breaking news
Hyderabad
-
‘స్వీట్’ కపుల్ : ఐటీని వదిలేసి, లక్ష పెట్టుబడితో ఏడాదికి రూ. 2కోట్లు
అనుకున్నది సాధించాలంటే సాహసం చేయక తప్పదు.పట్టుదలగా ప్రయత్నిస్తే విజయం వంగి సలాం చేస్తుంది. విదేశాల్లో కార్పొరేట్ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి మరీ తమకిష్టమైన వ్యాపారంలోకి అడుగుపెట్టిన దంపతులు సక్సెస్ సాధించారు. పదండి వారి సక్సెస్ గురించి తెలుసుకుందాం.సందీప్ జోగిపర్తి (Saandeep Jogiparti), కవిత గోపు (kavitha gopu) దంపతులు ఐదేళ్లపాటు అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేసేవారు. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం కానీ వారికి అది సంతృప్తినివ్వలేదు. స్వంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనే కలను సాకారం చేసుకునేందుకు 2019లో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్వేషణ మొదలైంది. సందీప్ ఆరు నుండి ఎనిమిది నెలలు భారతదేశం అంతటా ప్రయాణించారు.ఆ సమయంలో ఆహారం, ఫిట్నెస్ పరిశ్రమ వారి దృష్టిని ఆకర్షించింది. సందీప్కు స్వీట్లంటే చాలా ఇష్టం. పైగా భోజనం తర్వాత ఏదైనా తీపి తినడం ఇంకా (చాలామందికి) అలవాటు. మార్కెట్ నిండా ఎనర్జీ బార్లు,స్నాక్స్ , స్వీట్లు, కృత్రిమ స్వీట్లతో నిండి తీపిపదార్థాలతో నిండి పోయాయి. అందుకే దీనికి భిన్నంగా ఆరోగ్యం, పోషకాలతో నిండిన స్వీట్లను తయారు చేయాలని భావించారు. అలా 2020లో పుట్టింది హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ లడ్డుబాక్స్. తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, గింజలు, మిల్లెట్స్, బెల్లం, ఆవు నెయ్యితో తయారు చేసిన లడ్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్, వేరుశెనగలు, బెల్లం నెయ్యి వంటి స్థానిక పదార్థాలను ఉపయోగించి 11 రకాల లడ్డూలు విక్రయిస్తారు. ప్రతి ఒక్కటి 21 రోజుల షెల్ఫ్-లైఫ్ కలిగి ఉంటుంది. ఇంకా ఖాక్రాస్, చిక్కీలు, నట్స్ అండ్ స్వీట్స్ వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ను కూడా విక్రయిస్తారు.చక్కెర, ప్రిజర్వేటివ్లు, కృత్రిమ రంగులు లేకుండా అధిక పోషకాల లడ్డూలను విక్రయించడమే వీరి లక్ష్యం.చదవండి: Prasadam Recipes : వరమహాలక్ష్మీ దేవికి శుచిగా, రుచిగా ప్రసాదాలుకేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన లడ్డూ బాక్స్ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 2 కోట్ల వార్షిక టర్నోవర్ను సాధించింది. కేవలం 4 రకాల లడ్డూల నుండి, ఇప్పుడు 15 రకాలను అందిస్తుంది. 2020 మేలో COVID-19 సమయం వారికి అనుకూలంగా పనిచేసింది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో లడ్డూబాక్స్కు అద్భుత మైన స్పందన వచ్చింది.భారతదేశం అంతటా డెలివరీ చేస్తారు. పెద్ద B2B ఆర్డర్స్ తీసుకుంటారు. హైదరాబాద్లో వారి స్వంత స్టోర్ ఉంది.2025 చివరికి బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, ఢిల్లీ NCR అంతటా 100 స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: తండ్రి కల.. తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్.. ఐఏఎస్ లక్ష్యం -
భార్యపై ఇన్స్టాలో భర్త అసభ్య పోస్టులు.. నవవధువు ఆత్మహత్యాయత్నం
సాక్షి, రాంగోపాల్పేట్: ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసికున్నారు. మూడు నెలలకే భార్యపై అనుమానం పెంచుకున్న అతను ఇన్స్ట్రాగామ్లో అసభ్యంగా పోస్టులు పెడుతుండటంతో మనస్తాపానికి లోనైన నవవధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. రాంగోపాల్పేట్ గైదీన్బాగ్కు చెందిన కీర్తి, రామంతపూర్కు చెందిన భీమ్రాజ్ ప్రేమించుకున్నారు. మే 8న పెద్దలను ఎదిరించి సైదాబాద్లోని ఆర్యసమాజ్లో పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే ఇటీవల అత్తింటి వారు కట్నం కోసం వేధిస్తుండటంతో ఆమె పుట్టింటికి తిరిగి వచ్చింది. బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్ ఇచ్చారు.ఆ తర్వాత ఆమె మళ్లీ అత్తారింటికి వెళ్లగా మళ్లీ అదే పరిస్థితి ఎదురు కావడంతో ఆమె తిరిగి పుట్టింటికి వచ్చింది. రెండు రోజుల క్రితం తాను గర్భవతి అని తెలియడంతో భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అయితే ఆ బిడ్డ తనకే పట్టాడని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించడంతో మనస్తాపానికి లోనైన కీర్తి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. బుధవారం సాయంత్రం బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాంగోపాల్పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్ లో వర్ష భీభత్సం
-
ముంచెత్తిన వాన.. చెరువులుగా మారిన రోడ్లు
సాక్షి, హైదరాబాద్/తిర్యాణి/కెరమెరి/కౌటాల: హైదరాబాద్ మహానగరంలో గురువారం రాత్రి కుండపోత వర్షం భీభత్సం సృష్టించింది. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఓపెన్ నాలాలు, డ్రైనేజీల మ్యాన్హోల్స్ పొంగిపొర్లాయి. చాలాచోట్ల పార్క్ చేసిన కార్లు నీట మునగగా, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. వాహనదారులతోపాటు పాదచారులు సైతం నరక యాతన పడ్డారు.సుమారు 43 ఫీడర్ల (11 కేవీ) పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. నగరం మొత్తం సుమారు గంటన్నర పాటు వర్షం దంచి కొట్టింది. గురువారం రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా గచ్చిబౌలిలో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్నగర్, శ్రీనగర్ కాలనీల్లో 12 సెంటీæమీటర్ల వర్షం కురిసింది. గంట వ్యవధిలోనే 7 నుంచి 9 సెంటీమీటర్ల వర్షం పడింది. నగర శివారులోని పలు అపార్ట్మెంట్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు.నగరమంతా ట్రాఫిక్ చక్రబంధం..రోడ్లపై వరదనీరు భారీగా నిలిచిపోవటంతో హైదరాబాద్ నగరం మొత్తం గంటలపాటు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయింది. ఎల్బీనగర్ నుంచి చాదర్ఘాట్ వరకు, పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ మీదుగా గచ్చిబౌలి వరకు, ఖైరతాబాద్ నుంచి బేగంపేట వరకు, మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వరకు, గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు, ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు, బషీర్బాగ్ నుంచి కోఠి మీదుగా మలక్పేట వరకు, ట్యాంక్బండ్ నుంచి ఎస్పీరోడ్, ఆర్పీరోడ్ వరకు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.కూ కట్పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్, కుత్బుల్లాపూర్, నిజాంపేట్, మల్కా జిగిరి, ఖైరతాబాద్, హిమాయత్నగర్, సికింద్రాబా ద్, నాంపల్లి, చార్మినార్, ఎల్బీనగర్, రాజేంద్రన గర్, ఐకియా, బయో డైవర్సిటీ, కొండాపూర్ జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖైరతా బాద్ – రాజ్భవన్ రహదారి నీట మునిగింది.పలు జిల్లాల్లోనూ..పలు జిల్లాల్లోనూ గురువారం భారీ వర్షం కురిసింది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వరంగల్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం పడింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మూడు మండలాల్లో పిడుగుపాటుకు ఏడు పశువులు మృతిచెందాయి. చేలల్లో పని చేస్తున్న పలువురు గాయపడ్డారు. -
హైదరాబాద్లో వర్ష బీభత్సం (ఫొటోలు)
-
HYD Rains: హైదరాబాద్ లో వర్ష బీభత్సం
-
హైదరాబాద్లో కుండపోత.. భారీగా ట్రాఫిక్ జామ్
Hyderabad Rains Updates: హైదరాబాదులో భారీ వర్షాల నేపథ్యంలో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లుNDRF ఫోన్ నెం.8333068536, ఐసీసీసీ 8712596106.హైడ్రా ఫోన్ నెం.9154170992, ట్రాఫిక్ 8712660600.సైబరాబాద్ 8500411111, రాచకొండ 8712662999.TGSPDCL ఫోన్ నెం.7901530966, RTC 9444097000.GHMC ఫోన్ నె.8125971221, HMWSSB 9949930003.👉జంట జలాశయాల్లోకి భారీగా వరదకాసేపట్లో హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తనున్న అధికారులులోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనకిస్మత్పూర్, బండ్లగూడ, సన్సిటీ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారుల సూచనవరద నీటిలో మునిగిన ఖైరతాబాద్-రాజ్భవన్ రహదారిమోండా మార్కెట్, బండిమెట్లో భారీగా వరదజీడిమెట్ల, సుచిత్రలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరాబేగంబజార్, గౌలిగూడ బస్తీల్లో భారీగా నిలిచిన వరదభారీ వర్షానికి మణికొండలో కారుపై కూలిన గోడయూసుఫ్గూడ, కృష్ణానగర్లో భారీగా వరద ప్రవాహంభారీ వర్షానికి మాదాపూర్లో పొంగుతున్న డ్రైనేజీ👉నగరంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షం మెుదలైంది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మూసాపేట్, కూకట్పల్లి, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మణికొండ, మియాపూర్, చందానగర్, బాలానగర్ సనత్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్....అబ్దుల్లాపూర్మెట్, పెద్ద అంబర్పేట్. దిల్సుఖ్నగర్ చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, నాచారం తార్నాక, నల్లకుంట హబ్సిగూడ, బేగంపేట్, వారణాసిగూడ, కంటోన్మెంట్, మారేడుపల్లి, హియాయత్నగర్, లక్డీకపూల్, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.👉హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు.👉జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.👉నగరంలో భారీగా వర్షపాతం నమోదైంది. ఖాజాగూడలో 12 సెంటీ మీటర్లు, ఎస్ఆర్ నగర్ 11, ఖైరతాబాద్ 11, సరూర్నగర్లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురవడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఒక వైపు వర్షం.. మరో వైపు ట్రాఫిక్ జామ్తో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు. కిలో మీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. చాదర్ఘాట్ నుండి ఎల్బీ నగర్ వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.👉ఆఫీసుల నుంచి ప్రజలు బయటకు వచ్చే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షాల దాటికి రోడ్లపైకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, పటాన్చెరువు, ఖైరతాబాద్, మల్కాజిగిరి, నాంపల్లి, మెహదీపట్నం, గోల్కొండ, కాప్రా, సికింద్రాబాద్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ముందుగానే తెలంగాణ వెదర్మ్యాన్ హెచ్చరించాడు. కొన్ని ప్రాంతాల్లో 2.5-4 సెం.మీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.👉కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాదాపూర్, కొండాపూర్ బయోడైవర్శిటీలో భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.👉బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నల్లగొండ, యాదాద్రి, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ముందని.. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్రెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఓయూ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 2016లో రేవంత్ రెడ్డిపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓయూలో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించారంటూ రేవంత్పై ఫిర్యాదు చేయగా.. రేవంత్రెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదైంది.విచారణ పూర్తి చేసిన పోలీసులు.. అభియోగపత్రం దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది. ఈ కేసును కొట్టేయాలంటూ రేవంత్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటరకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణ వాయిదా వేసింది. -
పబ్లో యువతి పట్ల అసభ్యకర ప్రవర్తన
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–36 లోని క్రిస్టల్ క్లబ్ పబ్లో ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ముగ్గురు యువకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మణికొండలో నివసించే యువతి (29) మంగళవారం రాత్రి తన స్నేహితురాలితో కలిసి క్రిస్టల్ పబ్కు వచ్చారు. రాత్రి 11.40 గంటల ప్రాంతంలో వీరి వెనుక సీట్లో కూర్చొన్న ఓ యువకుడు వాటర్ బాటిల్ను యువతి ఉన్న చోటికి వదిలాడు. తీసుకునే క్రమంలో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. రాత్రి 12.10 గంటల ప్రాంతంలో సదరు యువతి స్నేహితురాలితో కలిసి బయట నిలబడగా భరత్, మారుతి, డోనాల్డ్ అనే ముగ్గురు యువకులు బయటకు వచ్చి మరోసారి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అప్పటికే ఆమె సోదరుడు బయటకు రాగా తీవ్రంగా కొట్టారు. ఆపేందుకు వెళ్లిన ఆమెను దూషించారు. విషయం తెలుసుకున్న బౌన్సర్లు బయటకు వచ్చి యువకులను కట్టడి చేసేందుకు యతి్నంచగా వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో బాధిత యువతితో పాటు ఆమె సోదరుడికి తీవ్ర గాయాలు కాగా, అదే రోజు అర్ధరాత్రి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. జరిగిన ఘటన పట్ల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు భరత్, మారుతి, డోనాల్డ్పై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
IND vs ENG: అసదుద్దీన్ ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదే.. పోస్ట్ వైరల్
ఇంగ్లండ్ గడ్డ మీద అదరగొట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై ప్రశంసల వర్షం కొనసాగుతూనే ఉంది. ఓడిపోతామనుకున్న ఆఖరి టెస్టు (IND vs ENG 5th Test)లో అద్భుత ప్రదర్శనతో సిరాజ్ భారత్ను గెలిపించిన తీరు.. అమోఘమంటూ మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులూ కొనియాడుతున్నారు. ఆల్వేస్ వి న్నర్ఇందులో భాగంగా సిరాజ్ మియాను ఉద్దేశించి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసాపూర్వక ట్వీట్ చేశారు. ‘‘‘ఎల్లప్పుడూ విజేతే.. మన హైదరాబాదీ శైలిలో చెప్పాలంటే.. పూరా ఖోల్ దియే పాషా!’’ అంటూ ఒవైసీ సిరాజ్ను అభినందించారు. బౌలర్గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడని కితాబు ఇచ్చారు. ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదేఇక సిరాజ్ కూడా ఇందుకు బదులిస్తూ.. ‘‘ధన్యవాదాలు సార్.. ఎల్లవేళలా నన్ను ప్రోత్సహిస్తూ చీర్ చేస్తున్నందకు కృతజ్ఞతలు’’ అంటూ హార్ట్ సింబల్తో పాటు నమస్కారం పెడుతున్నట్లుగా ఉండే ఎమోజీని షేర్ చేశాడు. సిరాజ్ ఈ మేరకు ఒవైసీకి థాంక్యూ చెబుతూ చేసిన పోస్ట్ అర మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది.కెరీర్ బెస్ట్ ర్యాంకులో సిరాజ్ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్లోనూ దూసుకుపోయాడు. ఓవల్లో జరిగిన చివరి టెస్టులో 9 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఈ హైదరాబాదీ బౌలర్.. బుధవారం విడుదల చేసిన ఐసీసీ బౌలర్ల తాజా ర్యాంకింగ్స్లో 12 స్థానాలు ఎగబాకాడు. సిరాజ్ 674 రేటింగ్ పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. గతంలో సిరాజ్ అత్యుత్తమంగా 16వ ర్యాంక్ సాధించాడు.ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా (889 పాయింట్లు) అగ్ర స్థానంలో కొనసాగుతుండగా... భారత్ నుంచి రవీంద్ర జడేజా (17వ స్థానం) కూడా టాప్–20లో ఉన్నాడు. టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్ (792 రేటింగ్ పాయింట్లు)కు చేరుకున్నాడు. ఇంగ్లండ్తో సిరీస్లో జైస్వాల్ 2 సెంచరీలు సహా మొత్తం 411 పరుగులు చేశాడు.ఈ జాబితాలో జో రూట్ (908) తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకోగా... రిషభ్ పంత్ (8వ), శుబ్మన్ గిల్ (13వ)లకు టాప్–20లో చోటు లభించింది. టెస్టు ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (405 పాయింట్లు) నిలకడగా నంబర్వన్గా కొనసాగుతుండగా... వాషింగ్టన్ సుందర్ 16వ ర్యాంక్లో ఉన్నాడు. హైదరాబాద్లో సన్మానం! ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల పోరులో అత్యధికంగా 23 వికెట్లు తీసి సిరీస్ను భారత్ సమంగా ముగించడంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్ సొంతగడ్డకు చేరుకున్నాడు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో సన్నిహితులు, అభిమానులు అతనికి స్వాగతం పలికారు. ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్తో కలిసి లండన్ నుంచి నేరుగా ముంబైకి చేరుకున్న సిరాజ్ ఆ తర్వాత స్వస్థలానికి వచ్చాడు. వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ వరకు భారత జట్టు ఎలాంటి మ్యాచ్లు ఆడటం లేదు.ఈ నేపథ్యంలో నగరంలోనే ఉండనున్న సిరాజ్కు త్వరలోనే ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) యోచిస్తోంది. ప్రస్తుతానికి అధ్యక్ష, కార్యదర్శులు వివిధ ఆరోపణలతో జైలులో ఉన్నందుకు ఈ కార్యక్రమ నిర్వహణ తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి: Asia Cup 2025: అతడు భేష్.. ఇతడు ఓకే.. టీమిండియా సెలక్టర్లకు తలనొప్పి! -
హైదరాబాద్ : ఓ ఈవెంట్లో సందడి చేసిన మానసా వారణాసి (ఫొటోలు)
-
‘సృష్టి’ కేసులో మరో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ‘సృష్టి’ కేసులో గోపాలపురం పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సికింద్రాబాద్కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్ హెడ్లను వాడి నమ్రత పలువురికి ఇంజక్షన్లు, మందులు ఇచ్చినట్లు తేలింది. తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ చూసి షాక్ తిన్న.. ఆ గైనకాలజిస్ట్ డాక్టర్ నమ్రతపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరోగసి పేరుతో 80 మంది పిల్లలను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.పిల్లలను అమ్ముకున్నట్టు అంగీకరించిన నమ్రత.. వేర్వేరు ప్రాంతాల నుంచి పిల్లలను సేకరించామని.. అందరికీ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశామని తెలిపారు. అయితే, ఏజెంట్ల వివరాలు లేవంటూ ఆమె చెప్పింది. 80 మంది పిల్లల తల్లిదండ్రుల వివరాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. మళ్లీ నమ్రతను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పలు రాష్ట్రాలకు చెందిన 9 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ల సంఖ్య మొత్తం 26కి చేరింది.కాగా, ఈ కేసులో నిందితురాలైన విద్యుల్లతకు బెయిల్ లభించింది. కేసులో ఏ16గా ఉన్న ఆమెకు సికింద్రాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెను సోమవారం.. ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో డాక్టర్ విద్యులత ఉన్నారు. A3 కల్యాణి, A6 సంతోషిల ఐదు రోజుల కస్టోడీయల్ విచారణ నేటితో ముగిసింది. నిందితులను గోపాలపురం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. -
ప్లాట్ల వేలం.. రూ.100 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బహిరంగ వేలం ద్వారా చేపట్టిన ఓపెన్ ప్లాట్ల విక్రయాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. గత రెండు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మంగళవారం మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్ పల్లి ప్రాంతంలోని 68 ప్లాట్లకు సంబంధించిన బహిరంగ వేలం ప్రక్రియ చేపట్టారు. వేలం నిర్వహించిన 50 ప్లాట్ల విక్రయానికి సంబంధించి దాదాపు రూ.100 కోట్ల మేర ఆదాయం వచ్చిందని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డుకు (Outer Ring Road) అతి సమీపంలోని ఈ భూములను కొనుగోలు చేయడానికి సుమారు 119 మంది బిడ్డర్లు పాల్గొన్నారు.200– 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లలో, కార్నర్ ప్లాట్కు రూ 30 వేలు, ఇతర ప్లాట్లకు రూ.27 వేలు ఆఫ్ సెట్ ధరగా నిర్ణయించారు. ఒక్కో ప్లాట్ కోసం దాదాపు 30 మంది వరకు పోటీ పడ్డారు. కార్నర్ ప్లాట్లకు మంచి డిమాండ్ రేటు పలికింది. రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన 50 ప్లాట్లకు సంబంధించిన వేలంలో గరిష్టంగా చదరపు గజానికి రూ. 46,500 ధర పలికింది.చదవండి: ఇల్లు కొనడానికి ఇదే శుభ తరుణం -
దేనికింద ఏముందో.. ఏది కుంగనుందో?
సాక్షి, హైదరాబాద్: నాలాలు కుంగిపోయి వాహనాలు దిగబడుతున్నా దిక్కేలేకుండా పోయింది. కుహరాల్లా కుంగిపోతున్నా బల్దియాకు సోయే లేకుండాపోతోంది. గత ఏడాది బంజారాహిల్స్ రోడ్ నెంబర్– 11 ఉదయ్నగర్లో నాలా శ్లాబ్తో పాటు రిటైనింగ్ వాల్ కూలింది. గోషామహల్ చాక్నవాడి ప్రాంతంలో నాలాశ్లాబ్ స్వల్ప సమయంలోనే ఐదారుసార్లు కుంగింది. ఈ సంవత్సరం కూడా ఆ శ్లాబ్ కూలింది. వాహనాలు దిగబడ్డాయి. గతంలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ ప్రాంతంలోనూ నాలాపైనున్న రోడ్డు కుంగిపోయింది. ఇలా ఎంతోకాలంగా నగరంలోని నాలాల పైకప్పులు, నాలాలపై ఉన్న రోడ్లు కుంగిపోవడం, వాహనాలు అందులో దిగడం పరిపాటిగా మారినా ప్రమాదాలు జరగకుండా గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ ఎలాంటి శ్రద్ధ చూపడంలేదు. పురాతన కాలం నాటివెన్నో.. నగరంలోని నాలాలు ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినవి. నిజాం కాలం నాటి నాలాలూ వాటిల్లో ఉన్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన నాలాలు, వాటి పైకప్పులు (రోడ్లు) ఎలా ఉన్నాయి.. ఏమేర దెబ్బతిన్నాయి వంటి అంశాలను అధికారులు ఏనాడూ పట్టించుకోలేదు. నాలాల కింద ఎక్కడెక్కడ ఏమేమున్నాయో తెలిసే ఇన్వెంటరీ కూడా జీహెచ్ఎంసీ వద్ద లేదు. దీంతో.. ఏ నాలా కింద ఏముందో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలిసే పరిస్థితి లేదు. తాజాగా బంజారాహిల్స్లో నాలాలో వాటర్ ట్యాంకర్ దిగబడటంతో ఈ అంశం మళ్లీ తెరమీదికొచి్చంది. భారీ వాహనం కావడంతో నాలాలో పడిపోయింది. కనీసం నాలాలున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ప్రయాణించేందుకు హెచ్చరికల బోర్డుల వంటివి సైతం ఎక్కడా ఏర్పాటు చేయలేదు. గతంలోనూ నాలాలపై రోడ్లు కుంగినప్పుడు సైతం ఏ నాలా పరిస్థితి ఏమిటో, వాటికింద ఏమేమున్నాయో, రిటైనింగ్ వాల్స్ పరిస్థితేమిటో తెలుసుకోవాలనుకోలేదంటే అధికారుల తీరును అంచనా వేయవచ్చు. రూ.55 కోట్లు ఖర్చు చేస్తున్నా.. జీహెచ్ఎంసీ పరిధిలో 955 కిలోమీటర్ల మేర నాలాల్లో పూడికతీతల కోసం దాదాపు రూ. 55 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ.. రోడ్ల దిగువనున్న నాలాల పరిస్థితిని పట్టించుకోవడం లేదు. అదృష్టవశాత్తు నాలాల్లో వాహనాలు దిగబడినప్పుడు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.అదే వాహనాల్లో ఎక్కువమంది ఉండి ప్రమాదం తీవ్రమైతే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఆధునికీకరణ సరే.. ఆపదల మాటేమిటి? వరద ముంపు సమస్యల పరిష్కారం కోసం వ్యూహాత్మక నాలా అభివద్ధి పథకం కింద ఇప్పటికే దాదాపు రూ. 950 కోట్లు ఖర్చుచేశారు. నాలాల ఆధునికీకరణ, నీటి పారుదలకు బాక్స్ డ్రెయిన్ల నిర్మాణాల వంటివి చేపట్టారు కానీ.. పురాతన నాలాలపై కనీస శ్రద్ధ పెట్టలేదు. వీటిలో కాలనీలు, స్లమ్స్ మధ్యన ఉన్నవి కూడా ఎన్నో ఉన్నాయి. నాలా రిటైనింగ్ వాల్స్నే ఆనుకుని వెలసిన అపార్ట్మెంట్లు సైతం ఉన్నాయి. అయినప్పటికీ, నాలాల వల్ల కలిగే ప్రమాదాల గురించి అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. నాలా సేఫ్టీ ఆడిట్ పేరిట ప్రతి నాలానూ అధికారులు తనిఖీలు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ, నాలాల శ్లాబ్ (రోడ్)లు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేరు. శిథిల భవనాల విషయంలో మొక్కుబడి సర్వేలు చేస్తున్నప్పటికీ, పురాతన నాలాలు, వాటిపై ఉన్న రోడ్ల స్టెబిలిటీ గురించి మా త్రం కనీసం పట్టించుకోవడం లేదు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే.. ఏ నాలా ఎప్పుడు కుంగుతుందో తెలియని దుస్థితి దాపురించింది. కాగితాలకే పరిమితం.. నాలా సేఫ్టీ చర్యల్లో భాగంగా ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో నడుచుకుంటూ వెళ్లి పరిశీలించాలి. రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పున్న ఓపెన్ నాలాలకు అన్ని ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఉండాలి. పైకప్పులున్న నాలాల్లో ఎక్కడైనా కప్పులు దెబ్బతిన్నా, ఓపెన్గా ఉన్నా గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నది కాగితాలకే పరిమితమైంది. వరదనీరు ఏ నాలా నుంచి ఎక్కడకు వెళ్తుందో కూడా తెలియని అధికారులున్నారంటే అతిశయోక్తి కాదు. బలహీనంగా నాలా కప్పులు నగరంలో ప్రస్తుతమున్న నాలా వ్యవస్థ గంటకు 20 మి.మీ వర్షపాతాన్ని మాత్రమే తట్టుకోగలదు. సగటున గంటకు 60 మి.మీ.లకు పైగా వర్షపాతం న మోదవుతుండటంతో ఉన్న నాలాలు వర్షాన్ని తట్టుకునేలా లేవు. దాంతో నాలాల పైకప్పులూ బలహీనమవుతున్నాయి. 000లో కురిసిన భారీ వర్షాలతో అప్పటి ఎంసీహెచ్ పరిధి వరకు వరద కాలువలపై అధ్యయనం చేసిన కిర్లోస్కర్ కమిటీ సమగ్ర నివేదిక రూపొందించింది. 170 కి.మీ పొడవున్న 71 నాలాలను తక్షణం విస్తరించాలని సూచించింది. 2007లో జీహెచ్ఎంసీగా> రూపాంతరం చెందాక గ్రేటర్ పరిధి మొత్తానికి వాయెంట్స్ సొల్యూషన్స్ వరదనీటి కాలువలపై అధ్యయనం చేసింది. 20మి.మీ మించి వర్షం కురిసిన ప్రతిసారీ నగరం నీట మునుగుతోంది. 390 కి.మీ మేర మేజర్ నాలాలను ఆధునికీకరించాలని వాయెంట్స్ సొల్యూషన్స్ సూచించింది. నాలాల వెంబడి బఫర్జోన్ పరిధిలో మొత్తం 28వేల అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించింది. రోడ్డు కుంగి నాలాలో కూరుకుపోయిన వాటర్ ట్యాంకర్బంజారాహిల్స్: రోడ్ నెం– 1లోని మహేశ్వరి చాంబర్స్ అపార్ట్మెంట్ వీధిలో ఓ వాటర్ ట్యాంకర్ నాలాలో దిగబడిన ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి ఈ రోడ్డులోని నాలా కుంగిపోయింది. దీంతో అపార్ట్మెంట్కు వస్తున్న వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అపార్ట్మెంట్ రోడ్డు నుంచి ప్రధాన రోడ్డుకు రాకపోకలు నిలిచిపోయాయి. వాటర్ ట్యాంకర్ను వెలికితీసేందుకు 70 టన్నుల క్రేన్ కావాల్సి ఉంటుందని, ఇంత పెద్ద క్రేన్ నిలిపేందుకు అక్కడ స్థలం లేకపోవడంతో సాయంత్రం వరకు అధికారులు తర్జనభర్జన పడ్డారు. రాత్రి వరకు క్రేన్ ద్వారా నాలాలో పడిపోయిన ట్యాంకర్ను తొలగిస్తామని ఈఈ విజయ్కుమార్ తెలిపారు. సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన నాలా కావడంతో కుంగిపోయిందని అధికారులు గుర్తించారు.మాస్టర్ప్లాన్ ఏదీ?నాలాలపై ఉన్న రోడ్లపై వాహనాల రాకపోకలతో దెబ్బతినే ప్రమాదాలున్నందున నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు చేయాల్సి ఉన్నా ఆ పని జరగడం లేదు. వర్షం వచి్చనప్పుడు నీరు నాలాల్లో చేరినప్పటి నుంచి ఎక్కడి నుంచి వెళ్లి ఎక్కడ కలుస్తోంది వంటి వివరాలు లేవు. నిర్వహణ లేదు. నాలాలకు మాస్టర్ప్లాన్ అనేదేమీ లేదు. అక్రమ నిర్మాణాల కారణంగానూ నాలా పరిసరాలు బలహీనమవుతున్నాయి. నాలాలకు అడ్డుగా ఉన్న పైపులైన్లు తదితర యుటిలిటీస్ను తరలించడం, నాలాల్లో చెత్తా చెదారాలు చేరకుండా చూడాల్సి ఉంది. పైకప్పుల్ని బలోపేతం చేయాల్సి ఉంది.కాంక్రీట్ కప్పుల వల్లే.. నాలాలపై కాంక్రీట్ కప్పుల (రోడ్ల) వల్ల లోపల మరమ్మతులు చేయలేని పరిస్థితులుంటున్నాయి. లీకేజీలు గుర్తించలేకపోతున్నారు. చాలాకాలం క్రితం నిర్మించిన నాలాల పైకప్పులు బీటలు పడుతున్నా పట్టించుకోవడం లేదు. అంబర్పేట, బేగంబజార్, విజయ్నగర్ కాలనీ, మలక్పేట తదితర ప్రాంతాల్లోనూ కప్పులు దెబ్బతిని ప్రమాదాలు జరిగాయి. వీటికి తగిన పరిష్కారాలపై దృష్టి సారించాల్సి ఉంది. -
ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ
-
నో ఫోన్ అవర్..! స్వేచ్ఛ కోసం ఆత్మీయ పిలుపు..
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘నో ఫోన్ అవర్’ అనే సరికొత్త ప్రచారం చక్కర్లు కొడుతోంది. నో ఫోన్ అవర్ ఒక సాధారణ ప్రచారం మాత్రమే కాదు.. నేటి అధునాతన జీవనశైలిలో స్వేచ్ఛను అన్వేషించుకునే ఆత్మీయ పిలుపు అని నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ హోం అప్లయన్స్ బ్రాండ్ కెన్స్టార్ ఆధ్వర్యంలో ఈ ‘నో ఫోన్ అవర్’లో భాగంగా ఆగస్టు 15న సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకూ మొబైల్ ఫోన్లు ఆఫ్ చేసి, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో ఆ సమయాన్ని గడపాలని పిలుపునిస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్ ప్రపంచపు గందరగోళం నుంచి బయటపడి, నిజమైన ఆనందాన్ని, అనుబంధాన్ని మళ్లీ ఆస్వాదించేలా కెన్స్టార్ ఆహ్వానిస్తోంది. కెన్స్టార్ సీఈఓ సునిల్ జైన్ మాట్లాడుతూ.. బాధ్యతగల పౌరులుగా మన మూలాలను గుర్తుచేసుకుంటూ, ముఖ్యమైన వారితో కలిసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు. ఈ డిజిటల్ యుగంలో మనకు వేలాది ఆన్లైన్ ఫాలోవర్స్ ఉన్నా, మనుషులతో కలిసుండాలన్న కోరిక ఇంకా బతికే ఉంది. ‘నో ఫోన్ అవర్’ ఆ కోరికను తీర్చగలిగే సరికొత్త ప్రయత్నమని తెలిపారు. ఈ అనుభవాలను సోషల్ మీడియాలో # NoPhoneHour హ్యాష్ట్యాగ్తో కథలు, వీడియోలు, ఆడియో సందేశాల రూపంలో పంచుకోవాలని పేర్కొన్నారు. (చదవండి: 'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ': నటి లిసా రే) -
'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ' : నటి లిసా రే
‘నేను అత్యంత క్రమశిక్షణ కలిగిన మోడల్ను. కానీ దీని కోసం భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 37 ఏళ్ల వయసులో ఒక అసాధారణమైన రీతిలో బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. నేను ఐదు సంవత్సరాలు మించి బతకబోనని వైద్యులు చెప్పారు.. కానీ నా అంతరాత్మ మాత్రం నన్ను బలంగా నిలిపింది. ఇప్పడు నేను 53 ఏళ్ల వయసులో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నాను’ అని చెప్పుకొచ్చారు ప్రముఖ నటి, రచయిత లిసారే. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘ది మేనీ లైవ్స్ ఆఫ్ లిసా రే’ పేరిట బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఇంటరాక్టివ్ సెషన్ మంగళవారం జరిగింది. ఇందులో లిసా రే తన జీవిత అనుభవాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా అత్యున్నత విజయ ఘడియ, నాకు అత్యంత చీకటి సమయంగా మారింది’ అంటూ ఆమె వాఖ్యానించారు. మన ఆరోగ్యానికి మనమే సీఈఓ అన్నారు. ‘బాధ్యత తీసుకోండి, ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి’ అన్నారు. విజయం సమస్యలు పరిష్కరించదని, మన భావోద్వేగం ఆత్మవేదనను తొలగించబోదని అభిప్రాయపడ్డారు. సమాజం నిర్వచించిన విజయాన్ని తానే ప్రశ్నించాల్సి వచ్చిందన్నారు. లోపల నా భావాలు వేరుగా ఉండడంతో, నేను లోతుగా వెతకాల్సి వచ్చిందని చెప్పారు. రోగం అనేది దాచుకోవాల్సిన, సిగ్గుపడాల్సిన విషయం కాదు.. నా శరీరం, నా జీవితం, నా వ్యాధి.. అన్నీ అంగీకరించడం వల్ల నాకు నిజమైన విముక్తి లభించిందన్నారు. ధ్యానం నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందన్నారు. కార్లను శుభ్రం చేస్తాం.. ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతాం.. కానీ మన మనసులోని నెగెటివ్ ఆలోచనలను ఎందుకు శుభ్రం చేయలేకపోతున్నామని ప్రశ్నించారు. దేశం పరిపూర్ణం కాకపోయినా, జీవించడానికి ఇది ఉత్తమ స్థలమని పేర్కొన్నారు. హైదరాబాద్ నాకు ఎంతో ప్రత్యేకం. ఇక్కడి ప్రజల ఆత్మీయత, ప్రేమతోపాటు ఆహారాన్ని, ఇతర రంగాలన్నింటినీ నేను ప్రేమిస్తాను. మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చైర్పర్సన్ ప్రతిభా కుందా తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఆ ఆస్తిపై మీ తల్లికి మాత్రమే హక్కులు..) -
అత్తమామలపై కక్ష సాధింపు కేసు చెల్లదు
సాక్షి, హైదరాబాద్: గృహ హింస, వరకట్నం కేసు ల్లో ఆరోపణలతో, భర్తపై కక్ష సాధింపుతో అత్తమామలపై పెట్టే కేసు చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వారిని నిందితుల జాబితాలో చేర్చడాన్ని తప్పుబట్టింది. పిటిషనర్లపై ఎఫ్ఐఆర్ను రద్దు చేసింది. తమ కోడలు సెక్షన్ 498 –ఏ కేసులో తమను నిందితులుగా చేర్చడాన్ని సవాల్ చేస్తూ.. మహారాష్ట్ర చోర్బుర్జికి చెందిన 74 ఏళ్ల గోవింద్ ప్రసాద్, అతని భార్య ఉషాశర్మ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున కపీష్కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లపై ఆరోపణలకు నిర్దిష్ట ఆధారాలు లేవని అభిప్రాయపడ్డారు. పిటిషనర్లకు వ్యతిరేకంగా ఫిర్యాదీ ఎలాంటి వివరాలను సమర్పించలేదని పేర్కొన్నారు. వేధింపులు, క్రూరత్వం, వరకట్నం డిమాండ్కు సంబంధించిన ఏదైనా ప్రత్యేక సందర్భాన్ని వివరించలేకపోయారన్నారు. దీంతో పిటిషనర్లపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తున్నామని ఉత్తర్వులు జారీ చేశారు. -
ఐర్లాండ్లో లీగల్గా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు
హైదరాబాద్: ఐర్లాండ్ దేశంలో విద్యకోసం వెళ్తున్న విద్యార్థులు ఆ దేశ నియమ నిబంధనల ప్రకారం లీగల్గానే పార్ట్టైం ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఐర్లాండ్ దేశ ఎడ్యుకేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెండి డిసౌజ అన్నారు. ఐ 20 ఫివర్ ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా ఐర్లాండ్లోని వివిధ యూనివర్సిటీలలో విద్యనభ్యసించేందుకు వెళ్తున్న విద్యార్థుల అవగాహన సదస్సు మంగళవారం జరగగా ఈ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అక్కడి పరిస్థితులపై, పలు విషయాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యను పూర్తిచేసిన తర్వాత ఉద్యోగం వెతుక్కవడానికి రెండు సంవత్సరాల వరకు అక్కడే ఉండేందుకు అక్కడి చట్టం అనుమతిస్తుందని తెలిపారు. ప్రతీయేటా తెలుగు రాష్ట్రాల నుంచి ఐర్లాండ్లో బిజినెస్ స్టడీస్, ఇంజనీరింగ్, ఫార్మాసూటికల్, హెల్త్కేర్ రంగాల్లో చదువుకోవడానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డబ్లిన్ సిటీ యూనివర్సిటీ, మేనూత్ టీయూఎస్ ఎన్సీఐ గ్రిఫిట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ గాల్వే ప్రతినిధులు హాజరయ్యారు. ఐ20 ఫివర్ సంస్థ ప్రతినిధులు నవీన్ యాతపు, శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
నాన్నంటే వాడికి ప్రాణం.. ఇంగ్లండ్కు వెళ్లే ముందు నాతో ఏమన్నాడంటే..
క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం మార్మోగిపోతున్న పేరు మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj). ఇంగ్లండ్తో ఓవల్ టెస్టులో ఈ హైదరాబాదీ అద్బుతమే చేశాడు. ఓటమి కోరల్లో చిక్కుకున్న టీమిండియాను తన అద్భుతమైన డెలివరీతో విజయతీరాలకు చేర్చాడు.బాగా ఆడి ఇండియాను గెలిపించాలిఇంగ్లండ్తో ఓవరాల్గా ఐదు టెస్టుల్లో 185 ఓవర్లు బౌల్ చేసి.. ఏకంగా 23 వికెట్లు కూల్చాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)ని భారత్ 2-2తో సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్కు బయల్దేరే ముందు సిరాజ్ తన తల్లితో అన్న మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.ఈ విషయం గురించి సిరాజ్ తల్లి షబానా బేగం టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘అమ్మా.. నాకోసం ప్రార్థన చేస్తూ ఉండు. నేను బాగా ఆడి ఇండియాను గెలిపించాలని ప్రార్థించు’’ అని కుమారుడు తనతో చెప్పాడన్నారు.నాన్నంటే వాడికి ప్రాణంఅదే విధంగా.. తండ్రి అంటే సిరాజ్కు ప్రాణమని.. ‘‘సిరాజ్కు వాళ్ల నాన్న అంటే చాలా ఇష్టం. ఆయనను ఎంతగానో ప్రేమిస్తాడు. తండ్రి కోసం ఏం చేసేందుకైనా సిరాజ్ వెనకాడేవాడు కాదు. సిరాజ్ కోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను. నా కుమారుడు చేసే ప్రతి పనిలో విజయవంతం అయ్యేలా ఆ అల్లా దీవించాలి’’ అని షబానా మాతృప్రేమను చాటుకున్నారు.కాగా సిరాజ్ క్రికెటర్గా ఎదగడంలో అతడి కుటుంబం పాత్ర కీలకం. తండ్రి మహ్మద్ గౌస్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూనే.. కుమారుడి కల నెరవేరేలా ప్రోత్సహించారు. సిరాజ్ అంటే ఆయనకూ ప్రాణమే. ఆయన కోరుకున్నట్లే కొడుకు టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు.కుమారుడి ఎదుగుదల చూడకుండానేముఖ్యంగా తనకు ఇష్టమైన టెస్టు ఫార్మాట్లో ఆడేందుకు సిద్ధమైన తరుణంలోనే.. దురదృష్టవశాత్తూ గౌస్ కన్నుమూశారు. 2021లో సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా గౌస్ మరణించారు. అయితే, దేశం కోసం ఆడటమే ముఖ్యమని ఆయన నేర్పిన విలువలకు తగ్గట్లుగా అక్కడే ఉండిపోయిన సిరాజ్ తండ్రిని కడసారి చూసుకోలేకపోయాడు.తండ్రి సమాధి దర్శించుకున్న తర్వాతేఅయితే, ఆయన కోరుకున్నట్లుగానే టీమిండియా టాప్ పేసర్గా ఎదిగి ఇలా ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా తాను సిరీస్ ఆడేందుకు సన్నద్ధమయ్యే ముందు ముందుగా సిరాజ్ తన తండ్రి సమాధిని దర్శించుకుని అక్కడ ప్రార్థన చేస్తాడు. తాజాగా ఇంగ్లండ్కు వెళ్లే ముందు కూడా సిరాజ్ ఈ ఆనవాయితీని పాటించాడు. అత్యుత్తమ ప్రదర్శనతో భారత్కు చిరస్మరణీయ విజయం అందించాడు.చదవండి: ‘డ్రా’ అయినందుకే ఇంత సంబరమా?.. అవును.. కొన్ని పొరపాట్లున్నా..All heart. All hustle. All 𝘋𝘩𝘢𝘢𝘬𝘢𝘥 💪A fightback that will go down in Indian cricket history ✨#SonySportsNetwork #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/bvXrmN5WAL— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2025 -
డాక్టర్ నమ్రతా కస్టడీలో బయటపడ్డ సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. కస్టడీలో పలు అంశాలపై డాక్టర్ నమ్రతాను పోలీసులు విచారించారు. కస్టడీలో డాక్టర్ నమ్రతా అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆధారాలు ముందు ఉంచి నమ్రతాను విచారించిన పోలీసులు.. చైల్డ్ ట్రాఫికింగ్తో పాటు సరోగసి మోసాలపై ఆరా తీశారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో డాక్టర్ నమ్రతాకు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.కళ్యాణితో కలిసి ఏజెంట్లు సహకారంతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్టు నిర్థారణ అయ్యింది. కస్టడీ విచారణలో భాగంగా ఏజెంట్ల నెట్వర్క్ను పోలీసులు గుర్తించారు. రేపటితో కళ్యాణి, ధనశ్రీ సంతోషి విచారణ ముగియనుంది. మరికాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షలు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రతను హాజరుపర్చనున్నారు.కాగా, సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో గోపాలపురం పోలీసులు మరో డాక్టర్ను కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్కు వచ్చిన డాక్టర్ విజ్జు లతను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమె అరెస్టుతో ఈ కేసులో ఇప్పటి వరకు కటకటాల్లోకి చేరిన వారి సంఖ్య 15కు చేరింది. మరోపక్క డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందంటూ మరో ఐదుగురు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు.సరోగసీ కోసం హైదరాబాద్లోని సృష్టి సెంటర్ను ఆశ్రయించిన వారిని నమ్రత విశాఖపట్నంలోని బ్రాంచ్కు పంపేది. అక్కడ కీలకంగా వ్యహరించిన డాక్టర్ విజ్జు లత వారికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం తదితరాలు చేసేది. నమ్రత విచారణలో ఈ విషయం గుర్తించిన దర్యాప్తు అధికారులు విజ్జు లత కోసం గాలించారు. అయితే నమ్రత గ్యాంగ్ అరెస్టు విషయం తెలియడంతోనే ఆమెతోపాటు అనేక మంది ఏజెంట్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నమ్రత చేతిలో మోసపోయిన మరో ఐదుగురు బాధితులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ కేసుల్లోనే విజ్జు లతను అరెస్టు చేశారు. సరోగసీ పేరుతో ఒప్పందాలు చేసుకున్న నమ్రతకు రూ.11 లక్షలు, రూ.15 లక్షలు, రూ.13 లక్షలు చొప్పున ఆ ముగ్గురు, మరో జంట రూ. 20 లక్షలు చెల్లించినట్టు ఫిర్యాదు చేయగా, కేసులు నమోదు చేశారు. నమ్రతతో పాటు ఇతర నిందితులను ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్పై అరెస్టు చేయడంతో పాటు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. రాజస్తాన్ మహిళ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నమ్రత పోలీసు కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఆపై ఇతర కేసుల్లో అరెస్టు, కస్టడీ ప్రక్రియలు చేపట్టనున్నారు.నమ్రత ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహణ లైసెన్స్ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 2021లో పొడిగించలేదు. దీంతో తాను ఆ వృత్తి నిర్వహించట్లేదంటూ నమ్రత లేఖ కూడా ఇచ్చారు. సికింద్రాబాద్లోని గోపాలపురంలో నాలుగు అంతస్తుల భవనంతోపాటు మరో మూడు చోట్లా అక్రమంగా యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వహిస్తున్నారు. అయితే తన పేరుతో కాకుండా డాక్టర్ సూరి శ్రీమతి పేరుతో ముద్రించిన లెటర్ హెడ్స్తో కథ నడిపించారు.ఈ సూరి శ్రీమతి వయస్సు ప్రస్తుతం 94 ఏళ్లు అని, ఆమెకు తెలియకుండానే నమ్రత ఈ పని చేసినట్టు గుర్తించిన గోపాలపురం పోలీసులు ఈ మేరకు వాంగ్మూలాలు నమోదు చేశారు. నమ్రతకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లతో సహా మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఏజెంట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరి ద్వారానే మగ శిశువును గరిష్టంగా రూ.4.5 లక్షలు, ఆడ శిశువును గరిష్టంగా రూ.3.5 లక్షలకు ఖరీదు చేస్తోందని, వారిని సరోగసీ పేరుతో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఏజెంట్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
జయహో జకీయుద్దీన్..! సైకిల్పై ట్రాఫిక్ పోలీసు విధులు
అతనో ట్రాఫిక్ కానిస్టేబుల్.. ప్రభుత్వం కేటాయించిన బ్యాటరీ సైకిల్పై విధులు నిర్వహిస్తూ సికింద్రాబాద్ ప్రజల మన్ననలు పొందుతున్నాడు.. సంధులు, గల్లీల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయనే సికింద్రాబాద్ మహంకాళి ట్రాఫిక్ పోలీసు స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఎండీ జకీయుద్దీన్. 2014 బ్యాచ్కు చెందిన జకీయుద్దీన్ ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు..స్టేషన్ పరిధిలోని మోండా మార్కెట్, పాట్ మార్కెట్, ఓల్డ్గాస్ మండీ తదితర ప్రాంతాల్లో సైకిల్పై విధులు నిర్వహిస్తున్నాడు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వం బ్యాటరీ సైకిళ్లను అందజేసింది. అయితే చాలా స్టేషన్లలో వీటిని మూలనపడేశారు. విధుల కోసం డిపార్టుమెంట్ ప్రతి నెలా ఇచ్చే 25 లీటర్ల పెట్రోల్తో బైక్స్ వినియోగిస్తుంటారు.. అయితే ఇంధనం ఆదా చేయడంతో పాటు వాహన కాలుష్యాన్ని తగ్గించడానికే తాను బ్యాటరీ సైకిల్ వినియోగిస్తున్నానని జకీయుద్దీన్ చెబుతున్నాడు. తాను క్రీడాకారుడిని కాబట్టి సైకిల్ వినియోగం ఆరోగ్యానికీ ఉపయుక్తమవుతుందని, పర్యావరణానికీ మేలు కలుగుతుందని సాక్షితో పంచుకున్నాడు. (చదవండి: ఈ బామ్మ రూటే సెపరేటు..! వందో పుట్టినరోజుని అందరిలా కాకుండా..) -
చనిపోయిన వారి పింఛన్ల రికవరీ
సాక్షి, హైదరాబాద్: ఏడాది కిందట చని పోయిన పింఛనుదారులకు చేయూత పింఛన్లు అందజేశారు. ఇలా గత ఏడాది 28 వేల మందికి రూ.60 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ దారిద్య్ర నిర్మూలనా సంస్థ (సెర్ప్) తాజాగా గుర్తించింది. చేయూత పింఛన్లు అందుకుంటూ మరణించిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర కేటగిరీ లబ్ధిదారుల వివరాలను వారి కుటుంబసభ్యులు అధికారులకు తెలియ జేయకపోవ డంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఉన్నతాధికారులు నిర్ధారించారు. వృద్ధులు, ఇత రకేటగిరీల వారికిచ్చే రూ.2,016 మొదలు.. దివ్యాంగులకు ఇచ్చే రూ.4,016 వరకు చనిపో యిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ఏడాది పాటు పింఛన్ మొత్తం జమ అయినట్టు వెల్లడైంది. దీంతో ఈ పింఛన్దారుల కుటుంబీకుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు గ్రామీణాభివృద్ది శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రామీణ– పట్టణ స్థానిక సంస్థల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు, సర్వేలు, క్రాస్ వెరిఫికేషన్, ఎన్ఐసీ పోర్టల్లో పేర్లను సరిచూడడం వంటి వాటి ద్వారా పింఛన్దారులు చనిపోయినా వారి కుటుంబసభ్యు లు డబ్బులు విత్డ్రాచేయడాన్ని గుర్తించారు. అంతేకాకుండా మరణించిన వారి బ్యాంక్ డెబి ట్ కార్డులను వారి కుటుంబీకులు ఉపయోగించి ఏటీఎంల నుంచి డబ్బు తీసుకున్నట్టుగా కూడా తేలింది. దీంతో మరణించిన 28 వేల పింఛనుదారుల పేర్లను జాబితా నుంచి తొల గించినట్టు అధికారులు వెల్లడించారు. అదేసమ యంలో వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి మరణించిన వారి భార్య లేదా భర్తకు పింఛన్ అందించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. -
'కూలీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన శ్రుతి హాసన్ (ఫొటోలు)
-
Hyderabad Rains: నగరం.. నిలిచిపోయింది!
సాక్షి, హైదరాబాద్: హఠాత్తుగా కురిసిన భారీ వర్షానికి సోమవారం నగరం నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు అనేక ప్రాంతాల్లో చెట్లు కూలడంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటరు దూరం దాటడానికి కనీసం అరగంటకు పైగా పట్టింది. ఇంకొన్ని చోట్ల గంటల తరబడి వాహనాలు ముందుకు కదలనే లేదు. వర్షం నేపథ్యంలో ద్విచక్ర వాహనచోదకులు మెట్రోరైల్ స్టేషన్ల కింద ఆగిపోవడంతో ఆ ప్రాంతాలు బాటిల్ నెక్స్గా మారి మరిన్ని ఇబ్బందులు తెచ్చాయి.సాధారణంగా మిగిలిన రోజుల కంటే మొదటి పని దినమైన సోమవారం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో పరిస్థితి చేతులు దాటింది. ట్రాఫిక్ పోలీసులతో పాటు హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది శ్రమించినా వాహనచోదకుడిని నరకం తప్పలేదు. నగర వ్యాప్తంగా దాదాపు 140 ప్రాంతాల్లో ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాల కారణంగా రోడ్లన్నీ చెరువులుగా మారాయి. వర్షానికి రోడ్లన్నీ నీళ్లు నిండటంతో ఏది గొయ్యే, ఏది రోడ్డో అర్థంకాక వాహనచోదకులు తమంతట తామే వాహన వేగాలను తగ్గించుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ రహదారులపై వాహన శ్రేణులు నిలిచిపోయాయి.కీలక మార్గాల్లోనూ అత్యంత నెమ్మదిగా ముందుకు సాగాయి. నాగోల్–మెట్టుగూడ, సికింద్రాబాద్–బేగంపేట్, ఎల్బీనగర్–చాదర్ఘాట్, ఎంజే మార్కెట్–నాంపల్లి, పంజగుట్ట–కూకట్పల్లి, పంజగుట్ట–మాసబ్ట్యాంక్, లక్డీకాపూల్–మెహదీపట్నం ప్రాంతాల్లో వాహనాలు భారీగా ఆగిపోయాయి. రోడ్లన్నీ జామ్ కావడంతో గంటల తరబడి వాహనాలు రోడ్ల పైనే ఉండిపోయాయి. కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వెళ్లే దారిలోనూ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. స్వయంగా రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్... సోమవారం నాటి పరిస్థితుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. కేవలం గంట వ్యవధిలో ఏకంటా ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం పడే అవకాశం ఉందని రెండు గంటల ముందుగానే సమాచారం అందుకున్న హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆయన కూడా స్వయంగా ముంపు ప్రాంతాలకు వెళ్లారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడైనా వరద ముప్పు ఉంటే హైడ్రా కంట్రోల్ రూమ్కు (9000113667) ఫిర్యాదు చేయాలని సూచించారు. -
హైదరాబాద్లో ఆఫీస్ వసతులు రూ.1.39 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: హైదరాబాద్లో రూ.1.39 లక్షల కోట్ల విలువైన 123 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) కార్యాలయ వసతులు (ఆఫీస్ స్పేస్) ఉన్నట్టు నైట్ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. అంతేకాదు దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో జూన్ త్రైమాసికం చివరికి 993 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉండగా, దీని విలువ 187 బిలియన్ డాలర్లు ఉన్నట్టు తెలిపింది. ఈ నగరాల్లో సెపె్టంబర్ త్రైమాసికం చివరికి కార్యాలయ వసతుల పరిమాణం బిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం యూఎస్లో 10.2 బిలియన్ ఎస్ఎఫ్టీ, చైనాలో 6.26 బిలియన్ ఎస్ఎఫ్టీ, జపాన్లో 1.77 బిలియన్ ఎస్ఎఫ్టీ చొప్పున ఆఫీస్ స్పేస్ ఉన్నట్టు గుర్తు చేసింది. ‘‘2005లో 200 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉన్న ఆఫీస్ స్పేస్ ఏటా 8.6 శాతం చొప్పున పెరుగుతూ వచి్చంది. ఈ ఏడాది చివరికి బిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుంది’’అని నైట్ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. నగరాల వారీగా.. → బెంగళూరులో ఆఫీస్ వసతుల పరిమాణం జూన్ చివరికి 229 మిలియన్ ఎస్ఎఫ్టీగా ఉండగా, దీని వలువ 49 మిలియన్ డాలర్లు. → ఢిల్లీ ఎన్సీఆర్లో 44 బిలియన్ డాలర్ల విలువైన 199 మిలియన్ ఎస్ఎఫ్టీ కార్యాలయ వసతులు అందుబాటులో ఉన్నాయి. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో మొత్తం 169 మిలియన్ ఎస్ఎఫ్టీ (41 బిలియన్ డాలర్లు) అందుబాటులో ఉంది. → పుణెలో 106 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ ఉండగా, దీని విలువ 16 బిలియన్ డాలర్లు. → 13 బిలియన్ డాలర్ల విలువైన 92 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీసు వసతులకు చెన్నై నగరం వేదికగా ఉంది. → అహ్మదాబాద్లో 41 మిలియన్ ఎస్ఎఫ్టీ (4 బిలియన్ డాలర్లు), కోల్కతాలో 34 మిలియన్ ఎస్ఎఫ్టీ (4 బిలియన్ డాలర్లు) మేర కార్యాలయ వసతులు ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. → టాప్–8 నగరాల్లోని మొత్తం ఆఫీస్ స్పేస్లో గ్రేడ్–ఏ వసతులు 53 శాతంగా ఉంటే, గ్రేడ్–బీ వాటా 43 శాతంగా, గ్రేడ్–సీ 4 శాతం చొప్పున ఉన్నాయి.జీసీసీలు ప్రధాన చోదకం ‘‘గత 35 ఏళ్లలో భారత్లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఎంతో మార్పును చూసింది. ముఖ్యంగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) ఆఫీస్ స్పేస్ డిమాండ్కు ప్రధాన చోదకంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆఫీస్ మార్కెట్గా భారత్ అవతరించింది. ఇప్పటికే 0.99 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉండగా, బిలియన్ ఎస్ఎఫ్టీ మార్క్ను త్వరలో చేరుకోనుంది’’అని నైట్ఫ్రాంక్ ఇండియా రీసెర్చ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా తెలిపారు. -
హైదరాబాది స్టైల్లో సిరాజ్పై ఓవైసీ ప్రశంసలు
సాక్షి,హైదరాబాద్: చివరి వరకు ఉత్కంఠగా సాగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఆరుపరుగుల తేడాతో ప్రత్యర్ధి జట్టు ఇంగ్లండ్ను భారత్ మట్టి కరిపించింది.ఈ మ్యాచ్ విజయంతో సిరీస్2-2 సమమైంది.మమ్మద్ సిరాజ్ ఈ సిరీస్లో మొత్తం 23 వికెట్లు తీసి మెరుపులు మెరిపించాడు.చివరి మ్యాచ్లో అతడు తీసిన ఫైవ్ వికెట్ హల్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.అయితే నరాలు తెగే ఉత్కంఠ పోరులో అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్ను చిత్తు చేసిన మహ్మద్ సిరాజ్పై హైదరాబాద్ ఎంపీ అహ్మద్ ఓవైసీ ప్రశంసలు కురిపించారు. ఎక్స్ వేదికగా సిరాజ్ను హైదరాబాద్ స్టైల్లో పొగడ్తలతో ముంచెత్తాడు. సిరాజ్ ‘ఎప్పుడూ విజేతే @mdsirajofficial! మన హైదరాబాదీలో మాట్లాడతే.. పూరా ఖోల్ దియే పాషా!’అంటూ అభినందించాడు. Always a winner @mdsirajofficial! As we say in Hyderabadi, poora khol diye Pasha! pic.twitter.com/BJFqkBzIl7— Asaduddin Owaisi (@asadowaisi) August 4, 2025 -
చెరువుల్లా హైదరాబాద్ రోడ్లు.. వాహనదారులకు నరకం
-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రంగంలోకి ముగ్గురు మంత్రులు
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలనకు ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక’ రెఫరెండంగా భావిస్తూ ముందస్తు కార్యాచరణకు దిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక తర్వాత జూబ్లీహిల్స్ కావడంతో ఈ స్థానాన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది. ఎన్నికల షెడ్యూలు విడుదలతో సంబంధం లేకుండా, అభ్యర్థి ఎంపిక అంశానికి పెద్దగా ప్రాధాన్యమివ్వకుండా కేవలం పార్టీ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్లు జూబ్లీహిల్స్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఏకంగా ముగ్గురు రాష్ట్ర మంత్రులను రంగంలోకి దింపి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (jubilee hills bypoll) బాధ్యతలను అప్పగించారు.జూబ్లీహిల్స్ బీఆర్ఎస్కు సిట్టింగ్ సీటు కావడంతో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే.. క్షేత్రస్థాయిలో అధికార కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో అనుకూల పరిస్థితులు తీసుకొచ్చేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. సుడిగాలి పర్యటనతో సంక్షేమ, అభివృద్ధి అ్రస్తాలను ప్రయోగిస్తున్నారు. మరోవైపు పార్టీ శ్రేణుల్లో అంతర్గత కుమ్ములాటలు లేకుండా సమన్వయ సాధన కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేయడంతోపాటు బీజేపీని నిలవరించేందుకు సికిందాబాద్ కంటోన్మెంట్ తరహాలో జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడాలన్నదే అధికార కాంగ్రెస్ (Congress Party) అన్ని అ్రస్తాలకు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.ఒక్కో మంత్రికి రెండు డివిజన్ల బాధ్యతలు అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎదురులేని శక్తిగా అవతరించేందుకు ముందస్తు కసరత్తు చేస్తోంది. నియోజక వర్గాన్ని మూడు విభాగాలుగా విభజించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్లకు బాధ్యతలను అప్పగించింది. ఒక్కో మంత్రికి రెండు డివిజన్ల చొప్పన కేటాయించారు. తుమ్మల నాగేశ్వరరావుకు వెంగళ్రావు నగర్, ఎర్రగడ్డ, సోమాజిగూడ డివిజన్లలో కొంత భాగం.. పొన్నం ప్రభాకర్కు యూసఫ్గూడ, బోరబండ డివిజన్లు, గడ్డం వివేక్ వెంకటస్వామికి షేక్పేట రహమత్నగర్ డివిజన్లను కేటాయించారు. మంత్రులకు సహాయంగా ఉండేందుకు ఆరుగురు చొప్పున మొత్తం 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లకు బాధ్యతలు అప్పగించింది. వారంతా సంబంధిత మంత్రులతో సమావేశమవుతూ ఎన్నికలు పూర్తయ్యే వరకు డివిజన్లపై దృష్టి సారించి ఇక క్షేత్రస్థాయిలో సంక్షేమ, అభివద్ది పధకాల అమలు పర్యవేక్షణ, ప్రచార బాధ్యతలు నిర్వర్తించనున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు.క్షేత్ర స్థాయి పర్యటనలు.. మంత్రులు సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకున్నారు. తమకు కేటాయించిన డివిజన్లల్లో అత్యధిక ఓటు బ్యాంకు (Vote Bank) సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. నియోజవర్గంలోని డివిజన్లలో క్షేత్ర స్థాయి పర్యటనలకు మంత్రులు శ్రీకారం చుట్టారు. బూత్ స్థాయి నేతలతో సమావేశమై ఎన్నికలపై చర్చిస్తున్నారు. చదవండి: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ఇటీవల బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నంతో పాటు పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో పార్టీ గెలుపునకు ఉన్న అవకాశాలపై చర్చించారు.. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులపై డివిజన్ల వారీగా వ్యవహరించాల్సిన అంశాలపై స్థానిక నేతలకు మంత్రులు తుమ్మల దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. -
ప్రజాధనం దుర్వినియోగమైనట్లు నివేదికలో స్పష్టమైంది: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రెస్మీట్లో మాట్లాడారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఉత్తమ్ ఆ సమావేశం బ్రీఫింగ్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు.మేడిగడ్డ బ్యారేజ్లో చాలా లోపాలున్నట్లు సీడబ్యూసీ చెప్పిందని, తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదనడం సరైంది కాదని ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో స్పష్టమైనట్లు ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్దని హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ పట్టించుకోలేదని ఈ సందర్భంగా ఉత్తమ్ విమర్శించారు.ప్రజాధనం దుర్వినియోగం చేశారు..‘మేడిగడ్డ కుంగిపోవడానికి కేసీఆర్ ప్రధాన కారణమని పీసీ ఘోష్ కమిషన్ నిర్ధారించింది. మొత్తం ఆర్థిక అవతవకలు, అవినీతి, ప్లానింగ్, డిజైనింగ్ అంతా కేసీఆర్ పర్యవేక్షణలోనే జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడేలా మేడిగడ్డ బ్యారేజ్ అంచనాలు పెంచి నిర్మించారు. కాళేశ్వరం కమిషన్కు హరీష్రావు సరైన సమాచారం ఇవ్వలేదు. మేడిగడ్డ కరెక్ట్ ప్రదేశంలో కట్టలేదు. కాంట్రాక్టర్స్కు ఫేవర్గా చూడటానికి ప్రజాధనం దుర్వినియోగం చేశారు’ అని ఉత్తమ్ తెలిపారు.ఇష్టానుసారం ప్రాజెక్టుల డిజైన్ మార్చేశారు..‘కాగ్, ఎన్డీఎస్ఏ నివేదికలను ఘోష్ కమిషన్ పరిశీలించింది. కమిషన్ నివేదికపై కేబినెట్లో చర్చించాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునాదుల్లోనే సమస్యలు. కేసీఆర్ ఇష్టానుసారం ప్రాజెక్ట్ డిజైన్ మార్చేశారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును గతంలోనే నిర్ణయించారు. 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా డిజైన్ చేశారు. కేసీఆర్ ఇష్టానుసారం ప్రాజెక్టు డిజైన్లు మార్చేశారు. అధిక వడ్డీకి ఎన్బీఎఫ్ దగ్గర లోన్లు తెచ్చారు. అధిక వడ్డీలకు రూ. 84 వేల కోట్ల ురుణాలు తీసుకొచ్చారు. రుణాలు తెచ్చే విషయంలో అవతవకలకు పాల్పడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాళేశ్వరంపై విచారణ. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను 25 పేజీలకు కుదించాం’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
హైదరాబాద్లో 'కూలీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Guvvala Balaraju: బీఆర్ఎస్కు గువ్వల బాలరాజు రాజీనామా
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, అచ్చం పేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సోమవారం (ఆగస్టు4) బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్కు పంపించారు. పార్టీపై అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. బాలరాజుతో పాటుగా మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. గువ్వల బాలరాజ్ 2014 నుంచి 2023 వరకు రెండు సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే, మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో నాటి నుంచి పార్టీలో ఇన్ యాక్టీవ్గా ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం (ఆగస్టు3) రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో గువ్వల బాలరాజ్ భేటీ అయ్యారు. ఇవాళ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాగా, బాలరాజు త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. -
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం
-
Rain: హైదరాబాద్లో వర్షం బీభత్సం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం కురిసిన భారీ నుంచి అతి భారీ వర్షం ధాటికి నగరం అతలాకుతలమైంది. కురిసిన కుండపోత వర్షానికి నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. కురిసిన వర్షంతో రోడ్లు చెరువల్ని తలపించాయి.సికింద్రాబాద్,కోఠితో పాటు అన్నీ ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరంచి ఆస్పత్రి వరకు భారీ ట్రాఫ్రిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ కదిలేందుకు గంట సమయం పట్టడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జూబ్లిహిల్స్లో 7.4సెంటీమీటర్లు, మెహిదీపట్నంలో 5.3సెంటీమీటర్లు, బంజారాహిల్స్లో 4.6, యూసఫ్ గూడా 3.9,ఖైరతాబాద్ 3.6, మైత్రీవనం 3.4, కూకట్పల్లి 3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. వర్షంతో పాటు ఈదురు గాలులు నగర వాసుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో నగర వాసులు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హయత్నగర్, వనస్థలీపురం, అబ్ధుల్లాపూర్ మెట్లలో వర్షం కురుస్తుండగా.. దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట్, మీర్పేట్, ఉప్పల్, రామాంతపూర్, నాచారం, తార్నాకలో భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి,అబిడ్స్,మలక్పేట్లో దంచికొడుతోంది. రాజ్ భవన్ రోడ్, తెలంగాణ సెక్రటరియేట్ ఎదుట వరద నీరు రోడ్డు మీదకు చేరింది.తెలంగాణను భారీ నుంచి అతి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే వర్షం దాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. రానున్న మరో రెండు గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ ,హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. -
బీసీ, ముస్లిం రిజర్వేషన్లు వేర్వేరుగా ఉండాలి: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బీఆర్ అంబేడ్కర్, ఫులే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసిందన్నారు. సబ్బండవర్గాలు బాగుండాలని తెలంగాణ తెచ్చుకున్నామని, తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలని ఆశించారు.‘సమాజంలో సగ భాగం బీసీలు ఉన్నారు. వాళ్లకు రాజకీయంగా సమ ప్రాధాన్యం దక్కాలనే ఉక్కు సంకల్పంతో ఈ దీక్ష చేపట్టాం. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్లు బీసీలకు న్యాయం చేయాలని గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతున్నాం. అందరి ఆకాంక్ష ఒకటే.. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ మీద నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తోంది.కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని వెంటపడుతున్నాం. తెలంగాణ జాగృతి పోరాటాలతో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో బిల్లు పెట్టారు. సావిత్రిభాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్డేగా ప్రకటించారు. జ్యోతిభా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టమంటే ప్రభుత్వం ట్యాంక్ బండ్పై పెట్టింది. ఈ రోజు జరిగేది బీసీల ఆత్మగౌరవ పోరాటం ముస్లిం 10 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేకంగా బిల్లు పెడతామని కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలి. ముస్లింలకు 10శాతం ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. బీజేపీ అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం.బీజేపీ కేంద్ర ప్రభుత్వం, గవర్నర్ సంతకం పెట్టకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాం. ఉమ్మడి ఏపీలో అంబేద్కర్ విగ్రహం కోసం 48 గంటలు దీక్ష చేశాం. తెలంగాణలో ధర్నా చౌక్ లు ఓపెన్ చేశామని సీఎం ఢిల్లీలో గప్పాలు కొడుతున్నారు. తెలంగాణ జాగృతి దీక్షకు పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు భయం?. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 72గంటలు దీక్ష చేయడానికి ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వాలి. బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు అంతా ఏకంకావాలి’ అని తెలిపారు -
అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. అడ్డుకున్న పోలీసులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నా కవర్ చేయకుండా పోలీసులు.. మీడియాను అడ్డుకుంటున్నారు. దీంతో, ఉద్రిక్తత చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని శాసనసభ కార్యాలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వెళ్లింది. అయితే, స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ముందు గాంధీ విగ్రహం వద్ద ధర్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. కాగా, శాసనసభ ఆవరణలో మీడియాపై ఆంక్షలు ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా కవర్ చేయకుండా పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. -
లారీ బీభత్సం
భువనగిరి: భువనగిరి పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాలో లారీ బీభత్సం సృష్టించింది. లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పోతిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిలమామిడి రామకృష్ణ(35), చిలమామిడి సాయి కుమార్(22) హైదరాబాద్లోని సూరారం కాలనీలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. రామకృష్ణ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా, సాయికుమార్ కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం భువనగిరి పట్టణంలోని సంతోషనగర్లో నిశ్చితార్థం వేడుకకు బంధువులతో కలిసి వచ్చారు. నిశ్చితార్థం జరుగుతున్న క్రమంలో స్వీట్స్ కోసం రామకృష్ణ, సాయికుమార్ ఇద్దరూ కారులో పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాకు బయలుదేరారు. కారును రోడ్డు పక్కన పార్కింగ్ చేసి షాపు దగ్గరకు వెళ్తున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లారీ ఉత్తరప్రదేశ్ నుంచి జగదేవ్పూర్ రోడ్డు మార్గం నుంచి చెన్నైకు వెళ్తున్న లారీ వేగంగా దూసుకువచ్చి అక్కడే ఉన్న పాదచారులు, ద్విచకవ్రాహనదారులను ఢీకొట్టింది. దీంతో అక్కడే నిలబడి ఉన్న రామకృష్ణ మృతి చెందగా, సాయికుమార్తో పాటు రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన బీమారి శివసాయికుమార్, లారీ డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం సాయికుమార్తో పాటు శివకుమార్ను సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సాయికుమార్ మృతి చెందాడు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. మృతుడు రామకృష్ణకు భార్య ఇద్దరు కుమార్తెలు, సాయికుమార్కు భార్య, కుమార్తె ఉన్నారు. ధ్వంసమైన షాపులు, బైకులులారీ వేగంగా దూసుకురావడంతో రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్, పాన్ షాప్లు, అక్కడే ఉన్న మూడు బైకులు ధ్వంసమయ్యాయి. మృతుడు లారీ, గోడ మధ్యన ఇరుక్కుపోవడంతో పోలీసులు క్రేన్ సాయంతో లారీని తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
ఎన్నికల్లో ‘గెలుస్తామన్న ధీమాతో నిర్లక్ష్యం వద్దు’
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్లో చేసిన అభివృద్ధికి ,సేవలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.‘బీఆర్ఎస్ పార్టీకి 50 వేల మంది కార్యకర్తల సభ్యత్వం ఉన్న నియోజకవర్గం జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి. కాంగ్రెస్ వచ్చాక అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయాయి. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బస్తీల్లో ఉండే పేదల ఇండ్లు కూల్చుతున్నారు. సీఎం రేవంత్ కొడంగల్ నియోజకవర్గంలో ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్నాడు.హైదరాబాద్లో రేవంత్, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్లోనే ఉంటుంది. ఇలా చెప్పుకుంటే పోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్లు అన్ని బఫర్ జోన్, ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి. కూట్లో రాయి తెయ్యలేని వాడు, ఎట్లో రాయి తీస్తా అని రేవంత్ మాట్లాడుతున్నాడు.జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు ఒకటే చెప్తున్నా. గెలుస్తామన్న ధీమాతో నిర్లక్ష్యం వద్దు. గెలుస్తాం అని ఇంట్లోనే ఉండకుండా ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ గెలుపుకు కృషి చెయ్యాలి. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన మాగంటి గోపినాధ్ బీఆర్ఎస్ పార్టీ వీడలేదు. ఉపఎన్నిక గెలిచి మాగంటి గోపీనాథ్ అంకితం ఇవ్వాలి.ఎలక్షన్ కమిషన్ తీరు సరిగా లేదు. ఎలక్షన్ కమిషన్ దేశ వ్యాప్తంగా ఓట్లు తీసివేసి పనిలో ఉంది. బీహార్లో మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఓటునే తీసేశారు. మన ఓట్లు తీసివేయడం ఒక లెక్కనాఅందరం జాగ్రత్తగా ఉండాలి’ అని అన్నారు. -
Hyderabad: అన్నదానం వద్దంటూ నిమ్స్ గేటు బంద్
హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రి పార్కింగ్ స్థలం నుంచి బాలాపురి బస్తీ వైపు ఓ గేటు ఉంటుంది. ఈ గేటు వద్ద కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిత్యం ఉదయం వేళల్లో 300 నుంచి 500 మందికి అన్నదానం చేస్తుంటాయి. గడిచిన మూడు రోజుల నుంచి నిమ్స్ అధికారులు ఈ గేటు మూసివేశారు. దీంతో రోగుల సహాయకులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి అనారోగ్య సమస్యలతో వస్తుంటారని అలాంటి వారికి అన్నదానం చేస్తుంటే ఆపడం ఎంత వరకు సబబు అని బాలాపురి బస్తీవాసి, అన్నదాత బిట్ల శ్రీనివాస్ రాజు ప్రశ్నించారు. గేటు తెరవకపోతే ఈ విషయమై సంబంధిత శాఖా మంత్రిని కూడా కలిసి నిమ్స్ డైరెక్టర్, అధికారులపై ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. -
ఫాస్ట్ట్యాగ్
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ కళ్లల్లో కారం కొట్టి, కాల్చి చంపిన కేసులో నిందితులను సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 2025 జూలై 15న హైదరాబాద్లో ఈ హత్య చేసి, వేర్వేరు ప్రాంతాలకు పారిపోయిన దుండగులు నాలుగు రోజుల్లోనే చిక్కడంలో ఓ కారుకు సంబంధించిన ఫాస్ట్ట్యాగ్ కీలకంగా మారింది. ఈ హంతక ముఠా అరెస్టుతో విశాఖపట్నంలోని గాజువాక షీలానగర్లో జరిగిన భారీ చోరీ కేసు కూడా కొలిక్కి వచ్చింది. ఈ ముఠాలోని ఇద్దరు అక్కడి వెంకటేశ్వర కాలనీలో నివసించే ఎల్ఐసీ ఉద్యోగి ఎస్.శ్రీనివాస్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితులని తేలింది. ఆ ఇంట్లో వీళ్లు 700 గ్రాముల బంగారం, మూడు కేజీల వెండి నగలు, వస్తువులతో పాటు రూ.20 లక్షల నగదు తస్కరించారు.సీపీఐ ఎంఎల్ తెలంగాణ సెక్రటరీ రాజన్న అలియాస్ రాజేష్ హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఉంటున్నాడు. ఇతడికి నాలుగేళ్ల కిందట చందు నాయక్తో పరిచయమైంది. ప్రభుత్వ, భూదాన్ భూముల్లో పేదలతో గుడిసెలు వేయించడంతో పాటు ఇతర కారణాల నేపథ్యంలో వీరి మధ్య స్పర్థలు వచ్చాయి. చందును హత్య చేయడానికి రాజన్న గతంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరికి సుపారీ ఇచ్చినా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రాజన్న ఈసారి తన అనుచరులు ఏడుకొండలు, శ్రీను, కందుకూరి ప్రశాంత్లతో పాటు ఏడుకొండలుకు పరిచయం ఉన్న నెల్లూరుకు చెందిన అర్జున్, రాంబాబులతో కలిసి రంగంలోకి దిగాడు. ఉప్పల్ భగాయత్లోని హోటల్ సైలాలో గది బుక్ చేసి ఏడుకొండలు, శ్రీను, ప్రశాంత్లను అందులో ఉంచాడు. షీలానగర్లో 2025 జూలై 12న చోరీ చేసిన అర్జున్, రాంబాబు అక్కడ నుంచి తమ వాటాగా వచ్చిన సొత్తు, నగదుతో కాకినాడ వెళ్లారు. అక్కడ కారు బుక్ చేసుకుని, అందులోనే హైదరాబాద్ వచ్చి గచ్చిబౌలిలోని శ్రీనివాస గెస్ట్హౌస్లో బస చేశారు. అక్కడ నుంచి బయలుదేరి 13వ తేదీ రాత్రి క్యాబ్లో హోటల్ సైలాకు వచ్చి ఏడుకొండల్ని కలిశారు. మర్నాటి ఉదయం హత్య పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాక తిరిగి వెళ్లిపోయారు. తర్వాతి రోజు తెల్లవారుజామున (2025 జూలై 15) వీళ్లు ఉప్పల్ భగాయత్కు రాగా; అక్కడే ఉన్న రాజన్న, ఏడుకొండలు, శ్రీను, ప్రశాంత్లతో కలిసి ఓ కారులో వెళ్లి మలక్పేటలోని శాలివాహన నగర్ పార్కు వద్ద చందును కాల్చి పంపారు. వాకింగ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన చందుపై తొలుత అర్జున్, శ్రీను కాల్పులు జరిపారు.అతడు చనిపోయాడో, లేదో అనే సందేహంతో రాజన్న కూడా అర్జున్ నుంచి తుపాకీ తీసుకుని మరోసారి కాల్చాడు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా దుండగులు స్విఫ్ట్ కారులో వచ్చినట్లు గుర్తించారు. ఇది పీర్జాదిగూడకు చెందిన ఓ మహిళ పేరుతో రిజిస్టరై ఉంది. ఆమె దీన్ని కొత్తపేట కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ఏజెన్సీకి కాంట్రాక్టుకు ఇచ్చారు. ఈ కారును ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఏడుకొండలు హత్యానంతరం తిరిగి అప్పగించి వెళ్లిపోయాడు. ఆ కారుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఉండగా, దాని వివరాలన్నీ ఏజెన్సీ యజమాని ఫోన్లో నమోదవుతాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడి ఫోన్లోని వివరాలను విశ్లేషించి, ఏడుకొండలు అద్దెకు తీసుకున్న నాటి నుంచి కారు ఎక్కడెక్కడ సంచరించిందో గుర్తించారు. ఇలా పోలీసులకు భగాయత్లోని హోటల్ సైలా వివరాలు తెలిశాయి. అక్కడకు వెళ్లిన దర్యాప్తు అధికారులు అర్జున్, రాంబాబు గచ్చిబౌలి నుంచి అక్కడకు వచ్చిన క్యాబ్ నంబరు గుర్తించారు.ఆ నంబర్ ఆధారంగా ముందుకు వెళ్లిన పోలీసులు గచ్చిబౌలిలోని శ్రీనివాస గెస్ట్హౌస్ను గుర్తించారు. అక్కడే టాస్క్ఫోర్స్ బృందానికి వాళ్లు వినియోగించిన కాకినాడ ట్యాక్సీ నెంబర్ దొరికింది. చందు హత్య తర్వాత ఆరుగురూ ఉప్పల్ నుంచి ఇదే వాహనంలో బీబీనగర్, వలిగొండ, ఖమ్మం మీదుగా కోదాడ చేరుకున్నారు. ఆ సమీపంలోని చిలుకూరు వద్ద కారు దిగిన రాజన్న, ఏడుకొండలు, శ్రీను, ప్రశాంత్ జనగాం పారిపోయారు. అర్జున్, రాంబాబు అదే కారులో విజయవాడ వెళ్లి, ట్యాక్సీని పంపేశారు. తమ వద్ద ఉన్న సొత్తు విక్రయించడం విజయవాడలో సాధ్యం కాకపోవడంతో అట్నుంచి మచిలీపట్నం వెళ్లి ప్రయత్నించారు. అక్కడా కుదరకపోవడంతో నెల్లూరు వెళ్లిపోవాలని భావించారు. దీంతో మరోసారి కాకినాడ నుంచి అదే ట్యాక్సీ పిలిపించి మచిలీపట్నం నుంచి బయలుదేరారు.రాజన్న, ఏడుకొండలు, ప్రశాంత్, శ్రీను ఫోన్లూ స్విచాఫ్లో ఉండటంతో సాంకేతిక నిఘా సాధ్యం కాలేదు. అర్జున్, రాంబాబు నంబర్లు పోలీసుల వద్ద లేవు. దీంతో కాకినాడ ట్యాక్సీ నంబర్ ఆధారంగా సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాని ఫాస్ట్ట్యాగ్ వివరాలను సంగ్రహిచడం మొదలెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ టోల్గేట్ను ఆ వాహనం దాటినా తెలిసేలా జాతీయ రహదారుల సంస్థతో పాటు టోల్గేట్స్ నిర్వాహకులతో అనుసంధానం ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే ఓ బృందం ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంత్లాలో గాలిస్తోంది. 2025 జూలై 19 తెల్లవారుజామున ఆ ట్యాక్సీ మచిలీపట్నం నుంచి నెల్లూరుకు బయలుదేరింది. ఆ మార్గంలోని టోల్గేట్లు దాటినప్పుడల్లా టాస్క్ఫోర్స్కు సమాచారం వచ్చింది. వీటి ఆధారంగా వాహనం విజయవాడ దాటి చెన్నై జాతీయ రహదారిలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న బృందాన్ని అప్రమత్తం చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు కావలి పంపి అర్జున్, రాంబాబు ప్రయాణిస్తున్న వాహనం నంబర్ చెప్పారు. అక్కడి చెక్పోస్టు సిబ్బంది సహకారంతో ఈ వాహనాన్ని ఆపిన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో జనగాంలో దాక్కున్న రాజన్న, ఏడుకొండలు తదితరులను పట్టుకున్నారు. -
నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందన
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టు ఆదేశాలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలని స్పష్టం చేసిందని.. ఈ దేశ న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఈ కేసులు, కొట్లాటలు కొత్త కాదు నాకు. నా జీవితమే ఒక పోరాటం’’ అంటూ చెప్పుకొచ్చిన కొండా సురేఖ.. ఏ కేసులోనైనా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోమని చెప్పడం సర్వసాధారణమన్నారు.మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నటి సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్పై కొండా సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
ఇల్లు కొనడానికి ఇదే శుభ తరుణం!
సాక్షి, సిటీబ్యూరో: పండగలు వస్తున్నాయంటే చాలు.. రియల్టీ రంగానికి ఉత్సాహమే. ఎందుకంటే ప్రజలు ఇల్లు, ఫ్లాట్లు తీసుకోవడం శుభసూచకంగా భావిస్తారు. కరోనా తర్వాతి నుంచి ఖరీదైన గృహాలకు మళ్లీ ఆదరణ అధికమవుతోంది. వీటిని తీసుకోవడానికి కొనుగోలుదారులు ముందుకొస్తున్నారు. ఢిల్లీ, గుర్గావ్, నొయిడా, బెంగళూరు వంటి ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోనూ కొనేవారి శాతం పెరుగుతోంది. మెరుగైన ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ఉద్యోగావకాశాలు కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. నిర్మాణం పూర్తి కానున్న ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది.నగరంలోనూ అదే పోకడ.. గతంలో ఊపు తగ్గిన లగ్జరీ విల్లాలకు ఇటీవల కాలంలో నగరంలో ఆదరణ పెరుగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్కు చేరువలో ఉండి సదుపాయాల విషయంలో రాజీపడని ప్రాజెక్టుల్లో విల్లాలను తీసుకోవడానికి ప్రవాసభారతీయులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఐటీ నిపుణులు ఆసక్తి చూపిస్తున్నారు. నార్సింగి, అప్పా జంక్షన్, తెల్లాపూర్, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని విల్లాలకు గిరాకీ పెరిగింది.స్థానిక రాజకీయాంశాల వల్ల ఎదురయ్యే సమస్యలు తాత్కాలికమే.. తర్వాత పరిస్థితులు సద్దుమణుగుతాయి. నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు దాని అనుసంధానమైన రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్, మెట్రో రైలు విస్తరణతో పాటు కొత్త నియామకాల్ని చేపడుతోన్న ఐటీ/ఐటీఈఎస్ సంస్థలు, మెరుగవుతోన్న వైద్య, విద్య, బయోటెక్ రంగాలు వెరసీ.. భవిష్యత్తులో ప్రపంచాన్ని ఆకట్టుకునే స్థాయికి హైదరాబాద్ చేరుకుంటుంది. -
కేటీఆర్ పరువు నష్టం కేసు.. మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నటి సమంత విడాకుల వ్యవహారంలో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కొండా సురేఖపై క్రిమినల్ కేసుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. ఈ నెల 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేటీఆర్పై కొండా సురేఖ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.కేటీఆర్ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి మనోరంజన్ కోర్టు.. త్వరలో సీసీ నెంబర్ కేటాయించనుంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కోర్టు నేరంగా పరిగణించింది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, సమంత విడాకుల వంటి అంశాలపై కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు ప్రాథమికంగా నిరాధారమని కోర్టు భావించింది. కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ పోగుల వాదనలను వినిపించగా.. కోర్టు సమర్థించింది. సాక్ష్యుల వాంగ్మూలాలు, సమర్పించిన పత్రాలు, ఫిర్యాదును పరిశీలించిన కోర్టు.. సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు తేల్చింది. కొండా సురేఖ తరపు న్యాయవాది వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. ఆయన లేవనెత్తిన పలు అంశాలను తిరస్కరించింది. -
‘సృష్టి’ కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
సాక్షి, హైదరాబాద్: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కస్టడీ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ పేరుతో పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఫెర్టిలిటీ సేవలు చేస్తామంటూ గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఏపీలోని పలు జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలే టార్గెట్గా మెడికల్ క్యాంపులు నిర్వహించిన డాక్టర్ నమ్రత.. పేద మహిళలను గుర్తించింది. పేద మహిళల ఆర్థిక అవసరాలను గుర్తించి.. ఏజెంట్లు ట్రాప్లోకి లాగుతూ.. ఆర్థికంగా ఆశ చూపి పిల్లలను కన్న తర్వాత డబ్బులు ఇస్తామని ఎర వేసినట్లు పోలీసులు నిర్థారించారు.విశాఖపట్నం, విజయవాడ కేంద్రంగా డెలివరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. డెలివరీ అయిన తర్వాత డాక్టర్ నమ్రత బృందం.. నవజాత శిశువును తీసుకుని తల్లికి డబ్బులు ఇస్తున్నట్లు విచారణలో తేలింది. అలా నవజాత శిశువులను తీసుకొచ్చి డాక్టర్ నమ్రత బ్యాచ్.. చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడుతోంది. సరోగసి ద్వారా అద్దె గర్భంలో పుట్టిందంటూ బాధిత దంపతులకు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో హైదరాబాద్, ఏపీలో ఫామ్ హౌస్, భవన సముదాయాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మియాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, యూసఫ్గూడతో పాటు చాలా ప్రాంతాల్లో భవన సముదాయాలు కొనుగోలు చేసినట్లు విచారణలో బయపడ్డాయి.సృష్టి సెంటర్ కేసులో ఏ3 కల్యాణి, A6 సంతోషి స్టేట్మెంట్లు విచారణలో కీలకంగా మారనున్నారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఏజెంట్స్ ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడ్డ డాక్టర్ నమ్రత.. కల్యాణి, సంతోషిలే దగ్గరుండి నవజాత శిశువులను తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. పోలీసుల విచారణలో డాక్టర్ నమ్రత అక్రమాలు.. ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. -
అక్కడ అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్: పెరిగిన రెంట్
విద్యా సంస్థలు, ఆస్పత్రులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో గృహాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉండటంతో చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలా వరకు టులెట్ బోర్డులు కనిపించేవి. ప్రస్తుతం అన్ని కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాయి. దీంతో ఆఫీసులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌస్లలో కిరాయిలు హాట్కేక్లా మారాయి. – సాక్షి, సిటీబ్యూరోఅమీర్పేట, ఎస్ఆర్నగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కొంపల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు గణనీయంగా పెరిగాయి. కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్ని చోట్ల రెట్టింపయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు 6 నెలల్లో 15 శాతానికి పైగానే పెరిగాయి. బేగంపేట, ప్రకాశ్ నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, బోయిన్పల్లి, మారెడ్పల్లి, అల్వాల్లో 20-25 శాతం అద్దెలు పెరిగాయి.నడ్డివిరుస్తున్న అద్దెలు..హైదరాబాద్లో ఇంటి అద్దెలు కిరాయి దారుల నడ్డి విరుస్తున్నాయి. తమ జీతాలు తప్ప అన్నీ పెరుగుతున్నాయంటూ నిట్టూర్చే సగటు జీవి, పెరిగిన ఈ అద్దెలను భరించలేక నగర శివార్లకు తరలి వెళ్తుండటంతో అక్కడ కూడా అద్దెలు భారీగానే పెరుగుతున్నాయి. అనరాక్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఓ అధ్యయనం ప్రకారం హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో అద్దెలు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తొలి మూడు నెలల కాలంలోనే 10-15 శాతం పైగానే పెరిగాయి. గతంలో రూ.10-15 వేలకు నగరం నడి మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అద్దెకు లభించేవి. కానీ, ఇప్పుడు రూ.20-25 వేలకు పైగా ఖర్చు చేస్తే తప్ప దొరకని పరిస్థితి.అడ్వాన్స్లు, మెయింటెనెన్స్ల భారం..ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే 3-4 నెలలు అడ్వాన్స్లను ఇంటి యజమానులు వసూలు చేస్తున్నారు. పైగా ఫ్లాట్ అద్దెతో పాటు ప్రతి నెలా మెయింటెనెన్స్ వ్యయం కూడా అద్దెదారుల పైనే పడుతోంది. 2 బీహెచ్కే అపార్ట్మెంట్ అద్దె రూ.25 వేలు ఉండగా.. నిర్వహణ ఖర్చు రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది. -
హైదరాబాద్ : భిన్న సంస్కృతుల నృత్య సమ్మేళనం (ఫొటోలు)
-
మంత్రి కారే అడ్డుగా ఉందంటావా ?
హైదరాబాద్: మంత్రి కారు ఎక్కడ పెట్టాలో కూడా మీరు చెప్తారా..? మీ సీఐ ఎవరు పిలవండి... సస్పెండ్ చేయిస్తా ఏమనుకుంటున్నారో..? నేనేమైనా కారును అడ్డంగా పెట్టానా కామన్ సెన్స్ లేదా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రాఫిక్ ఎస్ఐ రామ్ మనోహర్తో పాటు, బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులపై రుసరుసలాడారు. వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం బంజారాభవన్లో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి కారు డ్రైవర్ భవన్ గేటు ఎదుట కారును ఆపాడు. కారు అడ్డుగా ఉందని కాస్తా పక్కకు తీయాలని బంజారాహిల్స్ ట్రాఫిక్ సీఐ సాయి ప్రకాశ్ డ్రైవర్కు సూచించాడు. మంత్రిగారు కారు ఇక్కడే పెట్టమన్నారని మేము ఇలాగే పెడతామని డ్రైవర్ చెప్పడంతో ట్రాఫిక్ సీఐకి డ్రైవర్కు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సీఐ కారును పక్కకు పెట్టించారు. కార్యక్రమం ముగించుకుని బయటికి వచ్చిన మంత్రికి వారు ఈ విషయాన్ని చెప్పడంతో ఆయన అక్కడే విధుల్లో ఉన్న అడిషనల్ డీసీపీ గోవర్ధన్ను పిలిచి మాట్లాడారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్ఐ రామ్ మనోహర్ను పిలిచి మందలించారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సస్పెండ్ చేయిస్తా, సస్పెండ్ చేయించే వరకు ఇక్కడి నుంచి కదలనంటూ మంత్రి అధికారులకు ఫోన్ కలిపారు. ఇంతలోనే కిందికి వచ్చిన ఎమ్మెల్యే దానం అధికారులకు, మంత్రికి సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపించారు. -
‘చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పందించారు. చెంప చెళ్లుమనిపించాలనిపిస్తోంది అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రామచందర్రావు ‘ఎక్స్’ వేదికగా కౌంటిరిచ్చారు. ‘‘చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?" ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేఖరులపై ఇలా మాట్లాడడం సబబా??, ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజాస్వామ్యంలోని నాల్గవ స్తంభమైన పాత్రికేయులపై పరుషంగా మాట్లాడడం రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయనే దానికి తార్కాణం. ఇంకా ఈ కర్కశ కాంగ్రెస్ నేతల టార్గెట్ లిస్టులో ఇంకెందరు ఉన్నారో ఇంకెవరు ఉన్నారో’ అని మండిపడ్డారు.చెంప చెళ్లుమనిపించాలనిపిస్తుందా?" ఇది ప్రజాప్రతినిధి మాట్లాడాల్సిన మాటలా? ముఖ్యమంత్రి పదవిలో ఉండి విలేఖరులపై ఇలా మాట్లాడడం సబబా??📌 ఓ వార్షికోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తునాన్ను.📌 భౌతిక దాడికి దిగాలనిపిస్తుంది అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి… pic.twitter.com/StKfVze1ub— N Ramchander Rao (@N_RamchanderRao) August 1, 2025 -
పేరుకుపోతున్న ఘన, బయో, నిర్మాణ, ఈ–వేస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా వ్యర్థాలు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. ఎలక్ట్రానిక్ వేస్ట్తోపాటు ఘన, బయో, నిర్మాణ, ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా పోగవుతున్నాయి. జీవరాశులకు ప్రాణాధారమైన గాలి, నీరు, భూమిని కలుషితం చేస్తున్నాయి. మానవాళితోపాటు సకల జీవరాశుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్రంలో ఏటేటా పరిశ్రమల నుంచి వ్యర్థాల విడుదల గణనీయంగా ఉందనే విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే వ్యర్థాల నియంత్రణ, నిర్వహణ, శుద్ధి చేయాల్సిన పీసీబీకి ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులను కూడా కేటాయించకపోవడం గమనార్హం. 2014–15 సంవత్సరం నుంచి ప్రభుత్వం పీసీబీకి నిధులు, గ్రాంట్లను కేటాయించడం లేదు. కేవలం ఆపరేషన్, రెన్యూవల్ కన్సెంట్ రూపంలో ఆసుపత్రులు, పరిశ్రమలు చెల్లించే ఫీజులే పీసీబీకి ఆదాయం వనరులుగా మారాయి.పరిశ్రమల నుంచి కలుషిత జలాలు.. రాష్ట్రంలో పరిశ్రమలను రెడ్, ఆరెంజ్, గ్రీన్, వైట్ అనే నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఇందులో రెడ్ కేటగిరీ అత్యంత హానికారక పరిశ్రమల కిందికి వస్తుంది. రాష్ట్రంలో 3,838 రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. 4,330 ఆరెంజ్, 1,332 గ్రీన్, 2,692 వైట్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. 2,193 పరిశ్రమలు రోజుకు 60.3 కోట్ల లీటర్ల కలుషిత జలాలను విడుదల చేస్తున్నాయి. ఈ వ్యర్థాలు నీరు చెరువులు, కాలువలు, పంట పొలాలు, భూగర్భంలోకి ఇంకుతున్నాయి. 3,024 పరిశ్రమలు ఏటా 3.17 లక్షల టన్నుల ప్రమాదక వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో 94,131 టన్నులు పునర్వినియోగించదగిన వ్యర్థాలు కాగా.. 2,085 టన్నులు దహనం చేయగల వ్యర్థాలు, 1,10,930 టన్నులు కో–ప్రాసెసింగ్, 1,09,943 టన్నులు భూమిలో నింపే వ్యర్థాలు.ఘన వ్యర్థాలూ ఘనమే.. రోజుకు 11,522 టన్నుల ఘన వ్యర్థాలు (Solid Waste) విడుదలవుతున్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 7,206 టన్నులు కాగా.. 4,316 టన్నులు మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి విడుదల అవుతున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నుంచి శుద్ధి చేయని బయో మెడికల్ వ్యర్థాలు విడుదల కావడం లేదు. ఇతర వ్యర్థాల మిశ్రమంతో బయో వేస్ట్ విడుదల అవుతున్నాయి. 10,292 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నుంచి రోజుకు 26,316 కిలోల బయో మెడికల్ వేస్ట్ విడుదల అవుతోంది. ఇందులో 17,184 కిలోలు దహించలేని బయో మెడికల్ వేస్ట్ కాగా.. 9,132 కిలోలు ఆటో క్లేవ్ వ్యర్థాలు.ఈ–వేస్ట్.. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వ్యర్థాలు కూడా గణనీయంగా పేరుకుపోతున్నాయి. రాష్ట్రంలో ఏటా 74,339 టన్నుల ఈ–వేస్ట్ విడుదలవుతోంది. 31 ఈ–వేస్ట్ (e- waste) కేంద్రాల్లో ఏటా 1,83,668 టన్నుల ఈ–వేస్ట్ శుద్ధి అవుతోంది. రాష్ట్రంలో రోజుకు 2,255 టన్నుల నిర్మాణ వ్యర్థాలు విడుదల అవుతున్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 1,763 టన్నులు, మున్సిపాలిటీ, పంచాయతీల్లో 492 టన్నుల వ్యర్థాలు ఉన్నాయి.చదవండి: డీపీఆర్ మార్పులు.. గ్రాఫిక్స్ మెరుపులు జీడిమెట్ల, ఫతుల్గూడ, శామీర్పేట, శంషాబాద్లో వ్యర్థాల శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. ఏటా వీటి సామర్థ్యం 2 వేల టన్నులు. రాష్ట్రంలో 251 ప్లాస్టిక్ తయారీ కేంద్రాలు నమోదయ్యాయి. వీటి నుంచి రోజుకు 1,300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల విడుదల అవుతుండగా.. 900 టన్నులు మాత్రమే ప్రాసెస్ అవుతోంది. -
Sheep Scam: గొర్రెల కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది. ‘గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. మాజీ ఓఎస్డీ కల్యాణ్ ఇంట్లో సోదాలు చేశాం.200లకుపైగా బ్యాంక్ పాస్బుక్లు సీజ్ చేశాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లోనూ ఈ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారు. 31సెల్ఫోన్లు, 20 సిమ్కార్డులు సీజ్ చేశాం. ఏడు జిల్లాల్లో రూ.253.93కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదికలో ఉంది. 33 జిల్లాల్లో రూ.వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేట్ వ్యక్తులు తమ సొంతఖాతాల్లోకి మళ్లించారు’అని తెలిపింది. -
ఇదొక ఫుడ్ లవ్ స్టోరీ..! వంటకానికో కథ..
నగర జీవన వైవిధ్యంలో విభిన్న సంస్కృతులకు చెందిన ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి అనుగుణంగానే దేశంతో పాటు విభిన్న ప్రాంతాలకు చెందిన కాంటినెంటల్ డిషెస్ సైతం నగరంలో ఆదరణ పొందుతున్నాయి. ఇందులో భాగంగానే నగరంలోని లీలా–రీన్ ది చెఫ్స్ స్టూడియో బెంగాల్ ప్రెసిడెన్సీ కాలం నాటి వంటకాలకు ఆధునికతను జోడించి ‘ప్రితిర్ కోతా’ రుచులను నగరవాసులకు చేరువ చేస్తున్నారు. ఈ చెఫ్స్ స్టూడియోలో ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనున్న ఫుడ్ ఫెస్ట్లో ప్రముఖ చెఫ్ గౌరవ్ సిర్కార్.. ప్రితిర్ కోతా ఫుడ్ పాప్–అప్తో అలరించనున్నారు. బెంగాల్ ఫుడ్కు నగరంలో ఇస్తున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇందులో భాగంగానే ఇక్కడి బెంగాల్ ఫుడ్ లవర్స్కు సరికొత్త రుచులను పరిచయం చేయనున్నట్లు ప్రముఖ చెఫ్ గౌరవ్ సిర్కార్ తెలిపారు. బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లోని జాక్ఫ్రూట్ కుడుములు మొదలు స్ట్రీట్ క్లాసిక్ ఫుడ్ భెట్కి, ప్రాన్ కబీరాజీ.. రాజ్–యుగ వంటకాలు స్టీమర్ డక్ కర్రీ, ఆల్టైమ్ ఫేవరెట్ ధోకర్దల్నా–రాధా బల్లవితో పాటు ఠాకూర్బరిర్ శుక్టో వంటి విభిన్న రుచులను నగరంలో వండి వారుస్తున్నామని తెలిపారు. ది ఒబెరాయ్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ పూర్వ విద్యార్థి అయిన చెఫ్ గౌరవ్ సిర్కార్.. న్యూఢిల్లీలోని ది ఒబెరాయ్ ‘ఓమ్య’, ది బాంబే క్యాంటీన్ వంటి ప్రముఖ సంస్థలతో తన కలినరీ అనుభవాన్ని విస్తరింపజేశారు. ప్రతి వంటకంతో ఒక కథ చెప్పడం అతని పాక శాస్త్ర వైవిధ్యం. ఈ పాప్–అప్ చారిత్రాత్మక కలయికలతో పాటు ప్రాంతీయ రుచులను సమకాలీన భోజన వినూత్నత్వాన్ని మిళితం చేస్తుంది.(చదవండి: జొన్న రొట్టె రుచికి అమెరికన్ సీఈవో ఫిదా..! ఇది చాలా హెల్దీ..) -
హైదరాబాద్ పబ్లో కిలాడీ స్కెచ్
హైదరాబాద్: భర్తతో కలిసి ఓ కిలాడీ లేడీ పక్కా స్కెచ్ వేసి సినీ ఫక్కీలో ఓ నగల దుకాణం ఉద్యోగిని కిడ్నాప్ చేసి నగదు, నగలు దోచుకోవడమేగాకుండా నగ్న వీడియోలు తీసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడింది. ఈ ఘటనలో యువతితో సహా నలుగురు కిడ్నాపర్లను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. అత్తాపూర్కు చెందిన సచిన్దూబే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–10లోని తిబారుమల్ జ్యువెలర్స్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. తరచూ పబ్లకు వెళ్లే అతడికి కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో బార్ డ్యాన్సర్గా పనిచేస్తున్న డింపుల్యాదవ్తో పరిచయం ఏర్పడింది.గత శనివారం తమ పబ్లో ప్రత్యేక కార్యక్రమం ఉందని సచిన్దూబేను ఆహ్వానించింది. దీంతో సచిన్ తన బైక్ను నగల దుకాణం వద్దనే పార్కు చేసి క్యాబ్లో పబ్కు వెళ్లాడు. పథకం ప్రకారం డింపుల్యాదవ్ డ్యాన్స్ చేస్తూ సచిన్ను రెచ్చగొడుతూ పీకలదాకా మద్యం తాగేలా చేసి మత్తులోకి దింపింది. అర్ధరాత్రి తర్వాత తూలుతూ, తూగుతూ బయటకు వచ్చిన సచిన్ను తాను బైక్పై దింపుతానంటూ తన స్కూటీ వెనుక ఎక్కించుకుని బంజారాహిల్స్కు వచ్చింది. అయితే.. అప్పటికే పథకంలో భాగంగా డింపుల్ భర్త తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో సచిన్, డింపుల్ వెళ్తున్న స్కూటీని అనుసరించాడు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–3లోని టీవీ9 చౌరస్తా వద్దకు రాగానే కిడ్నాపర్లు రోడ్డుకు అడ్డంగా కారును ఆపి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తన్నారంటూ బెదిరించడమే కాకుండా తాము టాస్క్ఫోర్స్ పోలీసులమని వెనుక కూర్చొన్న సచిన్ను కారులో ఎక్కించుకుని ఫిర్జాదీగూడ వైపు తీసుకెళ్లారు. మార్గమధ్యలో అతడికి నిద్ర మాత్రలు కలిపిన కూల్డ్రింక్ తాగించడంతో పూర్తిగా స్పృహ తప్పాడు. అనంతరం.. సచిన్ మెడలో ఉన్న గొలుసు, పర్సులో ఉన్న డబ్బులు లాక్కుని మంచంపై పడుకోబెట్టారు. అక్కడే ఉన్న అపరిచిత యువతితో సచిన్ బట్టలు తొలగించి నగ్న వీడియోలు తీయించారు. ఆపై, ఉదయం 6 గంటల సమయంలో సచిన్ను అత్తాపూర్లోని ఇంటి సమీపంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన గంట తర్వాత సచిన్ భార్యకు ఫోన్ చేసి తాము పోలీసులమని, రాత్రి మద్యం మత్తులో మీ భర్త ఒక మహిళను హత్య చేశాడని, తమ వద్ద వీడియోలు ఉన్నాయని బెదిరించడమే కాకుండా, రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీడియోలు బయటపెడతామని బ్లాక్మెయిల్ చేశారు.అయితే ఆమె భయపడకుండా హత్య చేస్తే ఇంటికి వచ్చి తన భర్తను అరెస్టు చేసుకోవచ్చని చెప్పింది. వారం రోజులుగా కిడ్నాపర్లు ఆమెకు ఫోన్లు చేస్తూ చివరకు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూకట్పల్లిలోని పబ్ వద్ద విచారణ చేపట్టి బార్ డ్యాన్సర్ డింపుల్ను అదుపులోకి తీసుకుని విచారించగా గుట్టురట్టయ్యింది.పథకం ప్రకారమే.. కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో బార్ డ్యాన్సర్గా పనిచేస్తున్న డింపుల్ యాదవ్ భర్త పవన్కుమార్యాదవ్ గతంలో అదే పబ్లో బౌన్సర్గా పనిచేశాడు. అయితే వీరి స్వస్థలం ఢిల్లీ కాగా హైదరాబాద్కు మకాం మార్చి అంబర్పేటలో అద్దెకు ఉంటున్నారు. ఈజీ మనీ కోసం అమాయకుడైన సచిన్ను మద్యం మత్తులో దింపి కిడ్నాప్ నాటకం ఆడి అడ్డంగా బుక్కయ్యాడు. డింపుల్యాదవ్, పవన్కుమార్యాదవ్తో పాటు కిడ్నాప్లో పాల్గొన్న సాయిప్రసాద్, హరికిషన్, అంగార సుబ్బారావులను పోలీసులు అరెస్టు చేశారు.కిడ్నాప్నకు వాడిన కారుపై లా ఆఫీసర్ ఎయిమ్స్ బీబీనగర్ అని ఉండడంతో పోలీసులు ఎవరూ అనుమానించకూడదనే ఇలా రాసినట్లుగా వెల్లడైంది. నిందితులు వాడిన బైక్లతో పాటు సచిన్ నుంచి నుంచి లాక్కున్న బంగారు గొలుసును స్వా«దీనం చేసుకున్నారు. తనను మద్యం మత్తులోకి దింపి పథకం ప్రకారమే కిడ్నాప్ చేసి నగ్న వీడియోలు తీసి రూ.10 లక్షలు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మోసం చేసినట్లు ఒప్పుకున్న డాక్టర్ నమ్రత!
హైదరాబాద్: అనైతిక సరోగసి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో భాగంగా డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. సరోగసీ పేరుతో పలువురిని మోసం చేసినట్లు డాక్టర్ నమ్రత అంగీకరించారు. చేసిన తప్పులను ఒప్పుకున్న డాక్టర్ నమ్రత.. దంపతులను సరోగసీ విషయంలో మోసం చేసినట్లు ఒప్పుకున్నారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసీ వైపు మళ్లించినట్లు తెలిపిన నమ్రత.. ఆ రాజస్థాన్ దంపతులు డీఎన్ఏ రిపోర్ట్ అడిగితే.. కుమారుడి ద్వారా రాజస్థాన్ దంపతులను బెదిరించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, అనస్థీషియన్ సదానందం డాక్టర్ నమ్రతకు సహకరించారని పోలీసులు తెలిపారు. సరోగసీ ద్వారా నమ్రత చాలా మోసం చేశారని పోలీసులు వెల్లడించారు. -
రేంజ్ రోవర్, డిఫెండర్లకు హైదరాబాద్లో ప్రత్యేక షోరూం
హైదరాబాద్: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జేఎల్ఆర్ ఇండియా హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా లగ్జరీ బొటిక్ ఆటోమోటివ్ షోరూమ్ లను ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రసిద్ధి చెందిన రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్లకు ప్రత్యేకమైన షోరూంను హైదరాబాద్లో ప్రారంభించిన జేఎల్ఆర్ ఇండియా సురేష్ రెడ్డి నేతృత్వంలోని ప్రైడ్ మోటార్స్ భాగస్వామ్యంతో దీన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది.ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ షోరూం వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన, ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఇందులో లేటెస్ట్ వెహికల్ మోడల్స్, క్యూరేటెడ్ ఆప్షన్స్, లైఫ్ స్టైల్, బ్రాండెడ్ ఐటమ్స్ కోసం ఒక విభాగం ఉన్నాయి. కన్సల్టేటివ్, ఇమ్మర్సివ్ సేల్స్ విధానంతో క్లయింట్ లకు మార్గనిర్దేశం చేయడానికి నిపుణులైన సిబ్బంది అందుబాటులో ఉంటారు."దేశంలోని అత్యంత డిజైన్-ఫార్వర్డ్, ఆకాంక్షాత్మక నగరాలలో ఒకటైన దానిలో మా రేంజ్ రోవర్, డిఫెండర్ బ్రాండ్ల గుర్తింపును మరింత బలోపేతం చేస్తున్నాము. ఈ షోరూం ఆధునిక, క్యూరేటెడ్ లగ్జరీ పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మా హౌస్ ఆఫ్ బ్రాండ్స్, కస్టమర్-ఫస్ట్ ప్రయాణంలో తదుపరి దశను సూచిస్తుంది" అని జేఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ అంబా పేర్కొన్నారు. -
లగ్జరీగా హీరో రవితేజ మల్టీఫ్లెక్స్.. ఫోటోలు వైరల్
-
సింగిల్ యూజ్.. ప్లాస్టిక్ బ్యాన్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వినియోగాన్ని త్వరలో పూర్తిగా నిషేధించనున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో నగరంలో దీని నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉండే క్యారీ బ్యాగ్లను సంపూర్ణంగా నిషేధించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టనున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ పేరిట దీన్ని అమల్లోకి తేనున్నారు. గతంలోనూ పలు పర్యాయాలు నిరీ్ణత మైక్రాన్ల కంటే తక్కువ మైక్రాన్ల ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఆదిలో అట్టహాసమే తప్ప అమలులో అటకెక్కింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. ప్లాస్టిక్ నిషేధం కోసం 2007 నుంచే ప్రయత్నాలు చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. నిషేధం అమలు కోసమని పెనాలీ్టలను రూ.5 వేల నుంచి మొదలు పెడితే లక్ష రూపాయల వరకు విధిస్తూ పలు సర్క్యులర్లు, జీవోలు జారీ అయినప్పటికీ, అమలులో మాత్రం నీరు గారింది. ఈ నేపథ్యంలో దీన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు తాజాగా జీహెచ్ఎంసీ చట్ట సవరణకు అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆమోదం అనంతరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించనున్నారు. తద్వారా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వినియోగంలో లేని నగరంగా హైదరాబాద్ ఉండాలని భావిస్తున్నారు. టీసీయూర్ (తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్)వరకు దీన్ని అమలు చేసే ఆలోచనలున్నప్పటికీ.. తొలుత చట్ట సవరణ ద్వారా జీహెచ్ఎంసీ పరిధి వరకు కట్టుదిట్టంగా అమలు చేయాలని భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకొని చట్ట సవరణ చేయనున్నారు. గతంలో ఇలా.. ఎన్ని మైక్రాన్ల లోపు ఉంటే సింగిల్ యూజ్ ప్లాస్టికో క్రమేపీ మారుతోంది. 20 మైక్రాన్ల లోపు వాటిని ఒకప్పుడు సింగిల్యూజ్ ప్లాస్టిక్గా పరిగణించగా, ప్రస్తుతం ఇది 120 మైక్రాన్లకు చేరింది. జీహెచ్ఎంసీ ఏర్పాటైన తొలినాళ్లలోనే 2007 ఆగస్ట్ 8న జారీ అయిన సర్కులర్ మేరకు 20 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ బ్యాగ్స్ అమ్మినవారికి రూ.5వేలు, వినియోగించిన వారికి రూ.500 జరిమానాలు విధించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2011లో 40 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలు జరగరాదన్నారు. 2016లో మొదటిసారి రూ.10వేల జరిమానాతో పాటు మూడోసారి సంస్థ మూసివేత వరకు చర్యలుంటాయని పేర్కొన్నారు. 2017లో వెలువడిన జీవో మేరకు నిషేధం అమల్లో జీహెచ్ఎంసీ విఫలమైతే జీహెచ్ఎంసీకి పీసీబీ రూ.25వేల జరిమానా విధిస్తుందని పేర్కొన్నారు. దాదాపు మూడేళ్ల క్రితం 2022లో డీలర్లు, డి్రస్టిబ్యూటర్లకు లక్ష రూపాయల జరిమానా నుంచి ప్రారంభించి సంస్థల సీజ్ వరకు చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వు జారీ చేశారు. ఒక టాస్్కఫోర్స్ సైతం ఏర్పాటు చేశారు. అమలులో మాత్రం విఫలమయ్యారు. పర్యవసానంగా ఏ మార్కెట్కు, దుకాణానికి వెళ్లినా ప్రజలకు మాత్రం క్యారీబ్యాగ్ల భారం అదనంగా పడుతోంది. గత పాలకమండలిలోనూ నగరంలో ప్టాస్టిక్ సంపూర్ణ నిషేధానికి ఆమోదం తెలిపిన సర్వసభ్య సమావేశం ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాక తిరిగి పట్టించుకోలేదు. ప్రభుత్వ నిర్ణయం మేరకు.. నిషేధానికి చేయనున్న చట్ట సవరణలోనూ కొన్ని ప్రత్యేక అవసరాలకు మినహాయింపులు ఉండనున్నట్లు తెలిసింది. నిషేధం అమల్లోకి వస్తే నగరంలో వివిధ సమస్యలు తగ్గుతాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నాలాల్లో వ్యర్థాలు చాలా వరకు తగ్గుతాయి. తద్వారా వరద సమస్యలు తగ్గుతాయి. ఎగుమతి కోసం ప్రత్యేకంగా ప్లాస్టిక్ క్యారీబ్యాగ్స్ ఉత్పత్తి చేసేవారికి, సీల్డు సరుకుల ప్యాకేజీలు, పాలు,పాల ఉత్పత్తుల ప్యాకింగ్స్, నర్సరీల అవసరాలకు అనుమతించే అవకాశం ఉంది. కాగా.. ప్రభుత్వ నిర్ణయానికనుగుణంగా మినహాయింపులు ఉండనున్నాయి. -
HYD: ఎట్టకేలకు చిక్కిన చిరుత
సాక్షి, హైదరాబాద్: గత 12 రోజులుగా అధికారులకు కంటి మీద కునుకులేకుండా చేసిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. మంచిరేవులలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత పడిందని అధికారులు ప్రకటించారు. దీనిని నల్లమల్ల అడవిలో వదిలిపెట్టనున్నట్లు తెలిపారు. నగర శివారులో గత రెండు వారాలుగా చిరుత సంచారం జనాలను భయాందోళనకు గురి చేస్తూ వచ్చింది. మృగవని పార్క్ గ్రేహౌండ్స్ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపింది. దీనిని బంధించేందుకు 8 ట్రాప్ కెమెరాలు, 4 బోనులు ఏర్పాటు చేశారు అధికారుల. అయినా అది చిక్కకుండా అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. ఈ క్రమంలో గత అర్ధరాత్రి దాటాక మొయినాబాద్ ఎకోటిక్ పార్క్లో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. -
హైదరాబాద్ : ఓ షోరూంలో సినీ నటులు, మోడల్స్ సందడి (ఫొటోలు)
-
Hyderabad: వాణిజ్య పన్నుల శాఖ దాడులు.. వెలుగులోకి భారీ మోసం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో భారీ పన్ను మోసం వెలుగులోకి వచ్చింది. కేసులో హైదరాబాద్లోని ప్రైవేట్ సంస్థ ఎంఎస్ కీషాన్ ఇండస్ట్రీస్ ఎల్ఎల్పీ ప్రధాన పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సికింద్రాబాద్లోని బన్సీలాల్పేట గోదాం, మెదక్ జిల్లాలోని కలకల్ ఆటోమోటివ్ పార్క్, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లోని తయారీ యూనిట్లలో అధికారులు సోదాలు నిర్వహించారు.సరుకులు తరలించకుండా భారీ విలువ కలిగిన కాపర్ సరుకుల సప్లైకి సంబంధించి పన్ను బిల్లులు జారీ చేసినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ వాహనాలను తెలంగాణ నుంచి మహారాష్ట్రకు పంపించగా.. డాక్యుమెంట్లలో మాత్రం భారీ సరుకుల రవాణా జరిగినట్టు చూపించినట్లు అధికారలు నిర్థారించారు. మోసపూరిత బిల్లుల మొత్తం విలువ రూ.100 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మోసం జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ద్వారా అందిన టోల్ గేట్ డేటా విశ్లేషణ ద్వారా వెలుగులోకి వచ్చింది.సంస్థ సుమారు రూ. 33.20 కోట్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) ను నకిలీ లావాదేవీల ద్వారా పొందినట్టు అధికారులు గుర్తించారు. ఖాతా పుస్తకాలు, రిజిస్టర్లు, హార్డ్ డిస్కులు, సీసీటీవీ ఫుటేజ్ తదితర ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంస్థ డైరెక్టర్లు వికాష్ కుమార్ కీషాన్, రజనీష్ కీషాన్పై క్రిమినల్ కేసు నమోదు చేయమని హైదరాబాద్ కేంద్రమైన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) డీసీపీకి అధికారులు ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో మరో సంఘటనలో, చార్మినార్ డివిజన్ మెహదీపట్నం-1 సర్కిల్కు చెందిన డీఎస్టీవో మజీద్ హుస్సేన్ మరో మోసాన్ని గుర్తించారు. మోసాలపై దర్యాప్తు చేపట్టినట్లు వాణిజ్య పన్నుల కమిషనర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. -
హైదరాబాద్ ఫామ్ హౌజ్ లో సీజ్ చేశామంటున్న డబ్బు నాది కాదు: రాజ్ కేసిరెడ్డి
-
హైదరాబాద్లో ఫ్లాట్ల కొనుగోళ్లకు భారీ తాకిడి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఫ్లాట్ల కొనుగోలుకు నగరవాసుల నుంచి తాకిడి పెరిగింది. నాగోలు బండ్లగూడ ప్రాజెక్టులోని 159 ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోడానికి మంగళవారం చివరి రోజు కావడంతో ఆసక్తి ఉన్నవారు డీడీలతో క్యూ కట్టారు. బండ్లగూడ, పోచారంలలో ఫ్లాట్ల కోసం సుమారు 1,900 మందికి పైగా దరఖాస్తు చేశారు. చివరి రోజు మంగళవారం 600కుపైగా దరఖాస్తులు రావడం విశేషం.సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారి నుంచి రాత్రి పొద్దుపోయే వరకూ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. గత తరహాలో కాకుండా లబ్ధిదారులు తమకు నచ్చిన ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ ఫ్లాట్ కోసం ఒకరి కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే లాటరీలో తీసి వచ్చిన వారికి కేటాయిస్తారు. ఈ కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన లాటరీని బుధవారం బండ్లగూడ ప్రాజెక్టు కార్యాలయంలో నిర్వహించారు.బండ్లగూడలో ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకుని లాటరీలో రానివారు, పోచారం ప్రాజెక్టులోని ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. బండ్లగూడలో ప్రాజెక్టులో ఈఎండీ చెల్లించినట్లు ఇచ్చిన రసీదును పోచారం ప్రాజెక్టులో సమర్పించి అక్కడి ఫ్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో తొర్రూర్, బహదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లో ఆగస్టు 4, 5, 6 తేదీల్లో జరిగే ఓపెన్ ఫ్లాట్ల విక్రయానికి సంబంధించిన వేలంలో.. బండ్లగూడలో పొందిన రసీదుతోనే పాల్గొనవచ్చని ఆయన వివరించారు. ఘట్కేసర్ పోచారం ప్రాంతంలోని 601 ఫ్లాట్ల కొనుగోలు దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 31 కాగా.. లాటరీ ప్రక్రియ ఆగస్టు 1, 2వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు గౌతం పేర్కొన్నారు. -
రాజాసింగ్ రీ ఎంట్రీకి ప్రయత్నిస్తున్నారా..?
సాక్షి, హైదరాబాద్: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి కమలం గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారా? బీజేపీ జాతీయ నాయకత్వం ఆహా్వనిస్తే కలవడానికి సిద్ధమవుతున్నారా.. అంటే ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించి బహిష్కరణ వేటుకు గురైన రాజాసింగ్ మళ్లీ కాషాయతీర్థం పుచ్చుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ పిలిస్తే రాజీనామా చేయడానికి గల కారణాలు, రాష్ట్ర పార్టీ నాయకుల తీరు గురించి వివరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ రాజాసింగ్ ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ‘నా వైపు నుంచి కూడా కొన్ని తప్పులు దొర్లాయి. అధిష్టానానికి కొందరు నాపై తప్పుడు సమాచారం చేరవేశారు’అని తాజాగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన మనసు మార్చుకునేందుకు, తిరిగి బీజేపీ గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీకి మాత్రమే రాజీనామా చేశా.. ‘ఉప ఎన్నిక వస్తుందని కొంత మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. నేను పార్టీకి మాత్రమే రాజీనామా చేశాను. ఎమ్మెల్యే పదవికి కాదు. స్పీకర్కు లేఖ ఇవ్వలేదు. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే అక్కడెక్కడా ఉప ఎన్నిక రాలేదు. గోషామహల్లో ఎలా వస్తుందో నాకు తెలియడంలేదు. మరో మూడేళ్లు నేనే ఎమ్మెల్యేగా ఉంటాను. ఉప ఎన్నిక ప్రసక్తే రాదు’అని రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీలో మిత్రులతోపాటు శత్రువులు ఉన్నారని, వాళ్లే మీడియాకు లీకులిస్తూ, వాటిని ఢిల్లీలో ఫిర్యాదు చేస్తారని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారంటూ సామాజిక మాద్యమాల్లో జరిగిన తప్పుడు ప్రచారంతో నా రాజీనామాను అధిష్టానం ఆమోదించిందని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా ఇచ్చాననేది వివరణ ఇచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఎవరి వల్ల నష్టం జరుగుతుంది, ఇతర పారీ్టల నుంచి వచి్చన వారికి ఎలాంటి అవమానాలు జరుగుతున్నాయనే అంశాలను వివరిస్తానని రాజాసింగ్ పేర్కొన్నారు. -
కుక్క కావాలా..
సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కల సమస్య పరిష్కారానికి బల్దియా చర్యలు చేపట్టనుంది. ఎంపిక చేసిన పెద్ద పార్కుల్లో వీధికుక్క పిల్లల ప్రదర్శన.. దత్తత కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. గతంలో ‘మా ఇంటి నేస్తం’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి మెరుగులు దిద్ది, కొత్త విధానంలో చేపట్టేందుకు రెడీ అవుతోంది. డా.బి.జనార్దన్రెడ్డి కమిషనర్గా ఉన్న సమయంలో ‘మా ఇంటి నేస్తం’ కింద కుక్క పిల్లలను పెంచుకోవాలని ముందుకొచ్చేవారికి వాటిని అందజేసేవారు.సదరు కార్యక్రమానికి మెరుగులు దిద్ది, వాటిని స్ట్రీట్ డాగ్స్లా చూడకుండా అందమైన పెట్డాగ్స్గా పెంచుకునేందుకు కుక్క పిల్లలకు వైద్య పరీక్షలు, టీకాలు తదితరాలు పూర్తయ్యాక పెంపకంపై తగిన అవగాహన వంటివి సైతం కల్పించి దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చే వారికి అందజేయనున్నారు. ఎంపిక చేసిన పార్కుల్లో కెన్నెల్స్లో కుక్కపిల్లలను ఉంచి ప్రదర్శన ఏర్పాటు చేసి, అధికారులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించి, నిబంధనలకనుగుణంగా నడచుకునేలా అవగాహన కలి్పంచి దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపే వారికి కుక్కపిల్లలను అందజేయనున్నారు.కుక్కకాట్లు తగ్గేందుకు.. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా దేశంలోని పలు నగరాల్లో వీధి కుక్కల సమస్యలున్నాయి. వాటి బారిన పడి ఎందరో.. ముఖ్యంగా చిన్నపిల్లలు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కోర్టులు సైతం ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ ఆయా మున్సిపల్ కార్పొరేషన్లను ప్రశి్నస్తున్నాయి. ఎంతగా శస్త్రచికిత్సలు చేసినప్పటికీ, కుక్కల సంతతిని అరికట్టడం సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో వీధికుక్కలుగా ఉంటే జనాన్ని కరుస్తుండటంతో వాటిని పెంపుడు జంతువులుగా మారిస్తే సమస్య తగ్గుతుందనే తలంపుతో జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమానికి సిద్ధమైంది. పార్కుల్లో ప్రదర్శనలు ఇందులో భాగంగా తొలుత బంజారాహిల్స్లోని జలగం వెంగళరావు పార్కులో, తర్వాత కేబీఆర్ పార్కులో కెన్నెల్స్లో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తద్వారా డాగ్ లవర్స్ కుటుంబాలతో సహ వచ్చి ప్రదర్శనలోని కుక్కపిల్లల్లో నచ్చిన దానిని ఎంచుకునేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రదర్శనకు అవసరమైన కెన్నెల్స్ ప్రైవేట్ ఏజెన్సీ సహకారంతో సమకూర్చుకోనున్నారు. జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం సిబ్బందితో పాటు స్వచ్ఛంద సేవల సిబ్బంది దత్తత ఇచ్చేందుకు కుక్కపిల్లలకు తగిన వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యకరంగా ఉన్నవాటినే ప్రదర్శనలో ఉంచుతారు. తల్లిపాలు మరచిన, నులిపురుగులు వంటివి లేకుండా తగిన మందులతోపాటు అవసరమైన టీకాలు వేసిన రెండునెలల వయసు దాటిన కుక్కపిల్లలను ప్రదర్శనల్లో ఉంచుతారు. ప్రదర్శన సమయంలో కుక్కపిల్లల్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చేవారికి అక్కడే దరఖాస్తులు అందజేస్తారు. ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రజల సందేహాలకు సమాధానాలిస్తారు. ప్రజలు కుక్కకాట్ల బారిన పడకుండా ఉండేందుకు వీధికుక్కల సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా, ఎక్కువమంది ప్రజలు కుక్కల్ని దత్తత తీసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఆరోగ్యంపై వాకబు.. దత్తత తీసుకునేవారికి కుక్కల పెంపకంపై తగిన అవగాహనతో పాటు జంతు సంరక్షణకు సంబంధించిన అంశాల వంటివి వివరించనున్నారు. దత్తత ఇచి్చన కుక్కలకు అవసరమైన వైద్య పరీక్షలకు జీహెచ్ఎంసీ సహకరించనుంది. నిరీ్ణత వ్యవధిలో దత్తత తీసుకున్న ఇళ్లకు వెళ్లడం లేదా ఫోన్ ద్వారా సంప్రదించి దత్తత కుక్కల ఆరోగ్యాన్ని వాకబు చేయనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ప్రజారోగ్యం, జంతు సంరక్షణల దృష్ట్యా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా దత్తత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
కాలుష్యరహితంగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చి పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరానికి అవసరమైన భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నగరం నడిరోడ్డున (కోర్ సిటీ) ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు తరలించాలని ఆదేశించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ప్రణాళిక రూపొందించండి హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయా లని సీఎం చెప్పారు. నగరంలో భూగర్భ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబులింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని శాఖలు సమగ్ర డీపీఆర్లు తయారు చేయాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడంతో పాటు నిర్మాణ రంగ వ్యర్థాలను ఇష్టారీతిన డంప్ చేయకుండా చూడాలని ఆదేశించారు.ఉద్దేశపూర్వకంగా డంప్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో మంచినీరు, మురుగు నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలని చెప్పారు. అందుబాటులో ఉన్న వనరులను సది్వనియోగం చేసుకునేలా, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సీవరేజీ బోర్డు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పర్యాటక ప్రదేశాలుగా వారసత్వ కట్టడాలు ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న వారసత్వ కట్టడాలను సంరక్షించడంతో పాటు పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించాలని సీఎం రేవంత్ సూచించారు. పాతబస్తీలో మెట్రో రైలు మార్గం పనులపైనా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆరా తీశారు. మెట్రో విస్తరణకు అవసరమైన నిధులు విడుదల చేసిన నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలన్నారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటేడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా హిమాయత్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఓఆర్ఆర్ నుంచి మూసీ వైపు వచ్చే క్రమంలో కొత్వాల్గూడ జంక్షన్లో మూసీ రివర్ ఫ్రంట్కు ప్రతీకగా గేట్ వే ఆఫ్ ఇండియా, ఇండియా గేట్, చారి్మనార్ తరహాలో ల్యాండ్ మార్క్ను నిర్మించాలని ఆదేశించారు. మీరాలం ట్యాంకు వద్ద అధునాతన హోటల్ నెహ్రూ జూ పార్క్, మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపైనా సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో హోటల్ నిర్మించాలని ఆదేశించారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్తో పాటు నగరాన్ని వీక్షించేలా హోటల్ ఉండాలని సూచించారు.సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం కార్యదర్శి మాణిక్రాజ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శులు ఇలంబర్తి, టీకే శ్రీదేవి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎఫ్సీడీఏ కమిషనర్ కె.శశాంక, వాటర్ బోర్డు ఎండీ అశోక్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిత్తల్, మెట్రో రైలు ఎండీ ఎనీ్వఎస్ రెడ్డి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, జేఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు. -
శస్త్రచికిత్సలకు 3 నెలలపాటు ఎదురుచూపులు
హైదరాబాద్: అది ఆసియాలోనే పేరున్న ఆసుపత్రి.. నిష్ణాతులైన వైద్యులకు నిలయం.. శస్త్రచికిత్సలకు ప్రసిద్ధి. కానీ, ఇటీవల వైద్యులు, ఫార్మసిస్టుల కొరత పీడిస్తోంది. ఉన్న సిబ్బందిపై పనిభారం తీవ్రమైంది. శస్త్ర చికిత్సలకు కనీసం మూడు నెలలపాటు వేచి చూడాల్సిందే. ఇదీ కోఠి ఈఎన్టీ (ముక్కు, చెవి, గొంతు) ఆసుపత్రి పరిస్థితి. కొంతకాలంగా వైద్యులు, ఫార్మసిస్టులు, నర్సులు, సిబ్బంది కొరత కారణంగా రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో నిష్ణాతులైన వైద్యులు ఇతర ఆసుపత్రులకు బదిలీ కావడంతో ఇక్కడ ప్రతినిత్యం జరిగే శస్త్రచికిత్సలకు తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. రోజూ వెయ్యిమందికిపైగా ఓపీ రోగులుతెలంగాణ (Telangana) నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎంతో మంది రోగులు ఈ ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందుతారు. ఈ ఆసుపత్రికి ప్రతి రోజు వెయ్యి నుంచి 1300 మంది ఔట్ పేషెంట్లు వస్తున్నారు. 200 నుంచి 300 వరకు ఇన్ పేషంట్లు వివిధ యూనిట్లలో చికిత్సలు పొందుతుంటారు. ఇటీవల కాలంలో ఓపీ రోగులు పెరుగుతుండటంతో సరైన వైద్య సేవలు అందటంలేదు. బదిలీలు అయిన వైద్యుల స్థానంలో కొత్తవారిని ప్రభుత్వం నియమించకపోవడంతో ఈ ఆసుపత్రిలో వైద్యం అంతంత మాత్రమే ఉంది. తీవ్రంగా వైద్యుల కొరత.. కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో మొత్తం ఐదు మంది ప్రొఫెసర్లు ఉండాలి. ఇటీవల ముగ్గురు ప్రొఫెసర్లు బదిలీ కావడంతో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఐదుగురు అసోసియేట్ ప్రొఫెసర్లకుగాను ఇద్దరు బదిలీకావడంతో ముగ్గురే సేవలందిస్తున్నారు. 14 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకుగాను నలుగురు మాత్రమే ఉన్నారు. వైద్యుల కొరత కారణంగా రోగులకు అవసరమైన శస్త్ర చికిత్సలు సకాలంలో అందడంలేదు. నెలలపాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై పలుమార్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభుత్వానికి నివేదికలు పంపినా ఫలితం శూన్యమని చెప్పవచ్చు. కేవలం ఒక ఫార్మసిస్టు మాత్రమే వందల మంది రోగులకు మందులు అందిస్తున్నారు. దీంతో ఆ ఫార్మసిస్టుపై పనిభారం ఎక్కువై ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఫార్మసిస్టును వెంటనే భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. మందులతోనే సరి..వివిధ జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు సరైన సమయంలో వైద్యం అందక పోవడంతో వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఔట్ పేషెంటు రోగులకు పీజీ వైద్యులు కేవలం మందులు రాసి సరిపెడుతున్నారు. ఒక్కప్పుడు ఇదే ఆసుపత్రిలో ప్రతి రోజు 20 నుంచి 30 శస్త్ర చికిత్సలు జరిగేవి. ఇప్పుడు శస్త్రచికిత్సలకు కనీసం మూడు నెలలు ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ ఆసుపత్రిలో సిబ్బందితో పాటు సరైన సౌకర్యాలు సైతం లేకపోవడంతో ఆసుపత్రి అధ్వానంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆసుపత్రికి సరైన వైద్యులు, ఫార్మసిస్ట్లు, నర్సింగ్ సిబ్బందిని సమకూర్చాలని పలువురు రోగులు కోరుతున్నారు.చదవండి: హైదరాబాద్లో చిరుత పులి.. పక్షం రోజులు దాటినా దొరకని జాడ -
డీజే బీట్స్.. రోడియో నైట్స్..
యువతను ఆకర్షించే రీతిలో హైదరాబాద్ నగరంలో మరోసారి సరికొత్త సంస్కృతికి బీజం పడింది. ప్రతిష్టాత్మక ‘రాయల్ ఛాలెంజ్ అమెరికన్ ప్రైడ్ రోడియో నైట్స్’కు నగరం వేదికైంది. అమెరికా తరహా కల్చర్లో భాగమైన కాక్టెయిల్స్, దేశీ డీజే బీట్స్ మేళవింపుతో ఈ నైట్ను బోల్డ్ లైఫ్స్టైల్ ఎక్స్ప్రెషన్గా సోమాజిగూడలోని ఆక్వా పార్కులో సోమవారం వినూత్నంగా నిర్వహించారు. నగరంలో మొదలైన ఈ ఉత్సవం.. త్వరలోనే ఇతర నగరాలకూ విస్తరించనుంది. లైఫ్స్టైల్ వేదికగా అమెరికన్ స్పిరిట్, ఫ్రీడమ్, అడ్వెంచర్ థీమ్లతో బ్రాండ్ అనుభవాన్ని మరింత బలంగా ట్యాప్ చేయనుంది. ఈ ఈవెంట్ ప్రధానంగా అమెరికానా వైల్డ్ వెస్ట్ థీమ్ ఆధారంగా డిజైన్ చేశారు. డెనిమ్ స్టైల్తో అలంకరించిన డిజైన్, ఇంటరాక్టివ్ గేమ్స్, ఏ ఆర్ ఫొటో మూమెంట్స్ వంటి అనేక అనుభూతులను కలిపి లైఫ్స్టైల్ స్టేట్మెంట్గా రూపొందించారు. ఇందులో భాగంగా లాసో ఛాలెంజ్లు, హ్యామర్ స్లామ్లు, హ్యాండ్ పెయింటెడ్ డీఐవై జోన్ వంటి క్రియేటివ్ స్పేస్తో యువతను కొత్తరకంగా భాగస్వాములను చేసింది. ఈ వేదికపై ప్రత్యేకంగా క్యూరేటెడ్ అమెరికన్ బైట్స్, సిగ్నేచర్ కాక్టెయిల్స్, ఎనర్జీ ఫుల్ డీజే బీట్ అహూతులను ఉత్సాహపరిచాయి. ఆధునిక జీవనశైలి.. ‘ఇది సంగీతం, స్వేచ్ఛ, సంస్కృతిని కలిపిన ఆధునిక జీవన శైలికి ప్రతిబింబం’ అని డియాజియో ఇండియా వైస్ ప్రెసిడెంట్ వరుణ్ కూరిచ్ అన్నారు. యువత ఆత్మవిశ్వాసం, ఐడెంటిటీని ప్రతిబింబించే ఈవెంట్లను కోరుతోంది. ఈ రోడియో నైట్స్ అలాంటి అవకాశాన్ని అందించిన తొలి వేదికని తెలిపారు. -
‘మీరు నన్నెలా అరెస్ట్ చేస్తారు?’.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రత
సాక్షి,హైదరాబాద్: అనైతిక సరోగసి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేరం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణ పోలీసులు తనని ఎలా అరెస్ట్ చేస్తారంటూ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిందితులు సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితురాలు డాక్టర్ అట్లూరి నమ్రత తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు.35 ఏళ్ల పాటు సుదీర్ఘ అనుభవం ఉన్న తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలనుండి ఒక్క ఫిర్యాదు కూడా లేదు. నేరం జరిగింది ఆంధ్రప్రదేశ్లో.. తెలంగాణ పోలీసులు నాపై కేసులు ఎలా నమోదు చేసి.. అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
హైదరాబాద్లో చిరుత పులి.. స్థావరాలను మారుస్తూ..
హైదరాబాద్ నగరవాసులను చిరుత పులి భయపెడుతోంది. అభయారణ్యంలో ఉండాల్సిన చిరుత జనారణ్యంలోకి వచ్చి.. దారి తెలియక అటూ ఇటూ స్థావరాలను మారుస్తూ శివారు ప్రాంతాల ప్రజలను వణికిస్తోంది. ఇప్పటి వరకు రాజేంద్రనగర్ పరిధిలోని అటవీ, పోలీసు శాఖల క్యాంపులలో ఉన్న చిరుతపులి సోమవారం ఏకంగా మిలిటరీ కేంద్రంలోకి దూరింది. దాన్ని పట్టుకునేందుకు పక్షం రోజులుగా అటవీ శాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించటం లేదు.మొయినాబాద్ మండలం, అజీజ్నగర్ గ్రామంలోకి వెళ్లే పాత రోడ్డులో ఉన్న మూలికావనంలో ఈ నెల 9వ తేదీన చిరుతపులి (Leopard) జాడ కనిపించింది. అక్కడి నుంచి ఈ నెల 20వ తేదీన పక్కనే ఉన్న గండిపేట మండలం, మంచిరేవులలోని పోలీస్ గ్రేహౌండ్స్లోకి వచ్చింది. అక్కడ విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ దాన్ని చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు వచ్చి సీసీ కెమెరాలు, బోన్లను ఏర్పాటు చేశారు. మరుసటి రోజు ఉదయం సమయంలో గ్రేహౌండ్స్లో ఓ రోడ్డు దాటుతూ సీసీ కెమరాలో చిక్కింది. ఆ మరుసటి రోజే గ్రే హౌండ్స్ వెనకాల ఉన్న ఓ విల్లా ప్రాజెక్ట్లో నివాసితులకు ఓ రాతి గుండుపై కూర్చుని కనిపించింది. ఈ నెల 24వ తేదీన తెల్లవారు జామున ఏకంగా ఔటర్రింగ్ రోడ్డు (Outer Ring Road) దాటి సర్వీసు రోడ్డులో ఉన్న అటవీశాఖకు చెందిన ట్రెక్ పార్క్లోకి చేరింది. దాంతో అక్కడా సీసీ కెమరాలు, బోన్లను ఏర్పాటు చేశారు. మరో మారు ప్రయాణం.. మొయినాబాద్ మండలంలోని మూలికా వనం నుంచి మొదలయిన చిరుత ప్రయాణం సోమవారం తెల్లవారు జామున రాందేవ్గూడలోని మిలట్రీ ఏరియాలోని రోడ్డు దాటి శిక్షణా కేంద్రంలోకి వెల్లింది. అటుగా వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డు దాటుతున్న చిరుతను చూసి 100 నెంబర్కు ఫోన్ చేశాడు. దాంతో ఇప్పటి వరకు అటవీశాఖ ట్రెక్పార్కులో ఉందనుకున్న చిరుత సోమవారం రంగారెడ్డి జిల్లా పరిధి దాటి హైదరాబాద్ జిల్లాలోకి ప్రవేశించింది. దాంతో మిలట్రీ వారు అలర్ట్ అయి దాన్ని పట్టుకోవాలని అటవీశాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు. చదవండి: హైదరాబాద్లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్భయాందోళనలో ప్రజలు.. తమ గ్రామాలకు పక్కనే చిరుతపులి సంచరిస్తుందనే విషయం తెలుసుకున్న గండిపేట మండల పరిధిలోని మంచిరేవుల, గండిపేట, నార్సింగి, బైరాగిగూడ, గంధంగూడ, నెక్నాంపూర్, గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహింబాగ్, రాందేవ్గూడల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.తిరిగి రావాల్సిందే.. మొయినాబాద్ మండల పరిధిలో ఆనవాళ్లు కనిపించిన చిరుతను పట్టుకునేందుకు పక్షం రోజులుగా ప్రయత్నిస్తునే ఉన్నాం. చాలాచోట్ల సీసీ కెమరాలు, బోన్లు ఏర్పాటు చేశాం. సోమవారం తెల్లవారుజామున రాందేవ్గూడలోని మిలట్రీ ఏరియాలో రోడ్డు దాటి మిలట్రీ క్యాంప్లోకి వెళ్లినట్టు సీసీ కెమరాలో రికార్డు అయ్యింది. దానికి అక్కడ అనువైన ప్రాంతం లేదు. కాబట్టి అది తిరిగి ట్రెక్ పార్క్, గ్రేహౌండ్స్ వైపే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, రోడ్లపై ప్రయాణించే వారు జాగ్రత్తగా ఉండాలి. – లక్ష్మణ్, అటవీ రేంజ్ అధికారి, చిలుకూరు రేంజ్ -
ఫోన్లో యువకుడితో మాట్లాడుతోందని..
హైదరాబాద్: సెల్ఫోన్లో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆవేశానికి లోనైన ఓ తమ్ముడు అక్క గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాఘవేంద్ర, సునీత దంపతులకు రుచిత (21), రోహిత్ (20) వైష్ణవి (18) సంతానం. పెద్ద కూతురు రుచిత ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి, ఎంబీఏలో చేరేందుకు సిద్ధమవుతోంది. రుచిత ఇదే గ్రామానికి చెందిన దినేశ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయంలో పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగ్గా, ఒకరితో ఒకరు మాట్లాడకూడదని తీర్మానించుకున్నారు. తల్లిదండ్రులు పని నిమిత్తం ఉదయాన్నే బయటకు వెళ్లగా.. ఉదయం 11 గంటలకు తమ్ముడు రోహిత్ ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో రుచిత ఫోన్లో దినేశ్తో మాట్లాడటాన్ని గమనించి అక్కతో వాగ్వాదానికి దిగాడు.ఇరువురి మధ్య మాటామాటా పెరిగి, ఆగ్రహానికి గురైన రోహిత్ గొంతు నులిమి సోదరిని హత్య చేశాడు. అనంతరం కొడిచర్లలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి, అక్కకు శ్వాస ఆడటం లేదని, కిందపడిపోయిందని చెప్పాడు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే రుచిత చనిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు దినేశ్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని షాద్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దినేశ్ కారణంగానే తన కూతురు చనిపోయిందని, మృతురాలి తండ్రి రాఘవేంద్ర ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నర్సింహారావు తెలిపారు. -
నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్పై కేసు
సాక్షి,హైదరాబాద్: నిమ్స్ డిప్యూటీ సూపరిటెండెంట్ లక్ష్మీ భాస్కర్పై కేసు నమోదైంది. రాజమండ్రికి చెందిన మరో వైద్యుడిని స్థలం వివాదంలో లక్ష్మీ భాస్కర్ మోసం చేశారు. స్థలం పేరుతో నిమ్స్ డిప్యూటీ సూపరీడెంట్ రూ.50 లక్షలు కాజేశారు. కోర్టు సిఫారసుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీ భాస్కర్పై గతంలోనూ ఇదే తరహా ఆరోపణలున్నాయి.తనకి గత ప్రభుత్వ రాజకీయ పలుకుబడి ఉందని బాధితుడని లక్ష్మీ భాస్కర్ బెదిరింపులకు గురిచేశారు. ఈక్రమంలో లక్ష్మీ భాస్కర్తో పాటు ఆయనకు సహకరించిన మరికొందరి పైనా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
డీపీఆర్ మార్పులు.. గ్రాఫిక్స్ మెరుపులు
సాక్షి, హైదరాబాద్: రైతుల, వ్యాపారులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా, పండ్ల మార్కెట్ ఏర్పాటు అతీగతీలేదు. నాయకులు హామీ ఇచ్చి నాలుగేళ్లు అవుతోంది. డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ఇంకా ప్రభుత్వ ఆమోదముద్రకు నోచుకోలేదు. ఇదీ కోహెడలో పండ్ల మార్కెట్ దుస్థితి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ (Hyderabad) నగర శివారులోని కోహెడ్లో పండ్ల మార్కెట్ నిర్మిస్తామని ప్రకటించింది. అప్పటి నుంచి కంప్యూటర్ గ్రాఫిక్ చిత్రాల్లో మెరుస్తోందే తప్ప ఆచరణలో రూపుదిద్దుకోవడంలేదు. కనీసం భూమిపూజకు కూడా నోచుకోలేదు. డీపీఆర్లో మార్పుల కారణంగా ఈ వ్యవహారం గజిబిజిగా మారింది. తొలుత ఫ్రూట్ మార్కెట్ అని, ఆనక జాతీయ, అంతర్జాతీయ స్థాయి పూలు, పండ్లు, కూరగాయల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని అధికారులు చెబుతూ వచ్చారు. తాజాగా గ్లోబల్ గ్రీన్ మార్కెట్గా పేరు మార్చారు. రూ.399 కోట్ల నుంచి రూ.2,900 కోట్లకు.. గడ్డిఅన్నారం (Gaddi Annaram) పండ్ల మార్కెట్ను కొత్తపేట నుంచి కోహెడకు తరలించే ప్రతిపాదనల్లో నిర్మాణ విస్తీర్ణం, అంచనా వ్యయం ఏటేటా పెరుగుతున్నాయి. తొలుత రూ.399 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించగా తాజాగా ఈ మొత్తం రూ.2,,900 కోట్లకు చేరింది. తొలి దశలో (2021) ప్రతిపాదనలు సిద్ధం చేసినపుడు 178 ఎకరాల విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్ద మార్కెట్ నిర్మించాలని నిర్ణయించారు. దీని కోసం సుమారుగా రూ.399 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అనంతరం డీపీఆర్లో అనేక దఫాలు మార్పులు చేస్తూ భూసేకరణ 199 ఎకరాలకు చేరింది. నిర్మాణ వ్యయం అంచనా సుమారు రూ.2,900 కోట్లకు పెరిగింది.కోహెడ గ్లోబల్ గ్రీన్ మార్కెట్ను ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ)కి 167 ఎకరాలు రూ.2,044 కోట్లు, మరో 31 ఎకరాల్లో రూ.856 కోట్లతో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈపీసీలో వేలం హాళ్లు, షెడ్లు, విదేశీ ఫ్లాగ్షిప్ పెవిలియన్, రిటైల్ జోన్లు, మినీ డేటా సెంటర్లు, కార్మిక విశ్రాంతి గదులు, పార్కింగ్, అంతర్గత రహదారులు, టవర్ ఆఫ్ ఎక్సలెన్స్, శీతల గిడ్డంగులు, ప్రొసెసింగ్ సెంటర్లు, వంటివి నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. 2047 నాటి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని మార్కెటింగ్ శాఖ భావిస్తోంది. దీనికి అధికారికంగా ప్రభుత్వ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. అనంతరం టెండర్లు పిలిచి, పనులు పూర్తి చేయడానికి మరికొన్నేళ్లు వేచిచూడాల్సి ఉంటుంది. అన్నీ సక్రమంగా జరిగితే ఏడాదికి సుమారు రూ.5 వేల కోట్ల టర్నోవర్ జరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరే అవకాశం ఉంది.ప్రత్యేక ఆకర్షణగా టవర్ ఆఫ్ ఎక్సలెన్స్.. కోహెడ మార్కెట్లో టవర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వంద అడుగుల ఎత్తులో, సుమారు 19 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. హై స్పీడ్ ప్యాసింజర్ లిఫ్ట్లు, హెలీప్యాడ్లు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఇందులో నాలుగు అంతస్తులు జాతీయ, అంతర్జాతీయ వాణిజ్య, ఎగుమతి సంస్థలకు లీజుకు ఇవ్వనున్నారని పేర్కొంటున్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను తాత్కాలికంగా బాటసింగారంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ మౌలిక వసతులు అంతంతగానే ఉన్నాయి. దీంతో రైతులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం త్వరితగతిన కోహెడ మార్కెట్ (Koheda Market) నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. చదవండి: హైదరాబాద్లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్ -
‘సృష్టి’ ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సీరియస్
హైదరాబాద్: సృష్టి పెర్టిలిటీ ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సీరియస్ అయ్యింది. సుమోటోగా తీసుకుని ఎథిక్స్ కమిటీలో విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు.2016లో డాక్టర్ నమ్రత రిజిస్ట్రేషన్న మెడికల్ కౌన్సిల్ ఐదేళ్లు రద్దు చేయగా, 2021లో TGMC కి మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారని డాక్టర్ నమ్రత. కోర్టు కేసులు పెండింగ్లో ఉండటంతో డాక్టర్ నమ్రత రిజిస్ట్రేషన్న పునరుద్ధరించలేదన్నారు. అయితే అక్రమంగా ఫెర్టిలిటీ సెంటర్ను నడుపుతూ దొరికిపోవడంతో సదరు సెంటర్ పై ఎథిక్స్ కమిటీ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.కాగా, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడినట్లు పోలీసులు నిర్దారణలోతేలింది. eదివారం(జులై 27) మీడియా సమావేశంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ భాగోతాలను ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ డీసీపీ రష్మీ పెరుమాళ్ బయట పెట్టారు.ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై కేసు నమోదైంది. రాజస్థాన్కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. గతేడాది ఆగస్టులో డాక్టర్ నమ్రతాను సోనియా దంపతులు కలిశారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రతను సోనియా దంపతులు కలిశారు. ఇక్కడి నుంచి దంపతులను విశాఖకు పంపారు. ఐవీఎఫ్ ద్వారా సాధ్యం కాదు.. సరోగసితో అవుతుందని చెప్పారు.సరోగసి కోసం అద్దె గర్భం మోసే మహిళ దొరికిందని చెప్పారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రత రూ.30లక్షలు డిమాండ్ చేశారు. రూ.15లక్షల చెక్కు,రూ.15లక్షలు బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్. మెడికల్ టెస్టుల కోసం రూ.66వేలు తీసుకున్నారు. విజయవాడ వెళ్లి శాంపిల్స్ ఇచ్చారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించారు.ఢిల్లీకి చెందిన గర్భిణీని విశాఖ తీసుకొచ్చి డెలివరీ చేశారు. ఆ బిడ్డనే దంపతులకు ఇచ్చారు. ఢిల్లీలో డీఎన్ఏ టెస్ట్ చేయించారు. మరొకరి డీఎన్ఏ అని తేలింది. డాక్టర నమ్రత జాబితాలో చాలామంది డేటా ఉంది. బిడ్డను ఇచ్చినందుకు ఢిల్లీ మహిళకు రూ.90వేలు ఇచ్చారు. దంపతుల వద్ద మొత్తం రూ.40లక్షలు వసూలు చేశారు. అక్రమ బాగోతం ఎలా వెలుగుచూసిందంటే..!పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల బాలుడి ఆరోగ్యంపై అనుమానంతో దంపతులు డీఎన్ఏ టెస్టు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. దీంతో వారు రెజిమెంటల్ బజార్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్, సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ వెంకటితో పాటు క్లూస్ టీం, వైద్య బృందాలు సెంటర్లో తనిఖీలు చేపట్టారు. -
హైదరాబాద్లో చిరుత కలకలం.. సీసీ కెమెరాలో రోడ్డు దాటుతున్న దృశ్యాలు
సాక్షి,హైదరాబాద్: గోల్కొండ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. తాజాగా ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో రోడ్డు దాటుతోన్న చిరుత దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. తారామతి మీదుగా మూసీ నది వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గోల్కొండ పోలీసులు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. ఇటీవల మంచిరేవుల గ్రేహౌండ్స్లోనూ చిరుత ప్రత్యక్షమైంది. 4 బోన్లు, ట్రాప్ కెమెరాలు పెట్టిన చిరుత చిక్కలేదు.ఇక సిటీలోపలికి చిరుత రావడం భయాందోళనకు గురిచేస్తోంది. -
ఫేక్ యాపిల్ ఉత్పత్తుల స్కాం.. ఏకంగా 3 కోట్ల విలువైన..
సాక్షి, హైదరాబాద్: నగరంలో నకిలీ యాపిల్ ఉత్పత్తుల కుంభకోణం బట్టబయలైంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.3 కోట్ల విలువైన డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు స్వాధీనం చేసుకున్నారు. షాహిద్ అలీ, ఇర్ఫాన్ అలీ, సంతోష్ రాజ్పురోహిత్లు ముగ్గురని అరెస్ట్ చేశారు. వీరంతా ముంబైలోని ఏజెంట్ల నుంచి డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.యాపిల్ లోగో, స్టిక్కర్లు, సీల్లతో నకిలీ ప్యాకేజింగ్ చేసి అసలైనవిగా నమ్మించి కస్టమర్లను మోసం చేస్తున్నట్లు తెలిపారు. యాపిల్ వాచ్లు, ఎయిర్పాడ్స్, పవర్బ్యాంకులు, కేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2,761 నకిలీ ఉత్పత్తులు సీజ్ చేశారు. నిందితులను మీర్చౌక్ పోలీసులకు టాస్క్ ఫోర్స్ అప్పగించింది. యాపిల్ ప్రతినిధులతో కలిసి టాస్క్ ఫోర్స్ ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. -
షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు
-
Hyderabad: బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి యువకులు ఇలా అందిరినీ ఆకస్మిక గుండెపోటు కలవరానికి గురిచేస్తోంది. తాజాగా ఓ యువకుడు బ్యాండ్మింటన్ ఆడుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది. నాగోల్ స్టేడియంలో బ్యాండ్మింటన్ ఆడుతున్న గుండ్ల రాకేష్ అనే యువకుడు(25).. గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి వ్యక్తులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువకుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతడు రాకేష్ ఖమ్మం జిల్లా తల్లాడ వాసిగా గుర్తించారు. కాగా అతడు ప్రైవేట్ కంపెనీలోని ఉద్యోగం చేస్తున్నట్లు తేలింది. -
TOP 5 హైదరాబాద్ బిర్యానీస్
-
కొండాపూర్లో రేవ్ పార్టీ కలకలం
-
Kondapur: రేవ్ పార్టీ భగ్నం
హైదరాబద్: వీకెండ్లో అమ్మాయిలతో డ్యాన్స్లు, గంజాయి, డ్రగ్స్, మందు తాగుతూ చిందేస్తుండగా..పక్కా సమాచారంతో ఎస్టీఎఫ్ బీ టీమ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి రేవ్పార్టీని భగ్నం చేశారు. వివరాల్లోకి వెళితే... కొండాపూర్ జేవీహిల్స్ కాలనీలోని ఎస్వీ.నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో వీకెండ్లో ఏపీకి చెందిన కొందరు కొంతకాలంగా రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి కూడా అలాంటి పార్టీ జరిగింది. దీనిపై పక్కా సమాచారం అందగా దాడులు చేశారు. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివంనాయుడు కొంతమంది అమ్మాయిలను తీసుకొచ్చి, యువకులతో ఎంజాయ్ చేయిస్తున్నారు. వీరిని ఎస్టీఎఫ్ బీ టీమ్ పట్టుకుంది. ఆ తర్వాత శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్టు సీఐ సంధ్య తెలిపారు. వీరి వద్ద నుంచి 2 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆరు కార్లు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో డ్రగ్స్ తెప్పించే కింగ్కెన్షేర్ రాహుల్, ఆర్గనైజర్ ప్రవీణ్కుమార్ అలియాస్ మన్నె అప్పికొట్ల అశోక్కుమార్, మరో ఆర్గనైజర్ సమ్మెల సాయికృష్ణ, హిట్ జోసఫ్, తోట కుమార స్వామి, అడపా యశ్వంత్, శ్రీదత్, నంద, సమతాతేజ ఉన్నారు. వీరితోపాటు మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉన్నట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేసిన వాహనాల్లో టీడీపీ నాయకులకు చెందినవి ఉన్నట్టు తెలిసింది. ఆ పార్టీకి చెందిన అశోక్ నాయుడు వాహనం కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. -
హైదరాబాద్ : సందడిగా చిన్నారుల ఫ్యాషన్ షో..చిన్నారుల ర్యాంప్వాక్ (ఫొటోలు)
-
ఆయన మంచి రైటర్.. ఇక్కడ మంచి ఫైటర్ కావాలి: రాజాసింగ్
సాక్షి,హైదరాబాద్: తాను పార్టీకి రాజీనామా చేయడంలో ఎలాంటి కుట్ర లేదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రాజాసింగ్ తిరిగి బీజేపీలో చేరనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను బీజేపీలో చేరడం లేదని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు హాట్ కామెంట్స్ చేశారు.‘‘రామచందర్ రావు మంచి రైటర్. కానీ తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలంటే మంచి ఫైటర్ కావాలి. నా రాజీనామా వెనక కుట్ర లేదు. వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారికి అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయంపై కేంద్ర పార్టీకి చెప్పాలని అనుకుంటున్నా. నా రాజీనామాను కేంద్ర పార్టీ ఆమోదించడం వెనక కుట్ర జరిగింది. నా పార్టీలో చేరడానికి నేను ప్రయత్నం చేయడం లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎం చేయాలో కేంద్ర పార్టీకి వివరించాలని ఉంది. హోంశాఖ మంత్రి అమిత్ షా నాకు ఫోన్ చేయలేదు. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న తప్పిదాలపై కేంద్రానికి లేఖ రాశా.. మెయిల్స్ చేశాను. వారి దృష్టికి వెళ్ళిందో లేదో.. తెలియదు. బేగంపేట ఎయిర్పోర్టులో కలిసినప్పుడు అమిత్ షాకు కలుస్తానని చెప్పాను.. ఆ లోపే రాజీనామా చేశాను.తెలంగాణలో 2014, 2018, 2023 ఎన్నికల్లో బీజేపీకి ఎవరు మోసం చేశారో, ఎవరు వెనక నుంచి కత్తిపోట్లు పొడిచారో ఐబీ రిపోర్ట్ కేంద్ర పార్టీ తెప్పించుకోవాలి. కొంతమంది బీజేపీ మహిళానేతలకు దండం. వారికి సన్మానం చేస్తా. నా ఉద్దేశ్యం ఒక్కటే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడమే. నాకు అమిత్ షా ఫోన్ చేశారని యూట్యూబ్ ఛానళ్లలో ఫేక్ వార్తలు పెట్టించి రాజీనామా ఆమోదించేలా చేశారు. ఫేక్ వార్తలు, మీడియాలో లీకులు ఇచ్చే అలవాటు నాకు లేదు.. అటువంటి చిన్న ఆలోచన నేను చేయను"అని అన్నారు. -
‘సృష్టి’ మాయ.. 90వేలకు కొనుగోలు చేసి.. 40లక్షలకు శిశువు అమ్మకం
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐవీఎఫ్ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆదివారం(జులై 27) మీడియా సమావేశంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ భాగోతాలను ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ డీసీపీ రష్మీ పెరుమాళ్ బయట పెట్టారు. ఈ నెల 25న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై కేసు నమోదైంది. రాజస్థాన్కు చెందిన బాధితురాలు సోనియా ఫిర్యాదుతో కేసు నమోదు చేశాం. గతేడాది ఆగస్టులో డాక్టర్ నమ్రతాను సోనియా దంపతులు కలిశారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రతను సోనియా దంపతులు కలిశారు. ఇక్కడి నుంచి దంపతులను విశాఖకు పంపారు. ఐవీఎఫ్ ద్వారా సాధ్యం కాదు.. సరోగసితో అవుతుందని చెప్పారు.సరోగసి కోసం అద్దె గర్భం మోసే మహిళ దొరికిందని చెప్పారు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం డాక్టర్ నమ్రత రూ.30లక్షలు డిమాండ్ చేశారు. రూ.15లక్షల చెక్కు,రూ.15లక్షలు బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్. మెడికల్ టెస్టుల కోసం రూ.66వేలు తీసుకున్నారు. విజయవాడ వెళ్లి శాంపిల్స్ ఇచ్చారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించారు.ఢిల్లీకి చెందిన గర్భిణీని విశాఖ తీసుకొచ్చి డెలివరీ చేశారు. ఆ బిడ్డనే దంపతులకు ఇచ్చారు. ఢిల్లీలో డీఎన్ఏ టెస్ట్ చేయించారు. మరొకరి డీఎన్ఏ అని తేలింది. డాక్టర నమ్రత జాబితాలో చాలామంది డేటా ఉంది. బిడ్డను ఇచ్చినందుకు ఢిల్లీ మహిళకు రూ.90వేలు ఇచ్చారు. దంపతుల వద్ద మొత్తం రూ.40లక్షలు వసూలు చేశారు. బాధిత కుటుంబం మమ్మల్ని కలిశారు. వెంటనే మేము సోదాలు చేశాము. నమ్రత కొడుకు జయంత్ కృష్ణ అడ్వకేట్గా పని చేస్తూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై ఏదైనా కేసులు వస్తే తనే వాదించేవారు. వైజాగ్లోనూ సరోగసి ద్వారా అనేక గర్భధారణలు చేశారు నమ్రత.హైద్రాబాద్లో ఉన్న ఒక మహిళకు రూ.89వేలు ఇచ్చి ఫ్లైట్లో వైజాగ్ తీసుకెళ్లి అక్కడ సర్జరీ అయ్యాక పాపని వాళ్లకు అప్పగించి మళ్ళీ హైదరాబాద్కు పంపించారు. పేదలకు డబ్బు ఆశ చూపించి సరోగసీకి ఒప్పిస్తున్నారు నమ్రత. నమ్రతకు సంబంధించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లైసెన్సులు కాన్సిల్ చేశాం.ఆమె లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యింది. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశాం. డాక్టర్ నమ్రతపై ఆంధ్రప్రదేశ్,తెలంగాణలలో 10కి పైగా కేసులు నమోదయ్యాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కథాకమామిషు ఏంటంటే?పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల బాలుడి ఆరోగ్యంపై అనుమానంతో దంపతులు డీఎన్ఏ టెస్టు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. దీంతో వారు రెజిమెంటల్ బజార్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్పై గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్, సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ వెంకటితో పాటు క్లూస్ టీం, వైద్య బృందాలు సెంటర్లో తనిఖీలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నగరానికి చెందిన ఓ జంట పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక పోవడంతో రెండేళ్ల క్రితం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. అక్కడ ఐవీఎఫ్ ప్రక్రియ అనంతరం వారికి మగబిడ్డ పుట్టాడు. అయితే ఇటీవల బాబు అనారోగ్యానికి గురికావడంతో వైద్యులను సంప్రదించారు. వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్ ఉందని తేలడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు. తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో, అనుమానం వచ్చి డాక్టర్ నమ్రతను గట్టిగా నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబుకు డీఎన్ఏ టెస్టులు చేయించగా.. ఆ దంపతుల డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశాఖ కేసులో లైసెన్సు రద్దు చేసినా.. డాక్టర్ నమ్రత హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి, పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. కాగా కేపీహెచ్బీలోని టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్లో కూడా ఇలాగే అక్రమ సరోగసీ కేసు నమోదైంది. -
హైదరాబాద్లో మరో స్పెర్మ్ క్లినిక్ నిర్వాకం బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా ఐవీఎఫ్ విధానాలను అనుసరిస్తున్న ఇండియన్ స్పెర్మ్ టెక్ నిర్వాకం బట్టబయలైంది. అద్దె గర్బాల కోసం అక్రమంగా వీర్యాన్ని, అండాలను సేకరిస్తున్న ఇండియన్ స్పెర్మ్ టెక్ మేనేజర్ పంకజ్ సోనీని ఇవాళ (ఆదివారం) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంకజ్తో పాటు సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరోలను అరెస్ట్ చేశారు.అధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇండియన్ స్పెర్మ్ టెక్ నిర్వహిస్తూ.. వీర్య కణాలను, అండాలను గుజరాత్, మధ్యప్రదేశ్లకు తరలిస్తున్నారు. అహ్మదాబాద్లోని ఫెర్టిలిటీ సెంటర్ కోసం హైదరాబాద్లో స్పెర్మ్ సేకరణ చేస్తున్నారు. స్పెర్మ్ డోనర్లకు రూ.4వేల చొప్పున ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన PV సింధు
-
కొండాపూర్ లో రేవ్ పార్టీ భగ్నం
-
‘సృష్టి’ కేసు.. డాక్టర్ నమ్రత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: నగరంలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపుతోంది. పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్ర కణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్ర కణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఈ కేసులో నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఐదుగురు సిబ్బందిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కాగా, విజయవాడలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో విజయవాడ సెంటర్ నిర్వహణ సాగిస్తుండగా, పలు కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. వ్యాపార అభివృద్ధి కోసం.. బీహార్ నుంచి పూజారులను పిలిపించిన డాక్టర్ నమ్రత.. 9 రోజుల పాటు.. ఆసుపత్రిలో హోమాలు నిర్వహించినట్లు పోలీసులు నిర్థారించారు.విశాఖపట్నంలోని పలు ఫెర్టిలిటి సెంటర్లలో పోలీసులు సోదాలు జరిపారు. మహారాణిపేట పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రెండు ఫ్లోర్లలో అనధికారంగా ఐవీఎఫ్ సెంటర్లు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 2023లో లైసెన్సు ముగిసినప్పటికీ అనధికారంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.మోసం బయటపడింది ఇలా..నగరానికి చెందిన ఓ జంట పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టక పోవడంతో రెండేళ్ల క్రితం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. అక్కడ ఐవీఎఫ్ ప్రక్రియ అనంతరం వారికి మగబిడ్డ పుట్టడు. అయితే ఇటీవల బాబు అనారోగ్యానికి గురికావడంతో వైద్యులను సంప్రదించారు. వివిధ రకాల పరీక్షల తర్వాత బాబుకు క్యాన్సర్ ఉందని తేలడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు.తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులు ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో, అనుమానం వచ్చి డాక్టర్ నమ్రతను గట్టిగా నిలదీశారు. ఆమె సరైన సమాధానం చెప్పకపోవడంతో బాబుకు డీఎన్ఏ టెస్టులు చేయించగా.. ఆ దంపతుల డీఎన్ఏతో మ్యాచ్ కాలేదు. దీంతో డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలిసి పరారీలో ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విశాఖ కేసులో లైసెన్సు రద్దు చేసినా.. డాక్టర్ నమ్రత హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి, పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది.డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమె లైసెన్సును రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇక్కడ నడుస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఇతర డాక్టర్ల లైసెన్సుల ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిసింది. కాగా కేపీహెచ్బీలోని టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్లో కూడా ఇలాగే అక్రమ సరోగసీ కేసు నమోదైనట్లు సమాచారం. -
కొండాపూర్లో రేవ్ పార్టీ కలకలం.. ఏపీకి చెందిన 11 మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మరోసారి నగరంలో రేవ్ పార్టీ కలకలం రేపింది. కొండాపూర్లో ఓ విల్లాలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీకి చెందిన 11 మందిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు చెందిన వ్యక్తుల కనుసన్నలో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బున్న బడాబాబులను తీసుకొచ్చి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు.కాగా, రెండు రోజుల క్రితం మాదాపూర్లో సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. 14 మంది యువకులు, ఆరుగురు యువతులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్డే పార్టీ సందర్భంగా రేవ్ నిర్వహించారు. నిర్వాకుడు నాగరాజ్ యాదవ్తో పాటు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపివేశారు. విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
నేను భూమి మీద ఉండి ఉద్ధరించేది ఏం లేదు..!
గచ్చిబౌలి (హైదరాబాద్): ‘ఎక్కడ చూసినా కరప్షన్, పొల్యూషన్. నేను భూమి మీద ఉండి ఉద్ధరించేది ఏం లేదు. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నా’అంటూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపిన వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరానికి చెందిన గుత్తుల వేణుగోపాల్ (26) రాయదుర్గంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. తన అన్నావదినలతో కలిసి మణికొండలోని షిరిడి సాయినగర్లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 23న అన్న, వదినలతో కలిసి రాజమహేంద్రవరానికి వెళ్లారు. అదే రోజు రాత్రి వేణుగోపాల్ తిరిగి మణికొండకు వచ్చాడు. 24న తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడగా, 25న ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం వాచ్మెన్కు ఫోన్ చేశారు. వాచ్మన్ వెళ్లి కిటికీలోంచి చూడగా వేణుగోపాల్ సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి చూపించాడు. దీనిపై రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. శనివారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రిటైల్ స్థలాల్లోనూ హైదరాబాద్ టాప్
హైదరాబాద్లో ఇళ్లు, కార్యాలయ స్థలాలకే కాదు రిటైల్ స్పేస్కు కూడా డిమాండ్ అధికంగానే ఉంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)లో దేశంలోనే అత్యధిక రిటైల్ స్పేస్ లీజులు మన దగ్గరే ఎక్కువగా జరిగాయి. 2025 క్యూ2లో 8 లక్షల చ.అ. స్థల లావాదేవీలు పూర్తయ్యాయని, దీంతో కలిపి ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరం (హెచ్1)లో నగరంలో 15 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లీజులు జరిగాయని కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. గతేడాది హెచ్1తో పోలిస్తే ఇది 11 శాతం అధికం. 2027 నాటికి నగరంలోకి 28 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ సరఫరా అవుతుందని, ఇందులో వచ్చే రెండు త్రైమాసికాలంలో సుమారు 17 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ వినియోగంలోకి కూడా వస్తుందని అంచనా వేసింది. – సాక్షి, సిటీబ్యూరోఫుడ్ అండ్ బేవరేజెస్, ఫ్యాషన్..ఫుడ్ అండ్ బేవరేజెస్(ఎఫ్అండ్బీ) బ్రాండ్లు ఎక్కువగా రిటైల్ స్పేస్ను లీజుకు తీసుకున్నాయి. ఈ విభాగం వాటా 34 శాతంగా ఉండగా.. ఫ్యాషన్ బ్రాండ్ల వాటా 14 శాతంగా ఉంది. ఈ క్యూ2లో కొత్తగా గ్రేడ్–ఏ మాల్స్ సరఫరా జరగకపోవడంతో మాల్స్లో వేకన్సీ రేట్ 1.85 శాతంగా ఉంది. ఇక, హై స్ట్రీట్ ప్రాంతాలలో రిటైల్ స్పేస్ అద్దెలకు ఆదరణ ఎక్కువగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూబ్లీహిల్స్ వంటి హై స్ట్రీట్లో అద్దెలు 13.6 శాతం మేర పెరిగాయి. అత్తాపూర్, మదీనాగూడ, చందానగర్ ప్రాంతాల్లోనూ రిటైల్ అద్దెలు ఆశాజనకంగానే వృద్ధి చెందుతున్నాయి.హాట్స్పాట్లుగా బాచుపల్లి, కొంపల్లిఈ ఏడాది రెండో త్రైమాసికం(క్యూ2)లో దేశంలోని 8 ప్రధాన నగరాలలో 22.4 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లావాదేవీలు పూర్తయ్యాయి. గతేడాది క్యూ2లో జరిగిన 23.9 లక్షల చ.అ. జరిగాయి. ఈ ఏడాది క్యూ1లో 23.7 లక్షల చ.అ.లు జరిగాయి. హైదరాబాద్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి హైస్ట్రీట్ ప్రాంతాలలో రిటైల్ స్పేస్కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 89 శాతం లీజులు ఈ ప్రాంతాల్లోనే జరిగాయి. బాచుపల్లి, కొంపల్లి ప్రాంతాలు రిటైల్ స్పేస్కు హాట్ స్పాట్లుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్యూ2లో ఈ ప్రాంతాలలో 57 శాతం లీజులు జరిగాయి. అమీర్పేట, నిజాంపేట వంటి ప్రధాన ప్రాంతాలలో 43 శాతం రిటైల్ స్పేస్ లీజులు పూర్తయ్యాయి. -
అక్రమ మద్యం కేసు.. ‘సిట్’ మరో కొత్త నాటకం
సాక్షి, హైదరాబాద్: అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి సిట్ తెరతీసింది. సోదాల పేరుతో హడావుడి సృష్టించేందుకు సిట్ ప్రయత్నించింది. హైదరాబాద్లోని బాలాజీ గోవిందప్ప నివాసంలో మరోసారి సోదాల పేరుతో సిట్ అధికారులు హల్చల్ చేశారు. గతంలోనే బాలాజీ గోవిందప్ప ఇంటిలో సిట్ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు.మే 13న బాలాజీ గోవిందప్పను సిట్ అరెస్ట్ చేసింది. 74 రోజులుగా ఆయన రిమాండ్లో ఉన్నారు. బాలాజీ గోవిందప్పకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా కోర్టు ముందు సిట్ పెట్టలేకపోయింది. ఏసీబీలో కోర్టులో బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్పై ఈనెల 29న కోర్టు విచారణ చేపట్టనుంది.బాలజీ గోవిందప్ప బెయిల్ను అడ్డుకునేందుకు సోదాల పేరుతో సిట్ అధికారులు మరో కొత్త నాటకానికి తెరలేపారు. కొత్తగా ఆధారాలు దొరికాయంటూ చెప్పేందుకే ఈ నాటకం చేస్తున్నారని గోవిందప్ప న్యాయవాదులు అంటున్నారు. బాలాజీ గోవిందప్ప.. ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ వికాట్ ఇంటర్నేషనల్లో ఫుల్టైమ్ డైరెక్టర్గా ఉన్నారు. వికాట్ గ్రూప్కు సంబంధించిన కార్యాలయంలో కూడా సిట్ అధికారులు సోదాలు చేపట్టారు. -
హాట్కేకుల్లా అమ్ముడుపోయే ఫ్లాట్లు..
ప్రతికూల పరిస్థితుల్లోనూ హాట్కేకుల్లా ఫ్లాట్లు అమ్ముడుపోవాలంటే.. పునాదుల్లోనే సగానికిపైగా అమ్మకాలు జరగాలంటే.. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఏడాదిలో గృహ ప్రవేశం చేయాలంటే.. వీటిన్నింటికీ ఒకే సమాధానం చిన్న ప్రాజెక్టులు. నిజం చెప్పాలంటే చిన్న ప్రాజెక్టులు విస్తీర్ణంలోనే చిన్నవి.. వసతుల్లో మాత్రం పెద్ద ప్రాజెక్టులకు ఏమాత్రం తీసిపోవు. పైపెచ్చు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండటం చిన్న ప్రాజెక్టులకు మరింత కలిసొచ్చే అంశం. – సాక్షి, సిటీబ్యూరోబడా ప్రాజెక్టులు నిర్మించాలంటే రూ.కోట్లలో పెట్టుబడి కావాలి. అమ్మకాలు బాగుంటే పర్వాలేదు.. కానీ, సీన్ రివర్స్ అయ్యిందో ప్రాజెక్ట్ను పూర్తి చేయడం కష్టం. దీంతో అటు కొనుగోలుదారులు, ఇటు నిర్మాణ సంస్థలకూ తలనొప్పే. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పకు పోయి పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు తెచ్చి ప్రాజెక్ట్లు ప్రారంభించి అమ్మకాలు లేక బోర్డు తిప్పేసిన సంస్థలు అనేకం. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాట్కేకుల్లా ప్రాజెక్ట్ అమ్ముడుపోవాలంటే చిన్న ప్రాజెక్ట్లే మేలని సూచిస్తున్నారు నిపుణులు. కొద్దిపాటి పెట్టుబడితో ప్రాజెక్ట్ను ప్రారంభించి.. పునాదుల్లోనే సగానికి పైగా అమ్మకాలు చేసుకునే వీలుంటుంది కూడా.ఏడాదిలో గృహప్రవేశం.. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొద్ది పాటి స్థలంలోనే చిన్నపాటి నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావడం, ఆధునిక వసతులూ కల్పిస్తుండటంతో కొనుగోలుదారులూ వీటిల్లో ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్ల మార్కెట్లో లాభాలు తక్కువగానే ఉంటాయి. అయినా నిర్మాణం చేపట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఈ నిర్మాణాలు ఏడాది లేక 15 నెలల్లో పూర్తవుతాయి. దీంతో త్వరగానే కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరడంతో పాటు మార్కెట్లో తమ కంపెనీ బ్రాండింగ్ పెరుగుతుందనేది నిర్మాణ సంస్థల వ్యూహం. అయితే చిన్న ప్రాజెక్ట్లు నిర్మించాలంటే స్థలం అంత సులువుగా దొరకదు. పోటీ ఎక్కువగా ఉంటుంది.వసతులకు కొదవేంలేదు..గతంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్ట్ల్లో వసతులు కల్పించకపోయినా గిరాకీకి ఢోకా ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. ధర ఎక్కువైనా.. వసతుల విషయంలో రాజీపడటం లేదు. దీంతో చిన్న ప్రాజెక్ట్ల్లోనూ ఆరోగ్యం కోసం వాకింగ్, జాకింగ్ ట్రాక్స్, యోగా, జిమ్, మెడిటేషన్ హాల్, ఆహ్లాదకరమైన ల్యాండ్ స్కేపింగ్లతో పాటు స్విమ్మింగ్ పూల్, బేబీ, మదర్ కేర్ సెంటర్, లైబ్రరీ.. వంటి ఏర్పాట్లు ఉంటున్నాయి. అంతేకాకుండా చిన్న ప్రాజెక్ట్లో ఉండే కొన్ని ఫ్లాట్లే ఉంటాయి. ఫ్లాట్వాసులందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. ఉమ్మడి కుటుంబాల లోటు తీరుతుందనేది కొనుగోలుదారుల అభిప్రాయం. -
అంత తక్కువ వడ్డీ అంటే అనుమానించాలి కదా?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగర శివార్లలోని తెల్లాపూర్లో ఉంటున్న ఓ వ్యక్తి తాను ముంబైలో ఉంటున్నట్లు ఆన్లైన్లో ప్రచారం చేసుకున్నాడు. ఫిన్పెయిర్ పేరుతో వెబ్సైట్ ఏర్పాటు చేసి వ్యాపారాభివృద్ధికి రుణం ఇస్తానంటూ ఎర వేశాడు. నమ్మి ముందుకు వచ్చిన నగర వ్యాపారి నుంచి రూ.1.5 కోట్లు స్వాహా చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడు డి.నాగరాజును అరెస్టు చేసినట్లు డీసీపీ దార కవిత శుక్రవారం వెల్లడించారు.తెల్లాపూర్ రోడ్డులోని హోనర్ వివాంటీస్లో నివసించే నాగరాజు ఆన్లైన్లో ఫిన్ పెయిర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. దీనికోసం ఓ వెబ్సైట్ను రూపొందించిన ఇతగాడు అందులో ఇది ముంబై కేంద్రంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నాడు. వివిధ రకాలైన వ్యాపారులను వారి వ్యాపారాభివృద్ధి కోసం తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామంటూ ఆన్లైన్ వేదికగా ప్రచారం చేశాడు.నగరానికి చెందిన ఓ వ్యాపారి (39) ఆన్లైన్లో వచ్చిన ఈ ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. తనకు రుణం కావాలంటూ ఆ ప్రకటనలో పొందపరచగా...అది చూసిన నాగరాజు 2023 జూన్లో సదరు వ్యాపారిని సంప్రదించాడు. వ్యాపారి పూర్వాపరాలు, రుణం అవసరాలను తెలుసుకున్న నాగరాజు భారీ మొత్తం తక్కువ వడ్డీకి ఇవ్వడానికి అంగీకరించాడు. ఆపై వివిధ రకాలైన రుసుముల పేరు చెప్పి ఆ ఏడాది నవంబర్ నుంచి దశల వారీగా రూ. కోటీ 55 లక్షలు స్వాహా చేశాడు.అప్పటి నుంచి త్వరలో రుణం మంజూరై ఖాతాలో పడుతుందంటూ నమ్మబలుకుతున్నాడు. ఎట్టకేలకు మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ కె.సతీష్ రెడ్డి నేతృత్వంలోని బృందం నిందితుడిని అరెస్టు చేసింది. ఇతడు ఇలాంటి నేరాలు ఇంకా ఏవైనా చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. -
Hyderabad: వెలుగులోకి మరో ప్రీ లాంచ్ మోసం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతీయ బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ అంటూ కోట్లాది రూపాయల ఘరానా మోసం బయటపడింది. ప్రీ లాంచ్ ప్రాజెక్ట్కు కోట్లు రూపాయలు చెల్లింపులు చేసిన 250 మంది బాధితులను ముంచేశారు. ఐదేళ్ల కిందట ప్రాజెక్ట్ మొదలు పెట్టిన భారతీయ బిల్డర్స్.. కనీసం 25 శాతం పనులు కూడా చేయలేదు.బాధితులకు సాకులు చెబుతూ వచ్చారు. అనూహ్యంగా సునీల్ అహుజా అనే వ్యక్తికి భారతీయ బిల్డర్స్ ల్యాండ్ అమ్మేశారు. దీంతో బిల్డర్స్ను బాధితులు ప్రశ్నించారు. బిల్డర్స్, సునీల్ అహుజా అనే వ్యక్తి బాధితులపై బెదిరింపులకు దిగారు. భారతీయ బిల్డర్స్తో పాటు సునీల్ అహుజాపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో కేసు నమోదైంది. మోసం చేసి ఆ తర్వాత భారతీయ బిల్డర్స్ పేరును శ్రీభారతి బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్గా కేటుగాళ్లు మార్చేశారు.ఈ కంపెనీకి 60 శాతం ఆశిష్ అహూజా, మిగిలిన నలభై శాతం వాటాలో భారతీ బిల్డర్స్ చైర్మన్ నాగరాజు, ఎండీ శివరామకృష్ణ లో పేరుతో షేర్లు ఉన్నాయి. ఇలా పేర్లు మారుస్తూ అమాయకులను నట్టేట ముంచుతున్నారు.సిరిసింపద ఎస్టేట్స్ అండ్ బిల్డర్స్, భారతీ బిల్డర్స్, శ్రీ భారతీ బిల్డర్స్, భారతీ బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ఇలా పేర్లు మారుస్తున్న నిందితులు.. భానూరు, కోకోపేట్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ప్రీలాంచ్ పేరుతో మోసాలకు తెరతీశారు. సునీల్ కుమార్ అహూజా, ఆశిష్ అహూజా, నాగరాజు, శివరామకృష్ణలను అరెస్టు చేయాలని.. తమ నగదును తిరిగి ఇప్పించాలంటున్న బాధితులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇన్నోవేషన్ కేంద్రంగా హైదరాబాద్: ఎస్తోనియా బృందం
హైదరాబాద్: డిజిటల్ ఆధారిత పరిపాలన,శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్తో సంబంధాలను మరింతగా బలపరిచే దిశగా ఎస్తో నియా కీలక అడుగులు వేస్తోంది. ఈ దిశగా ఎస్తోనియా రాయబారి హెచ్.ఈ. మాజే లూప్ (H.E. Ms. Marje Luup) నేతృత్వంలోని ఉన్నత స్థా యి ప్రతినిధి బృందం హైదరాబాద్ను సందర్శించింది. ఈ పర్యటనలో వ్యాపార, సాంకేతిక రంగాలలో భాగస్వామ్య అవకాశాలు, ఇన్నోవేషన్, సైబర్ సెక్యూరిటీ, హెల్త్ టెక్నాలజీ, డిజిటల్ పరిపాలన వంటి రంగాలలో సహకారమే లక్ష్యంగా తీసుకుంది. ఈ సందర్భంగా ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వ అధికారులతో పాటు స్టార్టప్లు, టెక్ కంపెనీలు, పెట్టు బడి సంస్థ ల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీలలో ఇన్నోవేషన్, సాంకేతిక పరిజ్ఞా నం, డిజిటల్ పాలన, రోబో టిక్స్, ఏఐ, హెల్త్ టెక్నాలజీ తదితర రంగాలలో సహకారంపై ప్రత్యేకంగా చర్చించారు.మీడియాతో మాట్లా డిన రాయబారి మార్జె లూప్ మాట్లా డుతూ, “భారత్, ఎస్తో నియా రెండూ డిజిటల్ ఇన్నోవేషన్కుప్రా ధాన్యతనిచ్చే దేశాలు. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కేంద్రంగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ఆవిష్కరణలు ఉన్న వ్యవస్థ లతో ఎస్తో నియాకు సహజ భాగస్వామిగా కనిపిస్తు న్నాయి,” అని పేర్కొన్నారు. ఎస్తో నియా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ దేశంగా గుర్తింపు పొందిందని, భారతదేశ టెక్ కంపెనీలకు యూరప్మా ర్కెట్ ప్రవేశానికి ఇదొ క రాజమార్గం అవుతుందని రాయబారి తెలిపారు. ఇరు దేశాల మధ్య విద్యా, పరిశోధన, వ్యాపార రంగాలలో భాగస్వామ్యాలకువిస్తృత అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.ఈ బృందంలో స్వెన్ ఆలిక్, మేడ్లీ రాహువార్మ్, కాత్రే ఎల్జాస్లు కూడా పాల్గొ న్నారు. వీరు హెల్త్ టెక్నాలజీ, సైబర్సెక్యూరిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబో టిక్స్ వంటి రంగాలలో నిపుణులు. తాల్టె క్ విశ్వవిద్యాలయం (TalTech),టెక్నోపో ల్ (Tehnopol), ఎస్తో నియన్ ఐటీ & టెలికమ్యూనికేషన్ అసో సియేషన్, ఎయిర్ (AIRE – AI & RoboticsEstonia) లాంటి ప్రముఖ సంస్థ లను ఈ బృందం ప్రతినిధ్యం వహించింది.ఈ పర్యటన ద్వారా భారతదేశంతో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రతో, ఎస్తో నియా మరింత సాంకేతిక, వ్యాపార సంబంధాలనుఅభివృద్ధి చేసేందుకు ఆసక్తిగా ఉందని స్పష్ట మైంది.ఎస్తో నియా గురించి: యూరప్దేశాల డిజిటల్, స్టార్టప్లీడర్ ఎస్తో నియా యూరప్లో అత్యంత ఆవిష్కరణాత్మక ఆర్థిక వ్యవస్థ లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు యూరప్లో కంపెనీలు స్థాపించి, నిర్వహించడానికి వీలు కలిగించేలా ఈ-రిజిడెన్సీ (e-Residency)కు ప్రా రంభించిన దేశం. లాభాలపై కార్పొరేట్ పన్ను మినహాయింపు, ఆన్లైన్లోనే కంపెనీ నమోదు, పూర్తిగా డిజిటల్పాలన వంటి సదుపాయాలతో ఇది స్టా ర్టప్లు, రిమోట్ వ్యాపారాలకు గ్లో బల్ కేంద్రంగా నిలుస్తుంది. ఎస్తో నియాలోనే నాటో సైబర్ డిఫెన్స్ సెంటర్, నాటో డయానా సైన్స్ సెంటర్, EU-LISA (EU యొక్క ఐసీటీ ఏజెన్సీ) వంటి కీలక అంతర్జా తీయ సంస్థ లు ఉన్నాయి. ప్రతి లక్ష జనాభా స్టా ర్టప్లు, యూనికార్న్స్ పరంగా యూరప్లో తొలిస్థా నంలో నిలిచింది. ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్యారంగంలోనూ అగ్రస్థా నంలో ఉంది.ఈయూ, యూరోజోన్ సభ్యదేశంగా ఎస్తో నియా : ఎలాంటి కస్ట మ్స్ అడ్డంకులు లేకుండా యూరోపియన్ మార్కెట్కు సులభమైన విధానాలను కల్పిస్తుంది. పారదర్శక చట్ట వ్యవస్థ , తక్కువ అవినీతి స్థా యి, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇది అంతర్జా తీయ పెట్టు బడిదారులు, వ్యాపారులకు ఆకర్షణీయమైన గమ్యస్థా నంగా నిలుస్తోంది.రాయబారి గురించి:హెచ్.ఈ. మార్జే లూప్ 1996లో ఎస్తో నియా విదేశాంగ సేవలో చేరారు. ఫిన్లాండ్లోని హెల్సింకి, స్వీడన్లోని స్టా క్హో మ్లో ఎస్తో నియా రాయబార కార్యాలయాల్లో ఆమె ఆర్థిక దౌత్యవేత్తగా, ఉపముఖ్యాధికారిగా సేవలందించారు. విదేశాంగ మంత్రిత్వశాఖలో ఆమె పలు కీలక పదవులు నిర్వహించారు. ముఖ్యంగా అభివృద్ధి సహకార విభాగాధిపతిగా, EU అభివృద్ధి సహకార డైరెక్టర్ జనరల్గా బాధ్యత నిర్వర్తించారు. 2013 నుండి 2023 వరకు విదేశాంగ మంత్రిత్వశాఖలో పరిపాలనా విభాగానికి డైరెక్టర్ జనరల్గా పని చేశారు. ప్రస్తు తం ఎస్తో నియా రాయబారిగా భారత్లో సేవలందిస్తున్న ఆమె, బంగ్లా దేశ్, నేపాల్, శ్రీలంక దేశాలకు కూడా రాయబారిగా బాధ్యత వహిస్తు న్నారు. -
హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
-
బంకుల్లోని ట్యాంకుల్లోకి వరద నీరు
నగర శివారు సాగర్ రోడ్డులోని ఓ ప్రధాన చమురు కంపెనీకి చెందిన పెట్రోల్ బంకులో రవీందర్ అనే వాహనదారు లీటర్ పెట్రోల్ పోయించుకున్నాడు. వాహనం కొద్దిదూరం వెళ్లిన తర్వాత మొరాయించింది. బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్లగా పెట్రోల్ ట్యాంక్లో నీళ్లు ఉన్నట్లు వెల్లడించారు. కంగుతిన్న సదరు వినియోగదారు కలెక్టర్తో పాటు స్థానిక పొలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.రెండేళ్ల క్రితం హయత్నగర్లోని బంక్లో నీళ్లతో కూడిన పెట్రోలు వచి్చందని వాహనదారులు ఆందోళన చేపట్టారు. ఫిర్యాదు రావడంతో పౌరసరఫరాల అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించి చేతులు దులుపుకొన్నారు. బంక్ యాజమానిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నెల రోజుల క్రితం చైతన్యపురిలోని జాతీయ రహదారిపై ఉన్న బంక్లో పెట్రోల్ పోయించుకోగా కొద్ది దూరం వెళ్లిన తర్వాత వాహనాలు మొరాయించాయి. అనుమానంతో వినియోదారులు ఖాళీ బాటిల్ తీసుకెళ్లి పెట్రోల్ పోయించారు. బాటిల్ అడుగున నీరు ఉండటంతో ఆందోళనకు దిగారు.నగర పరిధిలోని పలు బంకుల్లో పెట్రోల్, డీజిల్తో పాటు నీళ్లు కూడా వస్తున్నాయి. పెట్రోల్ బంకుల నిర్వహణలో నిర్లక్ష్యం వినియోగదారులకు శాపంగా తయారైంది. ఇప్పటికే పెట్రోల్ బంకుల కాసుల కక్కుర్తి నాణ్యతలో కల్తీ, తక్కువ కొలతలతో వాహనదారులు నష్టపోతుండగా... తాజాగా పెట్రోల్లో కలుస్తున్న నీళ్లు వాహనాల ఇంజిన్లను దెబ్బతీస్తున్నాయి. బంకుల యాజమానులకు కాసుల ధ్యాస తప్ప నాణ్యమైన పెట్రోల్, డీజిల్ పోయాలన్న ధ్యాసే లేకుండా పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంకుల్లోని ఇంధన నాణ్యతను పరిశీలించాల్సిన పౌరసరఫరా అధికారగణం పట్టించుకోకపోవడంతో పంపింగ్పై పెట్రోల్ డీలర్ల నిర్లక్ష్యం మరింత పెరిగినట్లయింది. ఇథనాల్లో పెట్రోల్ మిళితం.. ఆయిల్ కంపెనీల నుంచి ఇథనాల్తో కూడిన పెట్రో ల్ సరఫరా నిల్వలపై ప్రభావం చూపుతున్నాయి. వాస్తవంగా ఇథనాల్ మిళితమైన పెట్రోల్ నిల్వల్లో నీటిచుక్క కలిసినా.. క్రమంగా పెట్రోల్ మొత్తం నీరుగా మారుతోంది. ప్రధాన చమురు సంస్థలు అధికారికంగానే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం కింద పెట్రోల్లో 10 శాతం ఇథనాలన్ను కలుపుతున్నట్లు కంపెనీల ఇన్వాయిస్లు స్పష్టం చేస్తున్నా యి. ఇంధనంలో ఇథనాల్ను కలపడం వల్ల పెట్రోల్లోని ఆక్టేన్ సంఖ్య పెరుగుతుంది. అయితే.. ధర కూడా తగ్గించాల్సి ఉంటుంది. కానీ చమురు సంస్థలు వీటిని పట్టించుకోకుండా పెట్రోల్లో సుమారు 10 శాతం ఇథనాల్ కలిపి సరఫరా చేస్తూ పూర్తి ధరను కోట్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దెబ్బతీస్తున్న వర్షాకాలం.. పెట్రోల్ బంకుల్లో ఇథనాల్తో కూడిన పెట్రోల్ నిల్వలపై వర్షాకాలం తీవ్రంగా దెబ్బతీస్తోంది. ట్యాంకుల నిర్వహణలో నిర్లక్ష్యంతో కొద్దిపాటి వర్షపు నీరు చేరినప్పటికీ నిల్వలు క్రమంగా నీళ్లుగా మారడం సర్వసాధరాణంగా తయారైంది. రోజువారీ స్టాక్ సరఫరా ఆలస్యమైతే బంకుల నిర్వాహకులు అడుగు నిల్వలను సైతం వాహనాలకు పోస్తుండటంతో పెట్రోల్తో పాటు నీరు కూడా పంపింగ్ అవుతోంది. వాహనాం స్టార్ట్ అయినా కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆగిపోతోంది. నీళ్లు కలిసి పెట్రోల్తో ఇంజిన్పై ప్రభావం పడుతోంది. బోరు పిస్టల్ పనికి రాకుండా పోయి త్వరగా మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.శాంపిల్స్ సేకరణ అంతంతే పెట్రోల్ బంకుల్లో శాంపిల్స్ సేకరణ, వాటి పరీక్షలు నామమాత్రంగా మారాయి. పౌరసరఫరాల శాఖ అధికారులు ఏడాదికోసారి కూడా పెట్రోల్ బంకులను సందర్ళించి శాంపిల్స్ సేకరించి ల్యాబ్లకు పంపించి పరీక్షలు నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదు. వాస్తవంగా సంబంధిత అధికారులు సాధారణ విధుల్లో భాగంగా పెట్రోల్ బంకుల నుంచి సందర్శించి కల్తీ కట్టడి కోసం శాంపిళ్లను సేకరించి ల్యాబ్లకు పంపి పరీక్షించాల్సి ఉంటుంది. అధికారులు వద్ద కూడా పరీక్షలు నిర్వహించేందుకు పరికరాలు అందుబాటులో ఉండాలి. అవీ అందుబాటులో లేకుండా పోయాయి. పెట్రోల్, డీజిల్లో నాణ్యతను పరీక్షించేందుకు అధికారికంగా రెడ్హిల్స్లో ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ఉంది. అక్కడికి శాంపిల్స్ను పరీక్షకు పంపించిన దాఖలాలు వేళ్లపై లెక్కపెట్టవచ్చు. వినియోగదారులు మాత్రం నీళ్ల పెట్రోల్తో నష్టపోతున్నారు. -
హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలో శనివారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. రోడ్లపై ఎక్కడికక్కడే వర్షపు నీరు నిలిచిపోయింది. మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. విద్యా సంస్థలు, ఆఫీసుల వేళ వరుణుడు విజృంభించడంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. షేక్పేట, గోల్కొండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ , లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, లంగర్ హౌస్, అత్తాపూర్, రాజేంద్రనగర్లో వర్షం పడుతోంది. మరోవైపు.. జడివానకు రోడ్ల మీదకు వాన నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది కూడా.#HYDTPinfo #RainAlert#Raining in Hyderabad City.Commuters drive safely.#HyderabadRains pic.twitter.com/nruHbUJ8pW— Hyderabad Traffic Police (@HYDTP) July 26, 2025 -
నా జోలికి వస్తే అడ్డంగా నరికేస్తా
ఫిలింనగర్ (హైదరాబాద్): ‘నా జోలికి వస్తే అడ్డంగా నరికేస్తా’ అంటూ జీహెచ్ఎంసీ సర్కిల్–18 టౌన్ప్లానింగ్ అధికారులను బెదిరిస్తూ న్యూసెన్స్కు పాల్పడిన నిందితుడిపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని శ్రీవెంకటేశ్వర కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎమ్మెల్యే కాలనీలో ప్లాట్నెంబర్ 224/ఏ యజమాని రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేపడుతుండగా సొసైటీ అధ్యక్షుడు అటు హైడ్రాకు, ఇటు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. దీంతో జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్ టౌన్ప్లానింగ్ అధికారులు శుక్రవారం ప్రహరీని పరిశీలించడానికి వచ్చారు. అధికారులు సర్వే చేస్తున్న సమయంలో ఇంటి యజమానిగా చెప్పుకుంటున్న నూకారపు రామకృష్ణ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడికి చేరుకుని అధికారులపై దుర్బాషలాడారు. అంతుచూస్తానంటూ తన కారులో నుంచి కత్తి తీసి నరికేస్తానంటూ బెదిరించాడు. తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశాడు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో సర్కిల్–18 టౌన్ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిలింనగర్ పోలీసులు నిందితుడు నూకారపు రామకృష్ణపై బీఎన్ఎస్ సెక్షన్ 132, 351 (2) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నా జోలికి వస్తే నరికేస్తా రోడ్డు ఆక్రమణను అడ్డుకున్న అధికారులను కత్తితో బెదిరించిన వ్యక్తి హైదరాబాద్ – బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ రోడ్డు నంబర్ 12లోని రోడ్డు ఆక్రమించి ప్రహారీ గోడ కట్టిన వ్యక్తిని అడ్డుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డుకున్న అధికారులను అడ్డంగా నరికేస్తా… pic.twitter.com/n1mzWsluJ2— Telugu Scribe (@TeluguScribe) July 25, 2025 -
హైదరాబాద్లో 2వ జీసీసీ లీడర్షిప్ సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ తాజాగా 2వ జీసీసీ లీడర్షిప్ సదస్సుకు ఆతిథ్యమివ్వనుంది. జూలై 30న లీడర్షిప్ ఫెడరేషన్ నిర్వహించే ఈ కాంక్లేవ్లో దేశ విదేశ దిగ్గజాలు, ప్రభుత్వ సంస్థలు, ఇన్నోవేషన్ హబ్లకు చెందిన 300 మంది సీనియర్ లీడర్లు పాల్గోనున్నారు. చౌకగా సర్వీసులను అందించే వ్యాపార విభాగాల స్థాయి నుంచి అంతర్జాతీయంగా కొత్త ఆవిష్కరణలకు చోదకాలుగా జీసీసీలు ఎదుగుతున్న తీరుపై ఇందులో చర్చిస్తారని లీడర్షిప్ ఫెడరేషన్ అడ్వైజరీ బోర్డు సభ్యుడు రాబిన్ జె తెలిపారు. ఈసారి సదస్సులో జెన్ఏఐ–ఆటోమేషన్, వర్క్ఫోర్స్ పరివర్తన తదితర అంశాలు ప్రధాన అజెండాగా ఉంటాయని పేర్కొన్నారు. -
హైదరాబాద్లో సీఎన్జీ వాహనాలకు కష్టాలు
హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న సీఎన్జీ వాహనాల సంఖ్యకు అనుగుణంగా గ్యాస్ స్టేషన్ల విస్తరణ జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నగర పరిధిలో కేవలం 83 సీఎన్జీ స్టేషన్లే ఉన్నాయి. ఇవి రోజూ 55 వేల నుంచి 60 వేల వాహనాలకు గ్యాస్ సేవలు అందిస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.లోక్సభలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పలు కీలక వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లో ప్రజారవాణా వాహనాలు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు అధికంగా సీఎన్జీపైనే ఆధారపడుతున్నాయి. కానీ స్టేషన్ల తక్కువ సంఖ్య వల్ల వాహనదారులు గంటలకొద్దీ క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి లోక్సభ వేదికగా తెలిపారు. -
HCA Controversy: దేవరాజ్ తమిళనాడులో అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో అవినీతి ఆరోపణల కేసులో జనరల్ సెక్రటరీ దేవరాజ్ను ఎట్టకేలకు తెలంగాణ సీఐడీ అరెస్ట్ చేసింది. తమిళనాడులో దేవరాజ్ను సీఐడీ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న దేవరాజ్.. 17రోజులుగా పరారీలో ఉన్నారు. సీఐడీ కేసు నమోదు చేసినప్పట్నుంచీ దేవరాజ్ పరారీలో ఉన్నారు. హెచ్సీఏ వివాదంలో ప్రెసిడెంట్ జగన్మోహన్రావును ఈ నెల 9వ తేదీన తెలంగాణ సీఐడీ అరెస్ట్ చేసింది. జగన్మోహన్రావుతో పాటు పలువుర్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో జగన్మోహన్రావు ఏ-1గా ఉన్నారు.ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ సిఫార్సు మేరకు సీఐడీ దర్యాప్తు ేచేపట్టింది. దీనిలో భాగంగా ఏ-2గా ఉన్న జనరల్ సెక్రటరీ దేవరాజ్ను పోలీసులు ఈరోజు(శుక్రవారం, జూలై 25) అరెస్ట్ చేయడంతో విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది.గత ఐపీఎల్ సీజన్లో హెచ్సీఏ-ఎస్ఆర్హెచ్ మధ్య టికెట్ల వివాదం జరిగిన సంగతి తెలిసిందే. హెచ్సీఏ ప్రెసిడెంట్ హోదాలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని జగన్మోహన్రావు బెదిరించారన్నది ప్రధాన అభియోగం. అయితే ఆ అభియోగాలన్నీ వాస్తవమేనని విజిలెన్స్ నిర్ధారించడంతో సీఐడీ ఇప్పుడు అరెస్టులు చేసింది.హెచ్సీఏకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 10 శాతం టికెట్లు ఉచితంగా ఇస్తోంది. అయితే మరో 20 శాతం టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, లేకుంటే మ్యాచ్లు జరగబోనివ్వమని ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే హెచ్సీఏలో భారీ స్కామ్లు వెలుగుచూడటంతో అందులోని పెద్దల పాత్రపై దర్యాప్తు చేపట్టింది సీఐడీ. -
హెచ్సీఏలో మరో భారీ స్కాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)లో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. సీఐడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. సమ్మర్ క్యాంప్ల పేరుతో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అండ్ కో.. రూ.4 కోట్ల రూపాయలు కాజేసినట్లు సీఐడీ గుర్తించింది. గతేడాది మే 20 నుంచి మే 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో సమ్మర్ క్యాంప్లు నిర్వహించిన హెచ్సీఏ.. ప్రతీ క్యాంప్లో 100 మందికి చొప్పున దాదాపు 2500 మందికి పైగా క్రికెట్ కోచింగ్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చెప్పింది.ఒక్కో క్యాంప్పై రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు చూపి.. రూ.4 కోట్ల రూపాయలు జగన్మోహన్రావు కాజేశారు. క్యాంప్కి హాజరైన విద్యార్థులకు క్రికెట్ కిట్స్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించారు. క్యాంప్లు నిర్వహించిన కేంద్రాల్లో సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కో క్యాంప్లో లక్ష కూడా ఖర్చు చేయలేదని సీఐడీ ఆధారాలు సేకరించింది.కాగా, హెచ్సీఏ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరైంది. హచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాస్రావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, సెక్రటరీ రాజేందర్ యాదవ్కు బెయిల్ మంజూరైంది. మరో వైపు జగన్మోహన్రావును కస్టడీ పొడిగించాలని సీఐడీ వేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. మల్కాజిగిరి కోర్టులో జగన్మోహన్రావుతో పాటు సీఈవో సునీల్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. సోమవారం బెయిల్ పిటిషన్లపై వాదనలు జరగనున్నాయి. -
వాయిదా పడిన కొత్త రేషన్కార్డుల పంపిణీ
సాక్షి, సిటీ బ్యూరో: హైదరాబాద్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు ఎదురుచూపులు తప్పడంలేదు. కార్డుల పంపిణీ ప్రక్రియ ఆలస్యం కానుంది. వాస్తవానికి శుక్రవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాలి. ఈ మేరకు కసరత్తు పూర్తయినప్పటికీ హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అందుబాటులో లేకపోవడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 15 సీఎం రేవంత్రెడ్డి సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కొత్త రేషన్కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కొత్త రేషన్కార్డులను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇదీ పరిస్థితి.. హైదరాబాద్ జిల్లాలో సుమారు 2,19, 321 కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. అయితే కేవలం 47,374 దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయి విచారణ నిర్వహించినట్లు తెలుస్తోంది. వాటిల్లో 44,415 దరఖాస్తులు మాత్రమే అర్హత సాధించగా, 2,959 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయి. ఆరు నెలల నుంచి కొత్త రేషన్కార్డుల కోసం మీ సేవ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి విచారణ మాత్రం నత్తకు నడక నేర్పిస్తోంది. సిబ్బంది కొరత వల్ల విచారణ ప్రక్రియ వేగంగా ముందుకు సాగడం లేదని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా దరఖాస్తులను 360 డిగ్రీల్లో పరిశీలించి ఆస్తి, ఆదాయ వివరాల సేకరణ, వాహనాల పన్ను చెల్లింపు వంటి అంశాల్లో విచారణ జరిపి అర్హులను తేల్చాల్సి ఉంటుంది. అయితే సిబ్బంది మాత్రం వీలును బట్టి ఒక దగ్గర కూర్చొని దరఖాస్తుదారులను పిలిచి వివరాలు సేకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 20 శాతం దరఖాస్తులు కూడా క్షేత్ర స్థాయి విచారణకు నోచుకోకపోవడం గమనార్హం.1,100 మంది ఆర్పీల సేవలు తాజాగా కొత్తరేషన్ కార్డుల పెండింగ్ దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ బాధ్యతను జీహెచ్ఎంసీకి అప్పగించినట్లు తెలుస్తోంది. పెండింగ్ దరఖాస్తుల పరిశీలన సర్కిళ్లవారీగా నోడల్ అధికారుల పర్యవేక్షణలో వేగంగా సాగాలని ఇటీవల మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ నుంచి 1,100 మంది ఆర్పీలను వినియోగించుకోవాలని సూచించారు. దీంతో పౌరసరఫరాల శాఖ పెండింగ్ దరఖాస్తుల విచారణ ను జీహెచ్ఎంసీకి అప్పగించినట్లు తెలుస్తోంది. -
విశాఖ టు జోగిపేట వయా వికారాబాద్!
సాక్షి, సిటీబ్యూరో: సైబర్ నేరాలు... డ్రగ్స్ దందా... అక్రమ నివాసం... అసాంఘిక కార్యకలాపాలు... అనుమానాస్పద ప్రవర్తన... ఇలాంటి అనేక కారణాలతో చిక్కిన విదేశీయుల్లో కొందరిపై కేసులు నమోదు చేస్తుంటారు. మరికొందరిని తక్షణం వారి వారి దేశాలకు బలవంతంగా తిప్పిపంపుతారు. డిపోర్టేషన్గా పిలిచే ఈ ప్రక్రియకు కనిష్టంగా మూడు నెలలు పడుతుంది. అప్పటి వరకు వారిని డిటెన్షన్ సెంటర్లో ఉంచాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్నం సెంట్రల్ జైలులో డిటెన్షన్ సెంటర్ ఉండేది. విభజన తర్వాత తెలంగాణకు ప్రత్యేక సెంటర్ లేకపోవడంతో తాత్కాలికంగా హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆదీనంలో ఉంచారు. ఆపై వికారాబాద్, హైదరాబాద్లలో ఏర్పాటు చేయాలని భావించినా ఇప్పుడది జోగిపేట సబ్ జైలుకు మారింది. ఆ దేశాలకు చెందిన వారే అధికం... ఇక్కడ ఉన్న అవకాశాల నేపథ్యంలో నైజీరియా, సోమాలియా, టాంజానియా, ఐవరీ కోస్ట్ వంటి ఆఫ్రికా దేశాల నుంచి అనేక మంది వివిధ రకాలైన వీసాలపై హైదరాబాద్ (Hyderabad) వస్తున్నారు. వీరిలో కొందరు తమ వీసా, పాస్పోర్టుల గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్నారు. నకిలీ గుర్తింపుకార్డుల సహకారంతో తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇలా ఉంటూ చిక్కిన వారిపై ఫారెనర్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసేవారు. అనుమానాస్పద కదలికలు ఉన్నా, కొన్ని రకాలైన నేరాలకు పాల్పడినా ఇదే జరిగేది. దీంతో కోర్టులో ఆ కేసుల విచారణ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్కు అవకాశం ఉండేది కాదు. దీంతో పాటు కొందరు నల్లజాతీయులు సైబర్ నేరాలు, డ్రగ్స్ విక్రయం చేస్తున్నారు. వీరు పట్టుబడినా, శిక్ష పూర్తి చేసుకున్నా, కోర్టు ఆదేశించినా డిపోర్టేషన్ చేయాల్సిందే. కొందరిపై నేరుగా డిపోర్టేషన్ ప్రక్రియ చేపడతారు. తాత్కాలికం అంటూ ఇప్పటి వరకు... ఇలా అత్యంత సమస్యాత్మక వ్యక్తులుగా మారుతున్న ఈ విదేశీయుల ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటోంది. దీనిని గుర్తించిన నగర పోలీసులు అక్రమంగా నివసిస్తున్న వారికి, అనుమానాస్పద కదలికలు కలిగిన వారిని అరెస్టు చేయడానికి బదులు డిపోర్ట్ చేయాలని నిర్ణయించారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారి పైనే కేసు నమోదు చేసి, అరెస్టు తదితర వ్యవహారాలు చేస్తున్నారు. ఈ డిపోర్టేషన్ ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి. ఆయా ఎంబసీలకు సమాచారం ఇచ్చి వీరికి గుర్తింపు పత్రాలు, ఢిల్లీలోని కార్యాలయాల నుంచి టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్లు పొందాలి. ఆపై విమాన టిక్కెట్లు ఖరీదు చేసి సదరు ఎయిర్వేస్ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్, ఫారెనర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) నుంచి ఎగ్జిట్ పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు వారిని అదుపులో ఉంచుకోవాలి. దీనికోసం వారిపై మూవ్మెంట్ రిస్ట్రెక్షన్ ఆర్డర్ తీసుకుని డిటెన్షన్ సెంటర్లో ఉంచుతారు. రాష్ట్ర విభజనకు ముందు ఇది విశాఖపట్నంలో ఉండేది. తెలంగాణ (Telangana) ఏర్పడిన తర్వాత తాత్కాలిక ప్రాతిపదికన హైదరాబాద్ సీసీఎస్ను డిపోర్టేషన్ సెంటర్గా మార్చినా ఇప్పటికీ ఇక్కడే కొనసాగుతోంది. సీసీఎస్ మారినా సౌకర్యాల లేమి... ఒకప్పుడు సీసీఎస్ పబ్లిక్గార్డెన్స్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ను ఆనుకుని ఉండేది. అక్కడ ఐదుగురిని ఉంచడానికి సరిపోయే జైలు గదినే ఈ సెంటర్గా వాడారు. ఆపై సీసీఎస్ బషీర్బాగ్లోని పాత కమిషనరేట్కు వెళ్లింది. దీంతో అక్కడే ఓ గదిని లాకప్ కమ్ డిపోర్టేషన్ సెంటర్గా వాడుతున్నారు. ఒక్కోసారి పాత సీసీఎస్ లాకప్లోనే వీరిని ఉంచుతున్నారు. ఆయా విదేశీయులకు అనువైన ఆహారం అందించలేకపోవడం కొత్త సమస్యలకు కారణం అవుతోంది. దీంతో నగర పోలీసు విభాగం ప్రత్యేకంగా డిటెన్షన్ సెంటర్ (detention center) కోరుతూ ఐదేళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో వికారాబాద్లో ఈ సెంటర్ ఏర్పాటుకు సర్కారు నిర్ణయించింది. దీనికి నిధుల కేటాయింపు జరగకపోవడంతో నిర్మాణం ముందుకు సాగలేదు. 2023లో ఈ అంశంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం నగరానికి దూరంగా కాకుండా సిటీలోనే డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.ఎట్టకేలకు జోగిపేట సబ్ జైలులో... కొత్తగా డిటెన్షన్ సెంటర్ ఏర్పాటుకు భారీగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న భవనాల్లో అనువైనది ఎంపిక చేసి అందులోనే దీని ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జోగిపేట సబ్ జైల్ అధికారుల దృష్టికి వచ్చింది. ఇక్కడ నివసిస్తున్న విదేశీయుల వ్యవహారం సున్నితమైంది, అంతర్జాతీయ సంబంధాలతో ముడిపడి ఉన్నదని ప్రభుత్వ అభిప్రాయం. చదవండి: హైదరాబాద్లో పెరుగుతున్న e వ్యర్థాలుదీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆయా దేశీయుల భాష తర్జుమా చేయడానికి ట్రాన్స్లేటర్లు, వారికి అనువైన ఆహారం అందించే వంట వారితో పాటు ఇతర సౌకర్యాలు ఉండేలా ఆదేశించింది. ఈ సెంటర్ నిర్వహణతో పాటు డిపోర్టేషన్ ప్రక్రియ చేపట్టడానికి అవసరమైన నిధులను అందించడానికి సుముఖత వ్యక్తం చేసింది. దీంతో జోగిపేట సబ్ జైలులో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్న అధికారులు వీలైనంత త్వరలో ఈ సెంటర్ ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
రెక్కలొచ్చేనా..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టు చికాగో ఎయిర్ ఇండియా విమానం. కేవలం పదహారున్నర గంటల్లో చేరుకొనే సదుపాయం. యూఎస్లోని అత్యధిక రద్దీ ఉన్న విమానాశ్రయాల్లో ఒకటైన చికాగోకు హైదరాబాద్ నుంచి నేరుగా బయలుదేరే సదుపాయం ఉండడంతో ప్రయాణికులకు గొప్ప ఊరటనిచ్చింది. కనెక్టింగ్ ఫ్లైట్ల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండానే గమ్యస్థానానికి చేరుకొనే అవకాశం కల్పించింది. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్కు వెళ్లే విద్యార్థులు, వ్యాపారులు, బంధుమిత్రులు చికాగో ఫ్లైట్పైనే ఆధారపడి రాకపోకలు సాగించారు. రెండు ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల మధ్య 2021లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విమాన సర్వసు అనతి కాలంలోనే ఆగిపోయింది. కోవిడ్ కారణంగా పలు విమాన సర్వసులను నిలిపివేశారు. అందులో భాగంగా హైదరాబాద్– చికాగో సర్వసుకు సైతం బ్రేకులు పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సర్వసును పునరుద్ధరించలేదు. హైదరాబాద్– చికాగో విమానాన్ని పునరుద్ధరించడంతో పాటు కొత్తగా మరిన్ని నగరాలకు అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు మాత్రం 24 గంటలకు పైగా ప్రయాణం చేసి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తోంది. 30 శాతానికి పైగా పెరిగిన రద్దీ.. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు సుమారు 15 వేల మంది వివిధ దేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వీరి లో యూఎస్కు రాకపోకలు సాగించేవారి సంఖ్యే అధికం. మిగతా ప్రయాణికులు ఎక్కువగా దుబాయ్, యూరప్, సింగపూర్, బ్యాంకాక్, మలేసియా, శ్రీలంక, మాల్దీవులు తదితర దేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రా ల నుంచి యూఎస్కు రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతోంది. లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పర్యాటకులు భారీ సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నారు. 2020లో హైదరాబాద్ నుంచి అమెరికాకు సుమారు 8.5 లక్షల మంది ప్రయాణం చేశారు. ఇప్పుడు ఆ సంఖ్య 10 లక్షలు దాటింది. ఈ ఐదారేళ్లలో ప్రయాణికుల రద్దీ సుమారు 30 శాతం పెరిగినట్లు అంచనా. కానీ ప్రయాణికుల డిమాండ్, రద్దీ మేరకు నేరుగా బయలుదేరేందుకు విమాన సరీ్వసులు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం పలు ఎయిర్లైన్స్కు చెందిన 25 విమానాలు కనెక్టింగ్ సదుపాయాన్ని అందజేస్తున్నాయి. లుఫ్తాన్సా, పసిఫిక్ క్యాథీ, ఎమిరేట్స్, ఎత్తెహాద్, ఖతార్, తదితర ఎయిర్లైన్కు చెందిన విమానాలు ఢిల్లీ, ముంబయి, దుబాయ్, దోహా, ఫ్రాంక్ఫర్ట్, లండన్ తదితర ఎయిర్పోర్టుల నుంచి సరీ్వసులను అందజేస్తున్నాయి. 24 గంటలకు పైగా పడిగాపులే.... హైదరాబాద్ నుంచి దుబాయ్, దోహాల మీదుగా బయలుదేరే ప్రయాణికులు కనెక్టింగ్ ఫ్లైట్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ‘హైదరాబాద్ నుంచి డల్లాస్కు చేరుకోవడానికి 24 గంటల కంటే ఎక్కువ సమయం ప్రయాణంలోనే గడిచిపోతోంది. ట్రాన్సిట్ ఎయిర్పోర్టుల్లోనే ఎదురుచూడాల్సి వస్తోంది’ అని హిమాయత్నగర్కు చెందిన ట్రావెల్స్ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు తెలిపారు. డైరెక్ట్ ఫ్లైట్ సదుపాయం ఉంటే 12 నుంచి 17 గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్ నుంచి 75 శాతం మంది ప్రయాణికులు డల్లాస్, న్యూయార్క్, చికాగో, అట్లాంటా, బోస్టన్, లాస్ఏంజిల్స్, శాన్ఫ్రాన్సిస్కో తదితర నగరాలకు ప్రయాణం చేస్తున్నట్లు అమీర్పేట్కు చెందిన ఓ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.రోజుకు 5 విమానాల డిమాండ్.. రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారుల అంచనాల మేరకు ప్రతి రోజు 1462 మంది యూఎస్కు ప్రయాణం చేస్తున్నారు. అంటే కనీసం 5 విమానాల ఆక్యుపెన్సీకి తగినట్లుగా ప్రయాణికుల డిమాండ్ ఉంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్ధులు, ఉద్యోగులు, వ్యాపారవర్గాలకు చెందిన వాళ్లు ఎక్కువగా ఉంటారు. వారానికి కనీసం 3 డైరెక్ట్ ఫ్లైట్లు అందుబాటులో ఉన్నా ప్రయాణికులకు ఎంతో సదుపాయంగా ఉంటుంది. -
భవనంపై నుంచి దూకి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
మియాపూర్: పదో తరగతి విద్యారి్థని భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నింపింది. సీఐ శివప్రసాద్, మృతురాలి తండ్రి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్లోని జనప్రియ అపార్ట్మెంట్లోని డీ– బ్లాక్లో నాలుగో అంతస్తులో నివాసముంటున్న బిజయ్ నాయక్, చిన్మయి నాయక్ దంపతులకు కుమార్తె హన్సిక నాయక్ (15), ఓ కుమారుడు ఉన్నారు. హన్సిక మియాపూర్ మాధవ నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం హన్సిక పరీక్ష రాసేందుకు వెళ్లగా.. పాఠశాల యాజమాన్యం ఇంటికి తిరిగి పంపించింది. దీంతో హన్సిక ఇంటికి వెళ్లి మధ్యాహ్నం తాము నివసిస్తున్న భవనం ఐదో అంతస్తు పైనుంచి కిందికి దూకడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా.. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఐదు రోజుల క్రితం.. మాధవనగర్లోని హన్సిక చదువుతున్న పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్న షేక్ రిజ్వాన్ (15) ఈ నెల 19న పాఠశాల భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రిజ్వాన్, హన్సిక ఒకే తరగతి కావడంతో సన్నిహితంగా మెలిగేవారు. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేసుకునేవారు. వీటిని పాఠశాల టీచర్ చూసి ప్రిన్సిపాల్కు సమాచారం అందించింది. దీంతో ప్రిన్సిపాల్ రిజ్వాన్ తల్లిని పాఠశాలకు శనివారం పిలిపించి మాట్లాడుతుండగా ఈ చాటింగ్ విషయం తల్లికి, పాఠశాల యాజమాన్యానికి తెలిసిందనే మనస్తాపంతో పాఠశాల భవనం ఐదో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో గురువారం విద్యార్థిని హన్సిక, తండ్రి బిజయ్ నాయక్తో కలిసి మృతి చెందిన తోటి విద్యార్థి రిజ్వాన్ ఇంటికి వెళ్లారు. అక్కడ రిజ్వాన్ తల్లిదండ్రులు బిజయ్ నాయక్, హన్సికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల భవనంపై నుంచి దూకి రిజ్వాన్ ఆత్మహత్య చేసుకున్న విధంగానే తన కుమార్తె హన్సికను పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని బెదిరించారని హన్సిక తండ్రి బిజయ్ నాయక్ పోలీసులకు చెప్పారు. పరీక్ష రాసేందుకు అనుమతించకపోవడం, తోటి విద్యార్థి రిజ్వాన్ కుటుంబ సభ్యులు దూషించడంతో మనస్తాపం చెందిన తన కుమార్తె హన్సిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని మియాపూర్ పోలీసులు తెలిపారు. -
పోలీసులతో మాధవి లతా వాగ్వాదం
-
తెలంగాణ సచివాలయంలో మరోసారి ఊడిపడ్డ పెచ్చులు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మరోసారి పెచ్చులు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి సీఎం రేవంత్ కాన్వాయ్ వచ్చే మార్గంలోనూ పెచ్చులు కూలాయి. పెచ్చులు ఊడి పడడంతో సచివాయం సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. కాగా, గత వారం రోజుల నుంచి సచివాలయానికి సిబ్బంది రిపేర్లు చేస్తున్నారు. సచివాలయంలో పెచ్చులు ఊడి పడుతున్న ఘటనలపై సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ సచివాలయలో పీవోపీ పార్టిషన్ స్వల్పంగా కూలింది. పెచ్చులు ఊడిపడ్డాయి. సీఎం ఛాంబర్ అంతస్తులో పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి.. రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై పడ్డాయి. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెచ్చులు ఊడిపడడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. పీఓపీ పెచ్చులు ఊడి పడటంతో అధికారులు, భదత్రా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయం పీఓపీ కూలడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయ నిర్మాణ లోపాలపై చర్చ జరుగుతోంది.ఘటనపై స్పందించిన సచివాలయ నిర్మాణ సంస్థసెక్రటేరియట్ పెచ్చులు ఊడిన ఘటనపై షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ స్పందించింది. ‘‘ రెగ్యులర్ డిపార్ట్మెంట్ పనుల్లో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం పనులు చేపట్టినట్లు పేర్కొంది. నిర్మాణం ప్రాబ్లం కాదని.. అది కాంక్రీట్ వర్క్ కాదని తెలిపింది. స్ట్రక్చర్కు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఊడి పడింది జీఆర్సీ ఫ్రేం. ఇటీవల లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్ఎసీ డ్రిల్ చేస్తున్నారు.. దీంతో జీఆర్సీ డ్యామేజ్ అవుతుంది. స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతోంది. ఎలాంటి నాణ్యత లోపం లేదు. మేము ఘటనపై రివ్యూ చేస్తున్నాం అని’’ ఆ సంస్థ వెల్లడించింది. తాజాగా, మరోసారి సచివాలయంలో పెచ్చులు ఊడడం చర్చాంశనీయంగా మారింది. -
హైదరాబాద్లో పెరుగుతున్న e- వ్యర్థాలు
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ పెరుగుతున్న ఈ వేస్ట్.. రీసైక్లింగ్పై అధికారుల్లో కొరవడిన శ్రద్ధ.. ప్రజల్లో అవగాహన లోపం.. పర్యావరణానికి ప్రమాదం... వెరసీ విశ్వనగరానికి ఈ వేస్ట్ విపత్తు పొంచి ఉంది. ఈ వ్యర్థం ఏ అనర్థానికి దారితీస్తుందో మరి! హైదరాబాద్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ (ఈఈఈ) వినియోగంతోపాటు అదే స్థాయిలో ఈ వ్యర్థాలు కూడా గుట్టలుగుట్టలుగా పేరుకుపోతున్నాయి. అయితే వీటిని సరిగా రీసైక్లింగ్ చేయడంలో కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించడంలేదు. కొత్త కొత్త ఫోన్లు, టీవీలు, విద్యుత్తు పరికరాలు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ గ్యాడ్జెట్స్ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ప్రజలు కూడా వాటి పట్ల మక్కువ చూపుతున్నారు. దీంతో పాతవి మూలకు చేరుతున్నాయి. కొత్తవి చెంతకు చేరుతున్నాయి.వీటి రీసైక్లింగ్ కోసం రాష్ట్రంలోని 31 సంస్థలకు కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) నుంచి అనుమతులు ఇచ్చింది. ఇందులో ఏటా సుమారు 3.5 లక్షల టన్నుల ఈ వ్యర్థాలను రీసైకిల్ చేసే సామర్థ్యం ఉంది. అయినప్పటికి 64,635 మెట్రిక్ టన్నులే రీసైకిల్ చేస్తున్నాయి. అంటే.. 18 శాతం మేర రీసైక్లింగ్ చేస్తున్నారన్నమాట. రాష్ట్రంలో ఈ వ్యర్థాల రీసైక్లింగ్ సామర్థ్యం, సేకరణకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అవగాహనా లోపం కారణంగా ప్రజలు వేలాది మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలు చెరువులు, కాల్వలు, సాధారణ చెత్తలో కలిపేస్తున్నారు. రీసైక్లింగ్ యూనిట్లను ఖచ్చితమైన ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని పీసీబీ అధికారులు పేర్కొంటున్నారు.బంగారం, రాగి, ఇతర లోహాలు.. కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023–24లో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ పోర్టల్లో 64,635 మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలను సేకరించారు. ప్రాసెస్ చేసిన ఈ వ్యర్థాల్లో బంగారం, రాగి, అల్యూమినియం, ఇనుము (Iron) వంటి లోహాలు 24,497 మెట్రిక్ టన్నులు ఉండగా, ఇతర వ్యర్థాలు 24,433 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. మనమే టాప్.. హైదరాబాద్లో ఐటీ, వైద్యం, బల్క్ డ్రగ్స్, నిర్మాణ రంగాలు, ప్రభుత్వ, ప్రైవేటు పరిపాలనా కార్యాలయాలు, ప్రపంచ స్థాయి ఉత్తమ కంపెనీ(ఎంఎన్సీ)ల శాఖలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ ఎక్విప్మెంట్ (ఈఈఈ) వినియోగంతోపాటు ఈ వ్యర్థాలు అధికంగానే ఉంటున్నాయి. అయితే వీటిని రీసైక్లింగ్ చేయడంలోనూ దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఈ వ్యర్థాల నిర్వహణ మెరుగ్గానే ఉందని పీసీబీ అధికారులు చెబుతున్నారు.చదవండి: హైదరాబాద్లో రూ.25 లక్షలకే 2 BHK ఫ్లాట్తెలంగాణలో ఏటా సరాసరిన 42 వేల మెట్రిక్ టన్నులు ప్రాసెసింగ్ చేస్తుండగా మహారాష్ట్ర 18 వేల మెట్రిక్ టన్నులతో రెండో స్థానంలో నిలుస్తోంది. రీసైక్లింగ్ ప్రక్రియ ఇప్పటికీ చాలావరకు అనధికారికంగా నడుస్తోందని, సరైన పద్ధతులపై అవగాహన లోపం లోపించిందని పీసీబీ అధికారులు పేర్కొంటున్నారు. పాడైన ఎలక్ట్రిక్, ఎల్రక్టానిక్ పరికరాల సేకరణ కేంద్రాలకు అప్పగించాలనే విషయంపై ప్రజల్లో అవగాహన లేదని, ఈఈఈ సేకరణ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలియక సాధారణ చెత్తలో కలిపి పారేస్తున్నారని అధికారులు గుర్తించారు. -
Gachibowli: పీజీ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువతి
-
మియాపూర్లో విషాదం.. భవనంపై నుంచి దూకేసిన టెన్త్ విద్యార్థిని
సాక్షి, హైదరాబాద్: మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. భవనంపై నుంచి దూకి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది.మియాపూర్లోని ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న హన్సిక (14) మియాపూర్ అపార్ట్మెంట్ ఐదో అంతస్తుపై నుండి దూకింది. తీవ్ర రక్తస్రావంతో ఘటన స్థలంలోనే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..
సాక్షి, మేడ్చల్: తెలంగాణలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల విషయంలో విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.విద్యార్థుల నుంచి వచ్చిన డబ్బుల విషయంలో ఆదాయ పన్నులో హెచ్చు తగ్గులను గుర్తించడంతో ఐటీ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ప్రీతి రెడ్డి, భద్ర రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారుల తనిఖీలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
కొత్త వందేభారత్ రైళ్లు.. కర్నాటక, మహారాష్ట్ర.. వయా తెలంగాణ
బెంగళూరు: దక్షిణాదికి మరిన్ని వందేభారత్ రైళ్లు రానున్నాయి. ఇవి కర్నాటకలోని బెలగావితో పూణే, హైదరాబాద్లను అనుసంధానించనున్నాయి. ఈ కొత్త రైళ్లు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని ప్రధాన నగరాలకు రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనున్నాయి.భారతీయ రైల్వే పూణే నుండి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇది బెలగావి, షెగావ్, వడోదర, సికింద్రాబాద్ (హైదరాబాద్) లకు కనెక్టివిటీని పెంచనున్నాయి. ప్రస్తుతం రెండు వందే భారత్ రైళ్లు పూణే నుండి నడుస్తూ, కొల్హాపూర్ హుబ్బళ్లి మార్గాలకు సేవలు అందిస్తున్నాయి. త్వరలో మరో నాలుగు అదనపు రైళ్లను ప్రవేశపెట్టాక పూణే నుండి బయలుదేరే మొత్తం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య ఆరుకు చేరనుంది.కర్నాటకలోని కలబుర్గి నుంచి పూణే- హైదరాబాద్ మధ్య నడిచే కొత్త వందే భారత్ రైలు మహారాష్ట్ర, కర్ణాటక తెలంగాణలోని ప్రధాన నగరాలను కలపనుంది. కర్నాటకలోని బెలగావి ప్రజలు చాలా కాలంగా హుబ్బళ్లి-బెలగావి-పుణే మార్గంలో రోజువారీ సెమీ-హై-స్పీడ్ రైలును నడపాలని కోరుతున్నారు. ప్రస్తుతం వారానికి మూడుసార్లు నడపబోయే ఈ కొత్త వందే భారత్ రైలు ఈ డిమాండ్ను తీర్చనుంది. పూణే-షెగావ్ వందే భారత్ రైలు దౌండ్, అహ్మద్నగర్, ఛత్రపతి సంభాజీనగర్ జల్నాలలో ఆగనుంది. మహారాష్ట్రలోని ప్రసిద్ధ గజానన్ మహారాజ్ ఆలయాన్ని సందర్శించే పర్యాటకులకు ఈ రైలు సౌకర్యవంతంగా ఉండనుంది. అలాగే పూణే-వడోదర మధ్య నడవబోయే రైలు మహారాష్ట్ర గుజరాత్ మధ్య వేగవంతమైన కనెక్టివిటీని ఏర్పరుస్తుంది. ఈ రైలు మహారాష్ట్ర, గుజరాత్ మధ్య వాణిజ్యం, పర్యాటకాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. వందేభారత్ రైళ్లలో సౌకర్యవంతమైన సీటింగ్, ఆటోమేటిక్ డోర్లు, వైఫై యాక్సెస్, ఆధునిక టాయిలెట్లు మెరుగైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. కాగా ఈ కొత్త వందేభారత్ రైలు సేవల అధికారిక షెడ్యూల్ను రైల్వే శాఖ ఇంకా ధృవీకరించలేదు. త్వరలోనే దీనిపై ప్రకటన రావచ్చని సమాచారం. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
గచ్చిబౌలి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం పట్టణం, గాంధీనగర్కు చెందిన చింతల యామిని (27) ఇందిరానగర్లోని జేకే పీజీ హాస్టల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. మంగళవారం ఉదయం ఖమ్మం వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్కు బయలుదేరిన ఆమె వాంతులు కావడంతో కొద్దిసేపటికే హాస్టల్కు తిరిగి వచి్చంది. అనంతరం తన రూమ్మేట్స్ నిఖిత, రాణిలతో కలిసి టిఫిన్ చేసి హాస్టల్లోనే ఉండిపోయింది. ఆఫీసుకు వెళ్లిన ఆమె స్నేహితులు సాయంత్రం గదికి తిరిగి వచ్చి చూడగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో హాస్టల్ నిర్వాహకుల సహాయంతో కిటికీ అద్దాలు పగులగొట్టి చూడగా కిటికీ గ్రిల్కు చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యామినికి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఇష్టం లేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాకపోవడంతో పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. బుధవారం పోస్టు మార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్ పేమెంట్తో పట్టేశారు
హైదరాబాద్: మద్యం మత్తులో రోడ్డుపై వెళుతున్న కారు పైకి ఎక్కి కారులో ఉన్న వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేసిన యువకుడిని కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఓ షాపులో అతను రూ. 32 ఆన్లైన్ పేమెంట్ చేయడంతో దాని ఆధారంగా అతడిని గంటలోపే అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ గిరీష్ కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... విశాఖపట్నం జిల్లా పెద్ద గోగాడ గ్రామానికి చెందిన సింహాచలం నాయుడు మూసాపేటలోని బాయ్స్ హాస్టల్లో ఉంటూ వెల్డర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను మూసాపేట చౌరస్తాలోని వైన్షాపులో మద్యం తాగాడు. మద్యం మత్తులో అమీర్పేట నుంచి కూకట్పల్లికి వెళుతున్న ఓ కారును అడ్డుకుని దాని పైకి ఎక్కి కూర్చున్నాడు. దీంతో భయాందోళనకు గురైన కారులో ఉన్న వ్యక్తులు అతడిని కిందకు దిగాలని బతిమాలినా ససేమిరా అన్నాడు. దీంతో స్థానికులు జోక్యం చేసుకుని అతడిని కిందకు దింపి కారును పంపించి వేశారు. సదరు వీడియో వైరల్ కావటంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్ఐ గిరీష్ కుమార్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. ఆన్లైన్ పేమెంట్ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో అదుపుతప్పిన లా అండ్ ఆర్డర్గంజాయి మత్తులో నడిరోడ్డుపై యువకుల హల్చల్మూసాపేట్లో నడిరోడ్డుపై కారును ఆపిన గంజాయి బ్యాచ్గంజాయి మత్తులో కారు ఎక్కి హల్చల్ చేసిన యువకుడుభయబ్రాంతులకు గురైన కారులోని కుటుంబం pic.twitter.com/2TybqwpfJC— Telugu Scribe (@TeluguScribe) July 23, 2025 -
వానల్లోనూ ఆన్లోనే..
హైదరాబాద్: వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. నగరంలో ఇటీవల ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోయి.. ఉక్కపోత తగ్గినప్పటికీ.. కరెంట్ వినియోగం మాత్రం తగ్గడం లేదు. వానల్లోనూ మరింత రెట్టింపు స్థాయిలో నమోదవుతోంది. గత ఏడాది జూలై 17న గ్రేటర్లో 65.58 ఎంయూలు నమోదు కాగా, ఈ ఏడాది అదే రోజు ఏకంగా 77.58 ఎంయూలు నమోదైంది. గతంతో పోలిస్తే.. ప్రస్తుతం 18.30 శాతం అధికంగా నమోదు కావడం గమనార్హం. అంచనాలు తలకిందులు ఏటా విద్యుత్ వృద్ధిరేటు విషయంలో డిస్కం అంచనాలు తలకిందులవుతున్నాయి. సాధారణంగా వేసవిలోనూ అత్యధిక డిమాండ్ నమోదవుతుంది. కానీ ఇందుకు భిన్నంగా వర్షాకాలంలోనూ నమోదువుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. కొత్త కనెక్షన్లతో పాటు గృహాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో కొత్తగా అనేక ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ పరికరాలు వచ్చి చేరుతున్నాయి. సీజన్తో సంబంధం లేకుండా ఇంట్లోని ఏసీలు ఆన్లోనే ఉంటున్నాయి. స్నానాలకు చన్నీటికి బదులుగా వేడినీళ్లను వాడుతున్నారు. నిన్నా మొన్నటి వరకు ఆఫ్లో ఉన్న గీజర్లు ప్రస్తుతం ఆన్లో ఉండటం కూడా విద్యుత్ వినియోగం పెరుగుదలకు మరో కారణం. అనూహ్యంగా విద్యుత్ వృద్ధిరేటు సైఫాబాద్, అజామాబాద్, మెహిదీపట్నం, చారి్మనార్, బేగంబజార్, ఆస్మాన్గఢ్, ప్యారడైజ్, బోయిన్పల్లి, కంటోన్మెంట్, బంజారాహిల్స్, గ్రీన్లాండ్స్ డివిజన్లలో విద్యుత్ వృద్ధిరేటు ఏటా పది శాతం ఉంటుందని డిస్కం అంచనా వేసింది. ఇందుకు భిన్నంగా ప్రస్తుతం ఇక్కడ 20 శాతం వృద్ధి రేటు నమోదైంది. అదే విధంగా కొండాపూర్, కూకట్పల్లి, జీడిమెట్ల, హబ్సిగూడ, సైనిక్పురి, కీసర, సరూర్నగర్, చంపాపేట్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, షాద్నగర్, సంగారెడ్డి డివిజన్లలో ఏటా 15 శాతం వృద్ధి రేటు ఉంటుందని అంచనా వేయగా, ప్రస్తుతం ఏకంగా 30 శాతం నమోదవుతోంది. ఇక ఐటీ, ఇతర పారిశ్రామిక సంస్థలకు నెలవైన ఇబ్రహీంబాగ్, గచ్చిబౌలి, పటాన్చెరు, కందు కూరు, మేడ్చల్ డివిజన్ల పరిధిలో 20 శాతం నమోదవుతుందని అంచనా వేస్తే.. ఇందుకు భిన్నంగా 40 శాతం వృద్ధిరేటు నమోదైంది. కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతుండటం, ఇప్పటికే ఉన్న పరిశ్రమల్లోనూ అదనపు యూనిట్లు ప్రారంభిస్తుండటం కూడా అనూహ్యంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు కారణమని డిస్కం అభిప్రాయపడుతోంది.అప్రమత్తంగా ఉండాలని ఆదేశం వర్షాలు, వరదల నేపథ్యంలో ఇంజినీర్లంతా అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశారు. అనూహ్యంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, ఏకధాటి వర్షాలు, వరదల నేపథ్యంలో నిత్యం ఆయన ఆయా సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులెవరూ తమకు కేటాయించిన హెడ్క్వార్టర్లను విడిచి వెళ్లొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సబ్స్టేషన్ల పరిధిలోని సిబ్బంది అంతా షిఫ్ట్ల వారీగా విధులు నిర్వహించాలని సూచించారు. డిమాండ్ ఎంత వచి్చనా.. నిరంతరాయంగా, మరింత నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ఇంజినీర్లు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. -
‘ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు’
సాక్షి,హైదరాబాద్: పోన్ ట్యాపింగ్ అంశంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చిట్చాట్లో ‘ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు.. ఫోన్ ట్యాపింగ్ ద్వారా కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటున్న మాటల్ని విన్నానని అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వినాల్సి వస్తే సూసైడ్ చేసుకోవడం ఉత్తమం. తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వస్తే లీగల్గా పర్మీషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సిట్ అధికారులను డిక్టేట్ చేయను. నాఫోన్ ట్యాపింగ్ కాలేదని అనుకుంటున్నా.ఫోన్ టాపింగ్ కేసులో నన్ను విచారణకు పిలిస్తే వస్తా. ట్యాపింగ్ జాబితాలో నా ఫోన్ నెంబర్ ఉందో లేదో తెలియదు. రిజర్వేషన్ల విషయంలో ఏ సమస్య వచ్చినా...స్థానిక ఎన్నికలు ఆగవు.ఈ విషయంలో మా రాజకీయ వ్యూహం మాకుంది’ అని తెలిపారు. -
hit and run case: లారీతో గుద్ది చంపి..
సాక్షి,మెదక్: నార్సింగి ఎన్హెచ్44 పై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. నార్సింగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం జరిగింది.లారీ ఢీకొట్టడంతో కారులో ఉన్న సత్తిరెడ్డి కోపోద్రికుడయ్యాడు. వెంటనే లారీలో ఉన్న డ్రైవర్ను దిగాలని సూచించాడు. దీంతో లారీ డ్రైవర్ మృతుడిని లారీతో గుద్ది ప్రాణాలు తీశాడు. అనంతరం, లారీతో పరారయ్యాడు. హిట్ అండ్ రన్పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ సీజ్
-
New Rules: తాగి వస్తే.. తాట తీస్తారు!
-
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ?
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా రేషన్ కార్డులు మంజూరైన పేద కుటుంబాలు ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలవుతున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కు వంట గ్యాస్ సిలిండర్ వర్తింపు కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. వారం రోజులుగా కలెక్టరేట్, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన సేవా కేంద్రాలకు దరఖాస్తుదారుల తాకిడి పెరిగింది. ఏడాదిన్నర క్రితం ప్రజాపాలన కార్యక్రమంలో విద్యుత్, గ్యాస్ కోసం ఆర్జీలు పెట్టుకున్నట్లు ఆన్లైన్లో చూపిస్తేనే కొత్త దరఖాస్తులు నమోదవుతున్నాయి. అప్పట్లో దరఖాస్తు చేసుకోనివారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో గంటలకొద్దీ క్యూలో నిలబడి వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అర్హత సాధించిన 58,565 కుటుంబాలు గ్రేటర్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల మంజూరుతో సుమారు 58,565 కుటుంబాలు ఆరు గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించినట్లయింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 43,115, రంగారెడ్డి జిల్లాలో 8,680, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 6,770 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. దీంతో ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. సగానికి పైగా కుటుంబాలు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోకపోవడంతో ఆన్లైన్లో నమోదుకు సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ప్రజాపాలన దరఖాస్తు నంబర్తో ముడిపడి ఉంటడంతో నమోదుకు ఆటంకం కలుగుతోంది.వాస్తవంగా ఇప్పటికే తెల్ల రేషన్కార్డు ప్రామాణికంగా అర్హత సాధించిన కుటుంబాలు సైతం కేవలం ఉచిత విద్యుత్కు పరిమితమయ్యాయి. సిలిండర్పై సబ్సిడీ అందిస్తున్నా.. మెజార్టీ బీపీఎల్ కుటుంబాలకు వర్తించడం లేదు. బీపీఎల్ ఒకే కుటుంబం గృహాలక్ష్మి పథకానికి అర్హత సాధించినా.. మహాలక్ష్మి పథకానికి మాత్రం అర్హత సాధించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో పూర్తిస్థాయి బహిరంగ మార్కెట్ ధర చెల్లించి వంట గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అందని ద్రాక్షగానే.. మహా నగర పరిధిలో వంట గ్యాస్ కనెక్షన్లు సుమారు 31.18 లక్షలు ఉండగా అందులో కొందరికి మాత్రమే రూ.500కు సబ్సిడీ వంట గ్యాస్ వర్తిస్తోంది. వాస్తవంగా సుమారు 24.74 లక్షల కుటుంబాలు మహాలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో సుమారు 19.01 లక్షల కుటుంబాలు మాత్రమే తెల్లరేషన్ కార్డులు కలిగి ఉన్నాయి. అయితే.. సబ్సిడీ గ్యాస్ మాత్రం మూడు లక్షల లోపు కనెక్షన్దారులు మాత్రమే ఎంపికైనట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.అయితే.. మిగతా సుమారు 16 లక్షల కనెక్షన్దారులు అర్హులుగా ఉన్నా.. సబ్సిడీ వర్తింపు మాత్రం అందని ద్రాక్షగా తయారైంది. కాగా.. సుమారు 52,65,129 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో ప్రజాపాలనలో గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ కోసం 24 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 11 లక్షల కుటుంబాలు జీరో బిల్లుకు అర్హత సాధించాయి. మిగతా కుటుంబాలు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. -
హైదరాబాద్ లో గంజాయి గ్యాంగ్ హల్ చల్
-
హైదరాబాద్ ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోమ్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: నగరానికి వాతావరణ శాఖ మరోసారి భారీ నుంచి అతిభారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రోడ్ల మీద నీరు నిలిచిపోకుండా చర్యలు చేపట్టడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది. మంగళవారం రాత్రి నుంచే జంట నగరాల్లోని చాలాచోట్ల చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వాన కురుస్తోంది. మధ్యాహ్నాం లేదంటే సాయంత్రానికి ఇది భారీ నుంచి అతి భారీ వర్షంగా మారొచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో మూడు నాలుగు రోజులపాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. ఈ తరుణంలో.. ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోం ఇవ్వమని కంపెనీలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు.. ఐటీ కంపెనీలు వర్క్ఫ్రమ్ హోం అంశాన్ని పరిశీలించాలని కోరారు. అదే సమయంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆఫీసులకు వచ్చిపోయేవాళ్లు తమ ప్రత్యామ్నాయ మార్గాలను పాటించాలని సూచిస్తున్నారు. ఇంకోవైపు.. కరెంట్ పోల్స్, మ్యాన్హోల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సూచిస్తున్నారు. ఇంకోవైపు.. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్కు వరద పోటెత్తుతోంది. ప్రస్తుత నీటి మట్టం 513.34 మీటర్లతో ఫుల్ట్యాంక్ లెవల్కు చేరింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. -
ఫిలింనగర్లో అంగరంగ వైభవంగా బోనాల జాతర (ఫొటోలు)
-
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి. కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం విశాఖపట్నం సమీపంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో కొనసాగుతోంది. మరో ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గడ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది. వీటి ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు చోట్ల అతి భారీ నుంచి, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.తెలంగాణ మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.It's 2:30AM & Just Pouring here in #Jeedimetla 🌧️💥 #Hyderabadrains pic.twitter.com/v1kjMHiWEK— Hyderabad Rains (@Hyderabadrains) July 22, 2025 రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు అలర్ట్ విధించింది. అలాగే, ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధించగా.. మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక, మంగళవారం వికారాబాద్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. మద్గుల చిట్టెంపల్లిలో 8.3 సెం.మీ, ధారూర్లో 8 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.దయచేసి అప్రమత్తంగా ఉండండి, లోతట్టు ప్రాంతాల నుండి తక్షణమే ఖాళీ చేయండి ⚠️⚠️ములుగు, వరంగల్ బెల్ట్ అంతటా తీవ్రమైన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వెంకటాపురంలో 136మి.మీ నమోదై, రానున్న గంటలలో 200మి.మీ వర్షపాతం కూడా సులువుగా దాటబోతోంది ⚠️⚠️⛈️⛈️⚠️రానున్న 12 గంటల్లో, 150-200… https://t.co/YvS6t8kNjo— Telangana Weatherman (@balaji25_t) July 22, 2025మరోవైపు.. ఏపీలో మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 40నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు విస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అనేక చోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. అదేవిధంగా దక్షిణకోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 🔴 LPA to form near NAP will give Severe rainfall over Telugu states 👇Precipitation forecast for July 21 - 27 (🔴 Very heavy - isol.ext rains ; 🟠 Heavy - very heavy rains ; 🟡 Mod/heavy rains ; 🟢 Light/Mod showers) #Chennairains #TelanganaRains #HyderabadRains #VizagRains 🌧🌧 https://t.co/752rIj72bQ pic.twitter.com/Reviw3e2wW— MADRAS WEATHERMAN (R G Prasad) 🇮🇳 (@Chennaiclimate) July 20, 2025 -
Chicken: చికెన్ కూర ఫ్రిజ్లో పెట్టుకుని తెల్లారి తింటున్నారా?
సాక్షి,హైదరాబాద్: వనస్థలిపురంలో బోనాల పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ఫ్రిజ్లో పెట్టిన చికెన్ తిని తొమ్మిదిమంది అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు మరణించారు. మిగిలిన తొమ్మిదిమందికి చింతలకుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వనస్థలిపురం ఆర్టీసీ కాలనికి చెందిన ఓ కుటుంబం బోనాల పండుగను నిర్వహించింది. అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులు, అతిథులతో కలిసి చికెన్,బోటీని ఆరగించారు. అనంతరం, మిగిలిన చికెన్,బోటీని ఫ్రిజ్లో ఉంచారు. ఫ్రిజ్లో ఉంచిన చికెన్, మటన్ కర్రీని మరుసటి రోజు తిన్నారు. తిన్న కొద్ది సేపటికే కుటుంబ సభ్యులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు.అప్రమత్తమైన స్థానికులు, బంధువులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, చికిత్స పొందుతున్న రజిత(38), జశ్విత(15), గౌరమ్మ(65), లహరి(17), సంతోష్ కుమార్(39), రాధిక(38), బేబీ కృతంగా (7)లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్లో మరికాసేపట్లో అతిభారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరానికి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం సాయంత్రం భారీ నుంచి అతిభారీ వర్షం కురవొచ్చని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఆఫీసులు, పనులు ముగిసే వేళలో వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు.. తెలంగాణలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరికలు జారీ చేసింది. -
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) జూన్ సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగితా రాణా ఫలితాలను విడుదల చేశారు. మొత్తం అభ్యర్థుల్లో 33.98 శాతం అర్హత సాధించారు.ఒక్క క్లిక్ ఫలితాల కోసం👉 https://education.sakshi.com/ లేదంటే అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in/tgtet/ క్లిక్ చేయండిజూన్ 18 నుంచి 30వ తేదీ మధ్య జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రాథమిక ఫలితాలు విడుదల జులై 5న విడుదలైన సంగతి తెలిసిందే. పేపర్ 1కు 63,261మంది, పేపర్-2కు 1,20,392మంది దరఖాస్తు చేసుకోగా.. రెండు పేపర్లకు దరఖాస్తు చేసినవారు 15వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. పేపర్ 1 పరీక్షకు 74.65% హాజరుకాగా, పేపర్ 2 (గణితం, సైన్స్) పరీక్షకు 73.48% మంది, పేపర్ 2 (సామాజిక అధ్యయనాలు) పరీక్షకు 76.73% మంది హాజరయ్యారు. -
పచ్చని విరులు.. ఆరోగ్యపు సిరులు..
ప్రతి ఒక్కరూ పచ్చని ప్రకృతిని చూస్తే పరవశించిపోతారు. అలాంటి పచ్చని ప్రకృతి మన ఇంట్లోనే ఉంటే ఇటు కంటికి.. అటు ఒంటికి ఆరోగ్యాన్ని అందిస్తాయి. వర్షాకాలం కావడంతో నగరంలో నర్సరీలు పూలు, పండ్లు, ఆయుర్వేదం మొక్కలతో అమ్మకాలకు సిద్ధమయ్యాయి. అదే తరహాలో కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. ఇంటి అలంకరణలో భాగంగా మొక్కలు పెంచేందుకు రంగు రంగుల కుండీలు సైతం ఆకర్షిస్తున్నాయి. హఫీజ్పేట డివిజన్ పరిధిలోని కొత్తకుంట చెరువు కట్టపై ఆర్టీసీ కాలనీ వద్ద, జాతీయ రహదారి జెనిసిస్ స్కూల్ వద్ద నర్సరీలు ఏర్పాటు చేశారు. ఇవి మొక్కల ప్రేమికులను, కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి, కడియం నర్సరీల నుంచి మొక్కలు తీసుకొచ్చి అమ్మకందారులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. గత పదేళ్లుగా కూకట్పల్లిలోని హౌసింగ్ బోర్డులో నర్సరీలు ఏర్పాటు చేసేవారు మొక్కల అమ్మకాలకు డిమాండ్ ఏర్పడటంతో మియాపూర్, హఫీజ్పేట్ పరిసర ప్రాంతాల్లోనూ విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని కుటుంబాలకు నర్సరీలే జీవనాధారం. ఈ నర్సరీల్లో 500ల రకాల వరకూ వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేస్తారు. అలంకరణ మొక్కలు, పూల మొక్కలు, ఆయుర్వేదం, పండ్ల జాతులు అమ్మకాలకు ఉంచుతారు. ఇతర ఉత్పత్తులు.. మొక్కల పెంపకానికి కావాల్సిన వివిధ రకాల మోడళ్లలో రంగు రంగుల కుండీలు, సేంద్రీయ ఎరువులు, వర్మీ కంపోస్టు, కోకోపిట్, ఆయుర్వేదం, పండ్లు, పూలు, అలంకరణ మొక్కలకు కావాల్సిన పురుగు మందులు, ఇళ్లలోకి కీటకాలను నివారించే మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో పాటు ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసే లాన్ కూడా సప్లై చేస్తున్నారు. కుండీలు రూ.20 నుంచి రూ.350 వరకూ అమ్ముతున్నారు. పూల మొక్కలకు గిరాకీ.. గులాబీ, చామంతి, మందారం, అలంకరణ పూలు వంటివి సుమారు 300 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇన్ అండ్ అవుట్ డోర్ మొక్కలు, తులసిలో లక్ష్మీ, కృష్ణ, శివుడి పూజకు బిల్వపత్రం, శంకం పూలు, పారిజాతం, ఉసిరి, జమ్మి వంటి మొక్కలు అమ్మకానికి ఉన్నాయి. వీటిలో రూ.30 నుంచి రూ.350 వరకూ ధరల్లో విక్రయిస్తున్నారు. ఆయుర్వేదం, పండ్ల మొక్కలు.. వివిధ రకాల రోగాలను నియంత్రించడంలో ఉపయోగపడే ఆయుర్వేదం మొక్కలైన తులసి, కలబంద, నల్లేరు, రణపాల, గరిక, తిప్పతీగ, మారేడు మొక్కలతోపాటు పండ్ల మొక్కలైన సపోట, దానిమ్మ, జామ, మామిడి, అంగూర్, నిమ్మ తదితర హైబ్రిడ్ మొక్కలు అలరిస్తున్నాయి. దోమలను నివారించే లెమన్ గ్రాస్, లావెండర్, పుదీన, సిటోన్రెల్లా వంటి అనేక మొక్కలు ఉన్నాయి. నర్సరీ ఏర్పాటు సంతోషకరం..కొత్తకుంట చెరువు కట్టపై నర్సరీ ఏర్పాటు సంతోషకరం.. కాలనీ వాసులు ఇష్టానుసారం చెత్త వేస్తున్న నేపథ్యంలో అదే స్థలంలో మొక్కలు పెంచడం మంచిపరిణామం. చెరువు నీరు మొక్కల ఎదుగుదలకు ఉపయోగం. వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు అమ్మకానికి అందుబాటులో ఉంచారు. – సురేష్ మదీనాగూడఆయుర్వేద మొక్కలకు గిరాకీ.. ఇటీవలి కాలంలో చాలా మందికి ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో ఆయుర్వేద మొక్కలకు గిరాకీ పెరిగింది. దీంతో పాటు కీటకాలను నివారించే కొన్ని రగకాల గడ్డిజాతి మొక్కలకు కూడా డిమాండ్ ఏర్పడింది. – రాజు, నర్సరీ నిర్వాహకుడు -
దక్షిణాదిలో జీసీసీల జోరు
న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) అత్యధిక వాటా దక్షిణాది నగరాలదే ఉంటోంది. మొత్తం జీసీసీల్లో 55 శాతం సెంటర్లు (992) బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలోనే ఉన్నాయి. అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ నివేదిక ప్రకారం భారత్లో సుమారు 1,700 జీసీసీలు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3,200 పైగా జీసీసీల్లో ఇవి దాదాపు 53 శాతం. ఇతర దేశాలతో పోలిస్తే వ్యయాలు తక్కువగా ఉండటం, సుశిక్షితులైన నిపుణుల లభ్యత, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, పురోగామి పాలసీలు, వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు మొదలైనవి జీసీసీల ఏర్పాటు సానుకూలాంశాలుగా ఉంటున్నాయని వెస్టియన్ సీఈవో శ్రీనివాస్ రావు తెలిపారు. ఏ జీసీసీ అయినా దీర్ఘకాలికంగా రాణించాలంటే సరైన ప్రాంతాన్ని ఎంచుకోవడం చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. → దేశీయంగా ఉన్న మొత్తం జీసీసీల్లో 94 శాతం సెంటర్లు టాప్ నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, పుణెలోనే ఉన్నాయి. → మొత్తం జీసీసీల్లో 50 శాతం వాటా ఐటీ–ఐటీఈఎస్ రంగానిది ఉండగా, 17 శాతం వాటాతో బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా) తర్వాత స్థానంలో ఉంది. → నగరాలవారీగా చూస్తే బెంగళూరులో 487 జీసీసీలు ఉన్నాయి. ఇది మొత్తం సెంటర్స్లో 29 శాతం. → హైదరాబాద్లో 273, ఢిల్లీ–ఎన్సీఆర్లో 272, ముంబైలో 207, పుణెలో 178, చెన్నైలో 162 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఉన్నాయి. -
కుబేర పైరసీ వీడియో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారని కంప్లైంట్
-
ఎయిర్ అంబులెన్స్ లో హైదరాబాద్ కు ముద్రగడ
-
హైదరాబాద్లో ఇష్టారాజ్యంగా ఆటో, క్యాబ్ చార్జీల పెంపు!
సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకి చెందిన శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం తార్నాక నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ను ఆశ్రయించాడు. సాధారణంగా అయితే క్షణాల్లో బుక్ అయిపోయే క్యాబ్లకు అనూహ్యంగా డిమాండ్ నెలకొంది. చివరకు పావుగంట తర్వాత ఓ అగ్రిగేటర్ సంస్థకు చెందిన క్యాబ్ బుక్ అయింది. ఆన్లైన్ యాప్లో కనిపించిన చార్జీలు చూసి అతడు బెంబేలెత్తాడు. సాధారణంగా తార్నాక నుంచి తిరుమలగిరికి రూ.250 లోపే ఉంటుంది. కానీ ఆదివారం సాయంత్రం ఏకంగా రూ.530 వరకు పెరిగింది. మరో గత్యంతరం లేక ఎక్కువ చార్జీలు చెల్లించేందుకు సిద్ధపడి క్యాబ్ ఎక్కేశాడు. ఇది కేవలం శ్రీనివాస్కు ఎదురైన సమస్య మాత్రమే కాదు, నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు క్యాబ్ అగ్రిగేటర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఆటోలు, క్యాబ్ల నిర్వహణలో స్లాక్ (రద్దీ లేని), పీక్ (రద్దీ ఉన్న) సమయాలుగా ఎలాంటి విభజన లేకపోయినప్పటికీ అడ్డగోలుగా చార్జీలు పెంచి ప్రయాణికుల జేబులు గుల్ల చేయడం గమనార్హం. ఆన్లైన్లోనే బేరసారాలు.. కొన్ని అగ్రిగేటర్ సంస్థలు ఆన్లైన్లోనే బేరసారాలకు దిగుతున్నాయి. ఉప్పల్కు చెందిన ఓ ప్రయాణికుడు సికింద్రాబాద్ వరకు వెళ్లేందుకు ఒక ఆటోను బుక్ చేసుకున్నాడు. మొదట రూ.150 వరకు చార్జీలు కనిపించాయి. సరేననుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కానీ.. ఎంపిక చేసుకున్న చార్జీలకు ఆటోడ్రైవర్ సుముఖంగా లేడంటూ ఐదు నిమిషాల తర్వాత మొబైల్ స్క్రీన్పై కనిపించింది. అంతే కాదు. అదనపు చార్జీలు చెల్లిస్తే ఆటో లభించవచ్చని సంకేతం, దాంతో మరో రూ.20 అదనంగా చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. అయినా ఆటో రాలేదు. అలా చివరకు రూ.50 ఎక్కువ చెల్లించేందుకు అంగీకరించిన తర్వాత క్షణాల్లో ఆటో వచి్చంది. దీంతో సదరు ప్రయాణికుడు బిత్తరపోయాడు. ఇలా కొన్ని ఆటో, క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు ఆన్లైన్లోనే బేరసారాలకు దిగుతున్నాయి. మొదట తక్కువ చార్జీలను ప్రదర్శించి ఆ తర్వాత ప్రయాణికుడి అత్యవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు బేరసారాలకు దిగుతున్నాయి. కొన్ని అగ్రిగేటర్ సంస్థలకు చెందిన యాప్లలో ఈ ఆప్షన్ కొత్తగా కనిపించడం గమనార్హం. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు మాత్రం పలు సంస్థలకు చెందిన క్యాబ్లు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. క్యాబ్ బుక్ అయిన తర్వాత ఆకస్మికంగా రద్దవుతున్నాయి. ఎంపిక చేసుకున్న క్యాబ్ కోసం చాలా సేపటి వరకు పడిగాపులు కాసి చివరకు ప్రయాణికులే తమకు తాముగా రద్దు చేసుకొనేవిధంగా కొందరు డ్రైవర్లు వ్యవహరిస్తున్నారు. మెట్రోల్లో పెరిగిన రద్దీ.. నగరంలోని వివిధ మార్గాల్లో ఆదివారం మెట్రో రైళ్లలోనూ రద్దీ కనిపించింది. బోనాల సందర్భంగా ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య ఎక్కువగా రాకపోకలు సాగించారు. దీంతో నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్ కారిడార్లలో సాయంత్రం పలు మెట్రో స్టేషన్లలో సందడి నెలకొంది, సాధారణంగా సెలవు రోజుల్లో రద్దీ తగ్గుముఖం పడుతుంది. కానీ ఆదివారం బోనాల వేడుకలు, వర్షం కారణంగా ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. -
భాగ్యనగరంలో వైభవంగా బోనాల ఉత్సవాలు (ఫొటోలు)
-
అంబులెన్స్లోనే హైదరాబాద్కు ముద్రగడ
అనారోగ్యంతో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభాన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు. సోమవారం అంబులెన్స్లోనే రోడ్డు మార్గం గుండా ఆయనను కుటుంబ సభ్యులు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ/హైదరాబాద్: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. తొలుత ఎయిర్ ఆంబులెన్స్లో రాజమహేంద్రవరం ఎయిర్పోర్టు నుంచి తరలించాలని అనుకున్నారు. అయితే చివరకు రోడ్డు మార్గం గుండానే తీసుకొస్తున్నట్లు సమాచారం. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన పద్మనాభంకు రెండు రోజులుగా కాకినాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై వదంతులు ప్రచారంలోకి రాగా.. కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. అదే సమయంలో ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో ఆరా తీశారు. వైద్యుల సూచన మేరకు అవసరమైతే ఎయిర్లిఫ్ట్ చేయాలని వైఎస్సార్సీపీ నేతలకు జగన్ చెప్పారు. అయితే.. ఈ ఉదయం ముద్రగడ కోరిక మేరకు తొలుత కిర్లంపూడి నివాసానికి ఆంబులెన్స్లో కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడి నుంచి ఆంబులెన్స్లోనే హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్కు కృతజ్ఞతలు: ముద్రగడ తనయులుతమ తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ముద్రగడ కుమారులు బాలు, గిరిబాబులు కృతజ్ఞతలు తెలియజేశారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని, తరలింపు నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందవద్దని వారు కోరుతున్నారు. జగన్ సూచన మేరకు ఇవాళే హైదరాబాద్కు తమ తండ్రిని తరలిస్తామని ప్రకటించారు. ముద్రగడ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ముద్రగడ తనయుడు, పార్టీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ గిరిబాబును ఫోన్లో పలకరించారు. పద్మనాభం ఆరోగ్య పరిస్థితి, కాకినాడ ఆస్పత్రిలో అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఎయిర్ అంబులెన్స్లో హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేస్తామని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో కాకినాడ వైద్యులూ హైదరాబాద్ తీసుకువెళ్లడం మంచిదని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి సాధ్యమైనంత త్వరగా ముద్రగడను ఎయిర్ అంబులెన్స్లో తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని పార్టీనేతలకు సూచించారు. అదివారం రాత్రి తరలించేందుకు సాంకేతికంగా ఇబ్బంది ఉండటంతో ఇవాళ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. -
117 ఏళ్ల చరిత్ర ఉన్న లాల్ దర్వాజా బోనాలు
-
హైదరాబాద్ లో ఘనంగా బోనాలు (ఫొటోలు)
-
బోనమెత్తిన హైదరాబాద్.. సందడే సందడి
సాక్షి, హైదరాబాద్: నగరంతో పాటు పాతబస్తీలో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున 4 గంటలకు బలిహరణ, అనంతరం ఉదయం మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా మహాభిషేకం జరిగింది. తదనంతరం బోనాల సమర్పణ కార్యక్రమం ప్రారంభమైంది.బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్బాబు తదితరులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పట్టు వ్రస్తాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బోనాలు తెలంగాణ సంస్కృతిలో అనాదిగా కొనసాగుతూ వస్తున్నాయన్నారు. గోల్కొండలో మొదలైన ఉత్సవాలు, సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వరకు జరుగుతున్నాయి. బోనాలు ప్రశాంతంగా అత్యంత భక్తి భావంతో కొనసాగుతున్నాయి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలను చల్లగా చూడమని వేడుకున్నాను. దాదాపు రూ.1290 కోట్లతో దేవాదాయ శాఖకు నిధులు విడుదల చేశాం. రూ.20 కోట్లు హైదరాబాద్లో బోనాల కోసం నిధులు విడుదల చేశాం. మహంకాళి అమ్మవారి ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని భట్టి విక్రమర్క తెలిపారు.కాగా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆలయాల పరిసరాల్లో బాంబు, డాగ్ స్క్వాడ్, నిఘా వర్గాలు భారీగా మోహరించాయి. దక్షిణ మండలం డీసీపీ స్నేహ మెహ్రా, అదనపు డీసీపీ మజీద్, ఛత్రినాక ఏసీపీ సి.హెచ్.చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్ వర్మ లు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. -
పాతబస్తీలో బోనాల సందడి
-
ఇక తెలంగాణ సర్కారు బడుల్లో నో బ్యాక్ బెంచ్!
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఇక బ్యాక్ బెంచ్లు కనిపించవు. ‘యూ’ఆకారంలో బెంచీలను అమర్చి వినూత్నంగా విద్యాబోధన చేపట్టేందుకు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. ఇటీవల వినేశ్ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ సినిమా ‘స్థానార్థి శ్రీకుట్టన్’ క్లైమాక్స్’ సీన్ స్ఫూర్తితో తొలుత ప్రయోగాత్మకంగా కేరళలోని కొల్లం జిల్లాలోని రామవిలాసం ఒకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో అక్కడి అధికారులు ఈ విధానాన్ని ప్రారంభించారు. అయితే.. ఈ విధానం సత్ఫలితాలిచి్చనట్లుగా అధికారులు గుర్తించారు. కేరళతోపాటు ఒడిశా, పంజాబ్, తమిళనాడుల్లోని పలు పాఠశాలల తరగతి గదుల్లో కూడా విజయవంతంగా యూ ఆకారపు బెంచీల అమరిక విధానం అమలవుతున్న తీరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి సికింద్రాబాద్ బోయనపల్లిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన సందర్భంగా ఒక తరగతి గదిలోని బెంచీ లను ‘యూ’ఆకారంలో ఏర్పాటు చేయించారు. మధ్యలో టీచర్ నిలబడి పాఠాలు చెప్పే విధానాన్ని పరిశీలించారు. ఆ తర్వాత విద్యార్థులతో కూడా ముచ్చటించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అన్ని సర్కారు పాఠశాలలో యూ ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేసి విద్యాబోధన జరిగే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా.. సాధారణంగా బ్యాక్ బెంచ్ అనే పదం వినగానే సరిగ్గా చదవని పిల్లలు అందులో కూర్చుంటారన్న భావన అందరి మదిని తడుతుంది. అయితే వెనుక బెంచీల్లో ఉన్న విద్యార్థులు తక్కువ శ్రద్ధ, ముందు భాగంలో ఉన్నవారు ఎక్కువ శ్రద్ధ కనబర్చడంతోపాటు పాఠ్యాంశాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో కూడా వ్యత్యాసం ఉందని అధికారులు గుర్తించారు. యూ టైప్ సిట్టింగ్లో టీచర్ సందేహాలను నివృత్తిలో వ్యక్తిగత శ్రద్ధ సాధ్యమవుతోందనే అంచనా అధికారుల్లో ఉంది. ఇది విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, అభ్యాస ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చేస్తుందని భావిస్తున్నారు. ఇది విద్యార్థి కేంద్రీకృత అభ్యాసానికి ప్రాధాన్యతనిస్తుందని, విద్యార్థులందరూ ఒకే స్థాయిలో అభ్యసన ప్రక్రియలో పాలుపంచుకోవడానికి అవకాశం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇంటరాక్టివ్ లెర్నింగ్..ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వృత్తాకార, సెమీ–వృత్తాకార తరగతి గది అమరికలు కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో, ముఖ్యంగా ఇంటరాక్టివ్ లెరి్నంగ్కు ప్రాధాన్యతనిచ్చే విద్యాసంస్థల్లో అమలులో ఉన్నాయి. ఫిన్లాండ్ వంటి దేశాలు విద్యార్థుల మధ్య పరస్పర చర్చలను ప్రోత్సహించడానికి ఇలాంటి అమరికలను ఉపయోగిస్తాయి. యూ–టైప్ అమరిక అనేది కేవలం కూర్చునే విధానాన్ని మార్చడం మాత్రమే కాకుండా, సమగ్రమైన సమానమైన విద్యావ్యవస్థను రూపొందించడంలో ఒక ముఖ్యమైన అడుగు అని అధికారులు భావిస్తున్నారు. యూ టైప్ సిట్టింగ్తో సత్ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల్లో యూ టైప్ సిట్టింగ్ విద్యాబోధనతో మెరుగైన ఫలితాలు రావచ్చని భావిస్తున్నాం. సంప్రదాయ తరగతి గది సిట్టింగ్ను మార్చడం ద్వారా బ్యాక్ బెంచర్ సంస్కృతికి చెక్ పడుతోంది. యూ ఆకారం సిట్టింగ్ అమరిక విద్యార్థుల్లో సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. చదువుపట్ల మరింత ఆసక్తి పెంపోందిస్తోంది. ఉపాధ్యాయులు స్పష్టమైన సూచనలు ఇవ్వడానికి, విద్యార్థులు సులభంగా వినడం, ఆచరించడం, చర్చల్లో మెరుగ్గా సంభాíÙంచడానికి ఎంతో దోహడపడుతోంది. :::హరిచందన దాసరి, హైదరాబాద్ కలెక్టర్ మరింత ఇంటరాక్షన్ పెరుగుతుంది తరగతి గదిలో యూ ఆకారంలో సిట్టింగ్ ఉపాధ్యాయులు– విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్ను పెంచుతుంది. తరగతి గదిలో సాధారణంగా టీచర్తో మాట్లాడటానికి ఇష్టపడని విద్యార్థులు ఈ తరహా సిట్టింగ్తో చురుగ్గా సంభావిస్తారు. తరగతి గదిలో విద్యార్థులందరూ ఏం చేస్తున్నారో టీచర్ సులువుగా గమనించవచ్చు. :::ఆర్.రోహిణి, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారివిద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతోంది తరగతి గదిలో సరికొత్త యూ–టైప్ సిట్టింగ్తో విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతోంది. టీచర్ల దృష్టి విద్యార్థులందరిపైనా ఉంటుంది. ప్రతి విద్యార్థి క్రమశిక్షణగా పాఠాలు వినక తప్పదు. విద్యార్థులు యూ టైప్ సిట్టింగ్పై ఆసక్తి కనబర్చుతున్నారు. :::డాక్టర్ విశ్వనాథ గుప్త్త, జీహెచ్ఎం, నాంపల్లి -
నేడు బోనమెత్తనున్న పాతబస్తీ
చార్మినార్/చాంద్రాయణగుట్ట: నగరంతో పాటు పాతబస్తీలో ఆదివారం జరిగే ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బోనాల జాతర కోసం లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం సహా పాతబస్తీలోని ప్రధాన ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. కాగా.. లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున 4 గంటలకు బలిహరణ, అనంతరం ఉదయం 6 గంటలకు మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా మహాభిõÙకం ఉంటుంది. తదనంతరం బోనాల సమర్పణ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీ యాదవ్ తెలిపారు. రాత్రి 8 గంటలకు శాంతి కల్యాణం జరగనుంది. పట్టు వ్రస్తాలు సమర్పించనున్న మంత్రులు.. బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్బాబు తదితరులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పట్టు వ్రస్తాలు సమరి్పంచనున్నారని ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు చైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆలయాల పరిసరాల్లో బాంబు, డాగ్ స్క్వాడ్, నిఘా వర్గాలు భారీగా మోహరించాయి. దక్షిణ మండలం డీసీపీ స్నేహ మెహ్రా, అదనపు డీసీపీ మజీద్, ఛత్రినాక ఏసీపీ సి.హెచ్.చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్ వర్మ లు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. -
టేకాఫ్ అయిన ఎనిమిది నిమిషాలకు..
శంషాబాద్ (హైదరాబాద్): టేకాఫ్ తీసుకున్న ఎనిమిది నిమిషాల ప్రయాణం తర్వాత సాంకేతిక సమస్యను గుర్తించడంతో ఫుకెట్ విమానం వెనక్కి తిరిగి వచి్చంది. వివరాలివి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఐఎక్స్–110 విమానం (బోయింగ్ 737) శనివారం ఉదయం 6.41 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి థాయిలాండ్లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరేందుకు టేకాఫ్ తీసుకుంది. విమానంలో 98 మంది ప్రయాణికులున్నారు.ఉదయం 6.49 గంటల సమయంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు.. ఏటీసీ అనుమతి మేరకు విమానాన్ని వెనక్కి మళ్లించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో 6.57 గంటలకు సురక్షితంగా దించారు. సాంకేతిక సమస్యల సర్దుబాటు అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు తిరిగి ఫుకెట్ విమానం బయల్దేరినట్లు ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి. -
మాల్స్లో ఆఫీసులు.. తక్కువ అద్దెలు
మాల్స్, స్టార్ హోటల్స్.. తినడానికో లేదా షాపింగ్ కేంద్రాలుగానే కాదు ఆఫీసు కేంద్రాలుగానూ మారుతున్నాయి. గతంలో ప్రత్యేకంగా ఒక వాణిజ్య భవనంలో కో–వర్కింగ్ స్పేస్ను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీలు ఇప్పుడు షాపింగ్ మాల్స్, స్టార్ హోటళ్లనూ కార్యాలయాలుగా కేటాయిస్తున్నాయి. పనిచేసే చోటే రిటైల్, ఫుడ్ వసతులూ ఉంటేనే కంపెనీలు స్వాగతిస్తుండటంతో కో–వర్కింగ్ సంస్థలు మాల్స్, హోటళ్ల వైపు దృష్టిసారించాయి. – సాక్షి, సిటీబ్యూరోదశాబ్దం కాలంగా దేశంలోని కార్యాలయాల్లో పని వాతావరణంలో మార్పు వచ్చింది. ఆఫీసు డిజైన్, వసతులు, రంగులు వంటివి ఉద్యోగి నైపుణ్యం, ఉత్పాదకత, పని సంస్కృతి వంటి వాటి మీద ప్రభావం చూపిస్తున్నాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. కార్యాలయాల్లో గ్రీనరీ, సహజసిద్ధమైన గాలి, వెలుతురు, వాసన వంటి వాటితో ఉద్యోగిపై పని ఒత్తిడిని తగ్గిస్తుందని, దీంతో మరింత క్రియేటివిటీ బయటకొస్తుందని పరిశోధనల్లోనూ తేలింది. ఆయా వసతులను అందుబాటు ధరల్లో కో–వర్కింగ్ స్పేస్ భర్తీ చేస్తుండటంతో ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్ మాత్రమే కాకుండా బహుళ జాతి సంస్థలూ కో–వర్కింగ్ స్పేస్లో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి.గంట, రోజు, నెల వారీగా చార్జీలు..ఒకే అంతస్తులో ఒక ఆఫీసు బదులు పలు రకాల చిన్న ఆఫీసులు ఉండటాన్ని కో–వర్కింగ్ స్పేస్ అంటారు. ఇక్కడ వ్యాపారం ఎవరిది వారిదే, ఎవరి ప్రమాణాలు వారివే. ప్రతి ఒక్కరికీ కావాల్సిన ప్రైవేట్ ఆఫీసు, ఫిక్స్డ్ డెస్క్లు, సమావేశ గది, క్యాబిన్లు వంటి సౌకర్యాలు ఉంటాయి. వీటితో పాటూ ప్రత్యేకంగా బహుళ జాతి కంపెనీలకు ఉండే కొరియర్ సర్వీస్, ఫుడ్, లాంజ్, ఎల్సీడీ, పార్కింగ్, ప్రింటర్, ప్రొజెక్టర్, వైఫై వంటి అన్ని రకాల ఆధునిక వసతుంటాయి. కో–వర్కింగ్ కార్యాలయాల అద్దెలు గంట, రోజులు, నెల వారీగా ఉంటాయి. నగరంలో నెలకు రూ.8 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్రాంగూడ, బంజారాహిల్స్, సోమాజిగూడ, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో కో–వర్కింగ్ ఆఫీసులున్నాయి.అద్దెలు 25 శాతం వరకు తక్కువఐటీ కారిడార్లు, అభివృద్ధి చెందిన వాణిజ్య ప్రాంతాల్లో స్థలాల ధరలు ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసే బదులు కో–వర్కింగ్లోనే స్పేస్ను అద్దె తీసుకోవటం కంపెనీలకు సులువవుతుంది. ఇదే కో–వర్కింగ్ డిమాండ్కు ప్రధాన కారణం. గ్రీడ్–ఏ ఆఫీస్ స్పేస్తో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్లో అద్దెలు 25 శాతం వరకు తక్కువ ఉంటాయి. సాధారణ ఆఫీసులో సీట్లతో పోలిస్తే కో–వర్కింగ్ స్పేస్లో ఒక్కో సీటుకు 5–15 శాతం స్థలం ఆదా అవుతుంది. పైగా ప్రతి కంపెనీ ప్రత్యేకంగా మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునే బదులు అన్ని కంపెనీలకు కలిపి ఒకటే పార్కింగ్, హౌస్ కీపింగ్, క్యాంటీన్, రిసెప్షన్ వంటి ఏర్పాట్లు ఉంటాయి. దీంతో కంపెనీలకు మౌలిక వసతుల వ్యయం కూడా తగ్గుతుంది. -
మియాపూర్: స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్: మియాపూర్లో స్కుల్ బిల్డింగ్పై నుంచి పడి విద్యార్థి మృతి చెందాడు. మధుర నగర్లోని సెయింట్ మార్టిన్ స్కూల్లో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థి రిజ్వాన్(15) స్కూల్ బిల్డింగ్ నాలుగో అంతస్థుపై నుండి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు.దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. రిజ్వాన్ ప్రమాదవశాత్తూ పడిపోయాడా.. లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వీకెండ్ ఫామ్హౌస్.. ఫుల్ డిమాండ్
ఆఫీసులో పని ఒత్తిడి ఒక ఎత్తయితే.. ట్రాఫిక్ సంద్రాన్ని ఈదుకుంటూ వెళ్లడం మరొక ఎత్తు. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ప్రతిరోజూ ఛేదించుకుంటూ వెళ్లే నగరవాసి కనీసం వారాంతంలోనైనా కుటుంబం, స్నేహితులతో స్వచ్ఛమైన ఆహ్లాదకర వాతావరణంలో గడపాలని కోరుకుంటున్నాడు. వీరి అభిరుచులకు తగ్గట్టుగానే ఫామ్ హౌస్లు నిర్మితమవుతున్నాయి. గతంలో ఫామ్హౌస్ల కోసం కేవలం సంపన్న వర్గాలు మాత్రమే మొగ్గు చూపేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి సామాన్య, మధ్యతరగతి సైతం వ్యవసాయ క్షేత్రాలకు ఆసక్తి చూపిస్తున్నారు. -సాక్షి, సిటీబ్యూరోకొందరు 200 నుంచి వెయ్యి గజాల్లోపు భూమిని కొనుగోలు సాదాసీదాగా ఫామ్హౌస్లను నిర్మించుకుంటుంటే.. మరి కొందరు వెయ్యి నుంచి 4 వేల గజాలు, రెండు, మూడెకరాలంటూ భూమి కొనేసి వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఫామ్ ల్యాండ్స్ పేరుతో కొన్న జాగాల్లో, డీటీసీపీ లేఅవుట్లలో, గ్రామ పంచాయతీ లే అవుట్లలో స్థలాలను కొని బంగ్లాలు కడుతున్నారు. శని, ఆదివారాల్లో కుటుంబ సభ్యులతో కలిసి కారులో వారాంతపు ఇంటికి వెళ్లి షికారు చేస్తున్నారు.ఔటర్ వెలుపలే..నగరం ఓఆర్ఆర్ వరకు విస్తరించింది. చేవెళ్ల, వికారాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్, శామీర్పేట, భువనగిరి, శంషాబాద్, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల్లోని వీకెండ్ హోమ్స్కు ఆదరణ ఎక్కువగా ఉంది. భూముల ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ.. వాతావరణం బాగుంటుందని, భవిష్యత్తులో ఆస్తిని విక్రయిస్తే మంచి ధర పలుకుతుందనే విశ్వాసంతో కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటితో పాటు చుట్టూ పచ్చదనం, ఆకుకూరలు, పండ్ల చెట్లను పెంచుతూ వ్యవసాయం చేశామనే తృప్తిని పొందేందుకు చాలామంది ఇష్టపడుతున్నారు.బిల్డర్లు కూడా..రియల్ ఎస్టేట్ సంస్థలు వేసిన వెంచర్లలో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. వారాంతాల్లో విడిది చేసేలా సకల సదుపాయాలు ఇక్కడ కల్పిస్తున్నారు. కొందరు తమ ఇళ్లను మిగతా సమయంలో కమ్యూనిటీ నిర్వహణ సంస్థలకే అద్దెకు ఇస్తున్నారు. కమ్యూనిటీల్లోని సభ్యులు చిన్న వేడుకలను ఇక్కడ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఇతర ఇళ్లను ఒకటి రెండు రోజులకు అద్దెకు తీసుకుంటున్నారు. ఈ రకంగా ఖాళీగా ఉండకుండా ఆదాయం వస్తుండటంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. -
Nallakunta: ప్రతి సంవత్సరం వర్షం వస్తే ఇదే పరిస్థితి అంటూ కాలనీవాసుల ఆవేదన
-
కొత్తిల్లు కొందామా.. పాతిల్లు చూద్దామా?
సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల. అయితే గృహ కొనుగోలు నిర్ణయం అంత తేలికైందేమీ కాదు. ప్రాంతం ఎంపిక నుంచి మొదలు పెడితే బడ్జెట్, నిర్మాణ నాణ్యత, నిర్మాణ సంస్థ నేపథ్యం, కొనుగోలుదారుడి అవసరాల వరకూ ప్రతి ఒక్కటీ ప్రధానమైందే. సమాజంలో గుర్తింపు కోసం కొందరు ఇల్లు కొంటే.. మరికొందరేమో పెట్టుబడి కోసం, ట్యాక్స్ నుంచి మినహాయింపుల కోసం కొంటుంటారు. కారణాలేవైనా ఇల్లు కొనడమనేది ఓ నిరంతర ప్రక్రియ. మరి, ఎలాంటి ఇల్లు కొంటే సొంతింటి యోగం మరింత తేలికవుతుంది? అంటే కొత్త ఇల్లు కొనడమా? లేక సెకండ్ హ్యాండ్ ఇల్లు బెటరా? అని! – సాక్షి, సిటీబ్యూరోదేశంలో కొత్త గృహాలకు డిమాండ్ ఎంత ఉందో రీసేల్ లేక సెకండ్ హ్యాండ్ ఇళ్లకూ అంతే ఉంది. కొత్త ఇల్లు నేరుగా డెవలపర్ నుంచి కొనుగోలు చేస్తే.. రీసేల్ ప్రాపర్టీలను పాత యజమాని నుంచి కొనుగోలు చేస్తాం. కొత్త లేక పాత ప్రాపర్టీ ఏదైనా కానీ ఎంపికలో ప్రధానమైంది బడ్జెట్. దీంతో పాటూ మన జీవన శైలి, అవసరాలు, అభిరుచులు, ఇంటీరియర్, ఇంధన సామర్థ్యాలు వంటివి కూడా ప్రాపర్టీ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.ప్రధాన నగరంలో సెకండ్సే బెటర్..ఇల్లు కొనుగోలు చేసిన వారెవరైనా సరే ఎప్పటికీ ఒకే ఇంట్లో ఉండాలనుకుంటారు. ఫ్యామిలీ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు గానీ ఉద్యోగ రీత్యా, కుటుంబ అవసరాల రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గానీ ఆర్థిక అవసరాల కోసం ఇంటిని విక్రయించాలనుకుంటారు. విద్యా, వైద్యం, వినోదం ఇతర అవసరాలకు రోజూ ప్రధాన నగరంతో అనుబంధం ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో కొత్త గృహాలు దొరకడం కొంత కష్టం. ఒకవేళ దొరికినా ధర ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఏరియాల్లో సెకండ్ హ్యాండ్ ఇల్లును కొనుగోలు చేయడం బెటర్. అవసరమైతే దాన్ని కూల్చేసి మన అవసరాలు, బడ్జెట్కు తగ్గట్టు మళ్లీ కొత్త గృహాన్ని నిర్మించుకోవచ్చు. అయితే ఇది కొంత డబ్బు, సమయంతో ముడిపడి ఉన్న అంశం. అందుకే ప్రధాన నగరంలో, అభివృద్ధి చెందిన ప్రాంతంలో రీసెల్ ప్రాపర్టీలను ఎంచుకోవటమే ఉత్తమమనేది నిపుణుల సూచన.రీసేల్ కొనేముందు..రీసేల్ ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు పాత యజమాని నేపథ్యం, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, టైటిల్, అనుమతి పత్రాలు, గృహ రుణానికి సంబంధించిన పత్రాలు వంటి వాటిని స్వయంగా పరిశీలించుకోవాలి. ఏమాత్రం అవగాహన లేకపోయినా లేక తప్పిందం జరిగినా సరే మొదటికే మోసం వస్తుంది. అదే కొత్త ఇల్లు కొనుగోలు చేస్తే ఈ ప్రక్రియంతా డెవలపరే పూర్తి చేసేస్తాడు.పాత ఇళ్లలో ఎలక్ట్రిక్ వైర్లు, ఉపకరణాలు, బాత్రూమ్ ఫిట్టింగ్స్ వంటి వాటిల్లో సమస్య వస్తుంటుంది. అదే కొత్త గృహాల్లో బ్రాండెండ్, నాణ్యమైన ఉత్పత్తుల వినియోగంతో ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. పైగా పాత ఇళ్లలో వాస్తు మార్పులు, గదుల్లో చిన్న చిన్న మార్పులు చేయాలంటే ఇబ్బందులుంటాయి. అదే కొత్త గృహాల్లో నిర్మాణంలో ఉన్నప్పటి నుంచే డెవలపర్కు మన అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణంలో మార్పులు చేసుకునే వీలుంటుంది.శివారు ప్రాంతాల్లో కొత్త ఇళ్ల ధరలు తక్కువకొత్త గృహాలతో పోలిస్తే రీసేల్ ప్రాపర్టీలు కొంత తక్కువ ధరకే లభ్యమవుతాయి. కానీ, రిజి్రస్టేషన్ ఫీజు, ప్రాపర్టీ బదిలీ రుసుము, వినియోగ చార్జీలు వంటివి చెల్లించాల్సి ఉంటుంది. పైగా సెకండ్ హ్యాండ్ హోమ్స్ నిర్వహణ భారం ఎక్కువగా ఉంటుంది. పైగా మన అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఇంటిని రిపేర్ చేయించాల్సి ఉంటుంది. ఆయా ఖర్చులన్నింటినీ కలిపి చూస్తే మాత్రం రీసేల్ ప్రాపర్టీ కంటే అభివృద్ధి చెందే ప్రాంతంలో, శివారు ప్రాంతంలోని కొత్త గృహాల ధరలే తక్కువగా ఉంటాయి.పర్యావరణం స్పృహ, ఇంధన నిర్వహణ సామర్థ్యాలు, కరెంట్ బిల్లుల మీద అవగాహన ఉంటే మాత్రం కొత్త ఇల్లు కొనడమే ఉత్తమం. ఎందుకంటే కొత్త గృహాలు ఎనర్జీ ఎఫీషియన్సీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇంట్లోనే ఉపకరణాలతో పాటూ గోడలు, పైకప్పులు, కిటికీలు, తలుపులు కూడా ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. దీంతో విద్యుత్ బిల్లు తక్కువగా రావటంతో పాటూ నిర్వహణ వ్యయం కూడా తక్కువ అవుతుంది. రీసేల్ ప్రాపర్టీలను కూడా ఎనర్జీ ఎఫీషియన్సీ ప్రమాణాలకు అనుగుణంగా మార్చవచ్చు. కానీ, ఆయా పాత గృహాలు దశాబ్ధాల క్రితం నాటి ప్రమాణాలను అనుగుణంగా నిర్మితమైనవి. వాటిని ఇప్పటి ప్రమాణాలను అనుగుణంగా మార్చాలంటే ఖర్చు ఎక్కువవుతుంది. కొత్త ఇళ్లలో గాలి, వెలుతురు బాగా వస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. -
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్, తార్నాక, సీతాఫల్మండి, చిలకలగూడ, సికింద్రాబాద్, మారేడుపల్లి, బోయిన్పల్లి, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్నగర్,జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్నగర్లో కుండపోత వర్షం కురుస్తోంది. తెలంగాణలో 9 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. రాబోయే రెండు గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.ఆదిలాబాద్, హైదరాబాద్, జనగాం, మహబూబ్నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్లొండ, రంగారెడ్డి, యాద్రాది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు మినహా అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ అయ్యింది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనీ బీరంగూడ, ఆర్సీ పురం, మియాపూర్, సెరిలింగంపల్లి, చంద్రాయణగుట్ట, హయత్నగర్, బాలాపూర్, శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.కాగా, శుక్రవారం ఏకధాటిగా నాలుగు గంటల పాటు కురిసిన వానతో నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న ప్యాట్నీ సింధీ కాలనీలో బోట్ల సాయంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంటోన్మెంట్ సిబ్బంది మోటార్ల సహాయంతో నీళ్లను తొలగిస్తున్నారు. నాలా రిటైనింగ్ వాల్ కట్టకపోవడంతోనే ఇళ్లలోకి వర్షపు నీరు చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. -
మలక్పేట్ కాల్పుల కేసు.. ఐదుగురు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మలక్పేట్ కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, గుడిసెలు వేయడంతో పాటు వ్యక్తిగత కారణాలే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. బిహార్ నుంచి తుపాకులు తెచ్చి సీపీఐ నేత చందునాయక్ను ప్రత్యర్థులు హత్య చేశారు. కాల్పులు జరిపిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేసిన పోలీసులు.. నిందితులు వాడిన గన్స్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ శివారులో నిందితులను పట్టుకున్నారు.ఈ నెల 15న హైదరాబాద్ మలక్పేట పోలీసుస్టేషన్ పరిధిలోని శాలివాహననగర్ పార్కులో వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా చందు నాయక్ దుండగుల కాల్పుల్లో చనిపోయారు. కళ్లలో కారం చల్లిన నిందితులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఆయన శరీరంలోకి మూడు తూటాలు దూసుకుపోయాయి. మూడేళ్ల క్రితం ఎల్బీనగర్ ఠాణాలో నమోదైన హత్య కేసులో చందు నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీకారం, భూ వివాదాలతోపాటు వివాహేతర సంబంధం కోణాన్ని పరిగణనలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.నాగర్ కర్నూల్ జిల్లా నర్సాయిపల్లికి చెందిన చందు.. భార్య నారీబాయి, కుమారుడు సిద్ధు, కుమార్తె సింధులతో కలిసి దిల్సుఖ్నగర్ సమీపంలోని విద్యుత్నగర్లో ఉంటున్నారు. ప్రస్తుతం సిద్ధు కెనడాలో ఎంటెక్ చదువుతుండగా.. సింధు గ్రూప్స్కు సన్నద్ధమవుతోంది. చందు విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐలో, కార్మిక నాయకుడిగా సీఐటీయూలో పని చేశారు. ఎల్బీనగర్ ఏరియా సీపీఎం నాయకుడిగా నాగోల్ శ్రీ సాయినగర్లోని స్థలాల్లో పేదలతో గుడిసెలు వేయించారు.2010లో సీపీఐలో చేరి భూపోరాటం చేసి పట్టాలు ఇప్పించారు. సీపీఐ (ఎంఎల్) నాయకుడు రాజేష్తో కొన్నాళ్లుగా చందుకు విభేదాలున్నాయి. కుంట్లూర్ రావినారాయణరెడ్డి నగర్లోని మూడెకరాల భూమిలో గుడిసెలు వేసుకున్న వారి నుంచి రాజేష్ తదితరులు డబ్బులు వసూలు చేస్తుండటాన్ని చందు అడ్డుకున్నారు. దీంతో రాజేష్ , సుధాకర్, మున్నా, రాయుడుతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. -
ఇద్దరితో సహజీవనం.. అతడితో పెళ్లి.. భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి..
సాక్షి, సిటీబ్యూరో: బంగ్లాదేశ్కు చెందిన రీతూ మోని బతుకుతెరువు కోసం అక్రమంగా నగరానికి వచ్చింది. రీతూ రావుగా మారి ఇక్కడే ఉంటూ సోషల్మీడియా ద్వారా ఎర వేసి పలువుర్ని ఆకర్షించింది. ఇద్దరితో సహజీవనం చేసిన ఆమె మరో వివాహితుడిని వివాహం చేసుకుంది. వీరిలో ఒకరి చిరునామాతో ఆధార్ కార్డు, పాన్కార్డు తీసుకుని.. మరొకరి చిరునామాతో అప్డేట్ చేయించింది. ఈమె వ్యవహారం నాటకీయంగా వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసిన నల్లకుంట పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరితో... అక్రమంగా సరిహద్దులు దాటిన రీతూరావు 2020లో హైదరాబాద్ చేరుకుంది. ఉద్యోగం కోసం వచ్చినట్లు ఇక్కడ నివసిస్తూ సోషల్మీడియా ద్వారా ఆసిఫ్నగర్కు చెందిన నరేష్ను పరిచయం చేసుకుంది. అతడితో కొన్నాళ్లు సహజీవనం చేసిన రీతూ.. ఆసిఫ్నగర్ చిరునామాతో ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకుంది. ఈ చిరునామాతోనే సిమ్కార్డులు సంగ్రహించింది. కొన్నాళ్లకు సోషల్మీడియా ద్వారా పరిచయమైన గన్ఫౌండ్రీ వాసి శంకర్రావు వద్దకు చేరింది. ఆ సందర్భంలో తన ఆధార్ కార్డును గన్ఫౌండ్రీ చిరునామాకు అప్డేట్ చేసుకుంది. ఈమె ధోరణి కారణంగా శంకర్ తరచు ఘర్షణకు దిగేవాడు. ఓ దశలో అతడిని భయపెట్టడానికి ఇంట్లోనే షాంపూ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో శంకర్ ఆమెను గుడిమల్కాపూర్లోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. దీనిపై గుడిమల్కాపూర్ ఠాణాలో కేసు నమోదైంది. ఆస్పత్రిలో వదిలి వెళ్లిపోవడంతో... నరేష్, శంకర్లతో సహజీవనం చేస్తున్న సందర్భంలోనే రీతూ నిజామాబాద్కు చెందిన ప్రవీణ్ను ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం చేసుకుంది. ఓ సందర్భంలో వీరిద్దరూ నగరంలోని ఓయో రూమ్లో గడిపారు. తాను గుడిమల్కాపూర్ ఆస్పత్రిలో ఉన్నానని, శంకర్ వదిలేసి వెళ్లిపోయాడంటూ రీతూ ప్రవీణ్కు ఫోన్ చేసింది. ఆస్పత్రికి వెళ్లిన అతడు బిల్లు చెల్లించిన ఆమెను తీసుకుని వెళ్లి విద్యానగర్లోని తన ఫ్లాట్లో ఉంచాడు. కొన్నాళ్లు సహజీవం చేసింది. అనంతరం, ఆమె ఒత్తిడి మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 15న యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడు. ఓ సందర్భంలో ఆమెకు సంబంధించిన బంగ్లాదేశీ గుర్తింపు పత్రాలను అతడు చూశాడు. నిలదీయగా రీతూ సైతం అసలు విషయం చెప్పింది. అదే సమయంలో పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో భయపడిపోయిన ప్రవీణ్ ఆమెను వదిలి నిజామాబాద్ వెళ్లిపోయాడు. భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి... తనను విడిచి వెళ్లిపోయిన ప్రవీణ్ను తన దారికి తెచ్చుకోవాలని భావించిన రీతూ అతడి భార్యకు సోషల్మీడియా ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఆమె యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రవీణ్తో అయిన పెళ్లి ఫొటోలు షేర్ చేసింది. వీటిని చూసిన ప్రవీణ్ భార్య షాక్కు గురై భర్తను నిలదీసింది. నిజం చెప్పిన అతడు ప్రస్తుతం రీతూ డబ్బు కోసం వేధిస్తోందని, బెదిరిస్తోందని వాపోయాడు. దీంతో ఇద్దరూ కలిసి వచ్చి నల్లకుంట ఠాణాలో రీతూపై ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా రీతూను పోలీసులు ఠాణాకు పిలిపించారు. ఆమె విచారణ నేపథ్యంలోనే బంగ్లాదేశీగా గుర్తించారు. న్యాయనిపుణుల సలహా మేరకు డిపోర్టేషన్ చేయాలని నిర్ణయించుకుని షెల్డర్ హోమ్కు తరలించారు. అయితే ఆమె ఆధార్, పాన్ కార్డులు పొందినట్లు తేలడంతో బుధవారం కేసు నమోదు చేశారు. రీతూతో పాటు ఆమెను వివాహం చేసుకుని వదిలేసిన ప్రవీణ్ను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నరేష్, శంకర్ కోసం గాలిస్తున్నారు.