Hyderabad
-
అరబిందో ఫార్మా థెరానిమ్ బయోలాజిక్స్ కేంద్రం ప్రారంభం
హైదరాబాద్: భారతదేశంలోని అతిపెద్ద ప్రత్యేక బయోలాజిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్లలో (సీఎంఓ) ఒకటైన థెరానిమ్ కేంద్రాన్ని అరబిందో ఫార్మా ప్రారంభించింది. తెలంగాణ మంత్రులు డి. శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ సమక్షంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. బయోలాజిక్స్ తయారీలో కొత్త ప్రమాణాలను నెలకొల్పే ఈ ప్రాజెక్ట్కు ప్రముఖ ఔషధ సంస్థ ఎంఎస్డీ ప్రధాన కస్టమర్గా చేరింది.ప్రారంభోత్సవానికి ముందు అరబిందో ఫార్మా డైరెక్టర్లు, ఎంఎస్డీ సీనియర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రాజెక్ట్ వివరాలు తెలియజేసి ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఈ ప్రాజెక్ట్ నిదర్శనంగా నిలుస్తుందని మంత్రులు పేర్కొన్నారు. బయోలాజిక్స్ కాంట్రాక్ట్ తయారీ రంగంలో అరబిందో ఫార్మా వ్యూహాత్మక విస్తరణలో భాగంగా ఏర్పాటైన థెరానిమ్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బయోలాజిక్ చికిత్సల డిమాండ్ను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది. -
అమెరికాలో కారు ప్రమాదం.. మధు యాష్కీ సతీమణికి తీవ్ర గాయాలు
వాషింగ్టన్: అమెరికాలో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణి సీనియర్ డాక్టర్ సుచీయాష్కీకి తీవ్రగాయాలయ్యాయి. మధుయాష్కీ దంపతుల కుమార్తె డాక్టర్ గగన యాష్కీని ఎండీ కోర్సులో జాయిన్ చేయించి బోస్టన్ నుంచి న్యూయార్క్కు వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. కారులో లగేజీ ఎక్కువ కావడంతో మధుయాష్కీ గౌడ్, సుచీయాష్కీలు వేర్వేరు కార్లలో ప్రయాణిస్తున్నారు.అయితే మార్గం మధ్యలో భారీ వర్షం కారణంగా సుచీ యాష్కీ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుచీయాష్కీకి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుచీయాష్కీ కోలుకుంటున్నారని సమాచారం. కాగా, అమెరికా పర్యటన ముగించుకొని రేపు మధుయాష్కీ దంపతులు భారత్కు రావాల్సి ఉంది. అమెరికాలో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సతీమణికి కారు ప్రమాదంసీనియర్ డాక్టర్ సుచి యాష్కీకి తీవ్ర గాయాలు.. రిబ్స్ విరిగినట్లు వైద్యులు వెల్లడికుమార్తె డాక్టర్ గగన యాష్కీని ఎండీ కోర్సులో జాయిన్ చేసి తిరిగి వస్తుండగా ప్రమాదంబోస్టన్ నుంచి న్యూయార్క్కు వస్తుండగా వర్షం కారణంగా కారు… pic.twitter.com/L0yxPNceyh— DONTHU RAMESH (@DonthuRamesh) June 3, 2026 -
జూబ్లీ బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జూబ్లీ బస్టాప్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్టాండ్ సిగ్నల్స్ వద్ద అదుపుతప్పి ప్రయాణికులపైకి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దూసుకెళ్లింది. దీంతో వాహనదారుడు బస్సు టైర్ల కింద ఇరుక్కుపోయాడు. ట్రాఫిక్ పోలీసులు అక్కడున్న వారి సాయంతో బస్సును పైకి లేపి వాహనదారుడి ప్రాణాలను కాపాడారు. బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ప్రాణాపాయం తప్పడంతో పోలీసులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
కాగితాలు ఏరుకునే వ్యక్తి పేరిట.. బీమా మోసం!
సుల్తాన్బజార్: చనిపోయిన వ్యక్తి పేరు మీద రూ.5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని బీమా డబ్బులు కాజేయాలని చూసిన ఓ ముఠా గుట్టును సుల్తాన్బజార్ పోలీసులు రట్టు చేశారు. చాదర్ఘాట్ వద్ద కాగితాలు ఏరుకుంటూ బతికే తలారి వెంకటయ్య అనే వ్యక్తి 2023 జనవరి 9న విద్యుదాఘాతంతో చనిపోయాడు.ఈ మరణాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న బోడ శ్రీకృష్ణ అనే వ్యక్తి స్టార్ హెల్త్ ఏజెంట్ మల్దే మహేష్, సేల్స్ మేనేజర్ మడసిరావార వంశీకృష్ణలతో కుమ్మకై పక్కా స్కెచ్ వేశాడు. 2024 డిసెంబర్లో వెంకటయ్య పేరు మీద స్టార్ హెల్త్ యాక్సిడెంటల్ డెత్ పాలసీ తీసుకున్నారు. మృతుడి బావమరిదినంటూ శ్రీకృష్ణ నామినీగా నమోదు చేసుకున్నాడు. 2025 ఏప్రిల్ 28న ప్రమాదం జరిగినట్లుగా పోలీసుల పాత ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం, ఇన్వెస్ట్ రిపోర్టులను ఫోర్జరీ చేశారు.క్లైమ్ కోసం దరఖాస్తు చేయగా స్టార్ హెల్త్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మహ్మద్ అబ్దుల్ బారీ చేసిన అంతర్గత విచారణలో బండారం బయటపడింది. పాలసీ తీసుకోవడాని కంటే ముందే వెంకటయ్య చనిపోయాడని తేలడంతో 2026 మే 14న సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడికి తరలించారు. ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ మత్తయ్య పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ నరేష్, ఎస్ఐ వేణు ఈ కేసును ఛేదించారు. -
చినికి చినికి చివరికి హత్యగా!
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయవాది, వక్ఫ్ బోర్డు ప్యానెల్ సభ్యుడు ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, విలువైన స్థిరాస్తులు తమ చేయి దాటిపోతున్నాయనే ఉద్దేశంతోనే ఆలంఖాన్లు ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. మలక్పేట, లక్డీకాపూల్ల్లోని ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్తోపాటు మల్లేపల్లిలో ఉన్న మదర్సా ఏ ఎజాజ్ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఖాజా మొహిజుద్దీన్కు తండ్రీకుమారులైన మహబూబ్ ఆలంఖాన్, ముజాహిద్ ఆలంఖాన్ వర్గాల మధ్య ఏళ్లుగా విభేదాలు నెలకొన్నాయి.13 ఏళ్లుగా వివాదాలు.. ఈ రెండు సంస్థలకు చెందిన స్థిరచరాస్తులు, విద్యాసంస్థల పరిపాలన, నిర్వహణను చేతుల్లోకి తీసుకునే అంశంపై 13 ఏళ్లుగా వివాదాలు నడిచాయి. ఈ నేపథ్యంలోనే మజ్లిస్ ఏ ఉమ్నాగా పిలిచే ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్ మేనేజింగ్ కమిటీ 2013లో మహబూబ్ ఆలంఖాన్ను సెక్రటరీ పోస్టు నుంచి తొలగించింది. దీంతో మహబూబ్ ఆలంఖాన్ 17 మంది సభ్యులతో ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతీ ప్రెసిడెంట్తో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ఈ రెండు కమిటీలు ఒకదానిపై మరోటి హైకోర్టులో అనేక రిట్ పిటిషన్లు ఫైల్ చేసుకున్నాయి.రాజీ చేసినా.. 2023లో కొందరు ఈ రెండు గ్రూపుల మధ్య రాజీ చేసి క్రిమినల్, సివిల్ పిటిషన్లు ఉపసంహరించునేలా చేశారు. దీంతో మహబూబ్ ఆలంఖాన్ ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్కు సెక్రటరీగా పునర్ నియమితులై 2025 ఫిబ్రవరి వరకు కొనసాగారు. ఆర్థిక అవకతవకలపై మరోసారి మహబూబ్ ఆలంఖాన్కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ముంతాజ్ యార్ ఉద్ దౌలా వక్ఫ్ మేనేజింగ్ కమిటీని రద్దు చేసింది. ఆ సమయంలో 2025 నుంచి 2027 వరకు చెల్లుబాటు అయ్యేలా ఏర్పడిన కొత్త కమిటీకి ఖాజా మొహిజుద్దీన్ ట్రెజరర్గా నియమితులయ్యారు. దీంతో మరోసారి హైకోర్టులో మహబూబ్ ఆలంఖాన్కు వ్యతిరేకంగా పిటిషన్లు ఫైల్ అయ్యాయి. వాటికి ఖాజా మొహిజుద్దీన్ వకాల్తా తీసుకున్నారు.వకాల్తా.. ఆర్థికంగా దివాలా.. 2013లో ఉస్మాన్ ఖాన్, కిషన్సింగ్ అలియాస్ పప్పుతో కలిసి మహబూబ్ ఆలంఖాన్ లంగర్హౌస్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ ద్వారా ఖాజా మొహిజుద్దీన్పై అత్యాచారం కేసు నమోదు చేయించారు. దర్యాప్తు అనంతరం ఈ కేసును పోలీసులు మూసివేశారు. మొహిజుద్దీన్ వకాల్తా కారణంగా తాము ఆర్థికంగా నష్టపోతున్నామని, అనేక వక్ఫ్ ఆస్తులు చేయి దాటిపోతున్నాయని భావించిన ఆలంఖాన్లు అతడిని అంతం చేయాలని కుట్ర పన్నారు.అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా కనిపించేలా హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ బాధ్యతల్ని తమ వద్ద పని చేసే హసన్ అలీతోపాటు ముజాహిద్ ఆలంఖాన్కు పరిచయస్తుడైన మునీర్లకు అప్పగించారు. కిషన్సింగ్ని కూడా భాగస్వామిని చేశారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాల్సిందిగా నాంపల్లి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసమూ గాలిస్తున్నారు. -
స్పాట్ పెట్టేస్తున్నాయ్.. సైబరాబాద్ పరిధిలో 43 బ్లాక్స్పాట్లు!
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 43 ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్ స్పాట్స్) ప్రాణాంతకంగా మారాయి. గత మూడేళ్లలో 320 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 251 మంది మరణించారు. మూల మలుపులు, అసంపూర్ణ రహదారి పనులు, వెలుతురు సరిగా లేకపోవడం, వాహనాల మార్గానికి అడ్డంగా చెట్లు ఉండటం వంటి కారణాలుగా గుర్తించారు. అనేక ప్రమాదకర ప్రాంతాల చుట్టూ నివాస కాలనీలు, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంక్లు, మెట్రో కారిడార్లు ఏర్పడ్డాయి. దీంతో ఆయా మార్గాలలో పాదచారులు, స్థానిక ప్రయాణికులు నిత్యం రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.ట్రాఫిక్ పోలీసు అధికారులు, శాంతి భద్రతల పోలీసు స్టేషన్లు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, రోడ్ ఇంజినీరింగ్ ఏజెన్సీల బాధ్యులు బ్లాక్ స్పాట్లను తనిఖీ చేసి నివేదిక రూపొందించారు. గుర్తించిన ప్రమాదకర ప్రాంతాల్లో 90 శాతానికి పైగా మేడ్చల్ జోన్ పరిధిలోకి వస్తాయి. 50 శాతానికి పైగా ప్రమాదకర ప్రాంతాలలో ఎన్హెచ్–65 మార్గం అత్యంత ప్రమాదకరమైందిగా గుర్తించారు. 43 బ్లాక్ స్పాట్లలో 22 ముంబై హైవే (ఎన్హెచ్–65)కి చెందినవే ఉండటం గమనార్హం.అత్యంత ప్రభావిత ప్రాంతాలివీ..పటాన్చెరు శాంతి నగర్ కమాన్ నుంచి బజాజ్ ఎల్రక్టానిక్స్ మార్గం అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ 24 ప్రమాదాలు జరగగా.. 11 మంది మరణించారు.పటాన్చెరులోని ఇస్నాపూర్ క్రాస్ రోడ్లో అలాగే ఆర్సీపురంలోని శ్రీమణికాంత షాపింగ్ కాంప్లెక్స్ నుంచి ఏషియన్ జ్యోతి థియేటర్ వరకు ఒక్కో మార్గంలో 10 మరణాలు సంభవించాయి.పటాన్చెరులోని నోవాపన్ టీ–జంక్షన్ మరో ప్రమాదకర ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ 10 రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు.ఎన్హెచ్–765డీ పై కుత్బుల్లాపూర్ ఎక్స్ రోడ్ నుంచి మాంగల్య షాపింగ్ మాల్ వరకు ఉన్న మార్గంలో 16 ప్రమాదాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. గండిమైసమ్మ ఎక్స్ రోడ్లో 14 ప్రమాదాల్లో 14 మంది చనిపోయారు.ఎన్హెచ్–65తో పాటు అధికారులు ఎన్హెచ్–44 నాగ్పూర్ రోడ్డుపై 7, ఎన్హెచ్–765డీ మెదక్–నర్సాపూర్ రోడ్డుపై 6, స్టేట్ హైవే (ఎస్హెచ్–1) రాజీవ్ రహదారిపై ఒకటి, నల్లగండ్ల ఫైఓవర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి ఓల్డ్ ముంబై హైవే వరకు ఉన్న మార్గంలో 5 ప్రమాదాలతో సహా 7 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు.ఎన్హెచ్–44పై రేకులబాయి క్రాస్ రోడ్, భారత్ పెట్రోల్ మధ్య మార్గంలో 11 ప్రమాదాల్లో 11 మంది చనిపోయారు. మేడ్చల్లోని ఎస్సీ హోటల్, సంప్రదా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మధ్య మార్గంలో 10 యాక్సిడెంట్లలో 8 మంది మృత్యువాత పడ్డారు.కారణాలివీ..అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనుల వల్ల అనేక మార్గాలు ప్రభావితమయ్యాయి. రోడ్లను తవ్వి చాలాకాలం పాటు అసంపూర్తిగా వదిలేశారు. రోడ్లపైనే నిర్మాణ సామగ్రి పెట్టడం, దెబ్బతిన్న క్యారేజ్వేలు, పాక్షికంగా పూర్తి చేసిన రోడ్డు పనులు అనేక ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.రోడ్డు పక్కన ఉన్న చెట్లు క్యారేజ్వేల పైకి చొచ్చుకురావడం, చెట్లు ఎండిపోయి అనేక ప్రాంతాలలో క్యారేజ్వేలకు అడ్డుగా ఉన్నట్లు తనిఖీలలో పోలీసులు గుర్తించారు. మూలమలుపులు, ఎత్తుపల్లాలు ఉండటం, రాత్రి వేళల్లో ఆయా మార్గాలలో వీధి దీపాలు లేకపోవడం, ఉన్నా వెలుతురు సరిగా లేకపోవడం. రాత్రి వేళల్లో అధిక వేగంతో వాహనాలు తిరిగే హైవే మార్గాలలో హెచ్చరిక బోర్డులు లేకపోవడం. -
తెలంగాణకు ఐఎండీ బిగ్ అలర్ట్
హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం గమనార్హం.తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు మరింత ఉధృతంగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట.. .. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు.అదే సమయంలో నైరుతి రుతుపవనాలు రేపటిలోగా కేరళ, తమిళనాడును తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాల తీవ్రత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. తల్లాడలో 6 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 4 సెం.మీ, దమ్మపేటలో 3 సెం.మీ, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 1.7 సెం.మీ వర్షం కురిసింది. మరోవైపు ఎండల తీవ్రత కూడా కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మరో 27 జిల్లాల్లో 40.2 నుంచి 44.7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని అధికారులు తెలిపారు. -
అలలపై.. అలా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తున్న ‘17వ మాన్సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్షిప్’ నగరంలోని హుస్సేన్ సాగర్ వేదికగా ప్రారంభమైంది.మంగళవారం గాలి వేగం తగ్గడంతో ప్రిన్సిపల్ రేస్ ఆఫీసర్ చంద్రశేఖర్ దలై వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక రేసును మాత్రమే పూర్తి చేయగలిగారు. బాలికల అండర్–15 విభాగంలో సికింద్రాబాద్ క్లబ్కు చెందిన సృష్టి సింగ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొదటి రోజు ముగిసే సమయానికి బాలుర విభాగంలో నిల్కొండ మణి (1 పాయింట్) అగ్రస్థానంలో నిలవగా, బాలికల విభాగంలో సృష్టి సింగ్ (4 పాయింట్లు) టాప్లో నిలిచింది.సెయిలింగ్లో ‘మణి’రత్నం.. మల్కాజిగిరికి చెందిన 13 ఏళ్ల నిల్కొండ మణి తొలి రేసులో మొదటి స్థానంలో నిలిచాడు. 30 నిమిషాల పాటు సాగిన ఈ రేసులో తన సమీప ప్రత్యర్థి కంటే దాదాపు 2 నిమిషాల భారీ ఆధిక్యంతో మణి విజయం సాధించాడు. -
మిస్టర్ పవన్.. తెలంగాణ మా అయ్య జాగీరే : పొన్నం
సాక్షి,హైదరాబాద్: ‘తెలంగాణ మీ అయ్య జాగీరా?’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. మిస్టర్ పవన్ కళ్యాణ్.. ‘తెలంగాణ మా అయ్య జాగీరే’ అంటూ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ‘తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల జాగీరే. ఆయన మాటల్లో అహంకారం కనిపించింది. పవన్ పెయిడ్ ఆర్టిస్ట్’ అంటూ ధ్వజమెత్తారు. ‘‘ఆంధ్రాలోనే గెలవలేదు. తెలంగాణకు వచ్చి చేసేదేముంది’’ అని ఆయనే వ్యాఖ్యానించారు. ఏపీలో తన పరిస్థితి ఏంటో తానే చెప్పుకున్నాడు. ఆంధ్రాలోనే తనకు దిక్కులేదు.. తెలంగాణ లో ఏముంటుంది అన్నారు. ఏపీ ప్రజలు ఇక్కడ ఉండొద్దని, ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దని మేము అనట్లేదు. అమెరికా వాల్లే పెట్టుబడి పెట్టగా.. ఏపీ వాళ్లు పెడతామంటే మేము ఎందుకు వద్దంటాం. పవన్ తెలంగాణ నీ అయ్య జాగిరి కాదు పవన్. ఇక్కడకొచ్చి ఏం మాట్లాడుతున్నావ్’ అని హెచ్చరించారు.‘గద్దర్కు కార్ కొనిచ్చా అని బహిరంగంగా ప్రకటించి పవన్ తప్పు చేశాడు. పవన్ గద్దర్కు క్షమాపణ చెప్పాలి ...లేదంటే దలిత సంఘాలు ప్రశ్నించాలి. తెలంగాణను పదేపదే పాకిస్థాన్తో పోల్చి అవమానిస్తున్నారు. తెలంగాణ అమరవీరుల కు ఎప్పుడైనా పవన్ మద్దతు ఇచ్చారా?, తెలంగాణ ఏర్పాటు తో 11 రోజులు అన్నం తినలేదు అన్నది పవన్ కాదు. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్డిస్ట్. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. కొండగట్టుకు పవన్ వస్తే...తెలంగాణ ఛీఫ్ గెస్ట్ గా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొండగట్టుకు పైసలు ఇచ్చామంటుంన్నారు.. మీ అయ్య జాగిరా ఆ పైసలు. బీజేపీ పార్టీ పవన్కు సరైన స్కిప్ట్ ఇవ్వలేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే సభ పెట్టి పవన్ గెలికాడు. తెలంగాణ లొ పవన్ తిరుగుతా అంటే మాకు అభ్యంతరం లేదు’ అని స్సష్టం చేశారు. -
ఇంత రాద్ధాంతం నడుమ ప్రెస్మీట్ అవసరమా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలకు కారణమవుతున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరును ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తప్పుబట్టారు. అనవసర వివాదాలకు పవన్ తెర తీస్తున్నారంటూ సాక్షితో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, అలాగే హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించాలన్న ఆయన ప్రకటనపై రాజకీయ దుమారం రేగింది. ఈ పరిణామంపై తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం తీవ్రంగా స్పందించారు.పవన్ కల్యాణ్ అనవసర వివాదాలకు తెర లేపుతున్నారని కోదండరాం విమర్శించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు నచ్చకపోతే అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవకాశం ఉన్నప్పటికీ, పోలీసు కేసుల వరకు వెళ్లడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తుల మధ్య ఉన్న విభేదాలను ప్రాంతాల మధ్య వైరుధ్యంగా మార్చడం ఆందోళనకరమని అన్నారు.మొదటి నుంచి తెలంగాణ అంటే బీజేపీకి గిట్టదని, ఈ వివాదాల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చని కోదండరాం వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ పవన్ కల్యాణ్ ద్వారా ఈ తరహా పరిస్థితులను నడిపిస్తోందని ఆరోపించారు. ఇంత రాద్దాంతం జరుగుతున్న తరుణంలో పవన్ హైదరాబాద్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయన తన అభిప్రాయాలను ఏపీలోనే వ్యక్తం చేయవచ్చని సూచించారు.ఇదిలా ఉండగా.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరిలూదుకొన్నది తెలంగాణ గడ్డపైనేనని పేర్కొంటూ, ఈ నేల నుంచే పార్టీకి పోరాట పటిమ లభించిందని అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అదే సమయంలో.. జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ ప్రెస్మీట్కైనా పోలీసులు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్’లో వెటకారంగా ఓ పోస్ట్ చేశారు. -
ఐయో... సెల్ఫీ మోజులో పడి ప్రాణాల మీదకు..
-
హైదరాబాద్ లో హత్య కలకలం.. గంజాయి మత్తులో దారుణం
-
రెండు పడవలపై రేవంత్ ప్రయాణం!
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీఆర్ను ఏ విధంగా చూడాలి. కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన వీరుడుగా చూడాలా? లేక కాంగ్రెస్కు స్పూర్తి ఇచ్చిన నేతగా చూడాలా? నిజంగానే ఇది ఒక ఆసక్తికరమైన సన్నివేశం. హైదరాబాద్ మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రసంగం ఒకవైపు, మహానాడులో తెలుగుదేశం చేసిన తీర్మానం మరో వైపు ఉన్నాయి. ఇవి పరస్పర విరుద్దంగా కనిపిస్తాయి. మహానాడులో చేసిన తీర్మానంలో ఏమి రాశారో గమనించండి.తెలుగునాట కాంగ్రెస్ పాలనలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెరిగి, భవిష్యత్తు దుర్భరంగా మారిన వేళ ఉదయించిన వెలుగు కిరణం తెలుగుదేశం అని అందులో పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెత్తందార్ల మితిమీరిన జోక్యం, అడుగడుగునా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటున్న వైనం ప్రతి తెలుగు గుండెను పిండేశాయి. అన్ని వర్గాలవారు తీవ్ర నిరాశ, నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్నతరుణంలో 1982 మార్చి 28న ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని ప్రకటించారని ఆ తీర్మానంలో వివరిచారు.కాంగ్రెస్పై పోరాటం అన్న తీర్మానంలో ఈ అంశాలను పేర్కొన్నారు. అంటే దాని అర్థం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అనే కదా! కాంగ్రెస్ అవినీతిపార్టీ అని చెబుతున్నట్లే కదా! దానికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్.. కాంగ్రెస్కు ఎలా స్పూర్తి అవుతారు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతిరత్నంలా ఎలా కనిపించారు?అందులో కూడా అంబేద్కర్, మాజీ ప్రధాని ఇందిరగాంధీలతో సమానంగా ఎన్టీఆర్ను పొగిడారు. దీనిని కాంగ్రెస్ వాదులు అంగీకరించగలరా? ఆ రకంగా చూస్తే ప్రస్తుతం కూడా కాంగ్రెస్ అధిష్టానం దగ్గరకు రేవంత్ కూడా పెక్కుమార్లు వెళుతున్నారు కదా! అంటే ఇప్పుడు కూడా తెలంగాణవారి ఆత్మగరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్లేనా?దానిని ఆయన ఒప్పుకుంటారా?అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడుగా ఉండడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన నేత. అలాగే ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉంటూ ఎన్నో విజయాలను దేశానికి అందించారు. కాని ఎన్.టి.రామారావు రాజకీయాలలోకి రావడానికి ముందు సినీమా నటుడు. పలు సాంఘిక పాత్రలతో పాటు రాముడు, కృష్ణుడు వంటి పాత్రలు పోషించడం ద్వారా తెలుగు ప్రజలను ఆకట్టుకున్న మాట నిజమే. ఆ రకంగా ఆయన గొప్పవాడే. తదుపరి ప్రజలలో తనపై ఉన్న సినీ క్రేజ్ను ఆసర చేసుకుని రాజకీయాలలోకి వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటుు ఆఫర్ చేసి ఉంటే రిస్థితి ఎలా ఉండేదో తెలియదు. కాంగ్రెస్పై విమర్శలు చేస్తూ ఆయన అధికారం చేపట్టగలిగారు.తెలుగుదశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్ధిగా ఉంది. ఒకసారి కాంగ్రెస్ మద్దతుతో ఎన్టీఆర్ను నాదెండ్ల భాస్కరరావు దించితే, అప్పుడు వచ్చిన ప్రజాందోళన, దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష సహకారం వంటి కారణాలతో తరిగి అధికారంలోకి వచ్చారు. కాని 1995లో స్వయాన అల్లుడి చేతిలో ఘోర పరభవానికి గురై ఆయన మళ్లీ పదవి కోల్పోయారు. 1985లో ఏపీలోని మూడు ప్రాంతాలలో పోటీచేసి గెలిచిన నేతగా రికార్డు ఉన్నప్పటికీ, 1989లో ఆయనే తెలంగాణలోని కల్వకుర్తిలో పోటీచేసి ఓటమపాలయ్యారు. తన పాలన కాలంలో తానిచ్చిన హామీలను నరవేర్చడానికి ఆయన కృషి చేసిన మాట నిజమే.అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను అధికారం నుంచి దించడానికి నేషనల్ ఫ్రంట్ స్థాపనలో క్రియాశీలక పాత్ర పోషించి దానికి ఛైర్మన్గా వ్యవహరించారు. ఈ మొత్తం ప్రక్రియలో కాంగ్రెస్కు స్పూర్తిని ఇచ్చిన అంశం ఏమిటో తెలియదు. అయిన ఫర్వాలేదు. ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ స్థిరపడ్డ టీడీపీ మద్దతుదారులు, ప్రత్యేకించి కమ్మ వర్గంవారు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ను కోరారు. అందుకు అంగీకరించి ఆ ప్రకారం విగ్రహ పెట్టించారు. విశేషం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, వైస్ ఛైర్మన్లు ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ ప్రచార ప్రకటనలు ఇచ్చారు.ఈ నేపథ్యంలో విగ్రహం ఆవిష్కరణ చేసి రేవంత్ ఉపన్యాసం పెద్దగా ఇవ్వకుండా వెళ్లపోయి ఉంటే ఇబ్బంది లేకుండా పోయేది. కాని ఎన్టీఆర్, ఇందిరాగాంధీల స్పూర్తిగా ప్రజాపాలన చేస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగానే అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఒక హార్స్ పవర్కు ఏభై రూపాయలకే రైతులకు విద్యుత్ అందించారని, ఆ స్పూర్తితోనే వైఎస్ రాజశేఖరరెడ్డి కర్షకులకు ఉచిత విద్యుత్ ఇచ్చారని చెప్పడం విడ్డూరమే అనిపిస్తుంది. ఎన్టీఆర్ తీసుకువచ్చిన రెండు రూపాయలకే కిలో బియ్యం, మద్య నిషేధం తదితర కార్యక్రమాలకు టీడీపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే1998లో మంగళం పలికారు. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేశాక ఆయన అవసరమే పార్టీకి లేదని, సినిమావాళ్లు రాజకీయాలకు పనికిరారని కూడా ప్రకటనలు చేశారు.ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయనకు జనంలో ఉన్న అభిమానాన్ని కేష్ చేసుకోడానికి చంద్రబాబు మళ్లీ రాగం మార్చి ఉండవచ్చు. కాని ఇందులో కాంగ్రెస్కు ఏమి సంబంధం. వైఎస్సార్ సొంతంగా ఉచిత విద్యుత్ స్కీమ్ను రూపొందించుకుని కాంగ్రెస్ అధిష్టానంతో ఓకే చేయించుకుని ప్రకటన చేశారు. ఎన్టీఆర్ కన్నా ముందే కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా రూ.1.90కే ఆ రోజుల్లో కిలో బియ్యం సరఫరా చేశారు. తెలంగాణకు చెందిన ప్రఖ్యాత కాంగ్రెస్ నేత పివి నరసింహరావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగాను, తదుపరి దేశానికి ప్రధానిగా సేవలందించి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. ఆయన జాతిరత్నం కాకుండా ఎలా పోయారు.బహుశా సోనియాగాంధీ ఆయన అంటే పడదు కనుక పివి పేరు ప్రస్తావించలేదేమో తెలియదు. ఆ మాటకు వస్తే జవహర్ లాల్ వంటి గొప్పనేతలు కాంగ్రెస్కు ఉండగా, ఎన్టీఆర్ పేరును అరువుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి ఉంది. పైగా రేవంత్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలందరిని తీవ్రంగా విమర్శించిన రీతిలోనే ,కాంగ్రెస్లోకి వచ్చాక ఎన్టీఆర్ను కూడా పరుష పదజాలంతోనే దుయ్యబట్టారు. మరి ఇంతలోనే ఆయనలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఎన్టీఆర్ గొప్పదనాన్ని ఎవరూ కాదనరు. మా బోటి వాళ్లం అంతా ఆయన పార్టీని స్థాపించి నప్పుడు కేరింతలు కొట్టినవారమే.కాని వివిధ రాజకీయ పరిణామాల తర్వాత ఆయన మాత్రమే తెలుగుజాతి ఆత్మగౌరవం ఆయన ఒక్కరే అంటే మాత్రం ఒప్పుకోవడం కష్టం. తెలుగుదేశం వారు అలా అన్నారంటే తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ సీఎం ఆ వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ వాదుల మనోభావాలను గాయపరిచినట్లు అవుతుందన్న అభిప్రాయం ఉంది. పనిలో పని తనకు గురువైన చంద్రబాబును కూడా ఆయన పొగుడుకున్నట్లుగా ఉంది.ఆయనేమో మహనాడు తీర్మానంలో కాంగ్రెస్ను అవినీతి పార్టీ అని అంటారు. రేవంతేమో ఆ టీడీపీ గొప్పదని చెబుతున్నారు. అంతేకాదు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఒక టీటీడీపీ నేత ప్రసంగిస్తే, విద్యావ్యవస్థకు ఒక మంత్రి లేకుండా తెలంగాణలో చేశారని, అది దౌర్బగ్యామని, లోకేష్తో పోల్చి రేవంత్ను మరో టీడీపీ మహిళా నేత విమర్శించారు. అయినా టీడీపీ నేతలను పొగడదలచుకుంటే ఎవరు అభ్యంతరం చెబుతారు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అని అంటారు.అలాగే కాంగ్రెస్ను అవమానించిన టీడీపీని రేవంత్ ఏదో కొన్ని ఓట్ల కోసం పొగుడుకుంటే మొత్తం కాంగ్రెస్ అభిమానుల నుంచి నిరసనలు గురయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికలలో టీడీపీ ఓట్లు గణనీయంగానే కాంగ్రెస్కు పడి ఉండవచ్చు. కాని భవిష్యత్తులో బీజేపీ ఒత్తిడి చేసి ఇక్కడ ఉన్న టీడీపీ మద్దతుదారుల ఓట్లను బీజేపీకి వేయాలని గట్టిగా కోరితే అప్పుడు ఇదే రేవంత్రెడ్డి ఏమి చేస్తారో చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కాంగ్రెస్కు సొంత ఐడియాలజీ ఉందన్న సంగతి రేవంత్ గుర్తిస్తే మంచిదేమో! లేకుంటే రేవంత్ రెండు పడవల మీద కాళ్లేసి ప్రయాణిస్తున్నారన్న అనుమానం ప్రజలలో రావచ్చేమో!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
పుష్కర ప్రగతి.. పన్నెండేళ్లలో అభివృద్ధి ముద్ర
సాక్షి, హైదరాబాద్: నింగినంటే ఆకాశ హరŠామ్యలు, వేగం పెంచిన రహదారులు, ఫ్లైఓవర్లు, ప్రపంచ నగరాల చెంతన నిలిపిన అంతర్జాతీయ హంగులు.. వెరసీ గత పుష్కరకాలంలో భాగ్య నగరం గ్లోబల్సిటీగా అవతరించింది. దేశవిదేశాలకు చెందిన కార్పొరేట్ దిగ్గిజాలకు కేరాఫ్గా నిలిచింది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సదస్సులు, ఉత్కంఠభరితమైన పోటీలు జరిగాయి. నగరం అనేక మార్పులను సంతరించుకుంది.‘భారత్ ఫ్యూచర్సిటీ’ దిశగా పరుగులు తీస్తోంది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విస్తరించుకుంది. దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి, శ్వేతసౌధాన్ని తలపించే సచివాలయం, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అందబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం, ఆ చెంతనే ఠీవీగా కొలువుదీరిన మాజీ ప్రధాని పీవీ విగ్రహం, లుంబినీ పార్కును ఆనుకొని నిర్మించిన అమరుల స్మారక భవనం.. చారిత్రక, పర్యాటక ఆనవాళ్లుగా నిలిచాయి.ముచ్చటగా మూడు కార్పొరేషన్లు..ఔటర్రింగ్ రోడ్డు వరకు ఉన్న నగరానికి కోర్ అర్బన్ సిటీగా పరిగణిస్తూ ప్రభుత్వం మూడు మున్సిపల్ కార్పొరేషన్లను కొత్తగా ఏర్పాటు చేసింది. ఇంతకుముందే ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కొత్తగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉనికిలోకి వచ్చాయి. దీంతో మహా నగరం సుమారు 2000 చ.కి.మీ. వరకు విస్తరించింది. కొత్తగా 300 డివిజన్లుగా నగరం విస్తరించింది. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిని సైతం ప్రభుత్వం పెంచింది. 7,200 చ.కి.మీ. నుంచి 10,080 చ.కి.మీ.పైగా హెచ్ఎండీఏ పరిధి పెరిగింది. ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్రోడ్డు వరకు 16 చోట్ల గ్రీన్ఫీల్డ్ రోడ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి.మెట్రో రయ్ రయ్..సుమారు 17 సంవత్సరాలకు పైగా ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) భాగస్వామ్య ప్రాజెక్టుగా కొనసాగిన హైదరాబాద్ మెట్రో మొదటిదశ ప్రాజెక్టును ప్రభుత్వం ఎల్అండ్టీ నుంచి స్వాధీనం చేసుకొంది. మెట్రో రెండోదశ విస్తరణలో భాగంగా చేపట్టిన ఈ ప్రక్రియ మరో కీలకమైన పురోగతిగా భావించవచ్చు.భూమి బంగారం.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే కళ్లు చెదిరే రీతిలో రాయదుర్గంలో భూముల వేలం సరికొత్త రికార్డును సృష్టించింది. టీజీఐఐసీ ఇటీవల నిర్వహించిన ఈ– వేలంలో ఎకరం ఏకంగా రూ.237 కోట్లకు అమ్ముడుపోయింది. మొత్తం 6.29 ఎకరాల భూమిపై రూ.1,490.73 కోట్లు లభించాయి. గత ఏడాది అక్టోబర్లో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోనే ఎకరం రూ.177 కోట్లు పలకగా, అంతకుముందు కోకాపేట నియోపోలిస్ వేలంలో ఎకరం రూ.100.75 కోట్లకు పైగా పలికింది.బాచుపల్లి ఫ్లైఓవర్ త్వరలో ప్రారంభం.. సాక్షి, సిటీబ్యూరో: బాచుపల్లి–మియాపూర్–గండిమైసమ్మ కారిడార్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు రూ.65.53 కోట్లతో నిర్మించిన బాచుపల్లి ఎక్స్ రోడ్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ను త్వరలో ప్రారంభించనున్నట్లు హెచ్ఎండీఏ తెలిపింది. 17.5 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్ల రహదారిగా 1.3 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్లో 545 మీటర్ల వరకు వయాడక్ట్ ఉంటుంది. మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి గండిమైసమ్మ వైపు ప్రయాణించే వాహనదారులకు ఊరట లభించనుంది. 30 మీటర్ల స్పాన్లతో, ప్రత్యేక అవసరాలున్నచోట కాంపోజిట్ స్టీల్ గిర్డర్ సూపర్ స్ట్రక్చర్ను ఉపయోగించారు. -
మత్తులో 2 హత్యలు..
కంటోన్మెంట్, బంజారాహిల్స్: గంజాయి మత్తులో ఓ యువకుడు కత్తితో పొడిచి మరో యువకుడిని, మద్యం మత్తులో ఓ వ్యక్తి స్నేహితుడిని చంపేశారు. మారేడ్పల్లి సంజీవయ్యనగర్ బస్తీ వాసి, ఫ్లవర్ డెకరేటర్ శ్రావణ్ (22)ను అదే ప్రాంతానికి చెందిన నిఖిల్ (23) అంతమొందించాడు.బీటెక్ ఆపేసి గంజాయికి బానిసైన నిఖిల్... శ్రావణ్ బంధువుల యువతిని అసభ్య సైగలతో వేధిస్తున్నాడు. శ్రావణ్, నిఖిల్ మధ్య 2 నెలల క్రితం గొడవ జరిగింది. ఆదివారం రాత్రి యువతిని నిఖిల్ మళ్లీ వేధించాడు. ఆమె తండ్రి మందలించగా గొడవ మొదలైంది. అప్పుడే ఇంటికి వస్తున్న శ్రావణ్ నిలదీయగా... కోపోద్రిక్తుడైన నిఖిల్ కత్తితో 8 సార్లు పొడిచాడు. గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రావణ్ చనిపోయాడు. నిఖిల్ గంజాయి తాగడంతో పాటు అమ్ముతుంటాడని, ఆ మత్తులోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు బేంగపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు.బంజారాహిల్స్ రోడ్ నం11 లోని బోళానగర్ బస్తీకి చెందిన మహ్మద్ ఇమ్రాన్ (32), రౌడీషీటర్ అహ్మద్ హుస్సేన్ స్నేహితులు. ఆటో నడుపుతుంటారు. ఖాలిద్ సయీద్ జావీద్, హైదర్ షరీఫ్, అన్వర్, మతీన్తో కలిసి హయత్ ప్లేస్ హోటల్ గల్లీలో ఆటోలోనే ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మద్యం తాగారు. ఖాళీ బీరు సీసాలను హుస్సేన్ రోడ్డు పక్కన పడేశాడు. అలా నిర్లక్ష్యంగా పడేస్తే ఎవరికైనా గుచ్చుకుంటాయని ఇమ్రాన్ మందలించాడు. హుస్సేన్ కోపంతో నాకే నీతులు చెబుతావా? అంటూ దాడికి దిగాడు. అరగంట పాటు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కుప్పకూలిన ఇమ్రాన్ మృతి చెందాడు. -
తెలంగాణ ఉద్యోగులకు గుడ్న్యూస్
హైదరాబాద్లోని సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, ఉద్యోగ సంఘాలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సమావేశం నిర్వహించారు. అనంతరం కీలక వివరాలు వెల్లడయ్యాయి. రెండు రోజుల్లో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) ట్రస్ట్ ద్వారా ఇది అమలు అవుతుంది.ఉద్యోగులు, పెన్షనర్లకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యమని సీఎస్ రామకృష్ణరావు అన్నారు. ఉద్యోగ సంఘాల సూచనలతో ట్రస్ట్ మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలిపారు. ట్రస్ట్కు ప్రత్యేక బ్యాంకు ఖాతా.. ప్రభుత్వం-ఉద్యోగుల సమాన వాటా ఉంటుందని వివరించారు. పూర్తి స్వయం ప్రతిపత్తితో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ పనిచేయనుంది. లబ్ధిదారుల ప్రయోజనాల కోసం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ట్రస్ట్ పాలన, ఆర్థిక నిర్వహణపై ఉద్యోగ సంఘాల నుంచి కీలక సూచనలు వచ్చాయి.ట్రస్ట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాంజాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ను స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రాథమిక వేతనంపై 1.5% కోత విధించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరారు. ఉద్యోగి వాటాను బేసిక్ పేతో కాకుండా కుటుంబ సభ్యుల ఆధారంగా నిర్ణయించాలని చెప్పారు. -
Hyd: భూములు బంగారం.. కొండలకే కోట్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధానిలో భూములు బంగారమైపోయాయి. కొండలే రూ.కోట్లు పలుకుతున్నాయి. హైదరాబాద్ భూముల వేలం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా ప్రభుత్వం నిర్వహించిన రాయదుర్గం భూముల వేలంలో ఎకరం రెండొందల కోట్లు పైగానే పలికింది. వరుసగా నిర్వహించిన రెండు వేలాల్లో సైతం ఎకరం భూమి ధర రెండొందల కోట్ల మార్కును దాటేయడం విశేషం. గతంలో రూ. 177 కోట్లు పలికితేనే వామ్మో అనుకునే ఆశ్చర్యపోతే, ఇప్పుడు రూ. 200 కోట్లను ఎకరం భూమి దాటేసి మరీ రికార్డులను స్పష్టించింది. ఈరోజు(సోమవారం, జూన్ 1వ తేదీ) టీజీఐఐసీ(Telangana Industrial Infrastructure Corporation) తాజాగా నిర్వహించిన భూముల వేలంలో రికార్డు ధర పలికింది. టీజీఐఐసీ వేలంలో రూ. 204 కోట్లకు పైగా పలికింది రాయదుర్గం భూమి. రాయదుర్గంలో 5 ఎకరాల 9 గుంటల భూమికి వేలం వేయగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వెళ్లింది. రెండు రోజుల క్రితం వేలంలో ఎకరం భూమి రూ. 237 కోట్లు రికార్డు ధర పలకగా, ఈసారి అదే పరిధిలో ఎకరం భూమి రూ. 204 కోట్లకు వెళ్లింది. దాంతో రెండు విడతల్లోనూ రెండొందల కోట్ల మార్కను ఎకరం భూమి దాటేయడంతో భూములు మరింత ప్రియం అయిపోతున్నాయని అనుకోవడం మన వంతైంది. రెండు విడతల్లో కలిపి ప్రభుత్వానికి రూ. 2500 కోట్ల ఆదాయం సమకూరింది. రెండు రోజుల క్రితం సర్వే నంబర్ 83/1 లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి ఈ-వేల నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 6 ఎకరాల 9 గుంటలు రూ. 1490.73 కోట్లు పలికింది. దీన్ని గౌర వెంచర్స్ దక్కించుకుంది. -
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. వినోదం ఇక మాక్సిమమ్..!
హైదరాబాద్ సినీ ప్రియులకు బిగ్ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న సినీ ప్రియుల కల తీరనుంది. ఐమ్యాక్స్ థియేటర్ ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. నగరంలోని సుదర్శన్ థియేటర్లో ఈ ఐమ్యాక్స్ ఏర్పాటు కానుంది. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ పేరుతో ఈ ఐమ్యాక్స్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.ఇప్పటి వరకు భాగనగరంలో ఒక్క ఐమ్యాక్స్ థియేటర్ కూడా అందుబాటులో లేదు. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ఏర్పాటు సినీ ప్రియుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఈ ఏడాదిలోనే ఐమ్యాక్స్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. MAX PICTUREMAX SOUNDMAX IMMERSIONIntroducing, IMAX 🔥Coming soon only at AMB Classic Victory, Hyderabad 🌟@IMAX @SureshProdns#IMAX #HomecomingwithAMBClassicVictory pic.twitter.com/OcuQfibz7N— AMB Cinemas (@amb_cinemas) June 1, 2026 -
వామ్మో అన్ని కత్తి పోట్లా.. 8 కత్తి పోట్లు పొడిచిన ముఠా
-
రూ.500 కోట్ల చెరువును కబ్జా చేసిన పవన్ కళ్యాణ్
-
‘SIR పై ప్రతి ఒక్కరు అప్రమత్తముగా ఉండాలి’
హైదరాబాద్: ‘సర్’ ఇప్పడు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, దీని పేరుతో ఓట్లు తొలగించే అవకాశం ఉందన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించగా అందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ SIR ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. SIR పేరుతో ఓట్లు తొలగించడం జరుగుతుంది. ఓటు అనేది ప్రతి ఒకరి హక్కు. అంబేద్కర్ మనకు ఓటు హక్కు కల్పించారు. SIR పై ప్రతి ఒక్కరు అప్రమత్తముగా ఉండాలి. ఓటు హక్కు తొలగించే హక్కు ఎవరికి లేదు. కానీ ఈ కేంద్రం SIR పేరుతో తొలగిస్తుంది. 18 సంవత్సరాల నిండిన వారు ఓటు ఎన్రోల్ మెంట్ చేసుకోవాలి. బీఆర్ఎస్ మెంబర్ షిప్ డ్రైవ్ కూడా పెద్ద ఎత్తున జరగాలి. ఈసారి మెంబర్ షిప్ డ్రైవ్ డిజిటల్ లో చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి పనులు చేశాం. కంటోన్మెట్ ప్రజలు సురక్షిత మంచినీరు అందజేశాం. అలవీ కానీ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం వచ్చాక.. హామీలు గాలికి వదిలేశారు. ఒక్క పథకం సక్రమంగా అమలు కావడం లేదు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది’ అని మండిపడ్డారు. -
హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)
-
బొల్లారంలో దారుణం.. బైక్పై వెళ్తున్న దంపతులపై దాడి
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలో దారుణం జరిగింది. బైక్పై వెళ్తున్న భార్యాభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో దుండగులను భర్త అడ్డుకున్నారు. దీంతో ఆయన భార్య మీనాను దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేయగా.. భర్త అనిల్ కుమార్పై కత్తులతో దాడి చేశారు.తీవ్రంగా గాయపడిన అనిల్ కుమార్ పరిస్థితి విషమం ఉంది. ఆసుపత్రికి తరలించారు. పరారైన నిందితులు కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. బిహార్కు చెందిన దంపతులు బొల్లారంలో నివాసం ఉంటున్నారు. షాపింగ్కు వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది. -
టికెట్ ధరలపై డిస్కౌంట్ కట్
సాక్షి, హైదరాబాద్: వరుసగా పెరుగుతూ వచ్చిన చమురు ధరలు ఆర్టీసీపై పెద్ద ప్రభావమే చూపుతున్నాయి. నగరంలో కొన్ని కేటగిరీ బస్సుల్లో తక్కువగా ఉన్న ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకునేందుకు గతంలో ప్రకటించిన టికెట్ ధరలపై డిస్కౌంట్ను ఆర్టీసీ ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. నగరంలో తిరుగుతున్న మెట్రో డీలక్స్, మెట్రో లగ్జరీ సర్వీసుల్లో మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు చార్జీలతోనే ప్రయాణించేలా ఈ డిస్కౌంట్ను ఆర్టీసీ ప్రకటించింది. మే నెలతో దాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఫలితంగా జూన్ ఒకటి నుంచి పాత చార్జీలను వసూలు చేయనున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఆర్డినరీ (పల్లె వెలుగు కూడా), మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే వీలుంది. ఈ వెసులుబాటు మొదలైనప్పటి నుంచి ఆ రెండు కేటగిరీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ముందు వైపు ఉండే మహిళల సీట్లు నిండిపోయి, వెనకవైపు సీట్లలో కూడా ఎక్కువగా వారే కూర్చుంటున్నారు. దీంతో పురుషులకు సీట్లు పరిమితంగానే ఉంటున్నాయి. దీనిపై వారి నుంచి వరుసగా ఫిర్యాదులొస్తున్నాయి. దీంతో గతేడాది మెట్రో డీలక్స్ పేరుతో కొత్త కేటగిరీ సర్వీసును ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది . ఈ సర్వీసులో మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం లేకపోవటంతో, పురుషులకు సీట్లు లభిస్తున్నాయి. కానీ, ఇందులో మెట్రో ఎక్స్ప్రెస్తో పోలిస్తే రూ.5 వరకు చార్జీ ఎక్కువ. దీనివల్ల ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో నమోదుకాలేదు. దీన్ని గుర్తించిన ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల అభిప్రాయాలు సేకరించారు. ప్రభుత్వ పథకం వల్ల ఎక్స్ప్రెస్ బస్సుల్లో సీట్లు లభించటం లేదని, ఇప్పుడు సీట్లు కావాలంటే ఎక్కువ చార్జీ చెల్లించి డీలక్స్ బస్సులో వెళ్లమనడం ఎలా న్యాయమని చాలామంది పేర్కొన్నారు. దీంతో ఈ డీలక్స్ బస్సులతోపాటు, ఏసీ కేటగిరీ అయిన మెట్రో లగ్జరీ బస్సుల్లో గత మార్చిలో స్పెషల్ డిస్కౌంట్ను ఆర్టీసీ ప్రకటించింది. మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు టికెట్ చార్జీనే చెల్లించి వీటిల్లో ప్రయాణించే వీలు కల్పించింది. మే నెల వరకు పరిశీలించి ఆక్యుపెన్సీ రేషియో పెరిగితే, ఈ ఆఫర్ను కొనసాగించాలని అప్పట్లో నిర్ణయించారు.కానీ ఇప్పుడు వరసగా పలుమార్లు డీజిల్ ధరలను పెంచటంతో ఆర్టీసీపై పెద్ద భారం నమోదైంది.నెలవారీ దాదాపు రూ.14 కోట్ల వరకు అదనపు భారం నమోదు కావటంతో ఈ డిస్కౌంట్ విషయంలో ఆర్టీసీ పునరాలోచన కొచ్చింది. నష్టాలను భరిస్తూ ఆఫర్ను కొనసాగించటం సరికాదని నిర్ణయించి, మే నెలతోనే దానికి మంగళం పాడి జూన్ నుంచి మళ్లీ పాత ధరలను ప్రారంభించాలని నిర్ణయించింది. జూన్ ఒకటి నుంచి, మెట్రో డీలక్స్ బస్సుల్లో రెండో స్టేజీ నుంచి ఎక్స్ప్రెస్ కేటగిరీతో పోలిస్తే రూ.5 వరకు, లగ్జరీ బస్సుల్లో అది రూ.10 వరకు ఎక్కువగా ఉండనుంది. అంటే, గత ఫిబ్రవరి వరకు కొనసాగిన చార్జీలు జూన్ ఒకటి నుంచి మళ్లీ అమలవుతాయి. -
రెండు నెలలకొకసారి ‘టీం లంచ్’ : ఫోటో వైరల్
హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి తన డ్రైవర్, పనిమనిషితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను పోస్ట్ చేస్తూ, భారతదేశంలో వర్గ భేదాలు నెమ్మదిగా తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.తద్వారా తన దినచర్యలోని ఒక సాధారణమైన,కానీ హృద్యమైన సంగతులను పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.హైదరాబాద్కు చెందిన నరేష్ షేర్ చేసిన ఎక్స్లో ఒక సెల్ఫీని పోస్ట్ చేశారు. ముగ్గురూ కలిసి డైనింగ్ టేబుల్ వద్ద కీమా పరాఠా తింటూ కెమెరా వైపు చూసి నవ్వుతున్న నవ్వుతూ పోజులిచ్చారు. ఒక ఉల్లాసభరితమైన సెల్ఫీ తో షేర్ చేస్తూ దేశంలోని వర్గ భేదాలు మెల్లగా తొలగిపోవాలని ఆయన ఆకాంక్షించారు.తమ ఇంట్లో పనిచేసే సిబ్బందితో( డ్రైవర్, మేడ్) కలిసి ప్రతి రెండు నెలలకొకసారి తాను ఇలా 'టీమ్ లంచ్' చేస్తానని నరేష్ క్యాప్షన్లో రాశారు. అంతేకాదు మొదట్లో వారు తనతో కలిసి డైనింగ్ టేబుల్పై కూర్చోవడానికి ఎంతలా సంకోచించారో కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సమాజంలో ఉన్న అలవాట్లు, కండిషనింగ్ వల్ల వారు అలా కూర్చోవడానికి ఇబ్బంది పడ్డారని చెప్పారు."భారతదేశంలో ఉన్న ఈ వర్గ వ్యవస్థ పోవాలి. దేవుడి కోసమైనా గుర్తుంచుకోండి, ఇది 2026!" అని ఆయన రాసుకొచ్చారు.ఈ పోస్ట్ వెనుక ఒక మంచి సందేశం ఉన్నప్పటికీ, తాము తిన్నది మాత్రం చాలా సాధారణమైన 'కీమా పరాటా' మాత్రమేనని నరేష్ సరదాగా పేర్కొన్నారు.నెటిజన్ల ప్రశంసలుఈ పోస్ట్పై ఇంటర్నెట్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. చాలా మంది నెటిజన్లు తమ సొంత అనుభవాలను, సమాజంలోని వర్గ భేదాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇళ్లలో పనిచేసేవారు లేదా ఆఫీస్ సపోర్ట్ స్టాఫ్ పాత అలవాట్ల వల్ల విడిగా తినడానికే మొగ్గు చూపుతుంటారని, కానీ తాము కూడా వారిని ఒకే టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, ఒకే రకమైన పాత్రల్లో భోజనం పెట్టడం ద్వారా ఆ అదృశ్య గోడలను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నామని కొందరు కామెంట్ చేశారు. నేటితరం శ్రమను గౌరవిస్తున్నారని పాతకాలపు వర్గ వ్యవస్థలను అంగీకరించడం లేదని, ఇలాంటి మార్పులు కొత్త తరం ఇళ్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ పోస్ట్ ఎంతో స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులో తాము కూడా ఇలాంటి చిన్న చిన్న మార్పుల ద్వారా సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తామని పలువురు నెటిజన్లు రాసుకొచ్చారు. -
తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. బాల్క సుమన్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బాల్క సుమన్పై పలు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణభవన్లో ఉన్న బాల్క సుమన్ను నాంపల్లి పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. ఈ సందర్భంగా తెలంగాణభవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం, బాల్క సుమన్ను నాంపల్లి పోలీసు స్టేషన్కు తరలిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గత మూడు రోజులుగా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణభవన్ వద్దనే టాస్క్ఫోర్స్ పోలీసులు గత మూడు రోజులుగా మోహరించారు. బాల్క సుమన్ భవన్ నుండి బయటికి వస్తే అరెస్టు చేయాలన్న ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితమే సుమన్ తరపు లాయర్ అక్కడికి చేరుకున్నారు. అలాగే, నాంపల్లి, టాస్క్ఫోర్స్ పోలీసులు.. సుమన్కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.మరోవైపు.. బాల్క సుమన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 326, 351, 352, 353, 355, 361-BNS మరియు PDPP చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లను కేసులో చేర్చిన పోలీసులు. దీంతో, పోలీసులతో బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. సుమన్పై అక్రమ కేసులు పెట్టారంటూ లాయర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి కోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటామంటున్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని న్యాయవాదుల హెచ్చరించారు. ఈ క్రమంలో భవన్ వద్ద పోలీసులకు, లాయర్లకు మధ్య చర్చలు, వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
వయసు చిన్నదే..కానీ మనసు మాత్రం చల్లన
వేసవి సెలవలు అంటే....పిల్లలకు మహా సరదా. ఆటలు, పాటలు, సినిమాలు, షికార్లు...ఇంకేముందు ఫుల్ ఎంజాయ్. దాదాపుగా పిల్లలంతా ఇలానే ఉంటారు కదా. కాని మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలోని పిల్లలు ఈ వేసవిలో చేసిన పనిని చూస్తే పెద్దవాళ్లందరూ ముక్కున వేలేసుకుంటారు. అంతేకాదు ఇది చూసి తమ పిల్లలు కూడా ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. అసలింతకీ ఆ పిల్లలు ఏం చేశారో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదివేయండి మరి.సమ్మర్ అంటే సూపర్ హాట్ కదూ...ఎండ వేడి, ఉక్కపోత విపరీతమైన దాహం. మరీ ముఖ్యంగా ఏదైనా పని మీద రోడ్డు మీదకు వెళినపుడు దాహమేస్తే ఇక నరకమే. కాని మణికొండ పుప్పాలగూడ ప్రాంతాంలోని బాలాజీనగర్ రోడ్డు నెం.4 కి వెళితే మాత్రం మీకు ఓ జ్యూస్ స్టాల్ కనిపిస్తుంది. అందులో నుండి బుడి బుడి అడుగులతో పిల్లలు బయటకు వచ్చి మీకు చల్లని జ్యూస్ అందిస్తారు. అది కూడా మీకు ఏ జ్యూస్ కావాలో అడిగి మరీ ఇస్తారు. అంతేకాదు మీ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోరు. అలా దారిన పోయే ప్రతి ఒక్కరికి వారం నుండి దాహం తీరుస్తున్నారు ఈ పిల్లలు. పుప్పాలగూడ లోని త్రిపుర రెసిడెన్సీ, టెంపుల్ వ్యూ రెసిడెన్సీ వాసుల పిల్లలు సంయుక్తంగా చేప్పట్టిన ఈ సోషల్ ఇనిషియేటివ్ పలువురిని ఆకర్షిస్తోంది. ఏది ఏమైనా ఈ పిల్లల ఆలోచన మాత్రం నిజంగా సూపర్ కదూ, ఇంకెందుకాలస్యం పేరెంట్స్ మీ పిల్లలతో మీ ప్రాంతంలో ఓ సారి ట్రై చేయండి.ఇదీ చదవండి: Yoga ఉత్కటాసనంతో లాభాలేంటో తెలుసా? -
ఎన్ఎమ్ఈవో-ఓపీ అమలులో తెలంగాణ టాప్
-హైదరాబాద్,: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ (NMEO-OP) కార్యక్రమం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు–2026లో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి రాష్ట్రాల వారీగా ఆయిల్ పామ్ సాగు పురోగతిని వెల్లడించగా, తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్లు స్పష్టమైందన్నారు.NMEO-OP మిషన్ కింద 2021 నుండి 2026 వరకు దేశవ్యాప్తంగా 2,73,084 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేపట్టగా, అందులో 98,112 హెక్టార్లతో తెలంగాణ ఒక్కటే 36 శాతం వాటాను కలిగి ఉండటం రాష్ట్ర వ్యవసాయ రంగానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 1.16 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగవుతుండగా, 79,448 మంది రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు.మంంత్రి మాట్లాడుతూ... ఈ విజయం కేవలం గణాంకాలకు మాత్రమే పరిమితం కాదన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలను స్వీకరిస్తూ ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. దేశంలో వంటనూనెల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు తెలంగాణ రైతులు విశేషంగా తోడ్పడుతున్నారని చెప్పారు.దేశంలో ఎడిబుల్ ఆయిల్స్ అవసరం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుందని మంత్రి తెలిపారు. ఇతర నూనెగింజల పంటలతో పోలిస్తే అధిక దిగుబడి ఇచ్చే ఈ పంట రైతులకు స్థిరమైన, దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారిందన్నారు. ఒకసారి తోటను ఏర్పాటు చేస్తే సుమారు 30 సంవత్సరాలపాటు దిగుబడి అందే ఈ పంట ద్వారా రైతులు ఎకరాకు సంవత్సరానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని వివరించారు.ఆయిల్ పామ్ రైతులకు మార్కెటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. రైతులు పండించిన ఫ్రెష్ ఫ్రూట్ బంచ్లు (FFBs) ఆయిల్ పామ్ కంపెనీల ద్వారా నేరుగా కొనుగోలు చేయబడుతున్నాయని, దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ గెలల ధర మెట్రిక్ టన్నుకు రూ.23,501గా ఉండటం రైతులకు మరింత ప్రయోజనకరంగా మారిందన్నారు.అయితే, గతంలో అమలులో ఉన్న విధంగా కేంద్ర ప్రభుత్వం పామాయిల్పై 44 శాతం దిగుమతి సుంకాన్ని పునరుద్ధరిస్తే, దేశీయ ఆయిల్ పామ్ రైతులకు మరింత మేలు జరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. దిగుమతి సుంకం పెరగడం వల్ల దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, ఆయిల్ పామ్ గెలల ధర మెట్రిక్ టన్నుకు రూ.25,000 వరకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో రైతులకు మరింత అధిక ఆదాయం లభించడంతో పాటు, కొత్తగా ఎక్కువ మంది రైతులు కూడా ఆయిల్ పామ్ సాగు వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉందన్నారు. దేశీయ వంటనూనెల ఉత్పత్తి పెరగడం, రైతుల ఆదాయం మెరుగుపడడం, దిగుమతులపై ఆధారపడటం తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయని మంత్రి వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వివరించారు. రైతులకు నాణ్యమైన మొక్కల సరఫరా, డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థల ఏర్పాటుకు సబ్సిడీ, మొదటి నాలుగు సంవత్సరాలపాటు తోటల నిర్వహణకు ఆర్థిక సహాయం, అంతర పంటల సాగుకు ప్రోత్సాహకాలు, కోత పరికరాల కొనుగోలుకు ఎకరానికి రూ.51 వేల వరకు రాయితీ అందిస్తున్నామని తెలిపారు. అదనంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా పలు వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందిస్తున్నామని చెప్పారు. ఈ చర్యలన్నీ రైతుల పెట్టుబడి భారం తగ్గించి, ఆయిల్ పామ్ సాగుపై విశ్వాసాన్ని పెంచాయని పేర్కొన్నారు.ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన ప్రాసెసింగ్ మౌలిక వసతుల అభివృద్ధిపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు, సిద్ధిపేట జిల్లాలో ఒకటి కలిపి మొత్తం మూడు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లులు పనిచేస్తున్నాయని చెప్పారు. వీటి గంటకు ప్రాసెసింగ్ సామర్థ్యం 150 మెట్రిక్ టన్నుల వరకు ఉందన్నారు. అదనంగా మరో ఏడు ప్రాసెసింగ్ మిల్లులు నిర్మాణ దశలో ఉన్నాయని, అవి పూర్తయిన తర్వాత రైతులకు మరింత సమీపంలోనే ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.ఆయిల్ పామ్ రంగం కేవలం రైతుల ఆదాయాన్నే పెంచడం కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. ప్రాసెసింగ్ మిల్లులు, రవాణా, కోత, నిల్వ, అనుబంధ కార్యకలాపాల ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు పరిశ్రమల అభివృద్ధికి కూడా ఈ రంగం దోహదపడుతోందన్నారు.పంటల వైవిధ్యీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును మరింత విస్తరించాలని నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మరో 85 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, దేశంలో వంటనూనెల స్వయం సమృద్ధి సాధించడం, గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు."తెలంగాణ రైతన్న కృషి, పట్టుదల, ప్రభుత్వ ప్రోత్సాహం కలిసి వచ్చిన ఫలితమే ఈ అగ్రస్థానం. దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ నంబర్-1గా నిలవడం ప్రతి రైతుకు గర్వకారణం. రైతుల సంక్షేమం, ఆదాయ వృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అవసరమైన ప్రతి సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది" అని స్పష్టం చేశారు. -
‘టిమ్స్’ కూడా సాధారణ ప్రభుత్వ ఆస్పత్రేనా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రులకు మానవ వనరుల కల్పనే ప్రధాన సమస్యగా తయారైంది. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా, విదేశీ రోగులను ఆకర్షించేలా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో అందించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న ‘టిమ్స్’లో ఆ స్థాయి వైద్య సేవలు అందించే స్పెషలిస్టు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకం ఇప్పటి వరకు జరగలేదు.నిమ్స్, ఎయిమ్స్ తరహాలో ప్రత్యేక డైరెక్టరేట్, స్వయం ప్రతిపత్తి వ్యవస్థ, స్వతంత్ర నియామకాలతో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహణ ఉంటుందని ప్రభుత్వ పెద్దలు చెప్పినా, ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. సనత్నగర్, ఎల్బీనగర్, ఆల్వాల్ ప్రాంతాల్లో 1,000 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న మూడు టిమ్స్ ఆస్పత్రుల్లో కార్డియాక్ స్పెషాలిటీగా సనత్నగర్ టిమ్స్ను తొలి దశలో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలుమార్లు ఆస్పత్రి ప్రారంభోత్సవ తేదీలు మారగా, తాజాగా జూన్ 2న ప్రారంభించాలనే ప్రతిపాదన కూడా వాయిదా పడింది. సీఎం రేవంత్రెడ్డి అపాయింట్మెంట్ తీసుకొని జూన్ రెండోవారంలో ప్రారంభించాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు. అటకపైకెక్కిన ప్రత్యేక నియామకాలు టిమ్స్ ఆస్పత్రులను (Telangana Institute of Medical Sciences) సాధారణ ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి భిన్నంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా డైరెక్టరేట్ స్థాయి వ్యవస్థ ఏర్పాటు చేసి, నేరుగా ఈ ఆస్పత్రుల కోసమే వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాలని వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. ఒక్కో టిమ్స్ ఆస్పత్రికి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందితో కలిపి సుమారు 4 వేల మందిని నియమించాలని ప్రతిపాదించారు.అయితే వైద్య, నర్సింగ్, టెక్నికల్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు రాలేదని తెలిసింది. దీంతో ప్రత్యేక నియామకాల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యేక డైరెక్టరేట్ కింద టిమ్స్ నిర్వహించాలని భావించిన వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి ఆస్పత్రిలో ట్రయల్ రన్ కోసం గాంధీ, ఉస్మానియాతోపాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్పత్రుల నుంచి కొందరు వైద్యులు, ఇతర సిబ్బందిని తాత్కాలికంగా సనత్నగర్ టిమ్స్కు తరలించి ‘ట్రయల్రన్’నిర్వహిస్తున్నారు.కనీసం 4 వేల మంది వైద్య సిబ్బంది అవసరం...1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహణకు కనీసంగా 200 మంది స్పెషలిస్టు వైద్యులు, 500 మంది రెసిడెంట్ డాక్టర్లు, మూడు షిప్ట్ల్లో పనిచేసేందుకు 1,500 వరకు స్టాఫ్ నర్సులు, 1500–2000 మంది పారా మెడికల్ సిబ్బంది అవసరం ఉంటుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి కార్డియాక్ కేర్, ఐసీయూలు, ట్రామా కేర్, క్యాథ్ల్యాబ్లు, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్, ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి అత్యాధునిక విభాగాలు పూర్తిస్థాయిలో పనిచేయాలంటే అనుభవజ్ఞులైన సిబ్బంది తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. కనీసం 4 వేల మంది వరకు నేరుగా నియమిస్తే తప్ప, ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను సమర్థంగా నిర్వహించడం సాధ్యం కాదని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చదవండి: వడివడిగా ఫ్యూచర్ సిటీవైపు అడుగులు -
లాయర్ మొయిజుద్దీన్ హత్య కేసులో కీలక పరిణామం
-
లాయర్ హత్య కేసు.. ఆలంఖాన్ సహా ఐదుగురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రాజకీయ నేత ఆలంఖాన్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్కు చెందిన తండ్రీ కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, మొహిజుద్దీన్ చంపేందుకు ఆలంఖాన్ రూ.25లక్షల సుపారీ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. తన భూములకు అడ్డం పడుతున్నాడని కారణంగానే మొహిజుద్దీన్ను వారు హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.ఇక, ఈ కేసులో ఆలంఖాన్ కుమారుడు ముజాహిద్ ఆలంఖాన్ సహా గ్యాంగ్ నలుగురు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. మొహిజుద్దీన్ హత్య కోసం ఆలంఖాన్ ఇప్పటికే 10 సార్లు ప్లాన్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగానే ప్లాన్ ప్రకారం.. మొహిజుద్దీన్ను సుపారీ గ్యాంగ్ కారుతో ఢీకొట్టి చంపినట్టు పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా.. మొహిజుద్దీన్ కొన్నేళ్లుగా వక్ఫ్ భూముల పరిరక్షణకు పోరాడుతున్నారు. ఓ భూమికి సంబంధించి బర్కత్పురకు చెందిన ఆలంఖాన్తో విభేదాలు వచ్చాయి. తమ ఆధీనంలో ఉన్న ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ పలుమార్లు ఒత్తిడి తీసుకువచ్చారు. తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగడంతోపాటు ఆ భూ వివాదం కేసు నుంచి వైదొలిగితే రూ.2 కోట్లు ఇస్తామంటూ మొహిజుద్దీన్కు ఆఫర్ చేశారు. అయితే రాజీ పడబోనని చెప్పడంతో మొయిజుద్దీన్ను హత్యను చేయాలని భావించారు. ఆ పనిని సుపారీ గ్యాంగ్తో పనిపూర్తి చేయించాలని నగరానికి చెందిన కిషన్ సింగ్ అలియాస్ పప్పును వీరు కలిసి విషయం చెప్పారు. సుపారీ కింద రూ.15 లక్షలు చెల్లించారు. హత్య బాధ్యతను కవాడిగూడకు చెందిన సింగూరి అభిజీత్ అలియాస్ నాని, వినయ్, మణిదీప్లకు అప్పగించి రూ.10 లక్షలు చెల్లించాడు. ఈ ముగ్గురూ పప్పుతో కలిసి పథకం వేసి, కారు కొని, రెక్కీ చేసి, శనివారం మొయిజుద్దీన్ను రెడ్హిల్స్ శాంతినగర్లో హత్య చేశారు.అభిజిత్ గుర్తింపు... స్టంట్స్ చేయడంలో అనుభవం ఉన్న అభిజితే ఆ రోజు కారు నడిపాడు. మణిదీప్, వినయ్ అందులో కూర్చున్నారు. డ్రైవింగ్ నైపుణ్యం కారణంగానే ఇతడు నడిపిన, మొయిజుద్దీన్ ఎక్కబోయిన కార్లలో ఏదీ దెబ్బతినలేదు. ఈ హత్య చేసే సమయంలో కారుకు నెంబర్ ప్లేట్ లేకపోయినా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను టాస్క్ఫోర్స్ పోలీసులు అధ్యయనం చేశారు. వీటి ఆధారంగా అభిజిత్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. -
చీకటి పడితే అంతే.. రోడ్డు మీదే..
-
ప్రపంచానికే తలమానికంగా ‘ఫ్యూచర్ సిటీ’
హైదరాబాద్ : ప్రపంచానికే తలమానికంగా ఉండేలా “ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, డి .శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం నాడు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రతిష్టాత్మక “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ… గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టును ప్రపంచ స్థాయి గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు.ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ ప్రారంభోత్సవాన్నికి సంబంధించిన తేదీల పై గౌరవ ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ఫ్యూచర్ సిటీలో తీసుకునే ప్రతి నిర్ణయం, ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం వేస్తున్న పునాదులు రాబోయే తరాలకు ఆధునిక తెలంగాణ నిర్మాణానికి నాంది పలుకుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, గ్లోబల్ ప్రెజెన్స్ కలిగిన అనేక ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇక్కడి నుంచే నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ” ఏర్పాటు చేసినట్లు తెలిపారు.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎదురైన అనేక సవాళ్లను అధిగమిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణకే కాకుండా దేశానికే తలమానికంగా నిలిచే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటోందని, ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ప్రపంచంలోని అనేక దేశాలు, రాష్ట్రాలు సైతం ఆలోచించని విధంగా తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.ప్రస్తుతం తాత్కాలిక క్యాంపస్లో కొనసాగుతున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పనుల పురోగతిని సమీక్షించి అవసరమైన నిర్ణయాలు తీసుకుని నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు.అనంతరం మంత్రులు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కె. శశాంక, ఐఏఎస్, మహేశ్వరం డీసీపీకె. నారాయణ రెడ్డి, ఐపీఎస్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
తాతకు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ (ఫోటోలు)
-
మంచుకొండల మధ్యే మహాప్రస్థానం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని జయించిన ఆనందం.. చివరకు అదే మంచు పర్వతాల్లో శాశ్వత నిద్రగా మారింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ(53) మృతదేహాన్ని ఎవరెస్ట్పైనే వదిలేయాలని ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. “ఆయన ఇప్పుడు సాక్షాత్తూ పరమశివుడి చెంతనే ఉన్నారు” అంటూ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురవుతున్నారు.గత వారం ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన అరుణ్ కుమార్.. తిరుగు ప్రయాణంలో ‘హిల్లరీ స్టెప్’ సమీపంలో తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. ఆ సమయంలో ఆయనతో పాటు నలుగురు షెర్పాలు ఉన్నట్లు నేపాల్కు చెందిన యాత్ర నిర్వాహక సంస్థ ‘పయనీర్ అడ్వెంచర్స్’ తెలిపింది. అయితే 8 వేల మీటర్ల ఎత్తుకు పైబడిన ‘డెత్ జోన్’లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉండటంతో మృతదేహాన్ని కిందకు తీసుకురావడం దాదాపు అసాధ్యమని నిపుణులు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే అరుణ్ కుటుంబ సభ్యులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. “ఎవరెస్ట్ అంటే పరమశివుడి నివాసమైన కైలాసమే. ఆయన అక్కడే శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాలని భావించాం. అంత ఎత్తు నుంచి మృతదేహాన్ని తీసుకురావడం కూడా చాలా ప్రమాదకరం. తీసుకొచ్చేసరికి దేహం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది” అని అరుణ్ బావ సుధీర్ ఉపాధ్యాయ మీడియాకు తెలిపారు.అరుణ్ కుమార్ తివారీ కేవలం ఐటీ ప్రొఫెషనల్ మాత్రమే కాదు.. అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడు కూడా. హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో సీనియర్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయన.. ఇప్పటికే మౌంట్ ఎల్బ్రస్, డెనాలి, అకోన్కాగ్వా వంటి పర్వతాలను అధిరోహించారు. 2025లో ఒకసారి ఎవరెస్ట్ యాత్రకు వెళ్లినప్పటికీ ఆరోగ్య సమస్యల కారణంగా 7,200 మీటర్ల వద్ద నుంచి వెనుదిరిగారు. అయితే ఈసారి తన కలను నెరవేర్చుకుని శిఖరాన్ని జయించారు. కానీ తిరుగు ప్రయాణమే ఆయనకు చివరి మజిలీగా మారింది.అరుణ్ కుటుంబంలో భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆవేదనలో మునిగిపోయినా.. ఆయనకు ఇష్టమైన హిమాలయాల్లోనే శాశ్వత విశ్రాంతి కలగాలని నిర్ణయించడం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.ఇదే ఎవరెస్ట్ యాత్రలో మరో తెలుగు వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లోని హిందూపురానికి చెందిన, అమెరికాలో స్థిరపడిన ఐటీ ప్రొఫెషనల్ సందీప్ అరే(46) మే 20న ఎవరెస్ట్ అధిరోహించి, మరుసటి రోజే తీవ్ర అలసట, స్నో బ్లైండ్నెస్తో మరణించారు. ఆయన మృతదేహాన్ని షెర్పాలు కిందకు తీసుకురాగా.. బెంగళూరులో అంత్యక్రియలు నిర్వహించారు.👉ఎవరెస్ట్లోని ‘డెత్ జోన్’లో మృతదేహాలను తరలించడం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లలో ఒకటిగా భావిస్తారు. ఆక్సిజన్ కొరత, గడ్డకట్టే చలి, మంచు తుఫానులు, హిమపాతాల ముప్పు మధ్య రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఒక్క మృతదేహాన్ని కిందకు తీసుకురావాలంటే ఎనిమిది నుంచి పన్నెండు మంది అనుభవజ్ఞులైన షెర్పాలు, ప్రత్యేక పరికరాలు, అదనపు ఆక్సిజన్ సిలిండర్లు అవసరం అవుతాయి. ఈ ప్రక్రియకు రోజుల సమయం పట్టడంతో పాటు కోట్ల రూపాయల వ్యయం కూడా అవుతుంది.అందుకే చాలా కుటుంబాలు.. మరిన్ని ప్రాణాలకు ప్రమాదం కలిగించకుండా తమవారిని ఎవరెస్ట్పైనే వదిలేయాలని నిర్ణయిస్తుంటాయి. ఇప్పుడు అరుణ్ కుమార్ తివారీ కుటుంబం కూడా అదే మార్గాన్ని ఎంచుకుంది. అలా మంచు పర్వతాల్లో మొదలైన ఆయన సాహస యాత్ర.. చివరకు శివయ్య చెంతనే శాశ్వత విశ్రాంతిగా ముగిసింది. -
మళ్లీ మాకే.. ఎవరిని తప్పించాలి?
సాక్షి, హైదరాబాద్: కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి తీవ్రమవుతోంది. వచ్చే జూలై 7వ తేదీతో రెండేళ్ల పదవీ కాలం ముగియనున్న 37 కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు మళ్లీ తమకే కావాలంటూ ప్రస్తుత చైర్మన్లు భారీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో సహా వీలైన అన్ని మార్గాల్లో.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, పార్టీ ఇన్చార్జి మీనాక్షిలపై ఒత్తిడి చేయిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొందరు ఓ అడుగు ముందుకు వేసి ఢిల్లీ నుంచి కూడా సీఎం, పీసీసీ చీఫ్లకు చెప్పిస్తున్నారని సమాచారం. దీంతో ఈసారి కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక అంత ఈజీ కాదనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఎవరిని కొనసాగించాలి.. ఎవరిని తప్పించాలి? అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటు ఎన్నికల కంటే ముందు మొత్తం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. వీరంతా గత రెండేళ్లుగా ఈ పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ ఏడాది జూలై 7వ తేదీతో వీరి పదవీకాలం ముగియనుంది. దీంతో మిగిలిన కార్పొరేషన్లు కూడా కలిపి మొత్తం 50 మంది వరకు చైర్మన్లను నియమించాలనే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఇటీవల కుల కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లతో పాటు మహిళా కమిషన్ నియామకం సందర్భంగా సీఎం, పీసీసీ చీఫ్, రాష్ట్ర ఇన్చార్జీల మధ్య ఈ నియామకాలకు సంబంధించిన చర్చ కూడా జరిగింది.కీలక కార్పొరేషన్లకు కొత్తగా ఎమ్మెల్యేలను చైర్మన్లుగా నియమించే అంశం ఇప్పటికే హైకమాండ్ పరిధిలో ఉన్న నేపథ్యంలో మిగిలిన కార్పొరేషన్లకు నూతన సారథులను నియమించడంతో పాటు ప్రస్తుతమున్న వారిని కొనసాగించాలా వద్దా అన్న దానిపై ఈ చర్చ జరిగినట్టు సమాచారం. కొత్త చైర్మన్ పదవుల విషయంలో పెద్దగా ఇబ్బంది లేకపోయినా, పాత వారిని కొనసాగించే విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని, ఎవరిని కొనసాగించాలి, ఎవరిని తప్పించాలనే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని ముగ్గురు నేతలు అభిప్రాయపడినట్టు గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. రెన్యువల్ వద్దనుకున్నా.. వాస్తవానికి మొదటి దఫాలో నియమితులైన వారిలో ఎవరినీ మళ్లీ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించవద్దని సీఎం రేవంత్ గతంలోనే నిర్ణయించారు. ఒకరిని కొనసాగించి మరొకరిని తప్పిస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయని, కొత్తగా ఎక్కువమందికి అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ కోసం కష్టపడిన వారందరికీ న్యాయం చేసినట్టవుతుందనే ఆలోచనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. అయితే పదవుల రెన్యువల్ విషయంలో ఒత్తిడి తీవ్రం కావడంతో కనీసం ఐదారుగురిని అయినా కొనసాగించాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. ఎవరిని కొనసాగించాలనే విషయంలో కూడా తనకు స్పష్టత ఉందని ఆయన తన సన్నిహితుల వద్ద చెపుతున్నట్టు సమాచారం. తమ పదవులు రెన్యువల్ చేయాలని చైర్మన్లు అడిగిన సందర్భంలో ఎవరెలా పనిచేశారో తన వద్ద నివేదికలున్నాయని ఆయన చెబుతుండటం గమనార్హం.10 మంది లోపే ఫస్ట్ క్లాస్! మొత్తం 37 మందిని నియమిస్తే వారి పనితీరును బట్టి 10 మంది లోపే ఫస్ట్ క్లాస్ (60 శాతం) మార్కులు తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పాత వారిలో ఎంత మందిని కొనసాగించాలి, కొత్తగా ఎవరిని నియమించాలన్న దానిపై జూన్ రెండో వారంలో మరోమారు భేటీ జరుగుతుందని, ఎమ్మెల్యేలకు ఇచ్చే పదవుల విషయంలో హైకమాండ్ నుంచి గ్రీన్సిగ్నల్ తీసుకున్న తర్వాత జూన్ 25 తర్వాత కొత్త నియామక ఉత్తర్వులు ఇచ్చే అవకాశముందని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. -
గాంధీ భవన్లో రగడ.. గల్లాలు పట్టుకుని కాంగ్రెస్ నేతలు ఫైటింగ్
హైదరాబాద్: గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కలకలం చెలరేగింది. నాంపల్లి కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ను కార్వాన్ ఇన్చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీ ఉస్మాన్ తోసేశారు. ప్రొటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగడంతో ఈ గొడవ చెలరేగింది. ఫిరోజ్ఖాన్, ఉస్మాన్ గల్లాలు పట్టుకున్నారు.మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సమక్షంలోనే గొడవ జరిగింది. మంత్రి అజారుద్దీన్ పక్క కూర్చునే విషయంలో గొడవ మొదలైంది. గొడవ పడుతుంటే కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీహెచ్ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గొడవ ఆపాలని పొన్నం ప్రభాకర్ చెప్పినా ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ వినలేదు. గొడవ పడుతున్న వారికి అక్కడి నేతలు అడ్డుకున్నారు. గొడవ మొదలుకావడంతో సమావేశం ముగిసినట్లు ప్రకటించారు. క్షమాపణలు చెప్పాను: ఉస్మాన్ గొడవపై కార్వాన్ ఇన్చార్జి ఉస్మాన్ స్పందిస్తూ... ‘‘ఫిరోజ్ ఖాన్కు క్షమాపణలు చెప్పాను. ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న గొడవ. మాది కాంగ్రెస్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో గొడవకు జరుగుతూ ఉంటాయి. నేను తోసేసింది చూశారు. అంతకు ముందు జరిగింది కూడా తెలుసుకోండి’’ అని అన్నారు.అందుకే గొడవ: ఫిరోజ్ ఖాన్ గొడవపై ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘కుర్చీలో కూర్చోవడం విషయంలో ఇబ్బంది జరిగింది. చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల గొడవ అయింది. మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ అనుకున్నారు. ఉస్మాన్ నాకు పెద్దన్న లాంటి వాడు. ఉస్మాన్ నన్ను స్టేజీపైకి రమ్మంటే నేను వెళ్లలేదు. ఉస్మాన్ అన్న నాకు ముద్దు పెట్టాడు’’ అని చెప్పారు. -
తెలంగాణలో ఈడీ అధికారుల దాడులు.. ఏకకాలంలో 8 చోట్ల..
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్లో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఇసుక, గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. జీఎస్టీ ఎగ్గొట్టి రూ.కోట్లు దారిమళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీ, ఏజెన్సీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నకిలీ ఇన్ వాయిస్లతో గ్రానైట్ తరలించిన కేసులో తనఖీలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ గ్రానైట్ వ్యాపారిని జీఎస్టీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జీఎస్టీ ఎగ్గొట్టేందుకు నకిలీ బిల్లులతో వంద కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ తరలించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో మరింత దుమారం రేగుతోంది. -
విజేత దివ్యారెడ్డి
సీనియర్ అథ్లెట్ దివ్యారెడ్డి బొల్లారెడ్డి తన ఖాతాలో మరో విజయం నమోదు చేసుకున్నారు. నెక్లెస్ రోడ్లో నిర్వహించిన హైదారాబాద్ సిటీ స్లామ్ 10కె సమ్మర్ రన్-2026లో 40-49 మహిళల విభాగంలో దివ్యారెడ్డి విజేతగా నిలిచారు. ఇతర వయో విభాగాల్లో సునిమా, వెంకట్, విపిన్ గెలుపొందారు. పతకాల పంట పండిస్తున్న దివ్యారెడ్డిఇటీవల ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్-2025లో దివ్యారెడ్డి నాలుగు పతకాలు సాధించారు. నలభై ఐదేళ్లకు పైబడిన వయో విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం, 1500 మీటర్ల పరుగులో రజతం, 400 మీటర్ల రేసులో కాంస్యం గెలిచిన దివ్యారెడ్డి.. 4*400 రిలేలో స్వర్ణం గెలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్నారు. -
ఎవరెస్ట్ ‘డెత్ జోన్’లో హైదరాబాదీ.. బాడీ వదిలేసిన ఫ్యామిలీ!
న్యూఢిల్లీ: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే పట్టుదలతో అక్కడకు వెళ్లిన హైదరాబాద్కు చెందిన పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ(53) విషాదాంతం అందరినీ కలచివేస్తోంది. ఆయన శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించినప్పటికీ, తిరిగి వస్తుండగా ‘డెత్ జోన్’గా పిలిచే 8,000 మీటర్లకు పైగా ఎత్తులో ప్రాణాలు కోల్పోయారు.హిల్లరీ స్టెప్ సమీపంలో రక్తపు వాంతులతో అరుణ్ కుమార్ కుప్పకూలిపోగా, ఆయనతో ఉన్న షెర్పాలు రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అక్కడి విపరీతమైన చలి, అత్యంత ప్రమాదకర పరిస్థితుల కారణంగా ఆయన మృతదేహాన్ని ప్రస్తుతానికి అక్కడే వదిలివేయాల్సి వచ్చింది. అరుణ్ కుమార్ మృతదేహాన్ని కిందకు తీసుకురావడం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది.పయనీర్ అడ్వెంచర్ అనే సంస్థ ఈ మృతదేహాన్ని వెనక్కి తీసుకురావడానికి మొదట రూ. 1.1 కోట్లు కోట్ చేయగా, ఆ తర్వాత రాయితీతో రూ. 89.7 లక్షలు అవుతుందని తెలిపింది. 8,000 మీటర్ల ఎత్తులో, మంచులో కూరుకుపోయిన మృతదేహాన్ని వెలికితీసి కిందకు తీసుకురావాలంటే దాదాపు 8 నుండి 10 మంది షెర్పాలు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం హెలికాప్టర్ ద్వారా చేసే రెస్క్యూ ఆపరేషన్లకు మాత్రమే నిధులు ఇస్తాయి తప్ప, ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన మాన్యువల్ రికవరీలకు నిధులు కేటాయించవని సదరు సంస్థ స్పష్టం చేసింది.ఈ పరిస్థితులు, భారీ ఖర్చు, ఇతరుల ప్రాణాలకు ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని అరుణ్ కుమార్ తివారీ కుటుంబ సభ్యులు భావోద్వేగ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన మృతదేహాన్ని వెనక్కి తీసుకురావద్దని వారు నిర్ణయించుకున్నారు.‘హిమాలయాలు పవిత్రమైన దైవభూమి. అక్కడ మరణించడం అంటే వైకుంఠ ప్రాప్తి లభించడమే. ఆ పవిత్ర స్థలమే ఆయనకు చిరకాల నివాసం. హిమాలయాల్లో ఆయన ఇప్పుడు ఆ పరమశివునిలో భాగమయ్యారు’ అని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.ఇది కూడా చదవండి: మండుతున్న ఎండలు.. ప్రధాని మోదీ కీలక సూచనలు -
లాయర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూత్రధారి కాంగ్రెస్ కీలక నేత
సాక్షి, సిటీబ్యూరో: వక్ఫ్ బోర్డు ప్యానల్ న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసు కొలిక్కి వచ్చింది. ఈ హత్యకు భూవివాదాలే కారణమని, బర్కత్పుర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత సూత్రధారి అని తేలింది. ఆయనతో సహా నలుగురిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వీళ్లు కూడా చిక్కితే ఈ హత్యోదంతం ఆద్యంతాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. మొహిజుద్దీన్ కొన్నేళ్లుగా వక్ఫ్ భూముల పరిరక్షణకు పోరాడుతున్నారు. ఓ భూమికి సంబంధించి బర్కత్పురకు చెందిన కీలక కాంగ్రెస్ నేతతో విభేదాలు వచ్చాయి. తమ ఆధీనంలో ఉన్న ఈ భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దంటూ ఆ నేతతోపాటు ఆయన కుమారుడు సైతం మొహిజుద్దీన్, ఆయన కుమారుడు ఫర్హాన్పైనా పలుమార్లు ఒత్తిడి తీసుకువచ్చారు. బెదిరింపులు.. ఆఫర్.. తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగడంతోపాటు ఆ భూ వివాదం కేసు నుంచి వైదొలిగితే రూ.2 కోట్లు ఇస్తామంటూ మొహిజుద్దీన్కు ఆఫర్ చేశారు. అయితే రాజీ పడబోనని చెప్పడంతో మొయిజుద్దీన్ను హత్యను చేయాలని భావించి ఆ పనిని తావూస్, మునీర్లకు అప్పగించారు. కాగా, సుపారీ గ్యాంగ్తో పనిపూర్తి చేయించాలని నగరానికి చెందిన కిషన్ సింగ్ అలియాస్ పప్పును వీరు కలిసి విషయం చెప్పారు. సుపారీ కింద రూ.15 లక్షలు చెల్లించారు. హత్య బాధ్యతను కవాడిగూడకు చెందిన సింగూరి అభిజీత్ అలియాస్ నాని, వినయ్, మణిదీప్లకు అప్పగించి రూ.10 లక్షలు చెల్లించాడు. ఈ ముగ్గురూ పప్పుతో కలిసి పథకం వేసి, కారు కొని, రెక్కీ చేసి, శనివారం మొయిజుద్దీన్ను రెడ్హిల్స్ శాంతినగర్లో హత్య చేశారు.అభిజిత్ గుర్తింపు... స్టంట్స్ చేయడంలో అనుభవం ఉన్న అభిజితే ఆ రోజు కారు నడిపాడు. మణిదీప్, వినయ్ అందులో కూర్చున్నారు. డ్రైవింగ్ నైపుణ్యం కారణంగానే ఇతడు నడిపిన, మొయిజుద్దీన్ ఎక్కబోయిన కార్లలో ఏదీ దెబ్బతినలేదు. ఈ హత్య చేసే సమయంలో కారుకు నెంబర్ ప్లేట్ లేకపోయినా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను టాస్క్ఫోర్స్ పోలీసులు అధ్యయనం చేశారు. వీటి ఆధారంగా అభిజిత్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇతడిచ్చిన సమాచారంతో మణిదీప్, వినయ్లను పట్టుకున్నారు. పరారీలో ఉన్న తావూస్, మునీర్, కిషన్ సింగ్ల కోసం మూడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఈ హత్య కేసులో సదరు కాంగ్రెస్ నేత పాత్రపై ఆధారాలు దొరకడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం ఉదయం సికింద్రాబాద్లోని కార్యాలయానికి పిలిపించారు. మొయిజుద్దీన్తో ఉన్న విభేదాలు, హత్య తదితర అంశాలపై పలు ప్రశ్నలు వేశారు. తొలుత తనకు ఏం సంబంధమని, తాను ఎవరో తెలుసా? అంటూ చిందులు తొక్కారు. ఆ తర్వాత నేరం అంగీకరించడంతోపాటు తావూస్, మునీర్ పేర్లు బయటపెట్టారు. దీంతో ఈ నిందితుల కోసం గాలిస్తున్న టాస్క్ఫోర్స్ ఒకటిరెండు రోజుల్లో అరెస్టులను ప్రకటించనుంది. ఈ హత్య వెనుక కాంగ్రెస్ నేత కుమారుడి పాత్రపైనా ఆరోపణలు ఉండటంతో ఆ కోణంలోనూ విచారణ సాగుతోంది. -
హైదరాబాద్ : జలవిహార్ లో జనం సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది. లింగంపల్లి, గచ్చిబౌలి, కుత్బుల్లాపూర్, మియాపూర్, మాదాపూర్ చందానగర్ తదితర ప్రాంతాలలో భారీగా జల్లులు పడుతున్నాయి. దీంతో రోడ్లన్ని జలమయ్యాయి. తీవ్రమైన ఎండలతో తల్లడిల్లిపోయిన ప్రజలకు.. ఈ భారీ జల్లులు కొంత మేర ఉపశమనం కలిగించాయి. అర్ధరాత్రి వర్షం కురవడంతో రోడ్లపై వాహనాల రద్దీ పెద్దగా లేకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలగలేదు. నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో అర్థరాత్రి భారీగా వర్షం కురిసింది. సంగారెడ్డి, కరీంనగర్, రంగారెడ్డి, సిద్దిపేట, తదితర జిల్లాలలో అర్ధరాత్రి భారీ వర్షం పడింది. -
బండి భగీరథ్ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి
హైదరాబాద్: పొక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పోలీస్ కస్టడీకి మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పోలీసులు అతడిని మూడు రోజులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మరిన్ని నిజాలు రాబట్టే అవకాశం ఉంది. కాగా, ఈనెల 16న బండి భగీరథ్ను అరెస్టు చేసి, పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్కు తరలించిన విషయం తెలిసిందే. అతడిని కేసు పర్యవేక్షణాధికారిణి రితిరాజ్ విచారించారు.మరోవైపు, భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఇటీవలే హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. తనపై పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని భగీరథ్ కోరారు. ఒకవేళ అరెస్టు చేసినా వెంటనే బెయిల్పై రిలీజ్ చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకునేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. -
లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఎంఆర్వో సుచరిత
సాక్షి,హైదరాబాద్: ఏసీబీ అధికారులకు శామీర్ పేట్ ఎమ్మెఆర్వో సుచరిత రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. భూమి నాలా కన్వెర్షన్కి సుచరిత ఎకరాకు లక్షరేట్ కార్డ్ ఫిక్స్ చేశారు. 30ఎకరాల భూమి కన్వెర్షన్కి 30లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా అడ్వాన్స్గా సుచరిత కారు డ్రైవర్ రూ.2లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బును సుచరితకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. డబ్బు గురించి ప్రశ్నింగా సుచరిత, ఆమె డ్రైవర్ నీళ్లు నమిలారు.ఎమ్మార్వో సుచరిత శామీర్పేట్ ఆఫీస్నే అవినీతికి అడ్డాగా మార్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. అనంతరం మీడియాతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. శామీర్పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమి కన్వర్షన్కు సంబంధించి రైతు కన్సల్టెంట్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.ఎకరానికి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ డ్రైవర్ ద్వారా రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని, ఎమ్మార్వో సుచరితతో పాటు ఆర్డీఓ కీసర రాజేష్ పలువురు సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.2024లో శామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ఎమ్మార్వో సత్యనారాయణ రూ.2 లక్షల లంచం కేసులో డ్రైవర్తో కలిసి ఏసీబీకి చిక్కిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. -
బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు ..
-
భారీ వర్షానికి చల్లబడ్డ హైదరాబాద్
-
హెచ్డీబీఏ అధ్యక్షుడిగా చాముండేశ్వరనాథ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ (హెచ్డీబీఏ) అధ్యక్షుడిగా మరోసారి వంకిన చాముండేశ్వరనాథ్ ఎంపికయ్యారు. కానూరి వంశీధర్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో అన్ని పదవులకు ఏకగ్రీవంగా ఎంపిక జరిగింది. ఆరుగురు ఉపాధ్యక్షులలో మాజీ ప్లేయర్లు పారుపల్లి కశ్యప్, జాస్తి శారదా గోవర్ధిని ఉన్నారు. వచ్చే నాలుగేళ్ల పాటు (2026–30) ఈ కార్యవర్గం కొనసాగుతుంది. హెచ్డీబీఏ కొత్త కార్యవర్గం వివరాలు: అధ్యక్షుడు:వి.చాముండేశ్వరనాథ్; ఉపాధ్యక్షులు: దగ్గుబాటి సురేశ్బాబు, ఒంటెద్దు శ్రీనివాస రెడ్డి, ఇందుకూరి వెంకటసోమరాజు, ఆదినారాయణ కమ్మ, జాస్తి శారదా గోవరి్ధని, పారుపల్లి కశ్యప్; ప్రధాన కార్యదర్శి: కానూరి వంశీధర్;నిర్వాహక కార్యదర్శి: గున్ను విజయ్ రాఘవన్కోశాధికారి: కొల్లి నాగవేణి; సంయుక్త కార్యదర్శులు: చిట్టబోయిన రమేశ్ యాదవ్, గంటా శారదా రెడ్డి; సభ్యులు: జయేశ్ రంజన్, మున్నంగి బంగారుబాబు, బొంబోజి రాజ్గోపాల్ చారి, సిద్ధార్థ్ రెడ్డి ఆరంరెడ్డి, మొహమ్మద్ మఖ్దూమ్ అహ్మద్ ఖాద్రీ, సీబీ తారాప్రశాంత్ చంద్ర, పల్లె చంద్రశేఖర్ రావు, వంకిన రమ్య, నామాల పురుషోత్తం రావు. -
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం
హైదరాబాద్: నగర వాసులకు భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం కల్గింది. ఈరోజు(సోమవారం, మే 25వ తేదీ) హైదరాబాద్లో పలుచోట్ల మోస్తరు వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, ఎల్బీనగర్, వనస్థలిపురం, చింతల్, బాలానగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెంట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని చోట్ల మాదిరిగా వర్షం పడగా, అక్కడక్కడా భారీగానే వర్షం పడింది. ప్రధానంగా కోఠిలో భారీ వర్షం పడింది. దీంతో హైదరాబాద్ వాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే రోహిణి కార్తె ప్రారంభం కూడా ఈరోజే కావడంతో రేపట్నుంచి ఎండలు ఎలా ఉంటాయో అనే ఆందోళన కూడా జనాల్లో ఉంది. రోహిణి కార్తె ప్రారంభంలో సాధారణంగా చినుకులు పడటం జరుగుతూ ఉంటుంది. ఆపై భానుడు మరింత సెగలు కక్కుతాడు. ఈ వర్షం అందుకే సంకేతమైతే నగరవాసులకు మరింత హీట్వేవ్ను చూడాల్సి ఉంటుంది. -
హైదరాబాద్ ఫార్మా కంపెనీ లాభం హైజంప్
హైదరాబాద్: ఫార్మాస్యూటికల్స్ రంగ కంపెనీ సాయి పేరెంటరల్స్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు ప్రకటించింది. క్యూ4 (జనవరి–మార్చి)లో నికర లాభం భారీగా జంప్చేసి రూ. 13 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 1.6 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 74 కోట్ల నుంచి రూ. 201 కోట్లకు ఎగసింది.నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 6 కోట్ల నుంచి రూ. 29 కోట్లకు మెరుగుపడింది. పూర్తి ఏడాదికి నికర లాభం 45 శాతం వృద్ధితో రూ. 14 కోట్లను అధిగమించింది. 2024–25లో రూ. 10 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 159 కోట్ల నుంచి రూ. 381 కోట్లకు జంప్ చేసింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. -
ఛీ..ఛీ..! నడిరోడ్డుపై ప్రేమజంట రాసలీలలు
-
పోలీసులపైకే దూసుకొచ్చాడు..
హైదరాబాద్: వీకెండ్లో ఐటీ కారిడార్ కార్ రేస్, బైక్ స్టంట్లకు వేదికవుతోంది. రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో కారు రేస్ రేసింగ్ పాల్పడటం పరిపాటిగా మారింది. శనివారం రాత్రి కార్ రేసింగ్ చేస్తున్నారనే విషయం పోలీసులకు తెలిసింది. దీంతో వారు ఘటన స్థలానికి వెళ్లారు. తమపైకే కారు దూసుకురావడంతో వారు కంగుతిన్నారు. రేసింగ్కు పాల్పడిన డిగ్రీ విద్యార్థిని అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న చెప్పిన వివరాల ప్రకారం.. టీ హబ్, హై హోంభూజ, ఐకియా రోడ్లలో కారు రేసింగ్ చేస్తున్నారని సమాచారం అందడంతో శనివారం రాత్రి 12.30 గంటలకు బ్లూకోల్ట్ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఎం.రమేష్ హెడ్కానిస్టేబుల్ అక్కడికి వెళ్లారు. నాలెడ్జి సిటీలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి నిలోఫర్ కేఫ్ వైపు హోండా సిటీ కారు భారీ శబ్దాలు చేస్తూ రోడ్డుపై మితిమీరిన వేగంతో చక్కర్లు కొడుతోంది. బ్లూకోల్ట్ సిబ్బంది కారును ఆపేందుకు ప్రయత్నించగా అందులోని వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కారు సైడ్ మిర్రర్ తాకడంతో కానిస్టేబుల్ రమేష్ కుడిచేతికి గాయాలయ్యాయి. ఫిరోజ్గాం«దీనగర్కు చెందిన మహ్మద్ రెహా్మన్ (18) మెహిదీపట్నంలోని ఓ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి కారు రేసింగ్కు వచ్చాడు. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసిన రెహా్మన్ను పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. కారులోంచి పారిపోయిన ఒయాసిస్, అయాన్, వాసిమ్లపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కారు, బైక్ రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. -
ORRపై 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన యువకుడు
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కారును నడిపి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతోపాటు టోల్ సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలకాపూర్ టౌన్షిప్కు చెందిన కొత్తపల్లి యశ్వంత్రెడ్డి గత ఏప్రిల్లో వోక్స్ వ్యాగన్ విర్టస్ కారును కొనుగోలు చేశాడు. దాని వేగాన్ని పరీక్షించేందుకు ఈ నెల 10న నార్సింగి టోల్గేట్ వద్ద ఔటర్రింగ్ రోడ్డు ఎక్కి కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపాడు. దాన్ని తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశాడు. దాన్ని గమనించిన పెట్రోలింగ్ అధికారి కె.సాయిరాం ఈ నెల 19న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసి ఆదివారం అతడితోపాటు కారును అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, ప్రమాదకర స్టంట్లు చేయటం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, ఇలాంటి చర్యలతో అమాయక ప్రయాణికులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్నారు. -
వివాహేతర సంబంధం.. ప్రియురాలి నాలుక కోసిన ప్రియుడు!
హైదరాబాద్: సహజీవనం చేస్తున్న మహిళ నాలుకను కోసేశాడు ఓ వ్యక్తి. కుషాయిగూడ ఎస్ఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడ, శుభోదయ కాలనీలో నివాసం ఉంటున్న సుజాత దినసరి కూలీ. ఆమె భర్త చనిపోవడంతో అదే కాలనీకి చెందిన నవీన్ అనే వ్యక్తితో కలిసి ఆరు నెలలుగా సహజీవనం చేస్తోంది. కూలీ పనిచేసే ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఈ నెల 22న మద్యం మత్తులో ఉన్న వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. మాటామాట పెరగడంతో ఆమె నాలుకను నవీన్ కోశాడు. ఇరుగుపొరుగు గమనించి అదే కాలనీలో ఉండే ఆమె కొడుకు డేవిడ్కు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న డేవిడ్ ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
జూబ్లీహిల్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దంపతులపై యువకుల దాడి
బంజారాహిల్స్: మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు అర్ధరాత్రి దారి కాసి అకారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దంపతులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... సనత్నగర్ జెక్ కాలనీలో నివసించే ముజఫర్ ఎండీ ఖాన్ యష్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. శనివారం అర్ధరాత్రి తన భార్యతో కలిసి కారులో అన్నపూర్ణ స్టూడియో రోడ్డులో వెళ్తున్నారు. ఓ కారులో వచ్చిన ముగ్గురు యువకులు తప్పతాగి అకస్మాత్తుగా రోడ్డును బ్లాక్ చేసి వీరిని అడ్డగించారు. ఇదేమిటని ప్రశి్నంచిన ముజఫర్పై దాడికి పాల్పడటంతో ముఖం, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకున్న ఆయన భార్యపై కూడా దాడి చేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
‘ఇదే నా చివరి రాత్రి.. నువ్వు సుఖంగా ఉండు’
హైదరాబాద్: జీవితం మీద విరక్తి చెంది ఓ యువకుడు ‘ఇదే నా చివరి రాత్రి’ అంటూ సెల్ ఫోన్లో తన స్నేహితులకు మెసేజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో దేవరకొండ బస్తీలో నివసించే సమీర్ (20) ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా సమీర్ మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం స్నేహితులకు ‘ఇదే నా చివరి రాత్రి. నువ్వు సుఖంగా ఉండు’ అంటూ చాటింగ్ చేసి ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఎలాంటి కారణాలు కూడా లేవని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి మొబైల్ ఫోన్ చాటింగ్లను పోలీసులు పరిశీలించారు. -
హైదరాబాద్లో అత్యధిక డిమాండ్ ఈ మందులకే
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర పౌరులు మధుమేహం, రక్తపోటు, ఎసిడిటీ, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక రోగాలతో నలిగిపోతున్నారు. నగరంలో అమ్ముడవుతున్న మందుల్లోనూ వీటిదే అగ్రస్థానం. గ్రేటర్ పరిధిలోని 35 శాతం మంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) వెల్లడించింది. ఐటీ కారిడార్లో రక్తపోటు, స్ట్రెస్ రిలీఫ్ మందుల అమ్మకాల్లో ఏటా 15 శాతం వృద్ధి నమోదవుతోందని ప్రి్రస్కిప్సన్స్ ట్రెండ్ స్పష్టం చేసింది. 60 ఏళ్లు పైబడినవారు రోజుకు మూడు పూటలా కలిపి 6 నుంచి 10 మాత్రలు మింగుతున్నారని నివేదికలో పేర్కొంది. 42 లక్షల మంది మందులతోనే.. గ్రేటర్ పరిధిలో సుమారు 1.35 కోట్లు. వీరిలో దాదాపు 42 లక్షల మంది బీసీ, షుగర్, థైరాయిడ్, అసిడిటీ, గుండె, ఊపిరితిత్తులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి జబ్బులున్న వారు రోజుకు కనీసం రెండు నుంచి నాలుగు మాత్రలు తీసుకుంటుండగా, వృద్ధుల్లో ఈ సంఖ్య 6 నుంచి 10 మాత్రలుగా ఉందని అంచనా. మధుమేహంలో మనమే.. దేశంలో అత్యధికంగా మధుమేహం బాధితులున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. మధుమేహం నియంత్రణకు వినియోగించే మందుల అమ్మకాలు అంతే పరిమాణంలో ఉంటున్నాయి. టైప్–1, టైప్–2 బాధితులు రోజుకు ఒక దఫా నుంచి మూడు దఫాలు ఇన్సులిన్ తీసుకుంటున్నారు. బాధితుల్లో సుమారు 10 నుంచి 15 శాతం మంది ఇన్సులిన్ ఇంజక్షన్లపైనే ఆధారపడుతున్నారు. ఐటీ కారిడార్లో టెకీలతో పాటు ఇతర రంగాల్లోని నిపుణుల్లోనూ మానసిక ఒత్తిడి పెరుగుతోంది. దీంతో స్ట్రస్ రిలీఫ్, బీపీ మందుల వినియోగం గణనీయంగా పెరిగింది. థైరాయిడ్లో మహిళలతో సమానంగా పురుషులు అధిక మసాలాలు ఉండే బిర్యానీ, ఇతర వంటకాలు, సమయానికి ఆహారం తినకపోవడంతో అసిడిటీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. థైరాయిడ్ మహిళలతో పాటు పురుషుల్లోనూ సమానంగా కనిపిస్తోంది. వివిధ రకాల యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి వంటి మాత్రలు అధికంగా వినియోగిస్తున్నారు. జర్నల్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ నివేదిక ప్రకారం యాంటీబయాటిక్స్ వాడకంలో దేశంలోనే హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ప్రతి వెయ్యి మందిలో రోజు సగటున 15 మంది యాంటీబయాటిక్స్ వినియోగిస్తున్నారు. -
హైదరాబాద్ : అందమా.. అందుమా.. (ఫొటోలు)
-
లాయర్ మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
హైదరాబాద్: న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితుల్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో నలుగురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబాడిగూడాకు చెందిన వినయ్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టినట్లు గుర్తించారు పోలీసులు. దీనిలో భాగంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. ఈ హత్య కేసుకు సంబంధించి వినయ్తో సహా నలుగుర్ని అరెస్ట్ చేశారు. కాగా, శనివారం(మే 23వ తేదీ) నగరంలోని మాసబ్ట్యాంక్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది.. ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం ఉదయం ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీని ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అడ్వకేట్ హత్యలో కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: మసబ్ ట్యాంక్ పరిధిలో దారుణహత్యకు గురైన అడ్వకేట్ మెుయిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు కీలక ఆదారాలు సేకరించారు. అడ్వకేట్ హత్యలో ఆరుగురు నిందితులు పాల్గొన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆ హత్యకు వాడింది స్కార్పియో వాహనంగా గుర్తించి ఆ యజమానిని ప్రశ్నించారు. అయితే ఆ వాహనాన్ని ఆరునెలల క్రితమే తాను వేరే వ్యక్తులకు అమ్మానని కానీ కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని యజమాని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ వాహనం ఎవరు కొనుగోలు చేసిన వ్యక్తి ఏవరా అనే విషయం పోలీసులు విచారణ చేస్తున్నారు.కాగా నిన్న( శనివారం) మాసబ్ట్యాంక్ పరిధిలో ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోకాపేటలో కళ్లు చెదిరే భవనం.. సౌత్ఇండియాకే ‘టాప్’
హైదరాబాద్: నగర రియల్ ఎస్టేట్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తూ కోకాపేట ఐటీ కారిడార్లో ‘ది స్కైవెన్’ (The Skyven) పేరిట సరికొత్త లగ్జరీ రెసిడెన్షియల్ టవర్ ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ‘ఈ-ఇన్ఫ్రా’ మరియు ‘పింగ్లే వెంచర్స్ & రియాల్టీ’ (PVR) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్కైస్క్రాపర్ 63 అంతస్తులు, 755 అడుగులు అంటే దాదాపు పావు కిలోమీటరు (233 మీటర్లు) ఎత్తుతో దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనంగా రికార్డు సృష్టించనుంది. కేవలం ఎత్తులోనే కాకుండా, నిర్మాణంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను పొందుపరిచిన దక్షిణ భారత దేశపు మొట్టమొదటి ‘AI-రెడీ’ స్మార్ట్ బిల్డింగ్ కూడా ఇదే కావడం విశేషం.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పెంట్హౌస్లు, ఆకాశంలో విల్లా అనుభూతినిచ్చే ‘స్కై విల్లాస్’, లగ్జరీ 4BHK నివాసాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇక్కడ సాధారణ ప్రాజెక్టుల లాగా కాకుండా, నివాసాల సంఖ్య పరిమితంగా ఉండటం వల్ల ప్రతి నివాసికి లభించే లగ్జరీ సదుపాయాల వాటా (Amenity-to-Resident Ratio) చాలా ఎక్కువగా ఉంటుంది. భవన నిర్వహణ, విద్యుత్ ఆప్టిమైజేషన్, అత్యాధునిక 24x7 భద్రతా వ్యవస్థలను ఇక్కడి AI నెట్వర్క్ స్వయంచాలకంగా నియంత్రిస్తుంది.భవనం పైభాగంలో ఏర్పాటు చేస్తున్న ‘ది ఎవరెస్ట్’ రూఫ్టాప్ క్లబ్ ఈ ప్రాజెక్ట్కే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో నగర స్కైలైన్తో కలిసిపోయే ‘ఇన్ఫినిటీ పూల్’తో పాటు, హైదరాబాద్ నివాస మార్కెట్లోనే తొలిసారిగా నక్షత్రాలను వీక్షించేందుకు ‘స్టార్ అబ్జర్వేటరీ’, లగ్జరీ క్లబ్హౌస్, స్పా, మరియు హెలిప్యాడ్ వంటి ఐదు నక్షత్రాల వసతులను కల్పిస్తున్నారు. స్థిరమైన మార్కెట్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్ గ్లోబల్ ప్రొఫెషనల్స్ను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ గగన విహారి రూపుదిద్దుకుంటోంది. -
కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో పాలనను కాంగ్రెస్ గాలికొదిలేసిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆదివారం అంబర్పేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కేటీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో పాలనను కాంగ్రెస్ గాలికొదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పీకల్లోతు కోపం ఉంది. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు. ఉన్న నగరాన్నే సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదు. ఇలాంటి నాయకుడు ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాడంటే నమ్మాలా?. బీఆర్ఎస్లో పనిచేసే వారికే గుర్తింపు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వేల ఆధారంగానే టికెట్లు. బీఆర్ఎస్లో పని చేసేవారికే గుర్తింపు. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్దే గెలుపు. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తాం. ఎస్ఐఆర్పై అందరూ అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాసమస్యలపై పోటారం చేసిన వాళ్లకే టికెట్లు. కొందరి ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది’అని ఆరోపించారు. -
మరో మూడు రోజులు తీవ్ర వడగాలులు
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వడగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణంక కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... దీనికితోడు పడగాలులతో ప్రజలు అక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈనెల 26 వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్ మంచి ర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, అయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబా బాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లాల్లో త్రీవ వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెరిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజె అలర్ట్ జారీ చేసింది.రాత్రిపూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 30 డిగ్రీల మేర ఉంటాయని వివరించింది. శని వారం రాష్ట్రంలో అత్యవరంగా ధర్మపురి మండలం బుద్ధిశిపల్లిలో 48.3 డిగ్రీల సెల్సియస్ ఇష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రం. లోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు చురుకుగా నైరుతి రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులు శీలిస్తే గరిష్ఠ ఉష్ణోగ్రత అమ్మంలో 44.8 డిగ్రీలుగా నమోదైంది. మరో రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలలోకి విస్తరించమన్నాయి. ఈనెల 26న కేరళలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతా వరణ శాఖ తెలిపింది. నైరుతి బిహార్, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల చక్ర వాహత ఆవర్తనం శనివారం జార్ఖండ్ ఉత్తర రత్తీస్ గఢ్, ఒడిశాల మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 0.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. అది, సోమవారాల్లో రాష్ట్రంలోని తూర్పు ఉత్తర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్గాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. -
శంషాబాద్.. విమానానికి బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆమ్స్టర్డామ్ నుంచి శంషాబాద్కు వస్తున్న ఓ విమానంలో బాంబు ఉన్నట్లు గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ పంపడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేపట్టారు.వివరాలు ఇలా ఉన్నాయి.. ఆమ్స్టర్డామ్ నుంచి శంషాబాద్కు వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్టు ఆదివారం ఉదయం అధికారులకు మొయిల్ వచ్చింది. విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేలోపే ఏ క్షణమైనా పేలుడు సంభవించే అవకాశం ఉందంటూ ఆ ఆగంతకుడు మెయిల్లో పేర్కొన్నాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే అందులోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించి ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు.అనంతరం బాంబ్ స్క్వాడ్, భద్రతా సిబ్బంది విమానాన్ని పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. సుదీర్ఘ తనిఖీల అనంతరం విమానంలో ఎలాంటి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ బాంబు బెదిరింపు మెయిల్పై విమానాశ్రయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కాంగ్రెస్ నేత వల్లే మా తండ్రి చనిపోయాడు!
-
ఈవెనింగ్ కల్చర్ సిటీగా భాగ్యనగరం
వేసవి సంధ్య.. సల్లాపాల సరాగాలకు చిరునామాగా మారింది. హైదరాబాదీలు సరికొత్త రుచుల ఆస్వాదనకు ఆలవాలమైంది. రాత్రి పొద్దుపోయేదాకా ఆనంద విహారంలో మునిగితేలుతున్నారు. నగరంలో సమ్మర్ అంటే పగలు ఓ పరీక్ష. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు.. వేడి, ఉబ్బరం, ట్రాఫిక్... అన్నీ కలిసి నగరవాసులను ఇండోర్లోనే ఉండేలా చేస్తున్నాయి. ఆఫీసులు, వర్క్ఫ్రం హోమ్, షాపులు, చిన్న వ్యాపారాలు.. ఇలా ప్రతి ఒక్కరూ.. సూరీడు పడమటికి వాలగానే ఆనందాలను ఆస్వాదిస్తున్నారు. చల్లనిగాలి, మైండ్ ఫ్రెష్– పిల్లల ఆహ్లాదం.. సెలీ్ఫలు, వాక్స్, స్ట్రీట్ ఫుడ్ అన్నీ కలిసి సాయంత్రపు షిఫ్ట్ను సమ్మర్ ఫీస్ట్లా ఫీలవుతున్నారు ప్రస్తుత వేసవిలో సాయంత్రం 6 గంటల నుంచి నగరం రంగులు మార్చుకోగానే.. సిటీజనులు బయటికి వస్తున్నారు. ఈ సీజన్లో హైదరాబాద్ ఈట్ స్ట్రీట్ వ్యాపారం గణనీయంగా పెరిగిందనేది వ్యాపారుల మాట. ముఖ్యంగా ట్యాంట్బండ్ పరిసరాలు, మాదాపూర్–హైటెక్ సిటీ జోన్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు స్ట్రీట్ ఫుడ్స్టాళ్లు ఫుల్ బిజీ. వ్యాపార వర్గాల అంచనాల ప్రకారం, సమ్మర్ నెలల్లో ఈవెనింగ్–నైట్ టైమ్ ఫుడ్ సేల్స్ సగటున 25–30 శాతం పెరుగుదల చూపిస్తున్నాయి. పగలు తగ్గిన కస్టమర్ ఫుడ్ఫాల్ను రాత్రి పూర్తిగా కవర్ చేస్తోంది. సామాన్య జనాలకు ట్యాంక్ బండ్, దుర్గం చెరువు, శిల్పారామం వంటి ప్రాంతాలు బెస్ట్ స్పాట్స్గా నిలుస్తున్నాయి. సిటీలో సమ్మర్ అంటే పగలు నిశ్శబ్దం, సాయంత్రం సంబరాలు. ఇది ఉపశమనం మాత్రమే కాదు, నగర ఆర్థిక వ్యవస్థకూ ఊపిరి పోస్తోంది. ఆల్ఇన్ వన్..@: ఎగ్జిబిషన్స్ పిల్లలకు వేసవి సెలవులు కావడంతో.. సికింద్రాబాద్, పీపుల్స్ ప్లాజా, కూకట్పల్లి, ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల్లో సమ్మర్ ఎగ్జిబిషన్లు ప్రధాన ఆకర్షణగా మారాయి. గేమ్స్, షాపింగ్ స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్ ఆల్ ఇన్ వన్ కాన్సెప్్టతో ఆకట్టుకుంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సందర్శకులు 20 శాతం వరకు పెరిగారు. దీనివల్ల ట్రాఫిక్ ‘‘ఈవెనింగ్ హెవీ’’గా మారింది. ఇంకో వైపు పెరుగుతున్న వర్కింగ్ కం కేఫ్ కల్చర్లో భాగంగా నైట్ షిఫ్ట్ ఐటీ ఉద్యోగులు ల్యాప్టాప్లతో కేఫ్ల్లో పని చేస్తూ కనిపిస్తున్నారు. ఫ్రీ వైఫై, చిల్ ఎని్వరాన్మెంట్తో.. కేఫ్ బిజినెస్కు ప్లస్ అవుతున్నాయి. సమ్మర్లో రాత్రి 7 తర్వాత కేఫ్ ఫుట్ఫాల్ 15–18 శాతం పెరుగుదల నమోదు చేస్తోంది. ఫుడ్, షాపింగ్, ఎగ్జిబిషన్స్, కేఫ్ వర్క్ అన్నీ కలిసి హైదరాబాద్ను ‘‘రాత్రిలోనూ బతికే నగరం’’గా మరోసారి నిరూపిస్తున్నాయి! -
మహిళతో అసభ్యంగా ప్రవర్తించి..సీసీ కెమెరాల్లో చిక్కి
హైదరాబాద్: రోడ్డుపై వెళుతున్న మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని నార్సింగి పోలీసులు గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈనెల 14న అలకాపూర్ టౌన్షిప్లో ఓ వ్యక్తి ప్రవర్తించిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతోపాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నార్సింగి పోలీసులు.. తీవ్రంగా పరిగణించి బాధితురాలి నుంచి 19న ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. శనివారం పుప్పాలగూడలో ఉంటున్న నిందితుడు నాగరాజు(26)ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన నిందితుడు పుప్పాలగూడలో స్థిరపడ్డాడని ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు. -
గాంధీలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది. గాంధీ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ కోర్సు చదువుతున్న పల్లవిగౌడ్ (19) అనే విద్యార్థిని శస్త్రచికిత్స అనంతరం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మరణించిందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగడంతో గాంధీ మార్చురీ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బాధితులు, చిలకలగూడ పోలీసులు తెలిపిన మేరకు.. జియాగూడకు చెందిన పల్లవి గౌడ్ కుడిఛాతీపై వాపు (గడ్డ) రావడంతో ఈనెల 16న గాంధీ ఆస్పత్రికి వచి్చంది. చిన్నపాటి సర్జరీ చేయాలని వైద్యులు చెప్పడంతో 18న అడ్మిట్ కాగా..19న సర్జరీ చేశారు. మరుసటి రోజు వైద్యులు పరీక్షించి మరోసారి సర్జరీ (రీఎక్స్ప్లొరేషన్) చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది.ఇదిలా ఉండగా.. సీనియర్ వైద్యులతో కాకుండా జూనియర్లతో సర్జరీ చేయించి తమ కుమార్తె ప్రాణాలపై ప్రయోగాలు చేశారని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతురాలి తండ్రి వెంకటే‹Ùగౌడ్ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క బాధితులను పరామర్శించి, ప్రభుత్వపరంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ముగ్గురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ పల్లవి మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని గాంధీ సూపరింటెండెంట్ ప్రొ.వాణి స్పష్టం చేశారు. పల్లవికి సర్జరీ అనంతరం రక్తపుగడ్డలను తొలగించామని తెలిపారు. ఆ తర్వాత బీపీ పడిపోవడం, ఊపిరితిత్తుల సమస్యల కారణంగా వెంటిలేటర్పై ఉంచి అత్యుత్తమ వైద్యం అందించామని.. అయినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ ఘటనపై ముగ్గురు వైద్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. -
10% ఫీజు చెల్లిస్తే పాత రేట్లే
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్రోడ్డు లోపల దశాబ్దాల క్రితం ఏర్పాటైన పారిశ్రామిక ప్రాంతాలను పర్యావరణహితంగా, నివాసయోగ్యంగా (మల్టీ–యూజ్ జోన్స్) మార్చేందుకు తీసుకొచి్చన హైదరాబాద్ ఇండ్రస్టియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్–పీ)కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. జూన్ 30లోగా 10% అడ్వాన్స్ ఇంపాక్ట్ ఫీజు చెల్లించే దరఖాస్తుదారులకు పాత ఎస్ఆర్ఓ (సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్) రేట్లే వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు హిల్ట్–పీ మార్గదర్శకాలను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జారీ చేశారు.ఇందులో భాగంగా భూమార్పిడి రుసుముల వివరాలను ప్రకటించారు. జీవో 18 ప్రకారం పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. మొత్తం 21 పారిశ్రామిక పార్కులతోపాటు స్టాండ్ ఎలోన్ యూనిట్ల దరఖాస్తులను పరిశీలించడానికి రెండు వేర్వేరు టీమ్లను ఏర్పాటు చేశారు. హిల్ట్–పీ పోర్టల్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మే 28 నుంచి భూముల ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. నూతన పాలసీతో ప్రయోజనాలు.. ⇒ ఎస్ఆర్ఓ రేట్ల రాయితీ: 2026 జూన్ 30లోగా 10% అడ్వాన్స్ ఇంపాక్ట్ ఫీజు చెల్లించే దరఖాస్తుదారులకు పాత ఎస్ఆర్ఓ రేట్లే వర్తిస్తాయి. ⇒ తరలింపునకు ప్రోత్సాహకాలు: ఓఆర్ఆర్ వెలుపలికి మారాలనుకునే పరిశ్రమలకు పాత ప్రదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రాయితీలు, సబ్సిడీలు కొత్త చోటుకూ బదిలీ అవుతాయి. ⇒ చార్జీల సర్దుబాటు: విద్యుత్, నీటి కనెక్షన్ల కోసం గతంలో చెల్లించిన చట్టబద్ధమైన ఫీజులను కొత్త లొకేషన్లో సర్దుబాటు చేస్తారు. ⇒ ప్లాట్ల కేటాయింపులో ప్రాధాన్యం: నగరం వెలుపల టీజీఐఐసీ నిర్మించే కొత్త పారిశ్రామిక పార్కుల్లో వారికి ప్లాట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ⇒ ఏడాది గడువు: మల్టీ–యూజ్ జోన్ అనుమతి పొందిన తర్వాత కూడా పరిశ్రమను ప్రస్తుత ప్రాంతంలో ఏడాదిపాటు నిర్వహించుకోవడానికి గడువు ఇస్తారు.పారిశ్రామిక భూమి విస్తీర్ణం - ప్రాసెసింగ్ ఫీజు (రూ. లలో) ఒక ఎకరం వరకు - 20,000 1 ఎకరంపైగా–5 ఎకరాల వరకు - 50,000 5 ఎకరాలకుపైగా–10 ఎకరాల వరకు - 1,00,000 10 ఎకరాలకుపైగా–25 ఎకరాల వరకు - 2,00,000 25 ఎకరాలకుపైగా–50 ఎకరాల వరకు - 5,00,000 50 ఎకరాలకు మించి - 10,00,000 సేల్ డీడ్ ఉంటేనే.. అర్హతలు: రిజిస్టర్డ్ సేల్డీడ్ కలిగి ఉండి పూర్తయిన పారిశ్రామిక ప్లాట్లు మాత్రమే అర్హత ఉంటాయి. దరఖాస్తుకు ముందే పాత బకాయిలు (ఈఓటీ, మ్యుటేషన్, ప్రాపర్టీ ట్యాక్స్, సబ్–డివిజన్ చార్జీలు) క్లియర్ చేయాలి. తప్పనిసరి పత్రాలు: సేల్డీడ్, ఈసీ, తాజా ఆస్తిపన్ను రశీదు, స్థలం కలర్ ఫొటోలు, సంస్థ రిజిస్ట్రేషన్ (ఉద్యమ్ ఆధార్/ఆర్ఓసీ మొదలైనవి), ఐడీ ప్రూఫ్, ఫీజు చెల్లింపు, మౌలిక సదుపాయాల కోసం అవసరమైతే భూమిని అప్పగించేందుకు రూ. 100 స్టాంప్ పేపర్పై నోటరీ అండర్టేకింగ్ సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తు: దరఖాస్తుదారులు టీజీఐఐసీ పోర్టల్ ద్వారా 10 శాతం డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వెరిఫికేషన్: జోనల్ మేనేజర్, ఐఏఎల్ఏ కమిషనర్ 4 రోజుల్లోగా పరిశీలించి హెడ్ ఆఫీస్ స్రూ్కటినీ కమిటీకి పంపుతారు. ఆమోదం: స్రూ్కటినీ కమిటీ 3 రోజుల్లో అప్రూవల్ కమిటీకి పంపితే స్పెషల్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ 7 రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటుంది. బ్యాలెన్స్ ఫీజు: అనుమతి వచ్చిన వెంటనే మిగిలిన 90 శాతం ఫీజు కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తారు. నోటీసు అందుకున్న 45 రోజుల్లో 45% ఫీజు, తొలి వాయిదా చెల్లించిన 45 రోజుల్లో మిగిలిన మొత్తం చెల్లించాలి. ఆలస్యమైతే నెలకు 1 శాతం జరిమానా ఉంటుంది. నెల దాటితే మొత్తం రద్దవుతుంది. చెల్లించిన ఫీజు వెనక్కి ఇవ్వరు. మాస్టర్ ప్లాన్ మార్పు: ఫీజు అందిన 3 రోజుల్లో పురపాలక శాఖ/హెచ్ఎండీఏ రికార్డుల్లో భూ వినియోగ మార్పులు చేస్తారు. ఏమిటీ హిల్ట్–పీ పాలసీ? దాదాపు 50–60 ఏళ్ల క్రితం నాచారం, మల్లాపూర్, జీడిమెట్ల, సనత్నగర్, బాలానగర్, కూకట్పల్లి వంటి ప్రాంతాలు నగరం వెలుపల పారిశ్రామిక జోన్లుగా ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం ఇవన్నీ నగర నడి»ొడ్డుకు చేరాయి. ఫలితంగా నివాసాల మధ్య కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ పరిధిలోని 22 పారిశ్రామికవాడల్లో ఉన్న దాదాపు 9,300 ఎకరాల భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు పరిశ్రమల శాఖ జీవో 27 విడుదల చేసింది. నగరంలో ఉన్న రెడ్, ఆరెంజ్ కేటగిరీ కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించి హైదరాబాద్ను కాలుష్య ముప్పు నుంచి కాపాడటం, ఖాళీ అయిన పారిశ్రామిక భూముల్లో ఐటీ పార్కులు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, మాల్స్, స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వడం ఈ పాలసీ లక్ష్యం. -
‘రాజకీయాలు తాత్కాలికం.. రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతం’
హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక విమర్శలు చేయాలి కానీ అభివృద్దిని అడ్డుకునే వినాశకరమైన ఆలోచనలు చేయకూడదన్నారు మంత్రి శ్రీధర్బాబు. రాజకీయాలు అనేవి తాత్కాలికమని, రాష్ట్ర ప్రయోజనాలు అనేవి శాశ్వతమన్నారు. ఈరోజు(శనివారం, మే 23వ తేదీ) సీఎల్పీ కార్యాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రెస్మీట్లో మాట్లాడారు. దురదృష్టవశాత్తూ బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఎన్నికల ఓటమి తాలూకు నిరాశ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారు. అందుకే... హరీష్ రావు అమెరికా వెళ్లి కూడా పగటి కలలు కంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని రద్దు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. పగటి కలలు కంటూ... ‘చీప్ పాలిట్రిక్స్’... ‘డైవర్షన్ పాలిట్రిక్స్’... ‘బ్లాక్ మెయిలింగ్ పాలిట్రిక్స్’ ప్లే చేస్తున్నారు.మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకులు మూసీ ప్రక్షాళనను అడ్డుకునే కుట్ర చేశారు. ఇప్పుడు... ఫ్యూచర్ సిటీపై కుట్రలు చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నే మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అనేది కేవలం ఒక ప్రాంతానికో, ఒక ప్రభుత్వానికో పరిమితమైనది కాదు... ఇది తెలంగాణ బ్రాండ్ ను మరింత విశ్వవ్యాప్తం చేసేందుకు మేం వేసే ఒక ముందడుగు.రాబోయే రోజుల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్లా మారబోతోంది. దీన్ని రద్దు చేస్తామని పగటి కలలు కంటున్న హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.‘ప్రభుత్వం మారితే ఫూచర్ సిటీని రద్దు చేస్తాం’ అనే బాధ్యతారహిత ప్రకటన చేయడం ద్వారా హరీష్ రావు... అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను, ఇన్వెస్ట్ మెంట్ సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నారు. ఇది ‘తెలంగాణ’కు చేస్తున్న ద్రోహం కాదా...?’ అని ప్రశ్నించారు. -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది (2027) గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనులకు రూ.1000 కోట్లు కేటాయింపునకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. తొలి విడతగా రూ.300 కోట్లు మంజూరు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఆమోదం తెలిపిన కేబినెట్.. అల్పాహారం, పాలు కూడా అందించాలని నిర్ణయించింది.కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని నూతన డిగ్రీ కళాశాలకు 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులు, ఆరు నాన్ టీచింగ్ పోస్టులు, అవుట్ సోర్సింగ్ పద్ధతిన 3 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం చెప్పింది.మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఫైర్ స్టేషన్కు 18 పోస్టుల మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెలిది గ్రామంలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్ లో 5 ఎకరాలు, గన్నేరువరం మండలంలో 5 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
పక్కా ప్లాన్ తో న్యాయవాది హత్య
-
మాసబ్ట్యాంక్లో దారుణం.. ప్రముఖ న్యాయవాది మృతి
హైదరాబాద్: మాసబ్ట్యాంక్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్ను గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన సంచలనం రేపుతోంది. శనివారం ఉదయం ఆయన తన నివాసం నుంచి కారులో బయల్దేరుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ధుండగులు కారుతో ఢీ కొట్టి అటాక్ చేశారు. ఈ ప్రమాదంలో మొయినుద్దీన్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ లో ఆకట్టుకుంటున్న హనుమాన్ విగ్రహం (ఫొటోలు)
-
హైదరాబాద్లో టెస్లా.. రెడీ అవుతున్న షోరూం!
సాక్షి, హైదరాబాద్: టెస్లా.. ఎలక్ట్రిక్ కారు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు. ఇప్పటికే భారత్లో ముంబై, న్యూఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరులో ఎక్స్పీరియెన్స్ సెంటర్లను తెరిచిన టెస్లా.. హైదరాబాద్లోనూ అడుగు పెడుతోంది. కొండాపూర్లో రెండు నెలల్లో సేల్స్, సర్వీస్ సెంటర్ సిద్ధం అవుతోందని సమాచారం.యూఎస్కు చెందిన ఈ సంస్థ భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా మోడల్–వై కారును ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఆటోపైలెట్, ఫుల్ సెల్ఫ్–డ్రైవింగ్ వంటి అత్యాధునిక సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లు కంపెనీ కార్ల ప్రత్యేకత. టెస్లా అంటే కేవలం కార్లు మాత్రమే కాదని, ఈ సంస్థ రాకతో హైదరాబాద్ రియల్టీకి పెద్ద బూస్ట్నిస్తుందని రియల్టీ రంగ నిపుణుడు కలిశెట్టి నాయుడు ‘సాక్షి’కి తెలిపారు.టెస్లా కార్లకు ఇక్కడి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల విషయంలో బెంగళూరును బీట్ చేశామని, హైనకెన్, లాంజా వంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్లో కొలువుదీరడానికి ఇక్కడి మౌలిక వసతులు కారణమన్నారు. టాప్–20 ఎన్బీఎఫ్సీలు అన్నీ హైదరాబాద్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయని, ఒక్క భాగ్యనగరికే ఈ ఘనత సాధ్యమైందన్నారు.మంత్రి శ్రీధర్బాబుతో టెస్లా డెవలప్మెంట్ డైరెక్టర్ రజత్, ఇండియా జీఎం శరద్ అగర్వాల్ (ఎడమ నుంచి కుడికి) విస్తరణ చేపట్టండి.. మంత్రి శ్రీధర్బాబును టెస్లా బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ రజత్, ఇండియా జీఎం శరద్ అగర్వాల్ శుక్రవారం కలిశారు. హైదరాబాద్లో షోరూం ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. దేశంలో ప్రస్తు తం కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా సుమారు 4 శాతం మాత్రమే ఉందని, ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులకు మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, హైదరాబాద్ను క్లీన్ టెక్నాలజీ, ఆధునిక మొబిలిటీకి ప్రపంచస్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసే సంకల్పంతో ఉందని పేర్కొన్నారు.తెలంగాణలో టెస్లా అనుబంధ పరిశ్రమల విస్తరణ అవకాశాలను పరిశీలించాలన్నారు. పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభు త్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ప్రత్యేక కార్యదర్శి రఘురామశర్మ పాల్గొన్నారు. -
ఇల్లు.. అందుబాటులోనిల్లు
భాగ్యనగరంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల.. కలగానే మిగిలిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. చిన్న ఫ్లాట్ల నిర్మాణం క్రమంగా తగ్గిపోతుండటమే ఇందుకు కారణం. సొంత స్థలంలో ఇల్లు అనేది దశాబ్దాలుగా నగరంలో ఉంటున్న వారికి మినహా వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికి దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలోనే అపార్ట్మెంట్ల కల్చర్ వచ్చింది. తొలినాళ్లలో ఎక్కువగా సింగిల్ బెడ్ రూమ్ (1 బీహెచ్కే), డబుల్ బెడ్ రూమ్ (2 బీహెచ్కే) ఇళ్లే ఎక్కువగా నిర్మించేవారు. దీంతో సొంతంగా స్థలం కొనుక్కుని ఇల్లు నిర్మించుకోలేని వారు అపార్ట్మెంట్ ఫ్లాట్ల వైపు మొగ్గు చూపేవారు. 600–700 చ.అడుగుల్లో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు అందుబాటులో ఉండేవి. సొంతిల్లు కావాలనుకునే వారు ఈ సింగిల్ లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కొనుగోలు చేసి కల నెరవేర్చుకునేవారు. దాదాపు ఐదేళ్ల క్రితం వరకు కూడా డెవలపర్లు ఈ 1, 2 బీహెచ్కే ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది.1, 2 బీహెచ్కే ఇళ్ల నిర్మాణాలు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. 1 బీహెచ్కే ఇళ్లయితే అసలు కనిపించడమే లేదు. మిగతా నగరాలతో పోల్చుకుంటే అత్యధికంగా హైదరాబాద్లోనే ఈ తరహా ఇళ్లు (అఫర్డబుల్ హౌసింగ్/సామాన్యులకు అందుబాటులో ఉండేవి) 70 శాతం తగ్గినట్లు ప్రాప్ ఈక్విటీ నివేదిక పేర్కొనడం గమనార్హం. నగరంలో భూముల ధరలు విపరీతంగా పెరగడం, లేబర్ల జీత భత్యాలు పెరగడంతో గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో బిల్డర్లు అఫర్డబుల్ హౌసింగ్ను దాదాపుగా మానుకుంటున్నారు. మరోవైపు కొనుగోలుదారులు చాలావరకు అవసరమైతే మరింత అప్పు చేసైనా సరే కాస్త విశాలమైన ఇళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో 3 బీహెచ్కే ఫ్లాట్లు, విల్లాల వంటివి గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. కరోనా తర్వాత.. కరోనా కాలంలో చిన్న, ఇరుకైన ఇళ్లలో నివసించడం ఎంత రిస్కో తెలిసొచ్చింది. ఎక్కువ గదుల భావన బలపడింది. దీంతో అప్పటినుంచి అత్యధిక శాతం కొనుగోలుదారులు విశాలమైన ఇళ్ల కొనుగోళ్లకే మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్లో మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంలో 25–40 శాతం భూమి ధరలదే ఉంటోంది. దీంతో లాభదాయకం కాదనే భావనతో బిల్డర్లు కూడా 1, 2 బీహెచ్కే ఫ్లాట్ల నిర్మాణాన్ని తగ్గించారు. 2018లో గృహ విక్రయాలలో మధ్య తరగతి ఇళ్ల వాటా 54 శాతంగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 26 శాతానికి పడిపోవడం గమనార్హం. మధ్య తరగతి గృహాలపై తీవ్ర ప్రభావం.. దేశంలోని ఇతర మెట్రో నగరాలలో కూడా అఫర్డబుల్ గృహాల నిర్మాణం వేగంగా తగ్గుతోంది. ప్రాప్ ఈక్విటీ నివేదిక ప్రకారం మన తర్వాత (70 శాతం) ముంబైలో 60 శాతం, ఢిల్లీ–ఎన్సీఆర్లో 50 శాతం మేర క్షీణించాయి. ప్రత్యేకించి హైదరాబాద్లో 2022 నుంచి రూ.కోటి కంటే బాగా తక్కువగానే ధర ఉండే మధ్య తరగతి గృహ నిర్మాణాల అమ్మకాలు భారీగా తగ్గాయి. విశాలమైన, విలాసవంతమైన ఇళ్లలో నివాసం ఉండేందుకు, కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తుండటంతో వారి అభిరుచులకు మేరకు డెవలపర్లు కూడా లగ్జరీ గృహ నిర్మాణాలకు మొగ్గు చూపిస్తున్నారు. మరోవైపు భూముల ధరలు ఆకాశాన్నంటడం, నిర్మాణ సామగ్రి, నైపుణ్య కారి్మకుల వేతనాలు పెరగడం వంటి కారణంగా మధ్య తరగతి ఇళ్ల నిర్మాణం బిల్డర్లకు లాభసాటిగా ఉండటం లేదు. దీంతో ఎక్కువ లాభదాయకంగా ఉండే ప్రీమియం ప్రాజెక్టుల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ధరలు పెరిగే అవకాశం టైల్స్, శానిటరీ, అల్యూమినియం, రంగులు, యూపీవీసీ, పీవీసీ పైపులు, ఎలక్ట్రిక్ వైర్లు వంటి ఉత్పత్తుల తయారీలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ అత్యంత కీలకం. ప్రస్తుతం గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా తగ్గడంతో ఆయా ఉత్పత్తుల తయారీపై తీవ్ర ప్రభావం పడుతోంది. నిర్మాణ రంగంలో సిమెంట్, స్టీల్ తయారీ దేశీయంగానే ముడి పదార్థాలపై ఆధారపడి ఉండటంతో ఆయా ఉత్పత్తులపై పెద్దగా ప్రభావం లేదు.కానీ రవాణా అంతరాయం కారణంగా వీటి ధరలు 10–15 శాతం వరకు పెరిగాయి. దిగుమతి చేసుకునే యూపీవీసీ కిటికీలు, తలుపులు, గ్లాస్లు, శానిటరీ వేర్ వంటి వాటి ధరలు 40 శాతం పైనే పెరిగాయి. నిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయం, కొరత కారణంగా భవన నిర్మాణ వ్యయం 15–20 శాతం మేర పెరిగింది. ఈ భారాన్ని డెవలపర్లు తుదిగా గృహ కొనుగోలుదారులకు బదిలీ చేయక తప్పదు. ఫలితంగా అపార్ట్మెంట్ల ధరలను చ.అ.కు రూ.250–300 వరకు పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తగ్గుతున్న అమ్మకాలు భూములు, నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడం, నైపుణ్య కారి్మకుల కొరత, గృహ రుణ వడ్డీ రేట్ల పెరుగుదల సూచనలు.. వెరసి హైదరాబాద్ స్థిరాస్తి రంగం కుప్పకూలుతోంది. 2024తో పోల్చుకుంటే 2025లో ప్రాజెక్టులు, అదే విధంగా ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఇక హైదరాబాద్లో 2025 చివరి త్రైమాసికంలో 60 లక్షల చదరపు అడుగులు (చ.అ.) మేర గృహ నిర్మాణాలు పూర్తి కాగా.. ఈ ఏడాది తొలి త్రైమాసికం నాటికి కేవలం 6 లక్షల చ.అ.లకే పరిమితయ్యాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే భారీ స్థాయిలో క్షీణించడం నగరలో నిర్మాణ రంగ పతనాన్ని సూచిస్తోంది. ఇంకోవైపు కనెక్టివిటీ, మౌలిక వసతులు సరిగా లేకపోవడంతో శివారుప్రాంతాల్లోని 40 శాతం మధ్య తరగతి గృహాలు అమ్ముడుపోకుండా ఉన్నాయి. ప్రభుత్వం చొరవ చూపాలి భూ యజమానులు అత్యాశతో భూముల ధరలను రాత్రికి రాత్రే పెంచేస్తున్నారు. దీంతో అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్లు చేపట్టాలంటే బిల్డర్లు పునరాలోచిస్తున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ భూముల లభ్యత విపరీతంగా ఉంది. అయితే సరైన మౌలిక వసతుల్లేవు. ఆ మేరకు ప్రభుత్వం సదుపాయాలు కలి్పస్తే మధ్య తరగతి గృహ నిర్మాణాలు చేపట్టేందుకు వీలుంటుంది. – నరేంద్రకుమార్, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ (ఫొటో కామన్లో నరేంద్ర కుమార్ పేరుతో ఉంది) -
ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ.. చిందేసిన ఉప్పల్ (ఫొటోలు)
-
పెరిగిన ఇంధన ధరలతో వర్కర్లు విలవిల
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): దిల్సుఖ్నగర్కు చెందిన ఓ యువకుడు క్యాబ్ డ్రైవర్. ఓలా, ఉబెర్ అగ్రిగేటర్ సంస్థలతో అనుసంధానమై క్యాబ్ నడుపుతున్నాడు. రోజుకు సగటున 150 కి,మీ చొప్పున అతని క్యాబ్ తిరుగుతుంది. రూ.1800 నుంచి రూ.2000 వరకు ఆదాయం వస్తుంది. రోజుకు రూ.1000 డీజిల్ ఖర్చు పోను మరో రూ.800 నుంచి రూ.1000 వరకు మిగులుబాటయ్యేది. ఆ డబ్బులతోనే బండి ఈఎంఐ, ఇంటి కిరాయి, నిత్యావసరాలు, ఫోన్ రీచార్జ్, తదితర అన్ని అవసరాలు తీర్చుకున్నాడు. కానీ.. ఇప్పుడు డీజిల్ ధర పెరగడంతో రోజుకు రూ.1,275 వరకు ఖర్చవుతోంది. ఇంధన ధరల పెంపు కారణంగా 25 శాతం ఆదాయం తగ్గింది. ‘రోజు రోజుకు అన్ని ధరలు పెరుగుతున్నాయి కానీ.. క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు ఇచ్చే పేమెంట్స్ మాత్రం పెరగడం లేదు. ఈఎంఐ కట్టడం కష్టంగా ఉంది’ అని ఆందోళన వ్యక్తం చేశాడు. భారం రూ.30 కోట్లు అంతర్జాతీయ చమురు మార్కెట్లలో వస్తున్న మార్పుల ప్రభావం భాగ్యనగర వీధుల్లో ఆటోలు, క్యాబ్లు, బైక్లు నడుపుకుంటూ బతుకుదెరువు సాగిస్తున్న సామాన్యుల కుటుంబాలపై తీవ్రంగా పడుతోంది. మే నెలలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా లీటరుకు రూ. 4 పైనే పెరగడంతో నగరంలోని సుమారు 1.25 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు, 4 లక్షల మంది గిగ్ వర్కర్ల (డెలివరీ బాయ్స్, బైక్ టాక్సీ రైడర్స్) ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హైదరాబాద్ నగర రవాణా, డెలివరీ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ రెండు వర్గాలపై నెలకు సుమారు రూ.30 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు అంచనా.ధరలు పెరిగిన ప్రతిసారి ఓలా, ఉబెర్, స్విగ్ని, జొమాటో తదితర సంస్థలు రైడ్ ఛార్జీలు, డెలివరీ ఫీజులు పెంచుతున్నప్పటికీ, పెరిగిన లాభాలను డ్రైవర్లకు, డెలివరీ బాయ్స్కు ఆశించిన స్థాయిలో బదిలీ చేయడం లేదు. సుమారు 1.25 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు రోజుకు సుమారు 12.5 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నట్లు అంచనా. పెరిగిన ధరల కారణంగా ఈ ఒక్క క్యాబ్ కమ్యూనిటీపైనే నెలకు ఏకంగా రూ.15.94 కోట్ల అదనపు భారం పడుతోంది. నగరంలోని సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్లను పరిగణనలోకి తీసుకుంటే, వీరంతా రోజుకు 10.68 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తున్నారు.చదవండి: ఒంటి చక్రం సైకిల్పై సాహసయాత్ర!గ్రేటర్లోని సుమారు 1.25 లక్షల మంది డ్రైవర్ల దయనీయ పరిస్థితి ఇది. కేవలం పెట్రోల్, డీజిల్ కాకుండా సీఎన్జీ, ఎల్పీజీ ధరలు కూడా పెరిగాయి. చాయ్, టిఫిన్ సహా అన్నింటిపైనా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వర్క్ఫ్రమ్ హోమ్ మళ్లీ మొదలైంది. క్యాబ్, ఆటోడ్రైవర్లకు ఇది పిడుగుపాటుగా మారింది. మరోవైపు సుమారు 4 లక్షల మందికి పైగా ఉన్న గిగ్అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ (డెలివరీబాయ్స్) కూడా పెరిగిన పెట్రోల్ ధరలతో విలవిలలాడుతున్నారు.చెల్లింపులు పెంచాలిపెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా బండి బయటికి తీయాలంటేనే భయంగా ఉంది. ధరలకు అనుగుణంగా క్యాబ్ సంస్థలు చెల్లింపులను పెంచాలి. – సంతోష్ఆర్డర్లు తగ్గాయి డెలివరీబాయ్స్ బాగా పెరగడంతో ఆర్డర్లు తగ్గాయి. ఆదాయం కూడా తగ్గింది. గతంలో ఒక బుకింగ్పైన రూ.30 నుంచి రూ..40 లభించేది.ఇప్పుడు రూ.10, రూ.20 చొప్పున వస్తున్నాయి. – ఖలీల్ -
IPL 2026: ఆర్సీబీని చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్
ఉప్పల్ మైదానం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 55 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులకు పరిమితమైంది. బెంగళూరు బ్యాటర్లలో రజిత్ పాటిదార్(56) టాప్ స్కోరర్గా నిలవగా.. కృనాల్ పాండ్యా(41), వెంకటేశ్ అయ్యర్(44) రాణించారు. విరాట్ కోహ్లి మాత్రం కేవలం 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు, షకీబ్, ట్రావిస్ హెడ్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.ఆర్సీబీ నాలుగో వికెట్ డౌన్పాటిదార్ రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన పాటిదార్.. హెడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 185/4ఆర్సీబీ మూడో వికెట్ డౌన్దేవ్దత్త్ పడిక్కల్ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 21 పరుగులు చేసిన పడిక్కల్.. మలింగ బౌలింగ్లో ఔటయ్యాడు8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 91/28 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో దేవ్దత్త్ పడిక్కల్(20), పాటిదార్(10) ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీఎస్ఆర్హెచ్ విధించిన 256 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ధాటిగా ఆరంభించింది. 4 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. అయితే మరుసటి ఓవర్లోనే వెంకటేశ్ అయ్యర్ (44) ఔట్ కావడంతో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ టార్గెట్ 256 పరుగులుహైదరాబాద్ వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్ భారీ స్కోరు చేసింది. అభిషేక్, ఇషాన్, క్లాసెన్ అర్థశతకాలతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) ఫిఫ్టీలతో మెరిశారు. ఆఖర్లో నితీశ్కుమార్ (12 బంతుల్లో 29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఎస్ఆర్హెచ్ 250 పరుగుల మార్క్ను దాటింది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 2 వికెట్లు తీయగా, సుయాశ్, కృనాల్ చెరొక వికెట్ తీశారు.16 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్లాసెన్ 23 బంతుల్లో 50 పరుగుల మార్క్ సాధించాడు. కిషన్ 65 పరుగులతో ఆడుతున్నాడు.దంచుతున్న ఎస్ఆర్హెచ్.. 15 ఓవర్లలో 189-2ఆర్సీబీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ దంచికొడుతుంది. 15 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (50), క్లాసెన్ (47) క్రీజులో ఉన్నారు. అంతకముందు 56 పరుగులు చేసిన అభిషేక్ శర్మ సుయాశ్ శర్మ బౌలింగ్లో జోర్డాన్ కాక్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.6 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 63-16 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (26), ఇషాన్ కిషన్ (8) పరుగులతో ఆడుతున్నారు.హెడ్ (26) ఔట్.. తొలి వికెట్ డౌన్ఆర్సీబీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ రసిక్సలామ్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 45 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (17) క్రీజులో ఉన్నాడు.టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీపై భారీ విజయాన్ని సాధించి టేబుల్లో రెండో స్థానంలో నిలవాలని ఎస్ఆర్హెచ్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఇప్పటికే టాప్లో ఉన్న ఆర్సీబీ విజయంతో లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. మరి భారీ స్కోర్లకు పెట్టింది పేరైన ఉప్పల్ స్టేడియంలో ఎవరిది పైచేయి కానుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ తమ సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్తో తలపడింది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన ఆర్సీబీ.. యాదృశ్చికంగా లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ను మళ్లీ ఎస్ఆర్హెచ్తోనే ఆడుతోంది. అయితే ఎస్ఆర్హెచ్ మాత్రం ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 26 సార్లు తలపడితే ఎస్ఆర్హెచ్ 14 సార్లు, ఆర్సీబీ 12 సార్లు విజయాలు సాధించాయి. ఇక సొంత మైదానంలో ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్దే పైచేయిగా ఉంది. ఇక్కడ ఆడిన 9 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ ఆరింటిలో గెలవగా.. ఆర్సీబీ మూడింట నెగ్గింది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, జితేష్ శర్మ(వికెట్కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్.సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్. 🚨Toss update from Hyderabad 🚨@SunRisers won the toss and elected to bat first against @RCBTweets Rajat Patidar returns to lead #RCB Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB pic.twitter.com/izekAMXKnx— IndianPremierLeague (@IPL) May 22, 2026 -
వందల కోట్ల ఆస్తి.. ACB వలలో డిప్యూటీ కలెక్టర్
-
సన్రైజర్స్ నెత్తిన పిడుగు.. టాప్-2కి చేరాలంటే..
చెన్నై సూపర్ కింగ్స్తో సోమవారం నాటి మ్యాచ్లో గెలిచి ఐపీఎల్-2026 ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించింది సన్రైజర్స్ హైదరాబాద్. వెళ్తూ వెళ్తూ తమతో పాటు గుజరాత్ టైటాన్స్ను కూడా టాప్-4కి తీసుకువెళ్లింది. తాజాగా అదే చెన్నై జట్టును చిత్తుగా ఓడించిన గుజరాత్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకువెళ్లింది. సన్రైజర్స్ను మూడో స్థానానికి నెట్టివేసింది.గుజరాత్.. రైట్ రైట్చెన్నైతో గురువారం నాటి మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. సొంతమైదానం అహ్మదాబాద్లో లీగ్ దశలో తమ చివరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల తేడాతో.. ఐదుసార్లు విజేత చెన్నైని చిత్తు చేసింది. తద్వారా టైటాన్స్ 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, 5 పరాజయాలతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానానికి చేరుకుంది. మరోవైపు.. 14 మ్యాచ్లలో 6 విజయాలు, 8 పరాజయాలతో 12 పాయింట్లు సాధించిన చెన్నై ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టేబుల్ టాపర్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి 13 మ్యాచ్లకు గానూ 9 గెలిచిన ఆర్సీబీ 18 పాయింట్లు సాధించింది. నెట్రన్రేటు పరంగా గుజరాత్ (+0.695) కంటే ఆర్సీబీ (+1.065) మెరుగ్గా ఉండటంతో టాప్లోనే కొనసాగుతోంది.సన్రైజర్స్ నెత్తిన పిడుగుఇక లీగ్ దశలో తమకు మిగిలిన ఒకే ఒక్క మ్యాచ్లో సన్రైజర్స్- ఆర్సీబీ శుక్రవారం ముఖాముఖి తలపడనున్నాయి. సన్రైజర్స్ సొంతమైదానం ఉప్పల్లో ఈ మ్యాచ్కు షెడ్యూల్ ఖరారైంది. నిజానికి చెన్నైపై గుజరాత్ భారీ విజయం సాధించడంతో... సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు టాప్–2లో నిలిచే అవకాశాలు కాస్త క్లిష్టమయ్యాయనే చెప్పవచ్చు.పట్టికలో గుజరాత్ను వెనక్కినెట్టి సన్రైజర్స్ రెండో స్థానానికి చేరాలంటే... ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 88 పరుగుల ఆధిక్యంతో గెలవాలి. ఛేజింగ్ చేస్తే బెంగళూరు నిర్దేశించిన లక్ష్యాన్ని సన్రైజర్స్ సుమారుగా 12 ఓవర్లలోపు ఛేదించాలి. సన్రైజర్స్ టాప్-2కి చేరాలంటే సమీకరణలు ఇలా..👉తొలుత బ్యాటింగ్కు దిగి 250 రన్స్ చేస్తే.. ఆర్సీబీ మీద కనీసం 90 పరుగుల తేడాతో గెలవాలి.👉సన్రైజర్స్ 200 పరుగులు చేస్తే.. ఆర్సీబీ మీద 87 పరుగుల తేడాతో గెలవాలి.👉ఒకవేళ ఆర్సీబీ 200కు పైగా లక్ష్యం విధిస్తే సన్రైజర్స్ దానిని 11.2 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంటుంది.సన్రైజర్స్కు ఉన్న సానుకూలతలు👉సొంతమైదానంలో రాత్రి జరిగిన నాలుగు మ్యాచ్లలోనూ సన్రైజర్స్ గెలుపొందింది.👉ఉప్పల్లో ఇషాన్ మలింగ 11 వికెట్లు తీసి మంచి ఫామ్లో ఉన్నాడు.👉పవర్ ప్లేలో ప్రఫుల్ హింగే సొంతమైదానంలో ప్రతి పది బంతులకు ఒక వికెట్ తీయడం సానుకూలాంశం👉ఆర్సీబీ మీద హెన్రిచ్ క్లాసెన్ 196కు పైగా స్ట్రైక్రేటుతో 46.4 సగటుతో పరుగులు రాబట్టాడు.👉ఆర్సీబీ దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి వికెట్ను ముందుగానే పడగొడితే సన్రైజర్స్పై ఒత్తిడి కాస్త తగ్గుతుంది.టాప్-2 చేరితే ఉపయోగం ఏమిటి?ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఫార్మాట్ ప్రకారం.. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్లు క్వాలిఫయర్-1 ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకుంటుంది.అయితే, ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం కూడా ఉంటుంది. కాగా పట్టికలో టాప్-3, 4లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇక క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్కు దూసుకువెళ్తుంది.UPDATE: గెలిచినా ఎస్ఆర్హెచ్కు తప్పని గండంచదవండి: అనామక ప్లేయర్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర -
ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ప్లేయర్ల ప్రాక్టీస్.. ఉప్పల్లో లాస్ట్ పంచ్ ఎవరిది (ఫొటోలు)
-
SRH vs RCB: ఉప్పల్లో మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపులు ఇవే
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-2026లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలో తమ చివరి మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడనుంది. శుక్రవారం (మే 22) జరిగే ఈ మ్యాచ్కు ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన సన్రైజర్స్కు సొంతమైదానంలో ఇదే చివరి మ్యాచ్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున, ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ మార్పులు (డైవర్షన్లు) అమలు చేయనున్నట్లు సంబంధిత విభాగం వెల్లడించింది. ఇందుకు సంబంధించి మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్–II) పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఈ వాహనదారులకు అలెర్ట్లారీలు, రాకెట్ లారీలు, డంపర్లు, ఎర్త్ మూవర్స్, ట్రక్కులు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్లు, RMC వాహనాలు, JCBలు, ఐచర్ వాన్లు, ప్రైవేట్ బస్సులు మరియు ట్రాక్టర్లు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారం మధ్యాహ్నం 12:00 గంటల నుండి రాత్రి 12:00 గంటల వరకు నాగోల్ నుండి హబ్సిగూడ (ఉప్పల్ జంక్షన్ మార్గం).. అదే విధంగా బోడుప్పల్ నుండి అంబర్పేట్ (ఉప్పల్ జంక్షన్, రామంతాపూర్ మార్గం) వరకు మోస్తరు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంది.కాబట్టి ప్రజలు వీలైనంతవరకు ఈ మార్గాలను నివారించి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలి. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి RTC బస్సులు మరియు మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వినియోగించడం శ్రేయస్కరం.ట్రాఫిక్ డైవర్షన్ మార్గాలు:👉ఘట్కేసర్ నుండి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను మెహఫిల్ హోటల్ వద్ద HMDA ఉప్పల్ భగ్యాత్ ప్రవేశద్వారం వద్ద నాగోల్ – ఎల్.బి.నగర్ వైపు మళ్లించబడతాయి.👉ఎల్.బి.నగర్ నుండి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద U-టర్న్ తీసుకుని నాగోల్ U-టర్న్ – HMDA భగ్యాత్ – టయోటా U-టర్న్ – బోడుప్పల్ – చెంగిచెర్ల – IOCL చెర్లపల్లి / ఘట్కేసర్ వైపు మళ్లించబడతాయి.👉తార్నాక నుండి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను హబ్సిగూడ X రోడ్ వద్ద నాచారం – NFC రోటరీ – IOCL చెర్లపల్లి – ఘట్కేసర్ వైపు మళ్లించబడతాయి.👉రామంతాపూర్ నుండి ఉప్పల్ వైపు వచ్చే హెవీ వాహనాలను స్ట్రీట్ నం. 8 వద్ద హబ్సిగూడ X రోడ్ – నాచారం – NFC రోటరీ – IOCL చెర్లపల్లి – ఘట్కేసర్ వైపు మళ్లించబడతాయి.👉ఇక ఉప్పల్ జంక్షన్లోని ఎలివేటెడ్ కారిడార్ వర్క్ పనులు జరుగుతున్నందున వరంగల్ రహదారి మూసివేయడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనదారులను సర్వే ఆఫ్ ఇండియా వద్ద పిస్తా హౌస్ పక్క నుండి బీరప్ప గడ్డమీదుగా వరంగల్ రహదారి మీదుగా బోడుప్పల్, ఘట్కేసర్, వరంగల్ కు పంపించబడుతున్నవి. 👉అలాగే వరంగల్ నుండి హైదరాబాదు మరియు సికింద్రాబాద్ వచ్చే వాహనదారులను మే ఫీల్ హోటల్ వద్ద ఉప్పల్ బగాయతు మీదుగా నాగోల్ నుండి హైదరాబాదు మరియు సికింద్రాబాద్కు పంపించబడుచున్నవి.👉వరంగల్ నుండి హైదరాబాద్కు ఉప్పల్ మార్గం ద్వారా వచ్చే హెవీ వాహనాలు ఘట్కేసర్ వద్ద ORR ఎక్కి అబ్దుల్లాపూర్మెట్ – ఎల్.బి.నగర్ – దిల్సుఖ్నగర్ మార్గంలో ప్రయాణించాలి.👉హైదరాబాద్ నుండి వరంగల్ వైపు ఉప్పల్ మార్గం ద్వారా వెళ్లే వాహనాలు ఎల్.బి.నగర్ – హయత్నగర్ ద్వారా అబ్దుల్లాపూర్మెట్ వద్ద ORR ఎక్కి వరంగల్ చేరుకోవాలి.ప్రేక్షకులకు సాధారణ సూచనలు:👉మ్యాచ్ సందర్భంగా మొత్తం (05) ప్రధాన పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. వీటిలో (04) స్టేడియం బయట 500 మీటర్ల పరిధిలో సాధారణ ప్రజల కోసం ఉండగా, ఒకటి స్టేడియం లోపల (VVIP/VIP పాస్ హోల్డర్లకు మాత్రమే) కేటాయించబడింది.👉స్టేడియం బయట పార్కింగ్ (సాధారణ ప్రజలకు):ఉప్పల్ X రోడ్స్ నుండి హబ్సిగూడ వైపు: పెంగ్విన్ ,TGIALA👉ఉప్పల్ X రోడ్స్ నుండి రామంతాపూర్ వైపు:DSL ఓపెన్ ప్రదేశం (NSL భవనం ఎదురుగా)మోడర్న్ బేకరీ👉స్టేడియం లోపల పార్కింగ్ (పాస్ హోల్డర్లకు మాత్రమే):VVIP/VIP మరియు అనుమతిపత్రం కలిగినవారు మాత్రమే A గ్రౌండ్ పార్కింగ్ ఉపయోగించాలి. ప్రవేశం గేట్ 1A ద్వారానే ఉంటుంది.చెల్లుబాటు అయ్యే పాస్ లేని వాహనాలను EK మినార్ మరియు LG గోదాం చెక్పోస్టుల దాటి అనుమతించరు.పార్కింగ్ మార్గదర్శకాలు:👉ఎల్.బి.నగర్ నుండి ఉప్పల్ స్టేడియం:DSL ఓపెన్ ప్రదేశం, మోడర్న్ బేకరీ మరియు LG గోదాం జంక్షన్ నుండి కెమ్వేదా జంక్షన్ వరకు ఇండస్ట్రియల్ లేన్ రోడ్డు పక్కన పార్కింగ్ చేయాలి.👉హబ్సిగూడ నుండి ఉప్పల్ స్టేడియం:సర్వే ఆఫ్ ఇండియా వద్ద U-టర్న్ తీసుకుని EK మినార్ వద్ద పెంగ్విన్ పార్కింగ్ మరియు TG IALA పార్కింగ్లో వాహనాలు నిలిపివేయాలి.👉రామంతాపూర్ నుండి ఉప్పల్ స్టేడియం:DSL మాల్ వద్ద U-టర్న్ తీసుకుని DSL ఓపెన్ ప్రదేశం, మోడర్న్ బేకరీ మరియు LG గోదాం జంక్షన్ నుండి చం వేద జంక్షన్ వరకు పార్కింగ్ చేయాలి.పై మార్గాలు, తేదీలు, సమయాలను గమనించి ప్రజలు తమ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకొని మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి. అలాగే, ప్రజలు RTC బస్సులు మరియు మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించగలరు. -
స్టాక్ మార్కెట్లోకి హైదరాబాద్ ఈవీ కంపెనీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తాజా ఇంటర్నేషనల్తో రివర్స్ మెర్జర్ అనంతరం హైదరాబాద్కి చెందిన కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కెటో మోటర్స్ .. బీఎస్ఈలో లిస్టయింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు, ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కార్యకలాపాలను విస్తరించే క్రమంలో ఇదొక కీలక మైలురాయని సంస్థ డైరెక్టర్ వెంకటేష్ చల్లా తెలిపారు.దేశీయంగా వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాల రంగం పరివర్తనలో తమ సంస్థ అర్ధవంతమైన పాత్రను పోషించగలదని పేర్కొన్నారు. కంపెనీ తెలంగాణలో తలపెట్టిన రూ. 300 కోట్లతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ప్రాజెక్టు, అర్బనోవా కేఈ9 పేరిట తొమ్మిది మీటర్ల ఎలక్ట్రిక్ బస్ ప్లాట్ఫాంను ఆవిష్కరించడం తదితర పరిణామాల నేపథ్యంలో సంస్థ లిస్టింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. -
బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి
-
‘బండి భగీరథ్ లొంగిపోలేదు..పోలీసులే అరెస్ట్ చేశారు’
సాక్షి,హైదరాబాద్: పోక్సో కేసులో తన కుమారుడిని విచారణ నిమిత్తం తానే పోలీసులకు సరెండర్ చేశానని అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు.బండి భగీరథ్ లొంగిపోలేదు. పోలీసులు అరెస్టు చేశారు. అప్పా జంక్షన్లో పోలీసులు వాహనాల తనిఖీ చేసేటప్పుడు భగీరథ్ చిక్కాడు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. రోడ్డు మధ్యలో అతడ్ని కస్టడీలోకి తీసుకున్నామని మా పోలీసులు చెప్పారు. నేను మా పోలీసుల మాట నమ్మాలా.. రాజకీయ నాయకుల మాట నమ్మాలా. సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే సరెండర్ చేశారని అనుకోవచ్చు.ఐదు రోజులు పోలీసులు సోదాలు చేసినప్పుడు తండ్రీకొడుకులు ఎక్కడున్నారు. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ల పిల్లవాడ్ని వాళ్లింట్లో పెట్టుకుని పోలీసులను పిలిపించి అప్పచెబుతారు. సోదాలు చేసినప్పుడు అప్పగిస్తే.. సరెండర్ చేశారని అనుకోవచ్చు.ఐదు రోజులుగా పోలీసులు సోదాలు చేసినప్పుడు బండి సంజయ్, భగీరథ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మైనర్ బాలిక విషయంలొ రాజకీయాలు చేయడం ఏంటి అని మండిపడ్డారు. -
HYD: మదీనాలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మదీనాలోని ఎస్వైజే వస్త్ర దుకాణంలో గురువారం ఉదయం మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి ఎనిమిది ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు చెలరేగిన కాంప్లెక్స్లో వందకు పైగా దుకాణాలు ఉండటంతో ఆందోళన నెలకొంది. -
ఇళ్లల్లో నివసించకున్నా.. తాళం వేసినా.. అద్దెకిచ్చిన చర్యలే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దురి్వనియోగంపై గృహనిర్మాణ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు నివసించకున్నా..ఏళ్లతరబడి తాళాలు వేసి ఉంచినా..ఇతరులకు అద్దెకిచి్చనా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ఇప్పటికే రెండుసార్లు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించని వారిపై తుది నోటీసుల అస్త్రం సిద్ధమైంది. చివరి గడువు ముగిసేలోపు వివరణ ఇచ్చి సదరు లబి్ధదారులు ఇళ్లలోకి చేరని పక్షంలో వారి కేటాయింపులను తక్షణమే రద్దు చేసి ఆ నివాసాలను స్వా«దీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ గృహాల తాళాలు తెరుచుకుని అసలైన నిరుపేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా గృహనిర్మాణ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రక్రియ సరికొత్త మలుపు తిరుగుతోంది గతంలో ఇదీ పరిస్థితి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాజెక్టులో భాగంగా..సుమారు 111 ప్రాంతాలలో 68,176 వేల పైచిలుకు గృహాల నిర్మాణాలు పూర్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 63,982 ఇళ్లను అధికారికంగా పంపిణీ చేసింది. ఇక గతంలో ఇతర శాఖల పరిధిలో ఉన్న డబుల్ ఇళ్ల ప్రాజెక్టులను ఇప్పుడు గృహనిర్మాణ శాఖ పరిధిలోకి మార్చారు. 19 వేల కుటుంబాలకు పైనే... గత ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఇటీవల గృహనిర్మాణ శాఖ దృష్టిసారించింది. నగర శివారులోని కొల్లూరులో సుమారు 15,660 ఇళ్లు ఉండగా..ఇక్కడ చాలా ఇళ్లకు తాళం వేసి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. కొన్నిచోట్ల కేటాయింపులు జరిగి రెండేళ్లవుతున్నా లబి్ధదారులెవరూ ఇళ్లల్లో చేరలేదు. వీటిని అన్ ఆక్యుపైడ్గా గుర్తించారు. రాంపల్లి, దుండిగల్, అహ్మద్గూడ, మాన్సాన్పల్లి, శంకర్పల్లి, నల్లగండ్ల, నార్సింగ్, అబ్దుల్లాపూర్మెట్ తదితర నివాస సముదాయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హౌసింగ్ శాఖ క్షేత్రస్థాయి భౌతిక సర్వే చేపట్టగా..సుమారు 19 వేల మంది లబి్ధదారులు కేటాయించిన ఇళ్లలో నివసించకుండా వాటికి తాళాలు వేసి ఉంచడం, ఇతరులకు అద్దెకు ఇచి్చనట్లు బహిర్గతమైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సదరు లబి్ధదారులకు కఠిన నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే వారికి రెండు నోటీసులు జారీ చేయగా, కొందరు స్పందించారు. మూడో నోటీసుకు స్పందించి ఇళ్లలో చేరని పక్షంలో ఆ కేటాయింపులు రద్దు చేసి ఇళ్లను స్వా«దీనం చేసుకోవాలని నిర్ణయించారు. -
Hyderabad: రూ.8 లక్షలిస్తేనే ఎస్ఐ పోస్టింగ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లోని ఓ ఖరీదైన పోలీసు కమిషనరేట్ పరిధి ఠాణాలో ఎస్ఐ పోస్టింగ్ కావాలంటే రూ.8 లక్షలు ఇవ్వాల్సిందే. ఓ జోన్ ఉన్నతాధికారి ఈ రేటు నిర్ణయించి పలువురు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ), సబ్ ఇన్స్పెక్టర్లు (ఎస్ఐ)లతో కలిసి డీల్స్ కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ కమిషనరేట్ నుంచి ఒకేసారి పెద్ద సంఖ్యలో ఇన్స్పెక్టర్ల బదిలీ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే కమిషనరేట్లో ప్రతి ఠాణా నుంచి ఇద్దరు ముగ్గురు ఎస్ఐలు ఇతర జోన్కు బదిలీ అయ్యారు. ఈ బదిలీల వెనుక ముడుపుల వ్యవహారం జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఇంటెలిజెన్స్ విభాగం అంతర్గత విచారణ చేపట్టి ముడుపుల వ్యవహారం నిజమేనని తేల్చింది. ఆయా పోలీసు అధికారుల లావాదేవీలు, ఇతరత్రా అంశాలను నిర్ధారించేందుకు ముడుపుల నివేదికను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి అందించినట్లు విశ్వసనీయ సమాచారం. ఫుల్ డిమాండ్.. ఈ ఖరీదైన జోన్లోని ఠాణా పోస్టులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ పోస్టింగ్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందనే భావన పలువురు పోలీసుల్లో ఏర్పడింది. దీంతో ఈ జోన్ లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ల కోసం నేతలు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈక్రమంలో ఓ డివిజన్లోని రెండు ఠాణాల ఎస్హెచ్ఓలు, మరో డివిజన్లోని ఒక ఎస్ఐ ఖరీదైన జోన్ ఉన్నతాధికారితో జట్టు కట్టారు. బదిలీ అయిన వారి స్థానంలో పోస్టుల కావాలనుకునే వారితో డీల్ కుదుర్చుకున్నారు. అయితే సదరు ఎస్ఐలు బదిలీ అయ్యారు గానీ వీరి స్థానంలో కొత్త వారికి పోస్టింగ్లు ఆగిపోయాయి. దీంతో ఈ కమిషనరేట్లోని అన్ని ఠాణాలలో ఎస్ఐల కొరత ఏర్పడింది. సెక్టార్ ఎస్ఐలు లేకపోవడంతో నేరస్తుల కదలికలపై నిఘా కొరవడడంతో పాటు కేసుల దర్యాప్తుపై ప్రభావం పడుతుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
‘కుర్చీతాత’ కాలా బాషా కన్నుమూత
శ్రీనగర్ కాలనీ (హైదరాబాద్): ప్రపంచవ్యాప్తంగా వైరలైన.. హీరో మహేష్బాబు సినిమా ‘గుంటూరు కారం’లోని ‘ఆ కుర్చీని మడతపెట్టి’పాటకు పరోక్షంగా కారణమైన కుర్చీ తాత అలియాస్ మహ్మద్ కాలా బాషా (66) బుధవారం మృతి చెందాడు. దీంతో సోషల్ మీడియా పలువురు నివాళులర్పిస్తున్నారు.ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో తమ కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంభాషణను వివరిస్తూ కుర్చీని మడత పెట్టి అనే పదం వాడాడు కాలా బాషా. అది అలా సోషల్ మీడియాలో విపరీతంగా వెళ్లింది. అనంతరం ‘గుంటూరు కారం’సినిమాలో ఆ పదంతో పాట వచ్చి సంచలనం సృష్టించింది. విదేశీయులు సైతం ఈ పాటకు స్టెప్స్ వేసేవరకు వెళ్లింది. బోరబండ పరిసర ప్రాంతంలో నివాసం ఉంటూ.. రోజూ యూసుఫ్గూడ, కృష్ణకాంత్పార్క్ పరిసరాల్లో తిరుగుతుండేవాడు. బస్సులు ఎక్కి ఇంగ్లీష్లో డబ్బులు అడుక్కునేవాడు. అలా ఓ ఇంటర్వ్యూలో కుర్చీని మడతబెట్టి ... డైలాగ్తో కాలా బాషా కుర్చీతాతగా ప్రాచుర్యం పొందాడు. సోషల్ మీడియాలో మీమ్గా వైరల్ కావడంతో పలువురు ఇంటర్వ్యూలు చేసేవారు. అలా సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోయాడు. బాషాకు మద్యం అలవాటు ఉంది. పలుసార్లు అనారోగ్యానికి గురయ్యాడు. ఇంతకు ముందు కూడా కాలా బాషా చనిపోయినట్లు ప్రచారం జరిగింది. అయితే వైజాగ్ సత్యలాంటి వాళ్లు అది ఫేక్ న్యూస్ అని తేల్చేశారు. ఎండ తీవ్రత తట్టుకోలేక బుధవారం సాయంత్రం కృష్టకాంత్ పార్క్ వద్ద స్పృ హ తప్పి పడిపోయాడు. అక్కడివారు గమనించి కుటుంబసభ్యులకు తెలియజేయగా ఇంటికి తీసుకెళ్లాక మృతి చెందాడు. -
అత్తాపూర్ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
-
"ఏవియేషన్ రంగానికి చిరునామాగా హైదరాబాద్"
సాక్షి, హైదరాబాద్: వైమానిక, అంతరిక్ష, రక్షణ, డీప్టెక్ రంగాల్లో హైదరాబాద్ వ్యూహాత్మక కేంద్రంగా ఎదుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు తెలిపారు. అమెరికా విమానయాన సంస్థ సౌత్వెస్ట్ హైదరాబాద్లో తన గ్లోబల్ ఇన్నొవేషన్ సెంటర్ (జీఐసీ)ని ఏర్పాటు చేయడం కూడా ఈ విషయాన్నే ధ్రువీకరిస్తోందని ఆయన అన్నారు.హైటెక్ సిటీ ప్రాంతంలో బుధవారం సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ జీఐసీ కేంద్రాన్ని ఆవిష్కరించిన మంత్రి మాట్లాడుతూ పాతికేళ్ల క్రితమే దేశంలోనే తొలి విమానాశ్రయ నిర్మాణానికి పీపీపీ మోడల్ను ఎంచుకోవడంతో హైదరాబాద్లో వైమానిక రంగానికి పునాది పడిందని తెలిపారు. డీఆర్డీవో, ఆర్సీఐ, డీఎంఆర్ఎల్ వంటి దిగ్గజ రక్షణ రంగ సంస్థలకు కేంద్రమైన హైదరాబాద్ అత్యాధునిక ఇంజినీరింగ్, సృజనలకు కేంద్రంగా అవతరిస్తోందని అన్నారు. గత ఏడాది కాలంలోనే అంతర్జాతీయ కంపెనీలు బోలెడు హైదరాబాద్లో తమ తొలి ఇన్నొవేషన్ సెంటర్ ఏర్పాటు చేశాయని అన్నారు.సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లారెన్ వుడ్స్ మాట్లాడుతూ... ‘‘ఇంజినీరింగ్, అనలిటిక్స్, ఇన్నొవేషన్లకు సంబంధించినంత వరకూ హైదరాబాద్లో అద్భుతమైన నైపుణ్యం అందుబాటులో ఉంది. అందుకే మేము మా తొలి ఇన్నొవేషన్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము’’ అని వ్యాఖ్యానించారు. ఏఐ, డేటా, నెక్స్ట్ జనరేషన్ ఇంజినీరింగ్లతోపాటు బిజినెస్ ఆపరేషన్లను కూడా ఈ కేంద్రం నుంచి నడపనున్నట్లు తెలిపారు.వెయ్యి మందికి కొలువులు...సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ జీఐసీలో ప్రస్తుతం 170 మంది పనిచేస్తూండగా.. దశలవారీగా వెయ్యి మంది వరకూ ఉద్యోగాలు పొందుతారని సంస్థ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లారెన్ వుడ్స్ ‘సాక్షి.కాం’కు తెలిపారు. ఈ కేంద్రంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారే ఉద్యోగాలు పొందుతారని, ప్రస్తుతానికి విదేశీయులను నియమించే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిసరాల్లోని యూనివర్శిటీలు, తెలంగాణ ప్రభుత్వ స్కిల్ వర్శిటీతోనూ కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ దాదాపు పదేళ్లుగా మెషీన్ లెర్నింగ్పై దృష్టి పెట్టిందని, సంస్థ కార్యకలాపాల నిర్వహణలో ప్రస్తుతం ఏఐ కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని తెలిపారు. హైదరాబాద్ జీఐసీ ద్వారా సమీప భవిష్యత్తులోనే మరిన్ని ఉపయోగకరమైన ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తామన్నారు.తొలి టికెటింగ్ మెషీన్ మాదే..సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో సృజనకు ఎప్పుడూ పెద్దపీట వేస్తామని, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమెటిక్ టికెటింగ్ మెషీన్ను వినియోగించిన సంస్థ తమదేనని కంపెనీ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఇన్నొవేషన్ హెడ్ (ఇండియా) కల్లెపల్లి కృష్ణ తెలిపారు. 1971లో ఈ టికెటింగ్ మెషీన్ను ప్రారంభిస్తే 1994లోనే అత్యాధునిక రిజర్వేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్తర అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ భవిష్యత్తులో భారత్లోనూ ఎగిరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేధ అనేది ప్రస్తుతం ఏ కంపెనీకైనా ఇతర కంపెనీలపై అడ్వాంటేజ్ ఇచ్చేదేనని, అందుకే సౌత్వెస్ట్ కూడా ఈ రంగంలో తగిన చర్యలు తీసుకుంటోందని వివరించారు. -
సిమ్ కార్డ్ కోసం బయోమెట్రిక్ ఇస్తున్నారా? రూ.101.87 కోట్ల మోసం
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్న ఘోస్ట్ సిమ్ కార్డుల నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ సిటీ పోలీసు సైబర్ క్రైమ్ విభాగం ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’ను నిర్వహించింది. గతంలో మ్యూల్ ఖాతాదారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 1.0, నేరాలకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించగా.. తాజాగా సైబర్ నేరాలకు వెన్నెముకగా నిలుస్తున్న ‘ఘోస్ట్ సిమ్’ వ్యవస్థపై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’తో ఉక్కుపాదం మోపింది.హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించిన 1194 ఘోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా 18 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు దాడులు నిర్వహించాయి. ఈ క్రమంలో మొత్తం 66 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తంగా 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 432 సీల్డ్ సిమ్ లు ఉండగా.. 112 ఓపెన్డ్ సిమ్ లు ఉన్నాయి. వీరిలో 44 మంది ఘోస్ట్ సిమ్ కార్డుల వినియోగదారులు, 20 మంది పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు లేదా టెలికాం ప్రమోటర్లు, ఇద్దరు సిమ్ కార్డుల సరఫరాదారులు ఉన్నారు. వీరంతా కలిపి దేశవ్యాప్తంగా నమోదైన 76 సైబర్ నేరాల్లో భాగస్వాములైనట్లు తేలింది. ఈ నేరాలకు సంబంధించిన మొత్తం మోసం విలువ రూ.101.87 కోట్లు.టెలికాం నెట్వర్క్ వారీగా పరిశీలిస్తే.. అరెస్టయిన పీఓఎస్ ఏజెంట్లలో వొడాఫోన్ ఐడియాకు చెందిన వారు 10 మంది, ఎయిర్టెల్కు చెందిన వారు ఏడుగురు, జియోకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి.ఈ కేసుల విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వినియోగదారులు కొత్త సిమ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్ నంబర్ పొర్టబిలిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు, వారికి తెలియకుండానే అదనపు సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్నారు. కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ తీసుకునే క్రమంలో.. 'నెట్వర్క్ సరిగా లేదు', 'సర్వర్ డౌన్ అయ్యింది', 'వేలిముద్ర సరిగా పడలేదు' అంటూ ఏజెంట్లు నమ్మబలికి.. రెండు, మూడు బయోమెట్రిక్ ను తీసుకుంటున్నారు.మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఏకంగా ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి.. నిరక్షరాస్యులు, నిరుపేదలను లక్ష్యంగా చేసుకుని వారి ఆధార్ బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఇంటర్ నెట్ ను ఉచితంగా ఇస్తామంటూ ఆశచూపి అమాయకుల పేర్ల మీద సిమ్ కార్డులు సృష్టిస్తున్నారు. తమకు ఎన్ని సిమ్ లు అమ్మితే అంత కమిషన్ తో పాటు సైబర్ నేరగాళ్ల నుంచి డబ్బులు కూడా వస్తుండటంతో ఈ దందా చేస్తున్నారు.ఇలా అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు భౌతికంగా విదేశాలకు తరలించాల్సిన అవసరం లేకుండానే.. అత్యంత ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సాధారణ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసిన వెంటనే, వాటిని ఇ-సిమ్ (e-SIM)లుగా మారుస్తున్నారు. విదేశాల్లో కూర్చున్న ప్రధాన సైబర్ ముఠాలకు క్షణాల్లో చేరవేస్తున్నారు. తద్వారా ఆయా దేశాల్లో ఉండే ముఠాలు ఎలాంటి భౌతిక సిమ్ కార్డు లేకుండానే, మన దేశపు మొబైల్ నంబర్లను తమ ఫోన్లలో స్వేచ్ఛగా వాడుకుంటున్నారు.ఈ ఇండియన్ నంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరవడంతో పాటు.. మ్యాట్రిమోనియల్ సైట్లు, ప్రముఖ డేటింగ్ యాప్స్లో అత్యంత ఆకర్షణీయమైన నకిలీ ప్రొఫైల్స్ సృష్టిస్తారు. అమాయకులకు సైబర్ వల వేస్తారు. వారి నుంచి లక్షలాది రూపాయలు, ఒక్కోసారి కోట్లాది రూపాయలు కొల్లగొడుతారు. కొన్ని సందర్భాల్లో న్యూడ్ వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేసే 'సెక్స్టార్షన్' ముఠాలు, సీబీఐ పోలీసులమంటూ భయపెట్టే 'డిజిటల్ అరెస్ట్' ముఠాలు సైతం ఈ నంబర్లనే వాడుతున్నాయి. నంబర్ మన దేశానిదే కావడంతో బాధితులు సులభంగా నమ్మి మోసపోతున్నారు.ఇదంతా ఒక పక్కా వ్యూహంతో జరుగుతుంది. తమ టార్గెట్ మేరకు వేలాది సిమ్ కార్డుల యాక్టివేషన్ ప్రక్రియ పూర్తికాగానే, ఆ సిమ్ కార్డులను జారీ చేసిన లోకల్ ఏజెంట్లు రాత్రికి రాత్రే తమ దుకాణాలు మూసేసి బోర్డులు తిప్పేస్తున్నారు. ఈ సైబర్ నెట్వర్క్ను ఛేధించడంలో సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, ఏసీపీ శివ మారుతి, వారి ప్రత్యేక బృందాలు ఎంతో కృషి చేశాయి. కాగా,'ఘోస్ట్ సిమ్' నెట్వర్క్ వ్యవహారాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్ గా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్టెల్, జియో, వోడాఫోన్-ఐడియా వంటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ఉన్నతాధికారులతో సమావేశం కావాలని నిర్ణయించింది.అలాగే, డీవోటీ, ట్రాయ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను సంప్రదించి.. నిబంధనల్లోని లోపాలను సరిదిద్దాలని, కేవైసీ ప్రక్రియను మరింత కఠినతరం చేయాలని కోరనుంది. 'మ్యూల్ అకౌంట్స్' సమస్యను అరికట్టడానికి బ్యాంకుల నుంచి ఎలాగైతే పరిష్కారాలను కోరడం జరిగిందో.. ఇప్పుడు టెలికాం సంస్థల నుంచి కూడా 'ఘోస్ట్ సిమ్' సమస్యను నియంత్రించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని వారికి చెప్పనుంది.ముఖ్యంగా పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ఏజెంట్లపై నిఘాను పెంచడం, వారి బాధ్యతను నిర్ణయించే ఫ్రేమ్వర్క్ను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త సిమ్ కార్డుల జారీ, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) ప్రక్రియలో తప్పనిసరిగా రియల్-టైమ్ వెరిఫికేషన్ చేయాలి. సైబర్ నేరాల్లో గుర్తించిన సిమ్ కార్డులను వెంటనే డీయాక్టివేట్ చేయాలి. నిబంధనలు పాటించని PoS ఏజెంట్లను, డిస్ట్రిబ్యూటర్లను అన్ని టెలికాం నెట్వర్క్ల నుంచి బ్లాక్లిస్ట్ చేయాలి.ఎక్కువ సంఖ్యలో సిమ్ కార్డులు జారీ అవుతున్న తీరును గుర్తించేందుకు అధునాతన సాంకేతికతను ఉపయోగించాలి. కేవైసీ చేసే సమయంలో 'మ్యూల్ హంటర్ డేటా', I4C అనుమానితుల డేటాబేస్తో అనుసంధానం చేసి తనిఖీలు చేయాలి. టెలికాం సంస్థలు, పోలీసుల మధ్య డేటా షేరింగ్ కోసం ఒక క్రమబద్ధమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది.ప్రజలు ఆధార్ వివరాలు, బయోమెట్రిక్ సమాచారం, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దు. సిమ్ కార్డులు తీసుకునే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటూ, కేవలం అధీకృత డీలర్ల వద్దే వాటిని కొనుగోలు చేయాలి.మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్గా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ పోర్టల్ https://tafcop.sancharsaathi.gov.in ద్వారా వెంటనే చెక్ చేసుకోండి. ఈ 'సంచార్ సాథీ' పోర్టల్ను క్రమంతప్పకుండా తనిఖీ చేస్తూ, మీకు తెలియకుండా ఎవరైనా మీ నంబర్ను వాడుతుంటే వెంటనే అందులోనే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి.ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే.. ఆ మొదటి గంట గోల్డెన్ అవర్ అత్యంత కీలకం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, కంగారు పడకుండా.. వెంటనే 1930 టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. హైదరాబాద్ సిటీ పోలీస్ అందిస్తున్న 'సి-మిత్ర' సేవలను కూడా సద్వినియోగం చేసుకోండి. -
ఈవీలకు మారే ఉద్యోగులకు హైదరాబాద్ ఐటీ కంపెనీ ఆఫర్
ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు , హైదరాబాద్కు చెందిన టెక్ సంస్థ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసే తమ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది.ఈవీ కార్లు కొనుగోలు చేసే ఉద్యోగులకు రూ.10 వేల ప్రోత్సాహకం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి రూ.5 వేల ప్రోత్సాహకం అందజేస్తామని ఆ కంపెనీ సీఈఓ ఫణిరాజ్ జలిగామ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో పర్యావరణ హితమైన ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.ఇటీవల ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయని, దాంతో ప్రధాన మంత్రి కార్ పూలింగ్ను ప్రోత్సహించడంతో పాటు పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఈవీలకు మారాలని, ప్రజా రవాణా వ్యవస్థను విస్త్రృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారని ఫణిరాజ్ తెలిపారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా దేశ విదేశీ మారక నిల్వలను ఆదా చేయవచ్చన్నారు.ప్రధాని విజన్కు అనుగుణంగా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలో ‘గ్రీన్ పాలసీ’ /‘ఈవీ పాలసీ’ను అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఉద్యోగులు స్వచ్ఛమైన, ఇంధన పొదుపు కలిగిన రవాణా మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. -
అత్తాపూర్ కిడ్నాప్ కేసు.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. మలక్పేటలోని ఓ ఇంట్లో ఆ యువతి సేఫ్గా ఉన్నట్లు గుర్తించారు. యువతి ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసి గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా నిన్న అత్తాపూర్లో అర్ధరాత్రి యువతిని కిడ్నాప్ చేశారు. మహేంద్రా థార్లో వచ్చిన నలుగురు యువతిని బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు..వారి నుంచి తప్పించుకునేందుకు మొదట యువతి ఆస్పత్రిలోకి పరిగెత్తినప్పటీకీ యువకులు ఆమెను బెదిరించి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.ఇది గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించే ప్రయత్నం చేశారు. అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు పోలీసులు కారును చేజ్ చేశారు. కానీ పోలీసుల కళ్లుగప్పి కిడ్నాపర్లు పారిపోయారు.ఈ నేపథ్యంలోనే ఆమె ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసినట్లు పేర్కొన్నారు. యువతి క్షేమంగా ఉండడంతో ఆమె కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. -
బండి భగీరథ్ కేసుపై స్పందించిన బండి సంజయ్
సాక్షి,హైదరాబాద్: తాను కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు వస్తున్న వార్తల్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బండి భగీరథ్ కేసు వివాదం తర్వాత తొలిసారి తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీని నడిపిస్తున్నారు. నేనేంటో ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలు నాకు లేవు. ఎవరెవరో ఏదో రాస్తారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బండి భగీరథ్ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఏదైనా సందర్భంగా కొడుకును తండ్రి పోలీసులకు అప్పగించిన సందర్భం ఏదైనా ఉందా?. విచారణ నిమిత్తం నేనే స్వయంగా భగీరథ్ను పోలీసులకు అప్పగించా’నని వ్యాఖ్యానించారు. -
ఆధారాలు మాయం చేసిన బండి భగీరథ్?
సాక్షి, హైదరాబాద్: బండి సాయి భగీరథ్ పక్కా పథకం ప్రకారమే పోలీసులకు చిక్కాడని కేసు దర్యాప్తులో పాల్గొన్న కీలక పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. విచారణలో ఆధారాలు దొరకకుండా చేయాల్సిన పనులన్నీ పరారీలో ఉండగానే పూర్తి చేసిన తర్వాతే పోలీసుల అదుపులోకి వచ్చాడని చెప్పారు. ఈనెల 16న భగీరథ్ను అరెస్టు చేసిన తర్వాత నిందితుడిని పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు. ఠాణాలో రెండున్నర గంటలపాటు కేసు పర్యవేక్షణాధికారిణి రితిరాజ్ నిందితుడిని సుదీర్ఘంగా విచారించా రు. అయితే విచారణ సమయంలో భగీరథ్ పోలీసులకు ఖాళీ సెల్ఫోన్ మాత్రమే అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఫోన్లో సిమ్ లేదని, ఎక్కడుందని విచారణాధికారి నిందితుడిని ప్రశ్ని ంచగా.. సిమ్ కార్డ్ ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్పినట్లు తెలిసింది. విచారణాధికారులు న్యా యనిపుణులతో చర్చించిన అనంతరం పోక్సో కేసులో కీలకమైన సాక్ష్యాధారాలు ధ్వంసం చేశాడని గుర్తించి, భగీరథ్పై కొత్తగా ‘ఆధారాలు మాయం’సెక్షన్ను జోడించారు. ఈ మేరకు ఛార్జ్ షీట్లో భగీరథ్పై బీఎన్ఎస్ చట్టం సెక్షన్ 238ను జోడించారు. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని వారం రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు మేడ్చల్ న్యాయస్థానంలో కస్టడీ పిటీషన్ను దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకొని నార్సింగిలోని సర్వీస్ అపార్ట్మెంట్, మెయిన్బాద్ ఫామ్హౌస్, పరిసర ప్రాంతాలలో సీన్ రీకన్స్ట్రక్షన్స్ చేయాలని పోలీసులు నిర్ణయించారు. -
లక్ష్మీకుమార్ నివాసంలో గుట్టలుగా నోట్ల కట్టలు, భారీగా బంగారం!
మల్లాపూర్/నాంపల్లి: హైదరాబాద్ జలమండలిలో ఓ భారీ అవినీతి జలగ ఏసీబీకి చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ సంస్థ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) రెడ్హిల్స్ డివిజన్ జనరల్ మేనేజర్ సగ్గం అనంత లక్ష్మీకుమార్ (58) నివాసం సహా బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర సహచరులకు చెందిన 8 ప్రదేశాల్లో ఏసీబీ డీఎస్పీ మజీత్ అలీఖాన్ ఆధ్వర్యంలో 16 గంటలపాటు సోదాలు జరిగా యి. హైదరాబాద్ మల్లాపూర్లోని వెంకటరమణ కాలనీలో ఉన్న అనంత లక్ష్మీకుమార్ నివాసంలో చేపట్టిన తనిఖీల్లో కళ్లు చెదిరే స్థాయిలో ఏకంగా రూ. 1.10 కోట్ల నగదు, 2.1 కేజీల బంగారం, 9.2 కేజీల వెండి లభ్యమైంది. అలాగే నిజామాబాద్, సంగారెడ్డిలో 18 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఇళ్లు, మారుతీ కారు, బజాజ్ మోటార్ బైక్ సహా మొత్తం రూ. 5.88 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అనంత లక్ష్మీకుమార్ భార్య రాధమ్మ పేరిట మూడు బ్యాంకు లాకర్లలో భద్రపర్చిన ఆభరణాలు, ఇళ్ల పత్రాలను కూడా ఏసీబీ అధికారులు తెరిపించి స్వా«దీనం చేసుకున్నారు. రెడ్హిల్స్లోని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించి కొన్ని రికార్డులను తీసుకెళ్లారు. ఆయా ఆస్తుల మార్కెట్ విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అధికారులు తెలిపారు. అనంత లక్ష్మీకుమార్పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన్ను బంజారాహిల్స్లోని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ)కు తరలించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాధు చేయాలని సూచించారు. ఫిర్యాధుల వివరాలు పూర్తింగా గోప్యంగా ఉంచుతామన్నారు. కాగా, నోట్ల కట్టలను లెక్కించేందుకు తీసుకొచ్చిన కౌంటింగ్ మెషీన్లు కాసేపు మొరాయించాయి. సోదాల్లో 15 మంది అధికారులు పాల్గొన్నారు. ఉలిక్కిపడిన మల్లాపూర్...: మల్లాపూర్ వెంకరమణ కాలనీలో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నట్లు టీవీల్లో చూసి ఉలిక్కిపడిన స్థానికులు.. ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి అనంత లక్ష్మీకుమార్ నివాసం వద్ద గుమిగూడారు. గత నెలలో చిన్న కుమార్తె వివాహాన్ని ఆయన ఆరంఘర్ సమీపంలో అంగరంగ వైభవంగా చేశారని చర్చించుకున్నారు. -
స్పా సెంటర్లో భార్యను చంపిన భర్త..!
హైదరాబాద్: కుటుంబ కలహాలతో పాటు అనుమానంతో భార్యను కత్తితో పొడిచి చంపాడు భర్త. ఈ ఘటన మంగళవారం గాం«దీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, ఎస్ఐ నర్సింహ, బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం. ఆటో డ్రైవర్ రాజు, బంగి దేబోరా (25) 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. బహదూర్పురా కిషన్బాగ్ ఎంఎన్ గూడెంలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కవాడిగూడ ప్రధాన రహదారిలోని ఓ సూపర్ మార్కెట్ 4వ అంతస్తులోని స్పా సెంటర్లో దేబోరా బ్యూటీషియన్గా పని చేస్తోంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. పెద్ద మనుషులు సర్ది చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వీరు ఎంఎన్ గూడెంలో వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే భర్త వేధింపులు ఎక్కువయ్యాయంటూ రాజుపై దేబోరా అత్తాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం కేసు పెట్టింది. అప్పటి నుంచి రాజు కక్ష పెంచుకుని ఆమెను అంతమొందించేందుకు సమయం కోసం వేచి చూస్తున్నాడు. మంగళవారం ఉదయం దేబోరా విధుల్లో భాగంగా ఆటోలో కవాడిగూడలోని స్పా సెంటర్కు చేరుకుంది. ఆమెను వెంబడించిన రాజు కవాడిగూడకు చేరుకున్నాడు. ఆమె లిఫ్టులోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చాడు. వీరిద్దరూ లిప్టులోనే గొడవ పడుతూ 4వ అంతస్తుకు చేరుకున్నారు. ఆగ్రహానికి గురైన నిందితుడు వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె శరీరంపై అనేక చోట్ల పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో దేబోరా మృతి చెందింది. నిందితుడు రాజు అత్తాపూర్ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. రాజును కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
మహిళ వెనుక వెళ్లి.. డ్రెస్ను పైకెత్తి
హైదరాబాద్: ఇటీవల నార్సింగి సైకిల్ ట్రాక్లో జాగింగ్ చేస్తున్న యువతిని చూస్తూ ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించడం మరచిపోకముందే అలాంటిదే మరో ఘటన నెక్నాంపూర్ డివిజన్ అలకాపూర్ టౌన్షిప్లో చోటుచేసుకుంది. ఈ నెల 14వ తేదీన జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, నార్సింగి ఎస్ఐ సరిత తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ రోడ్ నం. 4లో మధ్యాహ్నం వేళ కూతురును ఎత్తుకుని వెళ్తోంది. ఓ యువకుడు నక్కినక్కి వచ్చి వెనకనుంచి మహిళ డ్రెస్ను పైకెత్తాడు. అకస్మాత్తు పరిణామంతో నివ్వెరపోయిన మహిళ గట్టిగా అరిచింది. దీంతో నిందితుడు పారిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డైంది. కొందరు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలైంది. విషయం పోలీసులకు చేరడంతో బాధిత మహిళను గుర్తించి ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఇలాంటివి జరగకుండా పోలీసులు గస్తీ పెంచాలని, కాలనీల్లో సీసీ కెమెరాలన్నింటినీ పనిచేసేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.చిల్లర నా కొడుకులు ఎక్కువైపోయారు 💦ఏం బ్రతుకులు రా మీవి ముండల్లారThis incident happened in Manikonda on 14 may afternoon pic.twitter.com/kcvlzogBme— Prudvi Kumar (@Prudvikumar_54) May 19, 2026 -
వీడు మామూలోడు కాదు.. తొవ్వేకొద్ది గోల్డ్, ఆస్తులు
-
అషు రెడ్డి కేసులో విచారణ వేగం బ్రేకప్ అంశంపై కీలక కామెంట్స్
-
భారీ అక్రమ ఆస్తులు.. జలమండలి జీఎం అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: జలమండలి జీఎం అనంతకుమార్ అరెస్ట్ అయ్యారు. అనంతకుమార్ వద్ద భారీ అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. సుదీర్ఘ సోదాల అనంతరం అరెస్ట్ చేశారు. సుమారు 15 గంటలపాటు అనంతకుమర్ నివాసంలో తనిఖీలు నిర్వహించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారుప.ఈ తనిఖీల్లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిజామాబాద్, సంగారెడ్డిలో 18 ఎకరాల భూమి, 6 ఓపెన్ ప్లాట్లు, 3 ఫ్లాట్లు ఉన్నట్లు బయటపడింది. జీఎం కుమార్కు చెందిన బ్యాంక్ లాకర్లు కూడా తెరిచి తనిఖీ చేశారు. సోదాలు మరికొన్ని గంటలు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ రోజు మంగళవారం ఏసీబీ అధికారులు హైదరాబాద్ జలమండలి జీఎం అనంతకుమార్ ఇంట్లో సోదాలు ప్రారంభించారు. ప్రారంభ సమయంలో తనిఖీల్లో రూ.కోటి ఐదు లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కిలోకు పైగా బంగారం, నిజామాబాద్లో మూడు ఎకరాల భూమి, ఇతర స్థిరాస్తులు ఉన్నట్లు తేలింది. వీటన్నిటి విలువ దాదాపు రూ.100 కోట్లుగా భావిస్తున్నారు. అదే విధంగా అనంతకుమార్ బ్యాంక్ లాకర్లు కూడా తెరిచి తనిఖీ చేయాలని అధికారులు నిర్ణయించారు. జీఎంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు జరిపారు. రెడ్ హిల్స్లోని జీఎం నివాసంతో పాటు మల్లాపూర్లోని నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. -
పిల్లలు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు : జ్ఞానేశ్వర్ ముదిరాజ్
హైదరాబాద్ : నేటి తరం పిల్లలు మొబైల్ ఫోన్లు, ట్యాబ్లకు అతిగా అలవాటు పడుతున్నారని తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. సన్ సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన “గ్యాలివెంట్ సన్ సిటీ గేమింగ్ జోన్” ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలలో బిజీగా ఉండటం వల్ల పిల్లలతో సమయం గడపలేకపోతున్నారని తెలిపారు. దీంతో పిల్లలు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లకు బానిసలవుతూ పలు మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.పిల్లలలో మానసిక వికాసం, శారీరక దృఢత్వం పెంపొందించేందుకు ఎడ్యుకేషన్ మరియు ఎంటర్టైన్మెంట్ కలగలిపిన గేమింగ్ జోన్లు ఎంతో అవసరమని అన్నారు. ఇలాంటి ఆధునిక గేమింగ్ కేంద్రాలు నగరంలో మరిన్ని ఏర్పడాలని ఆకాంక్షించారు. శారీరక క్రీడలు పిల్లలను ఉల్లాసంగా ఉంచడమే కాకుండా చదువుల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయని తెలిపారు.గ్యాలివెంట్ సన్ సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, తమ కేంద్రంలో ఆర్కేడ్ గేమ్స్, బౌలింగ్, సిమ్యులేటర్ క్రికెట్, వర్చువల్ గేమ్స్తో పాటు 40కి పైగా వినోదాత్మక గేమ్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్(సాక్ ఐ) పేరుతో సరికొత్త కృత్రిమ మేధ ఆధారిత అప్లికేషన్ను ప్రారంభించింది. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఆన్లైన్ వేదికలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని పసిగట్టడంతో పాటు, అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు ఈ అత్యాధునిక వ్యవస్థను హైదరాబాద్ పోలీస్ ఐటీ విభాగం రూపొందించింది.గతంలో సోషల్ మీడియా పర్యవేక్షణకు భారీగా సిబ్బంది అవసరమవ్వడమే కాకుండా గంటల తరబడి మాన్యువల్గా శ్రమించాల్సి వచ్చేది. కానీ ఈ 'సాక్ ఐ' ద్వారా ఇకపై అన్నీ ఆటోమేటెడ్ పద్ధతిలో నిరంతరాయంగా జరుగుతాయి. దీనిలోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ డ్యాష్బోర్డ్ ద్వారా డయల్ 100 కాల్స్, అంతర్గత నిఘా సమాచారం, నగరంలో జరుగుతున్న ప్రధాన ఘటనల వివరాలను ఒకే చోట క్రోడీకరించి అధికారులకు పూర్తి స్థాయి క్షేత్రస్థాయి అవగాహన కల్పిస్తుంది.సాక్ ఐ తన ప్రయోగాత్మక దశలోనే అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పురానాపూల్ ఎక్స్ రోడ్ ఘటనకు సంబంధించి 85 ద్వేషపూరిత, మతపరమైన సున్నితమైన అంశాలను, అలాగే గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించి పలు సోషల్ మీడియా ఖాతాలలో ఉన్న 126 పోస్ట్లను ఇది గుర్తించింది. ఇటువంటి కంటెంట్ను సకాలంలో తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టడం ద్వారా శాంతి సామరస్యాలను కాపాడటమే కాకుండా, విద్వేషాలను రేకెత్తించే వారిని గుర్తించడం సాధ్యమైంది.ప్రత్యేకించి మాదకద్రవ్యాల సరఫరా, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ వ్యవస్థ దృష్టి పెడుతుంది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్ వంటి అంశాలను ఏఐ మోడల్స్ స్వయంగా గుర్తించి అప్రమత్తం చేస్తాయి. పోస్టుల తీవ్రతను బట్టి వాటిని హై, మీడియం, లో రిస్క్ కేటగిరీలుగా విభజించి, అభ్యంతరకర పోస్టులను తొలగించేలా సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు నివేదిస్తుంది.నేరగాళ్ల నెట్వర్క్ విశ్లేషణ చేసే సామర్థ్యం ఈ అప్లికేషన్ ప్రత్యేకత కావడంతో, వివాదాస్పద పోస్టులను పదేపదే షేర్ చేసే వారిని, వాటిని వైరల్ చేసే ఖాతాలను ఇట్టే పట్టేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా ఇది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.ప్రతి ఫిర్యాదుకు ఒక యూనిక్ ట్రాకింగ్ నంబర్ కేటాయించి, అది పరిష్కారమయ్యే వరకు ఎండ్-టు-ఎండ్ మానిటరింగ్ చేస్తుంది. నగరంలో ప్రతిరోజూ జరిగే నిరసనలు, ర్యాలీలు, మతపరమైన ఊరేగింపుల వంటి కార్యక్రమాలపై ముందస్తు నిఘా ఉంచేందుకు 'ఈవెంట్ బేస్డ్ మానిటరింగ్' ఫీచర్ను ఇందులో పొందుపరిచారు. నిర్ణీత కీవర్డ్స్ ఆధారంగా సోషల్ మీడియా కార్యకలాపాలను ట్రాక్ చేస్తూ, ఏదైనా ముప్పు పొంచి ఉంటే వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది.అలాగే నేర పరిశోధనలో కీలకంగా మారిన SOCMINT, OSINT వంటి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఇందులో అంతర్భాగంగా ఉండటంతో సైబర్ కేసుల ఛేదన సులభతరం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రొఫైల్స్ మరియు కీవర్డ్స్ ఆధారంగా సెర్చ్ చేసే సామర్థ్యం ఉన్న గ్లోబల్ సెర్చ్ ఇంజిన్ ద్వారా ఏదైనా అంశంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను, వస్తున్న కథనాలను తక్షణమే విశ్లేషించే వీలు కలుగుతుంది.అత్యాధునిక ఏఐ సాంకేతికతతో కూడిన ఈ 'సాక్ ఐ' వ్యవస్థ పోలీసుల పనిభారాన్ని తగ్గించడమే కాకుండా, నేర నివారణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. "సమాజంలో అశాంతిని రేకెత్తించే శక్తుల ఆటకట్టించేందుకు, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ ఏఐ వ్యవస్థను రూపొందించాం. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరగాళ్లు సామాజిక మాధ్యమాలను అస్త్రంగా చేసుకుంటున్న తరుణంలో, అత్యాధునిక సాంకేతికతతో వారిని సమర్థంగా ఎదుర్కొంటాం" అని ఆయన స్పష్టం చేశారు. -
తెలంగాణలో భానుడి భగభగలు.. ప్రజలకు బిగ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న వారం రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కానున్నట్లు వాతావరణ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ అధికంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో చాలాచోట్ల 45 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్ర తలు నమోదు కావొచ్చని హెచ్చరిం చింది.ఆదివారం రాష్ట్రంలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వాతావరణ శాఖ వివరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఆదిలాబాద్లో గరిష్ట ఉష్ణో గ్రత 44.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 24.6 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది.ఈ సందర్భంగా వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. వడగాడ్పులు ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశమున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. సాధారణంగా తీసుకునే జాగ్రత్తలే కాకుండా అత్య వసరమైతే తప్ప మండే ఎండల్లో (మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు) అసలు బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. మండుటెండల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయట తిరిగితే వాంతులు, వికారంతో పాటు శరీరం పొడిగా, ఎర్రబారే అవకాశముందని పేర్కొంది. అంతేకాకుండా తీవ్ర తలనొప్పి, ఆందోళన, తలతిరగడం, స్పృహ కోల్పోయే అవకాశమూ ఉందని.. కండరాలు బలహీనపడి తిమ్మిర్లు రావచ్చని వివరించింది. కొన్నిసార్లు కోమాలోకి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తాయని హెచ్చరించింది. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే తగిన వైద్య సహాయం తీసుకోవాలని స్పష్టంచేసింది. -
మొయినాబాద్ జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి,హైదరాబాద్: మొయినాబాద్ జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన మొత్తం ఎనిమిది మంది చంపేందుకు నిందితురాలు కరీమాబేగం, ఆమె భర్త రెహమాన్ ప్లాన్ చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.తాండూరు ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే కరీమాబేగం, రెహమాన్ దంపతులు ఆబేదాబేగం, మహబూబాబీ అనే ఇద్దరు మహిళల వద్ద కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారు. అప్పు తీసుకున్న తర్వాత నెలలు గడుస్తున్నా కరీమాబేగం దంపతుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలో వారిపై మహిళలిద్దరూ ఒత్తిడి చేశారు. దీంతో వారిని చంపేయాలని కరీమాబేగం, రెహమాన్ కుట్ర చేశారు. కుట్రలో భాగంగా అప్పు ఇస్తానంటూ మొయినాబాద్ సమీపంలోని తోల్కట్ట ఫాంహౌస్ వద్దకు రావాలని సమాచారం అందించారు. అలా వచ్చిన బాధితుల్ని వేర్వేరు సమయాల్లో గొంతు నులిమి హత్య చేశారు. అక్కడే గొయ్యి తీసి మృత దేహాల్ని పూడ్చిపెట్టారు.మిస్సింగ్ కంప్లయింట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు జంట హత్యకేసును ఛేదించారు. తాజాగా పోలీసుల దర్యాప్తులో నిందితులు అప్పు తీసుకున్న ఆరుగురిని హతమార్చేందుకు ఫామ్ హౌస్కు పిలిపించుకున్నారని, అప్పు ఇస్తానని చెప్పి ప్రాణం తీసేందుకు ప్రయత్నించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
చిన్నారిపై నుంచి వెళ్లిన థార్.. షాకింగ్ వీడియో
-
మనవడు ఇక లేడని తెలిసి కూడా..
2007 మే 18... శుక్రవారం... మండు వేసవి... మిట్ట మధ్యాహ్నం... పవిత్ర ప్రార్థనలు జరుగుతుండగా 1.25 గంటలకు బాంబు పేలింది. ఈ ఘాతుకంలో తొమ్మిది మంది ప్రాణాలు విడువగా... పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఆ క్షణం అప్రమత్తమైన పోలీసులు ఎండలో కొన్ని గంటల పాటు డ్యూటీ చేస్తూనే ఉన్నారు. మొఘల్పుర ప్రాంతంలోని ఓ ఇంటి యజమాని తన వీధిలో విధుల్లో ఉన్న పోలీసులను చూసి లోపలకు ఆహ్వానించారు. వారికి సపర్యలు చేస్తుండగానే ఫోన్ ద్వారా పిడుగులాంటి వార్త ఆ వృద్ధుడికి చేరింది. అదే పోలీసుల కాల్పుల్లో తన మనుమడు చనిపోవడం... అయినప్పటికీ తన సాంప్రదాయాలను, అతిథి మర్యాదల్నీ మర్చిపోని ఆ పెద్దాయన అన్న మాటల్ని అక్కడ ఉన్న పోలీసులు ఇప్పటికీ తలచుకుంటున్నారు. ‘మక్కా’ పేలుళ్లు జరిగిన 19 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఆ విషయాలను ఓ ఉన్నతాధికారి ‘సాక్షి ప్రతినిధి’తో పంచుకున్నారు. ఆ వివరాలివి...హైదరాబాద్ పాతబస్తీలోని మక్కా మసీదులో ఉగ్రవాదులు రెండు బాంబుల్ని పెట్టారు. మధ్యాహ్న ప్రార్థనలు జరుగుతుండగా ఓ బాంబు పేలింది. దాన్ని ముష్కరులు అక్కడ ఉన్న మందపాటి సప్టా కింద పెట్టడంతో బ్లాస్ట్ ఇంపాక్ట్ తగ్గింది. ఫలితంగా పెను ప్రాణనష్టం తప్పి ఘటనాస్థలంలోనే ఐదుగురు మరణించగా... మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అదనంగా మరో 58 మంది క్షతగాత్రులయ్యారు. ఈ విషయం దేశ వ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. మక్కా మసీదులో బాంబు పేలిందని, ఆ ప్రభావానికి మసీదు మొత్తం కూలిపోయిందని పుకార్లు షికారు చేశాయి. దీంతో రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తన మక్కా మసీదు వద్దకు చేరుకున్నారు.అప్పటికే ఉన్నతాధికారులు భారీ భద్రత ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కొంత సమయంలోనే పెద్ద సంఖ్యలో బలగాలు పాతబస్తీని... నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. మక్కా మసీదు వద్దకు మరింత మంది ఆందోళన చేస్తూ వస్తుండటంతో పాటు రాళ్ల దాడులు మొదలయ్యాయి. దీంతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం తప్పలేదు. దీంతో పోలీసులకు–స్థానికులకు–మసీదు వద్దకు వచ్చే వారికి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే సమయంలో మొఘల్పుర వైపు కొందరు ఆందోళనకారులు దూసుకువస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.అక్కడి పరిస్థితులు, వాళ్ల చేతిలో ఉన్న వస్తువుల ఆధారంగా ఏదో జరగరానిది జరుగుతుందనే ఆందోళన అధికారులు, సిబ్బందిలో వ్యక్తమైంది. ఆ ఆందోళనకారులను అదుపు చేస్తుండగా... సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్కు నిప్పు పెట్టాలనే ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. అదే జరిగితే ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న పోలీసులు, ప్రజలు వందల సంఖ్యలో చనిపోతారని పోలీసులు భయపడ్డారు. పాతబస్తీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అప్పటికే అనేక మంది తమ ఇళ్లకు చేరారు. అలాంటప్పుడు పెట్రోల్ బంక్పై దాడి చేసే ఆందోళనకారులు దానికి నిప్పు పెడితే ఊహించని ఉపద్రవం తప్పదని నిర్థారించిన పోలీసులు అనివార్యంగా కాల్పులు జరపాల్సి వచ్చింది. అలా అల్లర్లను అదుపు చేయడానికి జరిగిన పోలీసు కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు. అదే రోజు మక్కా మసీదు నుంచి పేలకుండా ఉన్న మరో బాంబునూ స్వాధీనం చేసుకున్నారు.అలా అల్లర్లు, ఉద్రిక్తతలు, రాళ్ల దాడులు, లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, వాటర్ క్యానన్ల వినియోగం, నిఘా, గస్తీ, పికెట్లు... ఇలా కొన్ని గంటల పాటు సిబ్బంది, అధికారులు అంతా రోడ్లకు పరిమితం అయ్యారు. వీరికి కనీసం మంచి నీరు అందించడానికి ఉన్నతాధికారులకు సమయం చిక్కలేదు. అదే సందర్బంలో అన్ని దుకాణాలు మూతపడటంతో ఆహారం, టీ విషయం వదిలేస్తే.. మంచినీళ్లు దొరకడం కూడా కష్టసాధ్యమైంది. ఎవరికి వాళ్లు తమ ఇళ్లల్లో తలుపులు బిగించుకుని ఉండటంతో పాటు తీవ్ర భయాందోళనల్లో ఉన్న వాళ్లు కనీసం తలుపు తట్టినా తీసే పరిస్థితులు లేవు. ఇలా దాదాపు నాలుగైదు గంటల గడిచాయి.అప్పుడే మరో అంశం తెరపైకి వచ్చింది. అల్లర్లు, ఆందోళనల తర్వాత చాలా మంది యువకుల, ఆందోళనకారుల ఆచూకీ తెలియలేదు. పేలుడు, కాల్పుల్లో చనిపోయిన వారిని, వారి కుటుంబీకుల గుర్తింపు పూర్తి కాలేదు. ఇవన్నీ జరిగితేనే మృతదేహాల పోస్టుమార్టం పక్రియ, కేసు దర్యాప్తు తదితరాలు వేగం పుంజుకుంటాయి. ఇన్ని ఆలోచనల, ఆచరణల మధ్య హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులతో కూడిన ఓ బృందం మొఘల్పురలోని ఓ ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఆ సమీపంలోని ఇంటి యజమాని మధ్యాహ్నం నుంచి వీరిని గమనిస్తూ... కనీసం మంచినీళ్లు కూడా తాగలేదనే విషయం గుర్తించారు. అప్పటికి పరిస్థితులు కొంత వరకు అదుపులోకి రావడంతో... వారిని తన ఇంట్లోకి ఆహ్వానించాలని భావించారు. అతికష్టమ్మీద పోలీసుల వద్దకు వచ్చిన ఆ పెద్దాయన తన ఇంటికి వచ్చి సేదతీరాలని కోరారు.ఆ వృద్ధుడి ఇంటికి వెళ్లే విషయంలో కొద్దిసేపు ఆలోచించిన పోలీసు బృందం ఎట్టకేలకు అంగీకరించింది. అల్లర్లు అదుపులోకి రావడంతో కాస్త మంచినీళ్లు తాగి, కాలకృత్యాలు తీర్చుకోవడానికైనా వెళ్లిరావడం ఉత్తమమని భావించారు. దీంతో ఆ పోలీసు బృందం వృద్ధుడి వెంట ఆయన ఇంటికి వెళ్లింది. కుశల ప్రశ్నల, కాలకృత్యాల తర్వాత అంతా హాలులో కూర్చున్నారు. పోలీసులకు మంచినీళ్లు అందించిన ఆ పెద్దాయని... టీ, బిస్కెట్లు సిద్ధం చేస్తున్నారు. హఠాత్తుగా ఆయన జేబులో ఉన్న సెల్ఫోన్ మోగింది. ఆ కాల్ మాట్లాడిన పెద్దాయన ముఖంలో రంగులు మారిపోయాయి. కంఠం ఒణుకుతుండగా... కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ‘ఆ రోజు మధ్యాహ్నం మొఘల్పుర పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారిలో మీ మనుమడు కూడా ఉన్నాడు’ అనేది ఆ కాల్ సారాంశం. మృతదేహం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో ఉందని, కుటుంబీకులు వస్తే ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని అవతలి నుంచి పోలీసులు కోరారు.ఈ విషయం తెలియడంతోనే అక్కడ ఉన్న పోలీసుల కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది. మధ్యాహ్నం నుంచి తమను ఎవరూ పట్టించుకోకపోయినా... ఈ పెద్దాయన మాత్రం నేరుగా వచ్చి ఇంటికి ఆహ్వానించారు. ఆప్యాయంగా పలకరిస్తూ సంభాషించారు. ఇప్పుడు పోలీసుల తూటాలకు మనుమడిని కోల్పోయిన వార్త విని ఎలా స్పందిస్తారో..? అనే సందేహాలు అందరి మదిలో మెదిలాయి. వీలున్నంత త్వరలో అక్కడ నుంచి బయటపడాలని అంతా భావించారు. అప్పుడే నోరు విప్పిన పెద్దాయన ‘మీరు ఎందుకు ఫీల్ అవుతారు? ఏదీ ఎవరూ కావాలని చేయరుగా? అల్లర్లు అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు... వాడి ఆయువు తీరి పోవడంతో దేవుడి దగ్గరకు వెళ్లాడు’ అంటూ కన్నీళ్లు తుడుచుకున్నారు.అంతటిలో ఆగని ఆయన ‘ఇంటి వచ్చిన అతిథిని గౌరవించి, వారికి సపర్యలు చేయడం మా సంస్కృతి, సాంప్రదాయం. మీరు కచ్చితంగా టీ, బిస్కెట్లు తీసుకున్నాకే మా గుమ్మం దాటాలి’ అని స్పష్టం చేశారు. తన ఇంటిలో ఉన్న పోలీసులు తిరిగివెళ్లిపోయే వరకు అక్కడే ఉన్న ఆ పెద్దాయని ఆ తర్వాతే ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి పరిగెత్తారు. ఆ ఉదంతం తర్వాత ఇప్పటి వరకు ఆ పెద్దాయన సహయం కోరుతూనో... తనకు కృతజ్ఞత చూపించాలనో ఆశించలేదు... పోలీసుల వద్దకు వెళ్లలేదు.మక్కా మసీదులో పేలుడు, పేలని బాంబులపై స్థానిక హుస్సేని ఆలం పోలీసుస్టేషన్లో నమోదైన కేసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్కు (ఎస్ఐసీ) బదిలీ అయ్యాయి. అక్కడ నుంచి సీబీఐ చేతుల మీదుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దగ్గరకు వెళ్లాయి. 2008 అక్టోబర్ 28న మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుడు కేసులో ఏటీఎస్ అధికారులు అభినవ్ భారత్కు చెందిన సాథ్వీ ప్రజ్ఞాసింగ్, శ్రీకాంత్ పురోహిత్లను అరెస్టు చేశారు. వీరి విచారణలో అజ్మీర్ పేలుడుకు బాధ్యులైన దేవేంద్ర, లోకేష్, రామ్చంద్ర, సందీప్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్ ఏటీఎస్ అధికారులు దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మలను 2010 ఏప్రిల్ 28న అరెస్టు చేశారు. వీరి విచారణలో ‘మక్కా’ పనీ తమదే అని అంగీకరించడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి రాజస్థాన్ వెళ్లారు. సీబీఐ అధికారులు 2010 జూన్ 11న దేవేంద్రగుప్తా, లోకేష్ శర్మలపై నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్స్ పొందారు. వీరిని రాజస్థాన్ నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి ప్రత్యేక బృందంతో అక్కడకు వెళ్లి 18న హైదరాబాద్ తీసుకువచ్చారు. న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించిన నేపథ్యంలో స్వామి అశిమానంద పేరు వెలుగులోకి వచ్చింది. మారు పేరుతో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో రహస్య జీవితం గడుపుతున్న స్వామి అశిమానందను సీబీఐ అధికారులు 2010 నవంబరు 19న అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతర నిందితులైన రామ్చంద్ర, సందీప్లు ఇంకా పరారీలోనే ఉన్నారు. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు ‘మక్కా’ కేసు దర్యాప్తు సీబీఐ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు 2011 ఏప్రిల్ 7న బదిలీ అయింది. పరారీలో ఉన్న రామ్చంద్ర, సందీప్లపై రూ.20 లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ గాలించింది. ‘మక్కా’లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు 2011 మే 16న మరో సప్లమెంటరీ చార్జ్షీట్ దాఖలు చేశారు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులు 2018 ఏప్రిల్లో వీగిపోయాయి. నిందితులను దోషులుగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, హైదరాబాద్ -
హైదరాబాద్ : మురిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
హైకోర్టు న్యాయమూర్తిపై అసత్య ప్రచారం.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిపై సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం చేసిన ఘటనపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) బి.ఎస్. చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరధ్ను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో కల్పిత వార్తలు ప్రచారం జరిగాయి. ఈ వార్తలు న్యాయమూర్తులపై ప్రభావం చూపే ప్రయత్నంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్పిత వార్తలు ప్రచారం కావడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రజల మధ్య విస్తృత చర్చకు దారి తీసింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రమాదం ఉందని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.చార్మినార్ పోలీసులు ఐటీ యాక్ట్తో పాటు భారత న్యాయసంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 353(1)(c), బీఎన్ఎస్ 353(2), బీఎన్ఎస్ 267 సెక్షన్ల కింద ఎస్ఐఆర్ (SIR) నమోదు చేసి, కేసును దర్యాప్తు నిమిత్తం హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేశారు. -
కేంద్రమంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బండి భగీరథ్ పోక్సో కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి భగీరథ్ కేసులో నిష్పాక్షిక విచారణ చేయాలి. కేంద్రమంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి. లేదంటే విచారణ పారదర్శకంగా జరిగే పరిస్థితి లేదు. తప్పు చేసిన కొడుకును తొమ్మిది రోజులు దాచిపెట్టారు. బేటీ బచావో అన్నది నినాదాలకు సరిపెడతారా మోదీ గారూ. కేంద్ర మంత్రి కొడుకుపై లుక్ఔట్ నోటీసు ఇవ్వడం తొలిసారి. బాధిత కుటుంబాన్ని బెదిరించి, ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు’అని వ్యాఖ్యానించారు. -
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లులో అగ్నిప్రమాదం
నల్లగొండ: వీర్లపాలెంలో యాదాద్రి థర్మర్ పవర్ ప్లాంటులో అగ్ని ప్రమాదం జరిగింది. యూనిట్-3లో బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై అప్రమత్తమైన ప్లాంట్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చింది. ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలంలో దట్టమైన పొగ అలుముకుంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు -
‘మక్కా’ పేలుళ్లు.. ఇంట్లో పోలీసులు.. మనవడి మృతి అంటూ ఫోన్.. పెద్దాయన ఏం చేశాడు..
‘మక్కా’ పేలుళ్లు జరిగి రేపటికి 19 ఏళ్లు పూర్తి అవుతుంది. 2007 మే 18.. శుక్రవారం.. మండు వేసవి... మిట్ట మధ్యాహ్నం... పవిత్ర ప్రార్థనలు జరుగుతుండగా 1.25 గంటలకు బాంబు పేలింది. ఈ ఘాతుకంలో తొమ్మిది మంది ప్రాణాలు విడువగా... పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. కొంత సమయంలోనే పెద్ద సంఖ్యలో బలగాలు పాతబస్తీని... నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. మక్కా మసీదు వద్దకు మరింత మంది ఆందోళన చేస్తూ వస్తుండటంతో పాటు రాళ్ల దాడులు మొదలయ్యాయి. దీంతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం తప్పలేదు.అల్లర్లు, ఆందోళనల తర్వాత చాలా మంది యువకుల, ఆందోళనకారుల ఆచూకీ తెలియలేదు. పేలుడు, కాల్పుల్లో చనిపోయిన వారిని, వారి కుటుంబీకుల గుర్తింపు పూర్తి కాలేదు. ఇవన్నీ జరిగితేనే మృతదేహాల పోస్టుమార్టం పక్రియ, కేసు దర్యాప్తు తదితరాలు వేగం పుంజుకుంటాయి. ఇన్ని ఆలోచనల, ఆచరణల మధ్య హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులతో కూడిన ఓ బృందం మొఘల్పురలోని ఓ ఇంటి వద్ద బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఆ సమీపంలోని ఇంటి యజమాని మధ్యాహ్నం నుంచి వీరిని గమనిస్తూ... కనీసం మంచినీళ్లు కూడా తాగలేదనే విషయం గుర్తించారు. అప్పటికి పరిస్థితులు కొంత వరకు అదుపులోకి రావడంతో... వారిని తన ఇంట్లోకి ఆహ్వానించాలని భావించారు. అతికష్టమ్మీద పోలీసుల వద్దకు వచ్చిన ఆ పెద్దాయన తన ఇంటికి వచ్చి సేదతీరాలని కోరారు.అలసిపోయిన ఉన్న పోలీసులు మరో ఆలోచనే లేకుండా.. వెంటనే అతడి ఇంటికి చేరుకున్నారు. అనంతరం, వారికి సపర్యలు చేస్తుండగానే ఫోన్ ద్వారా పిడుగులాంటి వార్త ఆ వృద్ధుడికి చేరింది. పోలీసుల కాల్పుల్లో అతడి మనవడు చనిపోయాడు అని.. ఆ తర్వాత ఏం జరిగింది?.. మనవడి మృతి పట్ల పెద్దాయన ఎలా స్పందించాడు. పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు.. సదరు వృద్దుడు పోలీసులను ఎలాంటి సాయం కోరాడు.. తదితర విషయాలపై సాక్షి ఎక్స్క్లూజివ్ స్టోరీ.. రేపు ఉదయం(సోమవారం) మీ కోసం.. -
చాయ్ గరం.. బిర్యానీ పిరం..
హైదరాబాద్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ మొదలు అన్నిరకాల ఆహార పదార్థాలపై గ్యాస్ ధర పెంపు ప్రభావం పడింది. మొన్నటి వరకు రూ.220 నుంచి రూ.300 వరకు ఉన్న ప్లేట్ చికెన్, మటన్ బిర్యానీ ధర ఇప్పుడు రూ.270 నుంచి రూ.380కి చేరింది. పాతబస్తీలోని ఒక ప్రముఖ హోటల్లో మటన్ బిర్యానీ ప్లేట్ రూ.320 నుంచి ప్రస్తుతం రూ.360కి పెరిగింది. గచ్చిబౌలిలోని ఒక హోటల్లో మొన్నటివరకు రూ.340 ఉండగా రూ.380కు, ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఒక ప్రముఖ రెస్టారెంట్లో రూ. 320 నుంచి 360 పెరిగింది. ఇక నగర ప్రజలు ఇష్టంగా తాగే ఇరానీ చాయ్ రూ.12 నుంచి రూ.20కి ఎగబాకింది.పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభం గ్యాస్ దిగుమతులపై ప్రభావం చూపించడం, వాణిజ్య సిలిండర్ ధర గణనీయంగా పెరగడంతో ఫుడ్ ఇండస్ట్రీపై పిడుగు పడినట్టయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో టీ స్టాళ్లు మొదలుకుని కర్రీ పాయింట్లు, టిఫిన్ బండ్లు, చిన్న హోటళ్లు, స్టార్ హోటళ్ల వరకు అన్నిట్లోనూ ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ఎక్కడ చూసినా ‘ధరలు పెంచాం – సహకరించండి’అనే బోర్డులు కనిపిస్తున్నాయి. టీ నుంచి బిర్యానీ వరకు అన్నింటిపైనా సగటున 20% నుంచి 40% వరకు అదనంగా ధరలు పెరిగాయి. నగరంలోని ప్రతి నలుగురిలో ఒకరు బయటి ఆహారంపైనే ఆధారపడుతున్నారనే అంచనాల నేపథ్యంలో పెరిగిన ధరలు వారికి భారంగా మారాయి. 30 శాతం జనానికి హోటలే దిక్కు! నగర జనాభా 1.55 కోట్లు దాటింది. అందులో సుమారు 30 శాతం అంటే సుమారు 46.50 లక్షల మంది నిత్యం బయటి ఆహారంపైనే ఆధారపడి ఉంటారన్నది అంచనా. కాగా తాజా గ్యాస్ ధర ప్రభావంతో ఆహార ప్రియులపై రోజుకు సగటున రూ.40 నుంచి రూ.60 అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన నగరంపై రోజుకు సగటున రూ.20 కోట్ల వరకు అదనపు భారం పడుతుండగా, నెలకు రూ.600 కోట్లు దాటిపోతోంది. ఇంట్లో వంట సదుపాయం ఉన్నప్పటికీ టీ, టిఫిన్లు, భోజనాల కోసం 20.25 లక్షల మంది హోటళ్లకు వెళుతుంటారని అంచనా. మిగిలిన 26.25 లక్షల మంది విద్య, శిక్షణ, ఉపాధి, వైద్యం, ఇతరత్రా పనుల కోసం నగరానికి వచ్చి హాస్టళ్లు, అద్దె రూమ్లు, లాడ్జీల్లో ఉంటూ అనివార్యంగా బయటి భోజనంపైనే ఆధారపడుతుంటారు. నలుగురితో కూడిన ఒక కుటుంబం హోటల్కు వెళ్లి భోజనం చేసి రావాలంటే రూ. 500 నుంచి రూ.1,000 వరకు అదనంగా బిల్లు అవుతున్నట్టు తెలుస్తోంది. కడుపు నింపని భోజనం! నగరంలోని అమీర్పేట్, అశోక్నగర్, దిల్సుఖ్నగర్ మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు ఐటీ ఉద్యోగులు నూటికి నూరు శాతం మెస్లు, కర్రీ పాయింట్లపైనే ఆధారపడుతుంటారు. ప్రస్తుతం వీరి నెలవారీ మెస్ చార్జీలు కూడా పెరిగాయి. గ్యాస్ ధర పెంపుతో అమాంతం ధరలు పెంచిన మెస్లు.. మెనూ మాత్రం తగ్గించేశాయి. పప్పులో పప్పు ఉండటం లేదని, చారులో రుచి కరువయ్యిందని, పరిమాణం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హోటళ్లలో కూడా మొన్నటివరకు ఇద్దరికి సరిపోయే ’ఫుల్ బిర్యానీ’ఇప్పుడు ఒకరికి కొంచెం ఎక్కువ, ఇద్దరికి తక్కువ అన్నట్లుగా మారిపోయిందని అంటున్నారు. కర్రీ..వర్రీ నగరంలో కర్రీ పాయింట్లకు యమ గిరాకీ అన్న సంగతి తెలిసిందే. కీలక ప్రాంతాల్లో గల్లీకో కర్రీ పాయింట్ ఉంటోంది. ప్రస్తుతం నాన్ వెజ్, వెజ్..అన్నిరకాల కూరల ధరలూ పెరిగాయి. ప్రతి కర్రీపై రూ.10 నుంచి రూ. 20 వరకు పెరుగుదల చోటు చేసుకుంది. కర్రీ పాయింట్లలో ఒక కప్పు కూర ధర రూ. 30 నుంచి రూ. 50కి చేరడంతో, రెండు కూరలు కొనేవారు ఇప్పుడు ఒక్కదాంతోనే సర్దుకుపోతున్నారు. క్యాటరింగ్ రంగానిదీ ఇదే పరిస్థితి. కొత్తగా వచ్చే ఆర్డర్లపై ప్లేటుకు రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.వసతి భారం హాస్టళ్లపై వాణిజ్య గ్యాస్ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. సుమారు 12 వేల హాస్టళ్లలో ఉంటున్న 11 లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత, అధిక ధరలతో పాటు నిత్యావసరాల ధరలు కూడా పెరగడంతో హాస్టళ్ల నిర్వాహకులు భారీ నష్టాల్లో కూరుకుపోయారు. ఈ అదనపు భారాన్ని తట్టుకోలేక ఫీజులు పెంచడంతో పాటు మెనూలో కొంత కోతలు పెడుతున్నారు. -
ఉప్పల్ చౌరస్తా మూసివేత.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా..
ఉప్పల్: అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాను ఆదివారం నుంచి తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఉప్పల్ విద్యుత్ జంక్షన్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నిర్మాణ పనుల్లో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను దారి మళ్లిస్తున్నా మని సూచించారు. జీహెచ్ఎంసీ కార్యాలయం పక్కనున్న వరంగల్ బస్టాప్ను ఇప్పటికే ఉప్పల్ నల్ల చెరువు కట్ట వద్దకు మార్చిన విషయం విదితమే. ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా.. హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం, మల్లాపూర్, ఐవోసీ, చెంగిచర్ల మీదుగా వరంగల్ రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. చిన్న వాహనాలు ఉప్పల్ ఇందిరాగాంధీ పార్కునుంచి లిటిల్ ఫ్లవర్ వెనక దారి నుంచి వరంగల్ రహదారికి చేరుకోవచ్చు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు ఉప్పల్ ఏషియన్ సినీ థియేటర్ ఎదుటి హెచ్ఎండీఏ రోడ్డు ద్వారా నాగోల్ రోడ్డుకు కలుపుతారు. ద్విచక్ర వాహనదారులు నాగోల్ మెట్రో పిల్లర్లు 812, 813 నుంచి ఉప్పల్, సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, భారీ వాహనాలు నాగోల్ బ్రిడ్జి కింద నుంచి యూ టర్న్ చేసుకుని తిరిగి ఉప్పల్ వైపు రావాలి. వరంగల్ వైపు వెళ్లేవారు హెచ్ఎండీఏ లే అవుట్ నుంచి వరంగల్ హైవేకు చేరుకోవాలి. హైదరాబాద్కు వచ్చే వరంగల్ బస్సులు, లారీలు, భారీ వాహనాలన్నీ ఓఆర్ఆర్ మీదుగా హయత్నగర్ మీదుగా నగరానికి చేరుకోవాల్సి ఉంటుంది. -
జీసీసీ హబ్గా హైదరాబాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేథ హబ్గా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకి (జీసీసీ) హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతోందని ఏఐ ఆధారిత క్వాలిటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ క్వాలిజీల్ వెల్లడించింది. నగరంలో 400కు పైగా జీసీసీల్లో 3,00,000 మంది పైచిలుకు ప్రొఫెషనల్స్ ఉన్నారని వివరించింది. వీరితో పాటు దాదాపు పది లక్షల మంది ఐటీ, ఐటీఈఎస్ ప్రొఫెషనల్స్ ఉన్నట్లు ఎవరెస్ట్ గ్రూప్తో కలిసి రూపొందించిన శ్వేతపత్రంలో తెలిపింది. 2024లో 64.6 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీసీసీ పరిశ్రమ 2030 నాటికి 105 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకునే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని వివరించింది. 58 శాతం సెంటర్లు ఇప్పటికే ఏజెంటిక్ ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నాయని పేర్కొంది. క్వాలిజీల్కి స్వయంగా హైదరాబాద్లో 3 జీసీసీలు ఉండగా, వీటిలో 850 మందికి పైగా ఇంజినీర్లు పని చేస్తున్నారు. 2028 నాటికి 100 మిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించుకుంది. -
పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్
హైదరాబాద్: పేట్బషీరాబాద్లో నమోదైన పోక్సో కేసులో బండి భగీరథ్.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. అడ్వకేట్ల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈరోజు(శనివారం, మే 16వ తేదీ) రాత్రి లాయర్ల సమక్షంలో బండి భగీరథ్ను కుటుంబ సభ్యులే పోలీసులకు అప్పగించారు. కాసేపట్లో బండి భగీరథ్ను జడ్జి ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. పోలీసులకు అప్పగించాం: బండి సంజయ్‘చట్టంపైన గౌరవంతోనే మా అబ్బాయిని పోలీసులకు అప్పగించా. ఏ తప్పు చేయలేదని మా అబ్బాయి చెబుతున్నాడు. ఆధారాలను చూపేందుకే పోలీసులకు అప్పగింతలో జాప్యం జరిగింది’ అని పేర్కొన్నారు బండి సంజయ్.తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, అందుచేత ఏ తప్పూ చేయని తన కుమారుడు పోలీసులకు లొంగిపోయాడన్నారు బండి సంజయ్. చట్టం ముందు అంతా సమానమేనని, ప్రతీ ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. బండి భగీరథ్ను అరెస్ట్ చేశాం: సీపీబండి భగీరథ్ను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ రమేష్రెడ్డి స్పష్టం చేశారు. భగీరథ్ను గాలించే క్రమంలో అరెస్ట్ చేశామన్నారు. నార్సింగ్లోని పోలీస్ అకాడమీ వద్ద భగీరథ్ను అరెస్ట్ చేశామన్నారు. అటు తర్వాత పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నామన్నారు సీపీఇదిలా ఉంచితే, బండి భగీరథ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మేడ్చల్ కోర్టులో బాధితురాలు.. మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా కోర్టు రికార్డ్ చేసింది. ఇప్పటికే రెండుసార్లు స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు.కేసు తీవ్రత దృష్ట్యా స్వయంగా రంగంలోకి దిగిన న్యాయమూర్తి.. బాలిక స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. బాలిక తల్లిదండ్రుల నుంచి కూడా విడివిడిగా జడ్జి.. స్టేట్మెంట్ తీసుకున్నారు. బాధిత కుటుంబం నుంచి న్యాయస్థానం కీలక వివరాలు సేకరించింది. మూడోసారి స్టేట్మెంట్ ప్రక్రియ.. కేసు దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. న్యాయమూర్తి సేకరించిన స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి విచారణ మరింత వేగవంతం కానుంది. -
ఇల్లు కొనేందుకు ఇది మంచి ఛాన్స్!
సాక్షి, సిటీబ్యూరో: మార్కెట్ పడ్డప్పుడు కొంటేనే తక్కువ ధరకు వస్తుంది.. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు వర్తించే ఈ సూత్రం రియల్టీకి వర్కవుట్ అవుతుంది. మార్కెట్ బాగలేనప్పుడు గృహ కొనుగోలుదారులకు మంచి సమయం. బిల్డర్లతో బేరసారాలకు అవకాశం ఉంటుంది. వారు అందించే ఆఫర్లు అందుకునే అవకాశం ఉంటుంది.హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లో రెండు రకాల కస్టమర్లు ఉన్నారు. ప్రవాసులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), పెట్టుబడిదారులైన మొదటి రకంలో వీళ్లంతా పెద్దస్థాయిలో భూములు, అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోళ్లు చేస్తుంటారు. ఇక, రెండో రకం రిటైల్ కస్టమర్లు. వీళ్లు సొంతంగా ఉండేందుకు గృహాలను కొనుగోలు చేస్తుంటారు.మొదటి రకం కొనుగోలుదారులేమో మార్కెట్ బాగాలేనప్పుడు కొనుగోలు చేసి, బాగున్నప్పుడు ఎక్కువ ధరకు విక్రయించేసుకుంటారు. రెండో రకమేమో ధరలు మరింత తగ్గుతాయేమోనని వేచి చూస్తారు. ధరలు పెరిగిన తర్వాత ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటారు. వాస్తవానికి స్థిరాస్తి మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే మొదటి రకాన్ని ఫాలో అవడమే కరెక్ట్. అందుకే ప్రస్తుత సందిగ్ధ వాతావరణంలో గృహాలను కొనుగోలు చేయడమే మంచి నిర్ణయం. ఇలాంటి ప్రతికూల మార్కెట్లోనే ధర, వసతుల విషయంలో బిల్డర్లతో బేరసారాలకు అవకాశాలుంటాయి.ప్రభుత్వం ప్రోత్సహించాలిఏ పట్టణ ప్రాంతం అభివృద్ధికైనా కావాల్సింది విద్యా, వైద్యం, వినోదం, ఉద్యోగ అవకాశాలు. నగరవాసుల నాణ్యమైన జీవనాన్ని నిర్ణయించేవి ఈ నాలుగే. వీటిల్లో భాగ్యనగరం కేంద్ర బిందువనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెడికల్ టూరిజం, ఎడ్యుకేషనల్ హబ్, ఎంటర్టైన్మెంట్ జోన్లకు పెట్టింది పేరైన హైదరాబాద్లో ఐటీ, ఫార్మా, తయారీ రంగాలతో అపారమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి.ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరానికి ఉన్న మరో అద్భుతమైన అవకాశం మెరుగైన మౌలిక వసతులున్న అపారమైన భూముల లభ్యత, ఔటర్, మెట్రోలతో కనెక్టివిటీ. దీంతో నగర రియల్టీ మార్కెట్కు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నిరంతరం దృష్టి పెడుతూనే పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి.పారిశ్రామిక పాలసీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ సుందరీకరణ, ఫార్మా క్లస్టర్లు, సెమీ కండక్టర్ల పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి ఏదైనా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటి అమలుకు చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఒక సానుకూల వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి. ఆరోగ్యం, పర్యాటక రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహించాలి. ప్రభుత్వం దార్శనికతతో ప్రణాళికలు రూపొందిస్తే ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇవన్నీ రియల్టీ రంగానికి ఇంధనంగా ఉపయోగపడతాయి.కొత్త ప్రాజెక్ట్లపై పునరాలోచనప్రతీ ఆరేడేళ్లకు రియల్టీకి విరామ దశ సాధారణమే. తెలంగాణ ఉద్యమం, సత్యం స్కామ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లెమాన్ బ్రదర్స్ కుప్పకూలడం వంటి వాటితో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో 2007లో మొదలైన హైదరాబాద్ స్థిరాస్తి రంగం పతనం.. 2014 వరకూ కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాది కాలం వరకూ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైంది.కొత్త రాష్ట్రం, ప్రభుత్వ విధానాలు, కార్యచరణలపై అస్పష్టత వంటి కారణాలు అనేకం. ఆ తర్వాత 2015 ప్రారంభంలో మొదలైన రియల్ బూమ్ 2022 వరకూ కొనసాగింది. ఈ మధ్యకాలంలో మార్కెట్లో ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయి. 2023లో ఎన్నికలతో స్థిరాస్తి రంగంలో మొదలైన సందిగ్ధత ఇప్పటికీ కొనసాగుతోంది.ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, లేఆఫ్లు, అపరిమిత సరఫరా, ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు లేకపోవడం, అధిక ధరలు, వడ్డీ రేట్లు, ప్రభుత్వ ప్రతికూల విధానాల వంటి కారణంగా వచ్చే మూడేళ్ల వరకూ విరామ దశలోనే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే రియల్టీ రంగంలో ఈ విరామం మంచిదే అంటున్నారు. బిల్డర్లతో రాయితీలు, ఆఫర్లు వంటి బేరసారాలకు అవకాశం ఉంటుందంటున్నారు.మార్కెట్లో బోలెడంత ఇన్వెంటరీవిక్రయాలు అంతంత మాత్రంగా ఉన్న ప్రస్తుత రోజుల్లో కొత్త ప్రాజెక్ట్లు చేపట్టేందుకు బిల్డర్లు పునరాలోచిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం భూములను కొని పెట్టుకోవడం, నిర్మాణ అనుమతులు తీసుకోవడం చేస్తున్నారే తప్ప ప్రాజెక్ట్ లాంచింగ్ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఊహాజనిత మార్కెట్లో భూముల ధరలు పెరుగుతాయే తప్ప అపార్ట్మెంట్ల చదరపు అడుగు రేట్లు పెరగవు.ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో బోలెడంత ఇన్వెంటరీ ఉంది. నిర్మాణంలో ఉన్న, రెడీగా ఉన్న ఇన్వెంటరీ పోతేగానీ కొత్త యూనిట్లకు అవకాశం ఉండదు. అలాగే ప్రీలాంచ్ ప్రాజెక్ట్లు, డెవలపర్లు కూడా భూముల రేట్లు పెరగడానికి కారణమే. ఎప్పుడైనా సరే స్థిరాస్తి ధరలు స్థిరంగా పెరగాలే తప్ప అమాంతం పెరగకూడదు. రాత్రికి రాత్రే పెరిగే ధరలు గాలిబుడగ వంటివే. ఎప్పటికైనా పడిపోవాల్సిందే.. లేకపోతే తుది కొనుగోలుదారుల మీద అదనపు భారం తప్పదు. -
హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. మెహదీపట్నంలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్ను పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు శుభమ్ సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 137 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్తో పాటు వోల్వో కారు, ప్యాకింగ్ మెటీరియల్, 9 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్స్ టాస్క్ఫోర్స్, మెహదీపట్నం పోలీసులు పక్కా సమాచారం ఆధారంగా ఆపరేషన్ నిర్వహించారునిందితుల్లో శుభమ్ కుమార్ మిశ్రా ఏ1 కాగా, A2 సోహమ్ నాయక్, A3 కలంగి రాజేష్, A4 ముంతున్ కుమార్ మరియు A8 అబ్దుల్ షాబాజ్ బాలానగర్ ప్రాంతానికి చెందినవారు. మిగిలిన వినియోగదారులు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. ప్రధాన నిందితుడు శుభమ్ కుమార్ మిశ్రాకు, అదే ప్రాంతంలో నివసించే బుసా సాయి నిఖిల్ యాదవ్ అలియాస్ సాయి చిన్ననాటి స్నేహితుడు. వీరిద్దరికీ గంజాయి, ఎండీఎంఏ తీసుకునే అలవాటు ఉంది. ఈ క్రమంలో శుభమ్.. సాయి నిఖిల్ వద్ద నుండి ఎండీఎంఏ డ్రగ్ను సేకరించడం ప్రారంభించాడు. కాగా, సాయి నిఖిల్ను ఇటీవల చిలకలగూడ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు.సాయి నిఖిల్ అరెస్ట్ అయిన తర్వాత కూడా శుభమ్ కుమార్ మిశ్రా ఈ డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగించాడు. తన స్నేహితులైన సోహమ్ నాయక్, కలంగి రాజేష్లతో కలిసి కొనసాగించాడు. శుభమ్ వారిద్దరికీ పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేయగా.. వారు దానిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి కస్టమర్లకు విక్రయించేవారు. ఈ డ్రగ్స్ను వినియోగదారులకు చేరవేయడానికి శుభమ్ స్వయంగా వెళ్లడమే కాకుండా, రాపిడో సర్వీసులను ఉపయోగించేవాడు. అలాగే తన అన్న ముంతున్ కుమార్ ద్వారా కూడా డ్రగ్స్ డెలివరీ చేయించేవాడు. ఈ కేసులోని వినియోగదారులు.. నిందితులైన పెడ్లర్ల నుండి గ్రాము ఎండీఎంఏను రూ. 2,000 నుంచి రూ. 3,000 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. -
కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం
-
హైదరాబాద్ లో హై టెన్షన్...బండి భగీరథ్ కోసం గాలింపు
-
బీటెక్ ఒకప్పుడు గ్రేట్ ఇప్పుడు వేస్ట్! పనికి రాకుండా పోతున్న బీటెక్ డిగ్రీలు తప్పు కాలేజీలదే..
-
బాలికపై బాబాయి లైంగిక దాడి
హైదరాబాద్: పరీక్షలు పూర్తి అయ్యాయి..వేసవి సెలవులు సరదాగా గడుపుదామని బాబాయి ఇంటికి వెళ్లింది ఓ బాలిక..అయితే బాబాయి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.పోలీసులు తెలిపిన మేరకు.. జగద్గిరిగుట్టకు చెందిన బాలిక (16) సెలవులకు తిరుపతిలోని పిన్ని ఇంటికి వెళ్లింది. జీఎస్టీ విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పసిచేస్తున్న బాబాయి రామమూర్తి... తన భార్య ఉద్యోగానికి వెళ్లిన సమయంలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొద్ది రోజుల తరువాత నగరానికి వచి్చన బాలికను తల్లి ఆరా తీయగా విషయం వెలుగులోకి వచి్చంది. తల్లి ఫిర్యాదుతో జగద్గిరిగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేష¯న్కు బదిలీ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. -
హైదరాబాద్ : నాంపల్లి రైల్వే స్టేషన్..ఏసీ కోచ్లో మంటలు (ఫొటోలు)
-
కూలిన లిఫ్ట్.. బీఆర్ఎస్ నాయకులకు గాయాలు
సాక్షి, హైదరాబాద్: లిఫ్ట్ తెగిపడి బీఆర్ఎస్ నాయకులు గాయపడిన ఘటన హైదరాబాద్లోని పుప్పాలగూడ డాలర్ హిల్స్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు బీఆర్ఎస్ నాయకులు గాయపడ్డారు.వైర్లు తెగిపోవడంతో లిఫ్ట్ ఒక్కసారిగి కుప్పకూలింది. ప్రమాద సమయంలో లిఫ్ట్లో ఆరుగురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వీరందరికీ గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అవడంతో అపోలో ఆస్పత్రికి తరలించారు. ఓ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ ముగించుకుని లిఫ్ట్ లో కిందకు దిగుతున్న సమయంలో ఘటనఈ ఘటన జరిగింది. -
బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు
సాక్షి,హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం హార్ట్ స్టెంట్ వేసి చికిత్స అందిస్తున్నారు. బండి సంజయ్ స్వయంగా ఆసుపత్రికి చేరుకుని తల్లి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. -
నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 4వ ప్లాట్ఫాంపై ఉన్న ఏసీ కోచ్లో మంటలు చెలరేగాయి. జైపూర్ వెళ్తున్నట్రైన్ ఏసీ బోగిలో షార్ట్ సర్క్యూట్తో మంటలు ఎగసిపడుతున్నాయి. మూడు ఫైరింజన్లతో మంటలను సిబ్బంది అదుపు చేశారు. తోటి ప్రయాణికులు.. అద్దాలు పగలగొట్టి ప్యాసింజర్లను కాపాడారు. బీ1, బీ2 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.రాత్రి 7.30కి బయలుదేరాల్సి ఉండగా 6.20 గంటల ప్రాంతంలో బోగీల్లో మంటలు వ్యాపించాయి. బోగీలలో పొగలు రావడాన్ని గమనించి ఫైర్, హైడ్రా కంట్రోల్ రూమ్కు రైల్వే అధికారులు సమాచారం ఇచ్చారు. వెంటనే చేరుకుని హైడ్రా, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పెనుముప్పు తప్పడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. -
బండి భగీరథ కేసులో ఆ పేరు వాడొద్దు: కోర్టు
హైదరాబాద్: బండి భగీరథ కేసులో సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేరును వాడొద్దంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ కేసులో తన పేరును వాడుతున్నారంటూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్. ఈ మేరుకు విచారించిన కోర్టు.. బండి భగీరథ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ పేరు వాడొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ కేసు విషయంలో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని స్పష్టం చేసింది సివిల్ కోర్టు. తన పేరును ఉపయోగిస్తూ మీడియాలో ఎలాంటి వార్తలు రాయకుండా చూడాలని కోరారు. ఇప్పటివరకు మీడియాలో తన పేరుతో వచ్చిన ఈ కేసుకు సంబంధించిన వార్తలను డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు బండి సంజయ్. కేంద్రమంత్రి బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు. -
హైదరాబాద్లో ఈ దేవాలయం దర్శిస్తే.. మీ అమెరికా డ్రీమ్ నెరవేరినట్లే
వాషింగ్టన్: భక్తులు కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవం.. వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ. చిలుకూరు బాలాజీ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. విదేశాల్లో స్థిరపడాలనుకునే కోట్లాది మంది భక్తుల ఆశలు, విశ్వాసాలకు ప్రతీక. అందుకే చిలుకూరు బాలాజీని వీసా గాడ్ అని పిలుస్తారు. ఇప్పుడు మరోసారి చిలుకూరు బాలాజీ విశిష్టత ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్పై దుమ్మెత్తి పోస్తూ అమెరికా రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో హెచ్-1బీ వీసా పోగ్రామ్ వల్ల అమెరికన్లు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారు. దేశీయంగా ఉన్న ప్రముఖ టెక్ కంపెనీలు హెచ్-1బీ వీసాను దుర్వినియోగం చేస్తున్నాయి. పనితీరు పేరుతో స్థానికుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. అమెరికా సెనేటర్ నోట చిలుకూరు బాలాజీ ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం గురించి ప్రస్తావించారు. ఉదాహరణకు మీరు అమెరికా హెచ్-1బీ వీసా కావాలంటే వీసా దేవాలయాన్ని సందర్శించొచ్చు. హెచ్-1బీ వీసా కోరుకునేవారు (వీసా కార్టెల్)కి హైదరాబాద్లో వీసా దేవాలయం ఉంది. అక్కడ వేలాది మంది భారతీయులు పుణ్యక్షేత్రంలో ప్రదిక్షణలు చేస్తారు. యూఎస్ వర్క్ వీసాల కోసం ఆశీర్వాదం పొందుతారు’అని పేర్కొన్నారు.పన్నులు కట్టేది మనం.. ఉద్యోగాలు మాత్రం భారతీయులకుఅమెరికా వీసా ప్రోగ్రామ్లలో మోసం, దుర్వినియోగం అధికంగా ఉంది. తద్వారా హెచ్-1బీ,ఎల్-1,ఎఫ్-1,ఓపీటీ వీసా ప్రోగ్రామ్లు అమెరికా మధ్యతరగతి ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయి. షెల్ కంపెనీలు అక్రమ పద్దతుల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. వాటి ద్వారా తక్కువ వేతనాలతో వీసా ఆధారిత కార్మికులను అమెరికా ఉద్యోగాల్లోకి పంపుతున్నారు. అమెరికన్లను పక్కన పడుతున్నారు. ఆ కంపెనీలే భారత్లో ఏఐపై బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. పన్ను రాయితీ ప్రయోజనాలు మాత్రం అమెరికా నుంచి పొందుతున్నాయి. ఎల్‑1 వీసాలు వీసా కార్టెల్ వ్యాపారంగా మారాయని ఆయన ఆరోపించారు. విదేశీ కంపెనీలు నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి, మేనేజర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ వేతన పరిమితులను తప్పించుకుంటున్నాయి. దాదాపు సగం మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుని, టెక్ కంపెనీలలో మధ్యస్థాయి కంటే తక్కువ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. అమెరికా ప్రజలు చెల్లించే పన్నులే విదేశీ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయి. ఫలితంగా, కంపెనీలు పేరోల్ ట్యాక్స్, వేజ్ రూల్స్ లేకుండా తక్కువ వేతనాలతో వారిని నియమించుకుంటున్నాయి. తర్వాత వారు హెచ్‑1బీ ఉద్యోగులు ఆపై గ్రీన్ కార్డ్లు పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అమెరికా గ్రాడ్యుయేట్లు తక్కువ వేతనం తీసుకుంటున్న పోటీపడుతున్నారు. వీసా వస్తే.. ఒక్కరితో ఆగదు.. అందరికి షేర్ చేస్తారుకార్టెల్ పని ఇక్కడితో ఆగదు. భారతీయ వీసా హోల్డర్లు ఇంటర్వ్యూలలో అడిగే కాన్ఫిడెన్షియల్ ప్రశ్నలను ఇతర భారతీయ అభ్యర్థులతో పంచుకుంటున్నారు చివరిగా వీసాల పేరుతో జరుగుతున్న మోసాలు ఇంక చాలు. ఆ మోసాన్ని ఆపాలి. ఈ నెట్వర్క్లను మూసివేయాలి. లోపాలను సరిచేయాలి. అమెరికన్ వర్క్ ఫోర్స్ను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రస్తావనఅమెరికా డ్రీమ్ తరచుగా హైదరాబాద్లో ప్రార్థనతో ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. చిలుకూరు బాలాజీ ఆలయంను వీసా టెంపుల్గా పిలుస్తారని, వీసా కోసం ప్రయత్నించే విద్యార్థులు, టెక్ ఉద్యోగులు ఈ ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. హెచ్-1బీ వీసాలు పొందే జాబితాలో భారత్ వాటా 70 నుంచి 80శాతం ఉంటే చైనా మాత్రం 12శాతం మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. 11 లేదంటే 108 ప్రదక్షిణలుచిలుకూరు బాలాజీ ఆలయంలో వీసా కోసం చేసే ప్రదక్షిణల సంప్రదాయం ప్రత్యేకంగా ఉంది.కోరికను (ఉదా: అమెరికా వీసా) మనసులో పెట్టుకుని ఆలయ గర్భగుడి చుట్టూ 11 సార్లు తిరుగుతారు. కోరిక నెరవేరిన తర్వాత తిరిగి ఆలయానికి వచ్చి కృతజ్ఞతగా 108 సార్లు ప్రదక్షిణలు చేస్తారు.ఈ సంప్రదాయం 1990లలో ఐటీ విద్యార్థులు, ఉద్యోగులు అమెరికా వీసా కోసం ప్రార్థనలు చేసినప్పుడు విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. An American professor just sued SMU, alleging the department chair systematically favored Indian-origin candidates for tenure.100% approval for them, zero for equally qualified non-Indians.This isn’t isolated; it’s the pattern when these networks capture hiring. pic.twitter.com/60CezLg8pw— Senator Eric Schmitt (@SenEricSchmitt) May 13, 2026 -
భార్య రెండో పెళ్లి చిచ్చు.. భర్త ఆత్మహత్య!
హైదరాబాద్: తాను ఎంతగానో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కొన్నేళ్ల కాపురం తర్వాత రెండో పెళ్లి చేసుకోవడాన్ని అవమానంగా భావించి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని హయత్నగర్ పీఎస్ కోహెడ పరిధిలో చోటు చేసుకుంది. తమకు పుట్టిన బిడ్డను సైతం భార్య అమ్మేసి మరీ రెండో పెళ్లి చేసుకోవడంతోనే తాను ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు భర్త గోవర్థన్ వెల్లడించాడు. చనిపోయేముందు సెల్ఫీ వీడియో తీసుకోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. తన భార్య రెండో పెళ్లి చేసుకుందని, తమకు ఒక బాబు కూడా ఉన్నాడని ఆ వీడియోలో తెలిపాడు. నాలుగేళ్ల కాపురం తర్వాత ఆ బిడ్డను అమ్మేసి రెండో పెళ్లి చేసుకోవడాన్ని తాను భరించలేకపోతున్నానని, తనకు చావు తప్పితే మరొక మార్గం లేదని బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. ఆ వీడియోలో వెక్కి వెక్కి ఏడ్చిన గోవర్థన్.. తనను మోసం చేసిన ఆమెను వదిలిపెట్టవద్దని కుటుంబ సభ్యులకు విన్నవించాడు. తాను చనిపోతున్నందుకు క్షమించాలంటూ కుటుంబ సభ్యులను కోరాడు. దీనిపై గోవర్థన్ తల్లి మాట్లాడుతూ.. వారికి పెళ్లియిందనే విషయం తమకు ఇప్పుడే తెలిసిందని, బాబు పుట్టిన విషయం కూడా తమకు చెప్పలేదని, ఇప్పుడు వీడియో ద్వారా మాత్రమే వారికి పెళ్లైన విషయం, బాబు పుట్టిన విషయం తెలిసిందన్నారు. -
హలీమ్ ప్రియులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: డబ్బాలో పెట్టి కేఫ్/షాప్ల వాళ్లు అందిస్తున్న హలీమ్ ఎలాంటిది? ఏ దినుసులు ఎంత శాతం చొప్పున కలుపుతున్నారు? అది ఎంత మేర ఆరోగ్యకరం? ఇప్పటిదాకా తెలియని ఈ కచ్చితమైన వివరాలు హలీమ్ ప్రియులకు తెలియనున్నాయి. గోధుమలు, పప్పు లు సహా ఏవేవో కలిపేసి హలీమ్ తయారీ చేసే అక్రమ వ్యాపారుల ఆగడాలకు కళ్లెం పడనుంది. హైదరాబాద్ హలీమ్ (Hyderabad Haleem) ఎంతో పాపులర్. కాగా అంతర్జాతీయంగా ఎగుమతి అయ్యే ఏ ఆహారోత్పత్తికైనా నిర్దుష్ట ప్రమాణాలు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే కొందరు ఎగుమతిదారుల ఆరోపణల దృష్ట్యా హలీమ్ నాణ్యత ఖరారు చేయాలని, నగర సంస్కృతికి పర్యాయపదంగా నిలిచిన ప్రఖ్యాత వంటకాన్ని ప్రామాణీకరించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్ణయించింది. నిర్దుష్ట ప్రమాణాలను రూపొందించింది. గత ఏప్రిల్ 28న నవీకరణను జారీ చేసింది. ప్రమాణాలను పాటించాల్సిన గడువును పొడిగిస్తూ నవంబర్ 1గా నిర్ణయించింది.ప్రమాణాలు ఏమిటి? మాంసం, ప్రోటీన్ తేమ అవసరాలతో సహా కఠిన ప్రమాణాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రవేశపెట్టింది. హలీమ్ను ‘సాధారణ ఆహారం’ వర్గం నుంచి ఒక ప్రత్యేక విభాగానికి మార్చి కచ్చితంగా ఏమేం ఉండాలో తేల్చింది. ఇకపై చట్టబద్ధంగా ’హలీమ్’ అని పేర్కొనాలన్నా, అధికారముద్ర పడాలన్నా.. ఆ ఆహార ఉత్పత్తిలో ఇప్పుడు బరువు ప్రకారం కనీసం 25 శాతం మటన్ /చికెన్ ఉండాలి. ఖర్చులను తగ్గించుకోవడానికి గోధుమ కంకులు, పప్పులు నీళ్లు కలిపిన హలీమ్స్ను వండి వడ్డించే కొన్ని హలీమ్ స్టాల్స్ ఆటలు ఇక చెల్లవు.ప్యాక్ చేసి ఎగుమతి చేసే ప్రతి హలీమ్ తప్పనిసరిగా పాటించాల్సిన నిర్దిష్ట రసాయన ప్రమాణాలను కూడా నిబంధనలు నిర్దేశించాయి. మటన్ హలీమ్లో కనీసం 8 శాతం ప్రోటీన్, 70 శాతం తేమ ఉండాలి. చికెన్ హలీమ్లో (Chicken Haleem) కనీసం 6 శాతం ప్రోటీన్, 75 శాతం తేమ పరిమితిని నిర్దేశించారు. నిర్ణీత ప్రోటీన్, తేమ శాతాలు ఇప్పుడు హలీమ్ నాణ్యతను నిర్ధారించే ప్రయోగశాల పరీక్షల సమయంలో పారామితులుగా పనిచేస్తాయి.చదవండి: భర్త డైరెక్షన్.. భార్య యాక్షన్హలీమ్లలో కొవ్వు 12 శాతానికి పరిమితం కావాలి. వచ్చే రంజాన్ నాటికి, ప్రతి వాణిజ్య తయారీదారు ఈ ప్రోటీన్ కొవ్వు శాతాలను తమ లేబుళ్లపై చట్టబద్ధంగా ముద్రించాల్సి ఉంటుంది. మటన్, బఫెలో మీట్ హలీమ్ల మధ్య తేడాను లేబుళ్లపై స్పష్టంగా పేర్కొనాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది. -
‘తనూజ రంజన్’ కేసులో వెలుగులోకి కీలకాంశాలు
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజను చంపి, భారీ దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ కోసం నగర పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నేరంలో ఆరుగురు నేరుగా పాల్గొన్నారని, మరొకరు పరోక్షంగా సహకరించారని గుర్తించారు. ఉత్తరాది జైల్లో కల్పన భర్త... నేపాల్ నుంచి వలసొచ్చిన కల్పనతోపాటు ఆమె భర్త ఉత్తరాదిలో కొన్ని నేరాలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన మరో నేపాలీ మహిళ ద్వారా వినయ్ రంజన్ రే తల్లికి సపర్యలు చేయడానికి చేరింది. రంజన్ తల్లి రెండు నెలల క్రితం చనిపోయినా, కల్పన మీద ఉన్న నమ్మకంతో పనిలో కొనసాగించారు. ఈమెకు రెండో అంతస్తులో అటాచ్డ్ బాత్రూమ్తో కూడిన గదిని ఇచ్చారు. ఉత్తరాదిలో చేసిన నేరంలో అరెస్టు అయిన కల్పన భర్త ప్రస్తుతం అక్కడి జైల్లో ఉన్నట్టు తెలిసింది. జైలు నుంచే ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా కల్పనతో సంప్రదింపులు జరిపాడని సమాచారం. ఇలా మెసెంజర్ ద్వారా రంజన్ ఇంట్లో దోపిడీకి స్కెచ్ వేసి, ఆ విషయాన్ని కల్పనకు చెప్పారు. రెండు రోజుల ముందు వచ్చిన ముగ్గురు ఇటీవల వినయ్ రంజన్ రే (Vinay Ranjan Ray) బెంగళూరు వెళ్లడంతో దోపిడీకి అదే అదునైన సమయంగా భావించిన కల్పన అదే విషయాన్ని తన భర్తకు చెప్పింది. అతడి సూచనల మేరకు నేపాల్కు చెందిన సుజన్ షాహి అలియాస్ సురేశ్ సాహి, గణేశ్ సాహి, భరత్, దేవేందర్ నేరం చేయడానికి రెండు రోజులు ముందు నగరానికి వచ్చారు. ఉత్తరాదిలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వీరు రైలు ద్వారా సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చి గోపాలపురం పరిధిలోని ఎంఎస్ హోటల్లో బస చేశారు. ఆ మర్నాడు మరో నిందితుడు వచ్చి వీరిని కలిశాడు. గురువారం ఈ హోటల్లో సోదాలు చేసిన పోలీసులు పలు రికార్డులు, నేరగాళ్లు ఇచ్చిన గుర్తింపు పత్రాల ప్రతులు, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను స్వాదీనం చేసుకున్నారు. ఆటోలో జూబ్లీహిల్స్ వరకు...నేరం చేసిన రోజు కల్పన ఆదేశాల మేరకు ఈ ఐదుగురూ ఆటోలో ప్రశాసన్నగర్ వద్దకు చేరుకున్నారు. అక్కడి సీసీ కెమెరాల్లో ఇద్దరి కదలికలు మాత్రమే ఉండగా, మిగిలిన చోట్ల ఐదుగురినీ పోలీసులు గుర్తించారు. నేరం చేసిన తర్వాత వీరు వేర్వేరుగా రైళ్లల్లోనే పారిపోయారని పోలీసులకు ఆధారాలు లభించాయి. కల్పన (Kalpana) సహా కొందరు సొత్తుతో నేపాల్కు చేరినట్టు భావిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి ఉత్తరాదిలోని వివిధ నగరాల్లో గాలిస్తున్న టీమ్స్, ఇండో–నేపాల్ బోర్డర్లోని వివిధ ప్రాంతాలు, ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టుల వద్ద నిఘా ఉంచాయి.పోలీసుల అదుపులో నేపాలీ మమత గ్యాంగ్? జవహర్నగర్: జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కౌకూర్లో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమోహన్, విజయలక్ష్మీ నివాసంలో వారిని బంధించి ఆ ఇంట్లోనే దొంగతనం చేసిన నేపాలీ మమత గ్యాంగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మురళీమోహన్ నివాసంలో ఈ నెల 11న ఇంట్లో పనిచేసే నేపాలీ పనిమనిషి, నేపాల్కు చెందినవారు దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే.జవహర్నగర్, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో నేపాలీ గ్యాంగ్ను ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో పట్టుకున్నారని, అక్కడ కోర్టులో హాజరుపర్చిన తర్వాత వారిని హైదరాబాద్ తీసుకొస్తారని సమాచారం. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి స్వయంగా పర్యవేక్షించి 10 ప్రత్యేక టీమ్లు రంగంలోకి దించి నేపాలీ గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. -
హైదరాబాద్ లో రెచ్చిపోతున్న నేపాలీ గ్యాంగ్
-
పేద ప్రజల ఆరోగ్యం కోసమే టిమ్స్ ఆసుపత్రులు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని కేటీఆర్ అన్నారు. సనత్నగర్లోని టిమ్స్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమైతే, నేడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. హైదరాబాద్లో AIIMS స్థాయి వైద్యం అందించేలా టిమ్స్ను ఆలోచించి రూపకల్పన చేశామన్నారు.సనత్నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగించామని అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. ఇందులో మొత్తం మూడు బ్లాకులు నిర్మించామని 300 ICU బెడ్స్తో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని రోగుల బంధువుల కోసం ప్రత్యేక ధర్మశాల ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.1200 కోట్ల వ్యయంతో టిమ్స్ నిర్మాణం చేపట్టామని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆసుపత్రి రెండేళ్ల క్రితమే పూర్తయ్యేదన్నారు. -
సందడిగా యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ లండన్ మీట్ అండ్ గ్రీట్
సాక్షి, హైదరాబాద్ : మీట్ అండ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ లండన్ వీసీ జాన్ వాల్.. యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ లండన్ మీట్ గ్రీట్ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.బంజారాహిల్స్లోని తాజ్ దక్కన్ హోటల్లో గురువారం యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ మీట్ ద గ్రీట్ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ లండన్ వైస్ ఛాన్సిలర్ జాన్ వాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత మూస కోర్సులు చదువుకునేందుకు ఇష్టపడటం లేదని ఎప్పటికప్పుడు సరికొత్త కోర్సులు చదువుకోవడానికి ఇష్టపడుతున్నారని అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ యూనివర్సిటీకి భారతీయ విద్యార్థులకు మంచి సంబంధాలు ఉన్నాయని ఇక్కడ లభించే కోర్సులకు ప్రతియేటా భారతీయ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని అన్నారు. టెక్నాలజీ కోర్సులు, సైబర్ సెక్యూరిటీస్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రొబోటిక్స్ వంటి ఎన్నో అంశాలపై అధునాతన కోర్సులను విద్యార్థులకు ఈ యూనివర్సిటీ అందిస్తున్నదని తెలిపారు.ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నదని అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ రొహింప్టన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ అడ్మిన్ గులిని రిచర్డ్ మాట్లాడుతూ ప్రస్తుతం యూనివర్సిటీలో 12 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారని అన్నారు. సావరియా ఎడ్యుకేషన్ సంస్థ చైర్మన్ రాజేష్ గోయల్ మాట్లాడుతూ తొలుత 200 మంది తమ కన్సల్టెన్సీ నుంచి లండన్ వెళ్ళారని ఇప్పుడు 500 మందికిపైగా వెళ్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ సర్వీస్ ఈడీ గ్రోత్ మిస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
యూసుఫ్గూడలో అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: యూసుఫ్గూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విశ్వ విహార్ లాండ్ మార్క్ అపార్టుమెంటులోని ఐదో అంతస్థులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అపార్టుమెంటులోని వారిని ఖాళీ చేయించి మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. అయితే ఏసీ పేలడంతోనే ప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
ఇంటర్ విద్యలో కీలక మార్పులు.. తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2026-2027 అకడమిక్ ఇయర్ నుంచే నూతన విద్యా విధానం అమల్లోకి రానుంది. ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జూలజీలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్ ఇయర్లో 15 మార్కులు, సెకండ్ ఇయర్లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. బోర్డు మ్యాథ్స్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ను ప్రవేశపెట్టింది. ఫైనల్ ఎగ్జామ్స్లో మ్యాథ్స్ మార్కులు 75 నుండి 60కి తగ్గించింది. ఇంటర్నల్ అసెస్మెంట్లో ఒక్కో ఏడాదికి 15 మార్కులు కేటాయించారు. హ్యూమానిటీస్లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా 20 మార్కులు పొందే అవకాశం కల్పించారు. ఫైనల్ పరీక్షలు 100 మార్కుల బదులు 80 మార్కులకే నిర్వహించనున్నారు. లాంగ్వేజెస్లో కూడా ఫైనల్ ఎగ్జామ్స్ 100 మార్కుల బదులు 80 మార్కులకే జరుగుతాయని ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి. -
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్కు ఏసీబీ కోర్టు సమన్లు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈకారు రేసు కేసులో ఏసీబీ కోర్టు మాజీ మంత్రి కేటీఆర్కు సమన్లు జారీ చేసింది. అరవింద్ కుమార్, బీఎల్ఎన్రెడ్డికి సైతం సమన్లు పంపింది. జులై 31న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీచేసింది. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. -
తెలుగు రాష్ట్రాల్లో.. మూడో దశ ‘ఎస్ఐఆర్’కు ఈసీ ప్రకటన
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో.. మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో తెలుగు రాష్ట్రాలతో కలిపి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించింది. ఫేజ్-3 ప్రక్రియ కోసం 3.94 లక్షలకుపైగా బూత్స్థాయి అధికారుల్ని నియమించింది.ఏపీలో జులై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఓటర్ల ముసాయిదా జాబితా.. ఏపీలో సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రకటించనుంది. అదే విధంగా తెలంగాణలో జులై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఓటర్లు ముసాయిదా.. తెలంగాలో అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనుంది. ఏపీలో ఎస్ఐఆర్ షెడ్యూల్46,397 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ నియామకం68,868 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్మే 12 నాటికి 4,16,16,061 మంది ఓటర్లుజూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి ఓట్లు తనిఖీ చేయనున్న బిఎల్ఓలుజూన్ 14 పోలింగ్ కేంద్రాల రేషన్నలైజేషన్జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలజూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్, అభ్యంతరాల స్వీకరణజూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారంసెప్టెంబర్ 22న ఓటర్ల తుది జాబితా విడుదలతెలంగాణలో ఎస్ఐఆర్ షెడ్యూల్35,985 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ నియామకం25,886 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్మే 12 నాటికి 3,39,20,705 కోట్ల మంది ఓటర్లు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఓట్లు తనిఖీ చేయనున్న బిఎల్ఓలుజూన్ 24 పోలింగ్ కేంద్రాల రేషన్నలైజేషన్జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలజూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్, అభ్యంతరాల స్వీకరణజూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు క్లెయిమ్ అభ్యంతరాల పరిష్కారంఅక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితా విడుదలఈసీ అధికారిని కలవనున్న కాంగ్రెస్ నేతలుహైదరాబాద్: తెలంగాణ పీసీసీ ఛీఫ్, ఎమ్మెల్యేలు , ఎంపీలు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల అధికారిని కలవనున్నారు. త్వరలో తెలంగాణలో SIR పక్రియ చేపట్టనున్న నేపథ్యంలో తమకు ఉన్న అనుమానాలను తీర్చాలని ఎన్నికల అధికారిని కాంగ్రెస్ నేతలు కోరనున్నారు. -
లక్ష పెడితే 3 కోట్లు లాభం.. కాసుల వర్షం కురిపించిన హైదరాబాద్ స్టాక్
-
SI సురేష్ పెళ్లి పేరుతో మహిళా కానిస్టేబుల్ ని...
-
కేంద్రం.. ఆమోదమా? తిరస్కారమా?
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రెండోదశ పై మరోసారి ఉత్కంఠ నెలకొంది. కేంద్రం అనుమతి కోసం ఇప్పటికే సీఎం రేవంత్ సహా అధికారుల బృందం కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత సీఎం మరోసారి ప్రధాని మోదీతో మెట్రో అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ 4 రోజుల వ్యవధిలో రెండోసారి కేంద్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏడాది కాలంగా ఈ భేటీలు, సంప్రదింపులు సాగుతూనే ఉన్నాయి.. .. సీఎం సహా అధికారుల బృందాలు ఢిల్లీకి వెళ్తూనే ఉన్నారు. ఇటీవలి సమావేశాలు మెట్రో రెండో దశపై ఆశలు రేకెత్తిస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదించినట్లుగా తొలి దశను రాష్ట్ర ప్రభుత్వం ఎల్అండ్టీ నుంచి టేకోవర్ చేసింది. రుణాల రీఫైనాన్సింగ్తో పాటు ఎల్అండ్టీ బకాయిల చెల్లింపు జూన్తో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రెండో దశపై కేంద్రం నుంచి ఆమోదం పొందేందుకు కార్యాచరణను వేగిరం చేసింది.ఇంకా ఎన్నాళ్లు..?రెండోదశకు ప్రణాళికలను రూపొందించి, కేబినెట్ ఆమోదంతో దాదాపు 18 నెలల క్రితమే కేంద్రం అనుమతి కోసం డీపీఆర్లను అందజేశారు. ఇటీవల పలు నగరాల్లో మెట్రో నిర్మాణానికి కేంద్రం అనుమతులను అందజేసింది. హైదరాబాద్లో రెండో దశను మాత్రం పెండింగ్లో పెట్టింది. ఇప్పటికే రెండో దశలో పేర్కొన్న ‘ఏ’, ‘బి’ విభాగాల కోసం డీపీఆర్లను అందజేయగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఎలాంటి డీపీఆర్లు అందలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలోనే మొదటి దశ స్వాధీనంతో పాటు వివిధ అంశాలపై కేంద్రానికి స్పష్టమైన నివేదిక అందజేశారు. రెండో దశలో మొత్తం 8 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సమర్పించింది. దాదాపు రూ.48 వేల కోట్లతో అంచనాలను రూపొందించారు. మొదట.. రెండో దశలోనే ఈ కారిడార్లన్నీ పూర్తిచేయాలని ప్రతిపాదించారు. కానీ, ఇటీవల సీఎం రేవంత్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సమావేశమైన సందర్భంగా ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్సిటీకి మూడో దశలో చేపట్టాలని కోరారు. మరోపు మెట్రో నిర్మాణానికి జైకా, ఏడీబీ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు అందజేసేందుకు ఏడాది క్రితమే సంసిద్ధత వ్యక్తం చేసినా కేంద్రం నుంచి సావరిన్ గ్యారెంటీ లభించక ప్రతిష్ఠంభన నెలకొంది. గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా.. మెట్రో రెండో దశ పనులతో పాటు మూసీ ప్రక్షాళనను ప్రారంభించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించడంతో ఎన్నికలు సవాల్గా మారాయి. పాతబస్తీలో మెట్రో విస్తరణకు భూ సేకరణతో పాటు, రోడ్డు విస్తరణ చేపట్టారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మార్గాన్ని మొదట పూర్తి చేయనున్నారు. కానీ, రెండో దశపై కేంద్రం స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు. దీంతో హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ఢిల్లీకి ప్రదక్షిణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
మంత్రి అడ్లూరికి తప్పిన ప్రమాదం.. రోప్ తెగి కిందపడ్డ లిఫ్ట్
కరీంనగర్, సాక్షి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ఆస్పత్రి లిఫ్ట్లో దిగుతుండగా దురదృష్టవశాత్తు లిఫ్ట్ రోప్ తెగింది. దీంతో లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడడంతో అందులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది ఆయనను వెంటనే అందులో నుంచి బయిటకి తీశారు. అనంతరం గాయాలకు చికిత్స అందించారు. కాగా ఇటీవల లిఫ్ట్ ప్రమాదాలు తరచుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. -
లిఫ్ట్లో చిక్కుకుని తల్లడిల్లిన పసిపాప.. ఊపిరి ఆగిపోయింది..
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో హృదయాలను పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. గౌలిదొడ్డిలో ఉన్న ‘మహి వుమెన్ పీజీ’లో ఐదేళ్ల చిన్నారిని లిఫ్ట్ బలిదీసుకుంది. ఆడుకుంటూ అమాయకంగా గ్రిల్స్ ఉన్న లిఫ్ట్లోకి వెళ్లిన చిన్నారి బిస్తు సేఫ్ (5) అందులోనే చిక్కుకుపోయింది. ఆ తర్వాత నొప్పితో తల్లడిల్లిపోయింది. ఆ పసిపాప బయటపడలేకపోవడంతో చివరకు ఆమె ఊపిరి ఆగిపోయింది. జార్ఖండ్కు చెందిన బిస్తు సేఫ్ తన తాత, అమ్మమ్మలతో కలిసి ఆ హాస్టల్లో ఉంటోంది. కళ్లముందే ఆ చిన్నారి ప్రాణం పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. క్షణాల వ్యవధిలో ఆమె జీవితం ఆగిపోవడం.. కుటుంబానికి తట్టుకోలేని దుఃఖాన్ని మిగిల్చింది. పసిపాప నవ్వులతో మార్మోగాల్సిన ఆ ప్రదేశం ఇప్పుడు విషాదంతో నిండిపోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక అమాయక ప్రాణం ఇలా లిఫ్ట్లో ఇరుక్కుపోవడం భద్రతా ప్రమాణాలపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా, ప్రతి లిఫ్ట్కి సరైన భద్రతా చర్యలు తీసుకోవడం అత్యవసరం. -
జైలు జీవితం చూడాలంటే ఇదే ఛాన్స్! ఫీజు ఎంతంటే?
-
నేపాల్ పని మనుషులతో జాగ్రత్త.. మత్తు మందు ఇచ్చి.. చేతులు కట్టేసి..
-
సిటీలో దారుణం.. నేపాలీ పని మనుషులతో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జవహర్నగర్లో నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ గ్యాంగ్.. ఓనర్ దంపతుల చేతులు, కాళ్లు కట్టేసి ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి, రూ.30వేల నగదు చోరీ చేశారు. వరుస ఘటన నేపథ్యంలో పని మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేనని పలువురు చెబుతున్నారు.వివరాల మేరకు.. జవహర్నగర్లోని కౌకుర్లో మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గల్ప్ ఎన్క్లేవ్లో దంపతులు చేతులు, కాళ్లు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. డాక్టర్ విజయలక్ష్మీ దంపతులకు మత్తు మందు ఇచ్చి దోపీడి చేశారు. కాగా, నేపాలీ గ్యాంగ్ 13 రోజుల క్రితమే వారి ఇంట్లో పని మనుషులుగా చేరారు. అయితే, నేపాలీ మహిళ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటామని డాక్టర్ దంపతులను కోరడంతో వారు అందుకు అంగీకరించారు. ఈ క్రమంలో పని మనుషుల బంధువుల పేరుతో మరో ముగ్గురు నేపాలీలు ఇంట్లోకి వచ్చారు. అనంతరం.. ఇంట్లో పనిచేస్తున్న వారితో పాటు మరో ఐదుగురు కలిసి దోపిడీకి పాల్పడ్డారు. డాక్టర్ దంపతులకు మత్తు మందు ఇవ్వడంతో వారు నిద్రలోకి వెళ్లారు. దీంతో, ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి, రూ.30వేల నగదు చోరీ చేశారు. దోపిడీ సమయంలో సదరు ముఠా.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసింది. ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేసి పరారీ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే విశ్రాంత ఐపీఎస్ సతీమణి తనూజ రంజన్ హత్య కేసులో నిందితులు కూడా నేపాలీలు కావడం తెలిసిన విషయమే. ఈ హత్య కేసులో కీలక సూత్రధారి కల్పన అలియాస్ ధర్మ (30) నేపాలీ గ్యాంగ్ స్కెచ్లో భాగంగానేహైదరాబాద్కు వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన కాల్డేటాను విశ్లేషించిన పోలీసులకు బెంగళూరులోని ఆమె భర్తగా పేర్కొంటున్న వ్యక్తితో ఎక్కువగా మాట్లాడిందని, అతడితో పాటు మరికొంతమంది వ్యక్తులతో సైతం ఫోన్లో మాట్లాడినట్లు తేలింది. వారందరిపై పోలీసులు నిఘా పెట్టారు. నగరంలో కల్పనను ఉద్యోగంలో నియమించిన వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు.కల్పన తల్లిదండ్రులు పూణేలో నివాసం ఉంటారని గుర్తించిన పోలీసులు వారిని సైతం ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. నేపాల్ సరిహద్దులు దాటేందుకు యూపీలోని మూడు ప్రాంతాల్లో అవకాశం ఉండగా, అక్కడకు ఇప్పటికే చేరుకున్న పోలీసులు వారికోసం కాపు కాస్తున్నారు. కాగా తనూజరంజన్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన వైద్యులు ప్రాథమిక నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. నేపాల్లో ఉంటూనే భారత్లో వందలాదిమంది నేపాలీ వ్యక్తులను పావులుగా వాడుకుంటూ చోరీలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు విదేశీ వ్యవహారాలశాఖ సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సిట్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు ముమ్మరమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సిట్ బృందం బండి భగీరథ్కు నోటీసులు జారీ చేసింది. పోక్సో కేసులో నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల్లో రేపు మధ్యాహ్నం 2గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరు కావాలని సూచించింది.భగీరథ్ను వెంట తీసుకుని రావాలని కరీంనగర్లో నివసించే అతని మేనమామ వంశీ కృష్ణకు పోలీసులు నోటీసులు పంపించారు. మరోవైపు బండి బగీరథ్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎల్లుండి విచారణకు రానుట్లు తెలుస్తోంది. భగీరథ్.. తన కుమార్తెను వేధిస్తున్నాడంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఈ నెల 8న కేసు నమోదైన సంగతి తెలిసిందే. మరోవైపు ఆ బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8వ తేదీనే కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు తర్వాత భగీరథ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. సోమవారం (మే11,2026)న భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈ మేరకు మెమో జారీ చేసింది. ‘‘సైబరాబాద్ కూకట్పల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రితిరాజ్ పెట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ క్రైం నెం. 684/2026లో బీఎన్ఎస్ 74, 75 సెక్షన్లు, పోక్సో 12 సెక్షన్ కింద నమోదైన కేసు దర్యాప్తును వ్యక్తిగతంగా పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాం.దర్యాప్తు సరైన, నిష్పాక్షిక, వృత్తిపరమైన విధానంలో సాగేటట్లు చూసి, కేసుకు సంబంధించిన అన్ని అంశాలను నిర్లక్ష్యం లేకుండా, ఎటువంటి తప్పుదారి పట్టింపు లేకుండా పరిశీలించాల్సిందిగా ఆమెకు ఆదేశాలు ఇచ్చాం. దర్యాప్తు పురోగతిని డీసీపీ వ్యక్తిగతంగా పర్యవేక్షించి, ప్రతిరోజూ దర్యాప్తు నివేదికపై సంతకం చేసిన అధికారికి తప్పనిసరిగా సమర్పించాలి’’ అని పేర్కొంది. -
తాను చనిపోయి 5 మందికి ప్రాణదానం


