Hyderabad
-
పదేళ్లలో గ్లోబల్ సిటీగా హైదరాబాద్
అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా.. పదేళ్లలో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మహా నగరాల అభివృద్ధిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తోందని వివరించారు. గురువారం ముంబైలో నిర్వహించిన ‘నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026’లో ‘బియాండ్ పాలసీ: డిజైన్డ్ టు విన్ ది గ్లోబల్ జీసీసీ రేస్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే సంకల్పంతో ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’కు శ్రీకారం చుట్టామని వివరించారు. ప్రపంచంలోని అనేక నగరాలు అస్తవ్యస్త పట్టణీకరణ వల్ల ‘అర్బన్ కొలాప్స్’ కోరల్లో చిక్కుకున్నాయని, అలాంటి చారిత్రక తప్పిదాన్ని హైదరాబాద్ విషయంలో తాము చేయాలనుకోవడం లేదన్నారు.అందుకే.. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా, దాన్ని నిర్మించే బాధ్యతను తీసుకున్నామన్నారు. ఆ దిశగానే భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మెట్రో విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ఆర్ఆర్ఆర్, మూసీ ప్రక్షాళన, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఐకం ఇన్నోవేషన్ హబ్ తదితర కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. కేవలం టెక్ కంపెనీలే కాకుండా.. బ్యాంకింగ్, లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్లు, రక్షణ రంగం, ఎఫ్ఎంసీజీ, స్పేస్ టెక్, ఆతిథ్యం తదితర బహుళ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ ను తమ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయన్నారు.గతేడాది 70కి పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, దేశంలో ఇదే అత్యధికమని వివరించారు. ఈ ఏడాది కొత్తగా 100 జీసీసీలను ప్రారంభించి... వాటిల్లో కొత్తగా లక్ష మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీసీసీలను కేవలం బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్లకే పరిమితం చేయకుండా.. వాటిని ‘గ్లోబల్ వాల్యూ సెంటర్లు’గా మార్చేలా ప్రత్యేక ‘కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్’ను సిద్ధం చేస్తున్నామన్నారు.పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్లో ఉన్న ‘సిలికాన్ డెన్సిటీ (విభిన్న రంగాల నిపుణుల లభ్యత)’ని అందిపుచ్చుకుని ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో నాస్కాం ఛైర్మన్ శ్రీకాంత్, ప్రెసిడెంట్ రాజేష్ నంబియార్ తదితరులు పాల్గొన్నారు. -
వస్తావా? నీ రేట్ ఎంత? పోకిరీలకు మిడ్ నైట్ సినిమా చూపించిన లేడీ కమిషనర్
-
మైనర్ అమ్మాయిలే టార్గెట్.. వెలుగులోకి ఇన్ స్టాగ్రామ్ చీటర్ అర్జున్ అరాచకాలు
-
తెలంగాణలో ఇలా... ఆంధ్రప్రదేశ్లో అలా!
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్ట తెస్తుందా? లేక ఇందులో ఏమైనా రిస్క్ ను ఫేస్ చేయవలసి ఉంటుందా? రేవంత్ గురువుగా భావించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో గత సీఎం జగన్ ప్రభుత్వ రంగంలో తీసుకువచ్చిన కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ప్రైవేటు పరం చేయడానికి యత్నిస్తున్నారు. రేవంత్ మాత్రం ప్రైవేటు రంగంలో ఉన్న మెట్రో రైల్ను రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రభుత్వ పరిధిలోకి తీసుకు వస్తున్నారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కేవలం రూ.ఐదు వేల కోట్లతో కోట్లాది ప్రజలకు మంచి చేయగల వైద్య కళాశాలల ప్రారంభానికి వెనుకాడుతోంది. ఈ మధ్యకాలంలో ప్రైవేటు సంస్థ నుంచి ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సందర్భం ఇదే కావచ్చు. దీనిని బట్టి ప్రైవేటు సంస్థలు ప్రభుత్వాల కన్నా బాగా పని చేస్తాయన్నది ఒక అపోహ మాత్రమే అన్నది స్పష్టమవుతోంది. రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎల్ అండ్ టీకి మేలు చేస్తోందన్న భావన కలిగినా, మెట్రో రైలు ఆస్తులు అన్ని ప్రభుత్వపరం అవుతాయి కనుక భవిష్యత్తులో వాటికి మంచి విలువ రావచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం అంతగా స్వాగతించడం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. మెట్రో రైలు స్వాధీనం చేసుకోవడం కన్నా, ప్రత్యామ్నాయ మోడల్లో రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ను అమలు చేయవచ్చని కేంద్రం సూచిస్తోందంటూ ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని ఇచ్చింది. బహుశా ఇది భవిష్యత్తులో రాజకీయ వివాదంగా మారొచ్చు. మెట్రో రైల్ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఎల్ అండ్ టీ రెండో దశ విస్తరణకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారు చర్చోపచర్చల తరువాత ప్రాజెక్టును తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. నష్టాల నుంచి గట్టెక్కడానికి ఇది మేలైన మార్గం కావడంతో ఎల్ అండ్ టీ కూడా అంగీకరించింది. ఇందుకోసం సుమారు రూ. 1461 కోట్ల విలువైన షేర్లను రాష్ట్ర ప్రభుత్వం బదలాయించుకుంటుంది. దాంతోపాటు ఈ ప్రాజెక్టుకు ఉన్న సుమారు రూ.13538 కోట్ల మొత్తాన్ని రీఫైనాన్స్ కు అంగీకారం కుదిరింది. అంటే ఈ అప్పు భారం అంతా తెలంగాణ ప్రభుత్వానిదే. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పుకు ఇది అదనమన్నమాట. అయితే ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలేవీ పెద్దగా విమర్శలు చేయకపోవడం గమనార్హం. అయితే... ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందూకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు చూస్తే తెలంగాణ నిర్ణయం భవిష్యత్తులో వివాదమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం మెట్రో రైల్ ఫేజ్ 2, ఫేజ్ 2ఎ మ కింద సుమారు 162 కిలో మీటర్ల దూరం వరకు విస్తరించడానికి రాపిడ్ ట్రాన్సిట్ మోడల్ మంచిదని రాష్ట్రానికి సూచించిందట. దీనికి మెట్రో మోడల్ కన్నా తక్కువ వ్యయం అవుతుందని చెబతున్నారు. పటాన్ చెరు,ఆరామ్ఘఘర్, కోకాపేట, హయత్ నగర్, చాంద్రాయణగుట్ట, ఫ్యూచర్ సిటీ, రాజివ్ గాంధీ విమానాశ్రయం, మేడ్చల్, షామీర్ పేట ప్రాంతాలకు మెట్రో విస్తరించాలని తలపెట్టారు. ప్రస్తుతం భరిస్తున్న రుణంతో కలిపి ఈ రెండో దశకు 58 వేల కోట్ల రూపాయలు వ్యయం అవతుందని అంచనా వేస్తున్నారు.అదే కేంద్రం ప్రతిపాదిస్తున్న రాపిడ్ ట్రాన్సిట్ రైల్ వల్ల రూ.48 వేల కోట్లే ఖర్చు అవుతుందట.ఢిల్లీ-మీరట్ రూట్ లో ఈ తరహా విధానం అమలులో ఉందని చెబుతున్నారు.ఆరున్నర కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ రైల్ వస్తుందని అధికారులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తన ఒరిజినల్ స్కీమ్ కే కట్టుబడి ఉంటే బీజేపీ, బీఆర్ఎస్లు అదనపు భారంపై విమర్శలు చేయవచ్చు. కొత్త ప్రాజెక్టుపై అధిక వ్యయం చేయబోతున్నారని ఆరోపణలు గుప్పించవచ్చు. అలాగని ఇంత జరిగాక మెట్రో రైల్ మోడల్ కాకుండా రాపిడ్ రైల్ కు వెళ్లడం కూడా కష్టం కావచ్చు. ఏపీలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను సొంతంగా నడపలేదని, అవసరమైన పెట్టుబడులు పెట్టలేదని చంద్రబాబు సర్కార్ చెబుతోంది.ఒక పక్క అమరావతి పేరుతో వేల కోట్ల అప్పులు చేసి భారీ వ్యయం చేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికి ఉపయోగపడే మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.చంద్రబాబు ఎంతసేపు ప్రైవేటువారికి సంపద కట్టబెట్టాలని చూస్తారన్న విమర్శలను విపక్షం చేస్తోంది.అయినా ఆ ప్రైవేటు సంస్థలు ఎంతవరకు బాధ్యత తీసుకుని ఆ మెడికల్ కాలేజీలను సమర్ధంగా నిర్వహిస్తాయో చెప్పలేం.దానివల్ల ప్రజలపై అదనపు భారం పడదన్న గ్యారంటీ లేదు.తెలంగాణలో మాత్రం ప్రజల ప్రయోజనాల కోసమే ప్రైవేటు కంపెనీని తప్పించి ప్రభుత్వమే మెట్రోని చేపడుతోందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. రేవంత్ సర్కార్ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సంపద సమకూరవచ్చు.ఎందుకంటే ఇప్పటికే నిర్మాణం అయిన మెట్రోలో రియల్ ఎస్టేట్ మోడల్, మాల్స్ వంటివాటికి ఏర్పాట్లు, ప్రచార ప్రకటనల ద్వారా ఆదాయ ఆర్జన వంటివి ఉన్నాయి. ఇప్పటికైతే అవన్ని లాభసాటిగా ఉన్నాయని చెప్పలేం కాని, హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ది చెందినందున ఫ్యూచర్ లో ఇది మెరుగైన ఫలితాలు ఇవ్వవచ్చేమో!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నిలోఫర్లో రోగి సహాయకురాలిపై దాడి!
హైదరాబాద్: నిలోఫర్ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగి సహాయకురాలిపై ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోగి సహాయకురాలిపై ఓ మహిళ సెక్యూరిటీ పిడి గుద్దులు కురిపించింది. అంతటితో ఆగకుండా మరో ముగ్గురు మహిళా సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకొని రోగి సహాయకురాలిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడి సద్దుమణిగాక అధికారులు, వైద్యులు బాధితురాలిపై సానిభూతిని ప్రదర్శించి సర్ది చెప్పి బయటికి పంపింనిట్లు తెలిసింది. ఈ దాడి ఎప్పుడు జరిగింది, ఏ విషయంలో జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయమై సూపరిండెంట్ను వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన స్పందించలేదు. స్థానిక పోలీస్ స్టేషన్లోనూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
వర్షాకాలానికి ముందే నాలా పనులు పూర్తి చేయాలి: ఆరెకపూడి గాంధీ
హైదరాబాద్: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగర్ నాల విస్తరణ పనులలో భాగంగా పరికి చెరువు అలుగు నుండి ప్రేమ్ సరోవహర్ అపార్టుమెంట్స్ వరకు రూ. 8 కోట్ల 76 లక్షల రూపాయల అంచనావ్యయం తో చెవుడుతున్న నాల విస్తరణ పనులను SNDP ఇంజనీరింగ్ విభాగం మరియు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ నాలల విస్తరణ పనులు చేపట్టడం తో ఎన్నో ఏండ్ల వరద ముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని, ధరణి నగర్ కాలనీ లో నాల విస్తరణ పనులలో భాగంగా అసంపూర్తిగా మిగిలిపోయిన నాల విస్తరణ పనులను రూ. 8 కోట్ల 76 లక్షల రూపాయల అంచనావ్యయం తో నిర్మాణము పనులు చేపట్టడం జరుగుతుంది అని, నాల విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని , త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని . ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరనుంది అని, నాలా విస్తరణ పనులకు అందరూ సహకరించాలని , ఒక్కప్పుడు వరదలు వస్తే కంటి మీద కునుకు లేకుండా ప్రజలు తీవ్ర ఆందోళన తో ఇబ్బందులకు గురయ్యేవారు అని, కానీ నేడు సమస్య లేకుండా మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగినది అని,నాలల విస్తరణ పనులతో లోతట్టు, ముంపు ప్రాంతాలకు ఉపశమనం లభించింది అని ప్రజా అవసరాల దృష్ట్యా ప్రథమ ప్రధాన్యత లో విస్తరణ పనులు చేపట్టాలని రాబోయే రాబోయే వర్షాకాలం లోపు పనులు పూర్తి చేయాలని ,నాలల విస్తరణ పనులలో వేగం పెంచాలని ,యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు.ధరణి నగర్ నాల విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నాల విస్తరణ పనులు పై అధికారులకు పలు సూచనలు ,సలహాలు ఇవ్వడం జరిగినది, ఏ చిన్న సమస్య ఎదురైన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని PAC చైర్మన్ గాంధీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగినది. నాలల విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నాలల విస్తరణ పనులు సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని, ప్రధాన రహదారుల పై పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని , నాలల నిర్మాణం సమయంలో నీటి ప్రవాహం సాఫీగా సాగేలా లెవల్స్ ను నిర్దారించుకొని పనులు చేపట్టాలని, వర్షాకాలంలోపు పనులు పూర్తయ్యేలా చూడలని , వరద ముంపు మళ్ళీ పునరావృతం కాకుండా నాలల విస్తరణ నిర్మాణం పనులు చేపట్టాలని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. నాలల విస్తరణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని , పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, నాల విస్తరణ పనులు పై అధికారులకు పలు సలహాలు ,సూచనలు ఇవ్వడం జరిగినది . ప్రతి వర్షానికి వరద నీరు కాలనీలు ముంచెత్తడం జరుగుతుంది అని, సమస్య శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపట్టడం జరుగుతుంది అని, భవిష్యత్తు లో వరద సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకొని నాల విస్తరణ పనులు చేపడుతున్నాం అని, నాల విస్తరణ మరియు ,RCC బాక్స్ డ్రైన్ నిర్మాణము వలన ప్రజలకు ఎంతగానో ఉపశమనం కలుగుతుంది అని, ప్రజలకు సాంత్వన చేకూరుతుంది అని, పనులు పూర్తిచేయాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. పనుల విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడలని, వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాల దృష్ట్యా అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ నిర్మాణ పనులను చేపట్టడం జరిగినది అని, యుద్ధప్రాతిపదికన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని,నాల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుడదని, పనుల లో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని త్వరితగతిన నాల విస్తరణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేసారు. నాలల విస్తరణ పై ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తప్పకుండా పరిష్కరిస్తామని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయి అని ఏ చిన్న సమస్య ఎదురైన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని PAC చైర్మన్ గాంధీ గారు అధికారులకు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో SNDP ఇంజనీరింగ్ విభాగం DE ధీరజ్, AE అరుణ్ నాయకులు దొడ్ల రామ కృష్ణ గౌడ్,జిల్లా గణేష్, కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్,రాజేష్ , సంతోష్, శ్రీధర్ ,ఉమేష్ , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. -
లెక్కల్లోకి పెళ్లికాని కాపురాలు!
పెళ్లికాని కాపురాలు ఇక ‘లెక్కల్లోకి’ ఎక్కనున్నాయి. సహజీవనం చేస్తున్న జంటలు సరికొత్త తరహా కుటుంబాలుగా పరి‘గణన’ పొందనున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన మొదటి దశలో తొలి అడుగు పడనుంది. జన గణనలో భాగంగా ఇళ్ల వివరాలతో పాటు కుటుంబ సభ్యుల సంఖ్యను నమోదు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. సహజీవనం చేస్తున్న జంటలను కూడా కుటుంబంగా గుర్తించాలని అధికారులు నిర్ణయించిన విషయం విదితమే. దీంతో ఈ లెక్కలు తమకు తెచి్చపెట్టే చిక్కులపై లివ్ ఇన్ కపుల్లో కొంత అటెన్షన్, మరికొంత టెన్షన్ మొదలైంది. హైదరాబాద్: నగరంలో దాదాపు 2 దశాబ్దాల క్రితమే ఊపిరి పోసుకున్న సహజీవన సంస్కృతి కార్పొరేట్ కల్చర్తో మమేకమైపోతూ విస్తరించింది. విభిన్న ప్రాంతాల నుంచి వృత్తి ఉద్యోగాలు, వ్యాపకాల రీత్యా తరలి వస్తున్న యువతీ యువకులు రకరకాల కారణాల రీత్యా పెళ్లికి దూరంగా ఉంటూ కలిసి జీవించేందుకు అనుకూలమైనదిగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ మార్గాన్ని ఎంచుకోవడం సర్వసాధారణంగా మారింది. కెరీర్ కోసం పెళ్లిని వాయిదా వేయాలనుకునే యువత లక్ష్యాల వేటకు ఇది బాగా అనుకూలించింది. దాంతో తొలుత ఐటీ అనుబంధ కంపెనీలలోనే బాగా కనిపించిన ఈ సంస్కృతి అలా అలా హాస్పిటాలిటీ, సినిమా, టీవీ, మోడలింగ్ తదితర రంగాలకూ వేగంగా విస్తరించింది. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, పోచారం, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో సహజీవనం చేస్తున్న జంటల సంఖ్య భారీగా ఉండవచ్చని అంచనా. ఈ కల్చ ర్ యువతకు కలిగించే సౌలభ్యాల సంగతి ఎలా ఉన్నా, దీని తాలూకు దుష్ప్రభావాలు పలు నేర ఘటనల రూపంలో తరచుగా వెలుగు చూస్తున్నాయి. లెక్కకు చిక్కుతారా? సాధారణంగా సహజీవనం చేసే జంటల్లో తమ వ్యవహారాన్ని పెద్దలకు తెలియనివ్వని వారే ఎక్కువగా ఉంటారు. జనగణనలో భాగంగా వీరికి సంబంధించిన వివరాలు అధికారికం అవుతాయని, అంటే ఇక తమ సంబంధం బహిరంగ రహస్యమే అవుతుందనే ఆందోళన వీరిలో ఉంది. వీరి వివరాలను తాము రహస్యంగా ఉంచుతామని అధికారులు ఇస్తున్న హామీని ఎంత వరకు విశ్వసిస్తారనేది చూడాలి. మరోవైపు ఇటీవల న్యాయ స్థానాలు వెల్లడించిన పలు తీర్పులు.. సహజీవనం చేస్తున్న జంటలకు కొన్ని రకాల హక్కులను కూడా కల్పిస్తున్నాయి. కాబట్టి అధికారిక నమోదు ప్రయోజనకారి కాగలదని కూడా కొందరు లివ్ ఇన్ కపుల్ భావిస్తున్నారు. కలిసి ఉంటున్నప్పటికీ పెళ్లి విషయంలో భవిష్యత్తులో తమ బంధం విచ్ఛిన్నమైతే ఎలా? అప్పుడు వేరే వ్యక్తులను పెళ్లి చేసుకునేందుకు తమ ప్రస్తుత వివరాల నమోదు ప్రక్రియ అడ్డంకిగా మారవచ్చునేమో కదా? అనే భయమూ కొందరిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీరిలో ఎందరు సహకరిస్తారు? అలా సహకరించేలా అధికారులు వారిలో ఎటువంటి విశ్వాసం కల్పిస్తారు? అనేది చూడాలి. పోచారం ఐటీ కారిడార్కు.. సహజీవనం చేస్తున్న జంటలు విబేధాలు వస్తే ఎవరి దారిన వారు విడిపోతారు. ఇతర దేశా ల నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్లోని పడమర ప్రాంతానికి విస్తరించిన లివింగ్ రిలేషన్షిప్ నెమ్మదిగా పోచారంలోని ఐటీ కారిడార్కు పాకింది. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు రావడంతో ఈ కంపెనీలకు సమీపంలోని పలు భవనాల్లో సహజీవనం చేస్తు న్న జంటలు కనిపిస్తున్నాయి. జనగణనతో వీరిలో ఎలాంటి మార్పు వస్తుందో వేచి చూడాల్సిందే. పాత లెక్కల ప్రకారం పోచారం డివిజన్లో 60 వేల జనాభా ఉండగా, ఇప్పుడు లక్షన్నరకు చేరుకునే అవకాశం ఉంది. వీరిలో ఐటీ ఉద్యోగులే ఎక్కువని అంచనా. -
SRH vs PBKS : ఉప్పల్లో ఫుల్ జోష్.. తారల సందడి (ఫొటోలు)
-
రోగి కోలుకోవడంలో ట్రాన్సిషనల్ కేర్ కీలకం
హైదరాబాద్: శస్త్రచికిత్సలు, తీవ్ర అనారోగ్యం తర్వాత రోగులు పూర్తిస్థాయిలో కోలుకోవడానికి 'ట్రాన్సిషనల్ కేర్' (మధ్యంతర సంరక్షణ) ఎంతో కీలకమని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి పేర్కొన్నారు. ఇవాళ (బుధవారం) హైదరాబాద్లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన 'ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్' సెంటర్ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి జగదీష్ గౌడ్, సిమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ డైరెక్టర్ మౌనికా రెడ్డి అట్ల తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. "సాధారణంగా ఆసుపత్రులు రోగుల ప్రాణాలను కాపాడి నిలకడగా ఉంచుతాయి. కానీ, వారు తిరిగి సాధారణ జీవనశైలికి చేరుకోవడానికి ప్రత్యేక పునరావాస కేంద్రాల అవసరం ఉంది. మన దేశంలో ఇటువంటి ప్రత్యేక కేంద్రాల కొరత ఉంది. అమెరికా ప్రమాణాలతో ఎవరెస్ట్ కేర్ సెంటర్ అందుబాటులోకి రావడం అభినందనీయం" అని అన్నారు.ఎవరెస్ట్ ట్రాన్సిషనల్ కేర్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ కె. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికాలో 20 ఏళ్ల క్లినికల్ అనుభవం తర్వాత, స్వదేశంలో ప్రపంచస్థాయి వైద్య సేవలందించాలనే లక్ష్యంతో దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. పక్షవాతం (స్ట్రోక్), వెన్నెముక గాయాలు, వృద్ధాప్య సమస్యలతో బాధపడే వారికి ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో చికిత్స అందిస్తామని వివరించారు. వైద్యులు, స్థానిక నేతలు ఈ కేంద్రాన్ని సందర్శించి, ఇక్కడి అత్యాధునిక వసతులను పరిశీలించారు. నగరం నడిబొడ్డున ఇలాంటి సమగ్ర పునరావాస కేంద్రం అందుబాటులోకి రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.కేంద్రం ప్రత్యేకతలు:అడ్వాన్స్డ్ రోబోటిక్స్ మరియు స్పెషలైజ్డ్ థెరపీ జోన్లుడిమెన్షియా (మతిమరుపు), పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక విభాగాలుఅమెరికా దేశపు ఎవిడెన్స్ బేస్డ్ రీహాబిలిటేషన్ ప్రోటోకాల్స్. -
హైదరాబాద్లో మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే..
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మే 10వ తేదీన మధ్యాహ్నం 1.10 గంటలకు మోదీ బెంగళూరు విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు బయలుదేరతారు. మధ్యాహ్నం 2.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.30 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీపై నుంచే పలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్లో హైటెక్ సిటీకి వెళ్తారు. 3.45-4.15 గంటల మధ్య అక్కడి సాయి సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు. తిరిగి 4.40 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.40-5.25 గంటల మధ్య రిజర్వ్ సమయం ఉంటుంది. 5.30 గంటలకు మోదీ పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. సాయంత్రం 6.30 వరకు బహిరంగ సభలో ఉంటారు. ఆ తర్వాత 6.45 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి జామ్ నగర్కు తిరిగి వెళ్తారు.ప్రధానమంత్రి మోదీ మే 10న హైదరాబాద్ పర్యటనకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రత, ట్రాఫిక్, బందోబస్తుపై పోలీసులకు సూచనలు చేశారు. కాన్వాయ్ మార్గాలను పరిశీలించి అవసరమైన రోడ్డు మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. -
కిమ్స్లో క్రీడా గాయాలు & ఆర్థ్రోస్కోపీపై ఫెలోషిప్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: కిమ్స్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విద్యారంగం, స్పోర్ట్స్ మెడిసిన్లో కీలక మైలురాయిని సాధించింది. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో క్రీడా గాయాలు ఆర్థ్రోస్కోపీపై అంతర్జాతీయ గుర్తింపు పొందిన తొలి ఫెలోషిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక ఫెలోషిప్ సాధారణ ఆర్థోపెడిక్ శిక్షణ, క్రీడాకారులు, శారీరకంగా చురుకైన వ్యక్తులకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు రూపొందించబడింది. ఆర్థ్రోస్కోపీ అనే ఈ మినిమల్ ఇన్వేసివ్ శస్త్రచికిత్స పద్ధతి చిన్న జాయింట్ స్థలాల్లో అధునాతన పరికరాలు మరియు ఫైబర్ ఆప్టిక్ కెమెరా సహాయంతో పని చేసే నైపుణ్యాన్ని కోరుతుంది. ఏసీఎల్ (ACL) పునర్నిర్మాణం, లాబ్రల్ రిపేర్, కార్టిలేజ్ రీస్టోరేషన్ వంటి శస్త్రచికిత్సలు అత్యంత ఖచ్చితత్వంతో చేయాల్సి ఉంటుంది. ఈ ఫెలోషిప్ ద్వారా వైద్యులకు ఈ నైపుణ్యాలపై సమగ్ర శిక్షణ అందుతుంది.ఈ కార్యక్రమంలో మోకాలి, భుజం, నడుము జాయింట్ల రీకన్స్ట్రక్టివ్ ఆర్థ్రోస్కోపీతో పాటు స్పోర్ట్స్ మెడిసిన్, జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీలో ప్రత్యేక శిక్షణ అందింస్తారు. ప్రాక్టికల్ శస్త్రచికిత్స అనుభవంతో పాటు సైద్ధాంతిక బోధనను కలిపి, ఖచ్చితమైన శస్త్రచికిత్స, క్రీడలకు సంబంధించిన గాయాల అంచనా, పునరావాస విధానాలు మరియు ఆధారిత వైద్య విధానాలపై ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. కిమ్స్ హాస్పిటల్స్ మెుదటి నుంచే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, మెరుగైన చికిత్స ఫలితాలతో పాటు నిపుణుల తయారీకి కట్టుబడి ఉంది. ఈ ఫెలోషిప్కు లభించిన అంతర్జాతీయ గుర్తింపు, సంస్థ యొక్క వైద్య నైపుణ్యం మరియు గ్లోబల్ ప్రమాణాలపై ఉన్న నిబద్ధతకు నిదర్శనం. ఈ ఫెలోషిప్ కార్యక్రమానికి డైరెక్టర్ ఆర్థ్రోస్కోపీ, స్పోర్ట్స్ మెడిసిన్ హెచ్ఓడి డా. ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం దేశంలో ఆధునిక ఆర్థోపెడిక్ శిక్షణకు మార్గదర్శిగా నిలవనుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ మరియు ఆర్థ్రోస్కోపీ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ హెచ్ఓడి డా. ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి మాట్లాడుతూ, ఈ ఫెలోషిప్ ద్వారా అత్యాధునిక ఆర్థ్రోస్కోపీ పద్ధతుల్లో వైద్యులను శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రాంతంలో క్రీడా గాయాల చికిత్స నాణ్యతను మరింత మెరుగుపరచగలమని తెలిపారు. ఈ కార్యక్రమంతో కిమ్స్ హాస్పిటల్స్ ఆధునిక వైద్య విద్య మరియు ప్రత్యేక శస్త్రచికిత్స సేవలలో తన నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, దేశవ్యాప్తంగా కొత్త ప్రమాణాలను స్థాపిస్తోంది. -
ఐపీఎస్ సుమతికి వేధింపులు.. పోకిరీలకు దిమ్మతిరిగే షాక్
సాక్షి, హైదరాబాద్: నగరంలో పోకిరీల ఆట కట్టించేందుకు మల్కాజ్గిరి సీపీ సుమతి సరికొత్త ప్రయోగం చేశారు. కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్నారు. దీంతో, సుమతిని చుట్టుముట్టిన పోకిరీలు.. వేధింపులకు గురి చేశారు. వస్తావా? రేటెంత? అంటూ ఐపీఎస్నే వేధింపులకు గురిచేశారు. అనంతరం, దాదాపు 40 మంది పొకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఐపీఎస్ అధికారిణినే ఇంత వేధించారు అంటే అత్యవరస పరిస్థితుల్లో అర్ధరాత్రి బయటకు వెళ్ళే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.మల్కాజ్గిరి సీపీ సుమతి తన మార్క్ చూపించారు. దిల్సుఖ్నగర్లో పోకిరీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. సీపీ సుమతి మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 వరకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్నారు. ఈ సందర్భంగా అధికారి సుమతిని పోకిరీలు చుట్టుముట్టారు. ‘వస్తావా? రేటెంత?’ అంటూ అసభ్య పదజాలంతో వేధించారు. దీంతో, దాదాపు 40 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, స్పెషల్ ఆపరేషన్లో పట్టుబడ్డ వారంతా విద్యార్థులు, ఉద్యోగార్థులు కావడం గమనార్హం. వీరిలో పలువురు గంజాయి మత్తులో ఉన్నట్లు సమాచారం. 40 మంది పోకిరీలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.వస్తావా? రేటెంత? అంటూ ఐపీఎస్ అధికారిణి సుమతికి వేధింపులుదిల్సుఖ్నగర్లో మంగళవారం అర్ధరాత్రి మల్కాజ్గిరి సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్కామన్ లేడీలా అర్ధరాత్రి రోడ్డుపై నిల్చున్న ఐపీఎస్ అధికారి సుమతిని చుట్టుముట్టిన పోకిరీలుఅర్ధరాత్రి 12 గంటల నుంచి 3.30 వరకు సాగిన స్పెషల్… pic.twitter.com/aKJcRbQxRK— Telugu Scribe (@TeluguScribe) May 6, 2026 -
మాములోడు కాదు..! ఈ స్కామ్ లో వాడి తల్లి కూడా ఉంది
-
బిల్లు కట్టమని అడిగినందుకు సిబ్బందిపై దాడి
-
తల్లి సహకారం.. కొడుకుల వలపు వల
హైదరాబాద్: సంపన్న బాలికలకు వలపు వల విసురుతూ అన్నదమ్ములు రూ.లక్షల్లో దండుకున్న కేసులో కొత్త విషయాలు వెలుగు చూశాయి. పోలీసుల విచారణలో వెల్లడైన మేరకు.. కూకట్పల్లికి చెందిన ఈవెంట్ మేనేజర్ కొడూరి చంద్రశేఖర్ ఆజాద్ (22) ఖరీదైన అద్దె కార్లలో తిరుగుతూ ఇన్స్ట్రాగామ్లో ఫొటోలు పెట్టి సంపన్న బాలికలు, యువతులతో పరిచయాలు పెంచుకున్నాడు. వెయ్యిమంది యువతులు ఫాలోవర్స్ ఉన్న అతడికి తల్లి మీనాకుమారి, మేనమామ ప్రశాంత్ ప్రోత్సాహం ఉంది. నిందితుడితో పాటు అతడి సోదరుడు రాజీవ్ను పొక్సో కింద అరెస్టు చేసి, రిమాండ్కు తరలించి 4 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరి స్నేహితుడు కార్తీక్ను అరెస్టు చేశారు. మంగళవారం మీనాకుమారి, ఆమె స్నేహితుడు వినీల్చౌదరి, ప్రశాంత్, చంద్రశేఖర్ స్నేహితులు హేమంత్, జితిన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చంద్రశేఖర్ ముఠా నాయకుడిగా వ్యవహరిస్తూ అమ్మాయిలకు వల వేసేలా స్నేహితులను ప్రోత్సహించినట్లు తేలింది. వారి వీడియోలను అడ్డంపెట్టుకుని రూ.లక్షల్లో వసూలు చేసినట్లు గుర్తించారు. సీపీ రంగంలోకి దిగింది అందుకే.. కొంతమంది కొత్త తరహా వసూళ్లకు తెరలేపారని, నగరంలో ఇది చాపకింద నీరులా విస్తరిస్తోందని చంద్రశేఖర్ అరెస్టుతో పోలీసులు నిర్ధారిస్తున్నారు. అందమైన యువకులను, ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిని గుర్తించి డబ్బు సాయం చేస్తూ ఖరీదైన కార్లు ఇస్తున్నారు. పబ్లు, క్లబ్లలో జల్సాలకూ సాయం చేస్తున్నారు. అమ్మాయిలను ట్రాప్ చేసి సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. తర్వాత వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ రూ.లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీపీ సజ్జనార్ స్వయంగా కేసు విచారించినట్లు తెలుస్తోంది. ఆదిలోనే ఈ సంస్కృతికి చెక్ పెట్టాలని, వీరి వెనుక ఎవరున్నారో చూడాలని మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్యను ఆదేశించినట్లు సమాచారం. -
పత్తి దిగుబడి పెంపుకోసం రూ.5,659 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో పత్తి పంట దిగుబడి పెంపుకోసం ఐదేళ్లపాటు అమలయ్యే మిషన్కు రూ.5,695.22 కోట్లు కేటాయించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధాని మోది సారథ్యంలో భేటీ అయిన కేబినెట్ 2026–27 నుంచి 2030–31 కాలంలో అమలయ్యే ‘మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ’కింద ఈ మొత్తం వెచి్చంచాలని నిర్ణయించింది. దేశంలో పండే పత్తిలో నాణ్యత తగ్గడంతోపాటు దిగబడి క్రమంగా తగ్గిపోతుండటం వంటి సమస్యల పరిష్కారానికి ఈ నిధులను వెచి్చస్తారంది. వ్యాధులు, చీడపీడలను తట్టుకునే, అధిక దిగుబడులనిచ్చే వంగడాలను అభివృద్ధి పర్చడం, ప్రస్తుతమున్న సాంకేతికతను మరింత విస్తృతం చేయడం ఈ మిషన్ లక్ష్యాలని ప్రభుత్వం తెలిపింది. దీనితో దేశంలోని 32 లక్షల మందికి లబ్ధి కలుగనుందని పేర్కొంది.చెరకు కనీస ధర పెంపు అక్టోబర్ నుంచి మొదలయ్యే 2026–27 సీజన్కుగాను చెరకు కనీస ధరను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. న్యాయమైన, లాభదాయక ధర (ఎఫ్ఆర్పీ)ని క్వింటాలుకు రూ.10 చొప్పున రూ.365కి పెంచేందుకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. తాజాగా ఆమోదించిన ఎఫ్ఆర్పీ 2025–26 సీజన్ ధర క్వింటాల్కు రూ.355 కంటే 2.81 శాతం ఎక్కువని ఆయన వివరించారు. మిల్లులకు చెరకు సరఫరా చేసే రైతులకు రక్షణగా 10.25 శాతం రికవరీ రేటు ఆధారంగానే క్వింటాలకు ధర రూ.365 ఉంటుందని తెలిపారు. ఇది ప్రస్తుత 2025–26 సీజన్ ధర రూ.355 కంటే 2.81 శాతం అధికమని చెప్పారు. ఒకవేళ రికవరీ రేటు 10.25 శాతం కంటే ప్రతి 0.1 శాతం పెరిగితే, క్వింటాల్కు అదనంగా రూ.3.56 చెల్లిస్తారన్నారు. 9.5 శాతం కంటే తక్కువ రికవరీ ఉన్న మిల్లులకు చెరకు సరఫరా చేసే రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, వారికి ఎటువంటి కోత విధించకుండా క్వింటాల్కు రూ. 338.30 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. 2026– 27లో చెరకు ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.182 చొప్పున ఉంటుందన్న అంచనా ప్రాతిపదికన ఎఫ్ఆర్పీ100.5 శాతంగా నిర్ణయించామని చెప్పారు. దీనివల్ల రైతులకు అదనంగా రూ.లక్ష కోట్ల మేర లాభం చేకూరనుందని వివరించారు. -
హైదరాబాద్ : నెహ్రూ జూ పార్క్... ‘జూ’లకాలాటలలో పులి (ఫొటోలు)
-
మళ్లీ విజయం వేటలో..ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ (ఫొటోలు)
-
ఐపీఎల్ వీఐపీ టికెట్ల దందాలో టీడీపీ కార్యకర్తలు
కందుకూరు: హైదరాబాద్లో ఐపీఎల్ క్రికెట్ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు పట్టుబడటం స్థానికంగా సంచలనం కలిగించింది. క్రికెట్ బెట్టింగ్, పేకాట, మోసాలు చేయడంలో ఆరితేరిన అశోక్చౌదరి బృందం ఈ టికెట్లు అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడంతో వారి ఆగడాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ఘట్టమనేని అశోక్చౌదరి ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ కీలక కార్యకర్త. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల ఆసరాగా ఈ ముఠా భారీ మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.పలుకూరుకు చెందిన అశోక్చౌదరి, కంకణాల దినేష్, సింగమనేని వేణుమాధవ్ మిత్రులు. గ్రామంలో టీడీపీ కీలక కార్యకర్తలు. కందుకూరు ప్రాంతంలో టీడీపీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా హడావుడి అంతా అశోక్చౌదరిదే. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉండడంతో వీరు సంపాదనకు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. తమకు ఎదురే లేదన్నట్లు క్రికెట్ బెట్టింగ్ దందాను నడిపించడంతోపాటు వీఐపీల పేరుతో భారీ మోసాలకు పాల్పడసాగారు. దీన్లో భాగంగా తమిళనాడుకు చెందిన ఆశిష్, సెంథిల్, తన్సిల్తో కలిసి వీరు ముఠాగా ఏర్పడ్డారు. ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి వీఐపీ కాంప్లిమెంటరీ టికెట్లు సంపాదించి వాటిని బ్లాక్లో మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.దీనికిగాను గవర్నర్లు, మంత్రులు, న్యాయమూర్తుల పేరుతో వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు నకిలీ లెటర్హెడ్లను పంపి అక్కడి నుంచి ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్లు పొందేవారు. అలా పొందిన టికెట్లను బ్లాక్మార్కెట్లో ఒక్కొక్కటి రూ.22 వేలకు అమ్ముకుని సొమ్ము చేసుకునేవారు. వీఐపీ లెటర్హెడ్లతో టికెట్లు పొందుతున్న ఈ ముఠా వ్యవహారంపై అనుమానం రావడంతో హెచ్సీఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్లో టికెట్లు విక్రయిస్తుండగా అశోక్చౌదరి, దినేష్, వేణుమాధవ్లను రెండు రోజుల కిందట అరెస్టు చేశారు. వీరంతా పలుకూరుకు చెందినవారు కావడంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో వీరి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.ఈ ముఠాలో కీలక సూత్రధారి అశోక్చౌదరి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. గ్రామంలో దురుసుగా ప్రవర్తించడం, టీడీపీ కార్యక్రమాల సందర్భంగా బైక్లతో హంగామా చేయడం పరిపాటి అని చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు, వీఐపీలతో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటుంటాడు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్, పలువురు టీడీపీ ముఖ్యులు, ఐసీసీ చైర్మన్ జైషాతో దిగిన ఫొటోలను పెట్టుకున్నాడు. ఇలా ఫొటోలతో తననుతాను ప్రమోట్ చేసుకుంటూ క్రికెట్ బెట్టింగ్ దందా, టికెట్ల బ్లాక్మార్కెట్ ముఠా నడిపిస్తున్నాడు. -
మెట్ గాలాలో రూ. 142 కోట్ల నెక్లెస్తో మెరిసిన సుధా రెడ్డి..!
న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో మెట్గాలా 2026 వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో సెలబ్రెటీలు, ప్రముఖులు, ఇతరులు తమదైన శైలితో కళాత్మకంగా మెరిశారు. ఈసారి మన హైదరాబాద్ బిలియనీర్, MEIL(Megha Engineering and Infrastructures Limited) గ్రూప్ డైరెక్టర్లో ఒకరైన సుధారెడ్డి అద్భుతమైన లుక్లో అలరించారు. ఈ వేడుకలో ఆమె మనీష్ మల్హోత్రా దుస్తులను ఎంచుకున్నారు. ఆమె ఈ ఈవెంట్లో 'కాస్ట్యూమ్ ఆర్ట్' అనే థీమ్కు అనుగుణంగా ధరించిన మిలియన్ డాలర్ల నెక్లెస్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఈ నెక్లెస్ ఆమె వ్యక్తిగత ఆభరణాల కలెక్షన్లలో ఒకటి. దీని ఖరీదు వచ్చేసి దాదాపు 142 కోట్లు పైనే పలుకుతుందట. ఈ ఆభరణం త్రిభుజాకార రోజ్-కట్ వజ్రాలతో కూడిన విక్టోరియన్-ఫినిష్ చైన్తో రూపొందించారు. పూల గుత్తులలో పొదిగిన ఈ రత్నాలు, నెక్లెస్ మధ్యలో ఉన్న 550 క్యారెట్ల ముదురు ఊదా-నీలం రంగు టాంజనైట్ ఈ నెక్లెస్ అందాన్ని మరింత హైలెట్ చేశాయి. ఈ నెక్లెస్ని 'క్వీన్ ఆఫ్ మెరెలానీ' అని పిలుస్తారట. ఈ ఆభరణంతోపాటు 30 క్యారెట్ల రోజ్-కట్ పోల్కీ వజ్రపు ఉంగరం, 40 క్యారెట్ల అస్చెర్-కట్ కొలంబియన్ పచ్చ ఉంగరంతో సుధారెడ్డి తన ఆహార్యాన్ని పూర్తి చేశారు. ఇక మనీస్ మల్హోత్రా డిజైన్ చేసినా ఆమె డ్రెస్ 'జీవ వృక్షం', కాలం, జ్ఞాపకం, నిరంతర ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచింది. ఇందులోని ప్రతిదారం చరిత్రలో ఒక భాగాన్ని వివరించే అద్భుతమైన కళ. అన్నింటకంటే ఆ డిజైనర్వేర్లో ఏకంగా మూడువేల ఏళ్ల వస్త్ర సంప్రదాయాన్ని అల్లికలు, ఎంబ్రాయిడరీ ద్వారా చూపించినట్లు పేర్కొన్నారు మల్హోత్రా. అందులో పాలపిట్ట, జమ్మి చెట్టు, కల్పవృక్ష, టాంగేడు, సూర్య, చంద్ర తదితర మూలాంశాలన్నీ ఈ డ్రెస్ను మరింత అందంగా కనిపించేలా చేశాయి. కాగా సుధారెడ్డి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తన మెట్ గాలా లుక్ గురించి ఇలా షేర్ చేసుకున్నారు. "హైదరాబాద్ కేవలం తన పుట్టినిల్లు మాత్రమే కాదు, అది తనలో భాగమైన జీవన విధానం. తాను ఈ వేడుకలో ప్రపంచ వేదికపై దక్షిణ భారతీయతను కళ్లకు కట్టినట్లు చూపించేలా..అత్యంత ఆకర్షణీయంగా కనిపించాలని ఆకాంక్షించినట్లు వెల్లడించారు". కాగా, సుధా రెడ్డికి MEIL (Megha Engineering and Infrastructures Limited) మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డితో వివాహం జరిగింది. ఆ దంపతులకు మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by Sudha Reddy (@sudhareddy.official)(చదవండి: ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..) -
ప్రైవేట్ పాఠశాలల ఫీజులు.. మానవ హక్కుల సంఘం కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల ముందస్తు ఫీజు వసూలు విషయంలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పాఠశాలల్లో ముందస్తు ఫీజు వసూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఇటువంటి చర్యలు అనుచితం, ఏకపక్షమైనవే కాకుండా వాణిజ్యపరంగా విద్యను మలచరాదనే న్యాయసూత్రాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు మానవహక్కుల సంఘం ఛైర్మన్ షమీమ్ అక్తర్ అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.వివరాల్లోకి వెళితే.. బోడుప్పల్లోని ఒక ప్రైవేట్ పాఠశాల 2026–2027 విద్యా సంవత్సరానికి 50% ఫీజును ముందుగానే వసూలు చేయడం, అలాగే పుస్తకాలు మరియు యూనిఫాంల కోసం ముందస్తు చెల్లింపులు కోరడం వంటి అంశాలపై మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు నమోదైంది. దీనిని విచారించిన హ్యుమన్ రైట్స్ కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విద్య హక్కు ప్రాథమిక హక్కు కాగా, దానిని లాభాపేక్షతో నిర్వహించరాదని సంఘం పునరుద్ఘాటించింది.తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారం, అలాగే నిర్దిష్ట విక్రేతల వద్ద నుంచే పుస్తకాలు, యూనిఫాంల కొనుగోలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం వల్ల పారదర్శకత లోపిస్తున్న అంశాలను గమనించిన సంఘం, మెడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాధికారి తగిన చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ నిబంధనల ప్రకారం విడతలవారీగా ఫీజులు వసూలు చేసే విధానాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసింది.ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చట్టం, 1993 ప్రకారం నిర్ణీత గడువులోగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారిని సంఘం ఆదేశిస్తూ, ఈ వ్యవహారాన్ని ముగించింది. -
నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ వీరోచిత పోరాటం.. ప్రాణాలకు తెగించి..
హైదరాబాద్: నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్. ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కేళ్లేందుకు ప్రయత్నిస్తే.. ప్రాణాలకు తెగించి, తన ఆటోనే ఆయుధంగా మలచుకొని సాహసోపేతంగా ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్.. రౌడీ షీటర్ను అడ్డుకున్నారు. కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా ప్రతిఘటించారు.ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. మహమ్మద్ జాహెర్కు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతంలో మార్చి 4వ తేదీ తెల్లవారుజామున మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లారు. హిందీ మర్వాడీ విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే, డబీర్పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో, అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించారు.జాహెర్ వెంటనే స్పందించి తన ఆటోను వేగంగా వెనక్కి తిప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్ను తన ఆటోతో ఢీకొట్టి అతడిని కిందపడేశారు. ఆ సమయంలో నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నారు. ఆ సమయంలో పారిపోతుండగా వెంటనే గస్తీ తిరుగుతున్న పోలీసులు రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జాహెర్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆటో డ్రైవర్ సాహసం గురించి గోషామహల్ పోలీసులకు బాధితురాలు తెలియజేశారు. కాగా, ఈ వీరోచిత దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రౌడీ షీటర్ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించి, నిస్వార్థంగా వెళ్లిపోయిన ఆ అజ్ఞాత వీరుడి కోసం గోషామహల్ పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలో ఆటో నంబర్ను చూసి, సాంకేతిక పరిజ్ఞానంతో జాహెర్ను గుర్తించారు.ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు. “కళ్లముందే నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో, ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు. ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్తులకు భయం పుడుతుంది" అని ప్రశంసించారు.నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా, మహమ్మద్ జాహెర్లా ధైర్యంగా స్పందించి వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని నగరవాసులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా, డబిర్ పూరకు చెందిన రౌడీ షీటర్ పై గోషా మహల్ పీఎస్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడిపై పలు పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయి. ✅ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్✅ఆటోతో ఢీకొట్టి ‘నిలువరించిన’ తీరు.. సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం✅సన్మానించిన నగర సీపీ సజ్జనర్.. నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందజేతనేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు.. ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని… pic.twitter.com/IyGunUWQyB— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) May 5, 2026 -
హైదరాబాద్ బాచుపల్లి లో భారీ అగ్నిప్రమాదం
-
కొత్వాల్గూడలో ‘హైడ్రా’మా!
సాక్షి, హైదరాబాద్: కొత్వాల్గూడ్లో హైడ్రా హడావిడి చేస్తోంది. స్థానికంగా ఓ క్రషర్స్ మిషన్స్ను కూల్చివేస్తోంది. ఇది ఓ మంత్రికి సంబంధించిందంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల నడుమ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుండడం గమనార్హం. వట్టినాగులపల్లిలో అనుమతి లేని క్రషర్లను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. మొత్తం ఐదు ప్రాంతాల్లో అక్రమ క్రషింగ్ యూనిట్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడలో ఉన్న ఈ క్రషర్ల చుట్టూ ఉన్న వివాదాలు నెలకొన్నాయి. జీవో నెంబర్ 111 నిబంధనలను అతిక్రమిస్తూ.. అక్రమంగా ఓ మంత్రికి చెందిన కన్స్ట్రక్షన్స్ కంపెనీ క్రషర్లను నడుపుతోందని ఆరోపణలు వచ్చాయి. హిమాయత్సాగర్ క్యాచ్మెంట్ ఏరియా (111 జీవో పరిధి)లో ఈ క్రషర్లు పనిచేస్తున్నాయని, గుట్టలను పిండి చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని స్థానికులు, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే..తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అధికారులు కొన్ని క్రషర్లు, రెడీమిక్స్ ప్లాంట్లను సీజ్ చేశారు. 15 స్టోన్ క్రషర్లకు (పరిధిలోని వివిధ ప్రాంతాలు) జరిమానాలు కూడా విధించినట్లు సమాచారం. అయితే సదరు మంత్రికి చెందిన కంపెనీ ఆ లిస్ట్లో లేదని స్థానిక అధికారులు తెలియజేశారు. ఆ వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధంతో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో తాజా కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. -
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాచుపల్లి-మియాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న ఫర్నీచర్ షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి.. ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. సుమారు 20 కుటంబాలు రోడ్డున పడ్డాయి. షాపుల్లోని ఫర్నిచర్ సోఫా సెట్టులు, ఇంటి సామగ్రి, టేబుల్స్ దగ్ధమయ్యాయి.ఒక్కో షాప్లో సుమారు రూ. 3 లక్షల రూపాయల విలువైన సామగ్రి ఉంది. సంఘటన స్థలానికి ఆరు ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి.. అయితే ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా? గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చెన్నైలో పసిడి ప్రియులకు ఊరట..
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం భారీగా పెరిగిన పుత్తడి ధరలు వరుసగా నిలకడగా కొనసాగడం పసిడి ప్రియులకు ఊరట కలిగించే విషయం. ఇక వెండి ధరలు సైతం వరుసగా రెండో రోజూ ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అమ్మ ఆశీర్వాదం తీసుకున్నా.. డీజీపీ సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: డీజీపీ బా ధ్యతలు చేపట్టిన తర్వాత తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నట్టు సీవీ ఆనంద్ ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘మా అమ్మను పరామర్శించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాను. ఆమె నవంబర్ నుంచి జనవరి నెలల్లో అనా రోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు మంచానికే పరిమితమైనప్పటికీ కోలుకున్నారు. తన కొడుకు ఈ రాష్ట్రానికి డీజీపీ కావాలన్న ఆమె ప్రగాఢ వాంఛే ఆమెను నిలబెట్టిందని నాకు అనిపించింది. ఆమె ఎంతో సంతోషించారు. నేను కూడా అంతే..’ అంటూ కొన్ని ఫొటోలను సీవీ ఆనంద్ పంచుకున్నారు. -
ఆరేళ్ల నాటి సాయానికి కేటీఆర్కు ఓ బాలిక కృతజ్ఞత
హైదరాబాద్: ఆరేళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమి ట్టాడుతున్న ఓ బాలిక నాటి మంత్రి కె. తారక రామారావు అందించిన సాయంతో కోలు కొని ప్రస్తుతం కొత్త జీవితం అనుభవిస్తోంది. హైదరాబాద్లోని ప్యారడైజ్ బాలంరాయ్ ప్రాంతానికి చెందిన నారాయణ, రాజేశ్వరి దంపతుల కుమార్తె శరణ్య ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్తో బాధపడగా ప్రైవేటు ఉద్యోగులైన ఆమె తల్లిదండ్రులకు రూ. లక్షల వైద్య ఖర్చు భరించడం సాధ్యంకాలేదు. ఆ కష్ట సమయంలో శరణ్య చిన్నమ్మ చేసిన ట్వీట్కు స్పందించిన కేటీఆర్.. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి శరణ్యకు ఖరీదైన చికిత్సను ఉచితంగా అందేలా చర్యలు తీసుకున్నారు. కాలక్రమంలో శరణ్య పూర్తిగా కోలుకొని ఇటీవల పదో తరగతి పరీక్షల్లో 384 మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఈ నేపథ్యంలో తన ప్రాణాలను కాపాడిన కేటీఆర్ను తల్లిదండ్రులతో కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘‘ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి వినియోగించగలగడం నా అదృష్టం. శరణ్య ఆరోగ్యంగా ఉండటం ఎంతో ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. తమ చిన్నారి ప్రాణాలు కాపాడినందుకు.. కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబంఆరేళ్ల క్రితం ఎక్స్ వేదికగా.. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న తమ కుమార్తె శరణ్యను కాపాడాలని కేటీఆర్ను కోరిన ఫ్యామిలీఈ ట్వీట్కు వెంటనే స్పందించడమే కాదు.. ఆపరేషన్కు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించిన… pic.twitter.com/KHdO3ONe2I— PulseNewsBreaking (@pulsenewsbreak) May 3, 2026 -
ఐఫోన్.. ఆవేశం.. విషాదం
హైదరాబాద్: ఐఫోన్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుద్భిగూడ ప్రాంతానికి చెందిన బక్కి ప్రియ (42)కు 20 ఏళ్ల క్రితం మల్లికార్జున్ ముస్తాపూర్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొత్తగా తీసుకొచ్చిన ఐ ఫోన్ను తన కజిన్కు భర్త ఇచ్చాడు. ఈ విషయంపై ఆదివారం ఉదయం భార్యాభర్తులు గొడవపడ్డారు. ఆవేశంలో ప్రియ ఇంట్లో ఉన్న చెదల మందు తాగింది. ఇది గమనించిన భర్త వెంటనే ఆమెను కాచిగూడలోని సీసీ ష్రాఫ్ ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రియ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. -
ఒకే చితిపై నవ దంపతులకు దహన సంస్కారాలు
హైదరాబాద్: బలవన్మరణానికి పాల్పడిన నవ దంపతులు కార్తీక్, మంజుల (జ్ఞాన్సిక)లకు ఆదివారం కూకట్పల్లిలోని వెంకటరావునగర్ కాలనీలోని హిందూ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఒకే చితిపై దహన సంస్కారాలు చేశారు. వివాహమై రెండు నెలలు గడవక ముందే దంపతులు ఆత్మహత్య చేసుకోవటం మిస్టరీగా మారింది. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి సరదాగా ఉన్న కార్తీక్, మంజుల మరుసటి రోజు ఉదయం విగతజీవులుగా కనిపించటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్థిక సమస్యలు లేవని, ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చిందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోస్ట్మార్టం నివేదిక వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా.. శుక్రవారం అర్ధరాత్రి తొలుత మంజుల పురుగుల మందు తాగి మృతి చెందడంతో కార్తీక్ ఉదయం ఉరి వేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు.చదవండి: ఐఫోన్.. ఆవేశం.. విషాదం -
హర్టయ్యినట్లున్నాడు..క్యాబ్ డ్రైవర్ నోట్ వైరల్!
ఏదైనా మనసుకు గాయమైతే అది ఏదొక సందర్భంలో ఏదొక రూపంలో బయటకొచ్చేయడం ఖాయం. ఇక్కడ ధనిక, బీద అనే తేడా ఉండదు. ‘నేను నా బత్రుకు.. బ్రతుకుతున్నా.. మీకు బానిసను కాదు’’ అనే భావన మనిషిలో ఉండటంలో తప్పులేదు. ఉంటుంది కూడా. ‘నీ పనిని నువ్వు గౌరవించు.. అవతలి వాడికి సలాం కొట్టక్కర్లేదు’ అనే పెద్దలు చెప్పే మాటను చాలామంది పాటిస్తుంటారు. ఉద్యోగం చేసే చోట సలాం కొట్టే పరిస్థితి వచ్చినా అది కొంతవరకే ఉంటుంది కానీ, ఏదో మనం సుపీరియర్ అందుకే అవతల వ్యక్తి సలాం కొడుతున్నాడని అనుకోవద్దు. మరి స్వేచ్ఛా జీవులుగా బ్రతికే వ్యక్తులకు సలాం కొట్టడమన్నా, అవతల వాళ్లు అటిట్యూడ్ చూపెడుతున్నప్పుడు అది భరించడమన్నా చాలా కష్టం. ఇక్కడ ఓ క్యాబ్ డ్రైవర్ కూడా అదే చేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. క్యాబ్ డ్రైవర్ తన కారులో పెట్టిన నోట్ గురించి. ఎక్కడో ఏదో జరిగే ఆ నోట్ పెట్టడానికి కూడా కారణం అయ్యి ఉండొచ్చు. తన క్యాబ్లో ఎక్కే వారు ఎలా ఉండాలి అనే దానిపై ఓ నోట్ను పెట్టుకున్నాడు. ముందుగా ‘ ‘ క్యాబ్ ఎక్కేవారు యజమానిగా ఫీలవ్వద్దు’ అంటూ మొదలు పెట్టి సుమారు 10 నియమాలను పొందుపరిచాడు. డ్రైవర్లు- ప్రయాణికులు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలనే దానిపై పెట్టిన ఓ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెట్టింట ఇది విస్తృత చర్చకు కూడా దారి తీసింది. ప్రయాణికుడు క్యాబ్ యజమాని కాదని, దానిని నడిపే వ్యక్తే యజమాని అని పేర్కొంటూ ఆ నోట్ను ప్రారంభించి. ఆ తర్వాత, ప్రయాణికులను మర్యాదగా మాట్లాడాలని, గౌరవంగా ఉండాలని, కారు డోర్ను నెమ్మదిగా మూయాలని కోరాడు. మీరు(ప్రయాణికులు) డబ్బు చెల్లించినంత మాత్రాన అమర్యాదగా ప్రవర్తించే హక్కు వారికి లేదన్నాడు. మీకు ఏమైనా అహంకారం ఉంటే దానిని జేబులో పెట్టుకుని ఉండాలని కూడా సూచించాడు. ఇది హైదరాబాద్కు చెందిన క్యాబ్ డ్రైవర్ నోట్గా తెలుస్తోంది. హైదరాబాద్ క్యాబ్లు వెనుకాడవు అనే క్యాప్షన్తో అమన్ అనే సోషల్ మీడియా యూజర్ ‘ఎక్స్’లో ఆ నోట్ను ఫోట్ తీసి పోస్ట్ చేశాడు. ఇది వైరల్గా మారిన వైనంలో వార్త అయ్యింది. Hyderabad cabs do not hesitate pic.twitter.com/oWuJUtwRkB— Aman (@AmanHasNoName_2) May 2, 2026 -
ఎస్ఐఆర్పై ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష
హైదరాబాద్: గాంధీభవన్ లో మాజీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ లు మరియు కోఆర్డినేటర్లు విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఎన్నికల సంఘం చేపట్టిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)” కార్యక్రమంపై లోతైన చర్చ జరిపి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అత్యంత కీలక అంశమని పేర్కొన్నారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ లో ఎక్కడా దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు ఉండకుండా ప్రతి బూత్ స్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేయాలని, అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్ర స్థాయిలో కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, సవరణలు వంటి ప్రక్రియలను వేగవంతం చేయాలని, యువత, మహిళలు మరియు కొత్తగా అర్హత పొందిన వారిని ప్రత్యేకంగా గుర్తించి నమోదు చేయించాలన్నారు. ఈ దిశగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు.బూత్ స్థాయిలో సమర్థవంతమైన వ్యవస్థ కోసం వెంటనే “బూత్ లెవల్ అసిస్టెంట్స్ (BLA)” నియామకాన్ని పూర్తి చేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త ఈ బాధ్యతను కర్తవ్యంగా భావించి పనిచేస్తేనే భవిష్యత్ ఎన్నికల్లో విజయానికి బలమైన పునాది పడుతుందని స్పష్టం చేశారు,మరియు డివిజన్ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తి చేయాలని అన్నారుఈ కార్యక్రమంలో మధుయాష్కి గారు,జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు,ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు. ఉప్పల్ నియోజకవర్గం కోర్డినేటర్ శశికళ యాదవ్ గారు,బండి రమేష్ గారు,కోలన్ హనుమంత్ రెడ్డి గారు,తదితరులు పాల్గొన్నారు -
అక్షర యోధులకు అరుదైన గుర్తింపు
హైదరాబాద్: పగలూ రాత్రీ తేడా లేకుండా కాలంతో పరుగులు పెడుతూ పనిచేయాల్సి వచ్చే కఠోరశ్రమతో కూడుకున్న రంగం జర్నలిజం అని.. విశ్వవిద్యాలయాల్లో చదువుకొని, ఆదర్శాలు, విలువలతో వచ్చి, ఆచరణలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.‘హైబిజ్ టీవీ’ మీడియా అవార్డ్స్-2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ఒకప్పుడు అలా కష్టాలు అనుభవించినవాణ్ణే. అయితే, ప్రగాఢమైన అభిరుచితో వదలకుండా కృషి చేస్తే గుర్తింపు తప్పక వస్తుందన్నారు. ఇవాళ మీడియా ఎంతో ఉత్సాహంగా, క్రియాశీలంగా ఉందన్నారు.జర్నలిజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కొత్త టెక్నాలజీల ప్రభావంపై సీనియర్ జర్నలిస్టులు లోతుగా ఆలోచించి, మీడియా అభివృద్ధికి తగిన సూచనలు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. అందుకు ప్రభుత్వం ఓ వేదిక కల్పించడానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థంగా చేరవేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కాంగ్రెస్ నేత, భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు దశాబ్దాల క్రితమే చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, తెచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రస్తావిస్తూ, “1992లో హైదరాబాద్లో హైటెక్ సిటీకి అంకురార్పణ చేసిందే... మా కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే, అప్పుడైనా ఇప్పుడైనా ప్రజలకు మేము చేస్తున్న మంచి పనులను సమర్థంగా చెప్పుకోలేక పోతున్నాం. అంతెందుకు... మా ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక అనుకూల, క్రియాశీలక విధానాల వల్ల గత రెండేళ్ళలో రాష్ట్రంలోని కమర్షియల్ స్పేస్ నూటికి నూరుపాళ్ళు నిండిపోయింది.అలాగే, గత రెండేళ్ళలో ప్రతి 3 రోజులకు ఒక ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్’ (‘జీసీసీ’ - ఐటీ, ఫైనాన్స్ తదితర రంగాల్లో విదేశీ సంస్థల తాలూకు అనుబంధ సంస్థలు భారత్లో రావడం) హైదరాబాద్లో నెలకొనడం జరిగింది. ఒక్క గత ఏడాదిలోనే 70 జీసీసీలు వచ్చాయి. అలాగే, మరే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలోని ప్రతి గ్రామం ఆప్టికల్ ఫైబర్ నెట్ కేబుల్తో అనుసంధానమైంది. ఎక్కడికైనా సెకనులో వెయ్యో వంతులో సమాచారాన్ని పంపే వీలు కలిగింది. ఇది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పరాకాష్ఠ” అని శ్రీధర్ బాబు వివరించారు.శనివారం అట్టహాసంగా సాగిన ఈ మీడియా అవార్డుల ప్రదానోత్సవానికి ప్రధాన అతిథులుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ‘ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ’ అధ్యక్షుడు – రాజ్యసభ మాజీ సభ్యుడు వివేక్ గుప్తా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా ‘భారతీ సిమెంట్’ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం. రవీందర్ రెడ్డి, ‘లైఫ్ స్పాన్’ అధినేత నరేంద్ర రామ్ నంబుల, ‘క్రెడాయ్ - హైదరాబాద్’ ప్రెసిడెంట్ ఎన్. జైదీప్ రెడ్డి, అలాగే ఎం. రాజ్ గోపాల్ (మేనేజింగ్ డైరెక్టర్ - హైబిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (మేనేజింగ్ డైరెక్టర్ - హైబిజ్ టీవీ ఎల్.ఎల్.పి) తదితరులు పాల్గొన్నారు.2026కు గాను నిర్వహించిన తాజా అవార్డుల ప్రదానోత్సవంలో మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టుల కుటుంబాలలోని ప్రతిభావంతులైన పిల్లల చదువులకు ఒక్కో కుటుంబానికి పాతిక వేల రూపాయల చొప్పున హైబిజ్ టీవీ - లైఫ్ స్పాన్ సంస్థలు ఆర్థికంగా చేయూత అందించడం విశేషం. అలా తమ ప్రతిభతో స్కాలర్ షిప్ అందుకున్న విద్యార్థినీ విద్యార్థుల్లో ఏ. వికాస్ గౌడ్ (97.02% మార్కులతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఉత్తీర్ణుడు), ఏ. స్రవంతి (ఎం.బి.బి.ఎస్. విద్యార్థిని), ఎన్. సమీక్ష (97.10% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి)..ఎస్. అనుశ్రిజ (బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని), ఎస్. అశ్వంత్ కుమార్ (97% మార్కులతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పూర్తి), టి. తరళశ్రీ (97% మార్కులతో ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం పూర్తి), ఎస్. సిరి (97.1% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి), ఇ. వినీత్ (98% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి), సహస్ర (ఇంటర్మీడియట్ పూర్తి), హెచ్. సాయి కిరణ్ (పదో తరగతి పూర్తి) తదితరులున్నారు. ఉపకార వేతనాల చెక్కును మంత్రివర్యుల చేతుల మీదుగా అందుకుంటున్నప్పుడు ఆ పిల్లల ముఖంలో వెల్లివిరిసిన ఆనందం, ఆ కుటుంబాల సంతోషంతో సభావేదిక కళకళలాడింది.‘హైబిజ్ టీవీ - మీడియా అవార్డ్స్ 2026’లో భాగంగా మీడియా రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఐదుగురికి ‘లెజెండరీ పురస్కారాలు’ అందజేశారు. ఈ ‘లెజండరీ పురస్కారాలు’ అందుకున్న వారిలో... జాతీయ జర్నలిస్టు భూపేంద్ర చౌబే (మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సీఎన్ఎన్ - న్యూస్18, ఇండియా ఎహెడ్, ఎన్డీ టీవీ), తెలుగువారైన వెటరన్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు (ఆలిండియా రేడియో), ఆంగ్ల పత్రికా ప్రపంచంలో సుప్రసిద్ధ జర్నలిస్ట్ సీహెచ్. సుశీల్ రావు (టైమ్స్ ఆఫ్ ఇండియా - దక్కన్ క్రానికల్), పలు మీడియాల్లో ప్రసిద్ధురాలైన సి. మృణాళిని, ప్రకటనల రంగంలో విస్తృత సేవలు అందించిన శ్రీనాథ్ అయ్యర్ (హిందూ, హిందుస్థాన్ టైమ్స్) ఉన్నారు.ఈ సందర్భంగా భూపేంద్ర చౌబే మాట్లాడుతూ, “ఒక రకంగా ఇవాళ జాతీయ మీడియా కన్నా ప్రాంతీయ భాషల్లోని మీడియాయే చాలా శక్తిమంతంగా ఉంది. అదే సమయంలో, రానున్న రోజుల్లో మీడియా సంస్థల నిర్వహణలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం ఎక్కువ కానుంది” అని అభిప్రాయపడ్డారు. “హైదరాబాద్ నగరంలో ఓ తెలియని ఆత్మీయత ఉంది. నేను యూపీకి చెందినవాడిని అయినప్పటికీ, తెలుగు భాష, తెలుగు సినిమా, తెలుగు సంగీతం అంటే మక్కువ ఎక్కువ” అని ఆయన వ్యాఖ్యానించారు.ఈ అవార్డుల ఉత్సవానికి అతిథిగా హాజరైన పార్లమెంట్ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, “టెస్ట్ మ్యాచ్ల నుంచి వన్డేలు, 50 ఓవర్లు, ఇప్పుడు టీ20లకు క్రికెట్ మారినట్టే... కాలంతో పాటు మీడియా సైతం ఎంతో మార్పులు వచ్చాయి. అయితే, ఎన్ని మార్పులు వచ్చినా... ఏ రంగంలోనైనా గుర్తింపు అనేది మరింత శ్రమించడానికి ప్రేరణనిస్తుంది. దాదాపు 20 ఏళ్ళు యూత్ లీడర్గా ఎన్.ఎస్.యు.ఐ లాంటి వాటిలో నిరంతరం పనిచేయడం వల్లే కాంగ్రెస్ పార్టీ నాకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. అదే విధంగా మీడియా మిత్రులు తమ రంగంలో మరింత కృషి చేయడానికి ఈ అవార్డులు ఉపకరిస్తాయి” అని అభిప్రాయపడ్డారు.అందుకు తగ్గట్టే, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కేటగిరీలో కలిపి 60 మందికి పైగా సీనియర్ జర్నలిస్టులను ‘హైబిజ్ టీవీ’ మీడియా పురస్కారాలతో సత్కరించింది. లోతైన పరిశోధనతో ఎన్నో విశేషాలను వెలికితీసి, తెలుగు సినీ రంగ చరిత్రను అక్షరబద్ధం చేయడంలో సుదీర్ఘకాలంగా కృషి చేస్తూ, గతంలో ప్రభుత్వ నంది, గద్దర్ అవార్డులను అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ – రచయిత డాక్టర్ రెంటాల జయదేవను “తెలుగు సినీ చరిత్రకు ఉత్తమ డాక్యుమెంటేషన్ చేస్తున్న అరుదైన జర్నలిస్టు”గా గుర్తించి, అవార్డుతో గౌరవించింది. జయదేవను మంత్రి శ్రీధర్ బాబు ఆప్యాయంగా పలకరించి, ఉత్తమ ‘తెలుగు సినిమాపై ఉత్తమ గ్రంథం’గా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకున్న ఆయన రచన ‘మన సినిమా... ఫస్ట్ రీల్’ పుస్తకం గురించి తెలుసుకున్నారు.‘సాక్షి’ మీడియా గ్రూపు నుంచే మంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న విజేతలలో బొంబాయికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గుండాల శ్రీనివాసరావు (ప్రింట్ స్పెషల్ జ్యూరీ- అప్ కంట్రీ), అలాగే ప్రకటన, మార్కెటింగ్ రంగాలకు చెందిన శ్రీనివాస్ (ఎడ్యుకేషన్ స్పెషల్స్), వెంకటేశ్ (రిటైల్ యాడ్స్), వేణు (ఇంజనీరింగ్ కాలేజెస్) ఉన్నారు.ఇక, వ్యవసాయ రంగంపై విశేష కృషి చేస్తున్న అంకితభావం గల జర్నలిస్ట్ వలేటి గోపీచంద్ (ఆకాశవాణి), సినీ రంగ పాత్రికేయానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చల్లా శ్రీనివాస్ (జ్యోతి), ఎడిటోరియల్ విభాగంలో సీనియరైన భాస్కర్ తాటికొండ (హన్స్ ఇండియా), పొలిటికల్ రిపోర్టింగ్లో సీనియరైన గూడ ఆంజనేయులు గౌడ్, టీవీ రంగంలో పాపులరైన కాట్రగడ్డ అజిత (99 టీవీ), న్యూస్ యాంకర్లు స్వర్ణ రోజా (రాజ్ టీవీ), అపర్ణ (వి6), వినోదరంగంలో పేరు తెచ్చుకున్న టీవీ జర్నలిస్ట్ తారక్ (ఎన్టీవీ), టీవీ రిపోర్టర్ సత్యనారాయణ, ప్రింట్ జర్నలిస్ట్ పి. జగదీశ్వర్ (నవ తెలంగాణ), అలాగే మంగుమూరి శ్రీనివాస్, వి. సురేశ్ తదితరులు అవార్డు గ్రహీతల్లో ఉన్నారు.విసుగూ, విరామం లేకుండా విజేతలందరికీ మంత్రే స్వయంగా అవార్డులు అందించడం గమనార్హం. అవార్డు అందుకున్న విజేతలందరూ తమ సంతోషం వ్యక్తం చేశారు. మీడియా రంగంలో తాము చేస్తున్న కృషికి ‘హైబిజ్ టీవీ’ తగిన గుర్తింపునిచ్చిందనీ, ఇది తమకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తోందనీ అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.ఈ సందర్భంగా వచ్చే ఏడాది నుంచి మీడియా అవార్డ్స్ విజేతలకు ప్రోత్సాహకంగా నగదు పురస్కారాలు సైతం అందించేందుకు ‘క్రెడాయ్’ ముందుంటుందని ‘క్రెడాయ్ - హైదరాబాద్’ ప్రెసిడెంట్ జైదీప్ రెడ్డి ప్రకటించడం విశేషం. “హైదరాబాద్ నగరంలోని ఈ ప్రాంతం (హైటెక్ సిటీ)లో స్థిరాస్తి విలువ గత పాతికేళ్ళలో వంద రెట్లు పెరిగింది. కేవలం క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, అదీ అతి తక్కువగా కేవలం 12.5 శాతమే ఉన్నది స్థిరాస్తి రంగమే. అందుకే, దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడే స్థిరాస్తుల రంగంపై ప్రజలకు మరింత అవగాహన కలిగించేలా మీడియా మరిన్ని కథనాలు అందించా”లని జైదీప్ రెడ్డి అభ్యర్థించారు.విజేతలను ఎంపిక చేసిన విశేష అనుభవజ్ఞుల బృందం పక్షాన సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ ములుగు సోమశేఖర్ గత ఆరేళ్ళ అవార్డుల ప్రస్థానాన్ని వివరించారు. “మీడియా రంగంలో అందరికీ తెలిసేది జర్నలిస్టులే. కానీ, అడ్వర్టయిజింగ్, సర్క్యులేషన్ వారు ఈ పరిశ్రమలో అన్ సంగ్ హీరోస్” అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ‘భారతీ సిమెంట్’ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం. రవీందర్ రెడ్డి, ‘సాక్షి’ మీడియా గ్రూప్ కు చెందిన సీనియర్ డైరెక్టర్ కె.ఆర్.పి. రెడ్డి, మార్కెటింగ్ విభాగంలో ఉన్నత పదవి నిర్వహించిన రమణకుమార్, సీనియర్ జర్నలిస్టులు సాయి శేఖర్, ‘మిసిమి’ సంపాదకులు వల్లభనేని అశ్వినీకుమార్, ‘రైతు నేస్తం’ వ్యవసాయ మాసపత్రిక అధిపతి – ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ‘ఆలిండియా రేడియో’ విశ్రాంత ఉన్నతోద్యోగి సి.ఎస్. రాంబాబు, వివిధ రంగాలకు చెందిన ఇతర ప్రముఖులు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు, ‘హైబిజ్ టీవీ’కి చెందిన సుశిక్షితులైన సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఆర్ఆర్టీఎస్.. మెట్రో రైలా?
సాక్షి, హైదరాబాద్: ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్).. మెట్రో రెండో దశకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్న ప్రస్తుత తరుణంలో అనూహ్యంగా తెరపైకి వచ్చింది. తక్కువ నిర్మాణ వ్యయంతో వేగవంతమైన రవాణా సదుపాయాన్ని అందజేసే ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్టును హైదరాబాద్లో చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం నగరంలో నడుస్తున్న మెట్రో కంటే ఆర్ఆర్టీఎస్ ఎక్కువ వేగంతో పరుగులు తీస్తోంది. ప్రయాణికులకు హైస్పీడ్ రైల్ అనుభూతిని అందజేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధిమంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. మెట్రో రెండోదశ నిర్మాణంలో భాగంగానే ప్రభుత్వం మొదటి దశ ప్రాజెక్టును ఎల్అండ్టీ నుంచి కొనుగోలు చేసింది. కానీ.. ప్రస్తుత మెట్రో కంటే ఢిల్లీ నుంచి మీరట్కు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆర్ఆర్టీఎస్ తరహాలో హైదరాబాద్లో నిర్మించాలని పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రం అనుమతి కోసం పంపించిన రెండో దశ డీపీఆర్లకు అనుమతి లభిస్తుందా లేక, ఆర్ఆర్టీఎస్కే కేంద్రం కట్టుబడి ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మెట్రో రెండో దశకు భారీ వ్యయం.. రెండో దశలో మొత్తం 8 కారిడార్లలో మెట్రో విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్,(36,8 కి.మీ.) రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ (11.6 కి.మీ, ) ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.), మియూపూర్–పటాన్చెరు (13.4 కి.మీ.),ఎల్బీనగర్–హయత్నగర్ (7.1 కి.మీ.) చొప్పున మొత్తం 76.4 కి.మీ వరకు.. ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్సిటీ (39.6 కి.మీ.), జేబీఎస్–మేడ్చల్ (22 కి.మీ.), జేబీఎస్– శామీపేర్పేట్ (22కి.మీ,) కారిడార్లలో మరో 86.1 కి.మీ మెట్రో నిర్మాణం చేపట్టాలనేది ప్రతిపాదన. ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ.48 వేల కోట్లు.. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.48 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. మొదటి దశ కొనుగోలు కోసం వెచి్చంచే సుమారు రూ.15000 కోట్ల వ్యయంతో కలిపి రూ.63000 కోట్లకు చేరనుంది. మెట్రో రెండో దశకు అవసరమైన నిధులను జైకా,ఏడీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి కేవలం 2 శాతం వడ్డీకి నిధులను సేకరించాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఈ మేరకు ఇప్పటికే ప్రాథమికంగా జైకాతో ఒప్పందం కూడా ఏర్పడింది. కేవలం రూ.48000 కోట్లతో 192.2 కి.మీ వరకు ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్టును చేపట్టవచ్చని కేంద్రం ప్రతిపాదిస్తోంది. నిర్మాణ వ్యయం తగ్గుతుందని.. పటాన్చెరు–లక్డీకాపూల్– ఆరాంఘర్, రాయదుర్గం–కోకాపేట్, ఎల్బీనగర్– హయత్నగర్, ఎంజీబీఎస్– చాంద్రాయణగుట్ట, ఎయిర్పోర్ట్–ఫ్యూచర్సిటీ, జేబీఎస్–మేడ్చల్, జేబీఎస్– శామీర్పేట్ రూట్లలో ఆర్ఆర్టీఎస్ చేపట్టాలని మెట్రోరైల్ సంస్థకు కేంద్రం ప్రతిపాదనలు చేసింది. కానీ.. ప్రతిపాదిత ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంటుందని హెచ్ఎంఆర్ఎల్ పేర్కొంది. అయితే.. భూగర్భ కారిడార్లను నిర్మించి వ్యయాన్ని తగ్గించుకోవచ్చని కేంద్రం సూచించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలకు భిన్నంగా మెట్రో నిర్మాణ దిశగానే రాష్ట్రం ముందుకువెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వేగం ఎక్కువే.. ప్రస్తుతం మెట్రో రైళ్లు గంటకు గరిష్టంగా 80 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. ఆర్ఆర్టీఎస్ రైళ్లు గరిష్టంగా 160 కి.మీ వేగంతో పరుగులు తీస్తాయి. ఈ రైళ్లు యూరోపియన్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ (ఈటీఎస్సీ) సిగ్నలింగ్ వ్యవస్థతో నడుస్తాయి. ఇది మెట్రో రైళ్లలో వినియోగించే సిగ్నలింగ్ వ్యవస్థ కంటే అత్యాధునికమైనది. ఢిల్లీ నుంచి మీరట్ వరకు 82.15 కి.మీ మార్గంలో ఆర్ఆర్టీఎస్ నడుస్తోంది.‘నమో భారత్’ పేరుతో ఈ రైళ్లను నడుపుతున్నారు. -
ఏం కష్టం వచ్చిందో..!
హైదరాబాద్: ఆ దంపతులకు ఏం కష్టం వచ్చిందో ఏమో బలవన్మరణానికి పాల్పడ్డారు. వివాహమైన 55 రోజులకే తనువు చాలించారు. మిస్టరీగా మారిన ఈ విషాద ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి బస్తీకి చెందిన కార్తీక్ (28)కు గత మార్చి 8న ప్రశాంత్నగర్ రాజీవ్గాంధీ నగర్కు చెందిన మంజుల ఎలియాస్ జ్ఞాన్షిక (27)తో వివాహమైంది. కార్తీక్ ఐటీసీ కంపెనీలో మార్కెటింగ్ ఉద్యోగం చేస్తుండగా.. మంజుల ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తున్నారు. శుక్రవారం తెలిసినవారి ఇంటిలో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతానికి మంజుల వెళ్లి వచి్చంది. అనంతరం ప్రశాంత్నగర్లో తల్లి ఇంటికి భర్తతో కలిసి వెళ్లి వచి్చంది. రాత్రి భోజనాలనంతరం కార్తీక్, మంజుల వారి గదిలో నిద్రించారు. శనివారం ఉదయం 9.30 గంటలైనా ఇంటి తలుపులు తీయలేదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా.. కార్తీక్ తలుపుపై ఉన్న వెంటిలేటర్కు వైర్తో ఉరి వేసుకున్నాడు. మంజుల బెడ్పై నోట్లో నురగలతో కనిపించింది. ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మంజుల తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దంపతులు ఆత్మహత్యకు కారణాలేమిటో తెలియడంలేదని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. -
తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: తెలంగాణలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం (మే 2) ఈ సీజన్లోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్లో గరిష్ఠంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల ప్రభావంతో మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయట తిరగలేకపోతున్నారు. ఉదయం వేళల నుంచే ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో ఉంటున్నాయి. వేడి గాలులు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. -
"ఔషధి ఎక్స్ప్రెస్".. దక్షిణ మధ్య రైల్వే కొత్త సేవలు ప్రారంభం
సాక్షి,హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రజలకోసం మరో కొత్తరకం సేవలు ప్రారంభించింది. శీతలీకరించిన కాన్కోర్ కంటైనర్ రేక్ ' ఔషధి ఎక్స్ప్రెస్' సేవలను త దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ (కాన్కోర్) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ స్వరూప్ ఈ రోజు (శనివారం) సనత్నగర్లోని ఇన్ల్యాండ్ కంటైనర్ డిపో (ఐ.సి.డి) నుండి జెండా ఊపి ప్రారంభించారు."ఔషధి ఎక్స్ప్రెస్" అనే బ్రాండ్తో ఉన్న ఈ శీతలీకరించిన (రీఫర్) కంటైనర్ను, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (జె.ఎన్.పి.టి)కు కాన్కోర్ సంస్థ నడుపుతోంది. ఈ సేవ ప్రత్యేకంగా ప్రాణ రక్షక ఔషధాలు మరియు ఇతర ఉష్ణోగ్రతకు సున్నితమైన సరుకులను సురక్షితంగా రవాణా చేయడానికి రూపొందించబడింది. అధునాతన రీఫర్ కంటైనర్లలో డీజిల్ పవర్ ప్యాక్లు అమర్చబడి ఉండటం వలన, ప్రయాణమంతా నిరంతర శీతలీకరణ కొనసాగుతుంది.ఈ శీతలీకరించిన కంటైనర్ సేవ, కోల్డ్-చైన్ అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి మరియు భారతదేశ ఫార్మాస్యూటికల్ సరఫరా గొలుసు సామర్థ్యాన్ని పెంచడానికి ఒక ప్రధాన ముందడుగుగా నిలుస్తోంది . అధిక నాణ్యత గల రీఫర్ కంటైనర్లను అందిస్తున్న మెర్స్క్ లైన్తో వ్యూహాత్మక భాగస్వామ్యం, ఐసిడి సనత్నగర్ యొక్క కోల్డ్-చైన్ లాజిస్టిక్స్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది.హైదరాబాద్ భారతదేశంలోని అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కేంద్రాలలో ఒకటి మరియు దీనిని తరచుగా " భారతదేశ ఫార్మా రాజధాని" అని పిలుస్తారు. హైదరాబాద్లోని కీలక ఫార్మా ప్రాంతాలలో జీనోమ్ వ్యాలీ (తుర్క పల్లిలో ఉన్న ఒక ప్రధాన ఆర్&డి కేంద్రం ), జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం, పటాన్చెరు (ఒక పారిశ్రామిక ఫార్మా జోన్), మరియు ముచర్ల ఉన్నాయి . హైదరాబాద్–జేఎన్పీటీ కారిడార్, తెలంగాణ పారిశ్రామిక ప్రాంతాలకు మరియు భారతదేశంలోని అత్యంత రద్దీగా ఉండే ఓడరేవులలో ఒకటైన జేఎన్పీటీతో అనుసంధానించే కీలక మార్గంగా పనిచేస్తూ, ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతోంది.. ఇండియన్ రైల్వేలు ప్రత్యేకంగా ప్రారంభిస్తున్న రీఫర్ రేక్ సేవలు ఎగుమతిదారులు మరియు దేశీయ పంపిణీదారులకు ప్రయోజనకరంగా నిలుస్తాయి. ఇవి ప్రయాణ సమయాన్ని తగ్గించి, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించి, సరఫరా గొలుసు విశ్వసనీయతను పెంచుతాయి. ఫార్మాస్యూటికల్ ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో, నాణ్యత పరిరక్షణ అవసరాలు పెరగడంతో భారతదేశంలో విశ్వసనీయమైన కోల్డ్-చైన్ పరిష్కారాల కోసం పెరుగుతున్న డిమాండ్ను ఈ రీఫర్ రేక్ వినియోగం ప్రతిబింబిస్తుంది. ఇది ఎగుమతిదారులకు నూతన అవకాశాలను సృష్టిస్తుందని, ధరల సాధన మెరుగుపడుతుందని, అలాగే వృథాను తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఈ చొరవ, సమర్థవంతమైన, సుస్థిరమైన, మరియు పర్యావరణ అనుకూలమైన సరుకు రవాణా వ్యవస్థలను ప్రోత్సహించే ప్రధానమంత్రి గతి శక్తి పథకం కింద భారత ప్రభుత్వ దార్శనికతకు ఈ పథకం అనుసంధానంగా ఉంది. -
నిరూపిస్తే శిక్షకు సిద్ధం.. డాగ్ బ్లడ్ కేసులో డాక్టర్ సవాల్
-
హైదరాబాద్ లో విషాదం నవదంపతుల ఆత్మహత్య
-
పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా అనేక మందితో రేణుక ఎఫైర్.. సీతారాం కేసులో విస్తుపోయే నిజాలు
-
ఉరేసుకుని ఒకరు.. విషం తాగి మరొకరు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి ఏరియాలో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన ఓ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఒకరు విషం తీసుకోగా.. మరొకరు ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల్ని కార్తీక్, మంజులగా గుర్తించారు. వీళ్లకు పెళ్లై రెండు నెలలే అయ్యిందని.. ఎంతో అన్యోన్యంగా ఉండేవారని చుట్టుపక్కల వాళ్లు చెబుతున్నారు. మృతుల నేపథ్యం.. మరణాలకు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
ORR: నిలిపి ఉంచిన వాహనాలే మృత్యు శకటాలు
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై వాహనం రకం, వేగాన్ని బట్టి లేన్ (వరుస) డ్రైవింగ్ను నిర్ణయించారు. కానీ.. చాలా మంది వాహనదారులు లేన్ డ్రైవింగ్ నిబంధన పాటించకపోవడంతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఔటర్పై అతి వేగంగా వస్తున్న వాహనాలు ముందు ఆగి ఉన్న వాహనాలను అంచనా వేయకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి తోడు అతివేగం, నిర్లక్ష్యం కూడా ఔటర్పై రోడ్డు ప్రమాదాలలో కారణమేనని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం తుక్కుగూడ నుంచి శంషాబాద్ వస్తున్న కారు పెద్దగోల్కొండ ఔటర్పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొని.. కుటుంబంలోని ఆరుగురు సభ్యులు అక్కడికక్కడే అసువులు బాశారు. లేన్ డ్రైవింగ్ పాటించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమైంది. ఔటర్పై అతివేగంగా వెళ్తూ తరచూ ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా రహదారి భద్రతా నిపుణులు జాగ్రత్తలు సూచిస్తున్నారు. నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. దారుణాలకు ఇవీ కారణాలే.. 158 కిలోమీటర్ల ఔటర్పై రోజూ 15 లక్షకు పైగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఎక్కువ మంది వాహనదారులకు ఏయే లేన్లలో ప్రయాణించాలనే విషయంపైనే అవగాహన ఉండదు. సగటున 65 శాతం వాహనాలు లేన్ డ్రైవింగ్ (వరుస క్రమం) పాటించడంలేదని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. ఓఆర్ఆర్పై రాత్రి దాటాక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భారీ వాహన డ్రైవర్లు అవగాహన లోపంతో పక్కన నిలిపేస్తుంటారు. అతివేగంతో ముందు ప్రాంతాన్ని అంచనా వేయలేని కొందరు వీటిని ఢీకొట్టి.. మృత్యువాతపడుతున్నారు. కొన్నిసార్లు వెనుక నుంచి వచ్చే వాహనాలు వేగాన్ని అదుపుచేయలేక.. నెమ్మదిగా వెళ్లే ముందున్న వాహనాలను ఢీకొడుతున్నాయి. ఇంకొన్నిసార్లు వాహనాలు అదుపుతప్పి డివైడర్లను ఢీకొట్టుకుంటున్నాయి. ఇలా వెళ్తే సేఫ్ జర్నీ.. ఔటర్ రింగురోడ్డుపై ఒక్కోవైపు నాలుగు వరుసల చొప్పున రహదారులున్నాయి. నిబంధనల ప్రకారం 1,2 లేన్లలో కార్లు, 3,4 వరుసల్లో లారీలు, ఇతర భారీ వాహనాలు మాత్రమే ప్రయాణించాలి. ఈ నిబంధన అతిక్రమించిన సందర్భాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. 1, 2 లేన్లలో ప్రయాణించే వాహనాలు కనిష్ఠంగా 100 నుంచి గరిష్టంగా 120 కిలోమీటర్లు, 3, 4 వరుసల్లో కనిష్ఠంగా 80 నుంచి గరిష్టంగా 100 కి.మీ. వేగంతో ప్రయాణించాలి. లేన్లపై వాహనాలు అడ్డదిడ్డంగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు. ఒకవేళ వాహనాలు లేన్లు మారాలనుకుంటే ఆకస్మాత్తుగా తీసుకోకుండా.. కచ్చితంగా ఇరువైపులా, వెనుక గమనించాలి. వెనుక నుంచి వచ్చే వాహనదారులు అప్రమత్తమయ్యేలా ఇండికేటర్లు, ఇతర సంజ్ఞలు వేయాలి. ఇవేవీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పక్కలేన్లలోకి దూసుకెళ్లకూడదు. ఔటర్పై జరిగే 50 శాతం ప్రమాదాలకు అడ్డదిడ్డంగా లేన్లు మారడమే కారణం. అదుపుతప్పిన అతివేగంతోనూ.. ఔటర్పై వేగం పెరిగే కొద్దీ ప్రమాదశాతం పెరుగుతున్నట్లు వాహనదారులు గుర్తించాలి. సాధారణంగా ఔటర్ చూసేందుకు ఖాళీగా వేగంగా దూసుకెళ్లేందుకు అనువుగా ఉన్నట్లు కనిపిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సమయంలో ఒక్కసారిగా వాహనాన్ని అదుపుచేసే అవకాశాలు 90 శాతం తక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ముందు వెళ్తున్న వాహనం వేగం తగ్గితే అదుపు చేయలేక ఒక్కసారిగా ఢీకొడతాయి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వాహనం నిలపాలనుకుంటే పూర్తిగా ఎడమవైపున సర్వీసు లేన్పైనే ఆపాలి. ఇందుకు కొన్ని ప్రత్యేక ప్రాంతాలున్నాయి. పార్కింగ్ లైట్లు ఆన్లోనే ఉంచాలి. రాత్రివేళ ఎక్కువ సమయం వాహనాన్ని నిలపకూడదు. అలాగే ఓఆర్ఆర్ ప్రవేశం, నిష్కమణ మార్గాల్లో రాంగ్ రూట్లో ప్రయాణించకూడదు. -
హైదరాబాద్ : వైద్య విద్యార్థుల ఆనందం చెట్ట‘పట్టా’ల్ (ఫొటోలు)
-
చెత్త లారీ ఢీ.. ర్యాపిడో డ్రైవర్ మృతి
హైదరాబాద్: చెత్త లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో ర్యాపిడో రైడర్ మృతి చెందాడు. వెనుక కూర్చున్న వ్యక్తి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లాలాగూడ ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్న లక్ష్మారెడ్డి (35) ర్యాపిడో రైడర్. కొంతకాలంగా హయత్నగర్లోని కుంట్లూరులో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ర్యాపిడో రైడ్ రావడంతో తుర్కపల్లికి చెందిన కె.పౌల్ అనే వ్యక్తిని తన బైక్ ఎక్కించుకొని మహేంద్రాహిల్స్లో డ్రాప్ చేయడానికి బయలుదేరాడు. లాలాపేట మీదుగా వెళ్తుండగా చెత్తలోడ్తో జవహర్నగర్ డంపింగ్ యార్డ్కు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి బైక్ను ఢీకొట్టింది. లక్ష్మారెడ్డి తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో అతడు ధరించిన హెల్మెట్ సైతం ముక్కలై, తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న కస్టమర్కు తీవ్ర గాయాలయ్యాయి. -
సీఓఈ శిబిరానికి అనన్య ఎంపిక
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే హై పెర్ఫార్మెన్స్ క్యాంప్కు హైదరాబాద్ స్పిన్ బౌలర్ అనన్య దుండు ఎంపికైంది. అండర్–15 బాలికల విభాగంలో ఆమెకు ఈ అవకాశం దక్కింది. బెంగళూరులోని బీసీసీఐ–సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో ఈ నెల 18 నుంచి 11 జూన్ వరకు ఈ క్యాంప్ జరుగుతుంది. ఇటీవల జరిగిన బీసీసీఐ అండర్–15 వన్డే ట్రోఫీ (ఎలైట్)లో అనన్య 6 మ్యాచ్లలో 16 వికెట్లు పడగొట్టి టోర్నీ టాపర్గా నిలిచింది. బోర్డు అపెక్స్ కౌన్సిల్ మెంబర్ వి.చాముండేశ్వరనాథ్ పర్యవేక్షణలో నగరంలోని రామానాయుడు క్రికెట్ అకాడమీలో ప్రస్తుతం అనన్య శిక్షణ పొందుతోంది. -
అతివేగం.. 6 ప్రాణాలు బలి
శంషాబాద్ రూరల్/ సిరిసిల్ల: దైవ దర్శనానికి వెళ్లి.. తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. శంషాబాద్ శివారులో ఔటర్ రింగు రోడ్డుపై శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. చేవెళ్ల డీసీపీ యోగేశ్గౌతం తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్లలోని సర్దార్నగర్కు చెందిన కొడెం శ్రీనివాస్ (40), సనత్నగర్లో నివాసముండే బొల్లి శివకుమార్(37) వరుసకు బావబామ్మర్దులు.శుక్రవారం తెల్లవారుజామున రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు కలిసి సనత్నగర్ నుంచి శివకుమార్కు చెందిన వ్యాగనార్ కారులో యాదగిరిగుట్ట దైవ దర్శనానికి వెళ్లారు. ఆ తర్వాత స్వర్ణగిరి ఆలయానికి వచ్చి సనత్నగర్కు తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గ మధ్యలో ఔటర్ రింగు రోడ్డుపై పెద్దగోల్కొండ–తొండుపల్లి మధ్యలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొంది.లారీ కిందకు దూసుకెళ్లిన కారు..అతి వేగంతో ఉన్న కారు లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనతో కారులో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా, ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లారీ కిందకు దూసుకెళ్లిన కారును అతి కష్టం మీద వెనక్కి తీసి అందులోని ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన కొడెం శ్వేతను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారును శివకుమార్ నడుపుతున్నట్టు గుర్తించారు.లారీ ఆగిన ఐదు నిమిషాల్లోనేచౌటుప్పల్లోని రైస్మిల్లు నుంచి నూకల లోడుతో నంద్యాలలోని లిక్కర్ ఫ్యాక్టరీకి లారీ బయలుదేరింది. ఔటర్ మీద పెద్దగోల్కొండ–తొండుపల్లి మధ్యలోకి రాగానే లారీ బ్రేక్లైనర్లు మొరాయించడంతో డ్రైవర్ శ్రీనివాస్ గమనించి రోడ్డు పక్కన నిలిపాడు. డ్రైవర్ బ్రేక్లను పరిశీలిస్తుండగా.. క్లీనర్ లారీపై ఉన్న తాడును సరి చేస్తున్నాడు. సాయంత్రం 4 గంటలకు లారీని నిలపగా, ఐదు నిమిషాల తర్వాత కారు వెనుక నుంచి వచ్చి ఢీకొన్నట్టు లారీ డ్రైవర్ శ్రీనివాస్ తెలిపాడు.మృతులు వీరే..బొల్లి శివకుమార్ (37), బొల్లి లాస్య అలియాస్ రెనికిండి రాజేశ్వరి (30) దంపతులు, వీరి కూతురు బొల్లి రిషిత (7)తో పాటు కొడెం శ్రీనివాస్(40), ఆయన కుమారులు కొడెం కృష్ణచంద్ర (13), కొడెం మాధవ్ (10) దుర్మరణం చెందగా, శ్రీనివాస్ భార్య శ్వేత (35) తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉంది. శివకుమార్కు శ్వేత సోదరి అవుతారు.⇒ బొల్లి శివకుమార్ కామారెడ్డికి చెందిన లాస్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లాస్య హైదరాబాద్లోని పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రధాన ఫుడ్ ఇన్స్పెక్టర్.⇒ కోడం శ్రీనివాస్ వేములవాడలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కాలు విరిగింది.ప్రమాద కారణాలు విశ్లేలిస్తున్నాం: డీసీపీ యోగేశ్గౌతంఘటనా స్థలాన్ని చేవెళ్ల డీసీపీ యోగేశ్గౌతం పరిశీలించారు. డ్రైవర్ అలసిపోవడంతో నిద్రలోకి జారి ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కారులో మరైదేనా సాంకేతిక సమస్యతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో పరిశీలన చేస్తున్నామన్నారు. ప్రమాదానికి గురైన కారుపై అతి వేగంతో కారు నడిపినట్టు రెండు చలాన్లు ఉన్నాయి.ఇదే ఆఖరి సెల్ఫీ..రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబ సభ్యులంతా కలిసి చివరిసారిగా స్వర్ణగిరి దేవాలయం వద్ద సెల్ఫీ దిగారు. ఇప్పుడు ఈ సెల్ఫీ వారి జీవితంలో చివరి ఫొటోగా మిగిలింది.కేటీఆర్ దిగ్భ్రాంతిఆరుగురు సిరిసిల్లవాసుల మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. తాము అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. -
టిఫిన్ తినలేం.. కాఫీ తాగలేం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వ్యాపారుల ‘పొయ్యి’పై నీళ్లు చల్లింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరతను సాకుగా చూపిస్తూ సామాన్యుడి నడ్డి సైతం విరిచే నిర్ణయం తీసుకుంది. 19 కేజీల వాణిజ్య (కమర్షియల్) సిలిండర్ ధరను ఏకంగా రూ.993 పెంచడంతో హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర రికార్డు స్థాయిలో రూ.3,315కి చేరుకుంది. హైదరాబాద్లో 19 కేజీల సిలిండర్ ధర యుద్ధానికి ముందు రూ. 2,217 ఉంటే.. మార్చి 1న (మొదటి పెంపు) రూ.2,322కు, మే 1న (తాజా పెంపు) రూ.3,315కు చేరింది.అంటే కేవలం 60 రోజుల వ్యవధిలోనే రూ.1,098 అదనపు భారం పడిందన్న మాట. ముఖ్యంగా పెరిగిన సిలిండర్ రేటు హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కన్పిస్తోంది. మార్కెట్లో నెలకొన్న గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ గ్యాస్ కంపెనీలు, కొందరు డీలర్లు..ఇప్పటికే ఒక కమర్షియల్ సిలిండర్కు బ్లాక్లో రూ.5,000 వరకు వసూలు చేస్తున్నారు.ఇప్పుడు భారీగా ధర పెరగడంతో, ఈ సాకుతో బ్లాక్లో అమ్మే రేటు కూడా భారీగా పెంచే అవకాశం ఉండటంతో పెద్ద, చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు, చిరు వ్యాపారులు, కేటరర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. రోజుకు 2 సిలిండర్లు వాడే టీ బంకులు, చిన్న హోటళ్ల యజమానులపై రోజుకు రూ.3,000 నుంచి రూ.4,000 అదనపు భారం పడుతుందని అంచనా.ఇప్పటికే మెనూలో కోత..మూతగ్యాస్ కొరత, పెరిగిన ధరతో ఇప్పటికే నగరంలోని అనేక హోటళ్లలో వంటకాల్లో కోత విధించారు. గ్యాస్ ఆదా కోసం కొన్ని వంటకాలు తగ్గించేశారు. కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. కొత్తగా పెరిగిన గ్యాస్ ధర హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ రంగాలను అతలాకుతలం చేసే అవకాశం కన్పిస్తోంది.రోజువారీ వినియోగం 65 వేల సిలిండర్లపైనేహైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో ప్రధాన చమురు సంస్ధలతో పాటు ప్రైవేటు సంస్ధలకు సంబంధించి సుమారు 8.15 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రోజుకు సుమారు 65 వేల సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు.15%–20% వరకు ధరల పెరుగుదలప్రస్తుతం ఒక్కో సిలిండర్ రీఫిల్ ధరపై రూ. 994 పెంపుతో రోజుకు రూ.6.46 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నెలకు రూ.193.8 కోట్ల భారం పడుతుందన్నమాట. ఇది హోటళ్లలో ఆహారం ధరలపై ప్రభావం చూపించడం ఖాయం. హోటళ్ల యజమానులు ఈ భారాన్ని వినియోగదారులపైనే వేస్తారు. దీంతో హోటళ్లలో ఇడ్లీ మొదలుకుని బిరియానీ వంటి ఆహార పదార్థాల ధరలు 15% నుంచి 20% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.మహా హైదరాబాద్ పరిధిలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల వినియోగం ఇలా..జిల్లా వాణిజ్య కనెక్షన్లు (సుమారు) రోజువారీ డిమాండ్ రోజువారీ అదనపు భారంహైదరాబాద్ 4,20,000 35,000 రూ. 3,47,90,000రంగారెడి 2,10,000 18,000 రూ. 1,78,92,000మేడ్చల్–మల్కాజిగిరి 1,85,000 12,000 రూ. 1,19,28,000 -
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా ఐపీఎస్ బీ.సుమతి.. కొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా ఐపీఎస్ బీ.సుమతి ఈ రోజు ( శుక్రవారం) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లోని సిటిజన్స్ యొక్క ప్రయాణ సేఫ్టీని ఇంప్రూవ్ చేయడమే తమ ప్రధాన ప్రయారిటీ అని తెలిపారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ తో నేరాలకు చెక్.. క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్ పై దృష్టిపెడతామని స్పష్టం చేశారు. .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మల్కాజ్గిరికి మొదటి మహిళ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు అత్యంత పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడమే తన ప్రథమ కర్తవ్యమని సీపీ సుమతి పేర్కొన్నారు. మల్కాజిగిరి కమిషనరేట్కు ప్రశాంతమైన ప్రాంతంగా మంచి పేరుంది. ఆ ఖ్యాతిని కాపాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.సాంకేతికతతో నేరాలకు చెక్నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తామని సీపీ తెలిపారు. AI ఆధారిత “TG QUEST” వినియోగిస్తమన్నారు. ముఖ్యంగా మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల కఠినంగా ప్రాసెస్ ఓరియెంటెడ్ & రిజల్ట్ ఓరియెంటెడ్ అప్రోచ్ తో వ్యవహరిస్తామని, బాధితులకు సమాచార పూరిత త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.మాదకద్రవ్యాల కట్టడి.. ట్రాఫిక్ క్రమబద్ధీకరణసమాజానికి పెను సవాలుగా మారిన "మాదకద్రవ్యాల (Drugs)" అక్రమ రవాణా, వినియోగంపై ప్రివెన్షన్, డిటెక్షన్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ పై దృష్టి పెడతామనీ ఆమె హెచ్చరించారు. యువత మత్తుకు బానిస కాకుండా AI ఆధారిత నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు."మహిళా పోలీస్ కమిషనర్గా నన్ను నియమించిన ప్రభుత్వానికి, సహకరించిన డీజీపీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకతతో మా టీమ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆమె అన్నారు. -
శంషాబాద్ ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
సాక్షి,హైదరాబాద్: శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్-16 ఎగ్జిట్ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. మృతులు సిరిసిల్ల పట్టణానికి చెందినవారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఒకే కుటుంబసభ్యులు యాదగిరి గుట్ట నుంచి వస్తుండగా శంషాబాద్ వైపు వెళ్తున్న కారు (నంబర్ TS 23 F 2298) అతివేగంగా లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోయింది.కారులో మొత్తం ఏడుగురు ప్రయాణికులున్నారు. ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ప్రయాణికుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. -
ఆరుగురితో కాదు 36 మందితో చాటింగ్.. సీతారాం పెన్ డ్రైవ్ లో సంచలనాలు..
-
డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సీవీ ఆనంద్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, పండితుల ఆశీర్వచనాలతో ఆయనను కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం ఇతర ఐపీఎస్ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమానికి సీవీ ఆనంద్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తానన్నారు.సీవీ ఆనంద్ నేపథ్యంఐపీఎస్ 1991 బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్.. నక్సలైట్ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా, ట్రాఫిక్ కమిషనర్గా, సైబరాబాద్ కమిషనర్గా, అలాగే హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విస్తృతమైన సేవా అనుభవం ఉంది.తన సర్వీస్ ఆరంభంలోనే వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేసిన ఆయన నక్సలైట్ మావోయిస్టు సమస్యను ఎదుర్కొన్నారు. ఆయుధ సరఫరా గొలుసును అడ్డుకోవడంలో, యువతను నక్సలైట్ ప్రభావం నుంచి దూరం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దానితో పాటు పోలీసుశాఖలో మరెన్నో కీలక పదవులు అధిరోహించారు.ప్రముఖ పదవులుకమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ట్రాఫిక్ కమిషనర్, హైదరాబాద్ (ఇక్కడే డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రారంభించారు)డైరెక్టర్ జనరల్, యాంటీ-కరప్షన్ బ్యూరోస్పెషల్ చీఫ్ సెక్రటరీ, హోం శాఖ సంస్కరణలు-ఆవిష్కరణలుఈ-చలాన్, స్పీడ్ గన్స్, రివర్సిబుల్ లేన్లు, "ఫ్రీ లెఫ్ట్" వంటి పద్ధతులు ప్రవేశపెట్టారు.సైబరాబాద్లో సీసీటీవీ, ఐటీ ఆధారిత పోలీసింగ్, షీ టీమ్స్, షీ షటిల్స్ వంటి మహిళా భద్రతా కార్యక్రమాలు ప్రారంభించారు.పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS): ఆధార్ ఆధారిత రేషన్ వ్యవస్థ, GPS ట్రాకింగ్, ఆన్లైన్ చెల్లింపులు ప్రవేశపెట్టి రాష్ట్రానికి ₹2000 కోట్లు ఆదా చేశారు.అవార్డులుపోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్తెలంగాణ స్టేట్ ఎక్సలెన్స్ అవార్డు -
హైదరాబాద్ లో మంచు వర్షం.. భారీ విపత్తు రాబోతోందా..!
-
దారి తప్పిన భార్య.. ముగ్గురితో వివాహేతర సంబంధం
-
గిగ్ వర్కర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త
కార్మికుల దినోత్సవం సందర్భంగా.. గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించబోతోంది. గిగ్ సెక్టార్లో ఉద్యోగ భద్రత కోసం తెచ్చిన తెలంగాణ ఫ్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ లేబర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్) బిల్లు 2026 చట్టరూపం దాల్చింది. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ చారిత్రక బిల్లుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. మే 1న తెలంగాణ గిగ్ వర్కర్ల చట్టం గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే చట్టానికి సంబంధించిన గైడ్లైన్స్పై స్పష్టతకు మరో రెండు వారాల టైం పట్టొచ్చు. తాజా పరిణామంతో గిగ్ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిగ్ వర్కర్ అసోషియేషన్లు రేవంత్ సర్కార్కు కృతజ్ఞతలు తెలియజేశాయి. ఒక అంచనా ప్రకారం.. తెలంగాణలో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు.. ఇలా సుమారు ఐదు లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం వాళ్లందరికీ పని భద్రత(గిగ్ వర్కర్లను రిజిస్టర్ చేయడం, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు), ప్రమాద, ఆరోగ్య బీమా, ఇతర సామాజిక భద్రతా పథకాలు వర్తింపు ఇలా సమగ్ర రక్షణ కల్పిస్తుంది. అయితే.. ఈ చట్టంలో కొన్ని అంశాలపై ప్లాట్ఫారమ్ కంపెనీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదు. గిగ్ వర్కర్ల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా కనీస వేతనాన్ని నిర్ణయించడం, ప్లాట్ఫామ్ కంపెనీలు వచ్చే ఆదాయంలో కనీసం 50% వాటాను వర్కర్లకు ఇవ్వాలని నిబంధనలతో పాటు ఇక మీదట సరైన కారణం లేకుండా వర్కర్లను పనిలో నుంచి తొలగించడం కుదరదని తెలంగాణ గిగ్ వర్కర్ల చట్టం చెబుతోంది. అలాగే గిగ్ వర్కర్లను కూడా గ్రాట్యుటీ, కాంట్రాక్ట్ రక్షణ కల్పించేలా నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిబంధనలకు కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. దేశంలో గిగ్ వర్కర్ల కోసం చట్టం చేసిన రెండో రాష్ట్రం తెలంగాణ నిలవనుంది. గతంలో రాజస్థాన్ గిగ్ వర్కర్ల కోసం ఈ తరహా చట్టం(రాజస్థాన్ ఫ్లాట్ఫారమ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (Registration and Welfare) యాక్ట్ 2023 తెచ్చింది. ఈ చట్టానికి అదే ఏడాది జులైలో శాసనసభ ఆమోదం కూడా తెలిపింది. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసినా.. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఫలితం లేకపోయింది. ఇప్పటికీ ఆ చట్టం అమల్లోకి రాకపోవడంతో అక్కడ లక్షలాది మంది గిగ్ వర్కర్లు ఆర్థిక, సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. -
మెట్రో రెండోదశకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైల్ మొదటిదశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో రెండోదశ విస్తరణకు లైన్ క్లియర్ అయింది. ఏడాది క్రితమే రెండోదశ కోసం ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రూపొందించి కేంద్రానికి అందజేసింది. అయితే సాంకేతిక చిక్కుముళ్లను దృష్టిలో ఉంచుకొని కేంద్రం అనుమతిని నిరాకరించింది. మొదటిదశ ప్రాజెక్టు ఎల్అండ్ టీ సంస్థ నిర్వహణలో ఉండగా, రెండోదశను ప్రభుత్వం నిరి్మస్తే మొదటి, రెండోదశ రైళ్ల నిర్వహణల మధ్య సమన్వయం కొరవడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం..ఎల్అండ్ టీ సంస్థ నుంచి మెట్రో మొదటి దశను టేకోవర్ చేసింది. దీంతో రెండో దశకు కేంద్రం నుంచి త్వరలోనే ఆమోదం లభించే అవకాశం ఉందన్నారు.దశలవారీగా విస్తరణ..రెండో దశలో మొత్తం 8 కారిడార్లలో మెట్రో విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. మొదటి దశలో నాగోల్ నుంచి రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు (36.8 కి.మీ.) రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు(11.6 కి.మీ.), ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు (7.5 కి.మీ.), మియూపూర్–పటాన్చెరు(13.4 కి.మీ.), ఎల్బీనగర్–హయత్నగర్ (7.1 కి.మీ.) చొప్పున మొత్తం 76.4 కి.మీ. వరకు నిర్మించనున్నారు. ఆ తరువాత రెండోదశలో ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్సిటీ వరకు (39.6 కి.మీ.), జేబీఎస్–మేడ్చల్ వరకు (22 కి.మీ.), జేబీఎస్–శామీపేర్పేట్ వరకు(22 కి.మీ.) చొప్పున మరో 86.1 కి.మీ., నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేశారు.పాతబస్తీలో మొదటగా... మెట్రో రెండోదశకు వివిధ కారిడార్లలో భూసేకరణ, ఇతర మౌలిక సదుపాయాలపై హెచ్ఎంఆర్ఎల్ ఇప్పటికే దృష్టి సారించింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదిత 7.5 కి.మీ. మార్గంలో రహదారుల విస్తరణతోపాటు ఆస్తుల సేకరణ చేపట్టింది. ప్రస్తుతం ఇది తుదిదశలో ఉంది. కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే మొదట ఈ మార్గంలో నిర్మాణం చేపడతారు. -
హైదరాబాద్లోని 2 ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు
హైదరాబాద్: నగరంలోని 2 ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. నారాయణగూడ వైఎంసీఏ దగ్గర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద రెండు ఆటోలు దగ్ధమయ్యాయి. ఆటోలో గ్యాస్ ఫిల్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ఆటోకు కూడా మంటలు అంటుకుని అది దగ్ధమైంది. మంటలను సిబ్బంది అదుపు చేశారు. పెట్రోల్ బంక్ సిబ్బంది ఒకరికి గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.మరోవైపు, పాతబస్తీ బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జూ పార్క్ సమీపంలో ఉన్న తాడ్బన్లోని స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. -
వేసవి క్రీడా చార్జీలు ‘హైజంప్’!
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల్లో స్విమ్మింగ్, బాస్కెట్ బాల్ లాంటి క్రీడలు నేర్చుకోవడానికి హైదరాబాద్లో సమ్మర్ క్యాంపుల బాటపట్టే విద్యార్థులపై జీహెచ్ఎంసీ తోపాటు సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొ రేషన్లు చార్జీల భారం మోపాయి. కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని స్టేడియాలు, ప్లేగ్రౌండ్లలో సమ్మర్ కోచింగ్లకు యూజర్ ఫీజులు పెంచాయి. గతంలో బేస్బాల్, బాక్సింగ్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ వంటివి ఆడుకోవడానికి రూ. 50గా ఉన్న నెలవారీ ఫీజును రూ. 200 చేశాయి. సైక్లింగ్, క్యారమ్స్, చెస్, ఫెన్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, క్రికెట్, కిక్ బాక్సింగ్, తైక్వాండో, టెన్నికాయిట్ తదితర ఇన్డోర్/ఔట్డోర్ గేమ్స్పైనా ఫీజులు పెంచాయి.క్రికెట్ ఫీజును రూ. 100 నుంచి రూ. 400కు పెంచగా జిమ్ ఫీజు రూ. 200 నుంచి రూ. 400కు, లాన్ టెన్నిస్ (క్లే) ఫీజు రూ. 450 నుంచి రూ. 1,500కు పెంచేశాయి. వాటన్నింటికీ ఏడాదికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100గా నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా కార్పొరేషన్ల స్టాండింగ్ కమిటీలు ఫీజుల పెంపునకు ఆమోదం తెలిపాయి. అయితే సమ్మర్ క్యాంపుల్లో 16 ఏళ్లలోపు విద్యార్థులకు ఈ ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇచ్చాయి. పాఠశాల విద్యార్థులకూ భారం: పాఠశాలల విద్యార్థులు ప్లేగ్రౌండ్లు బుక్ చేసుకోవడంపైనా ఫీజుల భారం పెరిగింది. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 500 నుంచి రూ. 1,000కి పెరగడంతోపాటు విస్తీర్ణాన్ని బట్టి గ్రౌండ్ల ఫీజులు పెరిగాయి. 500 చదరపు మీటర్ల విస్తీర్ణమున్న ప్లేగ్రౌండ్ను ఒక విద్యా సంవత్సరంలో 11 నెలల్లో 75 గంటలపాటు వినియోగించుకోవడానికి రూ. 10 వేలుగా ఉన్న ఫీజును మూడు రేట్లతో రూ. 15 వేలు చేశారు. అదే గ్రౌండ్ను 150 గంటలు వాడేందుకు రూ. 20 వేలుగా ఉన్న ఫీజును రూ. 30 వేలకు పెంచారు.వెయ్యి చదరపు మీటర్ల గ్రౌండ్ను 11 నెలల్లో 150 గంటలు వాడుకోవడానికి రూ. 40 వేలుగా ఉన్న ఫీజును రూ. 60 వేలు చేశారు. మరోవైపు వ్యక్తులు లేదా కార్పొరేట్ సంస్థలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకపూట ఆయా గ్రౌండ్లను వినియోగించుకునేందుకు ప్రస్తుతమున్న రూ. 4 వేల ఫీజును రూ. 6 వేలకు, రోజు ఫీజు (ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు) రూ. 7,500 నుంచి రూ. 11,000కు పెంచారు. వాలీబాల్ కోర్టు ఒకపూట ఫీజును రూ. 4 వేల నుంచి రూ. 6 వేలకు, క్రికెట్ నెట్ ఫీజును రూ. 100 నుంచి రూ. 200కు, బాస్కెట్బాల్ కోర్టు రోజు ఫీజును రూ. 7500 నుంచి రూ. 11,000కు పెంచారు. -
మంగ్లీ తమ్ముడి అకౌంట్ ఫ్రీజ్.. బయటపడ్డ షాకింగ్ నిజాలు
-
భార్య ఎఫైర్లు, ప్రైవేట్ వీడియోలు : టెకీ ఆత్మహత్యకేసులో కీలక పరిణామం
ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీతారాం సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేసిన పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.సంచలనం రేపిన ఈ కేసులో సీతారం భార్య రేణుక వివాహేతర సంబంధాలు, ప్రైవేట్ వీడియోలు బయటపడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీతారాం 19 పేజీల సూసైడ్ నోట్ రాసి ట్యాంక్బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో రేణుకతో పాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త లెటర్టెకీ సీతారాం తన లేఖలో ప్రస్తావించిన విషయాలు సంచలనంగా మారాయి.. ‘‘నా భార్య రేణుకకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ.. ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. అంతేకాకుండా.. ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసుకుంది. వాటిన ఓ లవర్ దానిని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఇది చూసి ఎలా తట్టుకోగలగాలి.. రేణుకకు అసలు ఏం కావాలి?’’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోలు అవి చూశాకే నా భార్య నిజస్వరూపం తెలిసింది. ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది. తాను ఎంత నచ్చజెప్పినా ఆమెలో మార్పు రాలేదని, పైగా చచ్చిపోతానని బెదిరింపులు’’ అంటూ సూసైడ్ లెటర్లో సీతారాం ఆవేదన వ్యక్తంచేశాడు. అంతేకాదు తాను నెలకు రూ.2 లక్షల జీతం సంపాదిస్తూ కుటుంబాన్ని చాలా బాగా చూసుకున్నానని, అయినప్పటికీ భార్య తనకు తెలియకుండా ఇలా సంబంధాలు పెట్టుకోవడం తట్టుకోలేకపోయానంటూ వాపోయాడు. చివరికి అతను ప్రాణం తీసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిపోయారు.కాగా ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగాల రీత్యా బాచుపల్లిలో నివాసం ఉండేవారు. ఈ క్రమంలో కాపురంలో కలతలు, భార్య వివాహేతర సంబంధాలు,ఇన్స్టాలో వీడియోలు బయటపడటంతో గత ఫిబ్రవరిలో ట్యాంక్బండ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని.. కేసీఆర్ సీఎంగా ఉంటే ఢిల్లీ మెడలు వంచే వారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసు అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ చేయాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఇరికించాలని రెండో సిట్ వేశారు’’ అంటూ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.‘‘ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా దేశ భద్రత కోసం జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ట్యాపింగ్ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతుంది. 350 మంది సాక్షులను విచారించి ఇప్పటి వరకు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. ప్రభాకర్రావును 18 రోజులు జైల్లో కరుడుగట్టిన నేరస్తుడిలా ట్రీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఛార్జ్ షీట్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు పెట్టాలని అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు. సంధ్య శ్రీధర్ రావుపై 26 కేసులు ఉన్నాయి. అతనితో ఎమ్మెల్సీ నవీన్రావు పేరు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీనియర్ జర్నలిస్టును ఇరికించి అతను సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ వేస్తే హరీష్ రావు పేరు చెప్తారా లేదా అని బెదిరిస్తున్నారు..కేసీఆర్ ఇంటి గోడలపై నోటీసులు అంటించి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది రహస్యంగా ఉంటుంది. బాధ్యత లేని హోంమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పోలీసు డిపార్ట్మెంట్ బలైంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తప్పులు చేస్తున్నారు. ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్పై అక్రమ కేసు మోపినందుకు విచారణ చేసిన వాళ్లను కోర్టు దోషులుగా ప్రకటించింది. క్రిశాంక్పై కేసు పెట్టి జైలుకు పంపారు.కేటీఆర్, హరీష్ రావు ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. బెంగుళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకువచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. దీనిపై సిట్ వేసి విచారణ జరపాలి. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు డైరెక్టర్లుగా ఉన్నారు. ఐపీఎస్ అధికారులు సీఎం ఆదేశాలను పాటించవద్దు. కేసులను దైర్యంగా ఎదుర్కొంటాము. గతంలో నాకు యాపిల్ ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్ను సెంట్రల్ క్రైం పోలీసులకు ఇచ్చాను’’ అని ప్రవీణ్కుమార్ తెలిపారు. -
Big Update: ప్రభుత్వ ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
-
గాంధీభవన్ ముందు భిక్షాటన.. ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తెలంగాణ ఉద్యమకారులు గురువారం మెరుపు నిరసనకు దిగారు. అయితే అప్రమత్తమైన పోలీసులు వాళ్లను లోపలికి చోచ్చుకుని పోకుండా నిలువరించగలిగారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని.. తాము అధికారంలోకి రాగానే తప్పకుండా న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లైనా ఇప్పటిదాకా ఆ హామీని నెరవేర్చలేదని చెబుతూ ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. గాంధీ భవన్ వద్ద గురువారం చిప్పలు చేతబట్టి తెలంగాణ ఉద్యమకారులు భిక్షాటన ద్వారా నిరసన చేపట్టారు. వాళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. -
కిషన్ రెడ్డికి లేఖ రాయాలని తెలంగాణ సర్కారు నిర్ణయం
హైదరాబాద్: ఇరిగేషన్ శాఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణ కార్యాచరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మిస్తే 100 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని నిపుణులు వెల్లడించారు. ముంపు ప్రభావం తక్కువగా ఉండేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరపాలని సీఎం ఆదేశించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఇప్పటికే 11 వేల కోట్లు ఖర్చు చేశామని, 71.5 కిలోమీటర్ల మేర కాలువల పనులు పూర్తయ్యాయని సమీక్షలో చర్చించారు. 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్కు నీటిని తరలించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలో ఎక్కడైనా ముంపు వాటిల్లితే పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని నిర్ణయించారు. రేపు కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ప్రత్యక్షంగా చర్చించాలని మంత్రి ఉత్తమ్ కుమార్కు సీఎం సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన జియో టెస్టింగ్ పనులను వర్షాల కంటే ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ బ్యారేజ్ పూర్తయితే ఆదిలాబాద్తో పాటు తెలంగాణలోని మెట్ట ప్రాంత రైతులకు సాగు, తాగునీరు అందుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
మెట్రోను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఎల్అండ్టీ సంస్థతో షేర్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. ఎల్ అండ్ టీ నుంచి రూ.1,461.47 కోట్లకు 100% షేర్లను స్వాధీనం చేసుకుంది, దీంతో ఫేజ్-I, ఫేజ్-II విస్తరణ, సేవల సమన్వయం మెరుగుపడనుంది. దీంతో ఇప్పుటి నుంచి మెట్రో నిర్వహణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది. కాగా మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇదివరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్గా హైదరాబాద్’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ను ‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)ను కేవలం ‘బ్యాక్ ఆఫీస్’ ఆపరేషన్లకే పరిమితం కాకుండా... స్ట్రాటెజిక్ ఇన్నోవేషన్స్, హై వాల్యూ ప్రొడక్టివిటీకి కేంద్రాలైన గ్లోబల్ వాల్యూ సెంటర్లు(జీవీసీ)గా మార్చేలా కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్ను సిద్ధం చేస్తున్నామన్నారు.ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రూయింగ్ కంపెనీ హైనెకెన్(HEINEKEN) నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ‘హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా’ పేరిట 76వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన జీసీసీని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... హైనెకెన్ లాంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్ను ఎంచుకోవడం ఇక్కడి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, రెడీ టూ కొలాబరేట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలకు, పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమన్నారు.హైదరాబాద్ను కేవలం ఐటీ డెస్టినేషన్గా కాకుండా, ప్రపంచ శ్రేణి వ్యాపార పరిష్కారాలకూ చిరునామాగా మారుతోందన్నారు. అంతర్జాతీయ ఐటీ దిగ్గజాల మొదలు... మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్యూమర్ గూడ్స్ కంపెనీల వరకు తమ వ్యూహాత్మక కేంద్రాల ఏర్పాటు కోసం హైదరాబాద్నే మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నాయన్నారు. ఆ జాబితాలో 150 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హైనెకెన్ కూడా చేరడం వల్ల ప్రపంచ పటంలో ‘తెలంగాణ బ్రాండ్’ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. మరిన్ని అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించేలా ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’, ఇన్నోవేషన్ ఎకో సిస్టం బలోపేతంపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు.తెలంగాణను కేవలం ఒక ఉత్పాదక కేంద్రంగానే కాకుండా, గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీలో కీలక భాగస్వామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. తాజాగా ప్రారంభమైన హైనెకెన్ జీసీసీ... ఫైనాన్స్, డిజిటల్, టెక్నాలజీ, అనలిటిక్స్ రంగాల్లో గ్లోబల్ సర్వీసులను అందించే ఒక స్ట్రాటజిక్ సెంటర్ గా పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం 300 మందికి పైగా నిపుణులకు ఇక్కడ ఉపాధి లభిస్తుందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 1600కు చేరుకుంటుందన్నారు.హైనెకెన్ స్ఫూర్తితో తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైనెకెన్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్/సీఎఫ్ వో హెరాల్డ్ వాన్ డెన్ బ్రోక్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ యోలాండా తలామో, చీఫ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ రోనాల్డ్ డెన్ ఎల్జెన్, హేనెకెన్ బిజినెస్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ ఆకోస్ మగ్యారీ, యూబీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ గుప్తా, చీఫ్ కార్పోరేట్ అఫైర్స్ ఆఫీసర్ గరీమా సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాకీల మంచి మనసు.. నిరాశ్రయులకు ఆశ్రయం
సాక్షి,హైదరాబాద్: పోలీసులంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా సామాజిక బాధ్యతలోనూ ముందుంటారని చాదర్ఘాట్ పోలీసులు నిరూపించారు. రోడ్డు పక్కన నిరాశ్రయులుగా పడి ఉన్న ఐదుగురు వ్యక్తులను గుర్తించి, వారికి తగిన ఆశ్రయం కల్పించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం (29.04.2026) ఉదయం సుమారు 11:00 గంటల సమయంలో మలక్పేట్ గంజ్ మార్కెట్ సమీపంలోని ఫుట్పాత్పై కొందరు అపరిచిత వ్యక్తులు నివాసం ఉంటున్నట్లు చాదర్ఘాట్ పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని ఐదుగురు వ్యక్తులను గుర్తించారు. వారి వివరాలు.. వేణుగోపాల్ (46 సం),నరసింహ (60 సం),కృష్ణ (70 సం),భరత్ ఛెత్రి (35సం),అనిల్ (35 సం)లుగా గుర్తించారు.తీవ్రమైన ఎండలో, సరైన ఆహారం, వసతి మరియు ఆదరణ లేక ఇబ్బంది పడుతున్న వీరిని చూసి చలించిన పోలీసులు, మానవతా దృక్పథంతో తక్షణ సహాయం అందించారు. వారి గౌరవానికి భంగం కలగకుండా, సురక్షితమైన సంరక్షణ కోసం ఐదుగురిని నగరంలోని ఒక షెల్టర్ హోమ్కు తరలించారు. అక్కడ వారికి అవసరమైన వసతి మరియు వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. పోలీసుల ఈ చొరవను స్థానిక ప్రజలతో పాటు స్వచ్ఛంద సంస్థలు అభినందించాయి. ఖాకీల మంచి మనసుపై ప్రశంసలు కురిపించాయి. -
పదో తరగతి ఫలితాలు విడుదల..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం (ఏప్రిల్29) ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ నవీన్ నికోలస్లు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. టెన్త్ ఫలితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈసారి ఫలితాల్లో కేవలం గ్రేడ్స్ కాకుండా మార్కులను కూడా ఫలితాల్లో వెల్లడించనున్నారు.👉 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. ఇక, తెలంగాణలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు జరిగాయి. 5.17 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మరో 10 వేల మంది ప్రైవేటు విద్యార్థులున్నారు. నెలరోజుల పాటు పరీక్షలు జరిగాయి. విద్యార్థులు ఫలితాలను 8096958096 వాట్సాప్ ద్వారా నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. 👉 sakshieducation.com👉 https://results.bsetelangana.org👉 https://results.bse.telangana.gov.in👉 https://bse.telangana.gov.in👉 https://schooledu.telangana.gov.in పదవ తరగతి పరీక్షా ఫలితాల వివరాలు ఉత్తీర్ణత శాతం -95.15శాతంబాలురు - 94.07శాతంబాలికలు -96.26 శాతం100శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు -57310 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు -0699.30 శాతంతో ములుగు జిల్లా ఫస్ట్.89.23శాతంతో హైదరాబాద్ లాస్ట్సంక్షేమ పాఠశాలల్లో ఉత్తీర్ణత -99.10శాతంప్రభుత్వ పాఠశాలల్లో 86.18శాతంజిల్లా పరిషత్ పాఠశాల్లో 93.53శాతంమోడల్ స్కూల్స్లో 97.83శాతంకేజీబీవీల్లో 98శాతంప్రైవేట్ పాఠశాలాల్లో 95.81శాతంతో పాస్2065 జిల్లా పరిషత్ పాఠశాలల్లో 100శాతం పాస్ పర్సెంటేజ్మార్కుల రీ కౌంటింగ్ ,రీ వెరిఫికేషన్ ఈనెల 30 నుంచి మే 14 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు అధికారులుపదవతరగతి సప్లిమెంటరీ ..జూన్ 5 నుంచి 12 వరకు నిర్వాహాణ.ఈనెల 30 నుంచి మే 16 తేదీ లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. -
మూసివేసిన రేషన్ షాపులను తెరిపించండి
ఉప్పల్: ఉప్పల్ వివిధ కారణాలతో సర్కిల్–2 పరిధిలో మూసివేసిన రేషన్ షాపులను మళ్లీ తెరిపించాలని కోరుతూ మంగళవారం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి మందుముల పరమేశ్వర్రెడ్డి కలెక్టర్ మనుచౌదరిని కోరారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలు రేషన్షాపులను మూసి వేయించడంతో ఆయా ప్రాంత వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మూసివేసిన రేషన్షాపులను తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా పేదలు, రోజువారీ కూలీలు, వృద్ధులు, దివ్యాంగులు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆగంరెడ్డి, పూజారి హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. -
పసిడి ధరలు: నిన్న ఊహించని పతనం.. నేడు ఇలా..
బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. దేశంలో క్రితం రోజున భారీగా పతనమైన పసిడి ధరలు నేడు పుంజుకున్నాయి. మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. నాలుగు రోజుల తర్వాత మళ్లీ బంగారం రేట్లు పెరగడంతో కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. ఇక వెండి ధరలు స్థిరంగా కొనసాగడం కొంత ఊరట కలిగించే విషయం. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate) , వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో ఈ కింద తెలుసుకుందాం.. -
అత్తకు భారీ షాక్.. ఐదేండ్లు జైలు శిక్ష..!
హైదరాబాద్: గృహ హింస కేసులో భర్తకు 5 ఏండ్లు, అత్తకు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.1 లక్ష జరిమానా విధిస్తూ మంగళవారం నాంపల్లిలోని మనోరంజన్లో ఉన్న 15వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజి్రస్టేట్ కోర్టు జడ్జి డి.అజయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనితాదేశ్ముఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని పహాడిషరీఫ్కు చెందిన షభాన బేగంను అక్టోబర్ 10, 2014న చాంద్రాయణ గుట్టకు చెందిన అన్వర్పాషా వివాహం చేసుకున్నాడు. వరకట్నం కింద రూ.60 వేలు, 10 తులాల బంగారం, 30 తులాల వెండీ, రూ.5 లక్షల విలువైన వస్తువులను ఇచ్చారు. కొద్దికాలం అనంతరం అదనపు కట్నం తేవాలని భర్త, అత్త వేధింపులతో రూ.2 లక్షలు ఇచ్చారు. మళ్లీ వేధింపులకు గురిచేయడంతో ఆగష్టు 20, 2015లో రాజేంద్రనగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై ఎసై బాలునాయక్, ఎన్.శ్రేయ విచారణ చేపట్టి పూర్తి సమాచారంతో చార్జిషిట్ను కోర్టులో అందజేశారు. బాధితురాలి తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనితాదేశ్ముఖ్ కోర్టులో వాదనలు వినిపించారు. విచారణ చేపట్టిన 15వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజి్రస్టేట్ కోర్టు ఏపీపీ వాదనలను ఏకీభవిస్తూ నిందితులిద్దరికి శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ను పట్టుకున్నారు. సుమారు రూ. 2.15 కోట్ల విలువ చేసే డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి వద్ద నుంచే ఈ డ్రగ్స్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చిన సదరు వ్యక్తి హైడ్రోపోనిక్ గంజాయితో పట్టుబడ్డాడు. 6.15 కిలోల ఈ హైడ్రోఫోనిక్ గంజాయి విలువ రూ. 2. 15 కోట్ల వరకూ ఉంటుందట. ఎయిర్ ఆసియా విమానంలో బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడు దీన్ని 16 సీల్డ్ ప్యాకెట్లలో దాచిపెట్టి తెచ్చాడు. అంతకుముందు ఏప్రిల్ 2వ తేదీన కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. అది కూడా బ్యాంకాక్ నుంచే వచ్చింది. 25 కిలోల 45 గ్రాముల హైడ్రోఫోనిక్ గంజాయి తీసుకువచ్చారు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.8.9 కోట్లు. -
తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఐపీఎస్ సీవీ ఆనంద్ను రాష్ట్ర డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బదిలీ చేసింది.దీంతో హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. యూపీఎస్సీ కమిటీ సిఫార్సుల మేరకు నియామకం జరిగింది. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఐపీఎస్ 1991 బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్.. నక్సలైట్ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవం, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా, ట్రాఫిక్ కమిషనర్గా, సైబరాబాద్ కమిషనర్గా, అలాగే హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విస్తృతమైన సేవా అనుభవం ఉంది. తన సర్వీస్ ఆరంభంలో వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేసిన ఆయన నక్సలైట్ మావోయిస్టు సమస్యను ఎదుర్కొన్నారు. ఆయుధ సరఫరా గొలుసును అడ్డుకోవడంలో, యువతను నక్సలైట్ ప్రభావం నుంచి దూరం చేయడంలో కీలక పాత్ర పోషించారు.ప్రముఖ పదవులుకమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ట్రాఫిక్ కమిషనర్, హైదరాబాద్ (ఇక్కడే డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రారంభించారు)డైరెక్టర్ జనరల్, యాంటీ-కరప్షన్ బ్యూరోస్పెషల్ చీఫ్ సెక్రటరీ, హోం శాఖ సంస్కరణలు-ఆవిష్కరణలు ఈ-చలాన్, స్పీడ్ గన్స్, రివర్సిబుల్ లేన్లు, "ఫ్రీ లెఫ్ట్" వంటి పద్ధతులు ప్రవేశపెట్టారు.సైబరాబాద్లో సీసీటీవీ, ఐటీ ఆధారిత పోలీసింగ్, షీ టీమ్స్, షీ షటిల్స్ వంటి మహిళా భద్రతా కార్యక్రమాలు ప్రారంభించారు.పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS): ఆధార్ ఆధారిత రేషన్ వ్యవస్థ, GPS ట్రాకింగ్, ఆన్లైన్ చెల్లింపులు ప్రవేశపెట్టి రాష్ట్రానికి ₹2000 కోట్లు ఆదా చేశారు. అవార్డులుపోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్డ్ సర్వీస్పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్టెలంగాణ స్టేట్ ఎక్సలెన్స్ అవార్డు -
జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 కార్పొరేషన్ల ఏర్పాటులో కీలకపాత్ర
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్గా గత సంవత్సరం ఏప్రిల్ 29న ఆర్వీ కర్ణన్ బాధ్యతలు చేపట్టారు. నేటికి ఏడాది పూర్తవుతోంది. జీహెచ్ఎంసీ వంటి పెద్ద కార్పొరేషన్లో ఏడాది కాలం అంటే స్వల్ప సమయమే. కొత్తగా బాధ్యతలు చేపట్టే ఎవరికైనా జీహెచ్ఎంసీ పాలనవ్యవస్థ, వివిధ విభాగాలు, అర్థం చేసుకునేందుకే ఎంతలేదన్నా ఆర్నెళ్లు పడుతుంది. అందుకే గతంలో కనీసం ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఉన్న సీనియర్లనే జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమించేవారు కాగా, ఆ పరిస్థితి మారింది. ఓవైపు కమిషనర్గా రెగ్యులర్ బాధ్యతలతో పాటు కర్ణన్కు మిగతా వారికంటే అదనపు బాధ్యతలు వచ్చిపడ్డాయి.వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది 150 వార్డుల నుంచి 27 స్థానిక సంస్థల విలీనంతో జీహెచ్ఎంసీ పరిధి 300 వార్డులకు, పరిధి సైతం మూడురెట్లు పెరిగింది. రాజకీయంగా బలమైన ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ, ఎలాంటి రాద్ధాంతాలు, వివాదాలకు తావులేకుండా ఈ రెండు పనుల్ని అతి స్వల్ప సమయంలో విజయవంతంగా పూర్తిచేశారు. బహుశా దాన్ని దృష్టిలో ఉంచుకొనే జనగణన కార్యక్రమానికి సైతం క్యూర్ వరకు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా నియమించారు. అన్ని పార్టీలకూ ఎంతో కీలకంగా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను జిల్లా ఎన్నికల అధికారిగా ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించారు. ‘నగదు’ లేకుండా పనులు బల్దియా పరిపాలనలో ఎన్నో సంస్కరణలు చేపట్టినప్పటికీ, ప్రముఖంగా చెప్పుకోవాల్సింది నగదు రహిత సేవలు. ఆస్తిపన్ను చెల్లింపుల నుంచి మొదలు పెడితే జీహెచ్ఎంసీలో అన్ని సేవలకు ఫీజుల చెల్లింపులకు ఆన్లైన్లో సదుపాయం కల్పించారు. రెండు అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అవినీతికి తావులేకుండా పారదర్శక చెల్లింపులు. ఆయా అవసరాల కోసం ప్రజలు జీహెచ్ఎంసీ కార్యాలయాల దాకా రాకుండా సదుపాయం.డిజిటల్ వినియోగంపై ఎక్కువ శ్రద్ధ చూపారు. ప్రజలు తమ సమస్యల్ని ఫిర్యాదు చేసేందుకు సైతం క్యూఆర్ కోడ్ వినియోగం వంటివాటితో సాంకేతికతతో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వివిధ సర్వేల ద్వారా పన్ను పెంచకుండానే జీహెచ్ఎంసీ ఆదాయం పెరిగేలా చేయడంతో పాటు వసూళ్లపైనా ప్రత్యేక దృష్టి సారించి గత రికార్డుల్ని బ్రేక్ చేశారు. క్యూర్ వరకు వరద సమస్యల పరిష్కారానికి మాస్టర్ప్లాన్, వీధిదీపాల సమస్యల పరిష్కారానికి సర్వే, తదితరమైన వాటిని చేపట్టారు. ఏఎంఓహెచ్ల విధులు మార్చారు.వీటిపై దృష్టి పెట్టాలి..నాలాలు, రోడ్లు, వీధిదీపాలు, రోడ్లపై చెత్త, అవినీతి వంటి సమస్యల్ని మాత్రం కర్ణన్ పూర్తిగా పరిష్కరించలేకపోయారు. దీర్ఘకాలంగా ఉన్నవాటి పరిష్కారానికి సమయం పట్టనుంది. ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో చూపిన శ్రద్ధ ఏటీఆర్లపై చూపలేదనే ఆరోపణలున్నాయి. ‘సర్’పై సమీక్ష ఓటరు జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమం పురోగతిపై జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు పాల్గొన్న ఈ సమావేశంలో సర్ మ్యాపింగ్ పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక్కో బీఎల్ఓ రోజుకు వంద మంది ఓటర్లను, ఒక్కో సూపర్వైజర్ రోజుకు వెయ్యి మంది ఓటర్లను మ్యాప్ చేయాలనే లక్ష్యాన్ని నిర్ధారించారు. మే 5వ తేదీలోపు మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.హెల్ప్డెస్క్ ఏర్పాటు ఓటర్లకు సర్ గురించి అవగాహన కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హెల్ప్డెస్క్ (Help Desk) ఏర్పాటు చేశారు. అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఇక్కడ వివరిస్తారు.చదవండి: సీఎం వస్తున్నారని ట్రాఫిక్ నిలిపివేత.. హారన్ల మోత -
పెట్రోల్, డీజిల్ కొరత.. స్టీఫెన్ రవీంద్ర క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు పెరుగుతాయనే అపోహలు ప్రజల్లో ఉన్నాయి. సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మకండి. ఇంధనం ఎంత అవసరమో అంతే కొనుగోలు చేయండి అని వాహనదారులకు సూచించారు.తెలంగాణ సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఎక్కడ పెట్రోల్, డీజిల్ కొరత లేదు. పబ్లిక్ ఆందోళన వల్లే ఈ కొరత ఏర్పడింది. ఒక రోజుకు 13వేల కిలో లీటర్ల సప్లై చేసేది.. నిన్న ఒక్క రోజే 30వేల కిలో లీటర్ల సరఫరా చేశాం. పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ నో స్టాక్ పెట్టిన, రోజువారీ కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. ఎల్పీజీ, సీఎన్జీ, పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆన్లైన్లో మానిటరింగ్ చేస్తున్నారు. ధరలు పెరుగుతాయని భయంతో ప్రజలు ఇలా చేస్తున్నారు.దాదాపు 70, 80 రోజుల వరకు స్టాక్ అందుబాటులో ఉంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా జిల్లా కలెక్టర్లు మాకు సహకరిస్తున్నారు. గతవారం ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు పెరగడంతో లాస్ తగ్గించుకోవడానికి రెగ్యులర్ బంకులలో డీజిల్ బయింగ్ చేయడం వల్ల మనకు కొరత ఏర్పడింది. సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ఇంధనం ఎంత అవసరమో అంతే కొనుగోలు చేయండి. క్రెడిట్ లిమిట్పై జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదు. అందరు డీలర్లకు అన్ని రకాలుగా సరఫరా జరుగుతుంది. -
అంత్యక్రియలకు ఆర్ధికసాయం
హైదరాబాద్: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళినగర్ కాలనీకి చెందిన వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్గౌడ్ తనయుడు యువనేత రామకృష్ణగౌడ్ సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీవీజీ ట్రస్ట్ ద్వారా రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్.అశోక్, శ్రీనివాస్, పరమేష్, బాలు, బాలచందర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. -
మంచు దేశమా..? హైద్రాబాదా..?
-
పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు.. బారులు తీరిన వాహనాలు (ఫొటోలు)
-
హైదరాబాద్లో 101 టాటా సియెరా డెలివరీలు
హైదరాబాద్: ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ తాజాగా హైదరాబాద్లో 101 సరికొత్త టాటా సియెరా ఎస్యూవీలను డెలివరీ చేసింది. ఇందుకోసం స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో జాస్పర్ ఇండస్ట్రీస్, మాలిక్ ఆటోవరల్డ్, ఆరెంజ్ ఆటో మొదలైనవి పాల్గొని, కస్టమర్లకు వాహనాలను అందించాయి. సియెరాకి దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా బుకింగ్స్ రావడమనేది దీనిపై కస్టమర్లకు గల ఆసక్తికి నిదర్శనమని సంస్థ తెలిపింది. -
ఐదు గంటలు వెంటాడి దొంగను పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్: ఓ కరుడుగట్టిన దొంగను బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు సినీఫక్కీలో ఛేజింగ్ చేసి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్లో నివసించే వినోద్కుమార్ బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో హౌస్ కీపింగ్ పనిచేస్తుంటాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విధులు ముగించుకుని ఆస్పత్రి బయటకు వచ్చాడు. అదే సమయంలో ఇద్దరు అపరిచితులు వినోద్కుమార్ వద్దకు వచ్చి అర్జెంటుగా ఫోన్కాల్ మాట్లాడాలని రిక్వెస్ట్ చేయడంతో తన ఫోన్ ఇచ్చాడు. అందులో ఒకరు ఫోన్ మాట్లాడుతూ క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. వినోద్ ఆగంతకుడిని అనుసరిస్తూ వెళ్లగా బీరు సీసాలతో దాడి చేశాడు. బెదిరించి, కొట్టి ఫోన్తోపాటు రూ.3 వేలు లాక్కొని కమాండ్ కంట్రోల్ సెంటర్ మీదుగా పరారయ్యాడు. వెంటనే బాధితుడు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే కాలనీ రోడ్డులోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో నిందితుడు తిష్ట వేసినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. పోలీసు బృందాలు అక్కడికి వెళ్లి రెండువైపుల నుంచి వెతుకుతుండగా ఒకచోట బీరు తాగుతూ కనిపించాడు. పట్టుకునేందుకు యత్నించగా బీరు బాటిల్ పగులగొట్టి పొడుస్తానంటూ.. కత్తితో బెదిరిస్తూ వారిని తప్పించుకుని ఎమ్మెల్యే కాలనీలోకి పరారయ్యాడు. ఐదు గంటల్లో పట్టివేత... రాత్రి ఏడు గంటల ప్రాంతంలో అక్కడ ఓ ఇంటి ప్రహరీ దూకి రోడ్డు వైపు వచ్చేందుకు ప్రయతి్నస్తుండగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు గతంలో జవహర్నగర్ డంపింగ్యార్డు సమీపంలో ఉండేవాడని, అతడు పాత నేరస్తుడైన తురేకర్ అజయ్ అలియాస్ బబ్లూ(27)గా గుర్తించారు. ప్రస్తుతం సనత్నగర్ ప్రాంతంలో ఉంటున్నట్లుగా తేలింది. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆరు దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న బబ్లూ రెండు నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. గంజాయికి, మద్యానికి బానిసై దోపిడీలకు పాల్పడుతున్నట్లు తేలింది. -
తొలిసారి మహిళల రగ్బీ లీగ్
న్యూఢిల్లీ: గత ఏడాది మొదటిసారి పురుషుల కోసం భారత్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) జరగ్గా... రెండో ఏడాది ఏకకాలంలో పురుషులతోపాటు మహిళల రగ్బీ లీగ్ను నిర్వహించనున్నారు. జూన్ 16 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం రగ్బీ ప్రీమియర్ లీగ్కు ఆతిథ్యమిస్తుంది. క్రితంసారి పురుషుల విభాగంలో ఆరు జట్లు పోటీపడ్డాయి. ఆ ఆరు పురుషుల జట్లలో నుంచి నాలుగు జట్లతో (చెన్నై బుల్స్, ఢిల్లీ రెడ్జ్, ముంబై డ్రీమర్స్, కోల్కతా బంగా టైగర్స్) మహిళల విభాగం పోటీలు నిర్వహిస్తారు. జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సహకారంతో రగ్బీ ప్రీమియర్ లీగ్ జరగనుంది. ఈనెల 30న హైదరాబాద్లో వేలం కార్యక్రమం జరగనుంది. చెన్నై బుల్స్, ఢిల్లీ రెడ్జ్, ముంబై డ్రీమర్స్, కోల్కతా బంగా టైగర్స్తోపాటు హైదరాబాద్ హీరోస్, బెంగళూరు బ్రేవ్హార్ట్స్ ఆర్పీఎల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. గత ఏడాది ముంబైలో జరిగిన తొలి సీజన్లో చెన్నై బుల్స్ టైటిల్ సాధించింది. ‘మహిళల విభాగంలోనూ రగ్బీ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని కల కన్నాం. రెండో ఏడాదే మా కల నిజమవుతోంది. ఈ విషయంలో జీఎంఆర్ స్పోర్ట్స్ను, మా ఫ్రాంచైజీలను అభినందించాలి’ అని రగ్బీ ఇండియా అధ్యక్షుడు, సినీ నటుడు రాహుల్ బోస్ తెలిపాడు. -
ఘోర ప్రమాదం కార్మికులపై కూలిన క్రేన్
-
సిట్టింగ్ ఎమ్మెల్యేలు అని కూడా చూడను: కేసీఆర్ ఆగ్రహం
హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియర్ నేతలపై, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పార్టీ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఇంకా బీఎల్ఓ జాబితాను బీఆర్ఎస్ నేతలు సిద్ధం చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. 31 నియోజకవర్గాల నుంచి జాబితా రాలేదని, సభ్యత్వ నమోదులో చురుగ్గా లేకుంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు కేసీఆర్. ఈరోజు(సోమవారం, ఏప్రిల్ 27వ తేదీ) తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ప్రతినిధులు హాజరయ్యారు. దీనిలో భాగంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఎల్ఓ జాబితాను కేసీఆర్ ప్రస్తావించారు. దీనికి బీఆర్ఎస్ నేతల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘15రోజుల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలి. టికెట్ కేటాయింపులకు సభ్యత్వ నమోదు ప్రామాణికం. సోషల్ మీడియాలో యాక్టివ్గా కాదు.. ఫీల్డ్లో యాక్టివ్గా ఉండాలి. సభ్యత్వ నమోదును పట్టించుకోకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది,. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అని కూడా చూడను.. టికెట్ ఇవ్వను. నేను ఒకసారి చెబితే.. వెయ్యి సార్లు చెప్పినట్లే’ అని హెచ్చరించారు. -
నా కొడుకుని వాడుకొని రూ.9 కోట్ల మోసం..?
-
Hyd: అంబర్పేట కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని అంబర్పేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం( ఏప్రిల్ 27వ తేదీ) మధ్యాహ్న సమయంలో అంబర్పేటలోని మహేంద్ర, రెనాల్ట్ కార్ల షోరూమ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కార్ల షోరూమ్లో మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో చుట్టు పక్కల అంతటా పొగ భారీగా కమ్ముకుంది. ఈ అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. రెండు ఫైరింజన్లతో అక్కడకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది భారీగా ఎగిసిపడుతున్న అదుపులోకి తెచ్చే యత్నం చేస్తున్నారు. పొగ భారీగా వ్యాపించడంతో చుట్టుపక్కల నివాసాల వారిని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. కార్ల పార్క్ చేసిన చోట ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాలు పార్క్ చేసిన చోట అగ్ని ప్రమాదం జరగ్గా, ఆ మంటలు వేగంగా అన్ని కార్లకు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు చెబుతున్నారు. -
హైదరాబాద్లో ఈ ప్రాంతాల్లో తక్కువ ధరకే అపార్ట్మెంట్లు!
హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ పరంగా దూసుకుపోతోంది. ఐటీ కారిడార్లోని పశ్చిమ హైదరాబాద్లో గజం ధర ఆకాశాన్ని తాకుతున్న వేళ, మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు తక్కువ ధరలో అనువైన ఇళ్లు లభించే ఇతర ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. 2026 నాటి తాజా గణాంకాల ప్రకారం.. హైదరాబాద్లో అపార్ట్మెంట్లు కాస్తంత తక్కువలో దొరికే ఓ ఐదు ప్రాంతాలను ఈ కథనంలో పరిశీలిద్దాం..పటాన్చెరుపటాన్చెరు ప్రస్తుతం హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఔటర్ రింగ్ రోడ్ (ORR), ముంబై హైవేకు సమీపంలో ఉండటం దీనికి పెద్ద ప్లస్.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.4,800 – రూ.7,200రూ.55 - రూ.75 లక్షల మధ్య ఇక్కడ మంచి 2BHK ఫ్లాట్ కొనుక్కోవచ్చు.అనుకూలతలు: ఐటీ కారిడార్కు (గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్) కేవలం 20-30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంటుంది. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి.ఉప్పల్ - పోచారంతూర్పు హైదరాబాద్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఉప్పల్ ఐటీ పార్క్ చుట్టూ రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. పశ్చిమ హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ ధరలు చాలా తక్కువ.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.4,500 – రూ.6,500ఇక్కడ రూ.45 - రూ.60 లక్షల మధ్య 2BHK ఫ్లాట్ లభిస్తుంది.అనుకూలతలు: మెట్రో రైల్ కనెక్టివిటీ, ఇన్ఫోసిస్ వంటి పెద్ద ఐటీ కంపెనీల క్యాంపస్లు ఉండటం వల్ల మధ్యతరగతి ఉద్యోగులకు ఇది సరైన ఎంపిక.కొంపల్లినార్త్ హైదరాబాద్లో కొంపల్లి ప్రశాంతమైన, కాస్త తక్కువ ధరలో ఇళ్లకు నిలయంగా మారింది. ఇది రిటైల్ హబ్గా కూడా ఎదుగుతోంది.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.5,000 – రూ.6,500రూ.40 - రూ.55 లక్షల లోపే ఇక్కడ అన్ని సౌకర్యాలతో 2BHK ఫ్లాట్ వస్తుంది.అనుకూలతలు: తక్కువ ట్రాఫిక్, విశాలమైన రోడ్లు, నాణ్యమైన విద్యాసంస్థలు, ఆస్పత్రులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇది ఫ్యామిలీస్ ఉండటానికి చాలా అనుకూలంగా ఉంటుంది.నిజాంపేట్ - బాచుపల్లిఐటీ నిపుణులకు సమీపంలో, తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకునే వారికి నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాలు హాట్ ఫేవరెట్.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.4,200 – రూ.5,800రూ.50 - రూ.70 లక్షల మధ్య ఇక్కడ మంచి 2BHK ఫ్లాట్ కొనుక్కోవచ్చు.అనుకూలతలు: మియాపూర్ మెట్రో స్టేషన్కు దగ్గరగా ఉండటం, మెరుగైన రవాణా సౌకర్యాలు ఉండటం వల్ల ఈ ప్రాంతంలో డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.ఆదిభట్లవిమానాశ్రయం, టీసీఎస్ (TCS), ఏరోస్పేస్ పార్క్లకు సమీపంలో ఉండటం ఆదిభట్ల ప్రత్యేకత. పెట్టుబడి కోణంలో చూస్తే ఇది అద్భుతమైన ప్రాంతం.ధరలు: చదరపు అడుగుకు సుమారు రూ.3,800 – రూ.4,800ఈ ప్రాంతంలో రూ.55 - రూ.75 లక్షలు పెడితే 2BHK ఫ్లాట్ కొనవచ్చు.అనుకూలతలు: ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వల్ల నగరం నలుమూలలకూ సులభంగా చేరుకోవచ్చు. భవిష్యత్తులో ఇక్కడ ప్రాపర్టీ విలువలు బాగా పెరిగే అవకాశం ఉంది.పైన పేర్కొన్న ధరలు కొనుగోలుదారుల అవగాహన కోసం మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా ఇచ్చిన సగటు అంచనా ధరలు మాత్రమే. బిల్డర్, ఫ్లోర్, ఎంచుకునే సౌకర్యాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు. -
హైదరాబాద్లో మహిళలకు రక్షణ ఉండదా?
సాక్షి, హైదరాబాద్: ‘‘మహిళలకు ఈ నగరం ఎంతో సురక్షితమనుకున్నా. కానీ, అది నిజం కాదని ఇవాళే తెలిసింది’’ అంటూ ఓ యువతి విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉదయాన్నే రన్నింగ్కు వెళ్లిన తనకు ఎదురైన భయానక అనుభవాన్ని ఆమె ఆ వీడియోలో పంచుకుంది. హైదరాబాద్ సైకిల్ ట్రాక్లో ఓ మహిళా రన్నర్కు వేధింపులు ఎదరయ్యాయి. ఓ వ్యక్తి ఆమెను వెంబడిస్తూ జుగుప్సాకరంగా వ్యవహరించబోయాడు. అయితే అప్రమత్తమైన ఆ యువతి అతన్ని వీడియో తీయబోగా.. నిక్కరు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన దుస్తుల్ని చూపిస్తూ.. ఇది హైదరాబాద్! మహిళలకు సురక్షితంగా ఉండకూడదా?. సూర్యోదయం కంటే ముందు నేను ఎప్పుడూ రన్నింగ్కు రాలేదు. ఎప్పుడూ సూర్యోదయం తర్వాతే వస్తా.. రన్నింగ్ దుస్తుల్లో వస్తే ఆటోవాలాలు, బైక్ రైడర్లూ తేడా చూపులు చూస్తారు. ఆఖరికి ఐదు పదుల వయసున్న అంకుల్స్ కూడా అందుకు మినహాయింపేం కాదని ఆమె వ్యాఖ్యానించింది. భయంతో, బాధతో ఆ యువతి చేసిన వీడియో సోషల్ మీడియాకు చేరింది. పలువురు ఆమెకు మద్ధతుగా పోలీసు వ్యవస్థను నిందిస్తున్నారు. సైకిల్ ట్రాక్పై పోలీసుల గస్తీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ కావడంతో.. ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. This Is Hyderabad! Isn’t This Supposed To Be Safe?? A very agitated runner was seen asking in this video. She was running on the Hyderabad Cycle Track at 6am and a random sicko was behaving disgustingly. So, so, so…horrible!! Yes! Hyderabad is supposed to be a safe space… pic.twitter.com/TblHVLAM37— Revathi (@revathitweets) April 27, 2026 -
ఎర్రవెల్లి - హైదరాబాద్ బయలుదేరిన కేసీఆర్ కాన్వాయ్
-
రూ.కోటి కట్నం ఇవ్వలేదని వివాహం రద్దు
-
పట్టుదలతో మూడు ఖాకీ ఉద్యోగాలు సాధించిన యువకుడు
సిరిసిల్ల: ప్రభుత్వ ఉద్యోగం ఒకటి సాధించడమే కష్టంగా ఉన్న నేటి పోటీ ప్రపంచంలో పట్టుదలకు ప్రయత్నం తోడైతే విజయాలు క్యూ కడతాయని నిరూపిస్తున్నారు సిరిసిల్ల అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఏఎంవీఐ) బేర పృథ్వీరాజ్వర్మ. ఒక్కటి కాదు...రెండు కాదు.. ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. చదువు ఒక్కటే మనల్ని ముందుకు నడిపిస్తుందని.. సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుందంటున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఏఎంవీఐగా పనిచేస్తున్న పృథ్వీరాజ్వర్మ గ్రామీణ నేపథ్యంలో ఎదిగి వచ్చి “ఖాకీ’ యూనిఫామ్పై ఉన్న మక్కువతో మూడు ఉద్యోగాలు సాధించారు. ప్రజలకు నేరుగా సేవచేసే అవకాశం ఖాకీ దుస్తులకే ఉందని నమ్మారు. ఉద్యోగ అన్వేషణలో పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న నేటితరం యువతకు స్ఫూర్తినిస్తున్న పృథ్వీరాజ్వర్మ విజయగాథపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.మధ్యతరగతి కుటుంబంమంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లికి చెందిన బేర శ్రావణి, రాజమౌళి దంపతులకు ఇద్దరు కొడుకులు పృథ్వీరాజ్వర్మ, భరద్వాజ్. లక్షెట్టిపేటలో ఎస్ఎస్సీ వరకు చదివిన పృథ్వీరాజ్వర్మ పదోతరగతిలో 526 మార్కులు సాధించారు. హైదరాబాద్లో ఇంటర్, వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ (మెకానికల్) పూర్తి చేశారు. 2017లో బీటెక్ పట్టాతో బయటకు వచ్చిన పృథ్వీరాజ్వర్మ హోండా కంపెనీలో సర్వీసు ఇంజినీరుగా రెండేళ్లపాటు పనిచేశారు. అనంతరం మరో సిమెంట్ కంపెనీలో పనిచేశారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలగా ఖాళీ సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. బీట్ ఆఫీసర్గా ప్రస్తానం2019లో పోటీపరీక్షలు రాసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా తొలి ఉద్యోగం సాధించారు. శిక్షణ అనంతరం జన్నారం కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్లో ఉద్యోగం. అడవిని, వన్యప్రాణులను రక్షించే ఉద్యోగం. బీట్ ఆఫీసర్గా పనిచేస్తూ పోటీ పరీక్షలకు సిద్దమయ్యారు. 2023లో తెలంగాణ ప్రభుత్వం నేరుగా అసిస్టెంట్ మోటార్ వాహన తనిఖీ అధికారి(ఏఎంవీఐ) ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించింది. ఆ పరీక్షలకు పట్టుదలగా ప్రిపేర్ అయ్యారు. ఆ పరీక్షల ఫలితాలు రాక ముందే 2024లో పోలీస్ కానిస్టేబుల్(సివిల్) ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. కానిస్టేబుల్ ఉద్యోగం చేరకుండా.. ఏఎంవీఐ ఉద్యోగ ఫలితాల కోసం నిరీక్షించారు. ఉద్యోగం పోతుందని, వెంటనే చేరాలని అనేక మంది సలహా ఇచ్చినా అప్పటికే ఓ ఉద్యోగం ఉంది, మరో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను అనే ధీమాతో ఉండగా.. ఏఎంవీఐగా ఎంపికయ్యారు. మూడు ఖాకీ డ్రెస్ వేసుకునే ఉద్యోగాలు రావడంతో చివరగా.. ఏఎంవీఐగా ఉద్యోగంలో చేరారు.తమ్ముడూ.. భార్యా ఇంజినీర్లేపృథ్వీరాజ్వర్మ తమ్ముడు భరద్వాజ ఆర్అండ్బీలో ఏఈఈగా పనిచేస్తున్నారు. ఆయన భార్య కీర్తి ఇరిగేషన్ శాఖలో ఏఈఈగా మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నారు. ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడడంతో తల్లిదండ్రులు శ్రావణి, రాజమౌళి దంపతుల ఆనందానికి అవధుల్లేవు. చిన్నప్పటి నుంచి చదువు ఒక్కటే దారి చూపుతుందని నమ్మిన ఆ తల్లిదండ్రులు పిల్లలను ప్రయోజకులను చేశామని ఆత్మసంతృప్తితో ఉన్నారు.వెనకడుగు వేయొద్దుపట్టుదలగా చదువాలి. చదువును నిర్లక్ష్యం చేయొద్దు. వెనకడుగు వేయొద్దు. నిజా నికి బీట్ ఆఫీసర్గా ఉండగా మళ్లీ చదువు ఎందుకు అని చాలా మంది సలహా ఇచ్చా రు. ఉన్న ఉద్యోగం పోతుందన్నారు. అప్పటికే పోటీపరీక్షల పేపర్లు లీక్ కావడం, రాసిన పరీక్షలు రద్దు కావడం జరిగింది. దీంతో చాలా మంది ఉన్న ఉద్యోగంలోనే చేరమన్నారు. కానీ మనపై మనకు నమ్మకం ఉంటే.. ఇది పోతే ఇంకోటి వస్తుందిలే అనే ధీమాతో రెండేళ్లు ఇంటి ముఖం చూడకుండా హైదరాబాద్లోనే ఉండి చదువుకున్న. కృషికి తోడుగా.. పట్టుదల ఉంటే.. ఏదైనా సాధిస్తామనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతోనే మూడు ఉద్యోగాలు సాధించాను. అన్ని ఖాకీ యూనిపామ్ సర్వీసులే కావడం ఆనందం అనిపించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. చదువును మరువద్దు.– పృథ్వీరాజ్వర్మ, ఏఎంవీఐ, రాజన్న సిరిసిల్ల -
హైదరాబాద్ : ఆకట్టుకున్న ‘సాక్షి’ హ్యాపీ కిడ్స్ ఈవెనింగ్ (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో టెన్షన్.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు..
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కొరత వెంటాడుతోంది. పెట్రోల్, డీజిల్ కోసం కొన్నిచోట్ల వాహనదారులు బారులు తీరుతున్నారు. పలుచోట్ల పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో, వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా డీజిల్ సమస్య ఎక్కువగా ఉంది.ఏపీలో ఇంధన సంక్షోభం మరింత ముదిరింది. డీజీల్, పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 4,510 బంకుల్లో 70 శాతానికిపైగా మూతబడ్డాయి. కొన్నిచోట్ల ఉన్న కొద్ది స్టాక్ను రేషన్ లెక్కన అందిస్తున్నారు. అందుకోసం కనుచూపుమేర వాహనాలు బారులుతీరాయి. గంటల తరబడి ఎదురు చూపుల తర్వాత అరకొర ఇంధనంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. డీజిల్ కార్లకు 10–15 లీటర్లకు మించి ఇవ్వడం లేదు. బైకులకు రూ.200 పెట్రోల్ మాత్రమే పోస్తున్నారు. ఇంధనం ఉన్న బంకుల్లో గరిష్టంగా 5 గంటలు మించి అమ్మకాలు జరగలేదు. శనివారం డీజిల్కు మాత్రమే తీవ్ర కొరత ఏర్పడగా, ఆదివారం అది పెట్రోల్కు కూడా అంటుకుంది. దీంతో బంకుల వద్ద వాహనదారులు ఆందోళన చేశారు.ఇదిలా ఉండగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రాష్ట్రంలో డీలర్లకు డిమాండ్లో 40 శాతం మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఇంధన ఉత్పత్తి పెంచామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. అది ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సమస్య మరింత జఠిలమైంది. శనివారం మధ్యాహ్నం వరకు కొంత మేర తెరుచుకున్న బంకుల్లో పెట్రోల్ మాత్రమే అరకొరగా అమ్మకాలు సాగించారు. సాయంత్రానికి వాటిలోనూ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ద్విచక్ర వాహనాలకు రూ.200 పెట్రోల్, కార్లకు 10–15 లీటర్లు డీజిల్/పెట్రోల్ మాత్రమే అందించారు. ఫుల్ ట్యాంక్, క్యాన్లలో విక్రయాలు ఆపేశారు.తెలంగాణలో పరిస్థితి ఇది.. తెలంగాణలో ఇంధన కొరత లేదు.. నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాలశాఖ చెబుతున్నప్పటికీ పలుచోట్ల పెట్రోల్ బంకుల్లో మాత్రం ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో డీజిల్, పెట్రోల్ కొరతతో పలు బంకులను తాత్కాలికంగా మూసివేశారు. ఖమ్మం నగరంతో పాటు అశ్వారావుపేట మండలం వినాయకపురం బంకు వద్ద.. కల్లూరు, మణుగూరు, సత్తుపల్లిలో పెట్రోల్ కోసం వాహనదారులు బారులుతీరారు. వేంసూరు ఐఓసీ బంకు దగ్గర అయితే పెద్దపెద్ద డబ్బాల్ని వరుసలో పెట్టారు.హైదరాబాద్లో హిమాయత్నగర్ సహా కొన్నిచోట్ల బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టారు. మిగతాచోట్ల పరిస్థితి సాధారణంగానే ఉంది.సూర్యాపేట జిల్లాలో పదిహేనుకుపైగా పెట్రోల్ బంకులను తాత్కాలికంగా మూసివేసి నో స్టాక్ బోర్డు పెట్టారు. మిగతావాటిలో ఎక్కువ బంకుల్లో పెట్రోల్ ఉంటే డీజిల్ లేదు. డీజిల్ ఉంటే పెట్రోల్ లేదు. మద్దిరాలలోని ఓ బంకులో మూడ్రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ లేవు.కోదాడ పట్టణంలోని ఓ బంకు నిర్వాహకుడు రెండు ట్యాంకర్ల కోసం ఆయిల్ సంస్థకు సుమారు రూ.25 లక్షలు మూడ్రోజుల క్రితం చెల్లించారు. ఆదివారం నాటికీ ఇంధనం రాకపోవడంతో బంకును మూసేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో నాలుగు బంకులు ఉన్నాయి. డీజిల్, పెట్రోల్ కొరతతో వారంలో నాలుగురోజులే తెరిచి ఉంటున్నాయి. ఇప్పుడు ప్రధాన బంకు సహా రెండు తాత్కాలికంగా మూసి ఉన్నాయి.జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులోని ఐవోసీ బంకులో శుక్రవారం సాయంత్రానికే స్టాకు అయిపోయింది. మళ్లీ సోమవారం స్టాకు వస్తుందని సిబ్బంది తెలిపారు. -
ముఖ్యమంత్రి అయితే.. వారానికి మూడుసార్లు ఇదేనా?
హైదరాబాద్: మండిపోతున్న ఎండలు.. ఆపై మిట్టమధ్యాహ్నం.. ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధగంటకు పైగా వాహనాలను నిలిపివేయటంతో ప్రయాణికుల సహనం నశించింది. కొందరు కార్లలోంచి దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు విషయం ఏంటంటే.. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జన్వాడలో ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో పుప్పాలగూడ ఔటర్ టోల్గేట్తో పాటు మైహోం అవతార్ సర్కిల్లోనూ పోలీసులు ట్రాఫిక్ను నిలిపివేశారు. పది నిముషాల్లోనే వేలాది వాహనాలు బారులుతీరాయి. అర్ధగంట పాటు నిలిపివేయడంతో కొందరు కార్లలోంచి దిగి వచ్చి వాగ్వాదానికి దిగారు. ‘ముఖ్యమంత్రి అయితే వారంలో మూడు, నాలుగు సార్లు తమను ఇబ్బందులకు గురిచేస్తారా? హెలికాప్టర్లో తిరగమనండి. లేదంటే సామాన్యుడిలా ట్రాఫిక్లో వెళ్లాలని చెప్పండి. మండుతున్న ఎండలో మమ్మల్ని ఇంతసేపు నిల్చోపెడతారా’? అంటూ నిలదీశారు. అంతలోనే సీఎం కాన్వాయ్ వస్తుండగా ఒక్కసారిగా హారన్లను మోగించి ఆయనకు వినిపించేలా నిరసన తెలిపారు. అనంతరం సీఎం కాన్వాయ్ వెళ్లిపోవటం, ట్రాఫిక్ జాం సమస్య సమసిపోయింది. ఈ తతంగాన్ని మొత్తం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది. View this post on Instagram A post shared by Hyderabad Mail (@hyderabadmail) -
హైడ్రాపై ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజం
హైదరాబాద్: హైడ్రా, మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. గోషామహల్ నియోజకవర్గంలో ఫిష్ మార్కెట్ పక్కన ఉన్న డబ్బాలను తొలగించారని, తాను ఇక్కడ లేని సమయం చూసే వాటిని హైడ్రా తొలగించిందంటూ మండాపడ్డారు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు దౌర్జన్యంగా తొలగించారన్నారు. హైడ్రాకు దమ్ముంటే దారుసలాం, ఛార్మినార్ ముందు ఉన్న అక్రమ కట్టడాలు కూల్చి చూపెట్టాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల ఉపాధి అవకాశాలపై దౌర్జన్యం సరికాదని, త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతారుని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు రాదన్నారు. రాష్ట్ర సీఎం హోదాలో ఉన్న రేవంత్రెడ్డిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అంబేద్కర్ జయంతి వారోత్సవాల ముగింపు వేడుకలు
హైదరాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో నగరంలోని సోమాజిగూడలో జరిగిన అంబేద్కర్ జయంతి వారోత్సవాల ముగింపు వేడుకల్లో కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ వేడుకలకు భారీ ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. దీనిలో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ జయంతిని గల్లీ నుండి ఢిల్లీ వరకు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అంబేద్కర్ దేశ ప్రజలకి ఆశా జ్యోతి.. అందుకే దేశ వ్యాప్తంగా వారోత్సవాలు జరగుతున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా అంబేద్కర్ జయంతిని తూతూ మంత్రంగా జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని వారం రోజుల పాటు ప్రధాని మోదీ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితినే అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహిస్తుంది. మనం సుఖ సంతోషాలతో జీవిస్తున్నాం అంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్షనే. అంబేద్కర్ చరిత్రని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. అడుగడుగునా అంబేద్కర్ ని అవమానించిన పార్టీ కాంగ్రెస్. డూప్లికేట్ గాంధీ కుటుంబ చరిత్రనే ప్రజలకి తెలియాలని కాంగ్రెస్ కుట్ర చేసింది.దేశ విభజన, 370 ఆర్టికల్ ని వ్యతిరేకించిన వ్యక్తి అంబేద్కర్. నెహ్రూ ఆగడాలు, అరాచకాలు తట్టుకోలేక అంబేద్కర్ రాజీనామా చేసి బయటికి వచ్చారు. అంబేద్కర్ కి భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. అంబేద్కర్ రాజకీయ చరిత్ర లేకుండా చేసింది కాంగ్రెస్. అప్పట్లో జనసంఘ్ పార్టీ అంబేద్కర్కి ఎంఎల్సీ ఇచ్చి గౌరవించింది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ స్మృతి వనం కట్టలేదు’ అని విమర్శించారు. కిషన్రెడ్డి మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ ఆలోచన విధానాలతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. అంబేద్కర్ ఆలోచన విధానాలకి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెన్ను పోటు పొడిచిందో ప్రజలోకి తీసుకెళ్లాలి. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ఏ విధంగా అడ్డుకుందో అందరికీ తెలుసు. అసెంబ్లీ, పార్లమెంట్లకు గిరిజనులు, దళితులు, మహిళలని వెళ్ళకుండా కాంగ్రెస్ అడ్డుకుంది. సీట్లు పెంపు ద్వారా అందరూ లబ్ది పొందేవారు. దక్షిణ భారతదేశంకి అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి, స్టాలిన్, రాహుల్ గాంధీ మాట్లాడారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఒకే నిష్పత్తిలో సమాంతరంగా సీట్లు పెంచాలని మోదీ నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి, స్టాలిన్, రాహుల్ గాంధీ వల్ల దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ 50 ఏళ్ళు పాలించినపుడు ఏ రోజు కూడా బీసీలు గుర్తుకు రాలేదు’ అని మండిపడ్డారు.‘వచ్చే నెల పదోవ తేదీన తెలంగాణకు ప్రధాని మోదీ వస్తున్నారు. మూడోసారి ప్రధాని అయిన తరువాత మొదటి సారి హైదరాబాద్కి మోదీ వస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు జాతికి అంకితం చేస్తారు. వచ్చే నెల 10 వ తేదీ న పెరెడ్ గ్రౌండ్ లో నాలుగు గంటలకు ప్రధాని బహిరంగ సభలో పాల్గొంటారు’అని స్పష్టం చేశారు. -
నటి అషురెడ్డిపై కేసు నమోదు.. పెళ్లి పేరుతో రూ. 9 కోట్లు మోసం
బిగ్బాస్ ఫేమ్, సినీనటి అషురెడ్డి(అశ్విని రెడ్డి)పై హైదరాబాద్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని హైదరాబాద్ షేక్పేట్కు చెందిన వై.వి.ధర్మేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన నుంచి రూ.9.35 కోట్లు కాజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా తాను పని చేస్తున్నానని చెప్పిన ధర్మేంద్ర.. 2018లో భారత్కు వచ్చిన సమయంలో అషురెడ్డి పరిచయమైనట్లు పేర్కొన్నారు.పోలీసులతో ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ' అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమా ఛాన్స్లో కోసం హైదాబాద్ వచ్చినట్లు అషురెడ్డి చెప్పింది. మా అబ్బాయికి పరిచయం అయిన కొద్దిరోజుల్లోనే ప్రేమిస్తున్నాని చెప్పి పెళ్లి చేసుకుందామని నమ్మించింది. ఈ క్రమంలో మా అబ్బాయిని డబ్బులు అడగటం మొదలు పెట్టింది. బంగారం, కారు పలు ఆస్తులను కొనుగోలు చేయించుకుని తన పేరుతోనే రిజిస్టర్ చేయించుకుంది. అయితే, కొద్దిరోజుల క్రితం ధర్మేంద్రను కలిశారు. అషురెడ్డితో పెళ్లి సంబంధాన్ని ఖాయం చేస్తున్నామని ముహూర్తం కోసం పూజారిని కూడా పిలిపించి హడావుడి చేశారు. కానీ, వెంటనే ముఖం చాటేసి పెళ్లికి నిరాకరించారు. గతేడాది వరకు నా కుమారుడితో ఆమె టచ్లోనే ఉంది. ఇప్పటి వరకు రూ.9.35 కోట్ల వరకు నగదు, సుమారు 5 కిలోల బంగారం, కారు, ఫ్లాట్ కొనుగోలు చేసి తన పేరుతో రాయించుకుంది. ఆమెతో పాటు తన సోదరి కూడా రూ. 50 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదు.' అని ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
హైదరాబాద్లో సొంత ఇల్లా.. అద్దెనా?
సాక్షి, సిటీ బ్యూరో: జనగణన– 2027లో భాగంగా కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్)లోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్కు నేటి (ఆదివారం) నుంచి మే 10 వరకు అవకాశం ఉంది. ఈ గడువులో https:// se. census. gov.in పోర్టల్ ద్వారా ప్రజలు ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు తమ ఇంటి వివరాలను తామే స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. జనగణనకు సంబంధించి సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, ‘క్యూర్’ పరిధి వరకు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 33 ప్రశ్నలు.. 20 నిమిషాలు ఇందులో మొత్తం 33 పశ్ర్నలుండగా, నాలుగింటిని ఎన్యూమరేటర్లు నమోదు చేస్తారు. మిగతావాటికి ప్రజలే సమాధానం ఇవ్వొచ్చు. గుడిసెలు సహా అన్ని నివాస భవనాలను నమోదు చేయడం అధికారుల ప్రధాన విధి. ప్రశ్నలన్నీ ఇల్లు, మౌలిక సదుపాయాలు, వాహనాలు తదితరాలకు సంబంధించినవి. వాటిని కూడా ఉన్నదీ, లేనిదీ తెలియజేస్తే చాలు. అంతే తప్ప ఎన్ని వాహనాలున్నాయో తెలపాల్సిన పనిలేదు. కాకపోతే నివాస గృహం సొంతమా, అద్దెనా అన్నది తెలియజేయాలి. ఇక్కడ అద్దె ఇల్లు అయితే వేరే చోట సొంత ఇల్లు ఉందా అనే విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నమోదు ప్రక్రియ మొత్తం దాదాపు 20 నిమిషాల్లో పూర్తవుతుందని వారు తెలిపారు.సబ్మిట్ చేశాక ప్రత్యేక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ (ఎస్ఈ ఐడీ) జారీ అవుతుంది. ఈ ప్రక్రియలో ఆధార్ కానీ, ఇతరత్రా రుజువులు కానీ, ఫొటోలు కానీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులెవరైనా ఇంటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయొచ్చు. సురక్షితమైన వెబ్ పోర్టల్ ద్వారా ఇంటి నుంచి కానీ, కార్యాలయం నుంచి కానీ లేదా ఎక్కడి నుంచైనా వివరాలు నమోదు చేయవచ్చు. ప్రస్తుతం ఎక్కడ నివాసం ఉంటున్నారో ఆ ఇంటి వివరాలే ఇవ్వాలని తెలిపారు. నమోదు విధానం ఇలా.. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభించడానికి ముందు రాష్ట్రం పేరు, క్యాప్చా వంటివి నమోదు చేయాలి. ఆ తర్వాత కుటుంబ యజమాని పేరు, మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడీ కూడా ఇవ్వవచ్చు. కుటుంబ యజమాని పేరు ఒకసారి నమోదు చేసిన తర్వాత మార్చడం కుదరదు. ఒక మొబైల్ నంబర్ను ఒక ఇంటి వివరాల నమోదుకు మాత్రమే వాడాల్సి ఉంటుంది. మొబైల్కు వచ్చిన ఓటీపీ నమోదు చేశాక, భాషను ఎంచుకోవచ్చు. 16 భాషల్లో సదుపాయం ఉంటుంది. తర్వాత జిల్లా, పిన్కోడ్, లొకాలిటీ, తదితర వివరాలతో తమ ఇంటిని మ్యాప్లో గుర్తించాలి. మ్యాప్లో కనిపించే మార్కర్ను తమ ఇంటిపైకి తీసుకెళ్లి లొకేషన్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. లొకేషన్ సరిగా గుర్తించకపోతే ఎన్యూమరేటర్కు డేటా అందకపోవచ్చు. నమోదు చేసిన వివరాలను సరి చూసుకునేందుకు అవకాశం ఉంటుంది.ఒకేసారి కాకపోతే అప్పటి వరకు భర్తీచేసిన వివరాలను సేవ్ చేసుకొని తర్వాత భర్తీ చేసే సదుపాయం కూడా ఉంటుంది. అన్నీ సరిచేసి, నిర్ధారించుకుని సబ్మిట్ చేశాక మార్చడం కుదరదు. సబ్మిట్ తర్వాత మొబైల్ నంబర్కు, మెయిల్ఐడీ ఇస్తే మెయిల్కు కూడా హెచ్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల ఎస్ఈ ఐడీ వస్తుంది. దాన్ని ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు చూపిస్తే పరిశీలించి ధువ్రీకరిస్తారు. ఈ డేటా గోప్యంగా ఉంటుందని, ఎవరికీ సమాచారం వెళ్లదని స్పష్టం చేశారు. వివరాలిస్తే ప్రజలు తమకు అందుతున్న సంక్షేమ పథకాలు అందకుండా పోతాయని భయపడాల్సిన పనిలేదన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రజలకు సదుపాయమే తప్ప, తప్పనిసరి కాదు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోకుంటే , ఎన్యూమరేటర్లే వివరాలు నమోదుచేస్తారు. గ్రేటర్లో సన్నాహాలు గేట్రర్లో 60 సర్కిళ్లు, కంటోన్మెంట్కు 61 మంది చార్జ్ ఆఫీసర్లను నియమించారు. 19,865 హౌస్లిస్టింగ్ బ్లాక్స్ను(హెచ్ఎల్బీ) గుర్తించి మార్కింగ్ పూర్తి చేసినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. 21,866 మంది ఎన్యూమరేటర్లు, 3,662 సూపర్వైజర్లు అవసరమని గుర్తించారు. ఇప్పటి వరకు 8,067 ఎన్యూమరేటర్లకు, 1379 మంది సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. హెల్ప్లైన్ నంబర్: 1855. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు.సెల్ఫ్ఎన్యూమరేషన్ మహోత్సవ్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జీహెచ్ఎంసీ సెల్ఫ్ఎన్యూమరేషన్ మహోత్సవ్ పేరిట 15 రోజులు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మెట్రో పిల్లర్లు, బస్సులు, హోర్డింగ్స్, ప్రకటనల ద్వారా కూడా పచ్రారం చేయనున్నట్లు కర్ణన్ పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. -
హైదరాబాద్ కలెక్టర్గా ప్రియాంక అల
సాక్షి, హైదరాబాద్: కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ కావడం సంచలనంగా మారింది. కొంత కాలంగా పనితీరు బాగాలేని అధికారులను బదిలీ చేస్తామంటున్న ప్రభుత్వం.. తాజాగా జరిపిన ఐఏఎస్ల బదిలీల్లో నగరంతో సంబంధమున్న వారు పలువురుండటం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలోనే ఆర్థిక ఇంజిన్గా ఉన్న క్యూర్ పరిధిలోని అధికారులు బదిలీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఎల్ఈటీ అండ్ఎఫ్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా బదిలీ కాగా.. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక అల హైదరాబాద్ కలెక్టర్గా నియమితులయ్యారు. జోన్లకు జవసత్వాలు? క్యూర్లోని ఆరు జోన్ల జోనల్ కమిషనర్లను మార్చడం సంచలనంగా మారింది. ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ సీఈఓ పి.ఉదయ్కుమార్ను గోల్కొండ జోనల్ కమిషనర్గా, నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా, మిర్యాలగూడ సబ్కలెక్టర్ నారాయణ్ అమిత్ను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా, బోధన్ సబ్కలెక్టర్ వికాస్ మహతోను ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా, కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ను కూకట్పల్లి జోనల్ కమిషనర్గా నియమించారు. ప్రస్తుతం చారి్మనార్ జోనల్ కమిషనర్గా ఉన్న ఎస్. శ్రీనివాస్రెడ్డి (నాన్ క్యాడర్)ను రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా నియమించారు. గోల్కొండ జోనల్ కమిషనర్ ముకుందరెడ్డిని ఐఅండ్పీఆర్ స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ప్రతీక్ జైన్ను సంగారెడ్డి కలెక్టర్గా బదిలీచేశారు. బాన్స్వాడ సబ్కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టిని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్గా నియమించారు. క్యూర్ పరిధిలోని అధికారులు కొద్దికాలం గడవకముందే బదిలీ అవుతుండటంతో పాలన వ్యవస్థ గాడిన పడటం లేదు. మూడు కార్పొరేషన్లుగా మారాక ఇంకా బాలారిష్టాల్లోనే ఉన్న కొత్త కార్పొరేషన్ల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. -
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు చేపట్టారు. పలువురు అధికారులను బదిలీ చేయగా, మరికొందరికి కొత్తగా పో స్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు శనివారం రాత్రి సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 30 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శిగా ప్రావీణ్య, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కార్య దర్శిగా దానకిషోర్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బి.ఎం. సంతోష్, ఇంటర్ బోర్డు డైరెక్టర్గా అభిలాష అభినవ్, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా జి.వి శ్యామ్ప్రసాద్ లాల్ నియమితులయ్యారు. సంజయ్ కుమార్ (ఐఏఎస్ 1995) ప్రస్తుతం: పీఆర్&ఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్ & ఆర్ఎస్ఏడీ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బదిలీ: తెలంగాణ భవన్, న్యూఢిల్లీకి ప్రత్యేక అధికారిగాఎం.దాన కిషోర్ (ఐఏఎస్ 1996) ప్రస్తుతం: ఎల్ఈటీ&ఎఫ్ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బదిలీ: పీఆర్ & ఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్ & ఆర్ఎస్ఏడీ శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాబి.విజియేందిర (ఐఏఎస్ 2006) ప్రస్తుతం: టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి & ఎస్సీడీ కమిషనర్ బదిలీ: ఎస్సీడీ శాఖకు ప్రభుత్వ కార్యదర్శిగాహరిచందన దాసరి (ఐఏఎస్ 2010) ప్రస్తుతం: హైదరాబాద్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: ఎల్ఈటీ&ఎఫ్ శాఖకు ప్రభుత్వ కార్యదర్శిగాకృష్ణ ఆదిత్య ఎస్ (ఐఏఎస్ 2014) ప్రస్తుతం: ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ & బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి బదిలీ: పరిశ్రమలు & వాణిజ్య శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగాభావేష్ మిశ్రా (ఐఏఎస్ 2015) ప్రస్తుతం: ఐటీఈ&సీ శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బదిలీ: నిర్మల్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్గాపి.ఉదయ్ కుమార్ (ఐఏఎస్ 2016) ప్రస్తుతం: ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ బదిలీ: జీహెచ్ఎంసీ, గోల్కొండ జోనల్ కమిషనర్గా బధావత్ సంతోష్ (ఐఏఎస్ 2016) ప్రస్తుతం: నాగర్ కర్నూల్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: జీహెచ్ఎంసీ, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గాజెండాగే హనుమంత్ కొండిబా (ఐఏఎస్ 2016) ప్రస్తుతం: పౌర సరఫరాల డైరెక్టర్ బదిలీ: ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగాపి.ప్రవీణ్య (ఐఏఎస్ 2016) ప్రస్తుతం: సంగారెడ్డి కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: టీఆర్&బీ శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగాప్రియాంక అలా (ఐఏఎస్ 2016) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బదిలీ: హైదరాబాద్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్గాసంతోష్ బి.ఎం. (ఐఏఎస్ 2017) ప్రస్తుతం: గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ బదిలీ: గిరిజన సంక్షేమ శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగాప్రతీక్ జైన్ (ఐఏఎస్ 2017) ప్రస్తుతం: నారాయణపేట్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: సంగారెడ్డి కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్గాదివాకర టీఎస్ (ఐఏఎస్ 2017) ప్రస్తుతం: ములుగు కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: ఖమ్మం కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్గాఅనుదీప్ దురిశెట్టి (ఐఏఎస్ 2018) ప్రస్తుతం: ఖమ్మం కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: ఐటీఈ&సీ శాఖకు ప్రభుత్వ సంయుక్త కార్యదర్శిగా అభిలాష అభినవ్ (ఐఏఎస్ 2018) ప్రస్తుతం: నిర్మల్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ బదిలీ: ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ & బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శిగాభోర్ఖాడే హేమంత్ సహదేవరావు (ఐఏఎస్ 2018) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, సెర్లింగంపల్లి జోనల్ కమిషనర్ బదిలీ: ములుగు కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్గాచెక్క ప్రియాంక (ఐఏఎస్ 2018) ప్రస్తుతం: ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్ మరియు జీఏ(ఐ&పీఆర్) శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బదిలీ: నారాయణపేట్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్గాజి.వి.శ్యాం ప్రసాద్ లాల్ (ఐఏఎస్ 2019) ప్రస్తుతం: నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బదిలీ: పౌర సరఫరాల డైరెక్టర్గాజి.ముకుంద రెడ్డి (ఐఏఎస్ 2019) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, గోల్కొండ జోనల్ కమిషనర్ బదిలీ: ఐ&పీఆర్ ప్రత్యేక కమిషనర్ మరియు జీఏ(ఐ&పీఆర్) శాఖకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగాహేమంత్ కేశవ్ పాటిల్ (ఐఏఎస్ 2019) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ బదిలీ: నాగర్ కర్నూల్ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్గామండ మకరందు (ఐఏఎస్ 2020) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ బదిలీ: ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగాఅపూర్వ్ చౌహాన్ (ఐఏఎస్ 2020) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, కూకట్పల్లి జోనల్ కమిషనర్ బదిలీ: సీసీఎల్ఏ కార్యాలయంలో సీఎంఆర్వో ప్రాజెక్ట్ డైరెక్టర్గాలెనిన్ వత్సల్ టోప్పో (ఐఏఎస్ 2021) ప్రస్తుతం: మహబూబాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బదిలీ: ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగానారాయణ అమిత్ మాలెంపాటి (ఐఏఎస్ 2022) ప్రస్తుతం: నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్-కలెక్టర్ బదిలీ: జీహెచ్ఎంసీ, సెర్లింగంపల్లి జోనల్ కమిషనర్గావికాస్ మహతో (ఐఏఎస్ 2022) ప్రస్తుతం: నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్-కలెక్టర్ బదిలీ: జీహెచ్ఎంసీ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గామయాంక్ సింగ్ (ఐఏఎస్ 2022) ప్రస్తుతం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్-కలెక్టర్ బదిలీ: జీహెచ్ఎంసీ, కూకట్పల్లి జోనల్ కమిషనర్గాకిరణ్మయి కొప్పిశెట్టి (ఐఏఎస్ 2022) ప్రస్తుతం: కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్-కలెక్టర్ బదిలీ: రంగారెడ్డి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గాయువరాజ్ మార్మట్ (ఐఏఎస్ 2022) ప్రస్తుతం: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సబ్-కలెక్టర్ బదిలీ: కుమ్రంభీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గాఎస్.శ్రీనివాస్ రెడ్డి (నాన్-కేడర్) ప్రస్తుతం: జీహెచ్ఎంసీ, చార్మినార్ జోనల్ కమిషనర్ బదిలీ: జీహెచ్ఎంసీ, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా -
డీజీపీ ఎదుట భారీగా మావోయిస్టుల లొంగుబాటు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసుల ముందు భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. చత్తీస్గడ్కు చెందిన 47 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరి వద్ద నుంచి 34 ఆయుధాలను సరెండర్ చేసుకున్నారు. వీరిని ఈరోజు(శనివారం, ఏప్రిల్ 25వ తేదీ) మీడియా ముందు ప్రవేశపెట్టారు తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి. ఈ మేరకు డీజీపీ మాట్టాడుతూ.. వారంతా చత్తీస్గడ్కు చెందిన మావోయిస్టులేనని పేర్కొన్నారు.డీజీపీ శివధర్రెడ్డి ఏమన్నారంటే..తెలంగాణ పోలీసుల ఎదుట మొత్తం 47 మంది అజ్ఞాత మావోయిస్టు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. 32 తుపాకులను కూడా పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యుడు మరియు దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇంర్జి అయిన హేమ్లా ఇతు అలియాస్ విజ్జా, డివిజనల్ కమిటీ సభ్యుడు మరియు 9వ ప్లాటూన్ కమాండర్ అయిన పోడియం లచ్చు అలియాస్ మనోజ్ వంటి ముఖ్య నాయకులు ఉన్నారు. లొంగిపోయిన మావోలు పోలీసులకు 32 ఆయుధాలతో పాటు వివిధ క్యాలిబర్లకు చెందిన 515 తూటాలను అప్పగించారు.పోలీసులకు సమర్పించిన ఆయుధాలు1 - LMG,4 - AK-47 రైఫిల్స్3 - SLR రైఫిల్స్,2 - INSAS రైఫిల్స్2 - 410 మస్కెట్ రైఫిల్స్,1 - 8mm రైఫిల్12 - సింగిల్-షాట్ గన్స్,1 - 9mm పిస్టల్1 - రివాల్వర్,2 - BGL గన్స్2 - ఎయిర్ గన్స్,1 - SBBL గన్దక్షిణ బస్తర్ డివిసి (DVC) కార్యదర్శితో సహా కీలక నాయకులు, సాయుధ కేడర్లు దాదాపు అందరూ ఈరోజు లొంగిపోవడంతో, ప్రస్తుతం దక్షిణ బస్తర్ డివిసి మొత్తం నిర్వీర్యం అంచుకు చేరుకుంది.లొంగిపోయిన 47 మంది క్యాడర్ల వారీగా వివరాలు PLGA బెటాలియన్: 4 మందిDKSZC: 28 మంది9వ & 30వ ప్లాటూన్, దక్షిణ బస్తర్ DVC: 15 మంది (మొత్తం: 47 మంది) లొంగిపోవడం జరిగింది.తెలంగాణకి చెందిన నలుగురు మావోయిస్టు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారువారు కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవాలని అభ్యర్థిస్తున్నాము‘జనజీవన స్రవంతిలో చేరి తెలంగాణ ప్రభుత్వ లొంగుబాటు మరియు పునరావాస విధానం ద్వారా లభించే అన్ని ప్రయోజనాలను పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గత రెండేళ్లలో 818 మంది తెలంగాణ పోలీసులు ముందు లొంగిపోయారు. గత రెండేళ్లలో 334 ఆయుధాలను మావోయిస్టుల నుండి స్వాధీనం చేసుకున్నాం’ అని డీజీపీ పేర్కొన్నారు.అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ మావోయిస్టులు 1. లక్ష్మణరావు అలియాస్ గణపతి, కేంద్ర కమిటీ సభ్యులు2. పసునూరి నరహరి అలియాస్ సంతోషం కేంద్ర కమిటీ సభ్యులు3. జాడి రత్నా భాయ్ అలియాస్ సుజాత ,స్టేట్ కమిటీ మెంబర్4. వార్త శేఖర్ అలియాస్ మంగు, స్టేట్ కమిటీ మెంబర్ -
తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నా.. కవిత పార్టీ ప్రకటన (ఫొటోలు)
-
తుది దశకు మెట్రో టేకోవర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ మొదటిదశ ప్రాజెక్టు సర్కారు స్వా«దీన ప్రక్రియ కీలకదశకు చేరుకుంది. ఎల్అండ్టీ సంస్థకు చెందిన 100% ఈక్విటీ వాటాను కొనుగోలు చేసేందుకు వీలుగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జీవో నంబర్ 127ను విడుదల చేసింది. మెట్రో టేకోవర్కు సంబంధించిన ఆర్థిక, పరిపాలనపరమైన అంశాలకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెలాఖరుకు మెట్రో ప్రాజెక్టు ప్రభుత్వ స్వా«దీనంలోకి రానుంది. మార్చి 30 నాటికే టేకోవర్ ప్రక్రియను పూర్తిచేయాలని భావించినప్పటికీ కొన్ని సాంకేతిక అంశాలతో పాటు, ఐఆర్ఎఫ్సీ (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్)తో స్పష్టమైన ఒప్పందం ఖరారు కాకపోవడం వల్ల జాప్యం చోటుచేసుకుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ పలు దఫాలుగా ఐఆర్ఎఫ్సీతో, ఎల్అండ్టీ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. చివరకు మంత్రివర్గం ఆమోదించడంతో మెట్రో టేకోవర్ తుదిదశకు చేరుకుంది. ఏడాది పాటు ఉద్యోగుల కొనసాగింపు మెట్రో మొదటి దశ ప్రాజెక్టు (69.2 కి.మీ) కొనుగోలు విలువను మొత్తం రూ.15 వేల కోట్లుగా నిర్ధారించారు. ఇందులో భాగంగా ఎల్అండ్టీకి ఉన్న సుమారు రూ.13,615 కోట్ల రుణ భారాన్ని ఐఆర్ఎఫ్సీ రుణం ద్వారా ప్రభుత్వం చెల్లించనుంది. మిగతా రూ.1,385 కోట్లను హెచ్ఎండీఏ ద్వారా సమకూర్చాలని నిర్ణయించింది.టేకోవర్ ఇలా.. ప్రస్తుతం ఎల్అండ్టీ మెట్రోలో పనిచేస్తున్న 115 మంది ఉద్యోగులను ఏడాది పాటు కొనసాగిస్తారు. మెట్రో కార్యకలాపాలపై సలహాల కోసం ఎల్అండ్టీకి చెందిన ఏడుగురు ఉన్నతాధికారుల సేవలను కూడా 6 నెలల పాటు వినియోగించుకోనున్నారు. ఐఆర్ఎఫ్సీ నుంచి తీసుకునే రుణాన్ని 20 ఏళ్ల కాలపరిమితిలో చెల్లించనున్నారు. మెట్రో నుంచి వచ్చే ఆదాయంతోనే ఈ రుణాన్ని చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ భారీ రుణం కోసం ప్రభుత్వం ఐఆర్ఎఫ్సీకి గ్యా రెంటీ ఇవ్వనుంది.అలాగే ఆర్బీఐ ద్వారా డైరెక్ట్ డెబిట్ మాండేట్కు అంగీకరించింది. ఈ మేరకు ఆ సంస్థతో చేసుకోనున్న ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసేందుకు హెచ్ఎంఆర్ఎల్ ఎండీకి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి ప్రభుత్వం పూర్తి అధికారాలు కలి్పంచింది. ఈ ప్రక్రియ పూర్తయితే హైదరాబాద్ మెట్రో పూర్తిస్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థగా మారనుంది.రెండో దశకు మార్గం సుగమంనగరంలోని వివిధ మార్గాల్లో మెట్రో రెండోదశ విస్తరణకు ప్రభుత్వం ఏడాదిన్నర క్రితమే సమగ్రమైన ప్రాజెక్టు నివేదికలను రూపొందించి కేంద్రానికి అందజేసింది. కానీ మెట్రో మొదటిదశ, రెండోదశల మధ్య సమన్వయంపై కేంద్రం లేవనెత్తిన పలు కీలకమైన అంశాలతో మొదటి దశ ప్రాజెక్టు చర్చనీయాంశంగా మారింది. ఎల్అండ్టీ భాగస్వామ్యాన్ని కేంద్రం ప్రశ్నించింది. ఈ క్రమంలోనే మొదటి దశ ప్రాజెక్టు నుంచి తప్పుకోనున్నట్లు గతేడాది ఎల్అండ్టీ ప్రకటించింది. తాము స్వా«దీనం చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అనంతరం టేకోవర్ ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగింది. -
ఇంకా చాలా సమయం ఉంది..!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీతో శుక్రవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి కోడలు ప్రీతీరెడ్డి భేటీ అయ్యారు. బీజేపీలో చేరేందుకే ఆమె వచ్చారంటూ ఊహాగానాలు సాగాయి. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏఐ యూనివర్సిటీ ప్రారం¿ోత్సవానికి ఆహ్వానం అందించేందుకే వచ్చాన న్నారు. ఇందులో రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టం చేశారు. అయితే భవిష్యత్లో ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. ఎంపీ టికెట్ కోసం తాను రాలేదని, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పారు. మామ మల్లారెడ్డి రాజకీయాల్లో ఉన్నారని, ఆయన తమలో ఎవరినైనా పోటీ చేయమంటే సిద్ధమని స్పష్టం చేశారు. -
హైదరాబాద్ : బంగారు కాంతుల్లో అందాల కాంత! (ఫొటోలు)
-
‘ఆర్టీసీ’ విలీనానికి ఓకే..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంతోపాటు, కార్మీక సంఘాల గుర్తింపునకు ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించటంతో మూడు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మీకుల సమ్మె ముగిస్తున్నట్టు కార్మీక సంఘాల నేతలు ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్, లక్ష్మణ్కుమార్లతో కూడిన మంత్రుల బృందం ఆర్టీసీ కార్మీకులతో సుదీర్ఘంగా చర్చించింది. 32 డిమాండ్లపై మంత్రులు చర్చించారు. కొన్నింటిపై సులువుగానే సమ్మతి రాగా, ప్రధాన డిమాండ్లపై మంత్రుల నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు.ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2021, 2025 వేతన సవరణలు, ఆర్టీసీలో కార్మీక సంఘాల పునరుద్ధరణ.. ఈ మూడు డిమాండ్లపై ప్రతిష్టంభన నెలకొంది. చివరకు అర్ధరాత్రి సమయంలో వీటికి మంత్రులు ఓకే చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మూడొంతులు పూర్తయిన... ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు అంగీకరించారు.2021 వేతన సవరణకు సంబంధించి ఏడు శాతంతో మొదలై చివరకు 10 శాతం మేరకు మంత్రులు ప్రతిపాదించిన ఫిట్మెంట్కు కార్మీక సంఘాల నేతలు సమ్మతించారు. కార్మీక సంఘాలను పునరుద్ధరించి ఎన్నికలు జరిపేందుకు కూడా మంత్రులు అంగీకరించారు. మిగతా డిమాండ్లను ఆర్టీసీ బోర్డు, ఎండీ ఆధ్వర్యంలో పరిష్కరిస్తారని మంత్రులు పేర్కొనటంతో కార్మిక సంఘాల సమ్మె విరమణకు అంగీకరించాయి. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచి శుక్రవారం వరకు జరిగిన సమ్మె ముగిసింది. శనివారం ఉదయం మొదటి షిఫ్ట్ నుంచి బస్సులు యథావిధిగా రోడ్డెక్కుతాయని ప్రకటించారు. ప్రభుత్వంలో విలీనమే ప్రధాన డిమాండ్... గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించి ప్రక్రియ ప్రారంభించింది. అప్పటికే ఆంధ్రప్రదేశ్ ఈ విలీన ప్రక్రియ జరగ్గా, తెలంగాణలో మాత్రం జరగలేదు. కార్మిక సంఘాల నుంచి కూడా పెద్దగా డిమాండ్ లేకపోవటంతో దాని ఊసే లేదు. కానీ ఎన్నికలకు ముందు నాటి ప్రభుత్వం ఉన్నట్టుండి ఆ ప్రక్రియ ప్రారంభించింది.గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది. అపాయింటెండ్ డేట్ ప్రకటించకుండా, విలీన ప్రక్రియ ఎలా జరగాలో తేల్చే పేరుతో ప్రభుత్వం సీనియర్ అధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావటంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అప్పటి నుంచి కార్మీకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నా... ప్రభుత్వం మాత్రం దాని ఊసెత్తలేదు. ఎన్నికల సందర్భంగా, ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినా, అధికారంలోకి వచి్చన తర్వాత మాత్రం పట్టించుకోలేదు. చివరకు కార్మీక సంఘాలు సమ్మెకు దిగటం, సమ్మె రెండో రోజే ముగ్గురు కార్మీకులు ఆత్మహత్యలకు యత్నించటం, అందులో డ్రైవర్ శంకర్గౌడ్ మృతి చెందటంతో ప్రభుత్వం దిగి వచి్చంది. చాలా దీర్ఘకాల డిమాండ్లను పరిష్కరిస్తూ వచి్చనా, కార్మీక సంఘాలు సమ్మెకు దిగటాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తొలుత కఠినంగానే వ్యవహరించాలని భావించింది. కానీ, శంకర్గౌడ్ ఆత్మహత్య, మరో ఇద్దరు కార్మీకుల ఆత్మహత్య యత్నంతో ప్రభుత్వం తీరు మార్చుకుంది. 13 గంటల పాటు చర్చలు... ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో సమ్మె పరిష్కార చర్చలు ఏకంగా 13 గంటలపాటు సాగాయి. శుక్రవారం ఉదయం 11.30కు తొలుత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్రాజ్, దానకిశోర్, ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిలతో కూడిన అధికారుల కమిటీ సచివాలయంలో ¿బేటీ అయింది. నాలుగు రోజుల క్రితం ఇదే కమిటీతో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. ఆ చర్చలు విఫలమైన మరుసటిరోజు తొలి షిఫ్టు నుంచే సమ్మె మొదలైంది. శుక్రవారం ఈ కమిటీతో చర్చలు మధ్యాహ్నం భోజన విరామ సమయం వరకు జరిగాయి.భోజనానంతరం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్, లక్ష్మణ్కుమార్లతో ప్రారంభమయ్యాయి. ఏకబిగిన ఆ చర్చలు అర్ధరాత్రి 12.30 వరకు కొనసాగటం విశేషం. తొలుత రెండు జేఏసీల ప్రతినిధులతో, ఆ తర్వాత సంఘాల వారీగా, మధ్యలో జేఏసీ ప్రతినిధుల వారీగా చర్చలు జరిపారు.కొద్దిసేపు మంత్రులు వారిలోవారు విడిగా చర్చించుకోగా, కార్మీక సంఘాల నేతలు వారిలో వారు చర్చించుకున్నారు. ప్రధాన డిమాండ్లపై సయోధ్య కుదరకపోవటం, వేతన సవరణ ఫిట్మెంట్ శాతం మీద ఏకాభిప్రాయం రాకపోవటంతో చర్చల్లో అర్ధరాత్రి వరకు ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు రాత్రి 12.30కు సయోధ్య కుదరటంతో సమ్మె విరమణ ప్రకటన చేశారు. అయితే ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు చర్చల ప్రణాళిక వెనుక..శంకర్గౌడ్ అంత్యక్రియలకు ఆర్టీసీ కార్మీక సంఘాల నేతలు హాజరు కావొద్దన్నదేనన్న చర్చ నడుస్తోంది. నేతలు అంత్యక్రియలకు వెళితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, అది రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెపై ప్రభావం చూపుతుందన్నది ప్రభుత్వ అనుమానమన్న చర్చ కార్మీక సంఘాల్లో జరుగుతోంది. -
టీ లవర్స్ ఈ వీడియో చూస్తే ఇక జన్మలో టీ తాగరు..
-
టీ లవర్స్ ఈ వీడియో చూస్తే ఇక జన్మలో టీ తాగరు..
-
హతవిధి..! డబ్బులు కోసం వస్తే ప్రాణమే పోయింది
గోల్కొండ (హైదరాబాద్): డబ్బులు విత్డ్రా చేయడానికి ఏటీఎం సెంటర్లోకి వెళ్లిన ఓ వ్యక్తికి అది మృత్యుకుహరంగా మారింది. ఏటీఎం సెంటర్ డోర్ లాక్ కావడంతో ఊపిరి ఆడక గుర్తు తెలియని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గురువారం ఉదయం మెహిదీపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని న్యూ మల్లేపల్లిలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తన ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఓ వ్యక్తి విజయనగర్ కాలనీ న్యూ మల్లేపల్లిలోని హెచ్డీఎఫ్సీ ఏటీఎం సెంటర్కు వెళ్లాడు. డబ్బులు తీసుకున్న అనంతరం ఆ వ్యక్తి ఏటీఎం నుంచి బయటకు రావడానికి తలుపు తెరిచాడు. అయితే డోర్ సెల్ఫ్ లాక్ కావడంతో అది ఎంత ప్రయత్నంచినా తెరుచుకోలేదు. దీంతో లోపల చిక్కుకుపోయిన ఆ వ్యక్తి ఉపిరి ఆడక ఏటీఎం సెంటర్లోనే మృతి చెందాడు. చాలా సేపటికి మరో వ్యక్తి డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఏటీఎం సెంటర్కు వచ్చాడు. అప్పటికే ఏటీఎం సెంటర్లో చిక్కుకున్న వ్యక్తి కిందపడి ఉండడం చూసి ఆయన స్థానికులను పిలిచాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఏటీఎం సెంటర్ డోర్ను పగలగొట్టి ఆ వ్యక్తిని పరిశీలించారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: భర్త అక్రమ సంబంధం.. బట్టబయలు చేసిన భార్య!) -
హైదరాబాద్లో కొత్త పార్క్.. ఈ వేసవి సెలవుల్లో ఓ లుక్కేయండి (ఫొటోలు)
-
అల్ట్రా శ్రీమంతులు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ‘అతి భారీ సంపన్నుల’సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 30 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగిన వ్యక్తులను అల్ట్రా హైనెట్వర్త్ ఇండివిడ్యుయల్స్గా (యూహెచ్ఎన్డబ్ల్యూఐ) వ్యవహరిస్తారు. భారత్లో ఈ అల్ట్రా శ్రీమంతుల జనాభాలో హైదరాబాద్ వాటా 6.3 శాతంగా ఉంది. 2015లో ఇది 5 శాతంగా ఉంది. ఇలాంటి సంపన్నుల్లో అత్యధికంగా ముంబై వాటా 35.4 శాతంగా ఉందని గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ఫ్రాంక్ గురువారం విడుదల చేసిన ‘ది వెల్త్ రిపోర్ట్’20వ ఎడిషన్లో వెల్లడించింది. భారత్లో శ్రీమంతులు ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా శ్రీమంతుల ర్యాంకింగ్స్లో భారత్ ఆరో స్థానంలో ఉంది. అల్ట్రా శ్రీమంతులు మన దేశంలో ఈ ఏడాది 19,877 మంది ఉండగా.. 2031 నాటికి 27 శాతం వృద్ధి రేటుతో 25,217కు చేరుతుందని అంచనా. 2021లో ఈ సంఖ్య 12,161గా ఉంది. మన దేశంలో సంపన్నుల సంఖ్య పెరగడం దాని ఆర్థిక పరిణామాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రైవేట్ మూలధన నిధులు, అధునాతన ఆర్థిక మార్కెట్లు, వ్యవస్థీకృత పెట్టుబడిదారుల సంఖ్య పెరగడం, డిజిటలైజేషన్, లిస్టెడ్ ఈక్విటీలు, కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు వంటివి ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. నగరంలో 1 మిలియన్ డాలర్లతో 498 చ.మీ. స్థలం హైదరాబాద్లో విలాసవంతమైన గృహాల మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. నైట్ఫ్రాంక్ ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్ (పీఐఆర్ఐ) ప్రకారం.. హైదరాబాద్లో రూ.9.4 కోట్ల (1 మిలియన్ డాలర్లు)తో 498 చ.మీ. నివాస స్థలాన్ని కొనుగోలు చేయొచ్చని అధ్యయనంలో తేలింది. 2024లోని ఇది 503 చ.మీ.గా ఉంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నివాస నగరంగా ఉన్న మొనాకోలో 1 మిలియన్ డాలర్లతో కేవలం 16 చ.మీ. నివాస స్థలాన్ని మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ఆ తర్వాతి స్థానాల్లో హాంకాంగ్ 23 చ.మీ., జెనీవా 28 చ.మీ. ఉన్నాయి. -
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చే అవకాశం కనబడుతోంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ ఆర్టీసీ జేఏసీ తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ముందుగా శంకర్ గౌడ్కు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ హెచ్చరించిన ఆర్టీసీ జేఏసీ.. రేపటి నుంచి అన్ని డిపోల ఎదుట మౌన దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. సమ్మెపై తెలంగాణ ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ఇదే..రేపటి నుంచి అన్ని డిపోల ఎదుట ఆర్టీసీ జేఏసీ మౌనదీక్షలుఈ నెల 25 నుంచి అన్ని డిపోల్లో వంటా వార్పు26వ అన్ని జిల్లాలో ఆర్టీసీ కార్మికుల కవాతుఈనెల 27వ తేదీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు28వ తేదీన మహిళా ఉద్యోగులతో డిపోల వద్ద బతుకుమ్మలతో నిరసన29వ తేదీన అన్ని డిపోల ఎదుట కార్మికుల అర్ధనగ్న నిరసనలు -
Hyd: నకిలీ టీ పొడి తయారీ ముఠా గుట్టురట్టు
హైదరాబాద్: నకిలీ టీ పొడి తయారీ ముఠా గుట్టురట్టు చేసింది హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్. నగరవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించింది. కల్తీ టీ పొడిని తయారుచేస్తూ, విక్రయిస్తున్న తయారీ కేంద్రాలే లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అధిక లాభాల కోసం నిందితులు తక్కువ నాణ్యత గల టీ పొడికి కృత్రిమ రంగులు గడువు ముగిసిన ముడి పదార్థాలను కలిపి వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కల్తీ పొడిని రోడ్డు పక్కన ఉండే టీ స్టాళ్లతో పాటు కొన్ని ప్రముఖ విక్రయశాలలకు కూడా సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న పది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో కొంపల్లికి చెందిన పరేశ్ రాజన్ (రంగుల సరఫరాదారు), పెట్లాబుర్జుకు చెందిన సంజు అలియాస్ పతి (రంగులు కలిపే వ్యక్తి), ముషీరాబాద్కు చెందిన సతీష్, బౌయిన్ పల్లికి చెందిన నవీన్, ఆసిఫ్ నగర్ కు చెందిన నరసింహ (250 గ్రాముల ఇల్లీగల్ ప్యాకెట్ల తయారీదారు), రాజేంద్రనగర్ కు చెందిన చున్నిలాల్ చౌదరి, బోరబండకు చెందిన నరసింహులు, పెట్లాబుర్జుకు చెందిన రాజేష్, బీదర్కు చెందిన రవీందర్ మరియు మల్లేపల్లికి చెందిన వసీం ఉన్నారు. వీరంతా రంగులు కలపడం, ప్యాకేజింగ్ మరియు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిర్ధారించారు.విచారణ వివరాల ప్రకారం, నిందితులు కోల్కతా, కేరళ మరియు అస్సాం వంటి రాష్ట్రాల నుండి తక్కువ నాణ్యత గల టీ పొడిని సేకరించి, దానికి ఆకర్షణీయమైన రంగు రావడానికి సన్సెట్ ఎల్లో, టార్ట్రాజైన్ వంటి హానికరమైన రంగులతో పాటు బెల్లం పాకం, వాడేసిన టీ పొడి మరియు ఎక్స్పైరీ అయిన టీ పొడిని కలుపుతున్నారు. ఈ హానికరమైన మిశ్రమాలను ప్రసిద్ధ బ్రాండ్ల పేరుతో రీ-ప్యాకేజింగ్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. ఇటువంటి కల్తీ టీ పొడి సేవించడం వల్ల కడుపు సంబంధిత వ్యాధులు, అలర్జీలు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ దాడుల్లో సుమారు 3,000 కిలోల కల్తీ టీ పొడి, 1500 కిలోల ఎక్స్పైరీ టీ పొడి, 100 కిలోల బెల్లం మరియు భారీగా కృత్రిమ రంగులను సీజ్ చేశారు.ఈ సందర్భంగా ప్రజలకు ముఖ్య గమనిక జారీ చేస్తూ, టీ పొడిని కేవలం గుర్తింపు పొందిన విక్రేతల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. ఆహార కల్తీకి సంబంధించి ఎటువంటి అనుమానం ఉన్నా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. తయారీదారులు ఆహార భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారతీయ న్యాయ సంహిత, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడులను టాస్క్ ఫోర్స్ డీసీపీ శ్రీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐ.పి.ఎస్. గారి పర్యవేక్షణలో, H-FAST ఇన్స్పెక్టర్లు ఎన్. రంజిత్ కుమార్ గౌడ్, ఎం. అంజయ్య మరియు వారి బృందం విజయవంతంగా నిర్వహించింది. -
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చ జరిగింది. ఈ చర్చలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందర పాటు నిర్ణయాలు తీసుకోద్దు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టి పెట్టింది’ అని వ్యాఖ్యానించారు.కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేసిన సీఎం రేవంత్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు రేపు ఆర్టీసీ కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాలని చెప్పారు. -
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, వరంగల్: నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై వరంగల్ ఎంజీఎం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.శంకర్ గౌడ్ పరిస్థితి నిలకడగా ఉంది. 60 నుండి 80 శాతం కాలిన గాయాలయ్యాయి. మంటల వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నాం. ఒళ్ళంతా మంటల వల్ల ఎడిమా వచ్చింది. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నాం. మాట్లాడే పరిస్థితి లేదు, చికిత్సకు స్పందిస్తున్నారు’ అని ఎంజీఎం ఆర్ఎం డాక్టర్ అశ్విన్ తెలిపారు. నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తతనర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అప్రమత్తమైన తోటి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్ శంకర్కు అంటుకున్న మంటల్ని ఆర్పేశారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలు దారితీస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న శంకర్ మానకిక ఒత్తిడికి గురయ్యారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. -
బ్యాంకుల్లో ఆ ఖాతాలు ఉంటే.. వీసీ సజ్జనర్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు అధికారులు కేవలం ఖాతాల ఓపెనింగ్ టార్గెట్స్ వెంట పడకుండా, కస్టమర్ల భద్రతకు పెద్దపీట వేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సూచించారు. ఒక్క కస్టమర్ కూడా సైబర్ నేరాల బారిన పడకుండా చూడటమే ప్రాథమిక లక్ష్యంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బంజారాహిల్స్లోని టీజీఐసీసీసీలో గురువారం మ్యూల్ ఖాతాల నియంత్రణపై బ్యాంకు అధికారులతో ఆయన సమన్వయం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్, అడిషనల్ సీపీ ఎం. శ్రీనివాసులుతో పాటు 45 ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 75 మంది ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న మ్యూల్ ఖాతాలను అరికట్టేందుకు 'సేఫ్ కస్టమర్ చాలెంజ్'ను బ్యాంకులు స్వీకరించాలని కోరారు. ఈ క్రమంలో ప్రతి బ్యాంకు శాఖ 'జీరో మ్యూల్ అకౌంట్స్' లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఏ బ్యాంకు శాఖలోనూ సైబర్ బాధితులు ఉండకూడదని, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా ఆయా బ్రాంచీల పనితీరును అంచనా వేసుకోవాలని స్పష్టం చేశారు.బ్యాంకు మేనేజ్మెంట్లు ఖాతాల సంఖ్యను కాకుండా, కస్టమర్ల భద్రతనే ఉద్యోగుల కీలక పనితీరు సూచికగా (KPIs) పరిగణించాలని హితవు పలికారు. 'ఆపరేషన్ ఆక్టోపస్ 2.0లో భాగంగా 850 కేసుల్లో రూ. 150 కోట్ల మోసాన్ని గుర్తించామని, మ్యూల్ ఖాతాల ఓపెనింగ్లో సహకరించిన 32 మంది బ్యాంకు అధికారులను అరెస్ట్ చేశామని వెల్లడించారు.కంబోడియా, వియత్నాం, దుబాయ్ వంటి దేశాల నుంచి సాగుతున్న అంతర్జాతీయ సైబర్ ముఠాలు.. స్థానిక బ్యాంకు అధికారులతో కుమ్మక్కై ఈ నేరాలకు పాల్పడుతున్నాయని వివరించారు. కేవైసీ (KYC) నిబంధనలను ఉల్లంఘించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, వారిని బ్యాంకింగ్ రంగం నుంచే బ్లాక్లిస్ట్ చేయాలని సూచించారు. బ్యాంకుల్లో 'మ్యూల్ ఖాతాలు' ఉంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లను ముందస్తుగా క్లోజ్ చేసేందుకు వచ్చే కస్టమర్ల విషయంలో బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్ల ఒత్తిడితోనే వారు డబ్బు విత్డ్రా చేస్తున్నారా? అన్నది గమనించి వారిని కాపాడాలని కోరారు.మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు 'మ్యూల్ హంటర్' వంటి ఆధునిక సాంకేతిక పరికరాలను వాడాలని, 1930 హెల్ప్లైన్ నంబర్పై కస్టమర్లకు విస్తృత అవగాహన కల్పించాలని బ్యాంకర్లకు సూచించారు. సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ను పూర్తిగా తుడిచిపెట్టే వరకు ఆపరేషన్ ఆక్టోపస్ కొనసాగుతుందని, బ్యాంకులు పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివమారుతి, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రేయసి రావే
హైదరాబాద్: పెట్రోల్ క్యాన్తో హైటెన్షన్ టవర్ ఎక్కిన ఓ యువకుడు తన ప్రేయసితో మాట్లాడించాలని.. లేకపోతే పెట్రోల్ పోసుకుని దూకుతానని పోలీసులను బెదిరించాడు. ఇలా దాదాపు మూడు గంటల పాటు మండుటెండలో ముచ్చెమటలు పట్టించాడు. అల్లాపూర్ ప్రాంతానికి చెందిన సాల్మాన్ రాజ్కు ఎస్ఆర్టీనగర్కు చెందిన యువతితో పరిచయమైంది. ఈ క్రమంలో ఇటీవల సాల్మన్రాజ్ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది.ఆ తరువాత ఆమెకు దగ్గరకావాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో బుధవారం పెట్రోల్ క్యాన్తో మోతీనగర్ పార్కులో ఉన్న హైటెన్షన్ టవర్ను ఎక్కాడు. సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు సురేందర్తో మాట్లాడాడు. యువతితో మాట్లాడించాలని యువకుడు కోరాడు. అయితే ఆతరువాత బోరబండ ఎస్హెచ్ఓ సురేందర్ మాటల్లోకి దించి దిగివచ్చేలా చేశాడు. అనంతరం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
RTC Strike: ప్రైవేట్ వాహనాల నిలువు దోపిడీ
సాక్షి, హైదరాబాద్ : సిటీబస్సు స్తంభించింది. బుధవారం మొదటి రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. నగరంలోని వివిధ రూట్లలో అద్దె, ఎలక్ట్రిక్ బస్సులను నడిపినప్పటికీ.. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు తదితర వర్గాల ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. వస్త్ర దుకాణాలు, ప్రైవేట్ కార్యాలయాలు, షాపింగ్ కేంద్రాలు, మాల్స్, ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, హౌస్కీపింగ్ సిబ్బందిపై సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించింది. గ్రేటర్ పరిధిలోని 25 డిపోలకు చెందిన సుమారు 3 వేల బస్సుల్లో 90 శాతం డిపోలకే పరిమితమయ్యాయి. రూ.6 కోట్ల నష్టం.. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువగా ఉండే మార్గాల్లో ఆర్టీసీ అద్దె, ఎలక్ట్రిక్ బస్సులు నడిచాయి. సుమారు 450 ఎలక్ట్రిక్ బస్సుల్లో 400 వరకు నడిపినట్లు అధికారులు తెలిపారు. వివిధ డిపోల్లోని 260 అద్దె బస్సుల్లో 180 వరకు నడిచాయి. ఇవి కాక ఔట్సోర్సింగ్ డ్రైవర్లతో మరో 120 బస్సులను అందుబాటులోకి తెచి్చనట్లు అధికారులు పేర్కొన్నారు. వీటిలో 35 వేల మందికిపైగా రాకపోకలు సాగించినట్లు అంచనా. సాధారణ రోజుల్లో సుమారు 23 లక్షల మంది ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటారు. సమ్మెతో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్కు రూ.6 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. మహాత్మాగాంధీ, జేబీఎస్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి, ఏఎస్రావునగర్ తదితర ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచి్చంది. క్యాబ్లు, మ్యాక్సీ క్యాబ్లు, మినీబస్సులు, కార్లు తదితర వాహనాల్లో అడ్డగోలు చార్జీలు వసూలు చేశారు. ఉప్పల్ నుంచి హన్మకొండకు రూ.500 నుంచి రూ.700 వరకు తీసుకున్నట్లు ప్రయాణికులు చెప్పారు. అన్ని వైపులా ఇదే తరహా దోపిడీ కొనసాగింది. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు కూడా కొన్ని ఎలక్ట్రిక్, అద్దె బస్సులను నడిపినప్పటికీ ఇబ్బందులు తప్పలేదు. ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర క్యాబ్ సంస్థలు సైతం సమ్మెను సొమ్ము చేసుకున్నాయి. చార్జీలను రెట్టింపు చేశాయి. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు ఓలా ఆటోలో సాధారణంగా రూ.150 వరకు చార్జీ అవుతుంది. బుధవారం రూ.350 వరకు వసూలు చేశారు. బైక్లు, క్యాబ్లలోనూ రెట్టింపు వసూళ్ల పర్వం కొనసాగింది. కిక్కిరిసిన మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు.. ప్రయాణికులు మెట్రోరైళ్లు, ఎంఎంటీఎస్లను ఆశ్రయించడంతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు హెచ్ఎంఆర్ఎల్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. 56 రైళ్లను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. సాధారణ రోజుల్లో మెట్రోల్లో 4.8 లక్షల మంది పయనించగా బుధవారం 5 లక్షల మందికి పైగా మెట్రో సేవలను వినియోగించుకున్నట్లు అంచనా. -
జర్నీ జామ్ ఫుల్.. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల నిలువు దోపిడీ, ఇక్కట్లు (ఫొటోలు)
-
HYD: పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు
సాక్షి, హైదరాబాద్: మరోసారి మహానగరంలో పెట్రోల్ బంకులు ‘డ్రై’ (నిల్వలు లేని)గా మారుతున్నాయి. కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరాలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు చూసి వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. చమురు సంస్థలు ఇంధన సరఫరాను గణనీయంగా తగ్గించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సాధారణంగా పెట్రోల్ బంకుల డీలర్లు ముందుగానే నగదు చెల్లించి తమకు కావాల్సిన పరిమాణంలో ఇంధనాన్ని (ఇండెంట్) పొందుతుంటారు. ప్రస్తుతం డీలర్లు నగదు మొత్తాన్ని చెల్లించినప్పటికీ ఇండెంట్లో కనీసం సగం కూడా సరఫరా కాని పరిస్థితి నెలకొంది. చమురు సంస్థల టెర్మినళ్లలో సరిపోను నిల్వలు ఉన్నా.. కఠినమైన కోటాను అమలు చేస్తుండటంతో ప్రైవేటు బంకులతోపాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జైళ్ల, పౌరసరఫరాల శాఖ బంకులూ రెండు రోజులకోసారి బంకులు ‘డ్రై’ స్థితికి చేరుకుంటున్నాయి. -
ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు హైలైట్స్.. ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం!ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం.మంత్రులతో సబ్ కమిటీ లేదా కమిటీ వేసే యోచనలో సర్కార్.నేటి కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటన ఉండే అవకాశం.ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె.. పోలీసుల కీలక ఆదేశాలుఆర్టీసీ కార్మికుల సమావేశాలకు కన్వెన్షన్ సెంటర్లు ఇవ్వొద్దని పోలీసుల ఆదేశం.ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అనుమతి లేదు: వికారాబాద్ పోలీసులుసమ్మెకు సహకరిస్తే చర్యలు తప్పవు. నిజామాబాద్..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 645 బస్సులకు గాను 206 నడుస్తున్న బస్ సర్వీసులుపోలీసులు పహారాలో అద్దె బస్సులతో నడుపుతున్న ఆర్టీసీ యాజమాన్యంనేటి నుండి నిరవధిక దీక్షలు చేస్తామని ప్రకటించిన కార్మిక సంఘాలుఔట్ సోర్సింగ్, ప్రైవేట్ ఉద్యోగుల ద్వారా నడిపిస్తున్న యాజమాన్యం మహబూబాబాద్ జిల్లా..మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట మహబూబాబాద్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు.డిపో నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సులు.పోలీసుల బందోబస్తు నడుమ కదిలిన బస్సులు.బస్టాండ్కి చేరుకుంటూన్న ప్రయాణికులు.పోలీస్ వలయంలో మహబూబాబాద్ బస్టాండ్.హన్మకొండ, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు.ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో కలిసి వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్. జనగామ జిల్లాజనగామ ఆర్టీసీ డిపో వద్ద హృదయవిదారక దృశ్యాలు.జనగామలో పోలీసుల కాళ్లు మొక్కిన ఆర్టీసీ కార్మికులు.సమ్మెలో భాగంగా బస్సులను అడ్డుకున్న కార్మికులు.పోలీసులు కార్మికులను అడ్డుకోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు.తమ పొట్ట కొట్టొద్దంటూ కొందరు కార్మికులు పోలీసుల కాళ్లు మొక్కి ప్రాధేయపడటం అక్కడి వారిని కలిచివేసింది.ఈ ఘటనతో డిపో పరిసరాల్లో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.పోలీసులు వారిని సముదాయించి బందోబస్తు మధ్య బస్సులను పంపించారు.సూర్యాపేట జిల్లాబస్ డిపో ఎదుట పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం.పోలీస్ పహారాలో డిపో నుంచి బస్సులను బయటకు తీసుకెళ్తుండగా అడ్డుకున్న కార్మికులుసమ్మె చేస్తుండగా బస్సులను ఎలా బయటకు తీసుకెళ్లారంటూ కార్మికుల ఆందోళన బస్సుకో కానిస్టేబుల్తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన యాజమాన్యంఅద్దె బస్సులు, ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లతో నడిపించే ప్రయత్నంఅడ్డుకుంటున్న కార్మిక సంఘాలుపోలీసుల భద్రత మధ్య నడుస్తున్న బస్సులుబస్సుకో కానిస్టేబుల్ను ఏర్పాటు చేయిస్తున్న వైనం కరీంనగర్ జిల్లారెండో రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె..ఉమ్మడి జిల్లాలోని 11 డిపోల్లో మొత్తం వెయ్యి బస్సులకు గాను డిపోలకే పరిమితమైన సగానికి పైగా బస్సులుప్రైవేట్ డ్రైవర్లతో ప్రధాన రూట్లలో బస్సులు నడుపుతున్న ఆర్టీసీమరికొన్ని ఊళ్లకు బస్సులు లేక, ఉన్నా సరిపడా రాకపోవడంతో బస్టాండ్లలో ప్రయాణీకుల నిరీక్షణఆర్టీసీ ఉద్యోగులు వర్సెస్ సర్కార్ ప్రతిష్ఠంభనతో ప్రయాణీకుల ఇక్కట్లు.ఆర్టీసీ సమ్మెతో ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వాహనాల దందా.అధిక ధరలు వసూళ్లు.సూర్యాపేట జిల్లా :రెండవ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెసూర్యాపేట డిపో ఎదుట బైటాయించి కార్మికుల ధర్నాబస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు కొనసాగుతున్న సమ్మె.. తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె.ఆర్టీసీ సమ్మెతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు.వీలైనన్ని ఎక్కవ బస్సులు నడుపుతున్నామంటున్న అధికారులు.ప్రైవేటు విద్యాసంస్థల డ్రైవర్లు, తాత్కాలిక డ్రైవర్ల సమీకరణ.సిబ్బందిని అడ్డుకుంటే పీడీపీపీ చట్టం కింద కేసులు.నల్లగొండ జిల్లామిర్యాలగూడలో రెండవ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెఔట్ సోర్సింగ్ సిబ్బందితో బస్సులను నడిపిస్తున్న అధికారులుబస్టాండ్లో భారీగా మోహరించిన పోలీసులుబస్టాండ్ వద్దకు చేరుకొని ఆందోళనలకు దిగిన కార్మికులుహైదరాబాద్..నేడు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ..ఆర్టీసీ సమ్మె, కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చర్చించనున్న కేబినెట్..ఇందిరమ్మ కుటుంబ భీమా విధివిధానాలపై నిర్ణయం తీసుకోనున్న కేబినెట్..ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక, అజారుద్దీన్-కోదండరాం ఎమ్మెల్సీల అభ్యర్థిత్వంపై చర్చించనున్న కేబినెట్..మెట్రో స్వాధీన ప్రక్రియ, నిర్వహణపై చర్చించనున్న కేబినెట్.. -
148 కోట్లతో అప్రోచ్ రోడ్ల నిర్మాణం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో మూడు సంవత్సరాల క్రితం బ్రిడ్జిలు నిర్మించినప్పటికీ వాటికి అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడం మూలంగా అవి నిరూపయోగంగా ఉన్నాయి. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఇన్ఫ్రా స్ట్రక్చర్, క్యాపిటల్ వర్క్స్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు, క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన రూ.148 కోట్ల నిధుల విడుదలకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం ప్రకటించారు. సరైన పద్ధతిలో ప్రతిపాదనలు పంపితే ఆమోదం తెలపడం, అమలు చేయడం సులభం అవుతుందని పనులు వేగవంతం అవుతాయని డిప్యూటీ సీఎం తెలిపారు. 1:4 నిష్పత్తిలో వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపితే సబ్ కమిటీలు చర్చించి ఆమోదం తెలుపుతామని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని జూన్ 8 లోపల అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రగతిని తాను ప్రత్యేకంగా ప్రతి వారం సమీక్షిస్తానని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. టెండర్లు పిలవడం, పనులు చేపట్టడం , నాణ్యతతో పనులు పూర్తి చేయడం వంటి అన్ని అంశాలను తాను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో భారీ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
అటానమస్ ఎంటర్ప్రైజ్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ రెడ్వుడ్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోని హైటెక్ సిటీలో తన గ్లోబల్ సెంటర్ను బుధవారం ఘనంగా ప్రారంభించింది. సుమారు 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రెడ్వుడ్ సీఈఓ కెవిన్ గ్రీన్, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (ఐకమ్) వ్యవస్థాపక సీఈఓ ఫణి నాగార్జున, రెడ్వుడ్ ఇండియా కంట్రీ హెడ్ రాజ్కుమార్ పాల్రాజ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా రెడ్వుడ్ సీఈఓ కెవిన్ గ్రీన్ మాట్లాడుతూ, అటానమస్ ఎంటర్ప్రైజ్ నిర్మాణంలో హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏజెంటిక్ AI ఆవిష్కరణలు, గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్లో ఈ కేంద్రం ప్రధాన చోదక శక్తిగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఉన్న అద్భుతమైన టాలెంట్, ఎకోసిస్టమ్ తమ కంపెనీ వృద్ధికి ఎంతో దోహదపడుతుందని, అందుకే ఇక్కడ కార్యకలాపాలను విస్తరిస్తున్నామని ఇండియా కంట్రీ హెడ్ రాజ్కుమార్ పాల్రాజ్ పేర్కొన్నారు.ఉద్యోగ కల్పన విషయంలో కూడా రెడ్వుడ్ సాఫ్ట్వేర్ భారీ లక్ష్యాలను ప్రకటించింది. 2027 చివరి నాటికి ఇంజనీరింగ్, క్లౌడ్, బిజినెస్ ఆపరేషన్స్ విభాగాల్లో సుమారు 300 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇది కంపెనీ మొత్తం గ్లోబల్ వర్క్ఫోర్స్లో దాదాపు మూడొంతులకు సమానం. -
ఈ సినిమాలో పెద్ద స్టార్ట్ నటీమణులు ఒకేసారి కనిపించనున్నారు
-
అల్లు అర్జున్ షిఫ్ట్.. ముంబైకి కాదు.. ఎక్కడో తెలుసా?
టాలీవుడ్లో ఇప్పుడంతా అల్లు అర్జున్ టాపిక్ నడుస్తోంది. ఆయన త్వరలోనే ముంబైకి షిఫ్ట్ అవుతున్నారని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. రాకా మూవీ షూటింగ్ కోసం ముంబైలోనే ఉంటారని రాసుకొస్తున్నారు. వీటిపై అల్లు అర్జున్ తండ్రి అరవింద్ సైతం స్పందించారు. కేవలం సినిమా షూట్ కోసమే ముంబైలో ఎక్కువగా ఉంటున్నారని.. అక్కడే సెటిలయ్యే ఉద్దేశం బన్నీకి లేదని క్లారిటీ ఇచ్చారు.ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది. హైదరాబాద్లోని మాదాపూర్లో ప్రస్తుతం బన్నీ ఉంటున్నారు. అయితే నగరంలోనే మరో ఇంటిని ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ ఇంటికి సమీపంలోనే జూబ్లీహిల్స్లో ఓ ఖరీదైన ఇంటిని నిర్మిస్తున్నారని లేటేస్ట్ టాక్. ఈ ఇంటిని దాదాపు నాలుగు వేల చదరపు అడుగుల గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ లగ్జరీ హోమ్ కోసం దాదాపు రూ.80 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివర్లోనే కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేస్తారని కూడా టాక్ వినిపిస్తోంది.ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ ప్రస్తుతం రాకా మూవీలో నటిస్తున్నారు. అట్లీ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. -
ర్యాడికలైజేషన్ నిందితుడు నసీర్ కు .. హైదరాబాద్ లో లింకులు
-
హైదరాబాద్లో ఆఫీస్ స్థలాలకు గిరాకీ
న్యూఢిల్లీ: ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతుండడంతో అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ సహా దేశంలోని ఎనిమిది ప్రముఖ నగరాల్లో జనవరి–మార్చి త్రైమాసికంలో కార్యాలయ అద్దెలు 2–15 శాతం మధ్య పెరిగినట్టు (క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు) రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ఫ్రాంక్ ఒక నివేదికను విడుదల చేసింది. ముఖ్యంగా బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్లోని ప్రముఖ ప్రాంతాల్లో మొదటిసారి చదరపు అడుగుకు (ఎస్ఎఫ్టీ) నెలవారీ అద్దె రూ.100 మార్క్ను అధిగమించింది. ముంబైలో ఇప్పటికే నెలవారీ ఆఫీస్ అద్దెలు రూ.100కు పైనే ఉండడం గమనార్హం.నగరాల వారీ డేటా.. హైదరాబాద్లో కార్యాలయ స్థలాల నెలవారీ అద్దె చదరపు అడుగుకు 8 శాతం ఎగిసింది. రూ.77.5కు చేరింది. చెన్నైలోనూ 8 శాతం పెరుగుదలతో రూ.74.50గా నమోదైంది. అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్, కోల్కతాలో కార్యాలయ స్థలాల (ఆఫీస్) అద్దెలు మార్చి త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 15 శాతం పెరిగాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో నెలవారీ ఆఫీస్ అద్దెలు 15 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.105కి చేరాయి. ముంబైలో నెలవారీ ఆఫీస్ అద్దెలు 6 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.125 మార్క్నకు చేరాయి. బెంగళూరులో చదరపు అడుగు నెలవారీ అద్దె రూ.100.6కు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 7 శాతం పెరిగింది. పుణెలో 5 శాతం పెరిగి ఎస్ఎఫ్టీ అద్దె రూ.80.9కు చేరింది. కోల్కతాలో ఆఫీస్ అద్దెలు 15 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.48.30కి చేరాయి. అహ్మదాబాద్లో నెలవాసీ సగటు ఆఫీస్ స్పేస్ అద్దె ధర 2 శాతం పెరిగి ఎస్ఎఫ్టీకి రూ.45గా ఉంది. డిమాండ్ ఎక్కువ.. సరఫరా తక్కువ 2026 మొదటి త్రైమాసికంలో ఎనిమిది నగరాల్లో రికార్డు స్థాయిలో 2.99 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాల లీజు లావాదేవీలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 6 శాతం పెరుగుదల కనిపిస్తోంది. కానీ, ఇదే కాలంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్థలాలు 1.4 కోట్ల చదరపు అడుగులు మాత్రమే. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే సరఫరా సైతం 154 శాతం పెరిగింది. కానీ, డిమాండ్కు తగ్గ సరఫరా రానట్టు నైట్ఫ్రాంక్ నివేదిక తెలిపింది.కీలక మార్కెట్లలో సరఫరా తగ్గడంతో అద్దెలు స్థిరంగా పెరిగేందుకు దారితీసినట్టు వెల్లడించింది. డెవలపర్లు ఆఫీస్ ప్రాజెక్టుల కంటే నివాస గృహాలవైపు మొగ్గు చూపడం డిమాండ్కు తగ్గ సరఫరా రాకపోవడానికి కారణమని వివరించింది. ‘‘2021 నుంచి ఆపీస్ స్థలాలకు డిమాండ్, సరఫరా మధ్య అంతరం కొనసాగుతోంది. దీంతో సరఫరా పరిస్థితులు కఠినంగా మారాయి. 2021లో 17.2 శాతం మేర కార్యాలయ స్థలాలు ఖాళీగా ఉంటే, ఇప్పుడు 13.9 శాతానికి తగ్గిపోయింది. కార్యాలయ స్థలాల అభివృద్ధికి భారీ పెట్టుబడులు అవసరం కావడంతో, కేవలం కొన్ని సంస్థలు మాత్రమే ఈ రంగం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి’’ నైట్ఫ్రాంక్ నివేదిక వివరించింది. -
సీటు కోసం బస్సులో రచ్చ చేసిన మహిళ
ధారూరు: హైదరాబాద్–తాండూర్ ప్రయాణిస్తున్న ఎక్స్ప్రెస్ బస్లో మహిళలు సీటు కోసం గొడవకు దిగారు. చిలికి చిలికి గాలివానగా మారిన ఈ గొడవ ధారూరు పోలీస్స్టేషన్కు చేరింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బస్సు వికారాబాద్కు చేరుకోగా ధారూరు మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు బస్సు ఎక్కారు. కాగా బస్సులో తాండూర్కు వెళుతున్న ఓ ప్రయాణికురాలితో పంచాయితీ ఏర్పడింది. సీటులో చిన్న పిల్లను తీసుకుని సీటు ఇవ్వాలని అల్లిపూర్ మహిళలు కోరారు. ఇందుకు ఆమె నేను ఇవ్వనంటూ గొడవపడింది. ఈ గొడవ తారాస్థాయికి చేరడంతో డ్రైవర్ నేరుగా బస్సును ధారూరు ఠాణాకు తీసుకెళ్లారు. బస్సు ఆపగానే తాండూర్కు చెందిన మహిళ బస్సులోంచి కిందకు దిగి పరుగుపెట్టింది. దీంతో పోలీసులు అల్లిపూర్ మహిళలకు సర్దిచెప్పి పంపించారు. గొడవ సద్దుమణగడంతో బస్సు తాండూర్కు వెళ్లింది. -
హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన శివాలయం గురించి తెలుసా మీకు? (ఫోటోలు)
-
ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దు.. చర్చలకు సిద్దం: మంత్రి పొన్నం
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్డేట్స్.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి సీతక్క విజ్ఞప్తిఆర్టీసీ సోదరులు సమ్మె విరమించాలిఆర్టీసీ మనందరి కుటుంబం…కార్మికులు మా సోదరులు..సమ్మె విరమించి విధుల్లో చేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాసమ్మె సమస్యకు పరిష్కారం కాదు… ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కారం కోరుతోంది.మీ సమస్యలపై ఇప్పటికే ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేశాం… 4 వారాల్లో నివేదిక వస్తుంది.మీరు లేవనెత్తిన విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు వంటి అంశాలు సాంకేతికంగా పరిశీలనలో ఉన్నాయిఈ రెండు కీలక విషయాల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించే పనిలో ఉన్నాంఆర్టీసీని కాపాడుకుంది కాంగ్రెస్ పార్టీ: అద్దంకిఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కామెంట్స్..ఆర్టీసీ కార్మికులను నష్టపరచాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయికుట్రదారులను కార్మికులు నమ్మవద్దుఆర్టీసీని కాపాడుకుంది కాంగ్రెస్ పార్టీఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని కేసీఆర్ అండ్ కో భావించిందికేసీఆర్ కోసం కొందరు చేసే సమ్మెకు కార్మికులు సహకరించవద్దుఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్, మంత్రి పొన్నం అండగా ఉంటారు చర్చలకు సిద్దం: మంత్రి పొన్నంఆర్టీసీ జేఏసీతో చర్చలకు సిద్దం.సమ్మె విరమించి చర్చలకు రండి.32 సమస్యల్లో 29 అంశాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం.కమిటీ వేశాం.. నాలుగు వారాల సమయం అడిగాం.2018లో ఈవీ బస్సులు మొదలయ్యాయి.ఈవీ బస్సులు కేంద్రం నిర్ణయంఈవీ బస్సుల కారణంగా ఒక్క ఉద్యోగిని కూడా తొలగించం.గత ప్రభుత్వ చర్యలు గుర్తులేదా?.హరీష్ రావు వెనుక ఉండి సమ్మెను నడిపిస్తున్నారు.ఆర్టీసీని నిర్వీర్యం చేసుకోవద్దు. నిర్మానుష్యంగా ఎంజీబీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెతో వెలవెలబోతున్న బస్టాండ్బస్సులు లేకపోవడంతో ఖాళీగా ఎంజీబీఎస్. హైదరాబాద్..ప్రతీ రోజు 6779 బస్సులు నడుపుతున్న ఆర్టీసీ.సమ్మె కారణంగా 1247 బస్సు లు నడుపుతున్న ఆర్టీసీ..సాయంత్రం వరకు మరికొన్ని బస్సుల సర్వీసులు పెంచుతామంటుంన్న ఆర్టీసీ.ఈరోజు 9 గంటల వరకు కేవలం 18% బస్సులు మాత్రమే నడిపిన ఆర్టీసీ..ఇందులో 634 ప్రైవేట్ బస్సులు నడుపుతున్నారు..ఎలక్ట్రిక్ బస్సులు 467 నడుపుతున్నారు...మొత్తం 4 శాతం బస్సులను నడుపుతున్న ఆర్టీసీ..పోలీసుల భద్రత మధ్య డిపోల నుంచి బస్సులు ముందుకు సాగుతున్నాయి. ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వం అలర్ట్..ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.12 గంటలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ మీటింగ్..ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో చొరవ తీసుకోవాలని మంత్రి పొన్నం సూచించనున్నట్టు సమాచారం. నల్లొండలో నిలిచిపోయిన 350 బస్సు సర్వీసులుఉమ్మడి నల్లొండ జిల్లాలో నిలిచిపోయిన 350 బస్సు సర్వీసులుఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పాక్షికంగా సాగుతోంది.ఉమ్మడి నల్గొండలో 180కి పైగా ఎలక్ట్రిక్, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి.ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 డిపోల్లో 350కి పైగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ బంద్ సంపూర్ణంకార్మికుల సమ్మెతో నాగర్ కర్నూల్ జిల్లాలో ఆర్టీసీ డిపో మూతపడింది.బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల రాకపోకలు స్తంభించిపోయాయి.బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలను ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు.పోలీసుల పహారా మధ్య ఇప్పటివరకు మూడు ప్రైవేటు బస్సులను డిపో నుంచి బయటకు తీశారు.ఆర్టీసీ బస్సు-లారీ ఢీ..కరీంనగర్లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఢీకొన్న ఆర్టీసీ బస్సు-లారీఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.దీంతో వారిని స్థానికుల సహాయంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..ఆర్టీసీ సోదరులకు నా కుటుంబ సభ్యులకు విజ్ఞప్తిఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు దృశ్య సమ్మె విరమించాలని విజ్ఞప్తిసమ్మె సమస్యకు పరిష్కారం కాదు..ప్రభుత్వం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది..నాలుగు వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించాం..కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటు..ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి వ్యతిరేకత లేదు..అన్ని వెంటనే పరిష్కారం అయ్యే అంశాలు..ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు పెండింగ్లో ఉన్నాయి..ఈ రెండు అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చరించాల్సి ఉంది.వారు అధ్యయనం చేయడానికి నాలుగు వారాల గడువు అడిగాం..ఈ రెండు అంశాలు ముఖ్యమంత్రి దగ్గర, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చిస్తామని నలుగురు అధికారుల కమిటీకి తెలియజేశాం..ఆర్టీసీ విలీనం ఆలస్యం అయిన ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి..గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం నాయకత్వ అంశాలు ఉన్నాయిప్రభుత్వం ఏర్పడగానే గతంలో పెండింగ్ లో ఉన్న 2017 పీఆర్సీ క్లియర్ చేశాం..పెండింగ్ డీఏలు లేకుండా క్లియర్ చేశాం..2013 పెండింగ్ బాండ్స్ క్లియర్ చేశాంరూ.1205 కోట్లు ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించాంరూ.690 కోట్లు ఉన్న సీసీఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించాంఇవే కాకుండా నెల వారిగా పీఎఫ్, సీసీఎస్కి 75 కోట్లు చెల్లిస్తున్నాం..ఉద్యోగులపై పని భారం పడకుండా ఉండడానికి 4538 ఉద్యోగాల నియామకాలు భర్తీ త్వరలోనే పూర్తవుతుంది..సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న 1134 కారుణ్య నియామకాలు చేపట్టాం..గత ప్రభుత్వం లో వివిధ కారణాలతో శాశ్వతంగా సర్వీసు నుండి రిమూవ్ అయిన వారిలో ఇప్పటి వరకు దాదాపు 250 మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది..అన్ని అంశాలు పరిష్కారం చేస్తాం..ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది..మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్టు వద్దు..గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఆర్టీసీ లో ఏం జరిగిందో కార్మికులందరికీ తెలుసుఆర్టీసీలో ప్రయాణించింది పేదలు గ్రామీణ ప్రాంత ప్రజలు, మన అక్కా చెల్లెల్లు ..ప్రతి రోజు 65 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే అందులో 45 లక్షల మంది మహిళలే ఉన్నారు..ఆర్టీసీలో నిత్యం ఉపాధి కోసం విద్య, వైద్యం కోసం పోయే పరిస్థితి..ప్రభుత్వం పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్న.. సమ్మె వద్దు..మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు ప్రజాస్వామ్య పద్ధతిలో మీ నాయకులు నిరసన తెలుసుకోవచ్చు..ప్రభుత్వం పై ఒత్తిడి తేవచ్చుపేద ప్రజల ప్రయాణాలకు ఇబ్బందులు కలగజేయవద్దు..పేద ప్రజలకు కార్లలో పోయే స్థోమత లేదు..ప్రతి ఒక్క ఆర్టీసీ కుటుంబ సభ్యుడికి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్న..ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తరుపున కొట్లాడి సాధించుకుందాం..ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది..మీ సమస్యల పరిష్కారం పై సానుకూలంగా ఉన్నాం..సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దు..నేను విద్యార్థి నాయకుడిని.. కార్మికులకు అండగా ఉంటా..గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లైఫ్ లైన్ అయిన ఆర్టీసీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి..మీ నాయకులు నిరసనలు చెప్పుకొని వారికి ఆ హక్కు ఉంది..మిగతా వారంతా విధుల్లో చేరి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్న.. కామారెడ్డిలో ఉద్రికత్త..కామారెడ్డి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తతఅద్దె బస్సులను అడ్డుకున్న జేఏసీ నేతలు..జేఏసీ నేతలు, పోలీసులకు మధ్య తోపులాటఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసిన పోలీసులు...ధర్నాకు దిగిన ఆర్టీసీ కార్మికులు..సూర్యాపేట జిల్లాకోదాడ బస్ డిపోలో తీవ్ర ఉద్రిక్తతబస్సులను బలవంతంగా డిపో నుంచి పోలీస్ పహారాలో తీసుకొస్తుండగా అడ్డుకున్న సమ్మెలో ఉన్న ఉద్యోగులుబస్సు కింద పడుకుని డైవర్ల నిరసనబలవంతంగా లాగి పక్కకు పడేసిన పోలీసులు అద్దె బస్ డ్రైవర్లు Vs పోలీసులుమంచిర్యాల జిల్లాతమపై పోలీసులు దాడి చేశారంటూ అద్దె బస్ డ్రైవర్ల ఆందోళనమంచిర్యాల బస్ డిపో ఎదుట నిరసన వ్యక్తం చేసిన అద్దె బస్ డ్రైవర్లుకండక్టర్లను ఇవ్వకుండా బస్సులను తీసేదే లేదంటున్న అద్దె బస్ డ్రైవర్లుప్రజలు ఆగ్రహంతో బస్సులపై దాడులు చేస్తే ఎవరు భద్రత కల్పిస్తారని ఆగ్రహంయజమానుల హామీతో నిరసన విరమించిన డ్రైవర్లు డివైడర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..కరీంనగర్ బైపాస్లో ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొట్టింది.ప్రైవేటు డ్రైవర్ బస్సు నడపడంతో ప్రమాదంతృటిలో తప్పిన పెను ప్రమాదం, ప్రయాణికులకు గాయాలు.గాయపడిన వారికి ఆసుపత్రికి తరలింపు.. కామారెడ్డి బస్టాండ్లో ఉద్రిక్తతకామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్లో ఉద్రిక్తత నెలకొంది.నిజాంసాగర్ వెళ్లే బస్సును బయటకు తీసుకువచ్చే ప్రయత్నం.పోలీస్ బందోబస్తు మధ్య బస్సు కదిలింపుబస్సును అడ్డుకున్న జేఏసీ నాయకులు.ప్రైవేటు డ్రైవర్ సాయి రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు.బస్టాండ్లో కొంత సేపు ఉద్రిక్తతసమ్మె వల్ల బాన్సువాడ ఆర్టీసి డిపోలో ఆగి పోయిన బస్సులు.పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు బస్సులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు.అధిక డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వాహన దారులు. సంగారెడ్డిలో ఉద్రిక్తత..సంగారెడ్డి ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత..అద్దె బస్సులను పటాన్చెరు పంపేందుకు అధికారుల యత్నం.బస్సులను అడ్డుకున్న కార్మికులు.కార్మికులను చెదరగొట్టిన పోలీసులు.పోలీసు ఎస్కార్ట్ వాహనంతో బస్సులను నడుపుతున్న అధికారులు. మెదక్ జిల్లా..మెదక్ ఆర్టీసీ డిపోలో పోలీసులకు, ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వివాదం..బస్సులను డిపోల నుండి బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్న కార్మికులు.. ప్రయాణికుల అవస్థలు..ఆర్టీసీ సిబ్బంది సమ్మెతో అవస్థలు పడుతున్న ప్రయాణికులుప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు కొన్ని డిపోల్లో ఆర్టీసీ అద్దె బస్సులను నడిపిస్తున్నారు.సమ్మె నేపథ్యంలో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి.పికెట్, కంటోన్మెంట్, రాణిగంజ్ డిపోలలో బస్సులు నిలిచిపోయాయి.దీంతో ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.చర్లపల్లిలో ప్రయాణికుల ఇక్కట్లుఆర్టీసీ సమ్మె నేపథ్యంలో చర్లపల్లి రైల్వేస్టేషన్లో ప్రయాణికుల ఇక్కట్లుచర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇదే అదనుగా ఆటో డ్రైవర్లు రేట్లు పెంచడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు రాపిడో, ఓలా, ఉబర్ను ఆశ్రయిస్తున్నారు. గోదావరిఖనిలో బందోబస్తు..పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మె చేపట్టారు.దీంతో బస్సులు డిపోలకే 150 బస్సులు, 600 ఉద్యోగులు పరిమితం అయ్యారు.గోదావరిఖని బస్టాండ్, డిపో వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులు విధులకు హాజరు కావాలి: ఆర్టీసీ ఎండీకార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నాలుగు వారాల గడువు కోరింది.దశల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది.కార్మికులు విధులకు హాజరు కావాలి.నోటీసు నుంచి సమ్మె వరకుఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) మార్చి 13, 2026న సమ్మె నోటీసుప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెరాత్రి వరకు ప్రభుత్వం నియమించిన ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీతో కార్మిక సంఘాల నేతలు చర్చలుసమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం కావాలని కోరిన అధికారులుఇవి పాత డిమాండ్లేనని, ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ చర్చల నుంచి తప్పుకున్న కార్మిక సంఘాలుమొత్తం 32 డిమాండ్లతో చర్చలుఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్పెండింగ్లో ఉన్న 30% ఫిట్మెంట్ మరియు వేతన బకాయిల చెల్లింపు చేయాలని కోరిన కార్మిక సంఘాలుపీఎఫ్ (PF), సీసీఎస్ (CCS) కు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పట్టుపడుతున్న కార్మిక సంఘాలుమొత్తం RTC బస్సులు 9,375ఆర్టీసీ స్వంత బస్సులు: 6,594అద్దె (Hire) బస్సులు: 3,396సమ్మె కారణంగా దాదాపు 6,000 పైగా బస్సులు డిపోలకే పరిమితంసుమారు 50,000 మందికి పైగా సిబ్బంది ఉండగా, సమ్మెలో దిగిన మెజారిటీ కార్మికులుఆర్టీసీ రోజువారీ ఆదాయం సుమారు రూ. 21 కోట్లురోజూ ప్రయాణించే 60 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందిగత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి కార్మిక సంఘాలు ముందుగానే నోటీసు ఇవ్వడం, ప్రభుత్వ హామీలపై స్పష్టత కోరడం అనే వ్యూహంతో అడుగులుకేవలం కమిటీలతో కాలయాపన చేయకుండా, జీవో (GO) రూపంలో లేదా లిఖితపూర్వక హామీ వచ్చే వరకు సమ్మె విరమించకూడదని నిర్ణయంరాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరసనలు తెలుపుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం ఆర్టీసీ బస్సులు బంద్ చర్చలు విఫలం.. నేడు తొలి షిఫ్ట్ నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ సమ్మె నోటీసు ఇచ్చిన జేఏసీకి మద్దతు ప్రకటించిన రెండో జేఏసీ భారీగా తాత్కాలిక సిబ్బందిని సమకూర్చుకుంటున్న ఆర్టీసీ యథావిధిగా తిరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు సహా ఆర్టీసీలోని అద్దె బస్సులు తాత్కాలిక సిబ్బందితో మరో 2 వేల బస్సులు తిప్పే యత్నం సగానికిపైగా బస్సులు రోడ్డెక్కేలా ఆర్టీసీ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు.. బస్సులు తిరగకుండా అడ్డుకునే ప్రయత్నంలో సంస్థ కండక్టర్లు, డ్రైవర్లుప్రభుత్వ ఆదేశాలు.. జిల్లాలవారీగా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని ఆర్డీవోలకు ప్రభుత్వం ఆదేశం.జీహెచ్ఎంసీ పరిధిలో వీలైనన్ని ఎక్కువ ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశం.ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు తిప్పలు.సగానికిపైగా బస్సులు రోడ్డెక్కేలా ప్రభుత్వం చర్యలు. జేబీఎస్లో బస్సులు బంద్..సమ్మె బాటలో ఆర్టీసీ ఉద్యోగులుజేబీఎస్లో సమ్మె ప్రభావంతాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడిపే ప్రయత్నంభారీగా పోలీసుల మోహరింపుప్రశాంతంగా ధర్నా చేసుకోవాలని పోలీసుల సూచనాభద్రాద్రి కొత్తగూడెం జిల్లారాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె భాగంగా కొత్తగూడెంలో ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన 66 బస్సులు.స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు.కొత్తగూడెం ఆర్టీసీ డిపో ఎదుట సీపీఐ, ఆర్టీసీ నాయకులు ధర్నా.ధర్నా చేస్తున్న ఆర్టీసీ, సీపీఐ నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు.బస్సులు లేక బస్టాండ్లో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు. కరీంనగర్ జిల్లా..కరీంనగర్ వన్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాతమ డిమాండ్లను నెరవేర్చాలని నినాదాలుతమ సమస్యల్ని పరిష్కరించి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్యూనియన్లను పునరుద్ధరించాలని కోరుతూ డిపో గేట్ ముందు నిరసన.బస్సులు బంద్.. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమ్మెకు దిగిన ఆర్టీసీ జేఏసీ.. సమ్మె కారణంగా దాదాపు ఆరు వేలకు పైగా బస్సులు డిపోలకే పరిమితం. తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందని ప్రకటన. -
అభిషేక్ విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకు పరిమితమైంది. నితీశ్ రానా 57 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సమీర్ రిజ్వీ 41 పరుగులు సాధించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 4, హర్ష్దూబే మూడు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (68 బంతుల్లో 135 నాటౌట్) సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో తొలిసారి 240 పరుగుల ప్లస్ మార్కును దాటింది. చివర్లో క్లాసెన్ (13 బంతుల్లో 37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. హెడ్ 37, ఇషాన్ కిషన్ 25 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. అజేయ సెంచరీతో ఢిల్లీ పని పట్టిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.242లో సగం స్కోరు అభిషేక్దే..టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ను బ్యాటింగ్కు ఆహ్వానించడంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాలు మొదలయ్యాయి. ఆరంభం నుంచే ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. అభిషేక్ శర్మ, హెడ్లు పోటీపడి బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత జట్టు స్కోరు 97 పరుగుల వద్ద హెడ్ వెనుదిరగడంతో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఎండ్లో మాత్రం అభిషేక్ శర్మ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. గత రెండు మ్యాచ్ల్లో అర్థశతకాలు సాధించినప్పటికీ వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాడు. కానీ ఈసారి మాత్రం ఆది నుంచే ధాటిగా ఆడిన అభిషేక్ ఢిల్లీ బౌలర్లను చీల్చి చెండాడి సెంచరీ మార్క్ను అందుకున్నాడు. చివరి వరకు నిలిచిన అభిషేక్ క్లాసెన్, ఇషాన్లతో కలిసి మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. అయితే జట్టు సాధించిన 242 పరుగుల్లో అభిషేక్ ఒక్కడివే 135 పరుగులు ఉండడం గమనార్హం. అతడి ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండడం విశేషం.తడబడిన ఢిల్లీ..భారీ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ కేఎల్ రాహుల్ (37), నితీశ్ రానా (57) రెండో వికెట్కు 86 పరుగులు జోడించి ఢిల్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు వెనుదిరగడం ఢిల్లీని కష్టాల్లోకి నెట్టేసింది. ఆ తర్వాత వచ్చిన మిల్లర్ గోల్డెన్ డకౌట్ కావడంతో మరింత కష్టాల్లో పడింది. ఈ దశలో సమీర్ రిజ్వీ, స్టబ్స్ (27) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. సీజన్లో ఎస్ఆర్హెచ్కు ఇది నాలుగో విజయం కాగా, సొంతగడ్డపై మాత్రం హ్యాట్రిక్ విక్టరీ. ఈ గెలుపుతో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఆరు మ్యాచ్ల్లో ఇది మూడో పరాజయం. దీంతో ఆ జట్టు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.Explosive with the bat 🔥Lethal with the ball ⚡#SRH clinch a 4️⃣7️⃣-run win to make it three-in-a-row at home 🧡Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/Vcmp5r5sh1— IndianPremierLeague (@IPL) April 21, 2026 -
తెలంగాణలో మోగిన ఆర్టీసీ సమ్మె సైరన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంతో జరిగిన చర్చ లు విఫలం కావటంతో ఆర్టీసీ కారి్మక సంఘాలు సమ్మె ప్రారంభించాయి. బుధవారం తెల్లవారుజాము తొలి సరీ్వసు నుంచి బస్సులను స్తంభింపజేయాలని నిర్ణయించాయి. మరోవైపు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు ప్రారంభించింది. రవాణా శాఖ సహాయంతో తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ సిద్ధం చేసుకుంటోంది. ఈ ప్రత్యామ్నాయ చర్యలు పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చేందుకు సమయం కావాల్సి ఉన్నందున, సమ్మె తొలిరోజైన బుధవారం ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. నాలుగు వారాల గడువుకు ససేమిరా... బుధవారం తెల్లవారుజాము తొలి సరీ్వసు నుంచి సమ్మెకు వెళ్తున్నామని ఆరీ్టసీలో ఓ జేఏసీ వారం క్రితమే ప్రకటించినప్పటికీ, ప్రభుత్వం చర్చలకు సిద్ధం కాలేదు. మంగళవారం సాయంత్రం హడావుడిగా నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి కారి్మక సంఘాలతో చర్చించాలని ఆదేశించింది. రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కూడిన కమిటీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు సచివాలయంలో కారి్మక సంఘాలతో చర్చలు ప్రారంభించింది. సంఘాల వారీగా దాదాపు మూడు గంటలపాటు వారి డిమాండ్లపై అభిప్రాయాలు సేకరించిన అనంతరం, వాటి పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి కొంత సమయం కావాలని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇందుకు నాలుగు వారాల సమయం అవసరమవుతుందని, గడువు నాటికి ప్రభుత్వం నుంచి స్పందన ఉంటుందన్నారు. దీనికి కార్మిక సంఘాలు అంగీకరించలేదు. సమ్మె నోటీసు ఇచి్చన థామస్రెడ్డి, ఈదురు వెంకన్నతో కూడిన జేఏసీ ప్రతినిధులు వెంటనే సమావేశ మందిరం నుంచి వెలుపలికి వచ్చి, చర్చలు విఫలమయ్యాయని, యథావిధిగా సమ్మె ప్రారంభమవుతుందని ప్రకటించారు. అశ్వత్థామరెడ్డి, నరేందర్తో కూడిన రెండో జేఏసీ నేతలు కాసేపు అంతర్గతంగా చర్చించుకుని, చివరకు తాము కూడా సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. రెండు జేఏసీల్లో లేని మిగతా సంఘాలు కూడా సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో అన్ని సంఘాలు బుధవారం తెల్లవారుజాము నుంచి సమ్మె ప్రాంభిస్తున్నట్టు రాత్రి పదింటికి ప్రకటించాయి. ప్రభుత్వమే సమ్మెకు వెళ్లేలా చేసింది: థామస్రెడ్డి, ఈదురు వెంకన్న ‘సమ్మె డిమాండ్లలో ఉంచిన 32 అంశాలు చాలాకాలంగా కొనసాగుతూ వస్తున్నవే. వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం స్పందించలేదు. ఆ తర్వాత రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందింస్తుందని చెప్పటంతో వేచి చూశాం. కానీ, ఆయన కూడా స్పష్టమైన హామీకి ముందుకు రాకపోవటంతో విధిలేని పరిస్థితిలో సమ్మెకు సిద్ధమయ్యాం. ప్రభుత్వం కూడా స్పందించలేదు. సమ్మెకు కొన్ని గంటల ముందు ఆదరాబాదరాగా అధికారుల కమిటీ వేసి ప్రభుత్వం కాలయాపన ప్రయత్నం చేసింది. మా డిమాండ్లపై ఎలాంటి హామీ ఇవ్వకుండా నాలుగు వారాల గడువు కావాలని కోరటం దారుణం. సమ్మె చేస్తే చేస్కోండి అన్న తరహాలో సంస్థ వ్యవహరిస్తోంది. మేం చాలా సమయం ఇచ్చినా స్పందించకుండా ప్రభుత్వమే తమను సమ్మెకు వెళ్లేలా చేసింది. కారి్మకులంతా సమ్మెకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఎంత బెదిరింపులకు దిగినా సమ్మె ఆగదు, కొనసాగుతుంది. ‘ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి కొన్ని ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తే మేం పునరాలోచిస్తాం’ అని రెండో జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, నరేందర్ తదితరులు తెలిపారు. వేగంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు... డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె విషయంలో గట్టిగా ఉన్నప్పటికీ, మెకానిక్ సిబ్బంది కొంత ఊగిసలాటలో ఉన్నారు. దీంతో శ్రామిక్లు, మెకానిక్లలో ఎక్కువ మంది విధులకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక సిబ్బందిని సరఫరా చేసే ఏజెన్సీల నుంచి ఎనిమిది వేల మందిని తాత్కాలిక పద్ధతిలో పనిచేసేందుకు ఆర్టీసీ సమకూర్చుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,100 అద్దె బస్సులు యథావిధిగా తిరగనున్నాయి. మరో 500 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కుతాయి. తాత్కాలిక సిబ్బంది సహకారంతో మరో 2 వేల బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వెరసి సగానికిపైగా బస్సులను తిప్పటం ద్వారా ప్రయాణికులకు పెద్దగా ఇబ్బంది లేకుండా చూసేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో బాగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో నిత్యం ఆర్టీసీ బస్సుల్లో 35 లక్షల మంది ప్రయాణించగా, ఈ పథకం ప్రారంభమయ్యాక ఆ సంఖ్య 60 లక్షలను మించింది. ఇందులో 43 లక్షల మంది మహిళలే ఉంటున్నారు. గతంలో సమ్మె జరిగినప్పుడు ఆ 35 లక్షల మందికే ఇబ్బంది కలగగా ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు కానుంది. మళ్లీ ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలకు గిరాకీ పెరగనుంది. దీంతో వాటి చార్జీ కూడా పెరగనుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అడ్డుకునేందుకు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ప్రయత్నిస్తున్నారు. -
Telangana : డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించని లబ్ధిదారుల ఇళ్లను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేటాయించిన ఇళ్లలో తప్పనిసరిగా నివసించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పూర్తి అయిన, నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎంపిక చేసిన లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. టూ బీహెచ్కే ఇండ్లు పొందిన వారు వాటిలో నివసించకపోతే, వారికి ఇచ్చిన ఇళ్లను నోటీసులు ఇచ్చి రద్దు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రద్దు చేసిన ఇళ్లను కొత్త లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. సంబంధిత ఆర్డీఓలు, డిప్యూటీ కమిషనర్లు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎల్2 లిస్ట్ నుండి పేదవారిని ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
గుడ్న్యూస్.. ఈ మార్గాల్లో 8 కొత్త రైళ్లు
ఢిల్లీ: తెలంగాణ నుంచి 8 కొత్త రైళ్లు నడుస్తాయని రైల్వేశాఖ ప్రకటించింది. భాగ్యనగరంలోని వివిధ స్టేషన్ల నుంచి ఈ కొత్తరైళ్లు వీక్లీ ట్రైన్స్గా ప్రయాణికులకు సేవలందిచనున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుచానూరు (ఆంధ్రప్రదేశ్), శ్రీ గంగానగర్, జైపూర్ (రాజస్థాన్), భువనేశ్వర్ (ఒడిశా)లకు రెగ్యులర్ ట్రైన్స్ నడపాలని డిమాండ్లు కూడా ఉన్నాయి.కొత్త సర్వీసులు బయలుదేరే సమయం, వారం, గమ్యస్థానం 17607/17608 నెంబరు: కాచిగూడ నుంచి ప్రతి గురువారం రాత్రి 9.30 గంటలకు తిరుచానూరు (ఆంధ్రప్రదేశ్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 15 నుంచి ప్రారంభం కానుంది. 17601/17602 నెంబరు: కాచిగూడ నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు శ్రీ గంగానగర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ జులై 14 నుంచి ప్రారంభం కానుంది. 17047/17048 నెంబరు: చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 6.55 గంటలకు తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 7 నుంచి ప్రారంభం కానుంది. 17441/17442 నెంబరు: చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం రాత్రి 9.20 గంటలకు తిరుపతి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 14 నుంచి ప్రారంభం కానుంది. 17443/17444 నెంబరు: చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు తిరుపతి వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 15 నుంచి ప్రారంభం కానుంది. 17059/17060 నెంబరు: ప్రతి ఆదివారం రాత్రి 9.15 గంటలకు చర్లపల్లి నుంచి తిరుచానూరు వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ మే 11 నుంచి ప్రారంభం కానుంది. 17067/17068 నెంబరు: ప్రతి సోమవారం సాయంత్రం 6.10 నిమిషాలకు చర్లపల్లి నుంచి భువనేశ్వర్ (ఒడిశా) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్.. మే 5 నుంచి ప్రారంభం కానుంది. 17079/17080 నెంబరు: ప్రతి శుక్రవారం రాత్రి 7.50 గంటలకు నాంపల్లి నుంచి జైపూర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే త్వరలోనే ప్రకటించనుంది. -
TG: ఆర్టీసీ కార్మికుల సమ్మె వార్నింగ్.. కమిటీ ఏర్పాటు!
హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతామని హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసరంగా కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఉత్వర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. జీవో నంబర్ 66 విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ఉద్యోగుల నుంచి, వారి సేవా నిబంధనలు, సంబంధిత విషయాలపై పలు సమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి.వినతులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, టీజీఆర్టీసీ ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి, తగిన సిఫార్సులను సూచించడానికి ప్రభుత్వం ఈ క్రింది అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తోంది..కమిటీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా, రహదారులు & భవనాల శాఖ - ఛైర్మన్ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాల శాఖ - సభ్యుడుప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ - సభ్యుడువైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎస్ఆర్టీసీ - సభ్యుడు & కన్వీనర్కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి, ఈ ఉత్తర్వు జారీ చేసిన తేదీ నుండి నాలుగు వారాల వ్యవధిలోగా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించాలి. -
వర్ష సూచన.. సన్రైజర్స్-ఢిల్లీ మ్యాచ్ జరిగేనా..?
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 21) సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ పోరు హై స్కోరింగ్ థ్రిల్లర్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంగా చెప్పవచ్చు.అయితే ఆసక్తికరంగా ఇక్కడ పేసర్లు అధికంగా ప్రభావం చూపుతున్నారు. సుమారు 72 శాతం వికెట్లు వీరే తీశారు. ప్రారంభ ఓవర్లలో స్వల్ప స్వింగ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొత్త బంతితో బౌలర్లు కచ్చితమైన లెంగ్త్లో బౌలింగ్ చేస్తే వికెట్లు తీసే అవకాశం ఉంటుంది.ప్రారంభ ఒత్తిడిని ఎదుర్కొని బ్యాటర్లు సెటిల్ అయితే మాత్రం భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ చేయడానికి మొగ్గు చూపవచ్చు.వాతావరణ నివేదికఈ మ్యాచ్కు వాతావరణం అనుకూలంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ సమయానికి పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలో ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చు. వాతావరణం మేఘావృతంగా ఉంటే మాత్రం పేసర్ల అధిక సహకారం లభిస్తుంది. మొత్తంగా మ్యాచ్ సమయంలో వర్షం వచ్చే అవకాశం కేవలం 2 శాతంగా మాత్రమే ఉంది. -
అటు మండే ఎండలు, ఇటు వంట నూనె సెగలు
సాక్షి, హైదరాబాద్: వినియోగదారులు కొనకముందే వంట నూనెలు సలసలా కాగుతున్నాయి. ధరలు భగ్గుమంటున్నాయి. కొంతకాలంగా వ్యాపారులు ధరలు పెంచేయడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. విదేశాల నుంచి వంటనూనెల ముడిసరుకు దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వంటనూనెల వినియోగంలో దేశంలోనే రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని అంటున్నారు. వంటనూనెల వినియోగంలో సన్ఫ్లవర్ ఆయిల్దే అగ్రస్థానం. ఆ తర్వాత వేరుశనగ, ఇతర నూనెలు ఉన్నాయి. రెండు వారాల క్రితం సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ ధర రిటైల్ మార్కెట్లో రూ.175–185 ఉంది. వేరుశనగ నూనె ధర రూ.180 నుంచి 220కి ఎగబాకింది. మనదేశంలోకి థాయ్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్కు సంబంధించిన ముడిసరుకు దిగుమతి అవుతోంది. దిగుమతి చేసుకున్న ఆయిల్ను రిఫైనరీలు శుద్ధిచేసి మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. రోజుకు వందల టన్నుల విక్రయం నగరంలో రోజుకు వందల టన్నులకుపైగా వంటనూనె అమ్మకాలు జరుగుతున్నాయి. హోటళ్లు, క్లబ్బులు, బార్లలో అత్యధికంగా వివిధ రకాల వంటనూనెలు వినియోగిస్తుంటారు. హోల్సెల్ మార్కెట్ అన్ని రకాల నూనెలపై రూ.10 నుంచి రూ.15 పెరగడంతో ఇక రిటైల్, బహిరంగ మార్కెట్లో ప్రతీ లీటర్పై రూ.20 నుంచి రూ.25 పెరిగాయి. ఇదీ చదవండి: 99.99 శాతం మందికి భవిష్యత్తే లేదు : జాక్మా సంచలన వ్యాఖ్యలు -
అద్భుతం.. శిశువు కోసం ఎయిర్లిఫ్ట్ చేసి ప్రాణాలు పోసిన వైద్యులు
సాక్షి, హైదరాబాద్: కిమ్స్ వైద్యులు అద్భుతం సృష్టించారు. తీవ్రమైన శ్వాస సంబంధింత సమస్యలతో బాధపడుతున్న 9 నెలల శిశువుకి ఎయిర్ లిఫ్ట్ చేసి ప్రాణాలు పోశారు. 45 రోజులు తీవ్రంగా శ్రమించిన అనంతరం ఆ పసికందును ప్రాణాపాయం లేకుండా రక్షించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పీడియాట్రిక్స్ క్లినికల్ డైరెక్టర్ & పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హెడ్, డా. పరాగ్ డెకాటే వివరించారు. వివరాల్లోకి వెళితే..ఛత్తీస్గఢ్, రాయపూర్కు చెందిన తొమ్మిది నెలల శిశువు మెుదటగా జలుబు, దగ్గుతో ఆస్పత్రిలో చేరింది. అనంతరం కొద్ది రోజులకో ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచినప్పటికీ ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. తీవ్రమైన అడెనో వైరస్ కారణంగా వచ్చే తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ (అడెనోవైరల్ న్యూమోనియా), శ్వాసకోశ వైఫల్యం ఏర్పడింది.శిశువు పరిస్థితి అత్యవసరంగా మారడంతో కిమ్స్ కడల్స్ నియోనేటల్, పీడియాట్రిక్ ట్రాన్స్పోర్ట్ బృందం హుటాహుటీన రాయపూర్కు చేరుకుంది. అక్కడ శిశువును చికిత్సను అందించి వెంటిలేటర్పై ఉంచి విమానశాఖ సమన్వయంతో సురక్షితంగా హైదరాబాద్కు ఎయిర్లిఫ్ట్ చేశారు.కిమ్స్ కడల్స్ కొండాపూర్ లో పీడియాట్రిక్ ఐసీయూ చేర్చిన అనంతరం శిశువుకు తీవ్రమైన ఎఆర్డీఎస్ తో పాటు న్యూమోథొరాక్స్ (ఊపిరితిత్తుల చుట్టూ గాలి చేరడం) ఉన్నట్లు గుర్తించారు. హెచ్ఎఫ్ఓవీ, (ఇన్హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్ వంటి చికిత్సలు చేసినప్పటికీ శ్వాసలో మెరుగుదల కనిపించలేదు. దీంతో పరిస్థితి విషమంగా మారడంతో కార్డియోథొరాసిక్ శస్త్రచికిత్స మరియు పీడియాట్రిక్ ఐసీయూ బృందాలు కలిసి విఏ ఎక్మో చికిత్స ప్రారంభించాం. ఈ యంత్రం గుండె, ఊపిరితిత్తుల పనిని తాత్కాలికంగా నిర్వహిస్తూ శరీరానికి ఆక్సిజన్ అందించడంతో పాటు కార్బన్ డయాక్సైడ్ను తొలగిస్తుంది.శిశువు 25 రోజులపాటు ఎక్మోపై ఉండగా, వైద్య బృందం అనేక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది. అధిక వైరల్ లోడ్, ఇతర ఇన్ఫెక్షన్లు, గాలి లీకులు, రక్తస్రావం, రక్తపోటు మార్పులు వంటి సమస్యలను విజయవంతంగా చికిత్సను అందించాం.తదుపరి శిశువు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడడంతో ఎక్మో మరియు వెంటిలేటర్ నుంచి విజయవంతంగా తొలగించాం. మొత్తం 45 రోజుల చికిత్స అనంతరం శిశువును పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ చేశారు.ఈ విజయవంతమైన చికిత్సలో పీడియాట్రిక్ ఐసీయూ వైద్యులు డా. కళ్యాణ్ కె, డా. అవినాష్ రెడ్డి పి, డా. వినోద్ కుమార్, డా. మాధురి కె కార్డియోథొరాసిక్ సర్జన్ డా. సందీప్; ఇన్ఫెక్షియస్ డిసీజ్ నిపుణుడు డా. రవి తేజ పాల్గొన్నారు. “సమయానికి సరైన చికిత్స అందడం ఎంత ముఖ్యమో ఈ కేసు నిరూపించింది. ఎక్మో వంటి ఆధునిక ‘రెస్క్యూ థెరపీలు’ అందుబాటులో ఉండటం ప్రాణాలను కాపాడటంలో కీలకం. వెంటిలేటర్పై ఉన్న శిశువును ఎయిర్లిఫ్ట్ చేసి, దీర్ఘకాలం ఈసీఎంఓపై నిర్వహించడం అనేది నైపుణ్యం కలిగిన వైద్య బృందం వల్లే సాధ్యమైంది” అని డా.పరాగ్ ఈ సందర్భంగా వివరించారు. -
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. కాసేపట్లో ఈ జిల్లాల్లో..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో పలు జిల్లాలో వర్షాలు కూడా దంచికొడుతున్నాయి. ఇక, రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.నేడు మరో రెండు లేదా మూడు గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగాం, రంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మరోవైపు.. హైదరాబాద్ ఈరోజు సాయంత్రం మోస్తరు వర్షం కురిసే చాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వడగళ్ల వాన కారణంగా పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కళ్లాల్లో చేర్చినట్లయితే టార్ఫలిన్ కవర్లు కప్పి ఉంచాలని చెబుతున్నారు.DISTRICTS FORECAST - April 21, 2026Scattered THUNDERSTORMS ahead in Adilabad, Asifabad, Nirmal, Nizamabad, Jagitial, Mancherial during morning to afternoon Scattered THUNDERSTORMS ahead in Medak, Sangareddy, Vikarabad, Siddipet, Jangaon, Rangareddy, Mahabubabad during…— Telangana Weatherman (@balaji25_t) April 21, 2026 -
రేంజ్ రోవర్ కొన్న నితీశ్.. పెద్దమ్మ గుడిలో కాయిన్ పెట్టి పూజలు (ఫొటోలు)
-
ఆర్టీసీ కార్మికుల సమ్మె.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకే కార్మిక సంఘాలు మొగ్గు చూపుతున్నాయి.ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సాక్షితో ఆయన మాట్లాడుతూ..‘ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్టీసీని మూసివేసే పరిస్థితి నుంచి లాభాల బాటలో నడిచేలా చేసాం. నిరసన తెలపడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అన్నింటికి సమ్మె అనడం పరిష్కారం కాదంటూ హితవు పలికారు. సమ్మెకు వెళ్లి పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దు అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం స్పందిస్తూ..‘కబ్జాదారులకు మద్దతుగా ఉంటామని కేసీఆర్ ప్రకటించారు. మేము హైడ్రాతో ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడుతున్నాం. మాకు పదేళ్లు అధికారం పక్కా. మేము పకడ్బందీగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. తుమ్మితే ముక్కు ఊడిపోతుంది అన్నట్లు ఉంది కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి. రైతుభరోసా ఎప్పుడు వేయాలో మాకు తెలుసు అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు దిగనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకే కార్మిక సంఘాలు మొగ్గు చూపుతున్నాయి. పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపుపై ఉద్యోగులు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. సమ్మె నిర్ణయంతో ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు. కాగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సర్కార్ దృష్టి పెట్టింది.కాగా, ఆర్టీసీలో సమ్మె ప్రారంభానికి కేవలం ఒకేరోజు మిగిలి ఉన్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవటం ప్రయాణికుల్లో ఉత్కంఠ నెలకొంది. 22వ తేదీ తెల్లవారుజాము తొలి సర్వీసు నుంచి సమ్మె ప్రారంభమవుతుందని ఆర్టీసీలోని ఓ జేఏసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పుడు మరో జేఏసీ కూడా సమ్మెకు మద్దతు ప్రకటించింది. -
TG: నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె
సాక్షి, హైదరాబాద్: నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు దిగనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకే కార్మిక సంఘాలు మొగ్గు చూపుతున్నాయి. పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపుపై ఉద్యోగులు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. సమ్మె నిర్ణయంతో ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు. కాగా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సర్కార్ దృష్టి పెట్టింది.మరో సకల జనుల సమ్మెలాగా చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ నెల 22వ తేదీ నుండి సమ్మెకు దిగుతామని ప్రకటించిన నేపధ్యంలో.. 21వ తేదీ లోపు ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించేందుకు అంగీకరించకపోతే సమ్మె విషయంలో వెనకడుగు వేసేది లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి.మరో సకల జనుల సమ్మెలాగా కార్యరూపం దాల్చుతుందని.. ప్రైవేట్ సిబ్బందితో తమ సమ్మె నిర్వీర్యం చేయాలని చూస్తే ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసు అంటూ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న హెచ్చరించారు. అన్ని యూనియన్ల జేఏసీలు, జేఏసీలో లేని కార్మికులు సైతం సమ్మెకు మద్దతు ఇస్తున్నాయని, ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోతే 22వ తేదీ మొదటి షిఫ్ట్ నుండి సమ్మె మొదలవుతుందని కార్మిక సంఘాలు అంటున్నాయి.కాగా, ఆర్టీసీలో సమ్మె ప్రారంభానికి కేవలం ఒకేరోజు మిగిలి ఉన్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవటం ప్రయాణికుల్లో ఉత్కంఠ నెలకొంది. 22వ తేదీ తెల్లవారుజాము తొలి సరీ్వసు నుంచి సమ్మె ప్రారంభమవుతుందని ఆర్టీసీలోని ఓ జేఏసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పుడు మరో జేఏసీ కూడా సమ్మెకు మద్దతు ప్రకటించింది.సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం నుంచిగానీ, ఆర్టీసీ అధికారుల నుంచి గానీ చర్చలకు పిలుపు రాలేదు. ఆర్టీసీలో అధికారికంగా కార్మిక సంఘాలు లేనందున చర్చలకు సిద్ధం కాలేదు. కార్మిక సంఘాలకు నేతృత్వం వహిస్తున్న నేతల్లో ఇద్దరుముగ్గురు తప్ప మిగతా అంతా ఉద్యోగ విరమణ చేసిన వారే. దీనిని కూడా ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇది కూడా చర్చలకు సానుకూలత కల్పించలేదన్న భావనా ఉంది. తాను చర్చలకు నిరంతరం సిద్ధంగానే ఉంటానని, కార్మికులెవరైనా వచ్చి తనతో మాట్లాడవచ్చని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పదేపదే ప్రకటించినా... సమ్మె నోటీసు ఇచ్చిన జేఏసీ నేతలు ఆయనతో మాట్లాడేందుకు వెళ్లలేదు.ఇప్పటికిప్పుడు సమ్మె ప్రకటన చేయొద్దని భావించిన రెండో జేఏసీ పలు దఫాలు పొన్నం ప్రభాకర్తో భేటీ అయి, కారి్మకుల దీర్ఘకాల డిమాండ్లపై సానుకూల ప్రకటన చేయా లని లేని పక్షంలో తాము కూడా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. సోమవారం ఉదయం కూడా వెళ్లి కలిసి మాట్లాడినా సానుకూల ప్రకటన రాలేదని పేర్కొంటూ, తాను కూడా సమ్మెకు సిద్ధమని ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకుంటే 22 తొలి సర్వీసు నుంచి సమ్మెకు దిగుతామని ఆ జేఏసీ ప్రకటించింది.ఇప్పుడు రెండు జేఏసీలు సమ్మె విషయంలో ఏకం కావటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం రాత్రి వరకు సమ్మె విషయంలో స్పందించలేదు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎలాంటి నిర్ణయం తెలపలేని పరిస్థితి నెలకొంది. మంగళవారం వేతన సవరణ సహా కొన్ని డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయటం ద్వారా కార్మికులను ఒప్పించి సమ్మెకు దిగకుండా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ చేయాలనే డిమాండ్తో రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీతో జరిపిన చర్చల్లో ఎలాంటి ఫలితం లేనందున ఈ నెల 22 నుంచి తలపెట్టిన సమ్మెకు మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.హనుమంత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు డీవీకే రావు తెలిపారు. సోమవారం విద్యానగర్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేనందున సమ్మెలో భాగస్వాములం అవుతున్నామని వెల్లడించారు. -
హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)
-
Banjara Hills: తెలుగు మీడియం రెస్టారెంట్లో దారుణం!
హైదరాబాద్: బంజారాహిల్స్ ఆదివారం పూట సరదాగా హోటల్ నుంచి నాన్ వెజ్ ఐటమ్ తెప్పించుకున్న ఓ పోలీసు అధికారికి చేదు అనుభవం ఎదురైంది. కుళ్లిపోయిన మాంసంతో తయారు చేసిన ఖీమాతో వచ్చిన పార్సల్ చూసి ఆ అధికారి షాక్ కు గురయ్యారు. వివరాలకు వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46 లో తెలుగు మీడియం పేరుతో రెస్టారెంట్ ఉంది. ఆదివారం మధ్యాహ్నం ఓ పోలీస్ అధికారి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి ఈ హోటల్ నుంచి మటన్ కీమా తో పాటు మరికొన్ని నాన్ వెజ్ ఐటమ్ లు తెప్పించుకున్నాడు. పార్సల్ విప్పి చూడగా మటన్ ఖీమా కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించాడు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలుగు మీడియం రెస్టారెంట్ కి చేరుకొని ఆహార పదార్థాలను పరిశీలించి శాంపిల్స్ సేకరించారు. మిగిలిపోయిన ఖీమా తదితర ఆహార పదార్థాలను స్వా«దీనం చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఈ శాంపిల్స్ అందజేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
న్యూడ్ గా వచ్చి.. మా మమ్మి మీద చేయి వేశాడు
-
స్లీపర్తో శాశ్వత నిద్రే
సాక్షి,హైదరాబాద్: వరుస ప్రమాదాలతో స్లీపర్ బస్సులు ఠారెత్తిస్తున్నాయి. ఎక్కడో ఒక చోట మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. ఈ బస్సుల అనుమతిపై ఆర్టీఏ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నగరం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు, ముంబై, షిరిడీ, చెన్నై, బెంగళూర్ తదితర ప్రాంతాలకు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. స్లీపర్ బస్సుల్లో మంటలంటుకొని పదుల సంఖ్యలో ప్రయాణికులు విగతజీవులైన ఘటనలు గతంలో జరిగాయి. ఇటీవల కేపీహెచ్బీలోనూ స్లీపర్ బస్సులో మంటలంటుకున్నాయి. అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టడంతో ముప్పు తప్పింది. అంతకుముందు మియాపూర్ నుంచి బయలుదేరిన మరో బస్సు సైతం ఏపీలోని కర్నూలు వద్ద ఇలాగే ప్రమాదానికి గురైంది. ఇలా తరచూ.. స్లీపర్ బస్సులతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అడ్డగోలుగా అనుమతులు.. కొంతకాలంగా ప్రైవేట్ బస్సులు నాగాలాండ్, మేఘాలయ తదితర రాష్ట్రాల్లో నమోదై హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉన్న పర్మిట్ రుసుములను తప్పించుకొనేందుకు నాగాలాండ్ వంటి ఇతర రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. అడ్డగోలుగా అనుమతులు పొంది హైదరాబాద్లో రోడ్డెక్కిస్తున్నారు. నగరం నుంచి విజయవాడ, ఏలూరు, గుంటూరు, కాకినాడ, విశాఖ, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 1,100కు పైగా ప్రైవేట్ బస్సులు హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నట్లు అంచనా. వీటిలో 40 శాతం వరకు స్లీపర్ బస్సులే ఉన్నాయి. ప్రమాద ఘంటికలు..స్లీపర్ బస్సులు ఏ మాత్రం సురక్షితం కాదని ఇప్పటికి పలుమార్లు నిపుణులు సూచించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలోనూ ఆస్కీ ఇదే అంశాన్ని సూచించింది స్లీపర్ బెర్తులతో పాటు అదనపు హంగులను ఏర్పాటు చేయడం, వివిధ రకాల అవసరాల కోసం ఎలక్ట్రిక్ వైర్లను వినియోగించడంతో ఎక్కడో ఒక చోట అవి తెగి షార్ట్సర్క్యూట్కు గురవుతున్నాయి. స్లీపర్ బెర్తులను తొలగించి ఫుష్బ్యాక్ సీట్లను ఏర్పాటు చేయాలని, డ్రైవర్కు, ప్రయాణికులకు మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా సీటింగ్ ఏర్పాటు చేయాలని నిపుణులు పేర్కొంటున్నారు. -
యువతి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
హైదరాబాద్: చెరువులో ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్న యువతిని పోలీసులు కాపాడారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. కల్వకుర్తికి చెందిన ఓ యువతి (20) పటాన్చెరువులో ఉద్యోగం చేస్తూ కేపీహెచ్బీ కాలనీలోని షణ్ముఖ హాస్టల్లో ఉంటోంది. వ్యక్తిగత సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలకుంది. దీంతో ఆదివారం కూకట్పల్లి ఐడియల్ చెరువులోకి దిగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే చెరువు వద్దకు చేరుకున్నారు. ఎస్ఐ చంద్రశేఖర్, దీక్షిత, వెంకటప్పలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చెరువులోకి దూకి వెళ్లి యువతిని కాపాడి బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఎస్ఐ కాలికి గాయాలయ్యాయి. అనంతరం యువతిని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇప్పించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వెల్లడించడానికి ఇష్టపడటం లేదని పోలీసులు తెలిపారు. -
కేబుల్ బ్రిడ్జిపై బెంజ్ కారు బీభత్సం
హైదరాబాద్: కేబుల్ బ్రిడ్జిపై వేగంగా వచ్చిన బెంజ్కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన మేరకు.. ఘట్కేసర్కు చెందిన శ్యామ్రాజ్(32) న్యూహఫీజ్పేట్ అదిత్యనగర్లో నివాసముంటున్నాడు. ఆదివారం తెల్లవారు జామున మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్బ్రిడ్జిపై ఆగి ఉన్నాడు. ఆ సమయంలో జూబ్లిహిల్స్ నుంచి ఐకియా వైపు వెళుతున్న బెంజ్కారు కారు అతివేగంగా వచ్చి శ్యామ్రాజ్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మాదాపూర్లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారు క్యాంటం మినరల్స్ అండ్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోల్కత్తా పేరుతో ఉందని తెలిపారు. కారు డ్రైవరు పరారయ్యాడు. -
ఇదేం పైశాచికత్వం!
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసులకు దొంగలు, సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు తరచూ పని పెడుతుంటారు. ఈ పనుల్ని వాళ్లు తమ దైనందిన విధుల్లో భాగంగా భావిస్తుంటారు. అయితే.. ఒక్కోసారి అనివార్యమైన, అనవసర విధులు వచి్చపడుతుంటాయి. జాగిలాలు, పిల్లులు తప్పిపోయాయని కొందరు, వీటి కారణంగా ఘర్షణ పడి మరికొందరు ఠాణాలకు వస్తుంటారు. వీటన్నింటినీ మించిన తలనొప్పులు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. బహిరంగ ప్రదేశాల్లో దిగంబరంగా తిరిగే వ్యక్తులే దీనికి కారణం. మలక్పేట పరిధిలో గత వారం జరిగిన ఉదంతం కలకలం సృష్టించింది. అప్పట్లో పట్టపగలు.. నడిరోడ్డుపై.. 2021 మార్చిలో లంగర్హౌస్ ఠాణా పరిధిలో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసిన నిందితుడు.. మూడు రోజుల తర్వాత పట్టపగలు దానిపై నగ్నంగా షికారు చేశాడు. బోయిన్పల్లి పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ ఏరియాతో మొదలెట్టి బొల్లారంలో ఉన్న మిలిటరీ ప్రాంతం, బేగంపేటలోని నాలాపై ఉన్న వంతెన, బల్కంపేట, సనత్నగర్ ఠాణాల పరిధిలో సంచరించాడు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన గస్తీ బృందాలు సనత్నగర్ ఎస్ఆర్టీ ప్రాంతంలోని నెహ్రూ పార్క్లో అతడిని గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించారు. వాహనాన్ని అక్కడే పడేసిన నిందితుడు రాళ్లతో దాడి చేస్తూ పారిపోయాడు. ఇప్పుడు తెల్లవారుజామున.. అపార్ట్మెంట్లో.. గత మంగళవారం మలక్పేట పోలీసుస్టేషన్ పరిధిలో ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచి్చంది. మూసారంబాగ్ వెస్ట్ ప్రశాంత్నగర్లోని గంగాధర అపార్ట్మెంట్లోకి ఓ మధ్యవయస్కుడు నగ్నంగా చొరబడ్డాడు. ఫ్లాట్ తలుపు సందుల్లో నుంచి తొంగి చూస్తూ అపార్ట్మెంట్ అంతా తిరుగుతూ పరుగులు పెట్టాడు. దీంతో అక్కడ నివసించే వాళ్లు భయాందోళనకు గురయ్యారు. అంతా బయటికి వచ్చి చూసేసరికి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ తతంగం అంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. చివరకు అతగాడు కారులో వెళ్లిపోయినట్లు గుర్తించారు.పోలీసుల అదుపులో నిందితుడుమలక్పేట: మలక్పేట పీఎస్ పరిధి మూసారంబాగ్ డివిజన్ గంగాధర అపార్ట్మెంట్లో ఈ నెల 14న అర్ధరాత్రి నగ్నంగా తిరిగిన వ్యక్తిని ఆదివారం మలక్పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న అతని స్నేహితులు రాత్రి 10.30 గంటలకు పోలీస్స్టేషన్కు వచ్చారు. అదే విధంగా మలక్పేట బీజేపీ నాయకులు కూడా పీఎస్కు చేరుకుని నగ్నంగా తిరిగిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగ్నంగా సంచరించిన వ్యక్తిది అత్తాపూర్ అని తెలిసింది.కారణం మానసిక సమస్యలే.. ఇలాంటి ఉదంతాలు చోటు చేసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని రకాలైన మానసిక సమస్యలు ఉన్న వాళ్లు, మద్యం, డ్రగ్స్కు బానిసలైన వాళ్లు ఇలా ప్రవర్తిస్తారని అంటున్నారు. కొన్నిసార్లు స్నేహితులు లేదా పరిచయస్తులతో పందేలు కాసి అలా ప్రవర్తిస్తారని పేర్కొంటున్నారు. -
నిర్మాతల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యం
సినిమా నిర్మాణాన్ని సవాల్ చేస్తున్న క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళకు (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం) చెందిన అగ్ర సినీ నిర్మాతలు, సంబంధిత ప్రతినిధులు, ప్రోడ్యూసర్స్ గిల్డ్ ప్రతినిధులు ఏకతాటి పైకి వచ్చారు. సినిమా పరిశ్రమను వేధిస్తున్న సమస్యలను పరిష్కరించడమే కాకుండా నిర్మాతల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ (ఎస్ఐఎఫ్పీఏ) ఏర్పాటైంది.ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ‘ఎస్ఐఎఫ్పీఏ’ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. సినిమా నిర్మాణ రంగంలో ఇతర స్టేక్ హోల్డర్లు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదు. 8 వారాల తర్వాతనే ఓటీటీలో సినిమాను విడుదల చేయాలి, సినిమా రిలీజ్ల విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి (థియేట్రికల్ రెవెన్యూకు సంబంధించి పర్సెంటేజ్ అండ్ రెంటల్ వివాదాన్ని ఉద్దేశించి కావొచ్చు) అంటూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ఈ సమావేశంలో నిర్మాతలు ఖండించారు.వేలాది మంది ఉపాధి ఆధారపడి ఉన్న సినిమా నిర్మాణ వ్యవస్థలో ఆకస్మాత్తు నిర్ణయాలు తీసుకుని, రాత్రికి రాత్రి ఆటంకం కలిగించకూడదని ఈ సమావేశంలోని ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ విడుదల చేసిన నోట్లోని అంశాలు ఈ విధంగా... ‘‘నిర్మాతల ప్రయోజనాలను దీర్ఘకాలం పాటు కాపాడటానికి ‘ఎస్ఐఎఫ్పీఏ’ను ఏర్పాటు చేయడానికి నిర్మాతలందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. నాలుగు భాషలకు చెందిన దక్షిణాది నిర్మాతల మధ్య సమన్వయం కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం సభ్యులైన నిర్మాతలు తమ సినిమాల నిర్మాణం, విక్రయం, విడుదల తేదీ వంటి అంశాల విషయంలో ఏ ఇతర సంఘం నిబంధనలకు కట్టుబడకుండా తమ సొంత నిర్ణయాలతో కొనసాగాలి. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమాల విడుదల విషయంలో ఎటువంటి హామీ పత్రాలను నిర్మాతలు ఏ అసోసియేషన్కు లేదా రంగానికి ఇవ్వకూడదు. సినిమా పరిశ్రమ ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి నిబంధనలను అందరితో చర్చించి మాత్రమే నిర్ణయించుకోవాలి’’ అంటూ ‘ఎస్ఐఎఫ్పీఏ’ స్టీరింగ్ కమిటీ ఆ నోట్లో పేర్కొంది. -
Hyd: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
హైదరాబాబాద్: నగరంలోని కూకట్పల్లిలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఐడీఎల్ చెరువులో దూకేసింది ఓ డిప్లొమో విద్యార్థిని. వ్యక్తిగత కారణాల వల్ల మనస్తాపానికి గురై ఆమె చెరువులో దూకినట్లు సమాచారం. కేపీహెచ్బీ ప్రాంతంలో హాస్టల్లో ఉంటోంది 20 ఏళ్ల విద్యార్థిని. అయితే వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెందిన ఆమె.. ఐడీఎల్లో చెరువులో దూకేసింది. దీనిపై పోలీసులు వెంటనే స్పందించడంతో ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చెరువు మధ్యలో లోతుగా ఉన్న ప్రదేశానికి వెళ్లిపోయిన ఆ విద్యార్థిని చాకచక్యంగా కాపాడారు పోలీసులు. యువతి ప్రాణాలు కాపాడిన పోలీసులకు ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. -
తెలంగాణలో పలుచోట్ల వడగండ్ల వాన బీభత్సం
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల వడగండ్ల వాన బీభత్సం స్పష్టించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాలతో పాటు నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో వడగండ్ల వాన కురిసింది. నిజామాబాద్లో పలు చోట్ల గంట పాటు వడగండ్ల వాన కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, కొండూరు, మైలారం, పెద్ద వాల్గోట్ , చిన్న వాల్గోట్, భీం గల్లో వడగండ్ల వానతో జనజీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం నీటిపాలైంది. అకాల వర్షంతో అరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక హైదరాబాద్లో పలు చోట్ల వడగండ్ల వాన పడింది. ప్రధానంగా సుచిత్రా సర్కిల్, కొంపల్లి పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, మియాపూర్, చందానగర్, చింతల్, సూరారం, దుండిగల్లో కూడా వడగండ్ల కురిసింది. భారీ వర్షానికి కొన్ని చోట్ల వడగండ్లు ఇంట్లోకి సైతం వచ్చి పడ్డాయి. వాతావరణ మార్పులతో తెలంగాణలో పలుచోట్ల అకాల వర్షాలు పడతాయని ముందుగానే అధికారులు హెచ్చరించారు. రేపు, ఎల్లుండి కూడా తెలంగాణలో అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారుల ప్రకటన బట్టి తెలుస్తోంది.


