా నాన్న, అమ్మ 20 ఏళ్ళుగా గణేశ్ మాల ధరిస్తున్నారు. మైహోం భుజ కమిటీ వారు పారదర్శకంగా ఈ లడ్డూ వేలం నిర్వహించడం సంతోషంగా ఉంది’అని అన్నారు.చదవండి: హైదరాబాద్లో ఎక్కువగా అక్కడే రోడ్డు ప్రమాదాలు.. ఎందుకంటే? -
నిమజ్జన ఘట్టం సాఫీగా సాగేలా...
సాక్షి,హైదరాబాద్: గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం శనివారం హుస్సేన్సాగర్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో భారీ ఊరేగింపులు సైతం ఉంటాయి. వీటి కారణంగా నగర శివార్లతో పాటు సిటీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 66 ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో చేస్తారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 వరకు ఇవి అమలులో ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పొడిగించే అవకాశం ఉంది. నిమజ్జనానికి వచ్చే ప్రజలు వ్యక్తిగత వాహనాలను వదిలి ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్లను ఆశ్రయించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గం: కేశవగిరి–నాగుల్చింత–ఫలక్నుమ–చారి్మనార్–మదీనా–అఫ్జల్గంజ్–ఎంజే మార్కెట్–అబిడ్స్–బïÙర్బాగ్–లిబర్టీ–అప్పర్ ట్యాంక్/ఎనీ్టఆర్ మార్గ్ల్లో నిమజ్జనం జరుగుతుంది. సికింద్రాబాద్ వైపు నుంచి.. ఆర్పీ రోడ్–ఎంజీ రోడ్–కర్బాలామైదాన్–ముïÙరాబాద్ చౌరస్తా–ఆరీ్టసీ క్రాస్రోడ్స్– నారాయణగూడ ‘ఎక్స్’ రోడ్–హిమాయత్నగర్ ‘వై’ జంక్షన్ ద్వారా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో చేరుతుంది. ఈస్ట్జోన్ నుంచి.. ఉప్పల్–రామాంతపూర్–అంబర్పేట్–ఓయూ ఎన్సీసీ–డీడీ హాస్పిటల్ల మీదుగా ప్రయాణించి ఆర్టీసీ క్రాస్రోడ్స్ వద్ద సికింద్రాబాద్ రూట్ దాంతో కలుస్తుంది. వెస్ట్ జోన్ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్ లేదా సెక్రటేరియేట్ వద్ద ప్రధాన ఊరేగింపుతో కలుస్తాయి. నిమజ్జనం ఊరేగింపు జరిగే మార్గాల్లో చిన్న వాహనాలకు అనుమతి ఉండదు. ఈ మార్గానికి అటు ఇటు ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణించడానికి కేవలం బషీర్బాగ్ చౌరస్తా వద్ద మాత్రమే అవకాశం ఇచ్చారు. సాధారణ ప్రజలు రింగ్రోడ్, బేగంపేట్ మార్గాలను ఆశ్రయించడం ఉత్తమం. వెస్ట్–ఈస్ట్ జోన్ల మధ్య రాకపోకలు సాగించే వారికి కేవలం బషీర్బాగ్ వద్దే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్: సౌత్ జోన్: కేశవగిరి, మొహబూబ్నగర్ ఎక్స్రోడ్స్, ఇంజన్ బౌలి, నాగుల్చింత, హిమ్మత్పుర, హరి»ౌలి, ఆశ్రా హాస్పిటల్, మొఘల్పుర, లక్కడ్ కోటి, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జ్, దారుల్íÙఫా చౌరస్తా, సిటీ కాలేజ్ ఈస్ట్ జోన్: చంచల్గూడ జైల్ చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్ఘాట్ బ్రిడ్జ్, సాలార్జంగ్ బ్రిడ్జ్, అఫ్జల్గంజ్, పుత్లి»ౌలి చౌరస్తా, ట్రూప్బజార్, జాంబాగ్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్ వెస్ట్ జోన్: టోపి ఖానా మాస్్క, అలాస్కా హోటల్ చౌరస్తా, ఉస్మాన్ జంగ్, శంకర్బాగ్, శీనా హోటల్, అజంతాగేట్, ఆబ్కారీ లైన్, తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్ సెంట్రల్ జోన్: ఛాపెల్ రోడ్ ఎంట్రీ, జీపీఓ దగ్గరి గద్వాల్ సెంటర్, శాలిమార్ థియేటర్, గన్ ఫౌండ్రీ, స్కౌలైన్ రోడ్ ఎంట్రీ, హిమాయత్నగర్ ‘వై’ జంక్షన్, దోమల్గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గౌడ్స్ చౌరస్తా, కంట్రోల్రూమ్ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్ ఆఫీస్ ‘వై’ జంక్షన్, బీఆర్కే భవన్, ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్ చౌరస్తా, వీవీ స్టాట్యూ చౌరస్తా, చి్రల్డన్స్ పార్క్, వైశ్రాయ్ హోటల్ చౌరస్తా, కవాడీగూడ జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరాపార్క్ నార్త్జోన్: కర్బాలామైదాన్, బుద్ధభవన్, సెయిలింగ్ క్లబ్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్ ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్ల్లోకి ఎలాంటి ట్రాఫిక్ను అనుమతించరు. శనివారం ఉదయం నుంచి సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్, బాటా ‘ఎక్స్’ రోడ్, ఆదివాసీ చౌరస్తా, ఘాన్స్మండీ చౌరస్తాల మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి.సందర్శకులకు పార్కింగ్: హుస్సేన్సాగర్లో జరిగే నిమజ్జనాన్ని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించారు. ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జెడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధ భవన్ పక్కన, ఎనీ్టఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, లోయర్ ట్యాంక్బండ్, గో సేవా సదన్, కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి సందర్శకులు కాలినడకనే ట్యాంక్బండ్ పరిసరాలకు చేరుకోవాలి. నిమజ్జనం తరవాత: విగ్రహాలను తెచి్చన లారీలు/ట్రక్కులు నిమజ్జనం పూర్తి చేసిన తరవాత తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక రూట్లు కలి్పంచారు. ఎనీ్టఆర్ మార్గ్లో నిమజ్జనం చేసినవి నెక్లెస్రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ స్టాట్యూ, కేసీపీల మీదుగా వెళ్లాలి. వీటిని తెలుగుతల్లి స్టాట్యూ, మింట్ కాంపౌండ్స్లోకి అనుమతించరు. అప్పర్ ట్యాంక్బండ్ నుంచి నిమజ్జనం చేసిన లారీలు/ట్రక్కులు చిల్డ్రన్స్పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడీగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలి. బైబిల్హౌస్ రైల్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా అనుమతించరు. ఇంటర్ డిస్ట్రిట్/స్టేట్ లారీలకు: ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే లారీలను నగరంలోకి అనుమతించరు. ఔటర్ రూట్లను వినియోగించుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులకూ: ట్రాఫిక్ ఆంక్షలు ఆర్టీసీ బస్సులకూ వర్తిస్తాయి. నిమజ్జనం నేపథ్యంలో మాసబ్ట్యాంక్, వీవీ స్టాట్యూ, సీటీఓ, వైఎంసీఏ, రెతిఫైల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్లాక్ టవర్, చిలకలగూడ చౌరస్తా, ఛే నెంబర్, గడ్డిఅన్నారం, చాదర్ఘాట్, బహదూర్పుర, నల్గొండ చౌరస్తాలను దాటి ముందుకు రానీయరు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సులకు...నిమజ్జనం పూర్తయ్యే వరకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే బస్సుల్ని నగరంలోకి అనుమతించరు. వీటిని శివార్లలోనే ఆపేసి అటునుంచే మళ్ళిస్తారు. హెల్ప్లైన్స్ ఏర్పాటు: ఈ ఆంక్షలపై ప్రజలకు అవగాహన కలి్పంచడం, సహకరించడం కోసం ప్రత్యేక హెల్ప్లైన్స్ను సైతం ఏర్పాటు చేశారు. ఎలాంటి సహాయం కావాలన్నా 040–27852482, 8712660600, 9010203626 నెంబర్లలో సంప్రదించవచ్చు. -
ఎస్ఎల్బీసీ.. సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ కేవలం నల్గొండ జిల్లాకే కాదని.. తెలంగాణకు అత్యంత కీలకమన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లు ఇవ్వడానికి ఎస్ఎల్బీసీలో అవకాశం ఉందన్నారు.‘‘శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యలపై తక్షణమే సమాచారం ఇవ్వాలి. అటవీ శాఖ అనుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 2027 డిసెంబరు 9 లోగా ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలి. ఎస్ఎల్బీసీ పనులకు గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సొరంగం పనుల కోసం కాంట్రాక్టు సంస్థ జేపీ అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలి. కాంట్రాక్టు సంస్థ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకోను...సొరంగం తవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలను వినియోగించుకోవాలి. ఎస్ఎల్బీసీ పనులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ పూర్తి కావాలి. పనులు ఆగడానికి వీలు లేదు’’ అని రేవంత్రెడ్డి తేల్చి చెప్పారు. -
మహిళ ప్రాణాల మీదకు తెచ్చిన కరక్కాయ
హైదరాబాద్: దగ్గు వస్తోందని రాత్రి నిద్రపోయేటప్పుడు కరక్కాయ బుగ్గన పెట్టుకోవడం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. హైదరాబాద్ నగరానికి చెందిన 57 ఏళ్ల విజేత అనే మహిళకు దగ్గు బాగా ఎక్కువగా వస్తుందని రాత్రి నిద్రకు దగ్గుతో ఇబ్బంది అవుతుందని, ఆమె కరక్కాయ బుగ్గన పెట్టుకుని పడుకున్నారు. నిద్రలో తెలియకుండానే దాన్ని మింగేశారు. అది కాస్తా శ్వాసనాళాల్లోకి వెళ్లిపోవడంతో ఆమెకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఈ రవీందర్ రెడ్డి, డాక్టర్ భరత్ జానపాటి తెలియచేసారు.విజేత అనే ఈ మహిళకు కొంతకాలంగా వాతావరణంలో మార్పుల కారణంగా దగ్గు వస్తోంది. కూర్చున్నప్పటి కంటే పడుకుని ఉండే స్థితిలో దగ్గు ఎక్కువ అవుతుంది. రాత్రి నిద్రకు ఆటంకం కలుగుతుందని, దగ్గు తగ్గడానికి ఆమె ఒక కరక్కాయ బుగ్గన పెట్టుకున్నారు. నిద్రలో పొరపాటున దాన్ని మింగేశారు. దాంతో ఆమెకు విపరీతమైన దగ్గు, ఆయాసం, ఊపిరి అందకపోవడంతో బాధపడుతూ కామినేని ఆస్పత్రి ఎమర్జెన్సీకు వచ్చారు. అక్కడ సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాII రవీందర్ రెడ్డి చూసి, శ్వాస ఆడటంలో ఎక్కువగా ఇబ్బంది ఉంటడంతో ఆమెను వెంటిలేటర్ మీద ఉంచి, ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఆమెకు చెస్ట్ ఎక్స్-రే, హెచ్ఆర్ సీటీ స్కాన్ పరీక్షలు చేయగా ఎడమ శ్వాసనాళాలలో ఎదో అడ్డు పడినట్టు, దాని కారణంగా ఎడమ ఊపిరితిత్తులు పూర్తిగా మూసుకుపోయినట్టు గుర్తించారు. వెంటిలేటర్ పైన ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడ్డాక కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాII భరత్ జానపాటి బ్రాంకోస్కోపీ ద్వారా శ్వాసనాళాలను పరీక్షించారు. ఎడమ శ్వాసనాళం ఒక పదార్థంతో మూసుకుపోయినట్టు గుర్తించారు. దాంతో ఆమెకు ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కొపీ చికిత్స చేయాలని నిర్ణయించారు. ఇదివరకే ఆమెకు అధిక రక్తపోటు, థైరాయిడ్, గుండె సమస్య ఉన్నాయి. గతంలో ఒకసారి యాంజియోప్లాస్టీ కూడా చేశారు. అందువల్ల ఈ ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంది. అనస్తీషియా టీం సహకారంతో ఆపరేషన్ థియేటర్లో ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. బ్రాంకోస్కోపీ ద్వారా రాట్ టూత్ (Rat Tooth ) ఫోర్సెప్స్ అనే ప్రత్యేకమైన పరికరం సహాయంతో ఎడమ శ్వాసనాళంలో రెండు ముక్కలుగా బలంగా ఇరుక్కుపోయిన కరక్కాయను పేషెంట్కు ఎటువంటి హాని కలగకుండా విజయవంతంగా తీశారు.బ్రాంకోస్కోపీ చేసిన తర్వాత తీసిన ఎక్స్-రేలో ఎడమ ఊపిరితిత్తులు పూర్తిగా తెరుచుకున్నాయి. రోగి పరిస్థితి కూడా చాలా మెరుగుపడింది. ఎడమ ఊపిరితిత్తులు బాగా పనిచేస్తోందని నిర్ధారించుకున్న మరుసటి రోజు ఆమెను డిశ్చార్జ్ చేసారు.ఈ సందర్బంగా డాII భరత్ జానపాటి మాట్లాడుతూ "ఈ రకంగా శ్వాసనాళాలోకి, ఉపిరితిత్తులలోకి బయట పదార్థాలు వెళ్లడం ముఖ్యంగా చిన్నపిల్లల్లో, లేదా న్యూరోలాజికల్ సమస్యలు ఉన్న వారిలో తరచూగా చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా పడుకునే సమయాల్లో కరక్కాయలు, లేదా వక్క పలుకులు లాంటివి బుగ్గన పెట్టుకొని పడుకునే అలవాటు ఉన్నవారికి ఇలాంటి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బ్రాంకోస్కోపీ ప్రక్రియ ద్వారా వాటిని తొలగించటం సాధ్యం" అని ఆయన తెలియచేసారు. -
Hyderabad: గణేష్ నిమజ్జనాలు.. రూట్ మ్యాప్ ఇదే
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనాలకు రూట్ మ్యాప్ విడులైంది. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ పరిమితులు విధించారు. బాలాపూర్ నుంచి చార్మినార్–అబిడ్స్–లిబర్టీ–ట్యాంక్బండ్–నెక్లెస్ రోడ్డు వరకు ప్రధాన శోభాయాత్ర సాగుతోంది. సికింద్రాబాద్ నుంచి పాట్నీ–పరడైజ్–రాణిగంజ్–కర్బలామైదాన్–ట్యాంక్బండ్ మార్గం..దిల్సుఖ్నగర్, అంబర్పేట్, నారాయణగూడ, ఉప్పల్ నుంచి ప్రాసెషన్లు లిబర్టీ వద్ద కలుస్తాయి. టోలిచౌకీ, మెహిదీపట్నం నుంచి వచ్చిన విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు చేరతాయి. టప్పాచబుత్రా, ఆసిఫ్నగర్ నుంచి వచ్చిన విగ్రహాలు ఎంజే మార్కెట్లో కలుస్తాయి. ప్రధాన రూట్లపై ఇతర వాహనాలకు అనుమతి లేదు.👉సౌత్ ఈస్ట్ జోన్ డైవర్షన్ పాయింట్లు: కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్గూడ👉సౌత్ జోన్: అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దారుషిఫా👉ఈస్ట్ జోన్: శివాజీ బ్రిడ్జ్, పుత్లిబౌలి, హిమాయత్నగర్, వైఎంసీఏ👉సెంట్రల్ జోన్: లిబర్టీ, అబిడ్స్, ఖైరతాబాద్, ట్యాంక్బండ్, బుద్ధభవన్👉నార్త్ జోన్: పాట్నీ, పారడైజ్, రాణిగంజ్👉పార్కింగ్ ప్రదేశాలు: ఎన్టీఆర్ స్టేడియం, కట్ట మైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్⇒నిమజ్జనం అనంతరం లారీలు నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మాత్రమే అనుమతి⇒సెప్టెంబర్ 6 ఉదయం 8 నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 వరకు నగరంలోకి లారీలు ప్రవేశం లేదు⇒ఆర్టీసీ బస్సులు పీక్ సమయంలో మెహిదీపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, నారాయణగూడ వరకు మాత్రమే⇒అంతర్ రాష్ట్ర, జిల్లా బస్సులు-చాదర్ఘాట్ వైపు మాత్రమే దారి మళ్లింపు⇒దాటకూడని జంక్షన్లు: ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా⇒విమానాశ్రయం వెళ్ళేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే వాడాలి⇒సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లేవారు బేగంపేట్-పారడైజ్ రూట్ వాడాలి⇒నిమజ్జనం కోసం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంక్లు, 8 ఎక్స్కవేషన్ పాండ్లు ఏర్పాటు⇒హెల్ప్లైన్ నంబర్లు: 040-27852482, 8712660600, 9010203626 -
హైదరాబాద్లో ఇక్కడే తరచూ ప్రమాదాలు
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు బ్లాక్స్పాట్స్పై దృష్టి పెట్టారు. తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తు చేస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో నిర్వహించిన స్టడీ ఆధారంగా 54 బ్లాక్స్పాట్స్ ఉన్నట్లు గుర్తించారు. గడిచిన రెండేళ్ల గణాంకాల ఆధారంగా దీన్ని నిర్ధారించారు. – సాక్షి, సిటీబ్యూరోసిటీలో బ్లాక్స్పాట్స్గా పరిగణించే ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించడానికి ట్రాఫిక్ పోలీసులు శాంతిభద్రతల విభాగం అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నిరోధానికి ట్రాఫిక్ పోలీసులు పని చేస్తారు. అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసేది మాత్రం లా అండ్ ఆర్డర్ పోలీసులే. ఈ నేపథ్యంలోనే వారితో కలిసి ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేశారు. 2023–24లో సిటీలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల జాబితాలను సేకరించారు. ఒకే ప్రాంతం లేదా స్టెచ్లో రెండు కంటే ఎక్కువ యాక్సిడెంట్స్ (Accidents) చోటు చేసుకున్న ఏరియాలను గుర్తించారు. వీటిలో యాదృచి్ఛకంగా జరిగిన వాటిని మినహాయించారు. ఇంజినీరింగ్ సహా ఇతర లోపాల వల్ల చోటు చేసుకున్న ప్రమాదాలకు ప్రాధాన్యం ఇస్తూ బ్లాక్స్పాట్స్గా నిర్ధారించారు. అనేకం ‘చావు’రస్తాలే.. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో అత్యధికం చౌరస్తాలు, జంక్షన్లే ఉంటున్నాయి. రద్దీ వేళలు, సిగ్నల్స్ యాక్టివ్గా ఉండే సమయంలో కంటే మిగిలిన సమయాల్లోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ 54 బ్లాక్స్పాట్స్లో దాదాపు 40 శాతం చౌరస్తాల్లో ఉన్నవే. ఆ ప్రాంతాలు సైతం హైదరాబాద్–సైబరాబాద్–రాచకొండ సరిహద్దుల్లో ఉన్నవి కొన్ని ఉండటం గమనార్హం. వీటిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో మరణించిన/క్షతగాత్రులైన వారిలో 40 శాతం పాదచారులు, మరో 40 శాతం ద్విచక్ర వాహనచోదకులే ఉంటున్నారు. ఇవే ప్రధాన కారణాలు పరిమితికి మించిన వేగం (ప్రదానంగా ఐఆర్ఆర్లో..) ⇒ మద్యం తాగి వాహనాలు నడపటం ⇒ మలుపులు ఉన్న చోట్ల డివైడర్లు, మీడియమ్స్ లేకపోవడం ⇒ అత్యంత సమస్యాత్మకంగా(బ్లైండ్) ఉన్న మలుపులు ⇒ కీలక సూచనలు చేసే సైనేజ్ బోర్డులు లేకపోవడం ⇒ ఇరుకైనా రోడ్లు, ఆపై అక్కడే ఉంటున్న ఆక్రమణలు ⇒ రోడ్డు ఇంజినీరింగ్ను పట్టించుకోకుండా రహదారి నిర్మాణం ⇒ రహదారులపై హఠాత్తుగా చేపడుతున్న మరమ్మతులు ⇒ క్యారేజ్ వేలో తొలగించకుండా వదిలేసిన చెట్లు, కరెంటు స్తంభాలు ⇒ అవసరమైన స్థాయిలో విద్యుత్ దీపాలు లేకపోవడం ⇒ వాహనచోదకులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం ⇒ నో–ఎంట్రీలోకి వాహనాలతో దూసుకుపోవడం ⇒ రోడ్ మార్కింగ్ పక్కగా లేకపోవడం, శాస్త్రీయత కొరవడటం‘ఇన్నర్’లోనే అత్యధికంగా.. నగర ట్రాఫిక్ కమిషనరేట్ పరిధిలో 28 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటిలోని కేవలం కొన్నింటిలో మాత్రమే బ్లాక్స్పాట్స్ లేవని తేలింది. అత్యధిక ఠాణాల పరిధిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్స్పాట్స్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీటిలోనూ ఒక ఠాణా పరిధిలో ఐదు, మరోదాని పరిధిలో నాలుగు, నాలుగు పోలీసుస్టేషన్ల పరిధిలో మూడేసి, తొమ్మిదింటిలో రెండు చొప్పున యాక్సిడెంట్స్ స్పాట్స్ ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్)లో విస్తరించి ఉన్న ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధుల్లోనే బ్లాక్స్పాట్స్ ఎక్కువగా ఉంటున్నాయని తేలింది.ఏ ఠాణా పరిధిలో ఎన్ని, ఎక్కడ? ⇒ బోయిన్పల్లి: 5 (డెయిరీ ఫాం ఎక్స్ రోడ్, బోయిన్పల్లి చెక్పోస్టు, బోయిన్పల్లి ఎక్స్ రోడ్, సీటీఓ) ⇒ లంగర్హౌస్: 4 (బాపూఘాట్, లక్ష్మీనగర్, మొఘల్ క నాలా, దర్గా) ⇒ గాంధీనగర్: 3 (ట్యాంక్బండ్పైన చిల్డ్రన్ పార్క్, బడేమియా కబాబ్, లేపాక్షి) ⇒ ఎస్సార్నగర్: 3 (ఈఎస్ఐ, ఉమేష్చంద్ర స్టాట్యూ, మైత్రీవనం) ⇒ అఫ్జల్గంజ్: 3 (అఫ్జల్గంజ్ టి జంక్షన్, సీబీఎస్, చాదర్ఘాట్ చౌరస్తా) ⇒ బేగంపేట: 3 (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, పీఎన్టీ, రసూల్పుర చౌరస్తా) ⇒ చాదర్ఘాట్: 2 (నల్లగొండ చౌరస్తా, మలక్పేట గంజ్) ⇒ మలక్పేట: 2 (మూసరాంబాగ్ చౌరస్తా, వైభవ్ బస్టాప్) ⇒ బహదూర్పుర: 2 (పురానాపూల్ శ్మశానవాటిక, జూపార్క్ చౌరస్తా) ⇒ తిరుమల గిరి: 2 (తిరుమలగిరి చౌరస్తా, లోతుకుంట) ⇒ బంజారాహిల్స్: 2 (కేబీఆర్ పార్క్, రోడ్ నెం.3 జంక్షన్) ⇒ చాంద్రాయణగుట్ట: 2 (బండ్లగూడ చౌరస్తా, ఒమర్ హోటల్) ⇒ గోపాలపురం: 2 (గురుద్వార, రైల్ నిలయం) ⇒ నల్లకుంట: 2 (విద్యానగర్ చౌరస్తా, తిలక్నగర్ చౌరస్తా) ⇒ ఉస్మానియా యూనివర్సిటీ: 2 (హబ్సిగూడ చౌరస్తా, తార్నాక చౌరస్తా) ⇒ జూబ్లీహిల్స్: 1 (జూబ్లీహిల్స్ చెక్పోస్టు) ⇒ చిక్కడపల్లి: 1 (వీఎస్టీ చౌరస్తా) ⇒ గోల్కొండ: 1 (రామ్దేవ్గూడ) ⇒ కార్ఖానా: 1 (బోయిన్పల్లి మార్కెట్ యార్డ్) ⇒ లాలాగూడ: 1 (మెట్టుగూడ చౌరస్తా) ⇒ బొల్లారం: 1 (అల్వాల్ రైతుబజార్) ⇒ సైఫాబాద్: 1 (ఓల్డ్ సైఫాబాద్ ఠాణా) ⇒ బేగంబజార్: 1 (ఎంజే మార్కెట్) ⇒ చాంద్రాయణగుట్ట: 1 (కేశవగిరి టి జంక్షన్) ⇒ హుమాయున్నగర్: 1 (రేతిబౌలి) ⇒ కాచిగూడ: 1 (నిబోలిఅడ్డా వద్ద పాత ఠాణా) ⇒ అంబర్పేట్: 1 (త్రిశూల్ బార్) ⇒ మహంకాళి: 1 (ప్లాజా చౌరస్తా) ⇒ సుల్తాన్బజార్: 1 (కోఠి ఆంధ్రాబ్యాంక్) ⇒ సంతోష్నగర్: 1 (పిసల్బండ చౌరస్తా) చదవండి: హైదరాబాద్కు మరో వందేభారత్ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ సహకారంతో.. నగరంలోని బ్లాక్స్పాట్స్పై అధ్యయనానికి ట్రాఫిక్ విభాగంలో ఇంజినీరింగ్ సెల్ పని చేస్తోంది. మృతులతో కూడిన ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రాంతాలను జీహెచ్ఎంసీ (GHMC) అధికారులతో కలిసి అధ్యయనం చేస్తున్నాం. ప్రమాదాలకు కారణాలను గుర్తించి బల్దియా, జాతీయ రహదారుల సంస్థలకు సిఫార్సులు చేస్తున్నాం. ప్రతి మూడు నెలలకు కలెక్టర్ నేతృత్వంలో జరిగే రోడ్ సేఫ్టీ (Road Safety) మీటింగ్స్లో వీటిని ప్రతిపాదించడంతో పాటు పనుల పురోగతినీ సమీక్షిస్తున్నాం. ప్రమాదాలను నియంత్రించేందుకు షార్ట్టర్మ్, లాంగ్టర్మ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం. స్వల్ప మార్పు చేర్పులను ట్రాఫిక్ అధికారులే చేపడతారు. పెద్ద మొత్తంతో ముడిపడిన వాటి విషయంలో స్వచ్ఛంద సంస్థల సహాయం కోరుతున్నాం. ఇప్పటికే ఈ కోణంలో సర్వేజనా ఫౌండేషన్ సహాయం అందిస్తూ కొన్ని చర్యలు తీసుకుంటోంది. బ్లాక్స్పాట్స్ను నిర్మూలించడంతో పాటు నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల్ని సూచించాల్సిందిగా ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాను కోరాం. ప్రస్తుతం వాళ్లు నగరవ్యాప్తంగా అధ్యయనం చేస్తున్నారు. నివేదిక అందిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటాం. – జోయల్ డెవిస్, హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ -
గణేష్ నిమజ్జనం.. హైదరాబాద్లో మద్యం షాపులు బంద్
సాక్షి,హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో పోలీస్శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.రాచకొండ పోలీస్ కమిషనరేట్లో మద్యం దుకాణాలు మూసివేయాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది.హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు..గణేష్ నిమజ్జనం సందర్భంగా 2025 సెప్టెంబర్ 5 ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 6 సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేస్తున్నట్లు తెలిపింది.రెస్టారెంట్లకు అటాచ్ అయిన బార్లు కూడా మూసివేతకు లోబడి ఉంటాయి.అయితే స్టార్ హోటల్స్,రిజిస్టర్డ్ క్లబ్లలోని బార్లకు మినహాయింపు ఇచ్చింది.ఇందుకు ప్రజలు సహకరించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. -
నిందితులు, కన్జ్యూమర్లలో కొందరికి హెచ్ఐవీ: డీసీపీ
హైదరాబాద్: మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయ్యింది. నగరంలో గ్రిండర్ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న ముఠాను పోలీసులు గుర్తించారు. ఇది సాధారణంగా గే డేటింగ్ యాప్గా ఉపయోగించబడుతుంది. కానీ కొందురు దీన్ని డ్రగ్స్ విక్రయానికి వేదికగా మార్చారు. ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ వ్యవహారాన్ని రట్టుచేసి 10 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లు ఉండగా, మరో 8 మంది డ్రగ్స్ వినియోగదారులున్నారు. డ్రగ్స్ వినియోగిస్తున్న వారంతా స్వలింగ సంపర్కులుగా తేలింది. దీనికి సంబంధించి 100 గ్రాముల ఎమ్డీఏ(ఎక్స్టసీ) స్వాధీనం చేసుకున్నారు. ఆ యాప్లో రహస్య కోడ్లు ఉపయోగిస్తూ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ ముఠాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో డ్రగ్స్ సప్లై చేస్తున్న నైజరీయన్ నుంచి ఇద్దరు పెడ్లర్లు కొనుగోలు చేస్తూ అవసరమైన వారికి అందిస్తున్నారు. దీనికి గ్రైండర్ అనే యాప్ను వినియోగిస్తూ సింబల్స్ సాయంతో డోర్ డెలివరీ చేస్తున్నారు. దీనిపై డీసీపీ బాలాస్వామి మాట్లాడుతూ.. నిందితులు, కన్జ్యూమర్లలో కొందరికి హెచ్ఐవీ ఉన్నట్లు డీసీపీ బాలాస్వామి తెలిపారు. -
హైదరాబాద్కు మరో వందేభారత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు మరో వందేభారత్ రైలు రాబోతోంది. సికింద్రాబాద్–పుణే మధ్య ఇది నడవనుంది. ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణికుల సంఖ్య భారీగా ఉన్నందున వందేభారత్ రైలు నడపాలని గతంలోనే నిర్ణయించారు. కానీ, రేక్ అందుబాటులో లేక జాప్యం జరిగింది. తాజాగా హైదరాబాద్ నుంచి పుణేకు నడిపేందుకు రేక్ కేటాయించినట్టు తెలిసింది. నెల రోజుల్లో దాన్ని పట్టాలెక్కించేందుకు రైల్వే బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్–పుణే మధ్య ప్రయాణికుల సంఖ్య భారీగా ఉంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య 17 రైళ్లు నడుస్తుండటం విశేషం.8 గంటల్లోనే..రెండు నగరాల మధ్య 592 కి.మీ. దూరం ఉంది. సాధారణ రైళ్లు గమ్యం చేరేందుకు 11 గంటల నుంచి 13 గంటల సమయం పడుతోంది. శతాబ్ది రైలు 8.30 గంటలు, దురంతో 8.45 గంటల సమయం తీసుకుంటున్నాయి. ఈ నిడివిని వందేభారత్ ఎక్స్ప్రెస్ 8 గంటల్లో చేరుకోనుంది. దీంతో అత్యంత వేగంగా వెళ్లే రైలుగా వందేభారత్ (Vande Bharat) నిలవనుంది. వందేభారత్ రైలు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మధ్యాహ్నం పుణేకు చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్నం బయలుదేరి తిరిగి రాత్రి 11 వరకు సికింద్రాబాద్ (Secunderabad) చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసు ప్రారంభమయ్యాక డిమాండ్ను బట్టి దురంతోను కొనసాగించాలా వద్దా నిర్ణయించనున్నారు. హైదరాబాద్ నుంచి ఆమ్స్టర్డ్యామ్కు నేరుగా విమాన సర్వీసులు శంషాబాద్: నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డ్యామ్ నగరానికి హైదరాబాద్ (Hyderabad) నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్కు చెందిన కేఎల్ 874 విమానం బుధవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన తొలి సర్వీసును టేకాఫ్ తీసుకుని అమ్స్టర్డ్యామ్ నగరంలోని షిపోల్ విమానాశ్రయానికి బయలుదేరింది. హైదరాబాద్ నుంచి సోమ, బుధ, శనివారాల్లో ఈ సర్వీసులు ఉంటాయి. ఆమ్స్టర్డ్యామ్ షిపోల్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు ఆది, మంగళ, శుక్రవారాలు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.చదవండి: మొత్తానికి దొరికారు.. 54 దాడులు, 33 మంది అరెస్ట్ఢిల్లీ, ముంబై, బెంగళూరు (Bengaluru) తర్వాత భారత్లోకి నాలుగో గేట్గా ఆమ్స్టర్డ్యామ్ నుంచి నేరుగా హైదరాబాద్కు తమ సర్వీసులు ప్రారంభించినట్లు ఈ సందర్భంగా కేఎల్ఎం సీవోవో స్టీవెన్ మార్టెన్ తెలిపారు. దీనిద్వారా ఫార్మా, ఐటీ, పర్యాటక రంగాల్లో పురోగాభివృద్ధికి బాటలు పడతాయని నెదర్లాండ్స్ రాయబారి మారిసా గెరార్డ్స్ అన్నారు. కొత్త కనెక్టివిటీ యూరప్, ఉత్తర అమెరికా బంధాలను మెరుగుపరుస్తుందని ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ పేర్కొన్నారు. -
18న బాచుపల్లి ప్లాట్ల ఈ–వేలం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) బాచుపల్లి లే అవుట్లోని 70 ఖాళీ ప్లాట్లకు ఈ నెల 18న ఈ–వేలం వేయనుంది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం లే అవుట్లో ప్రీబిడ్ మీటింగ్ నిర్వహించింది. ఎస్టేట్ మేనేజ్మెంట్ యూనిట్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్రెడ్డి వేలంపాట ప్రక్రియ గురించి వివరించారు.ఎంఎస్టీఎస్ ప్రతినిధులు ఈ–వేలం పాట విధానం గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. కేపీఎంజీ ప్రతినిధులు ఈ ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రాధాన్యతలు, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్నవారి నుంచి వచ్చిన సందేహాలకు ఆయా విభాగాల అధికారులు నివృతి చేశారు.సమావేశంలో హెచ్ఎండీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సత్యప్రసాద్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కె.శ్రీకాంత్రెడ్డి, ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఈ వేలంలో పాల్గొనాలనుకుంటే, హెచ్ఎండీఏ అధికారిక వెబ్సైట్లో ఆక్షన్ గైడ్, ప్లాట్ వివరాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూడవచ్చు. -
నిమజ్జన ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం
-
Hyderabad: ఖైరతాబాద్ గణేశుడి రూట్ మ్యాప్
సాక్షి, హైదరాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 6న హైదరాబాద్లో నిర్వహించే నిమజ్జనం ఏర్పాట్లలో నగర అధికార యంత్రాంగం నిమగ్నమైంది. శోభాయాత్ర రూట్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, అదనపు సీపీ విక్రమ్సింగ్ మాన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరిలతో కలిసి బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర రూట్ మ్యాప్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ట్యాంక్బండ్ వరకు జరిగే శోభాయాత్ర మార్గంలో కీలకమైన బాలాపూర్, చార్మినార్ సర్కిల్, మొజం జాహి మార్కెట్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ రూట్పై అధికారులకు పలు సూచనలు చేశారు. విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు, వాటి ఎత్తు, ఊరేగింపులు, పోలీసు బందోబస్తు, వ్యర్థాల తొలగింపు, నిరంతర విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ మళ్లింపు, అత్యవసర వైద్యసేవలు వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. బందోబస్తులో 30 వేలమంది పోలీసులు నగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా 30 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని సీవీ ఆనంద్ చెప్పారు. 303.3 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపు మార్గంలో విగ్రహాల ఊరేగింపు సజావుగా జరిగేందుకు 160 గణేశ్ యాక్షన్ టీంలను సిద్ధం చేశామన్నారు. ఖైరతాబాద్, బాలాపూర్ విఘ్నేశ్వరుల శోభాయాత్ర సకాలంలో పూర్తి అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టామని పేర్కొన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అనంతరం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ ఈ నెల 2 వ తేదీ వరకూ నగరవ్యాప్తంగా 1,21,905 గణేశ్ ప్రతిమల నిమజ్జనం జరిగిందన్నారు. ఈ నెల 6వ తేదీన సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. బాలాపూర్ గణేశ్ రూట్ మ్యాప్ కట్ట మైసమ్మ దేవాలయం– కేశవగిరి– చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్– మహబూబ్నగర్ ఎక్స్ రోడ్– ఇంజన్ బౌలి– అలియాబాద్– నాగుల్ చింత జంక్షన్ – హిమ్మత్పురా– చార్మినార్– మదీనా క్రాస్రోడ్– అఫ్జల్ గంజ్– ఎంజే మార్కెట్– అబిడ్స్ జీపీఓ– బీజేఆర్ విగ్రహం– బషీర్బాగ్ క్రాస్రోడ్– లిబర్టీ– అంబేడ్కర్ విగ్రహం– ట్యాంక్ బండ్ ఖైరతాబాద్ గణేశుడి రూట్ మ్యాప్ బడా గణేశ్– పాత సైఫాబాద్ పీఎస్– ఇక్బాల్ మినార్– తెలుగుతల్లి విగ్రహం– అంబేద్కర్ విగ్రహం– ట్యాంక్ బండ్ -
గృహోపకరణ ఉత్పత్తుల గోదాంపై బీఐఎస్ దాడులు
హైదరాబాద్: బీఐఎస్ ధ్రువీకరించిన ఐఎస్ఐ మార్కు లేని ఉత్పత్తులను నిల్వ చేశారన్న సమాచారంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు సికింద్రాబాద్ సీటీసీ కాంప్లెక్స్లోని గోదాంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బీఐఎస్ ధ్రువీకరణ పొందని గృహోపకరణాలు గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ ఆదేశాలతో బీఐఎస్ హైదరాబాద్ శాఖ డైరెక్టర్ రాకేశ్ తన్నీరు, డిప్యూటీ డైరెక్టర్ కెవిన్, ఎస్పీవో అభిసాయి ఇట్ట, ఎస్ఎస్ఏ శివాజీ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.సికింద్రాబాద్ సీటీసీ కాంప్లెక్స్లో ఉన్న ఓ గోదాంలో మంగళవారం బీఐఎస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా దాదాపు రూ.8 లక్షల పైగా విలువైన 225 ఉత్పత్తులకు బీఐఎస్ ధ్రువీకరణ లేదని గుర్తించినట్లు తెలిపారు. ఐఎస్ఐ మార్క్ లేని, నకిలీ ఐఎస్ఐ ముద్ర ఉన్న ఉత్పత్తులను జప్తు చేసినట్లు వెల్లడించారు. వీటిలో మిక్సర్లు, ప్రెజర్ కుక్కర్లు, సీలింగ్ ఫ్యాన్లు, హీట్ ప్లేట్లు, ఇస్త్రీ పెట్టెలు తదితర వస్తువులను జప్తు చేసి కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.బీఐఎస్ చట్టం 2016లోని పలు సెక్షన్ 17 ప్రకారం భారత ప్రభుత్వం బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి చేసిన ఉత్పత్తులేవీ ఐఎస్ఐ మార్కు, ఎలక్ట్రానిక్ వస్తువులకు రిజిస్ట్రేషన్ మార్కు లేకుండా, బీఐఎస్ అనుమతి పొందకుండా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కల్వకుంట్ల కవిత మరో సంచలన ట్వీట్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్, ఆపై పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, భవిష్యత్ కార్యచరణపై పరోక్షంగా ఎక్స్లో పోస్టు పెట్టారు. అందులో .. ‘నిజం మాట్లాడటానికి చెల్లించాల్సిన మూల్యం ఇది అయితే.. తెలంగాణ ప్రజలకోసం వందరెట్లు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధం’ అని పేర్కొన్నారు. అయితే ఈ హరీష్ రావు, సంతోష్రావు గురించి సంచలన ఆరోపణలు చేసిన తర్వాత పార్టీలోని పరిణామాల్ని ప్రస్తావిస్తూ ఈ ట్వీట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై బీఆర్ఎస్ హరీష్ రావుకు మద్దతుగా నిలిచింది. హరీష్ రావు ఆరడగుల బుల్లెట్టు అంటూ వెనకేసుకొచ్చింది.అదే సమయంలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో పార్టీ ఎమ్మెల్సీ కే.కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు,కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటూ’బీఆర్ఎస్ అధికారిక ప్రకటన చేసింది.ఈ క్రమంలో పార్టీ నుంచి సస్పెండ్ తర్వాత కవిత మొదటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ తనని సస్పెండ్ చేయడంతో..కవిత కొత్త పార్టీని పెట్టనున్నారని,బీఆర్ఎస్యేతర పార్టీలో చేరబోతున్నారనే ప్రచారానికి పులిస్టాప్ పెట్టారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయోద్దని సూచించారు. ఇలా వరుస పరిణాలతో కవిత బుధవారం ఎక్స్లో తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం చర్చాంశనీయంగా మారింది. If this is the cost of speaking up the truth then I am ready to pay the cost hundred times again for the people of Telangana. Satyameva Jayathe Jai Telangana✊— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 3, 2025 -
హైదరాబాద్లో యాపిల్ విస్తరణ... మరింత స్థలం లీజు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ గ్లోబల్ సంస్థ యాపిల్ హైదరాబాద్ నగరంలో తన ఉనికిని, సేవలను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా నగరంలోని ఐటీ పార్క్ వేవ్రాక్లో నూతనంగా 64,125 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ విస్తరణతో సంస్థ మొత్తంగా 5 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.అయితే వేవ్రాక్ టవర్లో యాపిల్ 64,125 చదరపు అడుగుల అదనపు కార్యాలయ స్థలానికి రూ.80.15 లక్షల నెలవారీ అద్దె చెల్లించేలా ఐదేళ్లకు లీజ్కు తీసుకున్నట్లు సమాచారం. ఇందుకుగాను చదరపు అడుగుకు రూ.125 చొప్పున చెల్లించనుంది. హైదరాబాద్లోని టీఎస్ఐ బిజినెస్ పార్క్స్ లిమిటెడ్ ద్వారా ప్రాజెక్ట్లో ఉన్న యాపిల్ ప్రస్తుత కార్యాలయాలను విస్తరించింది. ప్రాప్స్టాక్ ప్రకారం., యాపిల్ కంపెనీ ఈ ప్రాజెక్ట్లో అనేక కార్యాలయ స్థలాలను మల్టీ లీజ్లో భాగంగా మొత్తం 5 లక్షల చదరపు అడుగుల తీసుకుంది.అద్దె ప్రారంభ తేదీ నుండి లీజుకు మూడు సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది . ఈ సమయంలో, ఒప్పందంలో పేర్కొన్న నిర్దిష్ట షరతుల కింద తప్ప, ఏ పక్షమూ లీజును రద్దు చేయలేరు. 2016 మేలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ అధికారికంగా హైదరాబాద్ కార్యాలయాన్ని ప్రారంభించారు. జియోస్పేషియల్ టెక్నాలజీ, డేటా మోడలింగ్లో ప్రత్యేకత కలిగిన యాపిల్ మ్యాప్స్కు ఇది కీలకమైన అభివృద్ధి కేంద్రంగా పనిచేస్తుంది.ఇదీ చదవండి: ఒక్కో కంపెనీ నెలకు ఎన్ని కోట్లు కడుతున్నాయో తెలుసా? -
ఒక్కో కంపెనీ నెలకు ఎన్ని కోట్లు కడుతున్నాయో తెలుసా?
హైదరాబాద్..! ప్రపంచ దేశాల్లో కేవలం ఒక ప్రముఖ నగరం మాత్రమే కాదు.. కాలాతీతంగా మారుతున్న జీవనశైలి, అంతర్జాతీయ ఆర్థిక, ఆధునిక, విజ్ఞాన, వ్యాపార అంశాల్లో ఎప్పటికప్పుడు తన ప్రశస్తిని చాటుతున్న గ్లోబల్ సిటీ. నగరంలోని పలు అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలు, ఆయా సంస్థలు చెల్లిస్తున్న అద్దెలే ఇందుకు తార్కాణం.. పలు గ్లోబల్ సంస్థలు నగర కేంద్రంగా లక్షల చదరపు అడుగుల వీస్తీర్ణంలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తుండటమే కాదు.. ఆ స్థలాలకు ప్రతి నెలా కోట్ల రూపాయల్లో అద్దె చెల్లిస్తున్నాయి. ఆయా గ్లోబల్ సంస్థల వింతలు, విశేషాలు.. – సాక్షి, సిటీబ్యూరోమైక్రోసాఫ్ట్ (ఆర్ అండ్ డీ): ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఫీనిక్స్ సెంచురస్ భవనంలో 2.64 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జూలై 2025 నుంచి కార్యాలయాన్ని లీజుకు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి నెల రూ. 5.4 కోట్ల అద్దె చెల్లిస్తోంది. ఐదేళ్ల లీజ్ ఒప్పందంలో భాగంగా ఈ ఆఫీస్ స్పేస్ కోసం నగరంలో అత్యధిక అద్దె చెల్లిస్తున్న సంస్థ మైక్రోసాఫ్ట్ మాత్రమే.క్వాల్కమ్: ఈ సంస్థ కార్యాలయం హై‑టెక్ సిటీలోని ది స్కై వ్యూ భవనంలో 4.14 లక్షల చదరపు అడుగులకు దాదాపు 3.15 కోట్ల భారీ అద్దెను చెల్లిస్తుంది. ఇది అత్యంత అధిక అద్దె తీసుకునే లీజుల్లో ఒకటి. ఈ సంస్థ కుదుర్చుకున్న ఐదేళ్ల లీజ్లో మొదటి ఏడాది తరువాత ఈ అద్దె 7 శాతం పెరుగనుంది. అంతేకాకుండా మూడేళ్ల తరువాత మరో 15 శాతం పెరిగేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.టీసీఎస్: శేరిలింగంపల్లి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రాజ్పుష్ప భవనంలో అంతర్జాతీయ సేవలందిస్తున్న టీసీఎస్.. సుమారు 10.18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి రూ.4.3 కోట్ల నెలవారి అద్దె కడుతోంది. 15 ఏళ్లకుగాను కుదుర్చుకున్న ఈ లీజ్ నగరంలో అత్యధిక అద్దె కడుతున్న సంస్థల్లో మరొక ప్రధాన సంస్థగా నిలిచింది.ఫేస్బుక్ (మెటా): ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫేస్బుక్ (మెటా) హైదరాబాద్ నగరంలో 3.7 లక్షల చదరపు అడుగుల స్థలం కోసం దాదాపు 2.8 కోట్ల నెలవారీ అద్దెతో లీజును నవీకరించింది. రానున్న ఏడాది 2026 జనవరిలో ఈ అద్దె 15 శాతం పెరగనుంది.ఎస్ అండ్ పీ క్యాపిటల్ ఐక్యూ ఇండియా: ఈ సంస్థ నగరంలో 2.41 లక్షల చదరపు అడుగులకు ప్రతి నెలా రూ.1.77 కోట్లు చెల్లిస్తోంది. 2024 నుంచి ఐదేళ్లకు కుదుర్చుకున్న ఈ లీజ్ రెండేళ్ల తరువాత 15 శాతం పెరుగనుంది.ఎల్టీఐ మైండ్ ట్రీ: హైటెక్ సిటీలోని స్కై వ్యూ 10లో ఎల్టీఐ మైండ్ ట్రీ సంస్థ సుమారు 1.09 లక్షల చదరపు అడుగులకు 89.18 లక్షలు అద్దెగా చెల్లిస్తూ.. ఐటీ దిగ్గజాల సరసన నిలిచింది.ఐబీఎం ఇండియా: గచ్చిబౌలిలోని దివ్య శ్రీ ఓరియన్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐబీఎం ఇండియా తమ లీజులో భాగంగా 1.06 లక్షల చదరపు అడుగుల స్థలానికి ప్రతి నెలా రూ.70.23 లక్షలు చెల్లిస్తోంది. 2024లో మొదలైన ఈ లీజ్ ప్రతి ఐదేళ్లకు 4 శాతం పెరగనుంది.50 శాతం టెక్ లీజింగ్..సిటీలో 2025లో నూతనంగా గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ సరఫరా గణనీయంగా తగ్గడంతో వేకెన్సీ ధర విపరీతంగా పెరిగింది. దీనివల్ల అద్దె చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయని ఓ గ్లోబల్ సంస్థ ప్రతినిధి తెలిపారు. దీనికి తోడు ఇక్కడ లభించే సేవల సమగ్రత, దీనికి స్థానిక ప్రభుత్వ మద్దతు.. అంతకు మించి తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు అందిస్తున్న ప్రోత్సాహం.. అత్యాధునిక ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్.. ఇవన్నీ కలిపి హైదరాబాద్ను యూనివర్సల్ హబ్గా మార్చేసింది.మోడ్రన్ లైఫ్స్టైల్..ఈ అంశాలే కాకుండా విలాసవంతమైన అధునాతన జీవనవిధానం, ఈ గ్లోబల్ కంపెనీలకు అనువైన డిజైన్తో కూడిన భవనాలు, సురక్షిత పార్కింగ్, ఆధునిక భవన లీఫ్ట్ సౌకర్యాలు, రెగ్యులర్ పవర్ బ్యాకప్ వంటివి తోడ్పాటును అందిస్తున్నాయి. కేవలం ఆఫీసు అధికారిక కార్యకలాపాల్లో భాగంగా పనిచేయడమే కాకుండా సమీపంలోని మోడ్రన్ లైఫ్స్టైల్ అలవాట్లు, కాంటినెంటల్ ఫుడ్, ఫిట్నెస్ సేవలు ఆ కంపెనీల ఉద్యోగులకు గ్లోబల్ లెవెల్ లైఫ్స్టైల్ అందిస్తున్నాయి. ఫ్యామిలీ–ఫ్రెండ్లీ వాతావరణం, ఉద్యోగులకు కుటుంబంతో ఉండేందుకు సరైన నివాస, విద్య, వినోదం వంటివి స్థానికంగానే అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం.ఇన్నోవేటివ్ సెంటర్..నగరంలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థలు ఇంత భారీ స్థాయిలో అద్దెలు చెల్లించడానికి ప్రధాన కారణం.. భాగ్యనగరం భారతీయ ఐటీ, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ (జీసీసీ) హబ్గా, ప్రతిష్టాత్మక ఇన్నోవేటివ్ కేంద్రంగా ఎదగడమేనని నిపుణులు చెబుతున్న మాట. అంతేకాకుండా హైదరాబాద్ సిటీ అధునాతన జీవన శైలికి అనుగుణమైన లైఫ్స్టైల్ పర్యావరణాన్ని రోజు రోజుకు అభివృద్ధి చేసుకుంటుంది. ముఖ్యంగా హైటెక్సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు సమృద్ధిగా కెఫేలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఇంటర్నెట్, క్యాంపస్ మోడ్రన్ వాతావరణంతో అద్భుత జీవన విధానాన్ని అందజేస్తున్నాయి. -
నిమజ్జనాల ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం
సాక్షి, హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం వ్యక్తం చేసింది. గణేష్ నిమజ్జనాలకు ఇంతవరకు ట్యాంక్ బండ్పై ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని.. భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని గణేష్ ఉత్సవ సమితి ఆవేదన వ్యక్తం చేసింది.45 ఏళ్ల నుండి ట్యాంక్ బండ్పై నిమజ్జనాలు చేస్తున్నామని.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఉత్సవ సమితి ప్రభుత్వాన్ని కోరింది. వెంటనే ఏర్పాటు చేయకపోతే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరుఫున భక్తులతో కలిసి ఆందోళనకు దిగుతామని సమితి సభ్యులు హెచ్చరించారు.గణేష్ నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. బాలాపూర్ నుంచి మెయిన్ రూట్ని పరిశీలించామని.. అన్ని డిపార్ట్మెంట్ల తరుపున నెల రోజుల నుంచి పని చేస్తున్నామన్నారు. అన్ని శాఖల కో-ఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నామన్నారు. నిమజ్జనం కోసం మెయిన్ ప్రొసెషన్ రూట్ని పరిశీలించి చెట్లు, విద్యుత్ వైర్లు తగలకుండా ఆదేశాలు ఇచ్చామని సీవీ ఆనంద్ చెప్పారు.వర్ష సూచన ఉందని.. మండపం నిర్వాహకులు పోలీసుల నిబంధనలు పాటించాలన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిమజ్జనాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని.. 20 వేల మంది స్థానిక పోలీసులు, 9 వేల మంది ఇతర జిల్లాల నుండి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.‘‘ఇతర కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. అన్ని విగ్రహాలు సమయం ప్రకారం వచ్చి నిమజ్జనం చేస్తే బాగుంటుంది. రోడ్లు గుంతలు లేకుండా చూడాలని ఆర్అండ్బీని అదేశించాం. మిలాద్ ఉన్ నబి పండుగ 6వ తేదీన ఊరేగింపు జరగాల్సి ఉంది. సమన్వయ సమావేశంలో మాత పెద్దలు ఒప్పుకున్నారు. 14వ తేదీన మిలాద్ ఉన్ నబి ర్యాలీ ఉండనుంది. హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారు. అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు చేసాం. క్రైమ్ టీమ్స్ నిరంతర గస్తీ ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాం. భవాని నగర్ ఇలా చాలా ప్రాంతాలు ఉన్నాయి. భక్తులు ప్రశాంతంగా నిమజ్జనాలు చేసుకోవాలి’’ అని సీపీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. -
కవిత కామెంట్స్పై సీఎం రేవంత్ రియాక్షన్
సాక్షి,మహబూబ్నగర్: మాజీ మంత్రి హరీష్రావు,సంతోష్రావు వెనక సీఎం రేవంత్రెడ్డి ఉన్నారంటూ మాజీ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు.మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్జీడీ ఫార్మా రెండో యూనిట్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యలు,బీఆర్ఎస్ గురించి మాట్లాడారు.కాలగర్భంలో బీఆర్ఎస్ కలిసిపోతుంది. జనతా పార్టీకి పట్టిన గతే బీఆర్ఎస్కు పడుతుంది. అవినీతి సొమ్ము పంపకంలో తేడాతోనే కొట్టుకుంటున్నారు. మీ పంచాయితీలోకి నన్నెందుకు లాగుతున్నారని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
ప్రయాణికులు ఒకవైపు.. సిటీ బస్సులు మరోవైపు...
సాక్షి, హైదరాబాద్: నగరశివారులకు ఆర్టీసీ సిటీ బస్సుల కొరత తీవ్రంగా ఉంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య లేదు. సిటీ బస్సుల కొరత ప్రజారవాణాకు సవాల్గా మారింది. సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఔటర్ రింగ్రోడ్డు చుట్టూ ఉన్న వందల కొద్దీ కాలనీలకు ప్రజారవాణా సదుపాయం అరకొరగా ఉంది. మరోవైపు ప్రయాణికుల రద్దీ ఉన్న రూట్లలో డిమాండ్ మేరకు బస్సులు లేవు. బస్టాపుల్లో ప్రయాణికులు చాలాసేపు పడిగాపులు కాయాల్సి వస్తోంది. గంటకు ఒక బస్సు కూడా అందుబాటులో ఉండటం లేదని, ఎప్పుడో ఒకసారి వచ్చే బస్సులో కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోందని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోఠి నుంచి లింగంపల్లి వైపు రాకపోకలు సాగించే రూట్(216)లో ప్రయాణికుల డిమాండ్ భారీగా ఉంటుంది. ఈ బస్సు కోఠి నుంచి టోలిచౌకి, కాజాగూడ, ల్యాంకో హిల్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చి»ౌలి చౌరస్తా నుంచి లింగంపల్లి వరకు రాకపోకలు సాగిస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులతోపాటు పలు ఐటీ సంస్థల ఉద్యోగులు కూడా ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తారు. ట్రిప్పులు తగ్గుముఖం... కాంప్రహెన్సివ్ మొబిలిటీప్లాన్(సీఎంపీ)పై హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన లీ అసోసియేషన్ అధ్య యనం ప్రకారం సుమారు 7,250 చదరపు కిలోమీటర్ల పరిధిలో అనేక కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్థుల భవనాలు విస్తరిస్తున్నా యి. నగర జనాభా సైతం 2 కోట్లకు చేరువవుతోంది. ఈ క్రమంలో ప్రజల అవసరాల మేరకు రవాణా సదుపాయాలు పెరగాల్సి ఉండగా ఈ దిశగా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. దేశంలోని పలు మెట్రోపాలిటన్ నగరాల్లో ఇప్పటికే మెట్రో రైలు రెండు, మూడో దశలను పూర్తి చేసుకుంది. హైదరాబాద్లో మాత్రం రెండోదశకే ఆటంకాలు ఎదురవుతున్నాయి. లీ అధ్యయనం మేరకు 2050 నాటికి 665 కి.మీ.లకు పైగా మెట్రో విస్తరణ చేపట్టాల్సి ఉంది. అదే సమయంలో ఇప్పుడున్న జనాభా మేరకు కనీసం 10 వేల పర్యావరణహిత బస్సులు అవసరం. కానీ, 2,800 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 250 మాత్రమే. ఇప్పటికిప్పుడు ప్రయాణికుల డిమాండ్ మేరకు 6 వేల బస్సులను సమకూర్చాల్సి ఉందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఉన్న బస్సులు, ట్రిప్పులతో 20 లక్షల మందికి కూడా సేవలు లభించడం లేదు. నగరంలో మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఉదయం, సాయంత్రాలు మాత్రమే..ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, కుత్బుల్లాపూర్, చేవెళ్ల, మొయినాబాద్ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు నిరంతరం రాకపోకలు సాగిస్తున్నారు. కానీ, చాలా కాలనీలకు ఉదయం, సాయంత్రం మాత్రమే రెండు, మూడు బస్సులు నడుస్తున్నాయి. మిగతా సమయాల్లో ప్రయాణికులు సెవెన్ సీటర్ ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఐటీ కారిడార్లలోని ఉద్యోగుల కోసం బస్సుల సంఖ్యను పెంచినట్లుగానే నగర శివారు ప్రాంతాల్లో ఉన్న కాలనీలకు కూడా ట్రిప్పులు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
రాణించిన వరుణ్, రోహిత్ రాయుడు
చెన్నై: వరుసగా రెండో ఏడాది ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లేందుకు డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ జట్టు మరో ఎనిమిది వికెట్ల దూరంలో ఉంది. హరియాణాతో జరుగుతున్న నాలుగు రోజుల సెమీఫైనల్ మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్దే పైచేయిగా ఉంది. హైదరాబాద్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరియాణా ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 6 పరుగులు చేసింది. హరియాణా చేజార్చుకున్న రెండు వికెట్లు నితిన్ సాయి యాదవ్కు లభించాయి. చివరిరోజు బుధవారం విజయం అందుకోవాలంటే హరియాణా మరో 266 పరుగులు చేయాలి. హైదరాబాద్ నెగ్గాలంటే ఎనిమిది వికెట్లు తీయాలి. అంతకుముందు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 80 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ గౌడ్ (41; 3 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలువగా... హిమతేజ (31; 2 ఫోర్లు), రాహుల్ రాదేశ్ (31; 1 ఫోర్) కూడా రాణించారు. హరియాణా బౌలర్లలో అమిత్ రాణా మూడు వికెట్లు తీయగా... నిఖిల్ కశ్యప్, పార్థ్ వత్స్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. హరియాణా జట్టు తొలి ఇన్నింగ్స్లో 79.3 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ హిమాన్షు రాణా (75; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లు రోహిత్ రాయుడు 65 పరుగులిచ్చి 5 వికెట్లు... వరుణ్ గౌడ్ 27 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి హరియాణాను కట్టడి చేశారు. 17 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ 99.4 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ గౌడ్ (91; 4 ఫోర్లు) తొమ్మిది పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకోగా... హిమతేజ (41; 3 ఫోర్లు), అమన్ రావు (35; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఆకట్టుకున్నారు. హరియాణా బౌలర్లలో నిఖిల్ కశ్యప్ 80 పరుగులిచ్చి 5 వికెట్లు... పార్థ్ వత్స్ 49 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. -
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే?
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ కోసం ఎన్నికల సంఘం ఎలక్ట్రోరల్ సమ్మరీని విడుదల చేసింది. నియోజకవర్గంలో మూడు లక్షల 92,669 ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. వీరిలో పురుషలు ఓటర్లు రెండు లక్షలు, మహిళ ఓటర్లు లక్షా 88 వేలకు పైచిలుకు ఉన్నారు. నియోజకవర్గంలో 47 పోలింగ్ స్టేషన్లో ఉన్నట్లు తెలిపింది. ఈనెల 17వ తేదీ వరకు ఫిర్యాదులు అభ్యంతరాలను తెలియజేయాలని ఎలక్షన్ కమిషన్ నోట్ విడుదల చేసింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థి ఎంపికపై దృష్టిసారిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అవరోధాలను అధిగమించేందుకు సమాలోచనలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ అంటే రిచ్ ఏరియా అని గుర్తింపు.. అక్కడ పాగా వేయాలని అధికార కాంగ్రెస్తో పాటు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, గ్రేటర్లో తమ బలం నిరూపించుకోవాలని బీజేపీలు ఉప ఎన్నికకు సై అంటున్నాయి. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి. ఇక్కడ ఏ పార్టీ నుంచి ఎవరు సీటు దక్కించుకుంటారా అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇక బై ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం నియోజకవర్గంలో ఓటర్లపై స్పష్టత ఇచ్చింది. ఈమేరకు సమ్మరీని విడుదల చేసింది. -
రేవంత్ కాన్వాయ్కు 18 చలాన్లు!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్ వెహికల్స్ మీద 18 చలాన్లు పడ్డాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా చలాన్లు పడినట్లు తెలుస్తోంది. ఇక చలాన్లు పడిన పలు వాహనాలకు ఒకటే నెంబర్ ప్లేటు ఉంది. కాన్వాయ్ సెక్యూరిటీ లేకుండా రోడ్లపైకి పలు వాహనాలు తిరిగాయి. ఇక TG09RR0009 బీఎండబ్ల్యూ కారు రాత్రిపూట సెక్యూరిటీ లేకుండా ఔటర్ రింగ్ రోడ్ మీద తిరిగినట్లు తెలుస్తోంది. -
హమ్మయ్య.. ఎట్టకేలకు పట్టుబడ్డారు
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వేలోని వివిధ ప్రాంతాల్లో రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడిన 33 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆర్ఫీఎఫ్ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు మొత్తం 54 రాళ్లదాడులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆయా సంఘటనలపై 30 కేసులు నమోదు చేశామన్నారు. రైల్వే ట్రాక్లపై ప్రమాద కారకమైన వస్తువులను ఉంచినందుకు నమోదైన 8 కేసుల్లో ఏడుగురిని అరెస్టు చేశారు.రైళ్లపై రాళ్లు రువ్వడం, ట్రాక్ లపై ప్రమాదకారకమైన వస్తువులను ఉంచడం వంటి నేరాలకు పాల్పడితే రైల్వే చట్టం, ఇతర క్రిమినల్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణకు రైల్వే అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. రైల్వే ఆస్తులపై దాడులకు పాల్పడివారే గురించి 139కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.కారు అద్దాలు పగులగొట్టి రూ. 4.79 లక్షలు చోరీ అత్తాపూర్: కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న రూ. 4.79 లక్షలు చోరీ చేసిన సంఘటన అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవి, ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శివరాంపల్లి ప్రాంతానికి చెందిన రాజు లింగయ్యగౌడ్, మైలార్దేవ్పల్లికి చెందిన దేవదాస్గౌడ్ ఉప్పర్పల్లి చౌరస్తాలో త్రిబుల్ ఆర్వైన్స్ నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి తమ షిఫ్ట్ కారు వెనుక సీట్లో కవర్లో రూ. 4.79 లక్షల నగదు ఉంచారు. గోల్డెన్ ప్యాలెన్ హోటల్ సర్వీస్ రోడ్డులో కారు పార్క్ చేసి హోటల్లో టీ తాగి వచ్చేసరికి కారు అద్దం పగిలి ఉన్నాయి. డబ్బుతో ఉన్న కవర్ కనిపించలేదు. రాజలింగయ్యగౌడ్ ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిపై కేసు నమోదు చందానగర్ సర్కిల్ 21లోని సీఎస్సీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సుభాషిణి 2024–2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్ను వసూళ్ల డబ్బును బల్దియా అకౌంట్లో జమ చేయకుండా సొంతానికి ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడిట్ అధికారులు తనిఖీలు చేపట్టడంతో ఆమె తిరిగి రూ.56 లక్షలు బల్డియా అకౌంట్లో జమ చేసింది. ఈ విషయం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు చందానగర్ సర్కిల్ 21 డిప్యూటీ కమిషనర్ శశిరేఖ సోమవారం చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
కవిత సస్పెన్షన్పై టీపీసీసీ చీఫ్ రియాక్షన్
సాక్షి,హైదరాబాద్:ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నుంచి కవితను స్పస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఈ క్రమంలో కవిత సస్పెన్షన్పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. కవిత సస్పెన్షన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారం.అందులో మేం తలదూర్చం.ఇది అంతా ఆస్తి పంపకాల్లో గొడవలా కనిపిస్తోంది. కాంగ్రెస్కు కవిత అవసరం లేదు. ఎవరినీ మాపార్టీలో చేర్చుకోవాల్సి అవసరం లేదు’అని వ్యాఖ్యానించారు. -
వేటుపై కవిత రియాక్షన్.. సర్వత్రా ఉత్కంఠ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సస్పెన్షన్ విధించడంతో ఎమ్మెల్సీ కవితపై భవిష్యత్ కార్యచరణపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ రేపు (బుధవారం) మధ్యాహ్నం 12గంటలకు కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో కవిత తన రాజకీయ భవిష్యత్ కార్యచరణను ప్రకటించనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నుంచి కవితను స్పస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత పార్టీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని హైలెట్ చేస్తూ బీఆర్ఎస్ నోట్ను విడుదల చేసింది. ఆ నోట్లో కవితపై వేటు గల కారణాల్ని ప్రస్తావించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. తనని సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కవిత ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఇదే అంశంపై కవిత స్వయంగా మీడియా ఎదుట వెల్లడించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు..తల్లితో గొడవ ఆపై విద్యార్ధి ఆత్మహత్య
సాక్షి,జగిత్యాల జిల్లా: ఆన్లైన్గేమ్స్కు అలవాటు పడి తొమ్మిదవ తరగతి విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని లింగంపేటకు చెందిన విష్ణువర్ధన్ (15) ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి తరచూ మొబైల్లో మునిగిపోతున్నాడు. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్స్ను పక్కన పెట్టి చదువుపై దృష్టిసారించాలని విష్ణువర్ధన్ను అతని తల్లి మందలించింది. దీంతో తల్లిపై తిరగబడి,దాడి చేశాడు. అనంతరం ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
హరీష్ రావుపై కేటీఆర్ పొగడ్తల వర్షం
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి హరీష్రావును కొనియాడుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేశారు. డైనమిక్ లీడర్ హరీష్రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అని ప్రశంసలు కురిపించారు. . నీటిపారుదల గురించి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు.. కేసీఆర్ ప్రియశిష్యుడు హరీష్ ఇచ్చిన పాఠం ఇది అంటూ’ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu https://t.co/w5YGJCETtL— KTR (@KTRBRS) September 1, 2025 -
పెళ్లి రోజే... మృత్యు ఒడికి!
శ్రీ సత్యసాయి జిల్లా: మండలంలోని ఎం.చెర్లోపల్లి గ్రామానికి చెందిన కపాడం నాగన్న, కపాడం రామాంజినమ్మ దంపతుల (ఇద్దరూ మాజీ ఎంపీటీసీ సభ్యులు) కుమారుడు రామ్మోహన్ భార్య హరిత (26) గత నెల 29న అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందింది. వీరికి ఏడేళ్ల క్రితం 2018, ఆగస్టు 29న వివాహమైంది. రామ్మోహన్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే భార్యతో కలసి ఉంటున్నాడు. నెల రోజుల క్రితం గొంతు నొప్పితో బాధపడుతున్న హరితను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రామ్మోహన్ పిలుచుకెళ్లి చికిత్స చేయించాడు. ఆ సమయంలో టాన్సిల్స్తో ఆమె బాధపడుతోందని, శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు నిర్దారించారు. తాత్కాలికంగా మందులు ఇవ్వడంతో అప్పట్లో ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో గత నెల 29న పెళ్లి రోజును హైదరాబాద్లో వేడుకగా జరుపుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం గొంతు నొప్పి తీవ్రం కావడంతో హరితను ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పరిశీలించిన వెద్యులు వెంటనే సర్జరీకి ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లిన తర్వాత తీవ్ర ఒత్తిడికి లోనైన హరిత గుండెపోటుకు గురై మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి చేర్చి, బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి... ఎం.చెర్లోపల్లికి చేరుకుని హరిత మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వైస్ ఎంపీపీ బోయ రామాంజినేయులును రాప్తాడులో పరామర్శించారు. ఆయన వెంట మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ సాకే వెంకటేష్, యూత్ మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి, యూత్ మాజీ కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి ఉన్నారు. -
పొన్నం ప్రభాకర్ పుష్కరాల మంత్రి
సాక్షి,హైదరాబాద్: పొన్నం ప్రభాకర్పై మాజీ మంత్రి గంగుల కమలాకర్ సెటైర్లు వేశారు. పొన్నం ప్రభాకర్ పుష్కరాల మంత్రి అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై గంగుల చిట్ చాట్ చేశారు.సభలో ఉత్తం, శ్రీధర్ బాబు, సీతక్క బిల్లులను ప్రవేశపెట్టారు.పొన్నం ప్రభాకర్ సభలో ఉండి బిల్లుల పై మాట్లాడం లేదు. పొన్నంతో సంబంధం ఉన్న బిల్లుల గురించి తప్ప..మిగతా విషయాలు మాట్లాడుతున్నారు. పొన్నం ప్రభాకర్ పుష్కరాల మంత్రి. మళ్ళీ 12ఏండ్ల తర్వాతే పొన్నం గెలిస్తే ..గెలుస్తారు.కరీంనగర్లో నేతలతో పొన్నంకు సఖ్యత ఉండదని ఎద్దేవా చేశారు. -
నాంపల్లి బీజేపీ ఆఫీసు వద్ద హైటెన్షన్..
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. బీజేపీ మహిళా మోర్చా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. మహిళా నేతలు గేట్లు ఎక్కి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. వివరాల ప్రకారం.. బీహార్ ఎన్నికల్లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్రలో కొందరు వ్యక్తులు ప్రధాని మోదీ తల్లిని దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో, పోలీసులు బీజేపీ కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు.మరోవైపు.. కాసేపటి క్రితమే బీజేపీ మహిళా మోర్చా నేతలు బీజేపీ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారంతా నిరసనలకు బయలుదేరుతున్న సమయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో గేటు మీద నుంచి దూకి నిరసన తెలిపేందుకు బీజేపీ మహిళా నేతలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.