Hyderabad
-
ఘోర ప్రమాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో వరుస లిఫ్ట్ ప్రమాదాలు భయపెడుతున్నాయి. జవహర్నగర్ డంపింగ్ యార్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డు నిర్మాణ పనుల్లో లిఫ్ట్ తెగిపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పవర్ ప్లాంట్లో చిమ్నీ అమర్చుతుండగా లిఫ్ట్ ఒక్కసారిగా కూలిపోయింది. మృతులను ఉత్తర్ప్రదేశ్కు చెందిన సురేష్ సర్కార్ (21), ప్రకాశ్ మండల్ (24), అమిత్రాయ్ (20)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గత నెల సూరారంలోని ఓ రెసిడెన్సీలో లిఫ్ట్ మీద పడటంతో అక్బర్ పాటిల్ (39) అనే ఆర్ఎంపీ వైద్యుడు మృతి చెందారు. అపార్ట్మెంట్ లిఫ్ట్ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ గుంతలోకి తలపెట్టినప్పుడు పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్ పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో నాంపల్లిలో లిఫ్ట్లో ఇరుక్కుని నరకం అనుభవించి చిన్నారి కన్నుమూసిన ఘటన తెలిసిందే. కాగా, మెహదీపట్నంలోని ఆసిఫ్నగర్ ఠాణా పరిధి సంతోష్నగర్కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్ లిఫ్ట్లో ఇరుక్కుని మరణించడం విషాదం నింపింది. -
‘కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోండి’
హైదరాబాద్: ఆపరేష్ సిందూర్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం.‘అన్ని శాఖలు పూర్తి గా సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలి. హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. రక్షణ రంగానికి చెందిన సంస్థల దగ్గర భద్రతా పరమైన చర్యలు చేపట్టాలి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలి. హైదరాబాద్ నగరంలో విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రత కల్పించాలి. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలి. కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలి’ అని సూచించారు.సైన్యానికి సంఘీభావంగా ర్యాలీభారత సైన్యానికి సంఘీభావంగా రేపు(గురువారం) సాయంత్రం ఆరు గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. దీనిపైన సైతం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు చర్చించారు. ఈ ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు సీఎం, డిప్యూటీ సీఎంలు. భారత సైన్యానికి నైతికంగా మద్దతు ఇవ్వాలని యువతకు విజ్ఞప్తి చేశారు. -
Miss World 2025: సుందరీమణులకు స్వాగతం
-
Hyderabad: ప్రపంచ సుందరీ పోటీలతో ప్రత్యేక వాతావరణం
సాక్షి, సిటీబ్యూరో: మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరం కొత్త తళులకులు అద్దుకుంటోంది. దాదాపు 120 దేశాల సుందరీమణులతో పాటు ఎందరెందరో వస్తున్న తరుణంలో నగరంలో రహదారులు మెరవాలని, రాత్రుళ్లు విద్యుత్ ధగధగలతో సిటీ మెరిసిపోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) ఆదేశించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. రోడ్లకు మరమ్మతులు, తుది మెరుగులతోపాటు డివైడర్లపై పేరుకుపోయిన దుమ్ము దులిపి రంగులు వేస్తున్నారు. లేన్ మార్కింగ్లతో పాటు కాలినడకల బాటలను రంగులతో ముస్తాబు చేస్తున్నారు.రోడ్లకిరువైపులా పచ్చదనం కనిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. విమానాశ్రయం నుంచి మొదలు పెడితే, పోటీలను నిర్వహించే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంకు వెళ్లే రహదారులను, అతిథులు బస చేసే హోటళ్ల మార్గాలను తీర్చిదిద్దుతున్నారు. ఫ్లై ఓవర్ల క్రాష్ బారియర్స్కు, జంక్షన్లు, రోడ్ల వెంబడి కెర్బ్లకు పెయింట్స్ వేస్తున్నారు. రాత్రుళ్లు ప్రత్యేకంగా కనిపించేందుకు వివిధ రకాల విద్యుల్లతలతో ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ జంక్షన్లు, పోటీదారులు సందర్శించే ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లోనూ ప్రత్యేక అలంకరణలు (Special Decoration) చేస్తున్నారు. 50 మార్గాల్లో పనులు గ్రేటర్లోని దాదాపు 50 మార్గాలు ఈ పనులతో ప్రత్యేకంగా కనిపించనున్నాయి. సాధారణ రోజుల్లో జరగని పనులు ఈ సందర్భంగానైనా జరుగుతుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇవాంకా ట్రంప్ నగరానికి వచ్చిన సందర్భంగా పలు రోడ్లు అద్దాల్లా మారడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చార్మినార్, లాడ్బజార్, ఫలక్నుమా ప్యాలెస్, మదీనా, సిటీ కాలేజీ, నయాపూల్, ఆరాంఘర్, మాసాబ్ట్యాంక్, గన్పార్క్, రేతిబౌలి జంక్షన్, ఐమ్యాక్స్ సర్కిల్, నెక్లెస్ రోడ్, సెక్రటేరియట్, ట్యాంక్బండ్, తాజ్కృష్ణ, నాగార్జున సర్కిల్, కేబుల్ బ్రిడ్జి, ఓయూ కాలనీ క్రాస్రోడ్స్, ఐకియా జంక్షన్, టీహబ్, హైటెక్ సిటీ జంక్షన్, శిల్పారామం, బయో డైవర్సిటీ జంక్షన్, ఏఐజీ హాస్పిటల్ తదితర ప్రాంతాలు కొత్త అందాలు సంతరించుకోనున్నాయి. స్పెషల్ డెకరేటివ్ లైటింగ్లో భాగంగా ఎల్ఈడీ పవర్ క్యాన్స్, స్ట్రిప్లైట్స్, సిరీస్ లైట్స్ తదితరమైనవి ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో 300 మీటర్ల మేర ప్రత్యేక లాంతర్లతో స్ట్రీట్ లైటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్ల ఆర్చ్లు ఏర్పాటు, ఎల్ఈడీలతో క్రౌన్, ‘ఫెయిరీ క్వీన్’ తదితరమైనవి ఏర్పాటు చేయనున్నారు.చదవండి: నాటి బికినీల పోటీ.. మిస్ వరల్డ్! చెత్తా చెదారం.. దోమలు లేకుండా చెత్త కనిపించకుండా వీధులు శుభ్రం చేసే కార్యక్రమాలు పెంచుతున్నారు. దోమలు లేకుండా నిల్వ నీరు లేకుండా చూడటంతో పాటు యాంటీలార్వా ఆపరేషన్లు, ఫాగింగ్ ముమ్మరం చేశారు. రాత్రివేళ దోమలు కుట్టకుండా ప్రత్యేకంగా రెపెల్లెంట్ క్యాండిల్స్ తెప్పిస్తున్నారు. చార్మినార్– చౌమహల్లా ప్యా లెస్ మార్గంలో హెరిటేజ్ వాక్కు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. -
హైదరాబాద్ లో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్
-
బ్యూటీ విత్ పర్పస్..
నగర వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల గురించి విధితమే. అయితే ప్రతి అంశానికి, కార్యక్రమానికి విధిగా నియమావళి ఉన్నట్లే మిస్ వరల్డ్ పోటీలకు సైతం నియమాలు, అర్హతలు, తదితర అంతర్జాతీయ అంశాలు ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఈ పోటీలకు సంబంధించిన నియమాలు, పోటీల్లో పాల్గొనే వారి అర్హతలు తదితర అంశాల గురించి ఆరా తీస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాల కోసం గూగుల్ను సైతం ఆశ్రయిస్తున్నారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన నియమావళి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక అందగత్తెల పోటీగా మిస్ వరల్డ్ పరిచయమైంది. మిస్ వరల్డ్ పోటీ అనేది కేవలం అందాన్ని ఆరాధించడమే కాక, వ్యక్తిత్వం, సామాజిక బాధ్యతలు, సామాజిక చైతన్యాన్ని కూడా ప్రోత్సహించే గొప్ప వేదిక. ఇది ప్రతి మహిళకూ తన ప్రతిభను ప్రపంచానికి చూపించేందుకు ఒక గొప్ప అవకాశం కలి్పస్తుంది. 1951లో ప్రారంభమైన ఈ పోటీ ద్వారా.. ప్రతి యేటా వివిధ దేశాల మహిళలు తమ అందం, ప్రతిభ, సామాజిక బాధ్యత, వ్యక్తిత్వం ఆధారంగా ప్రపంచానికి పరిచయమవుతారు. మిస్ వరల్డ్ పోటీని నిర్వహించే ప్రతిపాదనలు, నియమాలు, అర్హతలు, అంతర్జాతీయ అంశాలు విస్తృతంగా ఉంటాయి. నియమాలు, నిబంధనలు.. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉంటాయి. మొత్తం 140కు పైగా దేశాలు ఈ పోటీలో ప్రతినిధులను పంపిస్తాయి. ఇందులో ప్రతి దేశం తమ దేశంలో ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది, విజేతలు ఎంట్రీ పాసులు పొందుతారు. పోటీలో పాల్గొనడానికి మహిళలు వారి వయసు కనీసం 18 సంవత్సరాలు పూర్తయ్యి ఉండాలి. గరిష్ట వయస్సు 26 సంవత్సరాలు, అంటే 27వ సంవత్సరంలోకి ప్రవేశించే వారు పోటీలో పాల్గొనలేరు.ఇవే అర్హతలు.. జాతీయత : ప్రతి దేశం తన తరపున ఒక్క మహిళను పంపిస్తుంది. ఆ మహిళ ఆ దేశం సిటిజన్గా ఉండాలి. భాష : అభ్యర్థులు ఆంగ్ల భాషలో మాట్లాడగలిగితే అది వారి పోటీ కోసం అనుకూలంగా ఉంటాయి. విద్య, సామాజిక బాధ్యత : మహిళలకు సాధారణంగా మంచి విద్య ఉండాలి. అలాగే వారి సామాజిక బాధ్యతలు, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ముఖ్యం.అంతర్జాతీయ అంశాలు.. మిస్ వరల్డ్ పోటీ కేవలం అందం మాత్రమే కాక, సామాజిక, సాంస్కృతిక, శక్తివంతమైన అంశాలపై దృష్టి సారిస్తుంది. ప్రతి ఏడాది పోటీ ‘బ్యూటీ విత్ పర్పస్’ అనే థీమ్ ఆధారంగా నిర్వహించబడుతుంది. ఇందులో అభ్యర్థులు ప్రపంచవ్యాప్తంగా తమ కమ్యూనిటీలకు సహాయం చేసే విధంగా వనరులను ఉపయోగిస్తారు. వాటిలో విద్య, ఆరోగ్యం, మహిళల హక్కులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు ముఖ్యంగా ఉంటాయి.ప్రత్యేక అంశాలు.. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడం స్నేహపూర్వక పోటీ మాత్రమే కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా పరిచయమవ్వడానికి కూడా ఒక మార్గం. అభ్యర్థులు వివిధ ప్రదర్శనల్లో పాల్గొని, ప్రపంచంలోని వివిధ సాంస్కృతిక నేపథ్యాలను అంగీకరిస్తారు. ఇదే కాకుండా, వారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని, సాంకేతికంగా కూడా సమాజానికి అవసరమైన మార్పు తీసుకురావడంలో శక్తిమంతంగా వ్యవహరిస్తారు. -
మిస్ వరల్డ్ పోటీల విలేకరుల సమావేశంలో నందినీ గుప్తా, సోనూసూద్ (ఫొటోలు)
-
పోటీపడ్డ 138 దేశాలు.. CP సీవీ ఆనంద్కే అవార్డు
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ పోలీస్ విభాగాల్ని వెనక్కి నెట్టి మరీ అంతర్జాతీయ అవార్డు దక్కించుకున్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించిన సీవీ ఆనంద్.. ఎక్స్ లెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. దుబాయ్ జరుగుతున్న అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్ లో భాగంగా ఈ అవార్డుకు సీవీ ఆనంద్ ఎంపికయ్యారు. ఈ అవార్డు కోసం 138 దేశాలు పోటీపడగా, సీవీ ఆనంద్ కే ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును మే 15వ తేదీ న దుబాయ్ లో సీపీ సీవీ ఆనంద్ అందుకోనున్నారు. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ఈడీ, ఎన్ సీఆర్బీ, డీఆర్ఐ, ఎక్స్ సైజ్, ఆర్ఆర్ఓ, డ్రగ్స్ కంట్రోల్ విభాగాలతో సమన్వయం చేస్తున్న చర్యలను సీపీ సీవీ ఆనంద్ ఆన్ లైన్ వేదికగా వివరించారు.మత్తుకు బానిసలైన వారిని మార్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. దీని అవగాహన కోసం చేపడుతున్న చర్యలను సైతం వివరించారు. దానికి సంబంధించి ఫలితాలను కూడా అంతర్జాతీయ వేదిక ముందుపెట్టారు. వీటన్నింటిని పరిశీలించిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ ప్రతినిధులు ఎక్స్ లెన్స్ ఇన్ యాంటీ నారకోటిక్స్ అవార్డుకు సీవీ ఆనంద్ ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. -
TG: ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ చర్చలు సఫలం
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రేపు(మే7వ తేదీ, బుధవారం) ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఈ మేరకు జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ.. తమ సమ్మెను వాయిదా వేసుకుంది. సమ్మెను వాయిదా మాత్రమే వేస్తున్నాం -సమ్మెను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్ లో సమ్మె చేయక తప్పదని హెచ్చరించింది. సమ్మెను తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేస్తున్నామని, ఆర్టీసీ కార్మికులంతా సమన్వయంగా ఉండాలని, మరోసారి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలనిర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు.‘రవాణా శాఖ మంత్రి తో చర్చలు జరిపాం..Rtc యూనియన్ ల పై ఆంక్షలను ఎట్టివేస్తామని హామీ ఇచ్చారు. Rtc లోఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం అన్నారు. ఉద్యోగం భద్రతపై సర్కులర్ విడుదల చేస్తామన్నారు. విద్యుత్ బస్సులు కేంద్రం నుంచి రాయితీ లో కొని rtc కీ ఇప్పిస్తామన్నారు. కారుణ్య నియామకాలను రెగ్యులర్ ప్రాటిపథకన చేస్తామన్నారు.. Rtc ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం విషయంలో సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం,మంత్రిమీద నమ్మకం తో సమ్మెని తాత్కాలిక వాయిదా వేసుకుంటున్నాం. సమస్యలు పరిష్కరించకపొతే మళ్ళీ సమ్మెలోకి వెళ్తాం’ అని అన్నారు.తమ హామీలపై స్పష్టత రాకపోతే తాము మే 6వ తేదీ అర్థరాత్రి నుంచే సమ్మెకు దిగుతామని గత నెల ఆరంభంలోనే ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ నేతలు ఇటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు, అటు లేబర్ కమిషనర్కు సమ్మె నోటీస్ అందజేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. ఈరోజు(మే 6వ తేదీ, మంగళవారం) వారిని చర్చలకు పిలిచింది.ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ ఏర్పాటుఒకవైపు ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లిన సందర్బంలోనే తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై కమిటీ ఏర్పాటు చేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం ఓ కమిటీని సర్కార్ చేసింది. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లతో కమిటీ ఏర్పాటు చేశారు. అధికారుల కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ లు ఉన్నారు. ఉద్యోగులతో వారి సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ఈ అధికారుల కమిటీ విధి. -
ఓబులాపురం మైనింగ్ కేసులో ఏడుగురికి శిక్ష ఖరారు
సాక్షి,హైదరాబాద్: అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఏడుగురికి శిక్ష ఖరారు చేసింది. ఇద్దరికి శిక్ష విధించింది. ఇదే కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఐఏఎస్ కృపానందంలకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వచ్చిన ఓబుళాపురం మైనింగ్ కేసులో మంగళవారం సీబీఐ తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఇద్దరిని నిర్ధోషులుగా ప్రకటించింది. ఏ1 బీవీ శ్రీనివాస రెడ్డి, ఏ2: గాలి జనార్ధన్ రెడ్డి, ఏ3 వీడీ రాజగోపాల్, ఏ4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, A7 అలీ ఖాన్కు సీబీఐ కోర్టు శిక్ష విధించింది. ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 409, 468, 471లతోపాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (2) రెడ్ విత్ 13 (1)(డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇక ఈ కేసులో విచారణ సాగుతున్న సమయంలోనే A5రావు లింగారెడ్డి మృతి చెందారు. ఏ6 మాజీ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేసింది. కేసులో గాలి సోదరుడు, బీవీ శ్రీనివాస్ రెడ్డికి ఏడేళ్లు శిక్ష విధించింది. -
చిన్నలోపం కూడా ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీలను చిన్నపాటి లోటుపాట్లు కూడా లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మే 10 నుంచి 31 వరకు జరిగే ప్రపంచస్థాయి పోటీల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ఉపకరించే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. పోటీదారులతోపాటు దేశ, విదేశాల నుంచి ఈవెంట్ కవరేజీకి దాదాపు 3 వేల మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.వివిధ దేశాల నుంచి పోటీలకు వచ్చే వారిని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతించాలన్నారు. మిస్వరల్డ్– 2025 ఏర్పాట్లపై సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్షించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, డీజీపీ జితేందర్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ జి.సుదీర్బాబు, ఏడీజీపీ స్టీఫెన్ రవీంద్రతోపాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.పోటీల్లో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ఒక నోడల్ ఆఫీసర్ ఉండాలని సీఎం సూచించారు. మే 10వ తేదీన సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్డేడియంలో జరిగే ప్రారంబోత్సవం నుంచి... 31వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలే వరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. చార్మినార్, లాడ్బజార్, సచివాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు, భద్రత కల్పించాలన్నారు. అనుకోని అవాంతరాలు ఎదురైతే.. అనుకోని అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా, వాటిని అధిగమించే ప్రత్యామ్నాయ ప్రణాళికలను అధికారులు రూపొందించుకోవాలని ఆదేశించారు. మహిళా సాధికారతను చాటిచెప్పేలా రాష్ట్రంలో ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ సందర్శనతోపాటు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. విదేశీ అతిథులు బస చేసే హోటళ్లతోపాటు గచ్చిబౌలి స్టేడియం, చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, సచివాలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతోపాటు వివిధ రంగాల్లో ప్రముఖులను ప్రభుత్వం తరఫున ప్రారంబోత్సవానికి ఆహ్వనించాలని సూచించారు. -
అందం.. సామాజిక బంధం
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడనున్న సుందరీమణులు సౌందర్యోపాసనకే పరిమితం కావడంలేదు. భావి ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తున్నారు. వారిలో ఎందరో వైద్యులు, దౌత్యవేత్తలు, డిజైనర్లు, పైలట్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఎంచుకున్న రంగంలో బిజీగా ఉంటూనే మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ కోసం హైదరాబాద్ వస్తున్న 110 దేశాల సుందరీమణులు వృత్తి–ప్రవృత్తి పరంగా భిన్న రంగాల్లో ప్రావీణ్యం సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. సమాజానికి మంచి చేసేందుకు.. ⇒ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ ఇండియా నందినీ గుప్తా బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ చదువుతోంది. రాజస్తాన్లోని కోటా నగరానికి చెందిన ఆమె 2023లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. భవిష్యత్తు వాణిజ్య సామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఉండాలని తపిస్తూనే ‘ప్రాజెక్ట్ ఏకతా‘ద్వారా వికలాంగులకు మంచి జీవితం అందించేందుకు కృషి చేస్తోంది. ⇒ మిస్ నమీబియా సెల్మా కమన్య ఓ ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త. నమీబియాలో మెరుగైన సమాజాన్ని ఆవిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తోంది. ⇒ టర్కీ సుందరీమణి ఇడిల్ బిల్జెన్, ఉక్రెయిన్లో యుద్ధ బాధితులకు చికిత్స చేస్తూ సామాజిక సేవారంగంలో ముందుకు సాగుతున్నారు. ⇒ ఫ్రాన్స్ సుందరి అగాథే కాయెట్, నార్తర్న్ ఐర్లాండ్కు చెందిన హన్నా జాన్సన్, గయానాకు చెందిన జలికా సామ్యూల్స్ వైద్యులకు అండగా ఆసుపత్రుల్లో రోగులకు సేవలందిస్తున్నారు. ⇒ నేపాల్ భామ స్రీచ్చా ప్రధాన్ పర్యావరణం మెరుగుపరిచేందుకు పనిచేస్తోంది. ⇒ కిర్గిజ్స్తాన్కు చెందిన ఐజాన్ చనచేవా, సెర్బియా సుందరి అలెగ్జాండ్రా రుటోవిక్ హోటల్ మేనేజర్లుగా పనిచేస్తున్నారు. ⇒ మిస్ కొలంబియా కాటలినా క్వింటెరో వ్యాపారంపై దృష్టి పెట్టింది. ⇒ అంగోలాకు చెందిన నూరియా అస్సిస్, వ్యాపారం, మార్కెటింగ్లో డిగ్రీలు కలిగిన పాప్ స్టార్ గాయని. బీట్లను బోర్డ్ రూమ్లతో మిళితం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ⇒ ఫిన్లాండ్ నుంచి పోటీలో నిలిచిన సోఫియా సింగ్ పీఆర్, మార్కెటింగ్ నిపుణురాలు. ⇒ మిస్ హంగరీ ఆండ్రియా కాట్జెన్బాచ్ మార్కెటింగ్ క్యాంపెయిన్లను నైపుణ్యంతో సమన్వయం చేçస్తున్నారు. ⇒ గ్రీస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్టెల్లా మిచైలిడౌ, హైతీకి చెందిన క్రిస్టీ గురాండ్, మిస్ వియత్నాం హుయిన్ ట్రాన్యినీ భవిష్యత్తులో గొప్ప వ్యాపార సంస్థలకు సీఈఓలు అయ్యేందుకు బాటలు వేసుకుంటున్నారు. ⇒ దక్షిణాఫ్రికాకు చెందిన జోలైజ్ జాన్సెన్ వాన్ రెసబర్గ్ కేవలం 18 ఏళ్ల వయసులోనే డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ప్రొఫెషనల్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ⇒ థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాట, గ్లోబల్ అఫైర్స్ గ్రాడ్యుయేట్. ఆగ్నేయాసియా దేశాల మధ్య సంబంధాలపై అధ్యయనం చేస్తున్నారు. ⇒ మిస్ శ్రీలంక అనుది గుణసేకర, మిస్ కొరియా మిన్ జంగ్, పనామాకు చెందిన కరోల్ రోడ్రిగెజ్లు కూడా అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై అధ్యయనంలో బిజీగా ఉన్నారు. ⇒ కేమన్ ఐలాండ్స్కు చెందిన జాడా రమూన్ తన స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్తో కలిసి పనిచేçస్తున్నారు. ⇒ గ్వాడెలూప్నకు చెందిన నోమీ మిల్నే వైద్యురాలిగా రాణిస్తూనే రచయిత్రిగా కూడా ప్రతిభ చాటుకుంటున్నారు. ⇒ వేల్స్కు చెందిన మిల్లీ–మే ఆడమ్స్, బోస్నియాకు చెందిన ఎనా అడ్రోవిక్ వైద్యవిద్య అభ్యసిస్తున్నారు. ⇒ ప్యూర్టోరికోకు చెందిన వలేరియా పెరెజ్ మెడికల్ టెక్నాలజీలో మాస్టర్స్ గ్రాడ్యుయేట్. ⇒ బెల్జియంకు చెందిన కరెన్ జాన్సెన్, గ్వాటెమాలా నుంచి పోటీపడుతున్న జైమీ ఎస్కోబెడో, లెబనాన్కు చెందిన నాదా కౌస్సా, మలేసియాకు చెందిన సరూప్ రోషి, పోలాండ్కు చెందిన మాజా క్లాజ్డాలు మానసిక వైద్యులుగా ఎదిగేందుకు కసరత్తు చేస్తున్నారు. ⇒ ఇంగ్లాండ్కు చెందిన మిల్లా మాగీ లైఫ్గార్డ్, సీపీఆర్ ప్రచారకర్త. ⇒ బ్రెజిల్కు చెందిన జెస్సికా పెడ్రోసో, అర్జెంటీనాకు చెందిన గ్వాడలూపే అలోమర్, ఆ్రస్టేలియా ప్రతినిధి జాస్మిన్ స్ట్రింగర్లు ఉపాధ్యాయ వృత్తిలో ముందుకు సాగుతున్నారు. ⇒ మెక్సికో భామ మేరిలీ లీల్ విద్యా కార్యక్రమాలను నడుపుతున్నారు. ⇒ చిలీకి చెందిన ఫ్రాన్సిస్కా లవాండెరో కమర్షియల్ పైలట్గా రాణిస్తుండగా సొమాలియాకు చెందిన జైనబ్ జమా ఏవియేషన్ అధ్యయనంలో ఉన్నారు. ⇒ అర్మేనియా సుందరి అడ్రిన్ అట్షెమ్యాన్ అర్మేనియా టీవీలో ప్రసారమయ్యే అత్యధిక రేటింగ్ టీవీ సిరీస్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి. ⇒ అమెరికా తరఫున పోటీలో ఉన్న అథెన్నా క్రాస్బీ టీవీ తెరను ఏలుతోంది. ⇒ డొమినికన్ రిపబ్లిక్కు చెందిన మైరా డెల్గాడో స్వదేశంతోపాటు అమెరికా, ఇత ర లాటిన్ అమెరికన్ దేశాల్లో యూనివిజన్ కోసం రిపోర్టర్గా పనిచేస్తోంది. ⇒ ఎస్టోనియాకు చెందిన ఎలీస్ రాండ్మా సాఫ్ట్వేర్ డెవలపర్గా ఎదుగుతోంది. -
Miss World 2025: కాస్ట్లీ కాంటెస్ట్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు జరగనున్న ప్రపంచ సుందరి అందాల పోటీల మొత్తం విలువ రూ.700 కోట్లపైనే ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా వాణిజ్య, వ్యాపార, ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాల ద్వారా మిస్ వరల్డ్ నిర్వహణ సంస్థకు రూ. 400–500 కోట్ల మేర ఆదాయం వస్తుందనేది అనధికార అంచనా. పోటీల నిర్వహణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం భరిస్తున్నప్పటికీ స్పాన్సర్షిప్ ఆదాయంలో మాత్రం 90 శాతానికిపైగా ఆదాయం మిస్ వరల్డ్ సంస్థకే చెందనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్లు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు రూ. 57 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ లిమిటెడ్ చెరి సగం చొప్పున భరిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడకుండా స్పాన్సర్షిప్స్ ద్వారా ఆ మొత్తాన్ని రికవరీ చేసుకుంటామని.. కేవలం రూ. 2 కోట్ల వరకే ఖజానాపై భారం పడుతుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో పేర్కొన్నారు. ఈ లెక్కన స్పాన్సర్షిప్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్ల మేర సమకూరుతోందన్నది దాని సారాంశం. ప్రసార హక్కులు, టికెట్ల విక్రయాలతోనూ.. మిస్ వరల్డ్ అందాల పోటీలను 150కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వాటి ప్రసార హక్కుల కోసం పలు చానళ్లు ఇప్పటికే మిస్ వరల్డ్ సంస్థతో ఒప్పందం చేసుకోవడంతో ఈ రూపంలోనూ ఆ సంస్థకు భారీ మొత్తం సమకూరనుంది. అలాగే పోటీలను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఉండే టికెట్ల (హైదరాబాద్ పోటీల విషయంలో ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు) విక్రయాల రూపంలో సైతం ఆ సంస్థకు ఆదాయం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఉండే ఒప్పందం మేరకు ఇందులో వాటా ఇస్తుంది. డిజిటల్, సోషల్ మీడియా హక్కులు ప్రధాన మీడియా చానళ్లలోనే కాకుండా కొన్ని డిజిటల్, సోషల్ మీడియా చానళ్లలోనూ మిస్ వరల్డ్ పోటీల ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. అలాంటి సంస్థలకు కూడా హక్కులు విక్రయించడం ద్వారా మిస్ వరల్డ్ సంస్థ ఆదాయం పొందనుంది. యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్లో వాణిజ్య ప్రకటనల ప్రసారం ద్వారా కూడా ఆదాయంలో మిస్ వరల్డ్ సంస్థ వాటా పొందుతున్నట్లు సమాచారం. ఆదాయ వివరాల్లో గోప్యత.. ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు సంబంధించిన ఖర్చు వివరాలు మాత్రమే వెల్లడవుతుండగా ఆదాయ వివరాలను మాత్రం మిస్ వరల్డ్ సంస్థ గోప్యంగా ఉంచుతోంది. ఇతర అంతర్జాతీయ కార్యక్రమాలు, క్రీడా పోటీల ద్వారా స్పాన్సర్షిప్స్ ఆదాయంపై కొంత స్పష్టత ఉంటున్నా అందాల పోటీల విషయంలో మాత్రం సంపూర్ణ గోప్యతే కొనసాగుతోంది. పోటీల నిర్వహణకు అయ్యే ఖర్చుతో పోలిస్తే 10 నుంచి 15 రెట్ల ఆదాయం ఉంటుందని తెలుస్తోంది. భారత్లోనే ఖర్చు తక్కువ.. 2023లో మిస్ వరల్డ్ పోటీలకు తొలుత యూఏఈని ఎంపిక చేశారు. ఆ సమయంలో పోటీల నిర్వహణ బడ్జెట్ను రూ. 250 కోట్లుగా అంచనా వేశారు. కానీ అనివార్య కారణాలతో పోటీలు ముంబైకి మారాయి. ముంబైలో పోటీలకు చేసిన ఖర్చు, యూఏఈ అంచనాలో కేవలం 35 శాతంగా ఉన్నట్లు సమాచారం. రూ. 100 కోట్లలోపు ఖర్చుతోనే పోటీలను ముగించారు. ఇప్పుడు హైదరాబాద్లో అంతకంటే తక్కువ మొత్తాన్నే ఖర్చు చేస్తున్నారు. అయితే నగర సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు దీనికి అదనం. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అయితే స్పాన్సర్షిప్స్, ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మిస్ వరల్డ్ సంస్థ చెల్లించనుందని సమాచారం. కానీ ఇందులో స్పష్టత లేదు.విజేతకు వజ్రాల కిరీటం..ప్రపంచ సుందరి విజేతకు వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ధరింపచేస్తారు. గతేడాది ముంబైలోజరిగిన పోటీల్లో విజేతగా నిలిచిన చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టీనా పిజ్కోవాకు అందించిన కిరీటం విలువ రూ. 6.21 కోట్లని తెలుస్తోంది. ఈసారి విజేతకు ప్రైజ్మనీగా రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్ల మొత్తాన్ని చెల్లించనున్నట్లు సమాచారం. -
SRH vs DC Photos : ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అభిమానులతో సందడిగా ఉప్పల్ స్టేడియం.. తారల సందడి (ఫొటోలు)
-
ఉరుములు, మెరుపులతో హైదరాబాద్లో భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలుచోట్ల భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , పంజాగుట్టలో కుండపోత వర్షం కురిసింది. ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం ఎండలు మండిపోగా, సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. ఉరుములు, మెరుపులతో హైదరాబాద్లో భారీ వర్షంఅనంతరం రాత్రి 9 గంటల ప్రాంతంలో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం రాకతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది. ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. Raining in Nampally #HyderabadRains pic.twitter.com/Np4eJ5jUlN— Weatherman Karthikk (@telangana_rains) May 5, 2025 #Hyderabadrains Now scattered intense thunder storm rains for going in Hyderabad City not good news for #SRHvsDC Hope after 10:30 rain reduce chance high let's see ⛈️⚠️ pic.twitter.com/I6KNqEDfYK— Telangana state Weatherman (@tharun25_t) May 5, 2025 Lighting caught on camera in Tolichowki SHAIKPET Manikonda Golconda areas#tolichowki#manikonda#Hyderabad #hyderabadrains@balaji25_t @Hyderabadrains pic.twitter.com/jOWHSnLLSH— TajKeProperties (@Mawt777) May 5, 2025 -
earthquake: తెలంగాణలో పలు చోట్ల భూకంపం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో సోమవారం సాయంత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూమి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొడిమ్యాలలో ఆరు సెకన్లపాటు.. పెద్దపల్లి నియోజకవర్గంలో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. అటు నిర్మల్ జిల్లాలోనూ భూప్రకంపనలు సృష్టించాయి. ఖానాపూర్, కడెం, జన్నారం, లక్సెట్టిపేటలో ప్రకంపనలు ప్రజల్ని ఆందోళనకు గురి చేశాయి. భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు.మరోవైపు, మేడిపల్లి మండలంలో భూ ప్రకంపనలతో పల్లె అర్జున్ అనే రైతు ఇల్లు కూలింది. ఇల్లు కూలే సమయంలో ఇంట్లో ఉన్న అర్జున్ కుటుంబ సభ్యులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. -
ఎవరిమీద మీ సమరం?.. ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమరం అంటున్నారు.. ఎవరిమీద?. ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదు. ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులే. మీకు జీతాలు ఇస్తున్న ప్రజలే మాకు ఉద్యోగాలిస్తున్నారు. మీరు ప్రకటించిన సమరం 97 శాతం ప్రజల మీదనా. సమరం కాదు.. సమయ స్పూర్తి కావాలి. ఏవైనా సమస్యలు ఉంటే చర్చకు రండి.. చర్చిందాం. రాజకీయ నాయకుల్లో ఉద్యోగులు పావుగా మారొద్దు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వ సంఘాలకు లేదా? అని ప్రశ్నించారు.కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదు. అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు.. కానీ ఎక్కడా అప్పు పుట్టడం లేదు.స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారం.ఉద్యోగ సంఘాల నాయకుల్లారా.. రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం.. కుటుంబ పరువును బజారున పడేయొద్దు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నది.. నన్ను కోసినా… వచ్చిన ఆదాయానికి మించి నేను ఏం చేయలేను. ఉద్యోగ సంఘాల నాయకుల్లారా ఇప్పుడు కావాల్సింది సమరం కాదు… సమయస్ఫూర్తి, సంయమనం.మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా… తెలంగాణను మళ్లీ కోతుల గుంపుకు అప్పగించొద్దు. నాతో కలిసి రండి.. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళదాం. ఇక సమరమే అని ఉద్యోగ సంఘాలు ప్రకటిస్తున్నాయి. మీ సమరం తెలంగాణ ప్రజలపైనా? ఎందుకు మీ సమరం… గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా?.ప్రతీ నెలా ఏడు వేల కోట్లు ప్రతీ నెలా కట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానిది. గత పాలకులు 8500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారు. కొన్ని రాజకీయ పార్టీలు మాపై ఆరోపణలు చేస్తున్నాయి.. అవన్నీ వాళ్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్లిన బకాయిలే. కేవలం పదహారు నెలల్లో మేం 30 వేల కోట్ల నగదు రైతుల ఖాతాలకు బదిలీ చేశాం.ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టి వెళ్లారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికిబకాయి పెట్టి వెళ్లారు. ప్రాజెక్టులు కట్టామని చెప్పి .. కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టారు. 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారు.. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా?. ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదు… మనమంతా కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు.. సేవకులం.ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరం అని అంటున్నారు. ఎవరిపై సమరం… ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. -
Walkers Troubles నడక..నరకమే..!
చార్మినార్: అసలే ఇరుకు రోడ్లు..ఆపై ఉన్న కొద్దిపాటి ఫుట్పాత్లు సైతం యథేచ్ఛగా ఆక్రమణలకు గురికావడంతో పాతబస్తీలో పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికితోడు కొందరు షోరూం యజమానులు షాపుల ముందున్న ఫుట్పాత్లు తమ సొంతమన్నట్లు వ్యవహరిస్తున్నారు. వీరికి స్థానిక లోకల్ లీడర్లు, కొంతమంది ప్రభుత్వ విభాగాల సిబ్బంది, అధికారుల అండడండలు తోడవ్వడంతో ప్రశ్నించే వారే కరువయ్యారు. ఇప్పటికే చార్మినార్ పెడస్ట్రీయన్ ప్రాజెక్ట్ (సీపీపీ–చార్మినార్ కాలిబాట పథకం) పనులు చేపట్టి ఏళ్లు గడుస్తున్నా..ఇంకా పుట్పాత్లు అందుబాటులోకి రాలేదు. కొంతమంది సొంతంగా ఫుట్పాత్లపై వ్యాపారాలు కొనసాగిస్తుండగా..మరికొంత మంది షాపుల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు రోజు, వారం, నెలకు ఇంత...అంటూ అద్దెకు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశించినా.. ఫుట్పాత్ కబ్జాలు తొలగించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో నగరంలో వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం.. పాతబస్తీలో మాత్రం పట్టించుకోవడం లేదు. పర్యాటక కేంద్రమైన చార్మినార్, మక్కా మసీదు, లాడ్బజార్ తదితర ప్రదేశాలను సందర్శించేందుకు నిత్యం పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాతబస్తీకి వస్తుంటారు. దీంతో ఇక్కడి రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారతాయి. అయితే ఫుట్పాత్లు లేకపోవడంతో వాహనాల మధ్య నుంచే రోడ్లపై బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోందని పాదాచారులు వాపోతున్నారు. రోడ్లుసైతం ఆక్రమణ.. పాతబస్తీలోఫుట్పాతులే కాదు..కొందరు రోడ్లను సైతం ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. దీంతో పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల చారి్మనార్ ట్రాఫిక్ పోలీసులు పత్తర్గట్టి నుంచి మదీనా వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. స్థానిక చిరువ్యాపారులు, షోరూం నిర్వాహకులు తమకు సహకరించడం లేదని దక్షిణ మండలం ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. సమన్వయంతో పని చేస్తే.. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయంతో పని చేస్తేనే ఆశించిన ఫలితాలుంటాయి. అక్రమంగా అద్దెలు వసూలు చేస్తున్న వారిని కట్టడి చేయాలి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఫుట్పాత్ కబ్జాలు పూర్తిస్థాయిలో తొలగించాలి. చార్మినార్–మదీనా రోడ్డులో ఫుట్పాత్పై వ్యాపారాలు, ఆక్రమణలను నియంత్రించాలి. రోడ్లపైనే నిల్చుని అమ్మకాలు చేస్తున్న వారిని క్రమపద్ధతిలో అనుమతించాలి. అలాగే ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చోట సిబ్బంది సంఖ్యని పెంచడంతో పాటు ఇరుకు చోట్ల రోడ్ల విస్తరణ చేపట్టాలి. -
మిస్ వరల్డ్తో మోక్షం.!
బంజారాహిల్స్: ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ సిటీ ముస్తాబవుతోంది. మే 7 నుంచి 31 వరకు హైటెక్స్లో జరిగే పోటీల కోసం సుందరాంగులు నగరానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరాన్ని సుందరీకరించే దిశలో వివిధ శాఖలు సమన్వయంతో ముందుకుసాగుతున్నాయి. ముఖ్యంగా అందగత్తెలు రాకపోకలు సాగించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన ట్రాన్స్ఫార్మర్లు, వేలాడుతున్న వైర్లు, తుప్పుబట్టిన కరెంటు స్తంభాల తొలగింపు, మరమ్మతులు చేస్తోంది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సబ్స్టేషన్ల పరిధిలో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు, లైన్మెన్లు, సిబ్బంది ఆదివారం మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. బంజారాహిల్స్ రోడ్డు నం.12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఈనెల 18న సుందరాంగులు రానున్న నేపథ్యంలో ఈ రోడ్డులో శిథిలావస్థకు చేరిన 12 ట్రాన్స్ఫార్మర్లను మార్చారు. తుప్పుబట్టిన కరెంటు స్తంభాల స్థానంలో కొత్తవి వేశారు. వేలాడుతున్న కేబుల్ వైర్లను సరిజేశారు. ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేస్తున్న సుందరాంగులు తమ షెడ్యూల్లో భాగంగా వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు. అలాగే పోటీలు జరిగే హైటెక్స్కు కూడా ఈ ప్రాంతాల నుంచే వెళ్తారు. ఇక్కడ ఉన్న స్టార్ హోటళ్లలోనే వారంతా బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. దీంతో టీజీఎస్పీడీసీఎల్ అధికారులు గత వారం రోజులుగా సుందరాంగులు రాకపోకలు సాగించే, పర్యటించే ప్రాంతాలను సర్వే చేశారు. రోడ్డు మార్గంలో వెళ్లే క్రమంలో ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్లు శిథిలావస్థకు చేరాయో వాటిని గుర్తించారు. ఓవైపు ఒరిగిన ట్రాన్స్ఫార్మర్ల జాబితాను తయారు చేశారు. దీని ఆధారంగానే ఆదివారం నుంచి మరమ్మతులు చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. టీజీఎస్పీడీసీఎల్ ఫిలింనగర్ సబ్స్టేషన్ ఏఈ పవిత్ర పర్యవేక్షణలో 30 మంది సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. దాదాపు అన్ని సబ్స్టేషన్ల పరిధిలోనూ పనులు చేస్తున్నారు. ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలు -
ప్రాణాలు తీసిన పెంపుడు కుక్క
-
KPHBలో గోకులం సిగ్నేచర్ జ్యువెలర్స్ ను ప్రారంభించిన కాజల్ అగర్వాల్
-
అల్వాల్ లో వృద్ధ దంపతుల అనుమానాస్పద మృతి
-
ఉప్పల్లో జోరుగా SRH, DC ప్లేయర్ల ప్రాక్టీస్.. పరుగుల సునామీ ఖాయం (ఫొటోలు)
-
బాలుడిపై లైంగిక దాడి కేసులో యువతి రిమాండ్
బంజారాహిల్స్(హైదరాబాద్): ఆ బాలుడికి 16 ఏళ్లు. అతడి తల్లిదండ్రులు జూబ్లీహిల్స్లోని ఓ బడా పారిశ్రామికవేత్త ఇంట్లో పని చేస్తూ అక్కడే ఉన్న సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటున్నారు. సదరు బాలుడు పదో తరగతి పరీక్షల కోసం గత జనవరిలో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అదే ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న మరో యువతి (28) వారు ఉంటున్న క్వార్టర్ పక్కనే మరో క్వార్టర్లో ఉంటోంది. ఆ బాలుడితో పరిచయం పెంచుకున్న ఆమె తరచూ అతడిని తన క్వార్టర్లోకి పిలిపించుకుని అతడిపై లైంగిక దాడికి పాల్పడేది. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ తల్లి మీద దొంగతనం కేసు పెట్టించి ఉద్యోగం నుంచి తీసివేయిస్తానని బాలుడిని బెదిరించేది. తన తల్లి ఉద్యోగం పోతుందనే భయంతోనే అతను ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. ఐదు రోజుల క్రితం సదరు యువతి గదిలో తన కుమారుడు ఉండడాన్ని గుర్తించిన అతడి తల్లి అక్కడికి వెళ్లి చూడగా సదరు యువతి తన కొడుకును బలవంతంగా ముద్దు పెట్టుకుంటుండగా చూసింది.ఈ విషయమై తన కుమారుడిని నిలదీయగా అతను తల్లికి పూర్తి వివరాలు చెప్పాడు. దీంతో బాధితుడి తల్లి జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు లైంగిక దాడికి పాల్పడిన యువతిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
మిస్ వరల్డ్లో మన హస్తకళలు!
సాక్షి, హైదరాబాద్: నిత్యం ఫ్యాషన్ ప్రపంచంలో మునిగితేలే సుందరీమణులు నిర్మల్ కొయ్య బొమ్మలను చెక్కనున్నారు.. పోచంపల్లి చీరల తయారీకి పోగులు సిద్ధం చేయబోతున్నారు. చేర్యాల పెయింటింగ్స్కు రంగులద్దనున్నారు.. ఇలా ఒకటేమిటి తెలంగాణ సంప్రదాయ హస్తకళలకు సంబంధించి కాసేపు ‘కళాకారులు’కాబోతున్నారు. పోటీలో భాగంగా తెలంగాణ హస్తకళలపై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నారు. ‘ప్రపంచ సుందరి’ 72వ ఎడిషన్ పోటీలకు వేదికైన హైదరాబాద్ కొత్త ‘అందం’తో తళుకులీనుతోంది. ఇప్పటికే కొన్ని దేశాలకు చెందిన పోటీదారులు నగరానికి చేరుకోగా, మరికొందరు సోమ, మంగళవారాల్లో వస్తున్నారు. వీరి రాకకు దాదాపు వారం ముందే మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ, చైర్పర్సన్ జూలియా మోర్లే తన సిబ్బందితో నగరానికి చేరుకున్నారు. హైటెక్సిటీ సమీపంలోని ట్రైడెంట్ స్టార్ హోటల్లో ఆమె తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పోటీల నిర్వహణ పూర్తిగా మిస్ వరల్డ్ లిమిటెడ్ కనుసన్నల్లోనే జరగనుంది. పోటీల షెడ్యూల్, ఇతివృత్తాలను ఆ సంస్థే నిర్ణయించింది. రాష్ట్రప్రభుత్వ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని డిజైన్ చేసింది. ఇదే సందర్భంలో జూలియా మోర్లే రాష్ట్రప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ సంప్రదాయ హస్తకళలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని, వాటిని పోటీల్లో భాగంగా చేర్చాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆయా హస్తకళలపై పోటీదారులకు అవగాహన కల్పించాలని కోరారు. దీంతో రాష్ట్రప్రభుత్వం శిల్పారామంలో ప్రత్యేకంగా వారికి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. 22 రకాల హస్తకళల లైవ్ డెమానిస్ట్రేషన్ ఇక్కడ ఉండనుంది. ఈ నెల 21న వివిధ దేశాల పోటీదారులు అక్కడికి రానున్నారు. వారి ముందే నిపుణులైన కళాకారులు ఆయా కళాకృతులను తీర్చిదిద్ది, వాటి ప్రత్యేకతలను వివరించనున్నారు. వాటి తయారీలో పోటీదారులు కూడా స్వయంగా పాల్గొంటారు. శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉంటుంది. స్టాళ్లు చూసి ఆసక్తి..మార్చి 20న మిస్ వరల్డ్ పోటీల వివరాలను తొలిసారి జూలియా మోర్లే పర్యాటక భవన్లో మీడియాకు వెల్లడించారు. మిస్ వరల్డ్–2024 విజేత, చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టీనీ పిజ్కోవా కూడీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి స్వాగతం పలికేందుకు తెలంగాణ హస్తకళలను స్వయంగా రూపొందిస్తూ కళాకారులతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటిని జూలియా, క్రిస్టీనీ ఎంతో ఆసక్తిగా తిలకించారు. క్రిస్టీనా పిజ్కోవా అయితే కాసేపు మగ్గం మీద కూర్చుని పోచంపల్లి చీర అల్లికను పరిశీలించారు. అప్పుడే వీటిపై మిస్వరల్డ్ సీఈఓకు ప్రత్యేకాసక్తి కలిగిందని సమాచారం. ఆమె సూచనతో అధికారులు ప్రత్యేకంగా వాటి లైవ్ డెమానిస్ట్రేషన్కు ఏర్పాట్లు చేశారు. చేర్యాల స్క్రోల్ పెయింటింగ్స్, నిర్మల్ చిత్రకళ, నిర్మల్ కొయ్య బొమ్మలు, బిద్రి వేర్, బంజారా ఎంబ్రాయిడరీ, పోచంపల్లి, కొత్తకోట, నారాయణపేట, గద్వాల హ్యాండ్లూమ్స్, పెంబర్తి ఇత్తడి బొమ్మలు, సిల్వర్ ఫిలిగ్రీ, సిద్ది పేట గొల్లభామ చీరలు, నకాషీ, మట్టికుండల తయారీ, కళంకారీ.. ఇలా పలు కళలకు సంబంధించిన ఏర్పాట్లు చేయటం విశేషం. -
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం
సనత్నగర్ (హైదరాబాద్): సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద ఎస్బీఐ బ్యాంక్ అడ్మినిస్ట్రేషన్ భవనం నాలుగో అంతస్తులో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాపకశాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కొన్నిసార్లు ఆదివారం కూడా కొందరు సిబ్బంది కార్యాలయానికి వచ్చి కార్యకలాపాలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం ఇద్దరు ఉద్యోగులు నాలుగో అంతస్తులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఒకరు అగ్ని ప్రమాదం జరగక మునుపే బయటకు వెళ్లిపోగా, మరొకరు అంతస్తులో దట్టమైన పొగలు వ్యాపించడంతో భయంతో బయటకు వచ్చేసినట్లు సమాచారం.ఎగసిన మంటలతో భయాందోళనప్యాట్నీ సెంటర్ ప్రధాన రహదారిలో నగరానికి సంబంధించి ఎస్బీఐ అడ్మి నిస్ట్రేషన్ కార్యకలాపాలు ఇక్కడి నాలుగు అంతస్తుల భవనంలో కొనసాగు తాయి. నాలుగో అంతస్తులో లోన్ల విభాగం ఉంది. ఆ విభాగంలో ఆదివారం సాయంత్రం 7.30 గంటల సమయంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో.. స్థానికులతో అటు ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్షణాల్లో అగ్నికీలలు అంతస్తు మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటల తీవ్రత అధికంగా ఉండడంతో.. మల్కాజిగిరి, మౌలాలి ప్రాంతాల నుంచి మరో రెండు అగ్నిమాపక శకటాలను రప్పించారు. కాగా, ప్రమాదం జరిగింది నాలుగో అంతస్తులో కావడంతో.. భారీ క్రేన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో కీలక ఫైళ్లు, పెద్ద ఎత్తున ఫర్నిచర్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉండే ఈ కార్యాలయంలో.. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ప్రాణనష్టమే తప్పింది. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమై ఉండవచ్చని సికింద్రాబాద్ ఫైర్ అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. -
అద్దెకు ఇల్లు పేరుతో.. మేనత్త సొమ్ముకు మేన కోడలి పథకం
హైదరాబాద్: వారాసిగూడ చోరీ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక మహిళను కట్టేసి ఆమె ఒంటిపై ఉన్న నగలతో పాటు సొమ్మును అపహరించుకుని వెళ్లిన ఘటనలో మేనకోడలే నిందితురాలిగా తేలింది. మేనత్త సొమ్మును కాజేయాలని మేనకోడలు జ్యోతి పథకం రచించి ఆ ఇంటికి యువకుడ్ని పంపించి చోరీకి పాల్పడేలా పురిగొల్పింది. ఈ కేసులో జ్యోతిపాటు మరో ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.కాగా, గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి యజమానురాలిని కట్టేసి నగలు, నగదుతో ఉడాయించిన సంఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుం ది. ఎస్సై సుధాకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పార్శిగుట్టలోని ఓ ఇంట్లోని మొదటి అంత స్తులో పారిజాతం (56) అనే మహిళ నివాసముం టోంది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇల్లు అద్దెకు కావాలంటూ ఇంట్లోకి చొరబడ్డారు.తలుపులు గ యపెట్టి ఆమెను కత్తితో బెదిరించి కుర్చీలో కట్టేశాడా ఇంట్లో ఉన్న 30 గ్రాముల బంగారు నగలు, 6 మే నగదు, సెల్ ఫోన్ ను తీసుకుని పరారయ్యారు. కొ సేపటికి కట్లు విప్పుకుని బయటికి వచ్చి పారిజాతం చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది స్థానికులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఆమె వారాసిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టగా మేనకోడలే నిందితురాలు అయ్యింది. -
రేపు తెలంగాణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. పూర్తి షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: రేపు(సోమవారం) తెలంగాణలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు. కాగజ్ నగర్, హైదరాబాద్లో జాతీయ రహదారులు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను చేయనున్నారు. ఉదయం 9 గంటలకు నాగ్ పూర్ ఎయిర్ పోర్టు నుంచి హెలికాఫ్టర్లో సిర్పూర్ కాగజ్ నగర్కు చేరుకోనున్నారు.ఉదయం 10.15కి కాగజ్ నగర్ చేరుకోనున్న గడ్కరీ.. 10.30 నుంచి 11.30 వరకు జాతీయ రహదారుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.45 కు కాగజ్ నగర్ నుంచి కన్హా శాంతివనం పయనం కానున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3.30 వరకు కన్హా శాంతి వనం సందర్శించనున్నారు. సాయంత్రం 4 గంటలకు బీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం చేయనున్నారు.సాయంత్రం 5 గంటలకు అంబర్ పేట ఫ్లై ఓవర్ విజిట్ అండ్ ప్రారంభోత్సవం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు అంబర్ పేట్ గ్రౌండ్లో సభలో పాల్గొన్ని.. పలు ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రాత్రి 7 గంటలకు తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ పయనం కానున్నారు. -
హైదరాబాద్లో మిస్వరల్డ్ పోటీలు.. బ్యూటీక్వీన్స్పై టాలీవుడ్ ప్రముఖుల కన్ను
మూడవసారి మన భారతదేశం అతిపెద్ద అందాల పోటీకి ఆతిధ్యం ఇవ్వనుంది. అది కూడా తెలుగు రాష్ట్రాలకు తలమానికమైన హైదరాబాద్ నగరంలో ఈ ప్రపంచ స్థాయి బ్యూటీ కాంటెస్ట్ జరుగనుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమంపైనే విశ్వవ్యాప్త గ్లామర్ రంగం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ గ్లోబల్ ఈవెంట్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రూపురేఖలే మార్చే స్థాయిలో ఏర్పాట్లు షురూ చేసింది. మరో 3 రోజుల్లో ప్రపంచవ్యాప్త అందాలన్నీ రాశులు పోసినట్లుగా హైదరాబాద్ నగరంలో కొలువుదీరనున్నాయి. ఒకటీ రెండు రోజులు కాదు ఏకంగా నెల రోజుల పాటు నగరంలోనే తిష్టవేయనున్నాయి. దాదాపుగా 120 దేశాలకు చెందిన అందగత్తెలు ఈ పోటీలో తమ దేశాల తరపున బ్యూటీ ఫైట్కి సై అంటున్నారు. ఈ నేపధ్యంలో హాలీవుడ్, బాలీవుడ్ సహా అన్ని వుడ్లూ తమ కెమెరాకు తగ్గ ఫుడ్ కోసం వేటను షురూ చేసేశాయి. బాలీవుడ్కు చెందిన పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ పోటీల్లో పాల్గొంటున్న సుందరీ మణుల గ్లామర్, ఇతరత్రా టాలెంట్స్ను సమీక్షించి వారిపై నివేదికలు అందించేందుకు తగినంత మందీ మార్బలాన్ని పురమాయించినట్టు సమాచారం. తద్వారా వారిలో తమ భవిష్యత్తు తారలను ఎంచుకునే అవకాశాలను అన్వేషిస్తున్నారట. అదే విధంగా అంతర్జాతీయ చిత్రాలను అందించడంలో బాలీవుడ్ సినిమాలతో పోటీపడుతున్న టాలీవుడ్ సైతం ఇదే బాట పట్టినట్టు తెలుస్తోంది. తెలుగునాట రూ.వందల కోట్లతో సినిమాలు తీయడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. కొత్త కొత్త మార్కెట్లను పసిగట్టడం వాటిలోకి దూసుకువెళ్లడం కూడా కనిపిస్తోంది. ఏతావాతా తెలుగు సినిమాలు ఇప్పుడు దక్షిణాదిని దాటేసి ఉత్తరాదిని చుట్టేసి, అమెరికా. చైనాలను కూడా కలిపేసుకుని... జపాన్, జర్మీనీ, బంగ్లాదేశ్ అంటూ హద్దులన్నీ చెరిపేసి.. కాదేదేశమూ కలెక్షన్లకు అనర్హం అన్నట్టుగా దూసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకే ఈ మిస్ వరల్డ్ పోటీలు టాలీవుడ్కి కూడా ముఖ్యమైన టాపిక్గా మారాయి. టైటిల్ విన్నర్ని అలా ఉంచితే... వీరిలో విభిన్న రకాల టైటిల్స్ను గెలుచుకునే అందగత్తెలు కూడా ఉంటారు. అలాగే అత్యంత అందమైన అమ్మాయి మాత్రమే మిస్ వరల్డ్ కావాలి అని రూలేం లేదు. టైటిల్ గెలుపులో అందంతో పాటు మరెన్నో అంశాలు ప్రాధాన్యత దక్కించుకుంటాయి. కాబట్టి టైటిల్ వేటలో వెనుకబడినా అందంలో అద్భుతం అనిపించే వారూ మరికొందరు కనిపిస్తారు. అలాంటి గ్లామరస్ బ్యూటీస్తో ఒప్పందాలు కుదుర్చుకుంటే తమ ఇంటర్నేషనల్ మూవీస్కి ప్లస్ అవుతారని కొందరు టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారట. మరోవైపు ఇప్పటికే టాలీవుడ్ టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది దాంతో... పలువురు విదేశీ గ్లామర్ క్వీన్స్ సైతం సినిమా ఆకాంక్షల్ని వెంటబెట్టుకుని మన దేశానికి రావడంలో వింతేమీ ఉండదు. కాబట్టి... వారూ తమ టీమ్తో కలిసి తమ వంతు ప్రయత్నాలు చేయరని చెప్పలేం. మొత్తం మీద... తొలిసారి తెలుగు నాట జరుగుతున్న ఈ మిస్ వరల్డ్ పోటీలో టైటిల్ విజేతలు మాత్రమే కాదు వెండి తెరపై టైటిల్స్లో చోటు చేసుకునే విన్నర్స్ కూడా తేలనున్నారు. ఎవరో తెలియాలంటే.. మరో నెల రోజులు ఆగాల్సిందే. -
తెలంగాణ అమరుల స్మారకం ఆవిష్కరణకు రెండేళ్లు
సాక్షి, హైదరాబాద్: అది ప్రత్యేక రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మారక జ్యోతి. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చారిత్రక కట్టడాన్ని ఆవిష్కరించి రెండేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటి వరకు సందర్శకులకు అనుమతి లేకుండాపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా దీనిని ప్రారంభించింది. అమరుల మ్యూజియంతో పాటు మరికొన్ని పనులు వాయిదా పడ్డాయి. అలా పెండింగ్ జాబితాలో పడిపోయిన పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఫలితంగా సందర్శకులు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించారు. కానీ.. తెలంగాణ అమరుల స్మారకానికి మాత్రం ఇంకా తుది మెరుగులే దిద్దలేదు. సందర్శకులను అనుమతించడం లేదు. ఆ దిశగా అడుగు పడలేదు.. ప్రతిరోజూ వేలాది మంది పర్యాటకులు నెక్లెస్ రోడ్డుకు వస్తుంటారు. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో వేలాది మంది ట్యాంక్బండ్, లుంబిని పార్కు, ఎనీ్టఆర్ పార్కు, అంబేద్కర్ విగ్రహం వంటి ప్రాంతాలను సందర్శిస్తాను. వీటితో పాటు అమరుల స్మారకాన్ని బయటి నుంచి వీక్షించాల్సిందే. కానీ.. ప్రాంగణంలోకి వెళ్లేందుకు అవకాశం లేదు. తొలి, మలి దశ ఉద్యమాల్లో అమరులైన వందలాది మంది జీవితాలను సమున్నతంగా ఎత్తిపట్టేలా మ్యూజియం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. తెలంగాణ ఉద్యమాలపై రూపొందించిన డాక్యుమెంటరీలను కూడా ఈ మ్యూజియంలో ప్రదర్శించేందుకు ప్రత్యేకమైన హాళ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఉద్యమాలపై ప్రత్యేకంగా ఒక గ్రంథాలయాన్ని సైతం ఏర్పాటు చేయాలని భావించారు. ఇప్పటి వరకు ఈ దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదు.అలంకారప్రాయంగా జ్యోతి.. హుస్సేన్సాగర్ తీరాన లుంబిని పార్కును ఆనుకొని సుమారు 3.2 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రపంచంలోనే అపురూపమైన కళాఖండంగా నిలిచింది. ఎలాంటి అతుకులు లేని స్టెయిన్లెస్ స్టీల్తో దీని నిర్మాణం చేపట్టారు. దుబాయ్లో ఎంతో పేరొందిన ఫ్యూచర్ మ్యూజియానికి వినియోగించిన స్టీల్కు అతుకులు ఉన్నాయి. కానీ ఈ స్మారకానికి మాత్రం ఎలాంటి అతుకులు లేకపోవడం విశేషం. 85000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు రూ.131 కోట్లతో గత ప్రభుత్వం దీన్ని నిర్మించింది. సందర్శకులు భవనంపై ఉన్న స్మారకజ్యోతి వరకు వెళ్లేందుకు అవకాశం ఉంది. అక్కడే ఒక రెస్టరెంట్ను ఏర్పాటు చేయాలని భావించారు. ఇక భవనం రెండంతస్తుల్లో.. తెలంగాణ అమరవీరుల త్యాగాలను, వీరోచిత పోరాట గాథలను స్మరించుకునేలా గ్రౌండ్ఫ్లోర్లో చిత్రపటాలు, చారిత్రక చిహ్నాలను ఏర్పాటు చేయాలని భావించారు. ప్రేక్షకులు వీక్షించేందుకు లేదా విని తెలుసుకొనేందుకు వీలుగా ఆడియో, వీడియో హాళ్లు, గ్యాలరీలను కూడా గ్రౌండ్ఫ్లోర్లోనే ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. మ్యూజియంలో అక్కడక్కడా కియోస్్కలు, టచ్్రస్కీన్లను ఏర్పాటు చేసి వాటిద్వారా కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రను, విశేషాలను భవిష్యత్తరాలకు తెలియజేయాలని ప్రతిపాదించారు. పై అంతస్తులో కనీసం 600 మంది కూర్చొనేందుకు వీలైన కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. సాహిత్య సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనువైన హాల్ ఇది. ఆర్ట్ గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయవచ్చు. కాగా.. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. దీంతో స్మారక జ్యోతి అలంకారప్రాయంగానే ఉండిపోయింది.అంబేడ్కర్ మ్యూజియం తరహాలో ఏర్పాటు చేస్తే మేలు.. ప్రస్తుతం అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం వద్ద పార్లమెంట్ ఆకృతిలో ఉన్న వేదిక భవనంలో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇదే తరహాలో తెలంగాణ అమరుల స్మారకం వద్ద మ్యూజియం ఏర్పాటు చేస్తే తక్కువ వ్యవధిలోనే సందర్శకులను అనుమతించేందుకు అవకాశం లభిస్తుంది. మరోవైపు ప్రభుత్వ సంస్థలకు ఆ బాధ్యతలను అప్పగించకుండా తెలంగాణ అమరుల స్మారకజ్యోతి, మ్యూజియం నిర్వహణకు స్వతంత్రంగా పని చేసే ఒక సొసైటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని పలువురు ప్రతిపాదిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అమరుల త్యాగాలను, జ్ఞాపకాలను భావితరాలకు అందజేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. -
ప్రపంచ యాత్రికుడు అన్వేష్పై కేసు
హైదరాబాద్, క్రైమ్: ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్ (Na Anvesh)పై సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడనే అభియోగం అతనిపై నమోదు అయినట్లు సమాచారం.ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్ చేసేస్తూ.. ఆ వీడియోలను అప్లోడ్ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బూలు సంపాదించుకుంటున్నాడు అన్వేష్. అయితే.. తాజాగా బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరుతో.. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్రాజు తదితరులు రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా అతను వ్యాఖ్యలు చేశారట. అయితే అన్వేష్ అవాస్తవ, తప్పుడు సమాచారం ప్రచారం చేశారంటూ పోలీసులు సుమోటో(Suo moto)గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా.. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా ఆ వీడియో ఉంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్ క్రియేటర్ అన్వేష్ మీద చర్యలు తీసుకోవాలి అని సైబర్క్రైమ్ ఠాణా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు అన్వేష్పై కేసు నమోదు చేశారు. దీనిపై అన్వేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి. -
ఇదీ తెలంగాణ బ్రాండ్..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్కు గుర్తింపు దక్కేలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ పెట్టుబడులు వీలైనంత ఎక్కువగా ఆకర్షించాలంటే తెలంగాణకు విశ్వవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు అవసరమని భావిస్తోంది. ఇందుకు ప్రపంచ సుందరి పోటీలు సరైన అవకాశమని భావిస్తోంది. వీటిని విజయవంతం చేయడం ద్వారా రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటాలనే పట్టుదలతో ఉంది. ఇటీవలే ప్రత్యేకంగా టూరిజం పాలసీని తీసుకొచ్చిన ప్రభుత్వం.. దాన్ని ఈ పోటీల నిర్వహణతో ముడిపెట్టి విశ్వవ్యాప్త ప్రచారం కల్పించనుంది. ‘తెలంగాణ.. జరూర్ ఆనా, తెలంగాణ.. హార్ట్ ఆఫ్ ది డెక్కన్’లాంటి నినాదాలను విస్తృతంగా వినియోగిస్తోంది. మిస్ వరల్డ్ పోటీల లోగోలో కూడా వీటిని పొందుపరిచింది. నాలుగు అంశాలు.. నలుదిక్కులా ప్రచారం ప్రపంచ సుందరి 72వ ఎడిషన్ పోటీలు ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు హైదరాబాద్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో 120కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. ఈ పోటీలను కవర్ చేసేందుకు 150 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు హైదరాబాద్లో మకాం వేస్తున్నారు. పోటీలకు సంబంధించిన వివిధ ఘట్టాలు హైదరాబాద్లోని వివిధ వేదికల్లో జరుగుతున్నప్పటికీ, ఈ హడావుడి కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా యావత్ తెలంగాణను భాగస్వామ్యం చేసేలా.. పోటీ దారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేలా ఏర్పాట్లు చేసింది. నాగార్జునసాగర్ బుద్ధవనం, చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్, వరంగల్, రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట ఆలయం, పోచంపల్లి, మహబూబ్నగర్ పిల్లలమర్రి, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐపీఎల్ మ్యాచ్ సందర్శన, శిల్పారామం.. తదితర ప్రాంతాలను సుందరీమణులు సందర్శించనున్నారు. ప్రతి టూర్కు అంతర్జాతీయ మీడియా ప్రచారం కల్పించనుంది. సురక్షిత ప్రాంతం, మౌలిక వసతుల నిలయం, ఘనమైన చారిత్రిక వారసత్వం, ఆధునిక వైద్యం..అంశాల ఆధారంగా తెలంగాణ బ్రాండ్ను ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సురక్షిత ప్రాంతంప్రశాంత వాతావరణం ఉండే చోటుకే పెట్టుబడులు ఎక్కువగా వచ్చే వీలుంటుంది. ఈ అంశాన్ని ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ సుందరి పోటీల్లో చిన్నపాటి అవాంఛనీయ ఘటనా జరగకూడదని పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్త పాటు మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించే అన్ని ప్రాంతాల్లోనూ పటిష్టమైన భద్రతా ఏరాట్లు చేస్తున్నారు. వారికి ప్రత్యేక కాన్వాయ్ ఏర్పాటుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సుమారు 1,200 మంది రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. మౌలిక వసతులుపోటీలకు హాజరయ్యే వారికి నగరంలో అత్యంత అభివృద్ధి చెందిన, మౌలిక వసతుల పరంగా మెరుగ్గా ఉన్న హైటెక్ సిటీలోని స్టార్ హోటళ్లలో బస కల్పించారు. ప్రధాన పోటీలు జరిగే వేదికలను ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాలపై పోటీదారులు, మీడియా దృష్టి పడేలా చేయడం ద్వారా హైదరాబాద్లో మౌలిక వసతులపై ప్రపంచ వ్యాప్తంగా కొంత అవగాహన కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వివిధ దేశాలతో ఉన్న కనెక్టివిటీని వివరించడంతో పాటు పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, కొత్త సచివాలయ భవనం లాంటి వాటిని వారికి చూపించనున్నారు. మెడికల్ టూరిజంఅభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఆధునిక వైద్యవసతి హైదరాబాద్లో ఉందని అతిథులకు వివరించబోతున్నారు. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే 80 శాతం తక్కువ ఖర్చుకే ఆ స్థాయి ఆధునిక వైద్యాన్ని అందించే ఆసుపత్రులకు హైదరాబాద్ కేంద్రమని ప్రత్యేకంగా పోటీదారులు, విదేశీ మీడియాకు తెలియజేయనున్నారు. పోటీదారులను నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి ప్రత్యేకంగా తీసుకెళ్లి ఇక్కడి ఆధునిక వైద్య పద్ధతులు ప్రత్యక్షంగా తెలుసుకునే ఏర్పాటు చేశారు. ఏయే దేశాల నుంచి ఎంతమంది ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నదీ, వారికి ఇక్కడ అందుబాటులో ఉండే వసతులు, వైద్య సదుపాయాలను ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఘనమైన చరిత్ర, సంస్కృతి, ప్రపంచ రుచులు మెడికల్ టూరిజం తరహాలో ఇటీవల స్ట్రీట్ఫుడ్ టూరిజం కూడా విస్తృతమవుతోంది. స్ట్రీట్ ఫుడ్ను ఆస్వాదించే పర్యాటకుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఘనమైన వారసత్వం, చరిత్ర, సంస్కృతి ఉన్న నగరంలో విహరిస్తూ అక్కడి సంప్రదాయ భోజనం ఆస్వాదించటాన్ని ఈ పోటీల సందర్భంగా షోకేస్ చేసే దిశలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం విఖ్యాత చౌమొహల్లా ప్యాలెస్లో స్వాగత విందు (డిన్నర్) ఏర్పాటు చేశారు. ఇందులో 38 రకాల తెలంగాణ సంప్రదాయ వంటకాలను వడ్డించబోతున్నారు. కాంటినెంటల్ వెరైటీలకు సైతం హైదరాబాద్ వేదికే అన్న విషయం కూడా తెలిసేలా వివిధ ప్రాంతాల రుచులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ బాధ్యతను ఓ ఫైవ్స్టార్ హోటల్కు అప్పగించారు. ఇక తాజ్ ఫలక్నుమా, చార్మినార్ ప్రాంతాలను చూపటం ద్వారా హైదరాబాద్ చారిత్రక నేపథ్యాన్ని కూడా కళ్లకు కట్టబోతున్నారు. పోటీలకు ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష మిస్ వరల్డ్ పోటీల కోసం జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీనియర్ పోలీస్, ఇతర అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాటిపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని చెప్పారు. అతిథుల బస విషయంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రత, బందోబస్తుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. విమానాశ్రయం, హోటళ్ల వద్ద, అంతర్జాతీయ కార్యక్రమాల వేదికల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు. పర్యాటక శాఖ తరఫున పోటీదారులకు అందజేయడానికి వివరణాత్మక బుక్లెట్ను సిద్ధం చేయాలని సూచించారు. అతిథులు, పోటీల్లో పాల్గొనేవారు సందర్శించే అన్ని ప్రదేశాలను సుందరీకరించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. డీజీపీ జితేందర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సీఎంఓ) జయేశ్ రంజన్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఐఅండ్పీఆర్ ఇన్చార్జి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘టైమ్ పాస్ మీటింగ్లతో అలసిపోయాం’
హైదరాబాద్: ఇటీవల రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వంపై విమర్శలు చేస్తున్న ఆ పార్టీకే చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. మరోసారి ధ్వజమెత్తారు. ఇప్పటికే టైమ్ పాస్ మీటింగ్ లతో అలసిపోయామని, తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడిని త్వరగా నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంచితే, రేపు( ఆదివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కులగణనపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఈ తరుణంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చర్యనీయాంశంగా మారాయి.కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వాళ్లు కరెక్ట్ గా లేకే అధికారంలోకి రాలేదని గత నెలలో రాజాసింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం కచ్చితంగా బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగించిన అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా స్పందించింది. దీనిలో రాజాసింగ్ ఒకవైపు బీజేపీ అధికారంలోకి వస్తుందని అంటూనే , రాష్ట్రంలోని నాయకత్వం సరిగా లేదనే విషయాన్ని తేల్చిచెప్పారు.హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్ గౌతంరావును అభ్యర్థిత్వాన్ని తొలుత నిరాకరించారు రాజాసింగ్. అయితే కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ చొరవతో రాజాసింగ్ కాస్త దిగివచ్చారు. పార్టీ లైన్ లోనే పనిచేస్తానని బండి సంజయ్ కు హామీ ఇచ్చారు. అయితే మరొకసారి రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ రాజాసింగ్ మాట్లాడటం వెనుక ఉద్దేశం ఏమిటో కీలక నేతలకు అర్థం కావడం లేదు. -
హైదరాబాద్లో పలుచోట్ల కుండపోత
హైదరాబాద్: నగరంలోని పలుచోట్ల శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉన్నట్టుండి ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఉప్పల్, చిలూకానగర్, కంటోన్మెంట్, బోడుప్పల్, మేడిపల్లలో భారీ వర్షం కురిసింది. #Hyderabadrains!!Now scattered isolated rains lashes in few parts of Hyderabad City place at Ramanthapur pic.twitter.com/B1ljpuHMiU— Telangana state Weatherman (@tharun25_t) May 3, 2025సికింద్రాబాద్, బేగం పేట్ కుండపోతగా వర్షం కురిసింది. మరికొన్ని చోట్లు తేలికపాటి చిరుజల్లులు పడ్డాయి. నగరంలో కురిసిన వర్షానికి వావాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. -
Hyd: మైనర్ల తల్లిదండ్రులూ.. ఇది మీకోసమే!
హైదరాబాద్: ఇటీవల కాలంలో మైనర్లు వాహనాలు డ్రైవింగ్ చేస్తూ వారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఘటనలు తరచు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దీనిపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు అమలు చేయడానికి నడుంబిగించారు. ఇక నుంచి మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ తప్పనిసరి చేయడమే కాకుండా ఏడాది పాటు ఆ వాహనం లైసెన్స్ సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా విధించనున్నారు. అదే సమయంలో ఎవరైతే వాహనాలు డ్రైవింగ్ చేసిన మైనర్లున్నారో వారికి 25 ఏళ్ల వరకూ లైసెన్స్ జారీ కాకుండా చర్యలకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. -
అందుబాటులోకి ఆట.! ఇండోర్ షటిల్ కోర్టు రెడీ!
జీడిమెట్ల: సుభాష్నగర్ డివిజన్ ఎస్.ఆర్.నాయక్నగర్లో ఇండోర్ షటిల్ కోర్టును జీహెచ్ఎంసీ నిర్మించడంపై ఎస్.ఆర్.నాయక్నగర్, అపురూపాకాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో షటిల్ క్రీడాకారులు ఇక్కడకు వచ్చి షటిల్ ఆడుకుంటున్నారు. గతంలో కాలనీవాసులు షటిల్ ఆడాలంటే బాచుపల్లి, చింతల్, సుచిత్ర వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు కాలనీలో సదుపాయం కలగడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులకు మంచినీటితో పాటు టాయిలెట్స్ సదుపాయం కలుగజేస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని కాలనీవాసులు అంటున్నారు. కాలనీ స్థలంలో రూ.3 కోట్లతో నిర్మాణం నవంబర్ 2022లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కార్పొరేటర్ హేమలతా సురే‹Ùరెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సూరిబాబు కాలనీ అసోషియేషన్, కాలనీ ప్రజల ప్రోత్సాహంతో 23 నెలల్లో ఇండోర్ కోర్టు పనులను పూర్తి చేశారు. ఎకరం స్థలంలో ఇండోర్ స్టేడియం ఇండోర్ కోర్టు లోపల ఒకేసారి 12మంది క్రీడాకారలు ఆడుకునేల మ్యాటింగ్తో మూడు సింథటిక్ కోర్టులను ఏర్పాటు చేశారు. క్రీడాకారుల కోసం కోర్టు లోపల ఎల్ఈడీ లైటింగ్లో పాటు టేబుల్ ఫ్యాన్లను అమర్చారు. కోర్టుల చుట్టూ క్రీడాకారులు కురీ్చల్లో కూర్చునేలా కొంత మేరకు స్థలాన్ని వదిలారు. 7వేల చదరపు ఆడుగుల్లో మూడు సింథటిక్ షటిల్ కోర్టులు నిర్మించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే బుకింగ్స్, క్రీడాకారులు ప్రతి నెల కొంత చెల్లించేలా జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి ఒక సిస్టం తీసుకువస్తామని కాంట్రాక్టర్ అన్నారు. టోర్నమెంట్లు నిర్వహించేందుకు సిద్ధం కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కేటాయించిన షటిల్ ఇండోర్ కోర్టు మా కాలనీలో నిర్మించడం అనందంగా ఉంది. మా కాలనీ, అపురూపాకాలనీలో షటిల్ ఆడే క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. యువ క్రీడాకారులు ఇక్కడ సాధన చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనేది మా అకాంక్ష. మా ఇరు కాలనీల తరపున మేము సంవత్సరంలో రెండుసార్లు ఇక్కడ టోర్నమెంట్లు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. – టీటీకే శ్రీనివాస్ (ఎస్ఆర్.నాయక్నగర్ అధ్యక్షుడు) సంతోషంగా ఉంది ఫిట్గా ఉండాలంటే ఏదో ఒక క్రీడలో మనం పట్టు సాధించాలి. అలా అని రోడ్లపైన ఆడలేం. మాకు దగ్గరలో మా కాలనీలో ఇండోర్ షటిల్ కోర్టులు రావడం చాలా సంతోషంగా ఉంది. మేము తప్పకుండా ప్రతిరోజు ఇక్కడ షటిల్ ఆడాలని నిర్ణయించుకున్నాం. -సుస్మిత, అపురూపాకాలనీ మేము ఊహించలేదు మాకు షటిల్ ఆటపై మక్కువతో ఇంతకు ముందు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఆడేవాళ్లం. ఇప్పుడు మా ఇళ్ల మధ్యలోనే షటిల్కోర్టును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మేము ఊహించలేనిది. – రాఘవయ్య, కాలనీవాసిజీహెచ్ఎంసీకి కృతజ్ఞతలు నాకు షటిల్ ఆడాలనే కోరిక ఉండేది కాని మాకు దగ్గలో ఎక్కడ ఇండోర్ స్టేడియం లేదు. మా కాలనీలో ఇండోర్ కోర్టు ఏర్పాటు కావడం మాకు వరం. మూడ్రోజులుగా ఇక్కడకు వచ్చి షటిల్ ఆడుతున్నాం. మా కాలనీలో షటిల్ కోర్టు నిర్మించిన జీహెచ్ఎంసీ వారికి కృతజ్ఞతలు. – దివ్య, అపురూపాకాలనీ -
ఇదిగో ఇల్లు.. హైదరాబాదే టాప్
గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేసి, గృహ కొనుగోలుదారులకు అందజేయడంలో దక్షిణాది నగరాలలో హైదరాబాద్ ముందంజలో నిలిచింది. గ్రేటర్లో 2024–25లో ఆర్థిక సంవత్సరంలో 57,304 యూనిట్లు డెలివరీ అయ్యాయి. 2023–24లో డెలివరీ అయిన 35,641 ఇళ్లతో పోలిస్తే ఏడాది కాలంలో 61 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఇదే సమయంలో బెంగళూరులో 46,103, చెన్నైలో 19,650 యూనిట్లు డెలివరీ అయ్యాయి. – సాక్షి, సిటీబ్యూరోమార్చితో ముగిసిన 2025 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని తొమ్మిది నగరాలలో 4,06,889 యూనిట్లు డెలివరీ అయ్యాయని ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడించింది. అంతకు క్రితం ఆర్థిక సంవత్సరం(2023–24)లో డెలివరీ అయిన 3,06,600 యూనిట్లతో పోలిస్తే ఏడాది కాలంలో డెలివరీలో 33 శాతం వృద్ధి నమోదైంది. గడువులోగా గృహాల అందజేతలో అత్యధికంగా పశ్చిమాది నగరాల వాటా 55 శాతంగా ఉంది. గత మూడు ఆర్థిక సంవత్సరాలలో 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, గడువులోగా కస్టమర్లకు అందజేశారు. ఒక్క ఢిల్లీలోనే క్షీణత.. గడువులోగా ప్రాజెక్ట్లను పూర్తి చేయడంలో ఢిల్లీ–ఎన్సీఆర్ వెనకబడి ఉంది. 2023–24 ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే 2024–25లో ఈ నగరంలో యూనిట్ల డెలివరీలో 8 శాతం క్షీణత నమోదైంది. అత్యధికంగా కోల్కతాలో, అత్యల్పంగా ముంబైలో గృహాలు డెలివరీ అయ్యాయి. ఏడాది కాలంలో కోల్కతాలో 88 శాతం, ముంబైలో 22 శాతం వృద్ధి నమోదైంది. డెలివరీలో వేగవంతం.. 2018–19 మధ్య కాలంలో లాంచింగ్ అయిన ప్రాజెక్ట్లు 2025 ఆర్థిక సంవత్సరంలో డెలివరీ దశకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారి కాలంలో లాక్డౌన్, ప్రయాణాలపై ఆంక్షలు, కార్మికుల వలసలు తదితర కారణాలతో భవన నిర్మాణ పనులు మందకొడిగా సాగాయి. రెండేళ్లుగా సానుకూల మార్కెట్ సెంటిమెంట్లు, నగదు ప్రవాహం పెరగడంతో పాటు నిలిచిపోయిన ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు స్పెషల్ విండో ఫర్ అఫర్డబుల్ అండ్ మిడ్ ఇన్కం హౌసింగ్(ఎస్డబ్ల్యూఏఎంఐహెచ్) ఫండ్ లభ్యత తదితర కారణాలతో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. దీంతో పాటు రెరాలో నమోదైన ప్రాజెక్ట్లు గడువులోగా పూర్తి చేయాలనే పలు కఠిన నిబంధనలతో డెవలపర్లు ప్రాజెక్ట్ డెలివరీపై దృష్టిసారించారు. దీంతో 2025 ఆర్థిక సంవత్సరంలో కస్టమర్లకు గృహాల డెలివరీ పెరిగాయి. -
నన్నే నీ భర్త అనుకో.. భర్త ఎదుటే భార్యపై వేధింపులు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మందుబాబులు తాగిన మత్తులో రెచ్చిపోయి హల్చల్ చేశారు. రాత్రి వేళ దారిలో వెళ్తున్న భార్యాభర్తలను అడ్డుకుని.. మహిళను వేధింపులకు గురిచేశారు. నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు.. అంటూ వేధించారు. టచ్లో ఉండాలంటూ ఓవరాక్షన్కు దిగారు. అనంతరం, రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు ఆకతాయిలను అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఏపీలోని ఒంగోలుకు చెందిన యువతి (29) తన భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి హైదరాబాద్ రహ్మత్ నగర్లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం సాయంత్రం ఆ యువతి తన భర్త, మరిది, ఆడపడుచు, బంధువు స్నేహితుడితో కలిసి బేగంపేటలోని క్లబ్–8 పబ్కు వెళ్లారు. రాత్రి 11.40 గంటల సమయంలో పబ్ నుంచి ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో ఆమెను చూసిన ముగ్గురు యువకులు అడ్డగించారు. అప్పుడు తాను తన భర్తతో కలిసి వచ్చానని చెప్పినా మందుబాబులు పట్టించుకోలేదు.మరింత ఓవరాక్షన్ చేస్తూ.. నన్నే నీ భర్త అనుకో.. ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ వేధింపులకు గురిచేశారు. ఆమె శరీరాన్ని తాకే ప్రయత్నం చేశారు. చేతుల్లో బీర్ బాటిళ్లు పట్టుకుని బెదిరింపులకు దిగారు. అనంతరం, వారిద్దరూ అక్కడి నుంచి వెళ్తుండగా.. బేగంపేట నుంచి రహ్మత్ నగర్కు వచ్చే దాకా వెకిలి చేష్టలతో వెంబడించి వేధింపులకు గురిచేశారు.అయితే, వివాహితను ఇంట్లో దిగబెట్టిన తర్వాత తన స్నేహితుడిని డ్రాప్ చేసేందుకు భర్త మాదాపూర్ వెళ్తుండగా, ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర వారిని అడ్డగించి ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణించే బైక్తో పాటు ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. దీంతో వారు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వివాహితను వేధించిన వారిని పంజాగుట్టకు చెందిన డి.సంపత్ (28), సందీప్ (28), కూకట్ పల్లికి చెందిన ఉమేష్ (28)లుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సెకండ్ హ్యాండ్ ఇళ్లకు గిరాకీ
స్థిరాస్తి రంగానికి ప్రత్యేకించి గృహ విభాగానికి కరోనా మహమ్మారి బూస్ట్లా బలానిచ్చింది. హోం ఐసోలేషన్, వర్క్ ఫ్రం హోమ్ వంటి కారణంగా సొంతింటి అవసరం తెలిసి రావడంతో నివాస విభాగం శరవేగంగా అభివృద్ధి చెందింది. దీంతో కోవిడ్ తర్వాత కొత్త ఇళ్లకే కాదు రీసేల్ ప్రాపర్టీలకూ గిరాకీ పెరిగింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో రిజిస్ట్రేషన్ అయిన ప్రాపర్టీలలో సెకండ్ హ్యాండ్ హోమ్స్ వాటా 38 శాతంగా ఉండగా.. 2024–25 నాటికి 43 శాతానికి పెరిగిందని ఇంటిగ్రేటెడ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్లేస్ స్క్వేర్ యార్డ్స్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోడెవలపర్ నుంచి నేరుగా కొనుగోలుదారులు కొనుగోలు చేసే ప్రాపర్టీలను ప్రైమరీగా, ఇంటి యజమాని మరొక కస్టమర్కు రీసేల్ చేస్తే దాన్ని సెకండరీ ప్రాపర్టీగా పరిగణిస్తారు. దేశంలోని 7 ప్రధాన నగరాలలో 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3.07 లక్షల యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. ఇందులో 1.22 లక్షల రీసేల్ ప్రాపర్టీలు ఉండగా 2024–25 నాటికి మొత్తం 5.44 లక్షల యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. సెకండ్హ్యాండ్ ప్రాపర్టీలు ఏకంగా 2.33 లక్షలకు పెరిగాయి. ప్రైమరీ యూనిట్లు 2018–19లో 1.84 లక్షలుగా ఉండగా.. 2024–25 నాటికి 3.11 లక్షలకు చేరాయి. అంటే రీసేల్ ప్రాపర్టీలలో 38 శాతం నుంచి 43 శాతానికి పెరిగితే.. ప్రైమరీ యూనిట్లు 62 శాతం నుంచి 57 శాతానికి తగ్గాయి.లగ్జరీ పెరగడమే రీసేల్కు బూస్ట్.. కరోనా కంటే ముందు వరకూ బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉండేవి. డెవలపర్లు కూడా అఫర్డబుల్ హౌసింగ్ నిర్మాణాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఏటేటా భూముల ధరలు పెరుగుతుండటంతో చౌక ఇళ్ల నిర్మాణ వ్యయప్రయాసంగా మారింది. దీంతో లగ్జరీ, విశాలమైన గృహ నిర్మాణాల వైపు ఆసక్తి పెరిగింది. కొత్త ప్రాజెక్ట్ల లాంచింగ్స్ పరిమిత స్థాయిలో ఉండటం, అందు బాటు గృహాల స్థానంలో ఖరీదైన గృహాల సరఫరా పెరగడంతో సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీల వైపు సామాన్య, మధ్యతరగతి ప్రజలు మొగ్గుచూపుతున్నారు.గ్రేటర్లో ఇదీ పరిస్థితి.. హైదరాబాద్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 71 వేల యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. ఇందులో 35 వేలు ప్రైమరీ, 36 వేలు సెకండరీ యూనిట్లు ఉన్నాయి. అదే 2018–19లో మొత్తం 63 వేల యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా.. ఇందులో ప్రైమరీ 29 వేలు, సెకండరీ యూనిట్లు 34 వేలు ఉన్నాయి. 2018–19లో ప్రైమరీ యూనిట్ల వాటా 46 శాతం కాగా.. సెకండరీ యూనిట్ల వాటా 54 శాతంగా ఉంది. అదే 2024–25లో ప్రైమరీ యూనిట్ల వాటా 49 శాతం కాగా.. సెకండరీ యూనిట్ల వాటా 51 శాతంగా ఉంది.ఐటీ హబ్కు చేరువలో..రోడ్లు, విద్యుత్, తాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ వంటి మెరుగైన మౌలిక వసతులు ఉన్న ప్రాంతాలలో రీసేల్ ప్రాపర్టీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, హబ్సిగూడ, ఉప్పల్, పోచారం వంటి ఐటీ కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని సెకండ్ హ్యాండ్ హోమ్స్ డిమాండ్ ఎక్కువగా ఉంది. మెట్రో కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోని నాణ్యమైన ఇళ్లకు ధర కాస్త ఎక్కువైనా కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.ప్రయోజనాలివీ» కొత్త నిర్మాణాల కంటే రీసేల్ ప్రాపర్టీల ధరలు అందుబాటులో ఉంటాయి. » రోడ్లు, విద్యా, వైద్య సంస్థలు, మార్కెట్లు, రవాణా సదుపాయాలతో స్థిరమైన మౌలిక వసతులు ఉంటాయి. » నిర్మాణం పూర్తయ్యే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేకుండా గృహ ప్రవేశం చేసేయవచ్చు. » రీసేల్ ప్రాపర్టీలకు జీఎస్టీ వర్తించదు కాబట్టి కొనుగోలుదారులకు డబ్బు ఆదా అవుతుంది. » కొత్త ప్రాజెక్ట్లు పెద్దగా లేని ప్రాంతాలలో సెకండ్హ్యాండ్ హోమ్స్ యజమానితో బేరసారాలకు అవకాశం ఉంటుంది. » రీసేల్ ప్రాపర్టీలకు సైతం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్లు తక్కువ వడ్డీలోనే గృహ రుణాలను అందిస్తున్నాయి. » కొత్త ఇంటి కొనుగోలు సమయంలో డెవలపర్కు ముందుగా చెల్లించే 10–15 శాతం డౌన్ పేమెంట్ను చెల్లించి, బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే రీసేల్ ప్రాపర్టీలో అయితే ఇదేమీ అక్కర్లేదు.జాగ్రత్తలివీ..» సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీలు కొనేముందు ఇంటి వాస్తవ విలువ, మార్కెట్ ధరలను పూర్తిగా అధ్యయనం చేసుకున్న తర్వాతే నిర్ణయానికి రావడం ఉత్తమం. » సాధారణంగా రీసేల్ ప్రాపర్టీలు వ్యవస్థీకృత రంగంలో విక్రయాలు జరగవు కాబట్టి మధ్యవర్తుల మాటలు నమ్మకూడదు. ఒకటికి రెండుసార్లు పునఃసమీక్ష చేసుకున్న తర్వాతే ముందడుగు వేయాలి. » లీకేజీలు, నిర్వహణ సమస్యలను గృహ యజమాని దాచిపెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి థర్డ్పార్టీతో సమగ్రంగా అధ్యయనం చేయించిన తర్వాత కొనుగోలు చేయడం బెటర్. » 10–15 ఏళ్లకు పైబడి పాత ఇంటిని కొనకపోవడమే ఉత్తమం. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో అయితే పాత ఇంటిని కొన్నా.. దాని కూల్చేసి కొత్త ఇంటిని నిర్మించుకుంటేనే కలిసొస్తుంది. » లింక్ డాక్యుమెంట్లు, సేల్ డీడ్, ఆస్తి పన్ను పత్రాలు ఇతరత్రా డాక్యుమెంట్లను న్యాయ సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. -
అందాల ఆతిథ్యం.. అంతర్జాతీయ గౌరవం..
ప్రస్తుతం ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తోంది. మరి కొద్ది రోజుల్లో నగర వేదికగా ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో హైదరాబాద్ విశిష్టత విశ్వవ్యాప్తం కానుంది. ఈ నేపథ్యంలో దేశానికే తలమానికమైన భాగ్యనగరాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకూ జరగనున్న 72వ మిస్ వరల్డ్–2025 పోటీల్లో భాగంగా తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచానికి తెలిపేలా, అంతర్జాతీయంగా తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్ పెంచేలా కార్యాచరణ సిద్ధం చేసింది తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం. అయితే 7వ తేదీ నుంచే సన్నాహక కార్యక్రమాలు ప్రారంభం కానుండగా 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ మిస్ వరల్డ్ పోటీల కంటెస్టెంట్లు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇందులో భాగంగా మిస్ వరల్డ్ చైర్పర్సన్, సీఈఓ జూలియా ఎవెలిన్ మోర్లీ శుక్రవారం నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్కు చేరుకోగా.. వారికి ఘన స్వాగతం పలికారు.జూలియాతో పాటు విచ్చేసిన మిస్ వరల్డ్ అధికారిణి కెర్రీ ఇతర అధికారులకు భారతీయ సంప్రదాయం పద్దతిలో ఘన స్వాగతం పలికారు. సుమారు 120 దేశాల నుంచి కంటెస్టెంట్లు పాల్గొననున్న ఈ మెగా ఈవెంట్ను సువర్ణ అవకాశంగా మలుచుకొని రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘ప్రపంచం కళ్లన్నీ తెలంగాణవైపే!’ అనే స్లోగన్తో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం చరిత్రలో మైలురాయిగా నిలువనుంది. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పర్యాటక ఆకర్షణలు, మెడికల్, సేఫ్టీ టూరిజం, తెలంగాణ గ్రోత్ స్టోరీ, ఇతర ప్రత్యేకతలు ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రత్యేక థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్లు రూపొందించారు. ఇందులో భాగంగా మిస్ వరల్డ్–2025 (Miss World 2025) కార్యక్రమం ప్రయాణ ప్రణాళికలు, వేదికలను తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా రూపొందించారు.నగర వేదికగా మిస్ వరల్డ్ థీమ్స్, టూరిస్ట్ సర్క్యూట్స్.. హైదరాబాద్ హెరిటేజ్ వాక్.. (మే 12న..) హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వం, గొప్పదనం ప్రపంచానికి తెలియజేసేలా నగరంలోని చారిత్రాత్మక ఆనవాలైన చారి్మనార్, లాడ్ బజార్లలో ప్రత్యేకంగా ‘హెరిటేజ్ వాక్’ నిర్వహిస్తారు. చౌమహల్లా ప్యాలెస్ సందర్శన.. (మే 13న..) హైదరాబాద్ (Hyderabad) నగరానికే తలమానికమైన చౌమహల్లా ప్యాలెస్ సందర్శిస్తారు. అక్కడ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ను తిలకిస్తారు. ఎక్స్పీరియా ఎకో పార్క్ సందర్శన.. (మే 16న..) గ్రూప్–2 మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మే 16 సాయంత్రం.. హైదరాబాదు నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఎక్సీ్పరియన్ ఎకో పార్కును సందర్శిస్తారు. మెడికల్ టూరిజం పై పరిచయం.. (మే 16న..) వివిధ దేశాల నుంచి రోగులను ఆకర్షించే ఉద్దేశంతో మెడికల్ టూరిజాన్ని సైతం పరిచయం చేయనున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో నిర్వహించే మెడికల్ టూరిజం ఈవెంట్కు గ్రూప్–1 మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హాజరవుతారు. హైదరాబాద్లోని ఆధునిక ఆస్పత్రుల ప్రత్యేకతలను వారికి వివరిస్తారు. ఘనంగా గ్రాండ్ ఫినాలే.. మే 22న నిర్వహించే మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలేలో.. 23న హెచ్ 2 హెచ్ ఛాలెంజ్ ఫినాలేలో కంటెస్టెంట్లు పాల్గొంటారు. 24న మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫినాలే – జ్యువెలరీ/పెర్ల్ గది షో మిస్ వరల్డ్ టాప్ మోడల్, ఫ్యాషన్ ఫినాలే కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. 26న బ్యూటీ విత్ ఫ్యాషన్ కాంటెస్ట్ నిర్వహిస్తారు. చివరగా 31వ తేదీన మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారు. ఇవే కాకుండా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని నాగార్జునసాగర్, బౌద్ధవనం ప్రాజెక్టు, వరంగల్ వెయ్యి స్థంభాల గుడి, వరంగల్ పోర్ట్, యునెస్కో గర్తింపు పొందిన రామప్ప ఆలయం, ప్రతిష్టాత్మక యాదగిరి గుట్ట దేవాలయం తదితర ప్రదేశాలను సందర్శిస్తారు. మిస్ వరల్డ్ ఆటల తుది పోటీలు.. (మే 17న..) మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. రామోజీ ఫిలిం సిటీ సందర్శన.. (మే 17న..) ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీలో ఒకటిగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీని మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారు. సేఫ్టీ టూరిజం.. (మే 18న..) మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి తెలంగాణ ప్రభుత్వం పౌరుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను, ప్రభుత్వం సేఫ్టీ టూరిజం ఇనీషియేటివ్ను పరిశీలిస్తారు. సచివాలయ సందర్శన.. (మే 18న..) మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు అధికారులు తెలంగాణ రాష్ట్ర గ్రోత్ స్టోరీ, చరిత్రను తెలియజేస్తారు. ట్యాంక్ బండ్ పైన ప్రతి ఆదివారం ఏర్పాటు చేసే సండే ఫండే కారి్నవాల్ను కూడా సందర్శిస్తారు. ఐపీఎల్ మ్యాచ్కు హాజరు.. (మే 20 లేదా 21..) ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్కు గ్రూప్–1 కంటెస్టెంట్లు హాజరవుతారు. తెలంగాణ కళాకారులచే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వర్క్ షాప్.. (మే 21న..) గ్రూప్–2 కంటెస్టెంట్లు శిల్పారామంలో తెలంగాణ కళాకారులచే నిర్వహించే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వర్క్ షాప్స్కు హాజరవుతారు. స్వయంగా వాటి తయారీలో భాగమై ప్రత్యక్షంగా తయారీ గురించి తెలుసుకుంటారు. -
బాలుడిపై బాలిక లైంగిక దాడి
బంజారాహిల్స్(హైదరాబాద్): మైనర్ అయిన తన కుమారుడిపై బ్రదర్ అంటూనే ఓ బాలిక లైంగిక దాడికి పాల్పడిందంటూ బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్లోని ఓ ఇంట్లో పనిమనిషిగా ఉన్న ఓ మహిళ తన భర్తతో పాటు కుమారుడితో కలిసి అక్కడే సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటుంది. స్కూల్ సెలవులు (School Holidays) కావడంతో కుమారుడు ఇంటి వద్ద ఉంటున్నాడు. ఇదిలా ఉండగా వీరి క్వార్టర్స్ పక్క గదిలో ఉండే మరో పనిమనిషి అయిన బాలిక ఉంటుంది. సదరు బాలిక మహిళ కుమారుడిని బ్రదర్ అని, ఆమె కుమారుడు ఆ బాలికను సిస్టర్ అంటూ పిలుచుకునేవారు. ఒకసారి సదరు బాలిక తన కుమారుడిని ముద్దు పెట్టుకోవడంతో అతడిని నిలదీసింది. మార్చి నెలలో తాను గదిలో ఒంటరిగా ఉండగా బాలిక తనను ముద్దు పెట్టుకుందని చెప్పాడు. నిన్ను ఇష్టపడుతున్నానని, నిన్ను ఏమి చేసినా మౌనంగా ఉండాలని, లేకపోతే దొంగతనం కేసు పెట్టి మీ తల్లి ఉద్యోగం తీయిస్తానని బెదిరించిందని చెప్పుకొచ్చాడు. దీంతో ఆమె చెప్పినట్లు బాలుడు (Boy) చేసేవాడు. ఈ క్రమంలో బాలుడిపై ఆమె లైంగిక దాడికి పాల్పడింది. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు యువతి మీద పోక్సో కేసు నమోదు చేశారు.చదవండి: నన్నే నీ భర్త అనుకో.. వివాహితకు వేధింపులు -
హైదరాబాద్ : గోల్కొండ కోటలో పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
‘కేసీఆర్ పాలనలో మంత్రులకు పవర్ లేదు’
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ తన దగ్గర పెట్టుకొని పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో మంత్రులకు పవర్ లేదని, స్వేచ్చగా రివ్యూ చేసుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు పొంగులేటి. ఈరోజు(శుక్రవారం) మీడియాతో చిట్ చాట్ చేసిన పొంగులేటి.. ‘ ఆనాడు మంత్రులను కేసీఆర్ పని చేయనియ్యలేదు. భూ భారతి వల్ల 70శాతం ప్రజలకు ఉపయోగం జరిగినా మేము సక్సెస్ అయినట్లే. భూ భారతిలో కొత్త సాఫ్ట్ వేర్ రాబోతోంది. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరగదు. జరగనివ్వను. త్వరలోనే రాష్ట్రంలో సర్వేయర్లు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. జూన్ లో సర్వే మ్యాప్ పైలెట్ ప్రాజక్టు ద్వారా రిజస్ట్రేషన్లు చేస్తాం. ఆరువేల దరఖాస్తులు సర్వేకు వచ్చాయి. భర్తీ చేయబోతున్నాం. ప్రైవేట్ సర్వేయర్లతో భూముల సర్వే జరుగుతుంది.. ప్రభుత్వ పర్యవేక్షణ సైతం ఉంటుంది’ అని అన్నారు. -
రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: రేషన్ కార్డుదారుల పరేషాన్కు ఇక తెరపడనుంది. లబ్ధిదారులకు శుభవార్త. సరిగ్గా ఎనిమిదేళ్ల నిరీక్షణకు మోక్షం లభిస్తోంది. పాత రేషన్కార్డుల్లో కొత్త సభ్యుల(యూనిట్) ఆమోద ప్రక్రియ ఆరంభమైంది. పౌర సరఫరాల శాఖ ఆన్లైన్ ద్వారా కొత్త సభ్యుల చేర్పుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలిస్తూ ఒక్కొక్కటిగా ఆమోదిస్తోంది. అయితే రేషన్కార్డు (Ration Card) కలిగిన కుటుంబంలోని కొత్త సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నప్పటికీ ఏడేళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ కోటా కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెండింగ్ దరఖాస్తుల్లో సుమారు 20 శాతం మేర పరిష్కరించి మే నెల రేషన్ కోటా కూడా కేటాయించింది. మిగతా దరఖాస్తులను కూడా దశలవారీగా పరిష్కరించేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.ఆరు లక్షలపైనే కొత్త సభ్యులు.. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిరిగి జిల్లాల్లో పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పుల కోసం సుమారు మూడు లక్షలపైనే దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు ఆన్లైన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఎనిమిదేళ్లుగా రేషన్కార్డుల్లోని సభ్యులు (యూనిట్లు) వివిధ సాకులతో తొలగింపునకు గురవుతున్నా కొత్త సభ్యుల చేర్పుల దరఖాస్తులకు మాత్రం అతీగతీ లేదు. ఈ వ్యవధిలో ఉమ్మడి కుటుంబాలు రెండు, మూడుగా ఏర్పడగా, మరోవైపు కుటుంబంలో మరి కొందరు కొత్త సభ్యులుగా చేరారు.సుమారు మూడు లక్షల కుటుంబాలు ఆరు లక్షల కొత్త సభ్యుల పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పులు కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుండగా, మొన్నటి వరకు ఆమోదించే ఆప్షన్ లేకుండా పోయింది. అయితే రేషన్కార్డులోని సభ్యుల తొలగింపు ఆప్షన్ మాత్రం కొనసాగుతూ వస్తోంది. తాజాగా కొత్త సభ్యులు చేర్పుల ఆప్షన్కు ప్రభుత్వం గ్రీన్సిగ్న్ల్ ఇవ్వడంతో ఆమోద ప్రక్రియ ప్రారంభమైంది. చదవండి: తెలంగాణ గొర్రెల స్కాంలో కీలక పరిణామంఅర్హుల పేర్లకు ఆమోదంపాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల ఆమోదం ప్రక్రియ కొనసాగుతోంది. మీ సేవా (Mee Seva) ఆన్లైన్ ద్వారా వచ్చిన ప్రతి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి అర్హులై సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నాం. ఇప్పటికే కొన్ని కొత్త యూనిట్లకు నెలవారీ రేషన్ కోటా కేటాయించాం. మరి కొన్ని కొత్త యూనిట్లకు వచ్చే నెల నుంచి రేషన్ కోటాకేటాయిసాం. ఆందోళన చెందవద్దు – రమేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి, హైదరాబాద్ -
‘ఇలంబర్తికి వచ్చింది ప్రమోషన్.. డిమోషన్ కాదు’
హైదరాబాద్: తన పరిధిలో ఉన్న శాఖల్లో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. దీనికి సంబంధించి తన పరిధిలోని అన్ని డిపార్ట్ మెంట్లలో విచారణ చేసుకోవచ్చని సవాల్ చేశారు. మీడియాతో చిట్ చాట్ చేసిన పొన్నం తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందించారు. చిన్నస్థాయి నుంచి మంత్రిగా ఎదిగానని, తనపై వచ్చిన అవినీతి మరకలను నిరూప్తిస్తే తాను దేనికైనా సిద్ధమేనన్నారు.తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదని, తన దగ్గరున్న ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కింది స్థాయి అధికారి వరకూ మంచి సంబంధాలున్నాయన్నారు. ఇలంబర్తికి తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. అధికారుల బదిలీలు ప్రభుత్వంలో సర్వసాధారణంగా జరుగుతుందన్నారు. ఇలంబర్తికి వచ్చింది ప్రమోషన్.. డిమోషన్ కాదన్నారు. ఇదిలా ఉంటే, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి బదిలీ అయిన సంగతి తెలిసిందే. కొత్త కమిషనర్ గా ఆర్వీ కర్ణన్ ను నియమించింది ప్రభుత్వం. 2024 జూన్ లో రోనాల్డ్ రోస్ ని పక్కన పెట్టి జీహెచ్ఎంసీ కమిషనర్గా అమ్రాపాలి నియమించింది ప్రభుత్వం. ఐదు నెలల పాటు పనిచేయగానే అమ్రాపాలి ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో 2024 అక్టోబర్ లో బల్దియా బాస్ గా ఇలంబర్తిని నియమించారు. ఆరు నెలలు పని చేయగానే ఐఏఎస్ బదిలీల్లో భాగంగా ఇలంబర్తిని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్( MAUD) సెక్రెటరీగా బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ పై అవినీతి ఆరోపణలు రావడం, దానికి ఇలంబర్తి అంశాన్ని లింకు పెట్టడంతో వివాదం పెద్దదిగా మారింది. దీనిపై పొన్నం ప్రభాకర్ వివరణ ఇవ్వడమే కాకుండా అవినీతిని నిరూపించాలంటూ సవాల్ చేశారు. -
హైదరాబాద్ పబ్లో టాప్ హీరోయిన్... ఊపేస్తోందిగా..
గత ఏడాది లండన్లోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో అతిధులకు అనుకోని షాక్.. అప్పటి దాకా సంగీతం అందిస్తున్న లోకల్ బ్యాండ్ బృందం మధ్యలోకి అనూహ్యంగా దూసుకొచ్చిందో అందమైన యువతి. హఠాత్తుగా మైక్ తీసుకుని పాడడం ప్రారంభించింది. కాసేపట్లోనే అతిధుల హర్షధ్వానాలతో ప్రాంగణం మారుమోగిపోయింది. అప్పట్లో అది అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. ఆమె సాదా సీదా యువతి కాదు మరి...భారత చలనచిత్ర రంగంలో టాప్ హీరోయిన్స్లో ఒకరైన శృతి హాసన్.ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ నటి సరికా ఠాకూర్ కుమార్తె శృతి హాసన్, తెలుగు, తమిళం హిందీ చిత్రాల ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. ఆమె రెండు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఏడు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులతో సహా అనేక అవార్డులను గెలుచుకుంది. ఇటీవల రజనీకాంత్ నటించి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన రాబోయే చిత్రం కూలీ షూటింగ్ను శ్రుతి హాసన్ పూర్తి చేసింది. ఆమె అంతర్జాతీయ చిత్రం ‘ది ఐ’ ఫిల్మ్ ఫెస్టివల్స్లో సంచలనం సృష్టిస్తోంది.ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ఇటీవల భారతదేశంలో వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు నోచుకుంది కూడా. సానుకూల సమీక్షలను అందుకుంటోంది.ఇలా నటనా పరంగా అనేక రకాల సంచనాలను సృష్టిస్తోన్న శృతి...తన పేరును సార్ధకం చేసుకోవాలని అనుకుంటోంది. ఆమె పాటల ప్రపంచంలోనూ తన సత్తా చాటుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చిన్నతనంలోనే సంగీత శిక్షణ పొంది పాడటం ప్రారంభించింది తరువాత తన సొంత బ్యాండ్ను సైతం ఏర్పాటు చేసుకుంది. నటీమణులలో పాడే వారే తక్కువ అంటే స్వంత బ్యాండ్ కూడా ఉన్న ఏకైక హీరోయిన్ ఆమె మాత్రమే ఆమె పలు చిత్రాలకు సైతం పాడింది. ఈ సంవత్సరంలో రాబోయే కూలీ చిత్రంలో ఆమె పాత్రతో పాటు, మిస్కిన్ దర్శకత్వం వహించి సంగీతం అందించిన విజయ్ సేతుపతి రాబోయే చిత్రం ‘ట్రెయిన్‘ కు కూడా ఆమె తన గాత్రాన్ని అందించింది. ‘ఇట్స్ ఎ బ్రేక్ అప్ డా‘ పాట కోసం రెహమాన్ తో కలిసి పనిచేసింది. నటన గానం కాకుండా, శ్రుతి ఒక పాటల రచయిత కూడా. ఆమె ‘ఎడ్జ్,‘ ‘మాన్స్టర్ మెషిన్,‘ ‘ఇనిమెల్‘ వంటి ప్రసిద్ధ సింగిల్స్తో ఇండీ సంగీత రంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది.శ్రుతి తన స్పష్టమైన వ్యక్తిత్వం ప్రత్యేకమైన ఫ్యాషన్సెక్షన్కు ప్రసిద్ధి చెందింది.గాయని శ్రుతి హాసన్ మార్చి 28న హైదరాబాద్లోని ప్రముఖ పబ్ కమ్ క్లబ్గా పేరున్న ఓడియం బై ప్రిజంలో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వవలసి ఉంది. వయసు 21 ఏళ్లు అంతకంటే ఎక్కువ ఉన్నవారికి మాత్రమే ప్రవేశం అనే నిబంధనతో ఈ కన్సర్ట్ రాత్రి 8:00 గంటలకు ప్రారంభమై 4 గంటల 30 నిమిషాల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. టిక్కెట్లు ధరలు 1,000 నుంచి ఆపైన...బుక్మై షో ద్వారా విక్రయించారు కూడా అయితే ఏమైంతో ఏమో కానీ... ఆ షో వాయిదా పడింది. ఆ తర్వాత ఏప్రిల్ 28న శృతి హాసన్ ప్రదర్శన ఉంటుందని తిరిగి అనౌన్స్ చేశారు. అది కూడా వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి మే 3న శృతి రానున్నట్టు చెప్పారు. హైదరాబాద్కు రానున్న శ్రుతి, తన అభిమానులను ఆకట్టుకోవడానికి రాక్, సోల్ భారతీయ ప్రభావాల మిశ్రమాన్ని తీసుకువస్తోంది.ఈ నేపధ్యంలోనే శ్రుతి హాసన్ తాజాగా తన రాబోయే ప్రత్యక్ష ప్రదర్శన సన్నాహాల రిహార్సల్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ఆమె బ్యాండ్ సహచరులతో కలిసి ప్రాక్టీస్ సెషన్ లో మునిగిపోతున్న ఈ వీడియో, తెరవెనుక సంగీతం పట్ల ఉన్న ఆమె మక్కువను చూడటానికి అభిమానులకు వీలు కల్పిస్తుంది. తన ఇన్ స్ట్రాగామ్ పోస్ట్లో, శ్రుతి తన తోటి సంగీతకారులకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారిని ’నేరంలో సోదరులు’ అని పేర్కొంది. ఆమె ఇలా రాసింది, ‘మనం ఆ షో చేసి ఉంటే బాగుండేది కానీ చేయలేక పోయాం (మా తప్పు కాదు) కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడటానికి మేం ఇంకా వేచి ఉండలేం. త్వరలో మీ అందమైన ముఖాలన్నీ చూడాలనుకుంటున్నాను. నా అద్భుతమైన సంగీతకారులకు, నేరంలో ఉన్న నా సోదరులకు ఈ సంగీతం ప్రతిధ్వనించే ధైర్యం ఉన్న కొద్దిమంది ఆత్మలకు ధన్యవాదాలు. త్వరలో హైదరాబాద్లో కలుద్దాం, మీకు నా హృదయంలో చోటు ఉందని మీకు తెలుసు‘ అంటూ ఆమె అభిమానులను తన పోస్ట్ ద్వారా ఊరడించింది.ఎప్పుడూ సంగీతం పట్ల మక్కువ కలిగి ఉండే శ్రుతి హాసన్ ఈ సంవత్సరం తన సినిమా కమిట్మెంట్లను నిర్వహిస్తూనే మరిన్ని స్వతంత్ర పాటలను విడుదల చేయనుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రత్యక్ష ప్రదర్శనలకు ఆమె సిద్ధమవుతున్నందున, ఆమె సంగీత ప్రయాణం ఎలా సాగుతుందో చూడటానికి ఆమె అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతానికి, హైదరాబాద్లో ఆమె తొలి షో ఆమె శృతి మ్యూజికల్ జర్నీకి మలుపు కానుంది. -
నేచర్ క్యాంప్, ఫారెస్ట్ ట్రెకింగ్ అంటే ఇష్టమా..?
గచ్చిబౌలి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డెక్కన్ వుడ్స్, ట్రైల్స్ పేరిట వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీజీఎఫ్డీసీ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. 3వ తేదీ నుంచి మంరేవులలోని ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో సాయంత్రం 4 నుం మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు రాక్ బే నేచర్ క్యాంప్ ఉంటుందన్నారు. టీం బిల్డింగ్, టెంట్ పిచింగ రాత్రి పూట అడవిలో నడక, నైట్ క్యాపింగ్, క్యాంప్ ఫైర్, ఉదయం బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. (Summer Vacation వాయిద్యాలను పలికించడం ఆరోగ్యకరం)కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు ఎకో బస్ టూర్లో ఆడియో, వీడియో హాల్లో చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తారు. సీతాకొక చిలుకల మీద ప్రజెంటేషన్, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికిల్పై 75 థీమ్ పార్క్లు, వృక్ష పరిచయ క్షేత్రం చూపిస్తారు. అనంతరం జీవవైవిద్యంలో పాముల ప్రాముఖ్యతపై ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వివరిస్తుంది. వర్చువల్ వైల్డ్లైఫ్ సఫారీ, గిరిజన జీవన శైలి, సంస్కృతి, వెస్ట్రన్గార్డ్స్, ఈస్ట్రన్స్ గార్డ్స్, 9డి సినిమా, స్పేస్ అక్వైరియం, థీమ్ ఫారెస్ట్ను వీక్షించవచ్చు. ఏసీ బస్సులో మృగవని నేషనల్ పార్క్కు తీసుకెళ్తారు. 4వ తేదీన ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో బర్డ్స్ వాక్ నిర్వహిస్తారు. (అత్తగారు, ఆవకాయ పచ్చడి : ఉపాసన కొణిదెల వీడియో వైరల్)బొటానికల్ గార్డెన్లో సమ్మర్ డే క్యాంప్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. బర్డ్స్ వాక్, స్నేక్ షో, థీమ్ పార్క్లు, వైల్డ్ లైఫ్ సఫారీలను చూపిస్తారు. వివరాల కోసం ఫోన్: 9493549399, 9885298980. -
తెలంగాణ గొర్రెల స్కాంలో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో గొర్రెల స్కాంలో కీలకపరిణామం చోటుచేసుకుంది. గొర్రెల స్కాంలో దళారి మొయినుద్దీన్ అరెస్ట్ అయ్యాడు.ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టరుగా వ్యవహరించిన మొయినుద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అరెస్టు చేసేలోగానే అతడు దుబాయ్కి పారిపోయాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వచ్చిన మొయినుద్దీన్ను ఇమ్మిగ్రేషన్ సహకారంతో శుక్రవారం ఉదయం ఎయిర్ పోర్టులోనే ఏసీబీ అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఇప్పటివరకు గొర్రెల స్కాములో 17మంది అరెస్టయ్యారు. వారిలో మాజీమంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్, గొర్రెల మేకల పెంపకం సమైక్య మాజీ ఎండి రామచందర్ నాయక్, పలువురు వెటర్నరీ అధికారులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
ఘనంగా మైక్రోసాప్ట్ ఐడీసీ పినాకిల్ సమ్మిట్-2025
సాక్షి,హైదరాబాద్: ప్రపంచ దేశాల్లో కృత్రిమ మేధ (ai) వినియోగంలో భారత్ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా మైక్రోసాఫ్ట్కు చెందిన క్లౌడ్ బేస్డ్ టెక్ కంపెనీ గిట్ హబ్ ఓ నివేదికను విడుదల చేసింది. ప్రస్తుతం 1.7కోట్లకు పైగా డెవలప్ ఉన్న భారత్ 2028 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా అవతరిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది.ఈ దిశగా మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ (IDC) అడ్వాన్స్డ్ ఏఐపై దృష్టిసారిస్తూ మూడవ పినాకిల్ సమ్మిట్- 2025ను నిర్వహించింది. ‘అన్లాక్ ది ఎజెంటిక్ ఫ్యూచర్ - వేర్ ఏఐ ఏజెంట్ మీట్ హ్యూమన్ ఇంజెన్యూయిటీ’ అనే థీమ్ కొనసాగిన ఈ టెక్ సమ్మిట్లో పాల్గొన్న ఐడీసీ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్, కోర్ ఏఐ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జయ్ పారిక్,మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చంద్రోక్లు భారత్లో ఏఐ విస్తరణ, మైక్రోసాఫ్ట్ ఏఐ ఈకో సిస్టమ్ వంటి అంశాపై చర్చించారు. -
అరెస్ట్ చేసిన బాలుడు ఎక్కడ?
హైదరాబాద్: ఎలాంటి తప్పు చేయని తన కుమారుడిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ రాష్ట్ర వినియోగదారుల కమిషన్కు బుధవారం ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్..పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ మే 5వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏప్రిల్ 28న మహబూబ్నగర్ జిల్లా కడ్తాల్ పోలీస్స్టేషన్కు చెందిన పోలీసులు తన కమారుడు మేకల కళ్యాణ్పై ఎలాంటి కేసు నమోదు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ అలివేలు అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు దాఖలు చేసింది. పోలీసులు అక్రమ కస్టడీకి తీసుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్లి చూడగా అక్కడ తన కుమారుడు కనిపించలేదని పిటిషన్లో పేర్కొన్నారు.తర్వాత మూడు గంటల సమయంలో తన కుమారుడి ఫోన్ నుంచి కాల్ రాగా అతన్ని కోర్టులో హాజరు పరుస్తున్నామని చెప్పిన పోలీసులు కోర్టు ఎదుట కూడా హాజరు పర్చకుండా ఎక్కడికి తీసుకెళ్లారో కూడా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో న్యాయవాది అమర్నాథ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేస్తూ తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కమిషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేసుపై విచారణ జరిపించి మే 5వ తేదీలోపు పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది. -
థాయ్లాండ్లో హ్యాండ్లర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు మంగళవారం అరెస్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ‘హెచ్హెచ్ హ్యాండ్లర్’ థాయ్లాండ్లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. హవాలా నెట్వర్క్ మీద దృష్టి పెట్టిన పోలీసులు సహకరించిన వారి కోసం ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీíÙయల్ రిమాండ్లో ఉన్న అభిష్ క్, హర్షవర్థన్, ధావల్, రాహుల్లను పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఓజీ కుష్ పండించేదీ అతడేనా..? ఓరిజినల్ గ్యాంగ్స్టర్, మారువానా, హైడ్రాపోనిక్ గాంజా, ఓజీ కుష్ ఇలా వివిధ పేర్లతో పిలిచే గంజాయితో పాటు మ్యాజిక్ మష్రూమ్స్ను ‘హెచ్హెచ్ హ్యాండ్లర్’ సరఫరా చేస్తున్నాడు. ఈ గంజాయి థాయ్లాండ్లోనే ఎక్కువగా పండుతుంది. జబల్పూర్కు చెందిన హర్షవర్థన్కు ఓడల ద్వారా చేరింది కూడా థాయ్లాండ్ నుంచే. దీన్నిబట్టి ఈ ఓజీ కుష్ను హ్యాండ్లరే పండించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. థాయ్లాండ్లోని బ్యాంకాక్ నుంచి ఈ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. హైడ్రోఫోనిక్ టెక్నిక్ విధానంలో కృత్రిమ కాంతితో పండిస్తుంటారు. ఆన్లైన్లో విత్తనాలు ఖరీదు చేసి, ఎల్ఈడీ లైట్లను ఉపయోగించి గంజాయి మొక్కలను పెంచుతారు. ఏమాత్రం మట్టితో అవసరం లేకుండా ప్రత్యేకంగా తయారు చేసిన కుండీలు, ట్రేల్లో ఇసుక, కంకర లేదా నీటిలో అదనపు పోషకాలతో ఉపయోగించి సాగు చేస్తుంటారు. కొందరు మాత్రం కొబ్బరి పొట్టు నారలు, గులకరాళ్లు కూడా వాడతారు. నేలమీద పండే గంజాయి కంటే ఈ ఓజీ నాణ్యత ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఈ మొక్కలు ఓపెన్–రూట్ వ్యవస్థ ద్వారా పోషకాలు, ఆక్సిజన్ను నేరుగా తీసుకోవడమే దీనికి కారణం. వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యాపారం... ఈ డ్రగ్స్ క్రమవిక్రయాల దందా మొత్తం పక్కా వ్యవస్థీకృతంగా సాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఎన్క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఇండియా నుంచి తనకు వచ్చిన ఆర్డర్ల విషయాన్ని ‘హెచ్హెచ్ హ్యాండ్లర్’ ఆయా యాప్స్ ద్వారానే హర్షవర్థన్కు చేరవేస్తాడు. ఇతడు జబల్పూర్లో ఉన్న హవాలా ఏజెంట్కు ఆ కస్టమర్ వివరాలు పంపిస్తాడు. అతగాడు సదరు కస్టమర్ నివసించే ప్రాంతానికి చెందిన మరో హవాలా ఏజెంట్కు ఇవి అందిస్తాడు. ఆ వినియోగదారుడిని సంప్రదించే ఈ ఏజెంట్ డబ్బు ముట్టిన తర్వాత జబల్పూర్ ఏజెంట్కు బదిలీ చేస్తాడు. అతడి ద్వారా విషయం తెలుసుకునే హర్షవర్థన్ విషయాన్ని ‘హెచ్హెచ్ హ్యాండ్లర్’కు చెప్తాడు. ఔన్స్ (28.34 గ్రాములు) డ్రగ్కు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో అతడికి పంపిస్తాడు. ఆపై డ్రగ్ హ్యాండ్లర్ నుంచి హర్షవర్థన్కు వచి్చ... అక్కడ నుంచి డీటీడీసీ, శ్రీ తిరుపతి, శ్రీ ఆంజనేయులు కొరియర్స్లో కస్టమర్కు చేరుతుంది. హర్షవర్థన్ కూడా పోలీసుల నిఘాకు చిక్కకుండా ఈ పార్శిల్ బుక్ చేస్తున్నాడు. అక్కడ కస్టమర్ చిరునామా, ఫోన్ నెంబర్ తప్పుగా ఇస్తాడు. దాని ట్రాకింగ్ ఐడీని వినియోగదారుడికి పంపిస్తాడు. దీని ద్వారా ట్రాక్ చేసే కస్టమర్ ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరిందని గుర్తించిన వెంటనే అక్కడకు వెళ్లి తీసుకుంటారు. ఈ హవాలా, కొరియర్ నెట్వర్క్ పైనా హెచ్–న్యూ దృష్టి పెట్టింది. ఈ ముఠాలో కీలక పెడ్లర్గా ఉన్న హర్షవర్థన్కు చెందిన క్రిప్టో వాలెట్లో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన బిట్కాయిన్లు డిపాజిట్ అవుతున్నట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు. -
Hyderabad: నగరంలో 144 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: నగర కమిషనరేట్లో భారీ స్థాయిలో ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 144 మందికి స్థానచలనం కల్పించిన కొత్వాల్ సీవీ ఆనంద్..సస్పెన్షన్లో ఉన్న ముగ్గురికీ పోస్టింగ్స్ ఇచ్చారు. 42 శాంతిభద్రతల పోలీసుస్టేషన్లకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్హెచ్ఓ) మారగా...కొత్తగా ఏర్పడిన టోలిచౌకి ఠాణా తొలి ఎస్హెచ్ఓగా లావూరి రమేష్ నాయక్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం రెయిన్బజార్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, సీసీఎస్ విభాగాల్లోనూ కీలక మార్పులు జరిగాయి. ఇన్స్పెక్టర్ బదిలీల్లో ముఖ్యమైనవి ఇలా... -
హైదరాబాద్లో ప్రపంచస్థాయి బిస్కెట్ ఫ్యాక్టరీ
ప్రముఖ వ్యాపార సమ్మేళనం లోహియా గ్రూప్ హైదరాబాద్ శివారు మేడ్చల్ లో బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందుకోసం వచ్చే నాలుగేళ్లలో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు, 6,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఏడు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త హైస్పీడ్ ఆటోమేటెడ్ ఫెసిలిటీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 1,000 టన్నులు కాగా దీన్ని 5,000 టన్నులకు పెంచుకునే వీలుందని సంస్థ వెల్లడించింది. బిస్కెట్ల ఉత్పత్తికి కావాల్సిన పిండి, చక్కెర, బెల్లం, తేనె, పాల ఉత్పత్తులు, ఇతర సహజ పదార్ధాలను స్థానికంగా సేకరించనున్నారు. ఉత్పాదక రంగంలో మహిళల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన 'ఉమెన్ ఫస్ట్ ఎంప్లాయిమెంట్ డ్రైవ్'కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం 40 శాతానికి పైగా సిబ్బంది మహిళలేనని కంపెనీ తెలిపింది.బిస్కెట్ల తయారీ ప్రక్రియ వెనుక అధిక నాణ్యత పదార్థాలు, సంక్లిష్టమైన డిజైన్లు, అధునాతన బయోటెక్నాలజీ ఉన్నాయని లోహియా కన్ఫెక్షనరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా లోహియా లహోటి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్ గఢ్ లలో కార్యకలాపాలను ఏర్పాటు చేసిన ఈ సంస్థ త్వరంలో ఎగుమతులను ప్రారంభించాలని యోచిస్తోంది. -
‘జాతీయ కులగణన వ్యతిరేకి కాంగ్రెస్’
హైదరాబాద్: జాతీయ కులగణనకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి అంటూ కేంద్ర హెంశాఖ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కులగణన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం తమ ఘనతే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్కు బండి సంజయ్ చురకలంటించారు. ‘కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో జనాభా లెక్కల్లో కులగణనను చేర్చకపోవడమే నిదర్శనం. కులగణన చేయాలంటూ అన్ని పార్టీలు కోరినా పట్టించుకోని దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్సే. మోదీ సర్కార్ నిర్ణయం కాంగ్రెస్ ఘనతేనని చెప్పడం సిగ్గుచేటు. అదే నిజమైతే డూప్లికేట్ గాంధీల ఏలుబడిలో కులగణన ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలి. దేశవ్యాప్త కులగణన మోదీ సర్కార్ ఘనతే. రాష్ట్ర ప్రభుత్వ కులగణన సర్వే అంతా తప్పుల తడకే. కేసీఆర్ సమగ్ర సర్వేకు, రేవంత్ సర్కార్ సర్వేకు పొంతన లేకపోవడమే నిదర్శనం. కేంద్ర కులగణన అత్యంత శాస్త్రీయమైది. కులాల వారీగా జనాభా ఎంతో తేలిపోతోంది. జనాభా ఆధారంగా రిజర్వేషన్లలో న్యాయం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించండి’ అని బండి సంజయ్ కోరారు. -
రోజు రోజుకీ పెరుగుతున్న చింత చిగురు ధర
చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు అని పాత తెలుగు సినిమా పాట. చింత చిగురు రేటు చూడు.. ఆకాశాన్నంటున్న ధర చూడు అంటూ ఇప్పుడు పాడుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే చింత చిగురు ధర అమాంతం పెరిగి ఆహార ప్రియులను కలవరపెడుతోంది. దాని రేటు మటన్ ధరతో పోటీ పడుతుండడంతో వినియోగదారులు చింత చిగురు (Chinta Chiguru) కొనడానికి జంకుతున్నారు. చింత చిగురు కూరలు ఈసారి కుదరకపోవచ్చని నిట్టూరుస్తున్నారు.హైదరాబాద్: చింత చిగురు మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. రోజు రోజుకీ చింత చిగురు పసిడి ధరలాగా పైకి ఎగబాకుతుందే తప్ప కిందకు దిగిరావడం లేదు. భాగ్యనగరంలో శని, ఆదివారాల్లో జరిగే వారాంతపు సంతల్లో కిలో చింతచిగురు రూ.650 పలికింది. కానీ, ఈ ధర మంగళవారం రూ.800 చేరుకుంది. అంత ధర పెట్టి కొనుగోలు చేయకలేక చాలామంది వినియోగదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు. వర్షాలు (Rains) లేక చింత చిగురు రావడం లేదని విక్రయదారులు పేర్కొంటున్నారు. ధరలు ఎక్కువగా ఉండటం, కొనుగోలుదారులు ఆసక్తిని కనబరచకపోవడంతో విక్రయదారులు చింత చిగురును అమ్మడానికి ముందుకు రావడం లేదు. చదవండి: జీవామృత కేంద్రానికి రూ. లక్ష : కేంద్రం కొత్త మార్గదర్శకాలు తెలుసా? -
‘ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం’
హైదరాబాద్: కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ విజయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. జనగణనతో పాటు కులగణన నిర్వహిస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. కేంద్ర కేబినెట్ భేటీలో కులగణనపై నిర్ణయం తీసుకున్న అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు.‘దేశ చరిత్రలో మొదటిసారిగా కులగణన నిర్వహించిన రాష్ట్రం తెలంగాణ. కుల గణన తో తెలంగాణలో ఏ కులం వారు ఎంత నిష్పత్తిలో ఉన్నారని తేల్చి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం నిర్ణయం తీసుకొని పారదర్శకంగా కుల గణన సర్వే నిర్వహించడం జరిగింది’ అని ఆయన అన్నారు.కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాందేశవ్యాప్తంగా కులగణన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ‘భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా కులగణన జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ సూచన మేరకు తెలంగాణలో రేవంత్ రెడ్డి కులగణన చేశారు. రాహుల్ గాంధీ పోరాటం.. రేవంత్ రెడ్డి ఆలోచన విధానం వల్లనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం.. రాహుల్ గాంధీ సాధించిన విజయం. దేశ వ్యాప్తం గా ఉన్న బడుగు బలహీన వర్గాల విజయం ఇది. రాహుల్ గాంధీ పోరాటానికి భయపడే బీజేపీ ప్రభుత్వం కులగణన కోసం ముందుకు వచ్చింది. రాహుల్ , రేవంత్ దెబ్బకు కేంద్రం దిగివచ్చింది. బీసీ బిడ్డ కాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి కులగణనకు ముందుకు వచ్చారు. 56.36 శాతం బీసీలు ఉన్నారని తెలంగాణలో రేవంత్ రెడ్డి లెక్క తీశారు.బీసీ రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెడితే నేను బలపర్చాను.. అది నా అదృష్టం. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాం. జంతర్ మంతర్ ధర్నా కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. మా ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ ఆ నాడు మద్దతు ఇవ్వలేదు. గతంలో బీఆర్ఎస్ తన రాజకీయ అవసరాల కోసం సమగ్ర కుటుంబ సర్వే చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి దేశానికి మార్గదర్శనం చేశాడు. తెలంగాణ బీసీ కులగణనకు దిక్సూచిగా మారింది. కులగణన చేయకపోతే బడుగు బలహీన వర్గాల ఆగ్రహం తప్పదని బీజేపీకి అర్థమైంది. దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు వారి వాటా వారికి అందాల్సిందే. జనగణన లో కులగణన పకడ్బందీగా నిర్వహించి రిజర్వేషన్లను చట్టబద్దం చేయాలి’ అని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
'మైండ్బ్లోయింగ్ టాలెంట్'..! అటు ఇంజనీరింగ్, ఇటు మెడిసిన్..
జేఈఈ, నీట్ యూజీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. ఇందులో మంచి ర్యాంకు తెచ్చుకోవడం అనేది ఎందరో యువత కల. ఇంజనీరింగ్ వాళ్లు, జేఈఈ, మెడిసిన్ వాళ్లు నీట్ రాయడం జరుగుతుంది. అయితే ఈ అమ్మాయికి ఇంజనీరింగ్, మెడిసిన్ రెండూ ఇష్టమట. నిజానికి ఈ రెండు రంగాలు అత్యంత విరుద్ధమైనవి. ఏదో ఒక్కదాంట్లో రాణించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఏకంగా రెండింటిలోనూ బాగా రాణించడమే గాక రెండింటికి సంబంధించిన ఎంట్రెన్స్ టెస్ట్ల్లో కూడా మంచి ర్యాంకు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా అవి రెండు మిక్స్అయ్యి ఉండే కోర్సును అందించే కాలేజ్ కోసం అన్వేషించి మరీ అక్కడ సీటు సంపాదించింది. ఎంచక్కా చదివేస్తోంది కూడా. ఇంతకీ ఆ 'టాలెంటెడ్ గర్ల్' ఎవరంటే..?మన హైదరాబాద్కి చెందిన అమ్మాయి మింకూరి రిధిమా రెడ్డి. 10వ తరగతి వరకు తేజస్వి విద్యారణ్యలో, ఇంటర్ జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత జేఈఈ, నీటీ యజీ, బిట్శాట్, వీఐటీఈఈఈ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలన్నీ రాసింది. వాటన్నింటిలోనూ రిధిమాకు మంచి మార్కులే వచ్చాయి. అయితే ఆమె ఇంజనీరింగ్(Engineering), మెడిసిన్(Medicine) రంగాలు రెండూ.. అమిత ఇష్టం. అవి రెండు తనకు ఎంతో ఇంట్రస్టింగ్ సబ్జెక్టులని చెబుతోంది రిధిమా. అందుకోసం అని అవి రెండూ కలిపి అందించే కాలేజ్ల కోసం అన్వేషించి మరీ ఐఐటీ మద్రాస్ని సెలెక్ట్ చేసుకుంది. అక్కడ జాయిన్ అయ్యేందుకు ఐఐఎసీఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఐఏటీ)కి హాజరు కావాలని నిర్ణయించుకుంది. రిధిమా అనుకున్నట్లుగానే ఆ టెస్టలో మెరుగ్గా రాణించి ఆ కాలేజ్లో సీటు సంపాదించింది. అలా రిధిమా 2023లో ఐఐటీ మద్రాస్( IIT Madras)లో మెడికల్ సైన్స్, ఇజనీరింగ్ సైన్స్ కలగలిసిన కోర్సులో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది. ఈ మేరకు రిధిమా మాట్లాడుతూ..తాను ఐఐటీ మద్రాస్లోని iGEM (ఇంటర్నేషనల్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ మెషిన్) బృందంలో భాగం అని చెప్పుకొచ్చింది. ఇది జన్యుశాస్త్రం, పరిశోధన పట్ల అమిత ఇష్టమైన టీమ్ అని చెప్పుకొచ్చింది. తాము ప్రది ఏడాది జన్యు ఇంజనీరింగ్ ఆధారిత ప్రాజెక్ట్పై పనిచేస్తామని పేర్కొంది. ఆ ప్రాజెక్ట్లను పారిస్లోని గ్రాండ్ జాంబోరీలో ప్రదరిస్తామని తెలిపింది. తాను ఈ ఐఐటీలో ఉండటం వల్లే ప్రజలతో మరింత సమర్ధవంతంగా కమ్యూనికేట్ చేయడం సహకరించం నేర్చుకున్నాని అంటోంది. అలాగే క్లబ్లు, టెక్నికల్ టీమ్లలో పాల్గొనడం, ఈవెంట్ల నిర్వహించడం వల్ల కంఫర్ట్జోన్ నుంచి బయటపడటమే గాక సామాజికంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోగలిగానని చెబుతోంది.(చదవండి: సివిల్స్లో సక్సెస్ కాలేదు.. కానీ బిజినెస్లో ఇవాళ ఆ ఇద్దరూ..!) -
హైదరాబాద్లో భారీ బ్యాటరీ పరిశ్రమ
హైదరాబాద్: సిగ్ని ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నగరంలో భారీ బ్యాటరీ పరిశ్రమను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని ఈ-మొబిలిటీ వ్యాలీలో తన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) గిగాఫ్యాక్టరీ మొదటి దశను ప్రారంభించి భారతదేశ క్లీన్ ఎనర్జీ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది.ఇది దేశంలోనే మొదటి లీడ్ (LEED - లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్) అర్హత పొందిన అత్యాధునిక ఫ్యాక్టరీ. 1,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పూర్తి ఆటోమేటెడ్ ఫ్యాక్టరీని రూ.100 కోట్ల పెట్టుబడితో స్థాపించారు. గ్రిడ్-స్కేల్ స్టోరేజ్, ఎలక్ట్రిక్ వాహనాల (EV) కోసం 4.8 గిగావాట్-అవర్ల (GWh) బ్యాటరీ ప్యాక్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ఫ్యాక్టరీకి ఉంది.తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ కర్మాగారం క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడంతోపాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ప్రశంసించారు. ఇక ఫ్యాక్టరీ రెండవ దశ ఎలా ఉండనుందో సిగ్ని ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ వెంకట్ రాజారామన్ వెల్లడించారు. రెండో దశలో మరో రూ.150 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని 10.8 GWhకు విస్తరించనున్నట్లు చెప్పారు. 24 నెలల్లో పూర్తయ్యే ఈ విస్తరణ 1,000 పైగా ఉద్యోగాలను సృష్టించి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనుందని వివరించారు.ఈ గిగాఫ్యాక్టరీ మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ట్విన్ మోడలింగ్, స్మార్ట్-గ్రిడ్ ఇంటిగ్రేషన్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించి బ్యాటరీ పనితీరు, ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. సిగ్ని, ఐఐటీ-మద్రాస్తో భాగస్వామ్యం ద్వారా సోడియం-అయాన్ బ్యాటరీలు, సూపర్కెపాసిటర్ల వంటి తదుపరి తరం బ్యాటరీ పదార్థాలను అభివృద్ధి చేస్తోంది. ఇవి శక్తి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అరుదైన పదార్థాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. 1 GWh ఆర్డర్ పైప్లైన్తో, సిగ్ని ఎనర్జీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. -
వేసవి సెలవులు...అమ్మాయిల నైపుణ్యానికి మెరుగులు
ఘట్కేసర్: వేసవి సెలవులు అనగానే విద్యార్థులను అమ్మమ్మ, బంధువుల ఇళ్లు, విహారయాత్రలు పంపిస్తుంటారు. నేటి పోటీ ప్రపంచంలో అందరిలో ముందుంటేనే గుర్తుంపు ఉంటుంది. వేసవి సెలవుల్లో విద్యార్థులు అదనపు నైపుణ్యం సంపాదించడంపై దృష్టి సారిస్తే జీవితంలో రాణించవచ్చు. తద్వారా శారీరక, మానసిక వికాసం పెంపొందుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అందుకే వేసవి సెలవులు వృథా చేయకుండా పిల్లలకు ఏదో ఒకటి నేరి్పంచాలని తల్లితండ్రులు భావిస్తున్నారు. ఫీజులు చెల్లించి మరీ వారి ప్రతిభకు సానబెడుతు పిల్లల అభిరుచులకు అనుగుణంగా పలు అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న వారు ఫీజులు చెల్లించి శిక్షణ పొందుతుండగా పేద పిల్లలకు ఆ అవకాశం లభించడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థుల కోసం నూతనంగా వేసవి శిబిరం నిర్వహిస్తున్నామని, శిక్షణ అనంతరం విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేస్తామని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రాము, వైస్ ప్రిన్సిపాల్ రాములు తెలిపారు. ప్రతిభకు సాన... పేద విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి అలుగు వర్షిని నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు ఉచిత వసతి, భోజన సౌకర్యంతో పాటు సుశిక్షుతులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్ లలిత కళల పాఠశాలలో రాష్ట్రంలోని ఒక్కో గురుకులం నుంచి ప్రతిభగల ఐదుగురి చొప్పున సుమారు 1200 మంది విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు. అందులో పెయింటింగ్, డ్రాయింగ్, మట్టితో బొమ్మలు, కార్డున్, ఫొటోగ్రఫీ, నకాసీ పెయింటింగ్, అల్లికలు, జర్నలిజం వేద గణితం, చేతిరాత, బంజారా ఎంబ్రాయిడరీ అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు అదనపు నైపుణ్యం పెంపొందుంచుకునే అవకాశం లభిస్తుంది. విద్యార్థులు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొంటున్నారు. సమయం వృథా చేయకూడదని... వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకూడదని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల ప్రోద్భలంతో వేసవి శిబిరానికి వచ్చాను. బంజారా ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందుతున్నా. అందరితో కలిసి నేర్చుకోవడం సంతోషంగా ఉంది. – రిషిత, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఆలేరు నైపుణ్యం పెంచుకునే అవకాశం... వేసవి శిబిరంలో అరుదైన కళ నకాసీ పెయింటింగ్, వేదిక్ మ్యాథ్స్లో శిక్షణ పొందుతున్నాను. వ్యక్తిగత నైపుణ్యం పెంపొందించుకునే అవకాశం లభింంది. జీవితంలో మరిపోలేని శిబిరం. వేసవి శిక్షణ శిబిరం నిర్వాహణ చాలా బాగుంది. –లోహిత, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆలేరు ప్రతిభను వెలికి తీయాలని... తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల విద్యార్థుల ప్రతిభకు సానబెట్టడానికి వేసవి శిబిరం నిర్వహిస్తున్నాం. జీవితంలో విద్యార్థులు రాణించడానికి శిబిరం తోడ్పడుతుంది. సెలవులు సద్వినియోగం చేసుకునే వారికి బంగారు అవకాశం లభించింది.– వింధ్యారాణి, జోనల్ ఆఫీసర్ -
తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్తో చెక్ చేస్కోండిలా
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నాం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి ఇతరులు టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. గురుకులాల్లో 98 శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేట్ పాఠశాలల్లో 94.12 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా.. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమ టెన్త్ ఫలితాలను కింద ఇచ్చిన సాక్షి అధికారిక ఎడ్యుకేషన్ వెబ్ సైట్లో పొందవచ్చు. 👇 👉Server 1 https://results2.sakshieducation.com/Results2025/telangana/SSC/2025/ts-ssc-10th-class-results-2025.html👉Server 2 https://education.sakshi.com/sites/default/files/exam-result/TS-SSC-10th-Class-Results-2025-Direct-Link.html👉Server 3 http://results1.sakshieducation.com/results/SSC/ts-10th-class-results-2025.htmlసరికొత్త విధానం..కాగా.. ఈసారి గ్రేడింగ్ స్థానంలో మార్కుల మెమోలపై సబ్జెక్ల వారీగా మార్కులు, గ్రేట్లను ఇచ్చారు. ఈమేరకు కొత్త మెమో నమూనాను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో మార్కుల విధానాన్ని తొలగించి గ్రేడింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. 2009 నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. ఏ-1, ఏ-2, బీ-1,బీ-2, సీ-1, సీ-2, డి, ఈలుగా గ్రేడ్లను ఇచ్చేవారు. సబ్జెక్ట్ల వారీగా గ్రేడ్లతో పాటు సీజీపీఏ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ విధానాన్ని తొలగించి సీజీపీఏ కాకుండా సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించకుండానే సరికొత్త విధానాన్ని అమలు చేయడం పట్ల అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. -
కొవ్వొత్తులతో పీస్ వాక్..!
కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో, కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ లిమిటెడ్ (సీసీహెచ్ఎల్) ‘గ్లోబల్ యూనిటీ అగైనెస్ట్ టెర్రరిజమ్’ పేరిట వినూత్న రీతిలో సందేశాత్మక కార్యక్రమాన్ని నిర్వహించింది. బేగంపేటలోని క్లబ్ ప్రాంగణంలో కొవ్వొత్తులు చేత పట్టుకొని మోడల్స్ మంగళవారం ప్రదర్శన చేశారు. శాంతి, సామరస్యాన్ని ప్రోత్సహించే నినాదాలు ముద్రించిన ప్రత్యేక వస్త్రధారణలో మౌనంగా ‘పీస్ వాక్’ చేశారు. మృతి చెందిన పర్యాటకులకు నివాళిగా 26 కొవ్వొత్తుల ప్రదర్శనలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంట్రీ క్లబ్ సీఎండీ వై.రాజీవ్రెడ్డి మాట్లాడుతూ ‘గతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రవాద దాడులను ఖండిస్తూ నటుడు సునీల్ దత్ తో కలిసి ‘గ్రౌండ్ జీరో’ నిర్వహించామన్నారు. అలాగే శాంతి సామరస్యాల పట్ల తమ నిబద్ధతకు ప్రతీకగా లక్ష మంది సంతకం చేసిన చారిత్రాత్మక ‘ఫ్రెండ్షిప్ బ్యాండ్’ని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆమోదించారన్నారు. అదే క్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, తీవ్రవాదం ప్రపంచ ముప్పుగా మారిన నేపథ్యంలో దీనిని ఎదుర్కోడానికి అంతర్జాతీయ సహకారంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నామన్నారు. (చదవండి: పర్యావరణ హిత: ఈ చిత్రాన్ని మీకు సమర్పిస్తున్న వారు...) -
చదివేది ఏడో తరగతి.. వాడేది ఐ ఫోన్
జీడిమెట్ల(హైదరాబాద్): ఆ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఎవరూ చూడకుండా సంవత్సర కాలంగా ఇంట్లో ఐ ఫోన్ వాడుతున్నాడు. కుమారుడు ఐ ఫోన్ వాడటాన్ని గమనించిన తండ్రి.. ‘నీకు ఫోన్ ఎలా వచి్చంది’ అని నిలదీయడంతో అసలు విషయం చెప్పేశాడు. ‘మన షాపులోంచి రోజూ కొంత డబ్బు తీసి ట్యూషన్ మాస్టారుకు ఇచ్చేవాణ్ని. మాస్టారే ఈ ఫోన్ కొనిచ్చాడు’ అని బాలుడు తన తండ్రికి వివరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. షాపూర్నగర్కు చెందిన వ్యాపారవేత్త కమల్జైన్. ఆయన కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు. సంవత్సర కాలంగా బాలుడు తమ షాపులోంచి కొంత నగదు దొంగిలించసాగాడు. ఆ డబ్బును తనకు ట్యూషన్ చెప్పే మాస్టారుకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో బాలుడికి సదరు ట్యూషన్ మాస్టారు ఐ ఫోన్ కొనిచ్చాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుమారుడికి ట్యూషన్ చెబుతున్న వ్యక్తిపై జీడిమెట్ల పీఎస్లో కమల్జైన్ ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ట్యూషన్ మాస్టారు సందీప్పై కేసు నమోదు చేశారు. సంవత్సర కాలంగా కుమారుడు తమ షాపులోంచి డబ్బులు తీస్తున్న తండ్రి పసిగట్టకపోవడం గమనార్హం. అలాగే సంవత్సర కాలంగా కుమారుడు ఇంట్లో ఫోన్ వాడుతున్నా కుటుంబ సభ్యులు చూడకపోవడం మరో విచిత్రం. ఎవరైనా పిల్లలు ఇలాంటి పనులు చేస్తే వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని సీఐ గడ్డం మల్లేష్ తల్లిదండ్రులకు సూచించారు. -
హైదరాబాద్లో ఆజాద్ ఇంజినీరింగ్ తయారీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఈ వెర్నోవాకి చెందిన స్టీమ్ పవర్ సర్వీసెస్ అవసరాల కోసం హైదరాబాద్లో లీన్ తయారీ ప్లాంటును ప్రారంభించినట్లు ప్రెసిషన్ ఇంజినీరింగ్ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్ వెల్లడించింది. ఈ ప్లాంటు లో 180 మంది సుశిక్షితులైన ప్రొఫెషనల్స్ ఉండగా, రాబోయే రోజుల్లో వందల సంఖ్యలో మరింత మంది నిపుణులను రిక్రూట్ చేసుకోనున్నట్లు సంస్థ చైర్మన్ రాకేష్ చోప్దార్ వివరించారు. ఈ ఫ్యాక్టరీ నుంచి ఏటా 1,00,000 బ్లేడ్లను ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఆయిల్..గ్యాస్ తదితర రంగాల సంస్థలతో పటిష్టమైన భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు ఇలాంటి వ్యూహాలు తోడ్పడగలవని రాకేష్ తెలిపారు. -
యాదాద్రిలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మోటకొండూరు మండలం కాటేపల్లిలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. పేలుడు ఘటనలో కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది.ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మంగళవారం ప్రీమియర్ ఎక్స్పోజివ్ కంపెనీలో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా పెద్ద శబ్ధంతో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు మరణించినట్లు సమాచారం. కార్మికుల మరణంపై పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉండగా.. తీవ్రంగా గాయపడ్డ కార్మికులను భూవనగిరిలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. -
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
భద్రాద్రి కొత్తగూడెం,సాక్షి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రోటోకాల్ రగడ అధికార కాంగ్రెస్లో చర్చాంశనీయంగా మారింది. సొంత పార్టీ ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ కరువైంది. దమ్మపేట మండలం పూసికుంటలో మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పర్యటనలో గిరిజన ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు అవమానం జరిగింది.కోట్లాది రూపాయల పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు ఆహ్వానం అందలేదు. అధికారులు సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యేని పట్టించుకోలేదు. ఆహ్వానం అందకపోయినా కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల సమక్షంలో అధికారుల తీరుపై జారే మండిపడ్డారు. తీవ్ర ఆవేదనతో మాట్లాడారు. ఎమ్మెల్యే చచ్చిపోయాడనుకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శంకుస్థాపన నిలిపివేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..ఎమ్మెల్యే జారె ఆదినారాయణను సముదాయించేందుకు తన కారులోకి తీసుకెళ్లారు. ఎలాగోలా సముదాయించి ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో శంకుస్థాపన చేయించారు. అయినప్పటికీ ఎమ్మెల్యే జారె వర్గీయులు వెనక్కి తగ్గలేదు. అధికారుల నిర్లక్క్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. -
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్లు
సాక్షి, హైదరాబాద్: పలువురు ఐపీఎస్లు.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. భూదాన్ భూముల వ్యవహారంలో (Bhoodan Land Issue) కొద్ది రోజుల క్రితం హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 26 మంది ఆఫీసర్లకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ నెల 24న సింగిల్ బెంచ్ జస్టిస్ భాస్కర్రెడ్డి తీర్పు వెల్లడించారు. సింగిల్ బెంచ్ తీర్పుపై ముగ్గురు ఐపీఎస్లు అప్పీల్ చేశారు. మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు.కాగా, రాష్ట్రవ్యాప్తంగా భూదాన్ భూముల కబ్జా, అక్రమాలపై దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణ జరి పించాలని హైకోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సన్న ద్ధంగా ఉన్నారా? లేరా? అనే దానిపై వైఖరిని తెలియజేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కీలక స్థానాల్లోని ఉన్నతాధికారులని, వారిపై ఆరోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.తీర్పు వెలువడే వరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని అధికారులకు స్పష్టం చేసింది. తమ ముందున్న పిటిషన్పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాజ్యాంగం కల్పించిందని, ఆ మేరకు ఆర్టికల్ 226ను వినియోగించుకుని ఈ ఆదేశాలు ఇస్తున్నామని తేల్చిచెప్పింది.తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ భూములను విక్రయించడం, బదిలీ చేయడం సహా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ప్రతివాదులకు స్పష్టంచేసింది. అదీగాక, ఆరోపణల తీవ్రత దృష్ట్యా పిటిషన్ ఉపసంహరించుకునే అవకాశాన్ని పిటిషనర్కు ఇవ్వడం లేదని పేర్కొంది. ఒకవేళ పిటిషనర్ ఉపసంహరించుకోవాలని భావించినా అనుమతించవద్దని రిజిస్ట్రీని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూ కబ్జాలపై ఫిబ్రవరి 16న, మార్చి 8న అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అంబర్పేట్కు చెందిన బిర్లా మహేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసే చర్యలు చేపట్టారన్నారు.ఇప్పటికే కొందరు అనధికారికంగా భూములను బదిలీ కూడా చేయించుకున్నారని చెప్పారు. 26 మంది ఉన్నతాధికారులు భూకబ్జాలో ఉన్నందున ఈ అంశంపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం గత గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘భూదాన్ భూములపై బినామీల పేరిట రిజిస్ట్రేషన్, భూ కబ్జా, మనీలాండరింగ్పై విచారణ జరిపించాలని మహేశ్ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ కుంభకోణంలో ఉన్నారు.కొందరు అధికారులకు అందజేసిన పట్టాదారు పాస్బుక్లు, మ్యుటేషన్ ప్రొసీడింగ్లపై వివరాలు సమర్పించేలా రిజిస్ట్రేషన్, స్టాంపుల కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్కు ఆదేశాలు జారీ చేయండి. భూకబ్జాలో తెలంగాణతోపాటు ఏపీకి చెందిన సీనియర్ అధికారుల పాత్ర ఉంది. పిటిషనర్కు హక్కుగా ఉన్న భూమిని మోసపూరితంగా బదిలీ చేసుకున్నట్లు అధికారులు తప్పుడు డాక్యుమెంట్లు చూపించారు.అధికారులు భూరికార్డులను ఎలా తారుమారు చేశారో, తప్పుడు వారసత్వ పత్రాలు ఎలా తయారయ్యాయో.. పట్టాదార్ పాస్బుక్లను చట్టవిరుద్ధంగా ఎలా జారీ చేశారో దర్యాప్తు చేయాల్సి ఉంది. ధరణి పోర్టల్ను కూడా దుర్వినియోగం చేశారు. తన భూమి కోసం పోరాడుతున్న పిటిషనర్కు సాయం చేసే బదులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే 10కిపైగా లీగల్ నోటీసులు పంపారు.క్షమాపణ చెప్పకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. మోసపూరిత పాస్బుక్లను రద్దు చేయాలి. భూమిని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలి. సంబంధిత అధికారులపై విచారణకు ఆదేశించాలి’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇది అతి పెద్ద భూ కుంభకోణంలా కనిపిస్తున్నందున ఆ భూములకు సంబంధించి తదుపరి లావాదేవీలన్నింటినీ నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేశారు. -
మహిళా కార్పొరేటర్పై హనీమూన్ వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న తనపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ పోలీసులలతో పాటు, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు.కార్పొరేటర్ బానోత్ సుజాత నాయక్ ఫిర్యాదుతో Cr. No. 254/2025 U/s Sec. 3(2)(va), 3(1)(r)(w)(ii) SC/ST POA Act, 1989 & Sec. 79 BNS సెక్షన్ల కింద సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే అంశంపై వివరణ, విచారణకు హాజరవ్వాలంటూ మహిళా కమిషన్ సైతం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో మంగళవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం, ఎమ్మెల్యే సుధీరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరోజు జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు అడిగారు. లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చాను. కావాలని నాపై రాజకీయ కక్షతో పిర్యాదు చేశారు. ఈ అంశంపై లీగల్గా ఫైట్ చేస్తాను’అని వ్యాఖ్యానించారు.వివాదం నేపథ్యం ఇదే గత నెలలో ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రొటోకాల్ రగడతో మొదలైన వివాదం.. చిలికి చిలికి గాలి వానగా మారింది. ఎమ్మెల్యే కొన్ని పనులకు శంకుస్థాపన చేయగా.. అవే పనులకు బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి మళ్లీ శంకుస్థాపన చేశారు. దీంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే చేశాక మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.ఈలోపు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు. అయితే..కాసేపటికే మరో చోటులో శంకుస్థాపనలు పనులు జరగ్గా.. ఈసారి బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు.దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్మెట్ పీఎస్కు తరలించారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి..పీఎస్కు చేరుకుని వాళ్లను విడిపించారు. అరెస్ట్ సమయంలో కార్యకర్తలకు గాయాలు అయ్యాయని తెలుసుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు.వాళ్లను సరాసరి డీసీపీకి ఆఫీస్కు తీసుకెళ్లి ఉన్నతాధికారులకు జరిగింది వివరించారు.ఆపై బయటకు వచ్చి మాట్లాడిన ఆయన.. ఈ దాడుల వెనుక కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ప్రమేయం ఉందని, కార్పొరేటర్ల మధ్య హనీమూన్ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత పేరును కూడా ప్రస్తావించారు. దీంతో.. వివాదం రాజుకుంది. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై సుజాత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకానొక తరుణంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. -
హైదరాబాద్లో విషాదం.. రీల్స్ పిచ్చి.. ప్రాణాలు తీసింది
సాక్షి, మేడ్చల్: సోషల్ మీడియా సరదా యువకుడి ప్రాణం తీసింది. జవహర్నగర్లో రీల్స్ చేస్తూ తరుణ్(17) అనే యువకుడు క్వారీ గుంతలో పడి మృతి చెందాడు. రీల్స్ ప్రభావంతో తరుణ్ తన ఆరుగురి స్నేహితులతో కలిసి ఓ క్వారీ దగ్గర ఫోటో షూట్ చేస్తుండగా ఈ విషాదం జరిగింది. స్నేహితులతో ఈత కొడుతూ ఫొటోలు దిగుతూ లోతును గమనించకపోవడంతో ఈత రాక ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు తరుణ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సమాచారం తెలుసుకున్న జవహర్నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.కాగా, కొంతమందిలో సోషల్ మీడియా పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. త్వరగా ఫేమస్ అయిపోవాలని, తమ వీడియోలు వైరల్ అవ్వాలని కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి చేష్టలు చేయకూడదని ఎంతమంది చెప్పినా తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం లేదు. -
నిధుల సమీకరణకు ఫ్యాషన్ షో..
గ్లోరియస్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, రాయల్ మిస్టర్ ఇండియా వేడుకలను ఈ నెల 29, 30 తేదీల్లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సోమాజీగూడలోని ది పార్కు హోటల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్లో సోమవారం సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఫౌండర్ అండ్ డైరెక్టర్స్ స్నేహల్తో పాటు క్రాంతి, సబీనా, రిని, చతుర్వేది హాజరై వివరాలను వెల్లడించారు. జేసీఐ సికింద్రాబాద్ ప్యారడైజ్ మద్దతులో ఎస్ఎస్కే క్రియేషన్స్ ఆధ్వర్యంలో గ్లోరియస్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, రాయల్ మిస్టర్ ఇండియా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం అందాల పోటీ కాదని, ఇది ఒక లక్ష్యంతో ఏర్పడిన మిషన్ అని పేర్కొన్నారు. ఉమంగ్ ఫౌండేషన్, భారత సైన్యంతో కలిసి దేశ సరిహద్దు ప్రాంతాల్లోని పిల్లల కోసం పాఠశాలలు నిర్మించేందుకు నిధులు సమీకరిస్తున్నామన్నారు. పది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా తెలంగాణ జేసీఐ తరపున పాఠశాలల అభివృద్ధికి నిధుల సమీకరణ చేపడుతున్నామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో అందాల భామలు ర్యాంప్వ్యాక్ చేసి ఆకట్టుకున్నారు. (చదవండి: ఆభరణాల క్రియేటివిటీ వెనుక ఇంట్రస్టింట్ స్టోరీ ఇదే..!) -
GHMC: పది నెలలు.. నలుగురు కమిషనర్లు!
రాజధాని నగరంగా..తెలంగాణకు తలమానికంగా కీలకపాత్ర పోషిస్తున్న హైదరాబాద్ మహానగరంపై ప్రభుత్వం శీతకన్ను వేస్తోందా..అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. మహానగరాభివృద్ధిలో కీలకమైన జీహెచ్ఎంసీ నిర్వహణ తీరునే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. తరచుగా కమిషనర్లను మార్చడం..అభివృద్ధి పనులు నిలిచిపోవడం..నిధుల కొరత కారణంగా జీహెచ్ఎంసీ నిరీ్వర్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలా చేయడంలో ప్రభుత్వం ఉద్దేశం ఏంటో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బహుశా..ఎలాగూ రెండో, అంతకంటే ఎక్కువో కార్పొరేషన్లు చేసే యోచనలో ఉన్నందున కాబోలు ప్రభుత్వం జీహెచ్ఎంసీపై పెద్దగా శ్రద్ధ చూపుతున్నట్లు లేదు. పది నెలల వ్యవధిలోనే నలుగురు కమిషనర్లు రావడం అందుకు నిదర్శనమంటున్నారు జీహెచ్ఎంసీ గురించి తెలిసిన వారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేప్పటికి కమిషనర్గా ఉన్న రోనాల్డ్రాస్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ముగ్గురు కమిషనర్లు మారారు. గత సంవత్సరం ఆగస్ట్లో కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి ఏపీకి వెళ్లాల్సి రావడంతో, అక్టోబర్లో అదనపు కమిషనర్గా నియమించిన ఇలంబర్తిని నవంబర్ 14 నుంచి రెగ్యులర్ కమిషనర్గా నియమించారు. ఐదు నెలల్లోనే ఆయన్ను బదిలీ చేసి ఆర్వీ కర్ణన్ను తాజాగా నియమించారు. కారణాలేవైనా తరచూ కమిషనర్లు మారుతుండటంతో పరిస్థితి గందరగోళంగా మారింది. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లతో ఉన్న జీహెచ్ఎంసీలో ఆరువేల మందికి పైగా రెగ్యులర్ ఉద్యోగులున్నారు. ఔట్సోర్సింగ్, ఇతరత్రా వెరసి 30 వేల మంది వరకున్నారు. ఇంతపెద్ద వ్యవస్థను అర్థం చేసుకోవడానికే కనీసం ఆర్నెళ్లు పడుతుంది. ఆలోగానే మారిస్తే..కొత్తగా వచ్చేవారికి అదే పరిస్థితి ఎదురవుతుంది. తనదైన శైలితో.. ప్రస్తుతం జీహెచ్ఎంసీ నుంచి బదిలీ అయిన ఇలంబర్తి.. గతంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా పనిచేసిన అనుభవంతో కావచ్చు పాలనలో లోపాల్ని, ఇష్టారీతిన జరుగుతున్న వ్యవహారాల్ని, పెచ్చరిల్లిన అవినీతిని అడ్డుకునేందుకు నిశ్శబ్దంగానే పలు కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు.. సంస్థ ఆస్తులెన్నో తెలియని దిక్కుమాలిన స్థితిలో ఉన్న జీహెచ్ఎంసీని చక్కదిద్దే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఆధునిక సాంకేతికతతో అంగుళం కూడా తేడా రాకుండా జీహెచ్ఎంసీ ఆస్తుల్ని గుర్తించే పనుల్ని చేపట్టారు. ఇంజినీరింగ్ పనుల్లో, కాంట్టాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో లోపాలకు అడ్డుకట్ట వేశారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లలో అవకతవకల నివారణకు చర్యలు చేపట్టారు. స్ట్రీట్లైట్స్, సీఆర్ఎంపీ పనుల్లో అడ్డగోలు చెల్లింపులను గుర్తించి కట్టడి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఉన్నాయి. అవన్నీ గాడిన పడి ఒక దశకు రాకముందే ఆయన్ను బదిలీ చేయడంతో..కొత్త కమిషనర్కు పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. వదలరు.. కదలరు సుదీర్గకాలంగా జీహెచ్ఎంసీలో పాతుకుపోయిన వారి కొందరి ఆట కట్టించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు.రిటైరయ్యాక సైతం జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న వారందరినీ పంపించాలని,ఒకవేళ వారి సేవలు నిజంగా అవసరమైతే అందుకు కారణాలు తెలపాలని,ప్రభుత్వం అనుమతించాక తిరిగి కొనసాగించాలని గత నెలలో ప్రభుత్వం సూచించినప్పటికీ, జీహెచ్ఎంసీలో మాత్రం ఎక్కడి వారక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఇరవై మంది సేవలు మళ్లీ అవసరమని కోరినప్పటికీ, ప్రభుత్వం నుంచి అనుమతి రాకుండానే వారు కొనసాగుతూనే ఉన్నారు. మిగతా ప్రభుత్వ విభాగాల్లో ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక అలాంటి వారు కొనసాగుతుండగా, జీహెచ్ఎంసీలో మాత్రం అందుకు విరుద్ధంగా నడుస్తుండటం ఈ సందర్భంగా గమనార్హం. అలా కొనసాగుతున్న వారిలో కొందరు జీహెచ్ఎంసీకి పనులు చేయడం కంటే, జీహెచ్ఎంసీని అడ్డుపెట్టుకొని సొంత ప్రయోజనాల కోసం సాగిస్తున్న ‘ప్రైవేట్’ దందానే ఎక్కువని జీహెచ్ఎంసీ వర్గాల్లో వినిపిస్తోంది.ఇప్పుడిప్పుడే.. ఇలంబర్తి చేపట్టిన కొన్ని చర్యలు తొలుత అర్థం కాకపోయినప్పటికీ, కనిపిస్తున్న ఫలితాలతో జీహెచ్ఎంసీ మెరుగవుతోందనుకుంటున్న తరుణంలో బదిలీ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. రోనాల్డ్రాస్, ఆమ్రపాలి సైతం జీహెచ్ఎంసీని అర్థం చేసుకొని, గాడిలో పెట్టే తరుణంలోనే జీహెచ్ఎంసీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వానికి అప్పట్లో వారిని పంపించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడలాంటి పరిస్థితి లేకున్నా ఇలంబర్తి బదిలీతో జీహెచ్ఎంసీ పరిస్థితి ఏం కానుందో వేచి చూడాల్సిందే ! -
హైదరాబాద్లో బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో
హైదరాబాద్: ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్లో భాగమైన 'బిర్లా ఓపస్ పెయింట్స్'.. ఈరోజు హైదరాబాద్లో తన బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియోను (కంపెనీ యాజమాన్యంలోని కంపెనీ ఆపరేటెడ్ ఎక్స్పీరియన్స్ స్టోర్) ప్రారంభించామని ప్రకటించింది. గురుగ్రామ్, లక్నో, ముంబయి, నవీ ముంబయి, బెంగళూరులో ఇప్పటికే విజయవంతంగా ప్రారంభించిన అనంతరం, పెయింట్, డెకర్ పరిశ్రమను ఆవిష్కరణ, ప్రీమియం ఆఫర్లు, నిజంగా లీనమయ్యే కస్టమర్ అనుభవం ద్వారా మార్చాలనే బ్రాండ్ నిబద్ధతను ఈ విస్తరణ మరింత బలోపేతం చేస్తుంది.బిర్లా ఓపస్ పెయింట్స్ హైదరాబాద్ స్టూడియో సాధారణ రిటైల్ ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకమైన, లీనమయ్యే అనుభవంగా మార్చడానికి ఆలోచనాత్మకంగా రూపొందించారు. ఈ పెయింట్ స్టూడియో సంప్రదాయ పెయింట్ దుకాణాలకు అతీతంగా సృజనాత్మకతకు కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ కేంద్రం. ఇది వినియోగదారుల సృజనాత్మకతను మరింత కొత్తగా ఆవిష్కరించుకునేందుకు, నిజ జీవిత వాతావరణంలో రంగులను తాకడానికి, అనుభూతి చెందడానికి మరియు ఆస్వాదించేందుకు అనుమతిస్తుంది.వినియోగదారుల వ్యక్తిగతీకరించిన గైడ్ ద్వారా షేడ్ ఎంపిక, టెక్చర్లు, వినియోగించే నైపుణ్యాలపై నిపుణుల నుంచి ఉచిత మార్గదర్శకత్వాన్ని కూడా పొందవచ్చు. అధునాతన విజువలైజేషన్ సాధనాలు ఇంటి యజమానులు వారు ఎంచుకున్న రంగులు నిజ జీవిత సెట్టింగ్లలో ఎలా కనిపిస్తాయో ముందస్తుగా వీక్షించేందుకు సహాయపడతాయి. పెయింట్లకు మించి, పెయింట్ స్టూడియో వాల్కవరింగ్లు, డిజైనర్ ఫినిషింగ్లు మరియు సమగ్ర డెకర్ సొల్యూషన్ కోసం స్పెషాలిటీ కోటింగ్ ఎంపికలను కూడా కలిగి ఉంది.ఈ స్టోర్ 170 కంటే ఎక్కువ ఉత్పత్తులను ప్రదర్శించడమే కాకుండా, రంగుల ఎంపికపై నిపుణుల సంప్రదింపులు, వినూత్న అప్లికేషన్ టెక్నిక్లు, గొప్ప స్థానిక వారసత్వం నుంచి ప్రేరణ పొందిన క్యూరేటెడ్ డెకర్ సొల్యూషన్లతో సహా పలు ప్రత్యేక సేవలను అందిస్తుంది. ఇది స్థానిక అభిరుచులు, వారసత్వానికి అనుగుణమైన ఎంపికలతో శక్తివంతమైన నగర స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రత్యేకమైన షేడ్స్ను క్యూరేటెడ్ డెకర్ ప్యాకేజీలను అందిస్తుంది.దేశ వ్యాప్తంగా.. తన రిటైల్ పాదముద్రను విస్తరించే లక్ష్యంతో బిర్లా ఓపస్ పెయింట్స్ వృద్ధి వ్యూహంలో ఈ ప్రారంభం కూడా ఒక ముఖ్యమైన అడుగు. అనుభవపూర్వక రిటైల్పై దృష్టి సారించి, రాబోయే నెలల్లో ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, జైపూర్, అహ్మదాబాద్ మరియు సూరత్లలో అదనపు అనుభవ కేంద్రాలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.బిర్లా ఓపస్ పెయింట్స్ సీఈఓ రక్షిత్ హర్గవే మాట్లాడుతూ, “హైదరాబాద్లోని మా కొత్త పెయింట్ స్టూడియో కేవలం రిటైల్ స్థలం మాత్రమే కాదు, ఇది మీ పెయింటింగ్ అవసరాలకు ఒక అనుభవ కేంద్రం. అత్యాధునిక సాంకేతికత నుంచి స్థానికంగా ప్రేరణ పొందిన షేడ్ ప్యాలెట్ల వరకు, వినియోగదారులు, నిపుణులు అన్వేషించేందుకు, ప్రయోగాలు చేయడానికి, వ్యక్తీకరించడానికి మేము ఒక స్థలాన్ని సృష్టిస్తున్నాము. భారతదేశం పెయింట్లతో నిమగ్నమయ్యే విధానాన్ని మార్చడానికి, పెయింటింగ్ ప్రయాణాన్ని మరింత వ్యక్తిగతీకరించేందుకు, లీనమయ్యేలా.. స్ఫూర్తిదాయకంగా మార్చడానికి మా నిబద్ధతను ఈ స్టూడియో ప్రతిబింబిస్తుంది’’ అని వివరించారు. -
అందమైన పక్షులను వీక్షించాలనుకునే పిల్లలకోసం ఎర్లీబర్డ్ వర్క్షాప్
భారతీయులలో పక్షులను వీక్షించడం అనేది అభిరుచిగా అభివృద్ధి చెందుతోంది. అయితే, ఆ అనుభవాన్ని మరింత అందంగా ఆనందకరమైన అనుభవంగా మిగిల్చేందుకు ఎర్లీ బర్డ్ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎర్లీ బర్డ్ ప్రత్యేకంగా పిల్లల కోసం ఒక వర్క్షాప్ను నిర్వహిస్తోంది.తద్వారా పక్షుల ప్రపంచంలోకి చిన్నారులు మరింత డీప్గా వెళ్లేందుకు ,ఇతర జీవరాశులను నిశితంగా గమనించే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎర్లీ బర్డ్ ప్రకటించింది. ఈ వర్క్షాప్ను ఆన్లైన్లో అందించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ బర్డ్ లవర్స్ చేరాలని ఆశిస్తోంది.మే 11 నుండి జూన్ 8 వరకు జరిగే 6వ ఎడిషన్ నిర్వహిస్తున్నట్టు ఎర్లీ బర్డ్ తెలిపింది. యంగ్ బర్డర్స్ వర్క్షాప్ 2021లో ఆన్లైన్ వర్క్షాప్గా ప్రారంభమైందనీ,అప్పటి నుండి ఈ ఫార్మాట్లో కొనసాగుతోందని పేర్కొంది. ఇప్పటివరకు, దాదాపు 200 మంది పిల్లలు ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు.ఈ వర్క్షాప్ 10-13 సంవత్సరాల మధ్య వయస్సు గల యువ పక్షి పరిశీలకుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది 4 వారాల ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ రూపంలో ఉంటుంది. ప్రతి వారం, పాల్గొనేవారు పక్షులకు సంబంధించిన విభిన్న ఇతివృత్తాలను అన్వేషిస్తారు. ఈ సెషన్లు పూర్తిగా ఆన్లైన్లో ఉంటాయి .మల్టీమీడియా, గైడెడ్ ఇంటరాక్షన్లు, ఉల్లాసమైన చర్చలు , కార్యకలాపాల మిళితంగా ఈ వర్క్షాప్ ఉండనుంది.పక్షుల గురించి లోతైన పరిశీలనలను సులభతరం చేయడానికి సంబంధించిన కథనాలు అందిస్తుంది. ఇందులో పాల్గొనేవారు తమ ఇళ్ల చుట్టూ ఉన్న పచ్చని ప్రదేశాలను స్వతంత్రంగా అన్వేషించడంలో సహాయపడతాయి. ఇది వారి వేసవి సెలవుల్లో అద్భుతమైన అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది. వారపు ప్రత్యక్ష సెషన్లు వరుసగా వారాంతాల్లో ఆన్లైన్లో అందిస్తాయిరు. ప్రతి ఒక్కటి ఎంచుకున్న థీమ్ గురించి నేర్చుకున్న విషయాలను తిరిగి పొందడమే కాకుండా పాల్గొనేవారు స్వయంగా కొనసాగించగల కొత్త కార్యకలాపాలను కూడా పంచుకునే ఇలస్ట్రేటెడ్ యాక్టివిటీ షీట్తో ఉంటాయి.ఈ వర్క్షాప్ పాల్గొనేవారు ఎప్పుడూ గమనించిన, తమ ఇళ్ల చుట్టూ ఉన్న వాతావరణాన్ని నిజంగా తెలుసుకోవడానికి అనుమతిస్తుందని నిర్వహికులు తెలిపారు. వర్క్షాప్కు హాజరు కావడానికి ఉచితం. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టిసిపెంట్స్, మెటీరియల్కు సంబంధించి రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. https://bit.ly/ybw_2025 అనేలింక్ ద్వారా వర్క్షాప్ రిజిస్ట్రేషన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అలాగే విద్యావేత్తలు, తల్లిదండ్రులు , ప్రకృతి ఔత్సాహికులు ఎవరైనా వారి వారి ప్రాంతాలలోని పిల్లల కోసం ఇలాంటి వర్క్షాప్ను నిర్వహించడానికి ఆసక్తి ఉన్నవారికి, తాము'యంగ్ బర్డర్స్ కోసం వర్క్షాప్ నిర్వహిస్తామని కూడా ప్రకటించింది. ఈ ఉచిత గైడ్ https://early-bird.in/ybw-guideను ఎర్లీ బర్డ్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎర్లీ బర్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎర్లీ బర్డ్ఎర్లీ బర్డ్ అనేది పిల్లలను పక్షులు , ప్రకృతికి దగ్గరగా తీసుకురావాలనే ఆకాంక్షతో పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ. నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (NCF)లో ఒక భాగం. -
ఆటల పండుగ వచ్చేసింది...ఇవిగో పూర్తి వివరాలు
సనత్నగర్: వేసవి సెలవుల జోష్ మొదలైంది. నిన్నమొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీపట్టిన చిన్నారులు ఇక మైదానాల్లో తమకిష్టమైన క్రీడల్లో సందడి చేయనున్నారు. ప్రతియేటా లాగానే ఈ సారి కూడా జీహెచ్ఎంసీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణను చేపట్టింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఈ సారి కాస్తా ఆలస్యం కాగా ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా వేసవి క్రీడా శిబిరాలు అందుబాటులోకి వచ్చాయి. వేసవి క్రీడా శిక్షణ సామగ్రి సైతం ఆయా డివిజన్లకు చేరుకున్నాయి. సనత్నగర్, అమీర్పేట డివిజన్లలో అతిపెద్ద క్రీడా సౌధాలతో పాటు మైదానాలకు కొదువ లేదు. గ్రేటర్లో ఎక్కడా లేనివిధంగా అన్ని రకాల ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్లో ఆయా చోట్ల శిక్షణ కొనసాగుతుంటుంది. సాధారణంగానే నిరంతర శిక్షణ ఉంటుంది. అయితే వేసవి సెలవుల దృష్ట్యా వాటి స్థానంలో శనివారం నుంచి మే 31 వరకు ప్రత్యేక శిక్షణ కొనసాగనుంది. ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం! ఎప్పటిలాగానే అమీర్పేట్ జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సనత్నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లతో పాటు వివిధ క్రీడా ప్రాంగణాలు వేసవి శిక్షణ శిబిరాలకు వేదికయ్యాయి. క్రికెట్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, షటిల్, జిమ్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్, హాకీ, యోగ, చెస్, కరాటే....ఇలా వివిధ రకాల క్రీడాంశాల్లో జీహెచ్ఎంసీ తరుపున శిక్షణ ఇస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరాల ద్వారా కొనసాగే ఆటల్లో శిక్షణ పొందేందుకు 5 నుంచి 16 ఏళ్ళ మధ్య వయస్సున్న వారు అర్హులుగా నిర్ణయించారు. ఆసక్తి గల బాలబాలికలు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ క్రీడా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి తెలిపారు. వేసవి శిబిరాల్లో స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ మినహాయించి అన్ని క్రీడల్లో శిక్షణ పొందేందుకు రూ.10 ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవచ్చు. స్కేటింగ్, క్రికెట్లో మాత్రం వేసవి శిక్షణ కోసం రూ.50లు చెల్లించాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ శిక్షణకు రూ.500లు చెల్లించాలి.వేసవి శిక్షణ శిబిరాలకు హాజరయ్యే బాలబాలికలు స్పోర్ట్స్.జీహెచ్ఎంసీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి పిల్లల పేరు, వివరాలు నమోదు చేసి, ఇష్టమైన క్రీడను ఎంపిక చేసుకుని సూచించిన ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగుతాయి. స్కేటింగ్ వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: పవన్కుమార్ ఫోన్: 98665 13604 బాక్సింగ్ వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.10, కోచ్: ప్రకాశ్ ఫోన్: 93907 65412 జిమ్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.200, కోచ్: విక్రమ్ ఫోన్: 91772 85745 బ్యాడ్మింటన్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: సురేష్ ఫోన్: 99498 14362 హాకీవేదిక: అమీర్పేట్ క్రీడామైదానం ఫీజు: రూ.10, కోచ్: దర్శన్సింగ్ , ఫోన్: 98497 21703 కరాటే వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.10, కోచ్: బాబు, ఫోన్: 96181 33057జిమ్నాస్టిక్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్పేట డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: మహేష్ ఫోన్: 90002 77716 యోగా వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: మనోజ్ ఫోన్: 99639 78509 హ్యాండ్బాల్ వేదిక: సనత్నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ , ఫీజు: రూ.10, కోచ్: ఇమ్రాన్ఖాన్ ఫోన్: 91772 39786 బాస్కెట్బాల్ వేదిక: సనత్నగర్ ఎస్ఆర్టీకాలనీ ఇమ్మానుయేల్ చర్చి సమీపంలోని గ్రౌండ్ ఫీజు: రూ.10 కోచ్: నయిముద్దీన్, ఫోన్: 98483 96922వాలీబాల్ వేదిక: సనత్నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ ఫీజు: రూ.10, కోచ్: చిన్ని, పెద్ది ఫోన్ :99599 51499 క్రికెట్ వేదిక: సనత్నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ , ఫీజు: రూ.100, కోచ్: రాజ్కిరణ్ ఫోన్: 97041 59549 ఇదీ చదవండి: చింత చిగురా మజాకా.. కాస్త దట్టిస్తే చాలు ఆహా..! -
Himayat Nagar: పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనం లిఫ్ట్లో దారుణ హత్య
హైదరాబాద్,సాక్షి: హిమాయత్ నగర్లో దారుణం జరిగింది. దోమలగూడా పీఎస్ పరిధిలో హిమాయత్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనం లిఫ్ట్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు బాధితుణ్ని హత్య చేశారు. అనంతరం, బ్యాంకు లిఫ్ట్లో పడేసి వెళ్లారు. హత్యపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో ఆధారాల్ని సేకరిస్తున్నారు. -
పాతబస్తీలో ఈడీ అధికారులు సోదాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. పాతబస్తీలోని పలువురు ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. తెలంగాణలో భూదాన్ భూములు, మహేశ్వరం భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. భూదాన్ భూములను అక్రమంగా ఆక్రమించి లే-అవుట్ చేసి మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా అనే వ్యక్తులు అమ్మకాలు జరిపారు. దాదాపు వంద ఎకరాల భూమిని విక్రయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగి.. పాతబస్తీలో మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నిస్, శర్పాన్, సుకుర్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఇక, గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అమాయ్ కుమార్ను ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. -
సాహసం చేద్దాం బ్రదర్..! ఈ సమ్మర్లో చూడాల్సిన బెస్ట్ అడ్వెంచర్ స్పాట్స్..
వేసవి సెలవులను ఎంజాయ్ చేయడంలో ఇప్పుడు అడ్వెంచర్స్ కూడా భాగమవుతున్నాయి. గతంలో ఈ తరహా సాహస వినోదాల కోసం విహార యాత్రలకు వెళ్లినప్పుడు మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు నగరం నుంచి కేవలం 30కి.మీ నుంచి 200 కి.మీ పరిధిలోనే పలు రకాల అడ్వెంచర్ స్పాట్స్ సాహసికులను, ఔత్సాహికులను ఆహ్వానిస్తున్నాయి. వీకెండ్లో కాసింత ఉత్కంఠ, మరి కాసింత ఉద్వేగవంతమైన అనుభూతిని పొందేందుకు వినోదాన్ని మేళవించిన అనుభవాలను పొందాలనుకుంటే.. కచ్చితంగా ఇలాంటి వారి కోసమే అన్నట్లు పలు స్పాట్స్ ఆహ్వానిస్తున్నాయి. అయితే ఈ సాహసాలు ఏవైనా అవగాహన పెంచుకుని, ముందస్తు శిక్షణ తీసుకున్న అనంతరమే ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. మన దేశంలో తొలిదశలో ఉన్న సాహసికులను ఆకర్షించేది అడ్వెంచర్ పారా గ్లైడింగ్ దాదాపు 4 దశాబ్దాల క్రితమే మొదలైనప్పటికీ.. గత ఐదారేళ్లుగా ఈ క్రీడా వినోదానికి బాగా ఆదరణ పెరిగింది. వందల/వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు చూస్తూ ఓ గ్లైడర్/ కనోపి సాయంతో గాల్లో ఎగరడం ఒక అద్భుతమైన అనుభూతి. దీనిని ఎంజాయ్ చేయాలంటే.. నగరం నుంచి ఓ 50 కిమీ ప్రయాణించాలి. షామీర్పేట్, తుర్కపల్లి దగ్గర ఉన్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ పరిసరాల్లో ఈ అడ్వెంచర్ యాక్టివిటీ నిర్వహిస్తున్నారు.హైలెస్సో.. హైలెస్సా అంటూ నదిలో బోట్లు నడిపే కయాకింగ్ సాహసాలందు ఓ గొప్ప అనుభూతిని పంచుతుందంటున్నారు సాహసికులు. నీళ్లలో పడవను స్వయంగా నడుపుకుంటూ వైవిధ్యభరిత అనుభూతిని అందుకోవాలనునే వారిని.. సుమారు 100 కి.మీ.దూరంలోని వికారాబాద్ జిల్లాలో ఉన్న కోటిపల్లి రిజర్వాయర్ ఆహ్వానిస్తోంది. నీళ్లలో పడవల యానం.. మొదటిసారిగా ప్రయతి్నస్తున్నవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అనుభవజు్ఞలైన వారికి మరింత ఆస్వాదించదగిన అనుభవం. గుహల అన్వేషణ.. హిమాలయాల కంటే పాతవైన ఈ పర్వత సమూహాల్లో గుహల అన్వేషణకు పాండవుల గుట్ట ప్రత్యేక చిరునామా. అక్కడ జంతువులు, పురాతన చిహ్నాలతో కూడిన ప్యాలియోలిథిక్ రాక్ పెయింటింగ్స్ కనిపిస్తాయి. నగరం నుంచి సుమారు 195 కిమీ దూరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఈ గుట్టలో గుహలను శోధించడం.. ఓ సాహసం మాత్రమే కాదు చరిత్రను గుర్తుచేసుకోవడం కూడా. దీనిని సాహసాలను ఇష్టపడేవారి వారాంతపు వినోదానికి సరైన ఎంపిక అనవచ్చు. డర్ట్ బైక్.. ఏటీవీ రైడ్స్.. ఆఫ్–రోడ్ థ్రిల్ కోరుకునే వారికి నగరం నుంచి 85 కి.మీ దూరంలో ఉన్న అనంతగిరి హిల్స్ సరైన అడ్రెస్ అని చెప్పాలి. అక్కడ అడ్వెంచర్ చేయడానికి డర్ట్ బైకులు మాత్రమే కాదు ఏటీవీ రైడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కొండలు, చెట్లు రాళ్లు రప్పల నడుమ ప్రత్యేకంగా రూపుదిద్దిన రేసింగ్ ట్రాక్పై చేసే డర్ట్ బైక్స్, ఏటీవీ రైడ్స్ సాహసికులకు థ్రిల్ని అందిస్తాయి. జిప్ లైనింగ్.. నగరం నుంచి 35 కి.మీ దూరంలో ఉన్న ఘట్కేసర్ దగ్గరలోని పెబుల్ బీచ్ అడ్వెంచర్ క్లబ్లో జిప్ లైనింగ్ ట్రిప్లు ఉన్నాయి. వీటిని పిల్లలకూ, పెద్దలకూ సరిపోయేలా రూపుదిద్దారు. ఇంకా నగరం చుట్టు పక్కల బ్యాలెన్స్వాక్, ఫారెస్ట్ క్యాంపింగ్, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్.. లతో పాటు మరిన్న వైవిధ్యభరిత సాహస వినోదాలు అందుబాటులో ఉన్నాయి. తగినన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వీటిని ఎంజాయ్ చేస్తే చక్కని సమ్మర్ అనుభూతిని అందుకోవచ్చు. రాప్పెలింగ్.. స్కై సైక్లింగ్.. ఓ వీకెండ్ను వైవిధ్యభరితంగా, ఉద్విగ్నంగా గడపాలంటే స్కై సైక్లింగ్ మరో మంచి ఎంపిక. ఇది నగరం నుంచి 105కి.మీ దూరంలో ఉన్న సిద్ధిపేట జిల్లాలోని కోమటి చెరువు దగ్గర అందుబాటులో ఉంది. ఈ స్కై సైక్లింగ్ చేస్తూ ఆ చెరువు అందాలను, పరిసర ప్రదేశాల్లో అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. రాక్ క్లైంబింగ్.. తెలంగాణలో అనేక కొండలు, గుట్టలు రాక్ క్లైంబింగ్కు ప్రసిద్ధి చెందాయి. అయితే భువనగిరి కోట ప్రత్యేక శైలి నిర్మాణం రాక్ క్లైంబింగ్ సాహసానికి చారిత్రాత్మక ఆకర్షణను అందిస్తుంది. ఇది నగరం నుంచి దాదాపు 105 కిమీ దూరంలో ఉంది.బంగీ జంపింగ్.. ఇప్పటికే చాలా సినిమాల్లోనూ, బయటా స్టార్స్ చేయగా చూసి ఉంటారు. అలాంటి బంగీ జంపింగ్ నగరవాసులకు కూడా చేరువలోకి తెచ్చింది లియోనియా రిసార్ట్. నగరం నుంచి 30 కి.మీ దూరంలో ఉన్న ఈ రిసార్ట్కు వెళితే ఈసాహసాన్ని ఆస్వాదించవచ్చు. (చదవండి: అరేబియా సౌందర్యం..కన్నడ దైవత్వం..! ఏకంగా ఆరు రోజులు, ఐదు రాత్రులు..) -
అబ్బో.. అబ్బూరి బ్రదర్స్!
అబ్బూరి సతీష్, అబ్బూరి వెంకట్, అబ్బూరి రామకృష్ణ.. అబ్బూరి ఫ్యామిలీ చేతిలో మా కష్టార్జితాన్ని పోసి పూర్తిగా మోసపోయాం. మాలా మీరెవరూ మోసపోవద్దు. వీళ్లు పెద్ద మోసగాళ్లు. నీతి, నిజాయితీ అన్నదే లేదు. ఇక్కడ మమ్మల్ని మోసం చేసినట్లే పెద్ద వెంచర్ పేరుతో వైజాగ్లో వ్యాపారం మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. – హైదరాబాద్లో ఉర్సా బాధితుల ఆక్రోశం సాక్షి, అమరావతి: మోసాలే లక్ష్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిన అబ్బూరి బద్రర్స్ హైదరాబాద్లో విల్లాల పేరుతో అనేక మందికి కుచ్చుటోపీ పెట్టారు! తాజాగా ఉర్సా ముసుగులో విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా కొట్టేశారు! ఈ బాగోతం బయట పడటంతో ముసుగు దొంగల వెనక ఉన్న ముఖ్యనేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టైంది. ఈ నేపథ్యంలో ఓ ఆవారా కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల భూమిని ఎలా ధారాదత్తం చేసిందని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అబ్బూరీ.. ఇది నిజం కాదా? ఉర్సా క్లస్టర్స్లో ప్రధాన ప్రమోటర్గా ఉన్న సతీష్ అబ్బూరి ఫ్యామిలీ ‘ట్వంటీ ఫస్ట్ సెంచురీ’ పేరుతో పలు డొల్ల కంపెనీలను నెలకొల్పి చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో ఉంటున్నామని.. ఎన్నారైలమని.. తమ నెట్వర్త్ రూ.వందల కోట్లంటూ అబ్బూరి బ్రదర్స్ హైదరాబాద్లో విల్లాలు కడతామని ప్రచారం చేసుకుని కష్టార్జితాన్ని ధారపోసిన వారికి కుచ్చుటోపీ పెట్టారు. ముగ్గురు అన్నదమ్ముల్లో వెంకట్ అబ్బూరి, సతీష్ అబ్బూరి అమెరికాలో ఉద్యోగాలు చేస్తుండగా హైదరాబాద్లో రామకృష్ణ అబ్బూరి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించారు.అమెరికాలో ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్ ఎల్ఎల్సీ పేరుతో సతీష్ అబ్బూరి కంపెనీ నమోదు అయిన విషయాన్ని కేశినేని నాని సాక్ష్యాలతో సహా ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం తెలిసిందే. దీనికి అనుబంధంగా ఇండియాలో ఏర్పాటైన కంపెనీలో అబ్బూరి రామకృష్ణ, అబ్బూరి లతతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆయన భార్య కేశినేని జానకిలక్ష్మి డైరెక్టర్లుగా వ్యవహరించారు. కేశినేని చిన్ని వైదొలగిన తర్వాత జానకిలక్ష్మి డైరెక్టర్గా కొనసాగారు. అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సీకి అనుబంధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఇండియాలో ఏర్పాటు చేశారు. అంతా కలసి పంగనామం.. హైదరాబాద్లోని నిజాంపేట, బాచుపల్లి, గాజులరామారం, ఎల్బీనగర్ వద్ద ‘స్ప్రింగ్ వ్యాలీ’ పేరుతో విలాసవంతమైన విల్లాలు నిరి్మస్తున్నట్లు సతీష్ అబ్బూరి ఫ్యామిలీ భారీగా ప్రచారం చేసింది. ఆ తర్వాత కోట్లాది రూపాయలు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో వందలాది మంది తమ కష్టార్జితాన్ని వీరి వద్ద ఇన్వెస్ట్ చేసి దారుణంగా మోసపోయారు. కంపెనీ కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో రామకృష్ణ ఫ్యామిలి రెండేళ్లు కనపడకుండా పారిపోయినట్లు ఓ బాధితుడు పేర్కొన్నారు. బాధితులు అంతా కలసి ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో ఒక ఫోరం ఏర్పాటు చేసుకుని అబ్బూరి ఫ్యామిలీ చేతిలో ఎలా మోసపోయారో ప్రపంచానికి చాటి చెప్పారు. తమలా మరెవరూ మోసపోవద్దని హెచ్చరించారు.ఎట్టకేలకు అమెరికాలో పని చేస్తున్న సతీష్ అబ్బూరి ఒరాకిల్ కంపెనీ చిరునామా, ఫోన్ నంబరు వివరాలను సేకరించి అక్కడున్న వారు ఎవరైనా సాయం చేయాలంటూ ప్రాథేయపడ్డారు. దీన్ని బట్టి బాధితులు ఎంత నరకం అనుభవించారో ఊహించవచ్చు. ఆ ముగ్గురు సోదరులు తమ వెనుక పెద్ద శక్తులున్నాయని, తమను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగుతున్నారని ఓ బాధితుడు వాపోయాడు. ‘మోసగాళ్లయిన వీళ్లు వైజాగ్లో వెంచర్ ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాలా మీరు మోసపోకండి..’ అంటూ పలువురు బాధితులు గతంలోనే హెచ్చరించారు. అదే మోసగాళ్లు ఇప్పుడు ఉర్సా పేరుతో మళ్లీ విచ్చేస్తున్నారంటూ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘ట్వంటీ ఫస్ట్ సెంచురీ’తో తనకు సంబంధం లేదని సతీష్ అబ్బూరి జూమ్ మీటింగ్లో పేర్కొన్నాడు. ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో బాధితుల వాయిస్లున్న పేజీలను డేటాబేస్ నుంచి పూర్తిగా తొలగించేశారు. ఒకపక్క బాధితులను బెదిరిస్తూ.. మరోపక్క వెబ్సైట్లో పేజీలను డిలీట్ చేయించటాన్ని బట్టి దొంగెవరో ప్రత్యేకించి చెప్పాలా..? అని బాధితులు మండిపడుతున్నారు. ఇలాంటి ఆవారా కంపెనీకి ఏపీ ప్రభుత్వం రూ.3 వేల కోట్ల భూమిని ఎలా ధారాదత్తం చేసిందని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. -
సీఎం రేవంత్తో శాంతి చర్చల కమిటీ నేతల సమావేశం
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ తో వారు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ తో బేటీ అయిన వారిలో జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్, జంపన్న, రవిచందర్ లు ఉన్నారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులపై కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎం రేవంత్ ను వారు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ కు వినతి పత్రం అందజేశారు శాంతి చర్చల కమిటీ నేతలు.మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాందీనిపై సీఎం రేవంత్ వారితో మాట్లాడుతూ.. ‘నక్సలిజాన్ని మా ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతి భద్రతల అంశంగా పరిగణించదు. గతంలో నక్సలైట్ల తో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉంది.ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు , సూచనలు తీసుకుంటాం. మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం’ అని తెలిపారు.కాగా, తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగుతోంది. ఐదో రోజు కూంబింగ్లో భాగంగా మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. భద్రతా బలగాల ఆపరేషన్లో ఛత్తీస్గఢ్వైపు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది.గత కొంతకాలం నుంచి మావోయిస్టుల, కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని ఏఐటీయూసీ కోరుతోంది. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలనేది శాంతి చర్చల కమిటీ నేతల విన్నపం. అయితే తాజాగా మావోయిస్టులు.. ఈ మేరకు లేఖ రాశారు. తమతో శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. అయితే ఈ లేఖ రాసిన మరుసటి రోజు భారీ సంఖ్యలో మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. -
తెలంగాణ కొత్త సీఎస్గా రామకృష్ణారావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త సీఎస్గా రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్గా ఉన్నారు. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీకాలం ముగియనుంది. ఈ నెల 30న ఆమె రిటైర్ కానున్నారు. ప్రస్తుత సీఎస్ పదవీకాలం పొడిగిస్తారని చర్చ సాగింది.. కానీ ప్రభుత్వం.. కొత్త సీఎస్గా రామకృష్ణారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణలో భారీగా ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్గా శశాంక్ గోయల్మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ సెకట్రరీగా టీకే శ్రీదేవిజీహెచ్ఎంసీ కమిషనర్గా ఆర్వి కర్ణన్యాదగిరిగుట్ట ఈవోగా ఎస్.వెంకట్రావుపరిశ్రమలు, పెట్టుబడుల సెల్ సీఈవోగా జయష్ రంజన్ప్యూచర్ సిటీ కమిషనర్గా శశాంకకార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్జెన్కో సీఎండీగా హరీష్హెల్త్ డైరెక్టర్గా సంగీత సత్యనారాయణపరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్యకార్యదర్శిగా సంజయ్ కుమార్పట్టణాభివృద్ధి కార్యదర్శిగా ఇలంబర్తిరాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవోగా నిఖిలసెర్ప్ అదనపు సీఈవోగా పి. కాత్యాయనీదేవిఇండస్ట్రీ, ఇన్వెస్టిమెంట్ సెల్ అదనపు సీఈవోగా ఈవీ నర్సింహారెడ్డిజీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా హేమంత్సహదేవ్ రావుటీజీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్గా ఫణీంద్రారెడ్డిపంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్గా కధిరవన్హైదరాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విద్యాసాగర్హెచ్ఎండీఏ సెక్రటరీగా ఉపేందర్ రెడ్డి -
ఇంట్లోని రూ.3.20 కోట్ల నగదు, బంగారం తీసుకెళ్లిన భార్య
పంజగుట్ట (హైదరాబాద్): ఓ న్యాయవాది ఇంట్లో నుంచి భారీ మొత్తంలో నగదు ఎత్తుకెళ్లిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ను పంజగుట్ట పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ద్వారకాపురి కాలనీలో నివాసం ఉండే పురుషోత్తంరెడ్డి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఇతనికి భార్గవితో 2007లో కులాంతర వివాహం జరిగింది. భార్గవి సికింద్రాబాద్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా విధులు నిర్వహిస్తోంది. భార్యాభర్తలకు తరచూ గొడవలు జరగడంతో పలుమార్లు భార్గవి పురుషోత్తంరెడ్డిపై గృహహింస, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టింది. ఈ క్రమంలో పురుషోత్తంరెడ్డి ఇంట్లో ఉన్న రూ.3.20 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్న భార్గవి ఆమెకు పాతపరిచయం ఉన్న సంగారెడ్డి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరవింద్ కిరణ్ ఇటికి వెళ్లి అక్కడే ఉంటోంది. గత నెల 30న ఇంట్లో నగదు, బంగారం కనిపించకపోవడంతో పురుషోత్తంరెడ్డి ఆరాతీశాడు. భార్గవి అల్వాల్లోని అరవింద్ కిరణ్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి డబ్బుల విషయమై ఆరాతీస్తే తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. దీంతో పురుషోత్తంరెడ్డి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరవింద్ కిరణ్, భార్గవిని అదుపులోకి తీసుకున్నారు. -
ఎట్టకేలకు.. నగరాన్ని వీడిన ఓ పాకిస్థానీ
సాక్షి,హైదరాబాద్: పాకిస్థాన్ నుంచి షార్ట్ టర్మ్ వీసాపై (ఎస్టీవీ) నగరానికి వచ్చిన నలుగురు పౌరుల్లో ఒకరు శనివారం వెళ్లిపోయారు. సిటీ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో విమానంలో దుబాయ్ వెళ్లిపోయాడు. మిగిలిన ముగ్గురూ ఆదివారం వెళ్లిపోయే అవకాశం ఉంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర దేశంలో ఉన్న పాకిస్థానీయుల వీసాలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ప్రస్తుతానికి ఎస్టీవీ కేటగిరీకి చెందిన వారిని ఆదివారం లోపు పంపాలంటూ కేంద్రం ఆదేశించింది. దీంతో నగర పోలీసులు శనివారం ఆ నలుగురికీ నోటీసులు జారీ చేశారు. వీరిలో ఓ పురుషుడు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పురుషుడు, ఓ మహిళ వేర్వేరుగా సిటీకి రాగా... తన చిన్నారితో మరో మహిళ వచ్చారు. శనివారం పురుషుడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానంలో దుబాయ్ వెళ్లిపోయాడు. నగరంలో ఉన్న 199 మంది పాకిస్థానీల్లో ఈ నలుగురే ఎస్టీవీతో వచ్చారు. సైబరాబాద్లో ఉంటున్న 11 మంది లాంగ్ టర్మ్ వీసా (ఎల్టీవీ)తోనే ఉంటుండటంతో వారికి ప్రస్తుతం నోటీసులు జారీ చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం ముగ్గురు పాకిస్థానీలు ఉన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన అన్నదమ్ముల్ని వివాహం చేసుకున్న అక్కాచెల్లెళ్లు లాంగ్ టర్మ్ వీసాపై ఉంటున్నారు. వీరి వీసా గడువు సెపె్టంబర్ వరకు ఉండటంతో పాటు కేటగిరీ వేరు కావడంతో వీరిని పంపే ఆస్కారం లేదని తెలుస్తోంది. ఇక్కడి యువకుడు దుబాయ్లో ఉండగా అతడిని ప్రేమ వివాహం చేసుకున్న మరో పాకిస్థానీ ప్రస్తుతం భర్తతో కలిసి వాసవీ కాలనీలో నివసిస్తున్నారు. ఈమె లాంగ్టర్మ్ వీసా గడువు గతంలోనే ముగిసిపోయింది. భర్తతో కలిసి జీవిస్తున్న తనకు వీసా పొడిగించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఈ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో ఆమె విషయంలోనూ పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిఘా విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కేంద్రం నుంచి కేవలం షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వారికే నోటీసులు జారీ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. లాంగ్టర్మ్ వీసాలు ఉన్న వారికి సంబంధించి ఎలాంటి స్పష్టత లేదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చే తదుపరి ఆదేశాలను బట్టి వీరిపై నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. -
వేర్హౌస్ లావాదేవీల్లో.. అప్ అండ్ డౌన్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పారిశ్రామిక గిడ్డంగుల(వేర్హౌస్) విపణిలో భిన్న వాతావరణం ఏర్పడింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో నగరంలో 3 లక్షలు చ.అ. లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 2 లక్షల లావాదేవీలతో పోలిస్తే ఇది 50 శాతం అధికం. ఇక, 2025 క్యూ1లో నగరంలో కొత్తగా 2 లక్షల చ.అ. గిడ్డంగుల స్థలం సరఫరా అయ్యింది. గతేడాది ఇదే కాలంలో సరఫరా అయిన 6 లక్షల చ.అ.లతో పోలిస్తే ఇది 67 శాతం తక్కువ.ఈ ఏడాది క్యూ1లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 90 లక్షల చ.అ. పారిశ్రామిక గిడ్డంగుల స్థల లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 78 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఎక్కువగా ఇంజినీరింగ్ కంపెనీలు 25 శాతం, ఈ–కామర్స్ సంస్థలు 21 శాతం స్పేస్ను లీజుకు తీసుకున్నాయని కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. అలాగే ఈ క్యూ1లో కొత్తగా 94 లక్షల చ.అ. స్పేస్ సరఫరా అయింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ. -
‘స్పెషల్ కాయిన్’..వీడియోలో చూపించి మరీ, రూ.9 లక్షలు దోచేసింది!
శంషాబాద్: ‘‘అదో స్పెషల్ కాయిన్... కాయిన్ ఎదురుగా పెట్టగానే సూది కూడా లేచి నిలబడుతుంది’’.. ఇలా కాయిన్తో అనేక విన్యాసాలు చూపించి దానిని తయారీకి రూ. 4 నుంచి రూ. 6 లక్షలు ఖర్చు చేస్తే.. దానిని కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారు.. లేడీ టక్కుటమార విద్యలతో పాటు మాటలను నమ్మిన ఓ మహిళ 8 లక్షల రూపాయలు చెల్లించింది.. ఆరు నెలలుగా ఇదిగో అదిగో అంటూ చెప్పుకొస్తున్న ఆ మహిళ మాటలు నమ్మి చివరికి నిండా మునిగింది. జరిగింది ఇలా... శంషాబాద్ పట్టణంలోని సాతంరాయి బస్తీకి చెందిన అరుణ(32) అదే బస్తీకి చెందిన ఓ యువకుడి ద్వారా కాయిన్ విషయాన్ని తెలుసుకుంది. కర్నాటక మైసూర్ ప్రాంతానికి చెందిన లక్ష్మీ అనే మహిళ ఈ కాయిన్ వ్యాపారం చేస్తుందని తెలపడంతో గతేడాది అక్టోబర్లో అరుణ నగరంలోని తాజ్కృష్ణ హోటల్ ముందు ఉన్న కాఫీ షాపులో కిలేడీ లక్ష్మీని కలిసింది. లక్ష్మీ మరోమారు వీడియోలో కాయిన్ చూపించి దానిని తయారు చేయడానికి సుమారు రూ. 6 లక్షల వరకు ఖర్చువుతుందని తయారు చేసి దానిని అమ్మి కోటి రూపాయాల వరకు ఇస్తానని నమ్మించింది. ఆమె మాటలను నమ్మిన అరుణ నగదు రూపంలో రూ. 90 వేలు ఇవ్వగా పలు దఫాలుగా రూ. 6 లక్షలు చెల్లించింది. తనిఖీలో కాయిన్ చేసిన తర్వాత తాను ఉంటున్న హోటల్లో తనిఖీలు జరగడంతో దానిని అక్కడే పడేసి వెళ్లాలని బుకాయించింది. తనకు మరో రెండు లక్షల వరకు చెల్లిస్తే ఈ దఫా కాయి తప్పకుండా చేసి విక్రయించి నీ కష్టం అంతా తీర్చేస్తానని నమ్మించింది. దీంతో మరోసారి మోసపోయిన మరో రెండు లక్షల వరకు ఫొన్పే ద్వారా చెల్లించింది. చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీఎయిర్పోర్టులో హైడ్రామా... తాను పూర్తిగా మోసపోయినట్లు గుర్తించిన అరుణ ఎలాగైనా లక్ష్మీని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని ఈ నెల 19 మరో వ్యక్తి డబ్బులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని శంషాబాద్ ఎయిర్పోర్టుకు రప్పించింది. ఆ రోజు మాట్లాడిన తర్వాత మరుసటిరోజు ఉదయం శనివారం కలుస్తానని చెప్పి నిందితురాలు అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఈ నెల 20 ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన కిలేడీని పట్టుకునేందుకు నానా పాట్లు పడ్డారు. చివరికి పోలీసుల సాయంతో పట్టుబడింది.. తాను డబ్బులు తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని పోలీసుల సమక్షంలోనే నమ్మించింది. ఆ తర్వాత తనతో పాటు కారు ఎక్కాలని చెప్పిన లేడీ చాకచక్యంగా అరుణతో పాటు ఆమెతోపాటు ఉన్న మరో మహిళను తోసేసి తనవెంట వచ్చిన వ్యక్తితో కారుతో వేగంగా ఎయిర్పోర్టు నుంచి ఉడాయించింది. దీంతో బాధిత మహిళ బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంది. అక్కడి పోలీసుల సూచనల మేరకు గురువారం ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాలరాజు ముందు జరిగిన విషయాన్ని వెల్లడిండించడంతో పాటు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. కిలేడీ ఫొటోలు, ఫోన్పే ద్వారా చెల్లింపు చేసిన వాటన్నింటిని, పలు దఫాలుగా జరిగిన సంభాషణల రికార్డింగులు సమర్పిచింది. బాధితురాలి నుంచి ఈ మేరకు పోలీసులు ఫిర్యాదును తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో -
రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని.. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. హెచ్ఐసీసీలో కొనసాగుతున్న భారత్ సమ్మిట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయమేనని.. ఆధునిక సోషల్ మీడియాతో అంతా మారిపోయిందంటూ చెప్పుకొచ్చారు. నిన్ననే ఇక్కడకు రావాల్సిన ఉన్నా.. కశ్మీర్కు వెళ్లడంతో రాలేకపోయాయన్నారు.పాతతరం రాజకీయం ఓ రకంగా అంతరించిపోయిందని.. ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని రాహుల్ విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రలో 4 వేల కిలోమీటర్లు నడిచానన్నారు. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. వాదన వినిపించేందుకు కొత్త దారులు వెతుక్కోవాల్సి వస్తుంది. రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు.విద్యా, వైద్యం తదితర అంశాలపై నూతన పాలసీలను రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశాను. దేశ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి నా పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడింది. విద్వేష రాజకీయాలను మార్చాలని అర్థం చేసుకున్నాను. ఎంతో మందిని కలిసిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇండియాలో నూతన రాజకీయాలను నిర్మిద్దాం. అందరి ఆలోచనలు స్వీకరించి నూతన విధానాన్ని కొనసాగిద్దాం. పాదయాత్రలో ఒక వ్యక్తి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పారు. ప్రేమ, ఆప్యాయతను ప్రజలతో పంచుకోవడం మొదలు పెట్టాను. పాదయాత్రలో అనేక మందిని కలిసిన తర్వాత విద్వేషపు బజారుల్లో ప్రేమ దుకాణాన్ని తెరిచానని స్లోగన్ తీసుకున్నాను’’ అని రాహుల్ పేర్కొన్నారు.అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యం: సీఎం రేవంత్ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. భారత్ సమ్మిట్లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నా.. తెలంగాణకు ఎంతో గొప్ప చరిత్రతో పాటు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళలు ఉద్యమానికి నాయకత్వం వహించారు. వారి పోరాటం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని రేవంత్ అన్నారు. -
పెరిగిన అద్దెలు.. హైదరాబాద్లో అక్కడే ఫుల్ డిమాండ్!
సాక్షి, సిటీబ్యూరో: కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాలలో అద్దె గృహాల మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉంది.ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండంతో సప్లయ్ తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్తో పాటు రెంట్లు కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్ 50, సప్లయి వాటా 39 శాతంగా ఉన్నాయి.పశ్చిమంలో డిమాండ్ ఎక్కువ.. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేలు నుంచి రూ.35 వేలు నెలవారీ అద్దెలకు కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ అధికంగా ఉంది.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ -
HYD: నలుగురు పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నివాసం ఉంటున్న పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఉంటున్న నలుగురు పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు అందజేశారు. రేపటిలోగా హైదరాబాద్ను విడిచి వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లలో కలిపి 213 మంది పాకిస్తానీలు నివాసం ఉంటున్నారు. వీరిలో నలుగురు షార్ట్ టర్మ్ వీసా మినహాయిస్తే మిగతా అందరికీ లాంగ్ టర్మ్ వీసాలు (LTV) ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సదరు నలుగురు వ్యక్తులు రేపటి లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తానీయులు వీసా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ కు చెందిన వారు వెంటనే తమ రాష్ట్రాలను వీడి స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణ డీజీపీ జితేందర్.. రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీయులు వెంటనే స్వదేశీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలి. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవు. మెడికల్ వీసాల మీద ఉన్నవారికీ ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంది. పాకిస్తానీలు తమ దేశానికి అటారి బార్డర్ నుండి వెళ్లొచ్చు. ఈనెల 30 వరకు అటారి బార్డర్ తెరుచుకుని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలి. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.కాగా, భారత్లోని పాక్ పౌరులకు కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్ దేశస్తులు భారత్ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది. జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. -
వివాహేతర సంబంధం, భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని..
హైదరాబాద్: ఇటీవల కుప్పలుతెప్పలుగా వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. అచ్చం అలాంటి పనిచేసే..ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్కి చెందిన శివ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం దీప్తి అనే మహిళతో పెళ్లి కాగా ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే పెళ్లై, పిల్లలున్న శివ కొంతకాలంగా తన భార్యతో దూరంగా ఉంటున్నాడు. కారణం మరో మహిళతో వివాహేతర సంబంధమే. ఆ విషయం అతడి భార్య దీప్తి కనిపెట్టింది. ఎలాగైనా రెడ్హ్యండెడ్గా పట్టుకోవాలని గట్టి నిఘా పెట్టింది.చివరికి తన భర్త శివ, సుష్మా అనే ఆమెతో కలిసి కూకట్పల్లిలో ఓ ఇంట్లో నివసిస్తున్నాడని తెలుసుకుని, కుటుంబసభ్యుల సాయంతో ఒకే గదిలో ఉన్న భర్త శివ, సుష్మలను రెడ్హ్యండెడ్గా పట్టుకుంది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించింది. అంతేగాక తనను పట్టించుకోకుండా మరో మహిళతో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాట్లు ఫిర్యాదు కూడా చేసింది. pic.twitter.com/95aRDE2twc— Telugu Scribe (@TeluguScribe) April 26, 2025 -
కాస్త పెరిగిన ఇంటి అద్దెలు..
కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాలలో అద్దె గృహాల విపణి క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉంది. - సాక్షి, సిటీబ్యూరోప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండటంతో సప్లయి తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్తో పాటు రెంట్లు కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్ 50, సప్లయి వాటా 39 శాతంగా ఉన్నాయి.పశ్చిమంలో డిమాండ్ ఎక్కువ.. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేలు నుంచి రూ.35 వేలు నెలవారీ అద్దెలకు కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ అధికంగా ఉంది. -
ఇక్రమ్.. ఇంకా ఇక్కడే!
సాక్షి,హైదరబాద్: కాశ్మీర్ లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ముష్కర మూకల ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్పై పోరు కొనసాగుతోంది. ఈ ఘాతుకాన్ని సీరియస్గా తీసుకున్న భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాకిస్థానీల వీసాల రద్దు కూడా అందులో ఒకటి. దీంతో వివిధ రకాలైన వీసాలపై నగరంలో ఉన్న 208 మంది పాకిస్థానీల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంలో తెరపైకి వచ్చే అంశమే హైదరాబాద్ డిటెన్షన్ సెంటర్లో బందీగా ఉన్న పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్. సిటీలో నమోదైన కేసుల విషయం తేలినా.. ఇప్పటికీ ఇక్కడే ఉండిపోయాడు. ఢిల్లీ వాసిగా నమ్మించి.. నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. 17 ఏళ్ల క్రితం ఆమె బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఈమెకు పాకిస్థానీ ఇక్రమ్తో పరిచయమైంది. తాను భారతీయుడినేనని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించి ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన మహిళ హైదరాబాద్ తిరిగొచ్చేశారు. 2011లో ఇక్రమ్ సైతం నగరానికి వచ్చాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్ వీసాపై వచ్చానంటూ ఆమెతో చెప్పాడు. అయితే వాస్తవానికి దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో వచ్చి అక్కడ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ.. అక్కడి నుంచి నగరానికి చేరుకున్నాడు. ఆ విషయం బయటపడక.. ఇక్రమ్ వచ్చిన ఆరు నెలలకు ఈ విషయం తెలుసుకున్న మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించారు. దీంతో కక్షగట్టిన అతగాడు ఆమెను వేధించడంతో మహిళా ఠాణాను ఆశ్రయించింది. దీంతో ఇక్రమ్పై వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు ఇక్రమ్ను విచారించి, నోటీసులు జారీ చేశారు. అప్పట్లో తన భర్త పాకిస్థాన్కు చెందినవాడని చెప్పకపోవడంతో విషయం బయటకు రాలేదు. పోలీసులు 2018 జూన్లో ఇక్రమ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సరిహద్దుల నుంచి వెనక్కు.. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన కేసు విచారణ, శిక్షా కాలం ముగియడంతో ఇక్రమ్ను పాకిస్థాన్కు బలవంతంగా తిప్పి పంపాలని (డిపోర్టేషన్) భావించారు. డిపోర్టేషన్కు సంబంధించిన పత్రాల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు చెప్పిన పాకిస్థాన్ అధికారులు అతడి రాకను అడ్డుకున్నారు. కాగా.. తనపై నమోదైన కేసును భార్యతో రాజీ చేసుకున్న ఇక్రమ్ను దాదాపు రెండేళ్లుగా నగరంలోని సీసీఎస్ అదీనంలో ఉన్న డిపోర్టేషన్ సెంటర్లో ఉంచారు. ఇక్రమ్ను పాకిస్థాన్కు పంపడానికి అవసరమైన కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. తాజాగా పహల్గాం ఉదంతంతో ఇతడి డిపోర్టేషన్ పక్రియపై సందేహాలు నెలకొన్నాయి. -
తెలంగాణకు వర్షసూచన.. ఐదు రోజులు ఈ జిల్లాల్లో గట్టి వానలే..
సాక్షి స్పెషల్ డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 5 రోజులు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల రైతులు ఈ సమయంలో దుక్కులు దున్నుకోవాలని రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా.పి.లీలారాణి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె బులెటిన్ విడుదల చేశారు.మామిడి పంటలో పండు ఈగ నియంత్రణకు ఇదే మంచి సమయమని తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి పంటల సాగులో ఈ నెల 26 (శనివారం) నుంచి 30 వరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక బులెటిన్లను విడుదల చేస్తున్నదని వెల్లడించారు.రైతులకు సూచనలు 5 రోజులు మండే ఎండలు.. ఈదురుగాలులతో వర్షాలు.. వచ్చే 5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని లీలారాణి తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావొచ్చని చెప్పారు. 26న ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 27 నుంచి 29 తేదీల మధ్య ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి. బులెటిన్లోని ప్రధాన సూచనలు ఇవే..వేసవి దుక్కుల వల్ల భూమిలో నిద్రావస్థలో ఉన్న చీడపీడలు కలిగించే పురుగులు బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. బయటపడిన ప్యూపాలను, గుడ్లను, పక్షులు తిని నాశనం చేస్తాయి. భూమి గుల్లబారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. అందువల్ల వేసవి జల్లులను వినియోగించుకొని వేసవి దుక్కులను చేసుకోవాలి.పండ్ల తోటల్లో వేసవి కాలంలో గుంతలు తీసి ఎండకు ఆరనివ్వాలి. దీనివల్ల నేలలోని పురుగులు వాటి గుడ్లు తెగుళ్లను కలిగించే శిలీంద్రాలు నశిస్తాయి. ఆ తర్వాత పండ్ల మొక్కలు నాటుకోవటం మంచిది.ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల క్రింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి.కోసిన పంటలను (వరి, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము, జొన్న, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటలు) వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలి. తాత్కాలికంగా పురుగు మందుల పిచికారీని వాయిదా వేసుకోవాలి. మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే 1 గ్రా. కార్బండజిమ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
హైదరాబాద్ : ‘భారత్ సమ్మిట్-2025.. విదేశీ ప్రతినిధులకు ఘనస్వాగతం (ఫొటోలు)
-
అపార్థం చేసుకోవద్దు.. రాజకీయాల్లోకి రండి
సాక్షి, హైదరాబాద్: రాజకీయాలను యువత అపార్థం చేసుకోవద్దని, రాజకీయాలపై ఏవగింపు ధోరణితో కాకుండా సానుకూల దృక్పథంతో ఆలోచించి అవకాశాలను వెతుక్కోవడం ద్వారా సమాజ భవిష్యత్తుకు పునాదులు వేయాలని భారత్ సమ్మిట్–2025 పిలుపునిచ్చింది. అసమానత, వాతావరణ మార్పులు, వృద్ధిలో అస్థిరత అనే అంశాలపై దృష్టి సారించేందుకు యువత రాజకీయాల్లోకి రావాలని విజ్ఞప్తి చేసింది. ‘ఓటింగ్లో పాల్గొనడం, గళమెత్తడం, రాజకీయాల్లో చేరడం’ అనేవి నేటి యువతకు మార్గదర్శకాలుగా నిలవాలని కోరింది.యువజన కాంగ్రెస్ జాతీయ నాయకుడు కృష్ణ అళవారు సంధానకర్తగా శుక్రవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ‘యువత..రేపటి రాజకీయాలు’ అనే అంశంపై చర్చాగోష్టి జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పెద్దపల్లి ఎంపీ డాక్టర్ వంశీకృష్ణ, ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరిలతో పాటు పలు దేశాలకు చెందిన ఉదయ్భాను చిబ్, అరెనా విలియమ్స్, లినేశ్సెల్యు అందాన్, మెరీనా హే, జేమ్స్ స్టీవ్ సెరానో, జీసస్ తాపియాలు ప్యానలిస్టులుగా వ్యవహరించిన ఈ గోష్టి పలు కీలక అభిప్రాయాలకు వేదికయింది. వక్తలు వెలిబుచి్చన అభిప్రాయాలివే.. పరిస్థితులను యువత అధిగమించాలి ⇒ రాజకీయాలంటే అవినీతి అని యువత అనుకుంటోంది. ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేసి విస్మరించే పారీ్టల వైఖరి వారికి వెగటు పుట్టిస్తోంది. అయితే ఈ కారణాలతో యువత రాజకీయాల నుంచి దూరం జరగకూడదు. వీటిని అధిగమించేలా యువత కంకణం కట్టుకోవాలి. ⇒ చదువుకునేటప్పుడే యువతకు రాజకీయాలు అలవడాలి. వారు వివిధ వృత్తుల్లోకి వెళ్లిపోయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని కోరితే ప్రయోజనం ఉండదు. అందుకే కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలి. ⇒ సోషల్ మీడియా యువతను బాగా ప్రభావితం చేస్తోంది. పలు సామాజిక మాధ్యమాల ద్వారా హింస, విద్వేషపూరిత ప్రసంగాలకు యువత ప్రభావితమవుతోంది. ఇది మంచిది కాదు. చెడును ప్రోత్సహించే ఎలాంటి సామాజిక మాధ్యమాలనైనా యువత అధిగమించగలగాలి. ⇒ వాతావరణ మార్పు అనే అంశాన్ని యువత సీరియస్గా తీసుకోవాలి. ఇందుకోసం చట్టాలు చేసే క్రమంలో యువత భాగస్వామ్యం కావాలి. యువత ముందున్న ప్రస్తుత రాజకీయ కర్తవ్యం వాతావరణ మార్పులపై పోరాటమే. ⇒ యువత ఎంత గట్టిగా అరిచిందన్నది ముఖ్యం కాదు. ఎంత నిఖార్సుగా పోరాడిందన్నదే ముఖ్యం. వారసత్వం ఇంకెన్నాళ్లు? చర్చాగోష్టిలో భాగంగా డొమినిక్ రిపబ్లిక్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ వారసత్వ రాజకీయాలపై ప్రశ్నించారు. తన కుటుంబం నుంచి ఒక ఎంపీనో, మంత్రినో ఉంటే ఆ కుటుంబ సభ్యులు మళ్లీ అవే పదవుల్లోకి వెళుతున్నారని, అలాంటప్పుడు సామాన్యులకు అవకాశాలెలా వస్తాయో ప్యానలిస్టులు చెప్పాలని కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తాను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లో ఎదిగానని చెప్పారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్లలో పనిచేసి ఎంపీని అయ్యానని, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నానని, కష్టపడిన వారికి రాజకీయాల్లో అవకాశాలు వస్తాయనేందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. అయితే వారసత్వంగా రాజకీయాల్లోకి వస్తున్న వారు కూడా ఉన్నారని, ఆ పరిస్థితిని కాదనలేమని పొన్నం అభిప్రాయపడ్డారు. మరో రెండు అంశాలపైనా చర్చ తొలిరోజు భారత్ సమ్మిట్లో భాగంగా మరో రెండు అంశాలపై కూడా చర్చాగోషు్టలు జరిగాయి. ఏఐసీసీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినాటె మోడరేటర్గా జరిగిన ‘నిజం వర్సెస్ ఊహాజనితం: తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడం’పై జరిగిన చర్చాగోష్టిలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దిగి్వజయ్సింగ్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్కుమార్రెడ్డిలతో పాటు విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. అదే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద శర్మ మోడరేటర్గా వ్యవహరించిన ‘బహుళపక్ష వాదం’ అనే అంశంపై చర్చాగోష్టిలోనూ పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొని వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు. -
నేపాల్ మీదుగా హైదరాబాద్కు.. పోలీసుల అదుపులో పాకిస్తానీ
హైదరాబాద్: పహెల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ నడుమ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ హైదరాబాద్కు వచ్చిన పాక్ జాతీయుడు పోలీసులకు చిక్కాడు. మహ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి.. హైదరాబాద్ కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే భార్యను కలిసేందుకు ఫయాజ్ భారత్ కు చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. ఎటువంటి వీసా లేకుండా నేపాల్ మీదుగా హైదరాబాద్ కు చేరుకున్నాడు ఫయాజ్. అయితే ప్రస్తుతం పాకిస్తానీయులను వెనక్కి పంపించే పనిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై ఓ కన్నేసి ఉంచాయి. ఈ క్రమంలోనే ఫయాజ్ ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న ఆ యువకుడ్ని మరింత లోతుగా విచారించనున్నారుపోలీసులు. అతను దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఇప్పటికే పాకిస్తాన్ జాతీయులు తమ దేశానికి వెళ్లిపోవాలని తెలంగాణ డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా డీజీపీ.. ముందుగా అప్రమత్తమయ్యారు. పాకిస్తాన్ జాతీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఇక వారు రాష్ట్రాల నుంచి ఖాళీ చేసి పాక్ కు వెళ్లిపోవాలని డీజీపీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ తరుణంలో భార్యను కలవడానికి వచ్చి పోలీసులకు పాకిస్తాన్ జాతీయుడు చిక్కడం గమనార్హం. -
పహల్గాం ఉగ్రదాడి.. నెక్లెస్రోడ్డులో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ ప్రదర్శన చేపట్టారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రులు, ఎమ్మెల్యే లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ సమ్మిట్కు వచ్చిన విదేశీ ప్రతినిధులు సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు.అందరం ఒక్కటై ఉగ్రవాదంపై పోరాడాలి: సీఎం రేవంత్రెడ్డిఅందరం ఒక్కటై ఉగ్రవాదంపై పోరాడాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. దాడులకు పాల్పడినవారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నాం. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.‘‘ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సానుభూతి తెలుపుతోంది. ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినపుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారు. ఒక్క దెబ్బతో పాకిస్తాన్ను పాక్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేశారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్ పేయ్ దుర్గామాతతో పోల్చారు. ప్రధాని మోదీ.. మీరు దుర్గామాత భక్తులుగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోండి. ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలి’’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. -
సాంకేతికంగా... ‘నిరభ్యంతరం’గా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అగ్నిమాపక శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవనాల నిర్మాణానికి ముందు జారీ చేసే తాత్కాలిక నిరభ్యంతర పత్రం (ప్రొవిజినల్ ఎన్ఓసీ) జారీ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువస్తోంది. రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ పర్యవేక్షణలో ఓ ప్రముఖ సంస్థ రూపొందిస్తున్న ఈ సాఫ్ట్వేర్ నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ వై.నాగిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. నిర్ణీత రుసుం చెల్లించి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ప్రొవిజినల్ ఎన్ఓసీ (provisional fire noc) పొందవచ్చని పేర్కొన్నారు. వీరికి ప్రొవిజినల్ ఎన్ఓసీ తప్పనిసరి రాష్ట్రంలో వాణిజ్య, వ్యాపార అవసరాల కోసం నిర్మించే 15 మీటర్ల కంటే ఎత్తైన, నివాస గృహాలుగా నిర్మించే 18 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన భవనాలకు ఈ ప్రొవిజినల్ ఎన్ఓసీ తప్పనిసరి. వీటితో పాటు 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండే పాఠశాలలు, సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, మతపరమైన, ప్రజావసరాలకు సంబంధించిన భవనాలకు కూడా ఈ ప్రొవిజినల్ ఎన్ఓసీ తీసుకోవడం అనివార్యం. భవన నిర్మాణానికి ముందే దీన్ని పొందాల్సి ఉంటుంది. అగ్నిమాపక శాఖ నుంచి ప్రొవిజినల్ ఎన్ఓసీ తీసుకుంటేనే ఇతర విభాగాలు తమ అనుమతుల్ని జారీ చేస్తాయి. ఈ ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసే ముందు ఆయా భవనాలకు సంబంధించిన పూర్తి వివరాలతోపాటు అమలు చేయబోయే ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. ఆ వివరాలన్నీ పొందుపరచాలి... భవన నిర్మాణం ప్రారంభానికి ముందే జారీ అయ్యే ఈ ప్రొవిజినల్ ఎన్ఓసీ కోసం దరఖాస్తుదారులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు ఆ ఫైల్ను, అందులోని ప్రతిపాదిత భద్రత ప్రమాణాలను పరిశీలిస్తారు. అవసరమైతే మార్పులు, చేర్పులు సూచించి, వాటిని జోడించిన తర్వాతే జారీ చేస్తారు. భవనం ఎత్తు, విస్తీర్ణం, ఎందుకు వినియోగిస్తారు? తదితర అంశాల ఆధారంగా భద్రతా ప్రమాణాలు ఉంటాయి. ఆ భవనానికి ఎన్ని ఫైర్ ఎగ్ట్వింగ్విషర్లు, స్ప్రింక్లర్లు ఎన్ని, ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే విషయాలు నిర్దేశించి ఉంటాయి. భవనం భద్రత ప్రమాణాల నమూనా, వాటికి తగ్గట్టు ఉంటేనే ప్రొవిజినల్ ఎన్ఓసీ జారీ అవుతుంది. వాటిని తనిఖీ చేసే అధికారి అవసరాలకు తగ్గట్టు ఉన్నాయా? లేదా? అనేది తేలుస్తారు.చదవండి: హైదరాబాద్లో హై అలర్ట్సాఫ్ట్వేర్తో ఆటోమేటిక్గా... తాజా సాఫ్ట్వేర్లో ఈ వివరాలన్నీ ముందే పొందుపరిచి ఉంటాయి. దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తుదారుడు భవనం వివరాలు పొందుపరచడంతోపాటు దాని భద్రతా ప్రమాణాల ప్లాన్ను ఆటో క్యాడ్ రూపంలో దాఖలు చేస్తాడు. దీన్ని ఆద్యంతం పరిశీలించే సాఫ్ట్వేర్ అవసరమైతే తగిన మార్పులు చేర్పుల్ని సూచిస్తుంది. ఈ మేరకు ప్లాన్ను మారుస్తూ మరో ఆటో క్యాడ్ను అప్లోడ్ చేస్తే ప్రొవిజినల్ ఎన్ఓసీ జారీ అవుతుంది. ‘కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి వస్తే మానవ వనరుల జోక్యం తగ్గుతుంది. తర్వాదా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ప్రొవిజినల్ ఎన్ఓసీ దరఖాస్తును పరిశీలించి, మార్పులు, చేర్పుల సూచన వస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పని విధానం పారదర్శకంగా మారి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు’ అని నాగిరెడ్డి పేర్కొన్నారు. -
‘భారత్ సమ్మిట్ చారిత్రాత్మకమైనది’’
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న భారత్ సమ్మిట్ చారిత్మాకమైనదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలతో భారత్ సమ్మిట్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. భారత్ సమ్మిట్ లో గ్లోబల్ జస్టిస్ కోసం ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. హెచ్ఐసీసీ వేదికగా తొలిరోజు జరిగిన భారత్ సమ్మిట్ గురించి మల్లు భట్టి విక్రమార్క్ మీడియాతో మాట్లాడారు.‘గ్లోబల్ జస్టిస్ కోసం ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. సోషల్ జస్టిస్, శాంతి తదితర అంశాలపై సమ్మిట్ లో చర్చించారు. సామాజిక న్యాయం, అభివృద్ధిపై డెలిగేట్స్ తో చర్చించాం. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల విదేశీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ న్యాయ్ కార్యక్రమం పట్ల డెలిగేట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దాడికి నిరసనలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటామని అన్నారు. కశ్మీర్ ఉగ్రవాద దాడిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.నెక్లెస్ రోడ్డులో జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు’ అని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. -
పాకిస్తానీలు వెంటనే మీ దేశానికి వెళ్లండి: తెలంగాణ డీజీపీ
హైదరాబాద్: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తానీయులు వీసా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ కు చెందిన వారు వెంటనే తమ రాష్ట్రాలను వీడి స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణ డీజీపీ జితేందర్.. రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీయులు వెంటనే స్వదేశీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలి. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవు. మెడికల్ వీసాల మీద ఉన్నవారికీ ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంది. పాకిస్తానీలు తమ దేశానికి అటారి బార్డర్ నుండి వెళ్లొచ్చు. ఈనెల 30 వరకు అటారి బార్డర్ తెరుచుకుని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలి. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం’ అని డీజీపీ జితేందర్ హెచ్చరించారు.కాగా, భారత్లోని పాక్ పౌరులకు కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్ దేశస్తులు భారత్ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది. జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న ఐదు సంచలన నిర్ణయాల అమలుకు భారత్ వడివడిగా అడుగువేస్తోంది. వేగంగా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గురువారం పాక్ పౌరులకు జారీ చేసిన అన్నీ వీసాలను భారత్ రద్దు చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. -
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్లో అఘోరీ అరుపులు, కేకలు!
సాక్షి, హైదరాబాద్: చంచల్ గూడ జైల్లో అఘోరీకి ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా నిద్ర పోకుండా గట్టిగా కేకలు వేస్తూ హల్చల్ చేసిన అఘోరీని ప్రత్యేక బ్యారెక్లో ఉంచారు. నా భార్య వర్షిణితో ఎప్పుడు ములాఖత్ చేయిస్తారంటూ అధికారులతో అఘోరీ వాగ్వాదానికి దిగారు. అఘోరీకి ఖైదీ నంబర్ 12121ను కేటాయించగా.. అఘోరీ ప్రవర్తనపై జైలు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.కాగా, చంచల్ గుడ జైలును నిన్న(గురువారం) సందర్శించిన మహిళ కమిషన్ ఛైర్పర్సన్ నెరేళ్ల శారదా.. అఘోరీని ఉంచిన బ్యారక్ను పరిశీలించారు. అఘోరీ అలియాస్ శ్రీనివాస్ను అరెస్టు చేసిన మోకిల పోలీసులు బుధవారం చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14 రోజులు జ్యూడిషయల్ రిమాండ్ విధించింది. అఘోరీతో పాటు శ్రీవర్షిణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మోకిల పీఎస్లో ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించారు. అనంతరం నగరంలోని హైదర్షాకోట్ కస్తూర్బాగాంధీ వెల్ఫేర్ హోమ్కు తరలించారు. కాగా.. మరోవైపు కోర్టు నియమించిన న్యాయవాది ఇవాళ అఘోరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.మహిళా సినీ నిర్మాత ఫిర్యాదుతో..పూజల పేరుతో అఘోరీ తనను మోసం చేసిందని, చంపుతానని బెదిరించి రూ.9.80 లక్షలు తీసుకుందని శంకర్పల్లి మండలం ప్రొద్దుటూర్ శివారులోని ప్రగతి రిసార్ట్స్లో నివాసముండే ఓ మహిళా సినీ నిర్మాత ఈ ఏడాది ఫిబ్రవరి 25న మోకిల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీఎన్ఎస్ 308(5), 318(1), 351(3), 352 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, గత మంగళవారం ఉత్తర్ప్రదేశ్లో అఘోరీని అరెస్టు చేసి, తీసుకువచ్చారు. నార్సింగి ఏసీపీ కార్యాలయం నుంచి బుధవారం పోలీస్ వాహనంలో చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, సాధారణ వైద్య పరీక్షలు చేయించి, చేవెళ్ల జూనియర్ ఫస్ట్క్లాస్ జడ్జి ధీరజ్కుమార్ ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు.న్యాయమూర్తి ఆదేశాల మేరకు మోకిల పోలీసులు అఘోరీని సంగారెడ్డి జిల్లా కంది జైలు అధికారులకు అప్పగించి వెళ్లారు. అయితే అఘోరీని ఏ బ్యారక్లో ఉంచాలనే సందేహం రావడంతో, వారు మళ్లీ మోకిల పోలీసులను పిలిపించారు. దీంతో అఘోరీని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. మహిళ అని గుర్తించిన తర్వాత చంచల్గూడ జైలుకు తరలించారు. అరెస్టు సమయంలో అఘోరీ నుంచి రూ. 5,500 నగదు, నేరాలకు ఉపయోగించిన ఐ20 కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తనను తాను అఘోరీ మాతగా ప్రకటించుకుని రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీనివాస్(28) చిన్ననాటి నుంచి అబ్బాయిగానే ఉన్నాడు. ఆతర్వాత సులభంగా డబ్బు సంపాదించడంతో పాటు ఇతర కారణాలతో చైన్నె, ఇండోర్లో లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకున్నాడు. అనంతరం ఆధ్యాత్మిక వేషధారణలో కనిపిస్తూ, తంత్ర పూజలు అంటూ అమాయకులను మోసం చేస్తూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
తెలంగాణలో తొలిసారిగా టెండన్ ఆగ్మెంటేషన్ షోల్డర్ జాయింట్ ప్రిజర్వేషన్ ఆపరేషన్
హైదరాబాద్: ఆధునిక ఆర్థోపెడిక్ చికిత్సలో అపోలో వైద్యులు అరుదైన ఘనతను సాధింఆరు తెలంగాణలోనే తొలి అల్లోగ్రాఫ్ట్ టెండన్ (ఆకిలీస్ టెండన్) ఆధారిత లోయర్ ట్రాపీజియస్ ట్రాన్స్ఫర్ విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ షోల్డర్ సర్జన్ డా. ప్రశాంత్ మేశ్రం ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సను నిర్వహించారు. ఇటువంటి చికిత్స అపోలో గ్రూప్ ఆసుపత్రుల్లో తొలిసారిగా జాయింట్ ప్రిజర్వేషన్ కోసం అల్లోగ్రాఫ్ట్ టెండన్ ద్వారా ఆ శస్త్ర చికిత్స చేసినట్టు వైద్యులు తెలిపారు.వివరాల్లోకి వెళితే 55 ఏళ్ల శక్తివంతమైన వ్యక్తి ప్రమాదంలో గాయపడ్డాడు. ఆరు నెలలపాటు తీవ్రమైన నొప్పితోపాటు, చేతిలో బలహీనతతో బాధపడ్డాడు. మాసివ్, మరమ్మతులు చేయలేని రోటేటర్ కఫ్ టియర్తో పాటు ఆర్మ్ జాయింట్లో ప్రారంభ దశ ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వారు అపోలో ఆసుపత్రి జూబ్లీహిల్స్లోని డా. మేశ్రంని సంప్రదించారు.ఈ మేరకు అతి సంక్లిష్టమైన ఈ ఆర్థోస్కోపిక్-అసిస్టెడ్ లోయర్ ట్రాపీజియస్ ట్రాన్స్ఫర్ శస్త్రచికిత్సలో ఆకిలీస్ టెండన్ అల్లోగ్రాప్ట్ను నిష్ణాతంగా ఉపయోగించారు. బైసెప్స్ టెండన్ రీ-రూటింగ్, సబ్స్కాపులారిస్ టెండన్ మరమ్మతులతో కూడిన ఈ చికిత్స ద్వారా భుజం పనితీరు సామర్థ్యాన్ని పునరుద్ధరించి, తద్వారా ఆర్థరైటిస్ను నివారించే ప్రయత్నించి విజయవంతమైనారు. ఆపరేషన్ తర్వాత చేసిన షోల్డర్ జాయింట్లో మారిన హెడ్ పొజిషన్ తిరిగి సరి అయినట్టు వెల్లడైంది. అరుదైన ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడం ఒక కొత్త మైలురాయి అని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. -
క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముచ్చట్లు (ఫొటోలు)
-
నార్త్ టు సౌత్ నగరానికి క్యూ కడుతున్న నార్త్ ఫుడ్ బ్రాండ్స్
సాక్షి, సిటీబ్యూరో: విభిన్న సంస్కృతుల సమ్మేళనంలో భాగంగా నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఆహార రుచులు ఆదరణ పొందటం విధితమే. ఈ మధ్య కాలంలో నగరం వేదికగా నార్త్ డిషెస్కు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో నగరంలో నార్త్ రెస్టారెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇందులో భాగంగానే నార్త్ ఇండియన్ ఫుడ్కు ప్రసిద్ధి చెందిన లజీజ్ అఫేర్ నగరానికి విచ్చేసింది. ఢిల్లీ వేదికగా ప్రసిద్ధి చెందిన లజీజ్ అఫేర్ దక్షిణాదిలో మొదటిసారిగా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–45లో ఆవిష్కరించడం ఇక్కడి ఫుడ్ లవర్స్కు గుడ్ న్యూస్ అని ఫుడ్ బ్లాగర్స్ చెబుతున్నారు.స్మోక్ తందూరి కబాబ్లు మొదలు మటన్ షికంపురి కబాబ్, పత్తర్ కా గోష్ట్ వంటి వంటకాలు ఉత్తరాది లాజీజ్ అఫైర్ ప్రత్యేకత. వీటితో పాటు షాహి దమ్ కా ఆలూ, భట్టి కా పనీర్, షాదీ కా లాల్ చికెన్, దాల్ లాజీజ్, కేసర్ ఫిర్ని వంటి రుచులను నగరవాసులకు చేరువ చేయడానికి జూబ్లీహిల్స్లో లజీజ్ అఫేర్ను ప్రారంభించినట్లు ఇన్నాటో హాస్పిటాలిటీ డైరెక్టర్ యాష్ త్రివేది తెలిపారు. ప్రత్యేకించి నార్ట్ స్టైల్ హైదరాబాదీ దమ్ బిర్యానీ మరోసారి నగరవాసులకు రుచి చూపించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికిసుగంధ ద్రవ్యాల సమ్మిళితంతో సాంస్కృతిక వంటకాలు, ఉత్తరాది పాకశాస్త్ర నైపుణ్యాలతో వడ్డించిన పసందైన రుచులు హైదరాబాదీల మనసు దోచేస్తాయన్నారు. అనాది ప్రపంచ స్థాయి వంటకాలకు నగరం వేదికగా నిలుస్తోంది. ఇక్కడి ప్రజలు వినూత్న రుచులను ఆస్వాదించే లక్షణమే ఈ ఆహార వైవిధ్యానికి కారణం. ఈ ప్రయాణంలో లజీజ్ అఫేర్కు స్పందన వస్తుండటం తమ ప్రయత్నానికి భరోసా లభించిందని సహా డైరెక్టర్ కుష్ త్రివేది వివరించారు. -
Payal Rajput వజ్రాభరణాలంటే ఇష్టం..
గచ్చిబౌలి: వజ్రాభరణాలంటే చాలా ఇష్టమని నటి పాయల్ రాజ్పుత్ (Payal Rajput) అన్నారు. కొండాపూర్లోని ప్రణవ్ వైష్ణాయ్ బిజినెస్ పార్క్లో టీబీజడ్–ది ఒరిజినల్ జ్యువెలర్ స్టోర్ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్లో వివిధ రకాల డిజైన్ల భరణాలు ధరించి సందడి చేశారు. అనంతరం పాయల్ రాజ్పుత్ మాట్లడుతూ రూ.75 లక్షల విలువైన వజ్రాలు (Diamonds) పొదిగిన నక్లెస్తో పాటు మొత్తం కోటి రూపాయల విలువైన ఆభరణాలు ధరించానని చెప్పారు. ప్రతి ఆభరణం మన సంస్కృతిని తెలియజేసే విధంగా రూపొందించారన్నారు. టీబీజడ్ మూడో స్టోర్ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మార్కెటింగ్ చీఫ్ ఆఫీసర్ రితీష్ గాడే మాట్లాడుతూ ప్రతి ఆభరణం మన వారసత్వానికి ప్రతీకలని, స్టోర్ బంగారంతో పాటు యాంటిక్, టెంపుల్ ఆభరణాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. విస్తృతశ్రేణి మోడళ్లు, వినూత్నమైన డిజైన్లు, ఆకర్షణీయమైన ఆఫర్లతో సమకాలీన ఆభరణాల నుంచి సంప్రదాయ ఆభరణాలను వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. టీబీజడ్ ఒరిజినల్ సర్టిఫైడ్, స్వచ్ఛతను సూచించే హాల్మార్క్ను కలిగి ఉందన్నారు. దేశంలో వివిధ నగరాల్లో 37 స్టోర్లు ఉన్నాయని తెలిపారు. చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికి -
Hyderabad: నగరంలోని పాకిస్థానీలపై ఆరా
సాక్షి,హైదరబాద్: పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్రం.. దేశంలో ఉన్న పాకిస్థానీల వీసాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఉన్న పాకిస్థానీలు నిర్ణీత గడువులోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నగరంలోని స్పెషల్ బ్రాంచ్లో (ఎస్బీ) రిజస్టర్ చేసుకున్న పాకిస్థానీల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. వివిధ వీసాలపై భారత్కు వచ్చే విదేశీయులు ఇక్కడ కచి్చతంగా రిజిస్టర్ చేయించుకోవాలి. వారి వీసా వివరాలతో పాటు ఎక్కడ ఉంటున్నారు? ఎవరితో ఉంటున్నారు? ఫోన్ నంబర్? చిరునామా? తదితరాలను అందించాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని దేశాలకు చెందిన వాళ్లూ శంషాబాద్లోని మామిడిపల్లిలో ఉన్న ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) వద్ద రిజిస్టర్ చేసుకుంటారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ జాతీయులు మా త్రం ఎస్బీ అధీనంలోని పాక్, బంగ్లా బ్రాంచ్ల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ కార్యాలయం పాతబస్తీలోని పురానీ హవేలీలో ఉంది. ఈ విభాగంలో రిజిస్టరై ఉన్న పాకిస్థానీల సంఖ్య 208గా ఉంది. వీరిలో లాంగ్ టర్మ్ వీసా కలిగిన వాళ్లు 156 మంది ఉన్నారు. ఇక్కడి వారిని వివాహం చేసుకున్న పాకిస్థానీలతో పాటు వారి రక్త సంబం«దీకులకు ఈ వీసాలు జారీ చేస్తుంటారు. మరో 13 మంది షార్ట్టర్మ్ వీసా కలిగి ఉన్నారు. విజిట్, బిజినెస్ తదితర కేటగిరీలకు చెందిన వీసాలు షార్ట్టర్మ్ కిందికి వస్తా యి. మిగిలినవన్నీ మెడికల్ వీసాలని అధికారులు చెబుతున్నారు. 1992 నుంచి సార్క్ వీసాలు అమలవుతున్నాయి. సార్క్ సభ్యత్వ దేశాలకు చెందిన ప్రముఖులు, ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు, పార్లమెంటేరియన్లు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, క్రీడాకారులు సహా 24 రకాల వారికి ప్రత్యేక మినహాయింపులతో కూడిన వీసాలు ఇస్తుంటారు. ప్రస్తుతం సిటీలో ఉన్న పాకిస్థానీల్లో సార్క్ వీసా కలిగిన వాళ్లు లేరు. నగరంలో రిజిస్టర్ అయిన ఈ 208 మంది వివరాలను ఎస్బీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పాక్ రాయబార కార్యాలయం నుంచి వీరికి తక్షణం భారత్ వదలాల్సిందిగా సందేశాలు వెళ్లినట్లు తెలిసింది. కేంద్రం విధించిన గడువు ముగిసిన తర్వాత వీరిలో ఎందరు ఎగ్జిట్ అయ్యారు అనేది ఇమ్మిగ్రేషన్ నుంచి తీసుకోనున్నారు. అప్పటి కీ ఎవరైనా మిగిలిన ఉన్నట్లు తేలితే వారిని పట్టుకుని బలవంతంగా తిప్పి పంపుతారని ఓ అధికారి తెలిపారు. -
హైదరాబాద్లో భారీగా పట్టుబడిన హవాలా డబ్బు..
హైదరాబాద్: నెల రోజుల నుండి నిఘా ఉంచి రూ.74.56 లక్షల హవాలా డబ్బును రాయదుర్గం పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన మేరకు.. ఇద్దరు యువకులు యాక్టివాపై డబ్బు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో రాయదుర్గంలోని విస్పర్ వ్యాలీ జంక్షన్లో ఎస్ఐ శ్రీనివాస్ వాహనాల తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వాహనంపై ఒక బ్యాగ్ కనిపించింది. తనిఖీ చేయగా ఆ బ్యాగ్లో రూ. 74,56,200 నగదు లభించింది. కరీంనగర్కు చెందిన బి.సాయికృష్ణ బీటెక్ పూర్తి చేసి చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. రాయదుర్గంలో ఉండేరవితో కలిసి బేగంపేట్లోని సురేందర్ అగర్వాల్ నుంచి డబ్బు తీసుకొని వస్తున్నారు. రవి డ్రైవింగ్ చేస్తుండగా బ్యాగ్తో సాయి కృష్ణ వెనకాల కూర్చున్నాడు. మియాపూర్కు వెళ్లి ఫోన్ చేస్తే ఎవరికి ఇచ్చేది చెప్తారని పోలీసులకు తెలిపారు. స్వాధీనం చేసుకొని నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించామన్నారు. కొంత కాలంగా బ్లాక్ మనీ అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే రెండు మూడు సార్లు పట్టుకునేందుకు ప్రయతి్నంచినా పట్టుబడలేదు. ఎట్టకేలకు భారీ నగదును స్వా«దీనం చేసుకున్నారు. -
సూరీడు సుర్రు.. మీటర్ గిర్రు!
సాక్షి, హైదరాబాద్: భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 10 గంటలకే సుర్రుమంటున్నాడు. ఎండలు మండిపోతుండటంతో గురువారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. కొద్ది రోజులుగా నగరంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. 2024 మే 6న రికార్డు స్థాయిలో 4,352 మెగావాట్ల డిమాండ్ (90.68 మిలియన్ యూనిట్లు) నమోదు కాగా.. తాజాగా గురువారం 4,170 మెగావాట్లకు చేరింది. ఇది ఇలాగే కొనసాగితే మే ఒకటి నాటికి 4,500 మెగావాట్లకుపైగా డిమాండ్ వచ్చే అవకాశం లేకపోలేదని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. ఆన్లోనే ఏసీలు, కూలర్లు గతంతో పోలిస్తే ప్రస్తుతం నగరవాసుల కొనుగోలు శక్తి పెరిగింది. రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లలోనే కన్పించే ఏసీలు ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి నివాసాల్లోనూ అనివార్యమయ్యాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం అనేక మంది ఏసీలు, కూలర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తయారీ కంపెనీలతో పాటు వివిధ ప్రైవేటు బ్యాంకులు జీరో పర్సంటేజీ లోన్లు మంజూరు చేస్తుండటంతో ఆర్థికంగా ఉన్నవారే కాదు.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఎల్రక్టానిక్ యంత్రాలు సాధారణమయ్యాయి. ఫలితంగా గత కొద్ది రోజుల నుంచి నగరంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. -
ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ నేతృత్వంలో క్యాండిల్ ర్యాలీ
హైదరాబాద్,సాక్షి: జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ర్యాలీ జరగనుంది.కాశ్మీర్ ఉగ్ర దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరేలా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ ర్యాలీ నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చింది. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రులు ,ఎమ్మెల్యేలు , భారత్ సమ్మిట్కు హాజరయ్యే పలువురు కీలక నేతలు పాల్గొననున్నారు. -
పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు.. కోర్టులో హాజరు పరిచారు. కాగా, అనారోగ్య కారణాలు చూపెట్టడంతో షకీల్కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యంగా ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో.. సాక్ష్యాలు తారుమారు చేసి తన కొడుకును రక్షించేందుకు ఆయన ప్రయత్నించారనే అభియోగాలు ప్రధానంగా ఉన్నాయి.2023 డిసెంబర్ 23వ తేదీ రాత్రి అతివేగంగా దూసుకొచ్చిన కారు అక్కడి ట్రాఫిక్ బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే సీసీ కెమెరా ఫుటేజీలో అసలు సంగతి బయటపడింది.బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారును నడపగా.. అతన్ని తప్పించేందుకు షకీల్ తన ఇంటి పని మనిషి ఆసిఫ్పై కేసు నమోదు చేయించారు. దీంతో సాహిల్ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు మార్చారు. అటుపై పరారీలో ఉన్న సాహిల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు పై సస్పెన్షన్ వేటు పడింది కూడా. -
ఆపన్న హస్తం ఆదుకుంది.. చదువు దారి చూపింది!
కన్నవారు కాదనుకున్నా.. అనాథలా మారినా.. కష్టాలు చుట్టుముట్టినా.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అక్షరమే ఆయుధంగా బతుకుపోరు సాగించింది.. అక్షరాన్ని ఆలంబనగా చేసుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ తాజాగా ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మెరిసింది రవీనా చౌదరి. రెండేళ్ల పసిప్రాయంలో ఆమెను తల్లి వదిలేసి ఎటో వెళ్లిపోయింది. ఆలనా పాలనా చూడలేక తండ్రి మొహం చాటేశాడు. ఏ దారి లేని ఏడారి రాష్ట్రానికి చెందిన ఆ చిన్నారిని తీసుకొని నానమ్మ హైదరాబాద్ (Hyderabad) వచ్చింది. ఇక్కడే ఉంటున్న తన కూతురు వద్ద ఉంచి రాజస్థాన్ తిరిగి వెళ్లిపోయింది. రవీనాను మేనత్త చేరదీసి స్థానిక హెచ్ఎంటీ కాలనీలోని సెయింట్ ఆంథోని పాఠశాలలో ఎల్కేజీలో చేర్పించింది. చదువుల్లో చురుగ్గా ఉండే రవీనా పదో తరగతిలో 9.3 జీపీఏ సాధించింది. చదువు ఇక చాలన్నారు..పదవ తరగతి పూర్తి కాగానే పైచదువులు చదివించలేనని, ఏదైనా పని చేయాలని రవీనాకు మేనత్త చెప్పింది. తండ్రి రాజస్థాన్ (Rajasthan) నుంచి వచ్చి తీసుకువెళ్లి బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నించాడు. చదువుకుంటానంటే కొట్టి పెళ్లికి అంగీకరించాలని హింసించాడు. తండ్రి బారి నుంచి తప్పించుకొని రవీనా అతి కష్టం మీద తిరిగి నగరానికి వచ్చేసింది. అయితే ఆమెను మేనత్త చేరదీయలేదు. ఓనమాలు నేర్పిన పాఠశాల గడప తొక్కడంతో..రవీనా చౌదరి సెయింట్ ఆంథోని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ వద్దకు వెళ్లి తన గోడు చెప్పుకుంది. ఆయన చలించి పాఠశాల పూర్వ విద్యార్థులు, తెలిసిన వారి సహకారంతో సమీపంలోని గరల్స్ హాస్టల్లో ఆమెను చేర్పించారు. నెలనెలా ఖర్చుల కోసం ట్యూషన్లు చెప్పుకోవాలని ఐదుగురు చిన్నారులను అప్పగించారు. దీంతో రవీనా చిన్నారులకు ట్యూషన్లు చెబుతూ హబ్సిగూడలోని ఓ ప్రైవేటు ఇంటర్ కళాశాలలో చేరింది. ఆమె గాథ టీఎన్జీఓ (TNGO) వ్యవస్థాపక మాజీ ప్రధాన కార్యదర్శి కోయడ దశరథరావు దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించి ఆర్థికంగా చేయూతనిచ్చారు.తాజాగా వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రవీనా 978/1000 మార్కులు సాధించి చదువుపట్ల తన ధృడత్వాన్ని చాటుకుంది. డిగ్రీ పూర్తి చేసి ఎప్పటికైనా సివిల్స్లో ర్యాంకు తెచ్చుకోవడమే తన లక్ష్యమని రవీనా చౌదరి ధీమాగా చెబుతోంది. అలాగే ఆమె వెయిట్ లిఫ్టింగ్లో ప్రవేశం పొంది ఓ టోర్నమెంటులో మెడల్ కూడా సాధించడం గమనార్హం. రవీనా డిగ్రీ చదువుకు, ఆ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్కు అండగా ఉంటామని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, దశరథరావు పేర్కొనడం వారి గొప్ప మనసుకు నిదర్శనం.చదవండి: ఈసారి కూడా అమ్మాయిలదే హవా -
ఆ దిశగానే భారత్ సమ్మిట్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే భారత్ సమ్మిట్ లో వంద దేశాలకు సంబంధించిన 450 ప్రతినిధులు పాల్గొంటున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ స్పష్టం చేశారు. భారతదేశం అలీనోద్యమం తీసుకొని ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని, ఆ దిశగానే సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క.ఈరోజు(గురువారం) హెచ్ఐసీసీ నుంచి మాట్లాడిన భట్టి విక్రమార్క.. ‘ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ఉదయం గం. 7.30ని.ల నుంచి గం.10.30 ని.ల వరకూ ఎన్ఆర్జీసీ పథకం ఫీల్డ్ విజిటింగ్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం వివరిస్తాం. 2:45 నుంచి 4 గంటల వరకు తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ కోసం ఏం చేస్తుందనేది వివరిస్తాం. వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో శాంతిని నింపేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుంది.ఎల్లుండి(శనివారం) సాయంత్రం ఇందిర మహిళ శక్తి బజార్ శిల్పకళ వేదిక సందర్శిస్తాం. పెహల్గామ్ ఉగ్రదాడి దురదృష్టకర సంఘటన. ఈ ప్రాంతాన్ని రేపు రాహుల్ గాంధీ సందర్శిస్తారు. అనంతరం భారత్ సమ్మిట్ కి రాహుల్ గాంధీ హాజరు అవుతారు. అహింస, సత్యాగ్రహ పద్ధతి ప్రపంచం పాటించాలని కోరుకుంటున్నాం. భారత్ సమ్మిట్ ద్వారా వివిధ దేశాల ప్రతినిధులు తెలంగాణకి వస్తారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న వనరుల వివరిస్తాం. న్యాయం అన్ని వర్గాలకు దక్కాలనేది కాంగ్రెస్ మూల సిద్ధాంతాలు. మా ప్రభుత్వం ద్వారా ప్రపంచానికి ఈ మూల సిద్ధాంతం తెలియజేస్తాం. ప్రగతిశీల భావజాలం ఉన్న, న్యాయ సిద్ధాంతం ఉన్న పార్టీలను ఈ సమ్మిట్ కి ఆహ్వానిస్తాం’ అని భట్టి పేర్కొన్నారు. భారత్ ఫౌండేషన్ సహకారంలో ఈ నెల 25, 26వ తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)లో భారత్ సమ్మిట్ 2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. -
పహల్గాం ఉగ్ర దాడి.. హైదరాబాద్లో హైఅలర్ట్
సాక్షి, హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. పాత బస్తీతో పాటు వివిధ ప్రాంతాలపై పోలీసులు నజర్ పెట్టారు. పర్యాటక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోని గతంలో టెర్రరిస్టుల దాడులకు గురైన ప్రాంతాలు సహా పలు ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.మరో వైపు, తిరుమలలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. పహల్గాంలో ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో టీటీడీ.. తిరుమలలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో సెక్యూరిటీని పెంచారు. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుమలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. -
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతనాగ్ జిల్లా పెహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా చేసిన దాడిలో 26 మంది పర్యాటకులు అసువులు బాసారు. పెహల్గాంలోని బైసరాన్కు విహార యాత్రలోభాగంగా , ప్రకృతి అందాలను వీక్షిస్తున్న తరుణంలో ఉగ్రమూకలు వారిపై దాడికి తెగబడ్డారు. దాంతో ఆ ఆనంద క్షణాలు కాస్తా విషాదంగా మారిపోయాయి. ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కుమారుడు ఉన్నారు.ఐబీ(ఇంటెలిజెన్సీ బ్యూరో) ఆఫీసర్ గా హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న మనీష్ రంజాన్.. ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు విడిచాడు. రంజాన్ మృతదేహం బుధవారం స్వస్థలానికి చేరుకున్న తరుణంలో ఆయన తండ్రి మంగ్లేస్ మిశ్రా కన్నీటి పర్యంతమయ్యారు. కుమారుడి మృతదేహాన్ని చూస్తూ కృంగిపోయారు. ఈ క్రమంలోనే జాతీయ మీడియా ఆయన్ని పలకరించగా తాను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని, ఒంటరిగా ఉన్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.‘నన్ను ఒంటరిగా వదిలేయండి. నేనే మాట్లాడలేను. కశ్మీర్ కు నవ్వుతూ వెళ్లాడు నా కుమారుడు రంజన్. ప్రతీరోజూ మాకు కాల్ చేసి మా ఆరోగ్యం గురించి అడిగేవాడు.. జాగ్రత్తలు చెప్పేవాడు. తాను అసువులు బాసిన చివరి రోజు కూడా మాకు కాల్ చేశాడు. అంతకుముందే మా కాల్ చేసి మాట్లాడిన నా కుమారుడు ఇలా వస్తాడని అనుకోలేదు’ అంటూ కన్నీటి వేదనతో చెప్పారు. -
ముత్యాల నగరంలో..ఆభరణాల ఉత్సవం!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం ఇప్పటికీ ముత్యాల నగరంగా ప్రసిద్ధి చెందిన విషయం విధితమే.. ఈ గుర్తింపును ఇప్పటికీ కాపాడుకుంటూ దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలు, వజ్రాలకు ప్రసిద్ధ గమ్యస్థానంగా నగరం నిలుస్తోంది. అంతేకాకుండా ఆభరణాల వ్యాపారానికి సురక్షితమైన ప్రాంతంగానూ నగరం సేవలందిస్తోంది. విభిన్న సంస్కృతుల నేపథ్యంలో ఈ వ్యాపార కలాపాలు ఇక్కడ విస్తృతంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆభరణాల వినియోగంలో దేశం దాదాపు 29 శాతం వాటా కలిగి ఉంది. ఇందులో దక్షిణాది, మరీ ముఖ్యంగా భాగ్యనగరం ప్రధాన వాటాదారుగా ఉంది. ఈ నేపథ్యంలో నగరం వేదికగా ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్’కు సిద్ధమవు తోంది. 3 రోజుల ఈవెంట్లో ట్రెండ్ సెట్టింగ్ డిజైన్లు, బ్రాండ్ లాంచ్లు, ఆభరణాల సమావేశాలు, ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక, పవర్ ఆఫ్ యంగ్, లెజెండ్స్ ఆఫ్ సౌత్, జ్యువెలరీ పర్చేజ్ మేనేజర్స్ కనెక్ట్, కాఫీ విత్ డాక్టర్ చేతన్, బిజినెస్ మ్యాచ్ మేకింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.220పైగా ప్రదర్శనకారులకు ఆతిథ్యం దక్షిణాదిలోని హైదరాబాద్ సహా ముంబై, జైపూర్, కేరళ, బెంగళూరు, కోయంబత్తూర్, చెన్నై వంటి నగరాలకు చెందిన ప్రముఖ జ్యువెల్లరీ బ్రాండ్లు నగరానికి విచ్చేయనున్నాయి. నగరంలోని హైటెక్స్ వేదికగా వచ్చే నెల 9 నుంచి 11వ తేదీ వరకు ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్’ నిర్వహించనున్నారు. భారతదేశపు ప్రీమియర్ బీ2బీ జ్యువెలరీ ఎగ్జిబిషన్గా ఇందులో 8 వేలకు పైగా వాణిజ్య సందర్శకులను ఆకర్షిస్తోందని, 220పైగా ప్రదర్శనకారులకు ఆతిథ్యం ఇస్తుందని అంచనా. ఈ వేదికగా తాజా ఆభరణాల ట్రెండ్స్, ప్రత్యేక బ్రాండ్ సేకరణలు, అత్యాధునిక డిజైన్లను ఆవిష్కరిస్తుంది. ఈ వేదికగా భారతదేశ వార్షిక ఆభరణాల అమ్మకాలలో 60 శాతం వరకు ప్రభావితం చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్ దేశంలోని ప్రీమియం ప్లాట్ఫామ్లలో ఒకటిగా స్థిరపడింది. దక్షిణాదిలోని ఆవిష్కరణ, హస్తకళ, వారసత్వం, వ్యాపారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తున్నాం. బంగారం, వజ్రం, వెండి, ముత్యాలు, రత్నాల ఆభరణాలను, టెక్నాలజీ ప్రొవైడర్లు, విలువైన లోహ సరఫరాదారులు, ఆభరణాల యంత్రాల తయారీదారులు, భారత్తో పాటు విదేశాల నుంచి మౌంటింగ్ వ్యాపారులను ఏకం చేస్తున్నాం. – యోగేష్ ముద్రాస్, భారత ఇన్ఫార్మా మార్కెట్స్ మేనేజింగ్ డైరెక్టర్. వచ్చే నెలలో హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్, జెమ్ ఫెయిర్ -
World Mental Health Index : అట్టడుగున హైదరాబాద్, కారణాలివే!
ప్రపంచవ్యాప్త అధ్యయనం ప్రకారం నగర యువత మానసిక ఆరోగ్యం బాగా క్షీణిస్తోంది. అంతర్జాతీయంగా సేపియన్ ల్యాబ్స్ సంస్థ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ రిపోర్ట్ దీనిని వెల్లడించింది. మానసిక ఆరోగ్యం ( World Mental Health Index )అత్యల్పంగా ఉన్న భారతదేశపు మెట్రో నగరాల్లో హైదరాబాద్కు అట్టడుగున స్థానం కల్పించింది. మెంటల్ హెల్త్ కోషియంట్(ఎంహెచ్క్యు) స్కేల్లో నగరం ప్రపంచ సగటు 63 కాగా మన నగరం 58.3 స్కోర్ను సాధించింది. ఢిల్లీ 54.4 స్కోర్తో మన తర్వాత స్థానంలో నిలిచింది. ఈ అధ్యయనం కోసం సంస్థ 18 నుంచి 55 ఆ తర్వాత వయస్సు కలిగిన 75 వేల మంది వ్యక్తులను ఎంచుకుంది. – సాక్షి, సిటీబ్యూరోఎంహెచ్క్యు స్కేల్ మానసిక ఆరోగ్యాన్ని ‘బాధలో ఉండటం’ నుంచి ‘అభివృద్ధి చెందడం’ వరకు విభజించింది. ‘ఎండ్యూరింగ్’ ‘మేనేజింగ్’ కేటగిరీల మధ్య హైదరాబాద్ సగటు పడిపోయింది. నగరంలో ‘32% మంది ‘బాధపడుతున్న’ లేదా ‘కష్టపడుతున్న’ కేటగిరీల్లోకి వచ్చారు. ఇది పేలవమైన భావోద్వేగ నియంత్రణ, బలహీనమైన సంబంధాలతో క్షీణించిన మానసిక పనితీరుగా గుర్తించడం జరిగింది’ అని సేపియన్ ల్యాబ్స్ డైరెక్టర్ శైలేందర్ స్వామినాథన్ అంటున్నారు.యువతే ఎక్కువ.. మానసికంగా ప్రభావితమైన వారి సంఖ్య యువకులలో ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 55 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులు అంతర్జాతీయ కొలమానాలతో సమానంగా 102.4 స్కోర్ సాధించగా, 18 నుంచి 24 సంవత్సరాల మధ్య యువత సగటున 27 పాయింట్లు పైబడి మాత్రమే సాధించి ‘ఎండ్యూరింగ్’ విభాగంలో చోటు దక్కించుకుంది. సేపియన్ ల్యాబ్స్కు చెందిన ప్రధాన శాస్త్రవేత్త తారా త్యాగరాజన్ మాట్లాడుతూ.. ‘దాదాపు సగం మంది యువకులు బాధను, మనసును బలహీనపరిచే భావాలను కలిగి ఉన్నారు’ అని చెప్పారు. యువత మానసిక ఆరోగ్య సంక్షోభానికి కారణాలను సైతం నివేదిక కీలకంగా ప్రస్తావించింది.పంచుకునే మనసులు లేక.. హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ పరిస్థితికి ముఖ్యంగా సామాజిక బంధాల విచ్ఛిన్నం ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. వ్యక్తివాద మనస్తత్వాలు పెరగడం వల్ల కుటుంబాలు సన్నిహిత స్నేహాలు వంటి సంప్రదాయ పద్ధతులు క్షీణించాయి. పిల్లలతో గడపడం అనే విషయంలో తల్లిదండ్రుల నిర్లక్ష్యం వంటివి వీటికి జత కలిసి ఒంటరితనం పెరుగుదలకు ఆజ్యం పోసింది అని నివేదిక తేల్చింది.ఊహ తెలిసేలోపే.. స్మార్ట్ ఫోన్ వినియోగం చిన్న వయసు నుంచే స్మార్ట్ ఫోన్ వినియోగం అలవాటు కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తోంది. తగిన వయసు లేకుండా స్మార్ట్ ఫోన్ వినియోగించడం వల్ల విషాదం, నిరాశా నిస్పృహలు, ఉద్రేకం, ఆత్మహత్యా ధోరణులు పెట్రేగేందుకు అవకాశం ఇచ్చి వాస్తవ దూరమైన ప్రపంచంలోకి నెడుతోంది. చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్ వినియోగం నిద్రాభంగానికి, సైబర్ బెదిరింపులు, హానికరమైన కంటెంట్ను దగ్గర చేస్తుంది. పర్యావరణ ప్రభావం.. మానసిక సమస్యలకు పర్యావరణ మార్పులు కూడా దోహదం చేస్తున్నాయి. ఆహారం నీటిలో ఇప్పుడు సర్వ సాధారణంగా కనిపించే పురుగు మందులు, భారీ లోహాలు మైక్రోప్లాస్టిక్లు–మెదడు అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు యుక్తవయస్సులో ఉన్నవారిలో తీవ్ర సమస్యలకు ఇది దోహదం చేస్తోందని నివేదిక నిర్ధారించింది. రాంగ్ డైట్.. సైకలాజికల్ ఫైట్.. అతిగా అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్స్(యుపీఎఫ్) తీసుకునే వ్యక్తులు మానసిక క్షోభను కూడా ఎక్కువ అనుభవించే అవకాశం ఉంది. ‘యుపీఎఫ్ వినియోగం 15 సంవత్సరాలలో బాగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో ఇది 30% వరకు మానసిక అనారోగ్యానికి కారణమవుతోందని మా డేటా సూచిస్తోంది.’ అని నివేదిక పేర్కొంది. -
హైదరాబాద్లో ఫిట్నెస్ ఇన్నోవేషన్ సెంటర్
హైదరాబాద్: ఫిట్నెస్ సంస్థలకు టెక్నాలజీ సేవలు అందించే గ్లోబల్ సంస్థ ఏబీసీ ఫిట్నెస్ హైదరాబాద్లో తమ ఇన్నోవేషన్ హబ్ను ఆవిష్కరించింది. ఫిట్నెస్ పరిశ్రమకు అవసరమైన టెక్నాలజీలను రూపొందించడంపై ఇది ప్రధానంగా దృష్టి పెడుతుంది.అంతర్జాతీయంగా ఎఫ్45 ఫ్రాంచైజీ, స్థానికంగా ది ఫిట్ స్ట్రీక్లాంటి ఇరవై పైగా కస్టమర్లకు కంపెనీ సర్వీసులు అందిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు సహా వచ్చే ఏడాది వ్యవధిలో 200 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు సంస్థ సీఈవో బిల్ డేవిస్ వివరించారు. భారత్లో ఒసాము సుజుకీ ఎక్సలెన్స్ సెంటర్జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటర్ కార్పొరేషన్ తమ మాజీ చైర్మన్, దివంగత ఒసాము సుజుకీ గౌరవార్థం భారత్లో ఆయన పేరిట సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను (ఓఎస్సీవోఈ) ఏర్పాటు చేయనుంది. దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీతో కలిసి గుజరాత్, హర్యానాలో ఓఎస్సీవోఈని నెలకొల్పనుంది. తయారీ రంగం అధిక వృద్ధి సాధనలోను, విడిభాగాల తయారీ సంస్థల ప్రమాణాలను మెరుగుపర్చడంలోను ప్రభుత్వ లక్ష్యాలకు తోడ్పడేదిగా ఇది ఉంటుందని మారుతీ సుజుకీ తెలిపింది. -
హైదరాబాద్ : ఓ షాపింగ్ మాల్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)
-
మాజీ మంత్రి విడదల రజిని, ఆమె మరిది గోపీనాథ్ పై అక్రమ కేసు
-
SRH Vs MI : ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్.. తారల సందడి (ఫొటోలు)
-
లోగోను మార్చిన హైడ్రా.. కొత్తది ఇదే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన లోగో మార్చుకుంది. జల వనరుల శాఖను పోలి ఉండేలా కొత్త లోగోను అధికారులు రూపొందించారు. హైడ్రా అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల్లో ఈ లోగోను ప్రొఫైల్ చిత్రంగా పెట్టి అప్డేట్ చేసింది. ఈ లోగోను తెలంగాణ సర్కార్ అధికారికంగా ఆమోదించింది. హైడ్రా కార్యాలయంతో పాటు సిబ్బంది యూనిఫాం, వాహనాలపై కొత్త లోగోను ముద్రించనున్నారు.కాగా, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలను అడ్డుకోవడమే లక్ష్యంగా జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (ఎన్ఆర్ఎస్సీ)తో హైడ్రా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ఆర్ఎస్సీ వద్దనున్న ఉపగ్రహ చిత్రాలు, ఇతరత్రా భూ వివరాలను ఉపయోగించుకుని చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్టీఎల్), బఫర్ జోన్లను నిర్ధారించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. అందుకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్, ఎన్ఆర్ఎస్సీ సంచాలకుడు డాక్టర్. ప్రకాశ్ చౌహాన్ బాలానగర్లోని ఎన్ఆర్ఎస్సీలో సంతకాలు చేశారు. -
ఐఏఎస్ స్మితా సబర్వాల్పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని వినిపించిన ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్పై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ‘ఆమె ఏం యాక్షన్ చేస్తుందబ్బా.. ఆమె ఐఏఎస్ అధికారిణి!’ అంటూ వ్యవంగంగా మాట్లాడారు.కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఐఏఎస్ స్మితా సబర్వాల్ సోషల్మీడియా రీట్వీట్లను ప్రస్తావించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 13 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికిందని ఆరోపించారు. ఆ చెట్లను నరికి వేసినప్పుడు స్మితా సబర్వాల్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు. సోషల్ మీడియా పోస్టులు ఎందుకు పెట్టలేదని పునరుద్ఘాటించారు. స్మితా సబర్వాల్.. అప్పుడు ఏం చేశినవ్? - గజ్జెల కాంతంకేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికేసినప్పుడు జింకలు, వణ్యప్రాణులు వేరే అడవులకు పోతుంటే నువేం చేశినవ్అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండి ఇది కరెక్టు కాదని ఎందుకు ఖండించలేదు?IAS అధికారి స్మితా సబర్వాల్పై రెచ్చిపోయిన… pic.twitter.com/FrHZkWO2dA— Telugu Galaxy (@Telugu_Galaxy) April 23, 2025 -
గిన్నిస్ బుక్ రికార్డు: ఒకే కుటుంబంలో ముగ్గురికి అరుదైన గౌరవం
సాక్షి, సిటీబ్యూరో: కేపీహెచ్ బీ కాలనీకి చెందిన మేడిది లలితాకుమారి తన ఇద్దరు చిన్నారులు లీషా ప్రజ్ఞ (8) అభిజ్ఞ ( 5) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాందించారు. 18 దేశాలకు చెందిన కీబోర్డ్ సంగీత కళాకారులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రికార్డు నెలకొల్పడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, వ్యవసాయ, సహకార మార్కెటింగ్ చేనేత వ్రస్తాల శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారిని అభినందించారు. డిసెంబర్ 1, 2024న హాలెల్ మ్యూజిక్ స్కూల్ విద్యార్థులతో కలిసి గంట వ్యవధిలో ఇన్స్ట్రాగాం వేదికగా వీడియోలు అప్లోడ్ చేశారు. లండన్లోని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధినేత మిస్టర్ రిచర్డ్ స్టన్నింగ్ సంగీత కళాకారులను విజేతలను ప్రకటించి డిసెంబర్ 9, 2024న లండన్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా వారిని అభినందించారు. ఈనెల 14న హైదరాబాద్లోని మణికొండలో జరిగిన వేడుకల్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి ఆనంద్ రాజేంద్రన్, హాలెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టీన్ దండింగి సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. -
బట్టతలపై జుట్టు అనగానే.. ఉప్పల్లో క్యూ కట్టిన జనం.. షాకిచ్చిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్లో బట్టతల మందు కోసం బాధితులు క్యూ కట్టారు. ఉప్పల్ బాగాయత్లో ఏర్పాటు చేసిన శిబిరం.. వేలాది మంది బట్టతల బాధితులతో నిండిపోయింది. వెయ్యి రూపాయలు పెట్టి బట్టతలకు బాధితులు మందు తీసుకుంటున్నారు. 300 ఎంట్రీ ఫీజు.. 700 ఆయిల్ కాస్ట్ అంటూ హరీశ్ అనే వ్యక్తి భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తీసుకొని బట్టతలకు ఆయిల్ ఇస్తామంటూ మోసానికి పాల్పడుతున్న హరీష్, వినోద్, రాజశేఖర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గతంలో కూడా బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని ఓ యువకుడు పాతబస్తీలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన వకీల్ గత కొంత కాలంగా పాతబస్తీ రామనాస్పుర రోడ్డులో కింగ్ పేరుతో కటింగ్ షాపును నిర్వహిస్తున్నాడు. నెల రోజుల నుంచి బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున యువకులు క్యూలో నిలబడి మందు పెట్టించుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది.వకీల్ మొదట బట్టతల గుండు కొట్టి రూ.100 తీసుకొని తర్వాత జుట్టు మొలిపించేందుకు కెమికల్ను బట్టతలపై రాసేవాడు. ఉన్న కాస్త జుట్టు కూడా పోయిందంటూ ఆందోళనకు గురయ్యారు. -
కలర్ఫుల్.. సిబ్లింగ్స్ వాక్..!
సాక్షి, సిటీబ్యూరో: ఎన్ని బంధాలున్నా తోబుట్టువుల అనుబంధం, ప్రేమ ప్రత్యేకమైనవి. జన్మతో సహా కలిసొచ్చే బంధం ఇది. ఇంతటి గొప్ప అనుబంధాన్ని, ఆప్యాయతను అంతే చక్కగా ప్రదర్శించింది కూకట్పల్లి అశోక వన్ మాల్ వేదికగా నిర్వహించిన ది సిబ్లింగ్స్ కిడ్స్ ఫ్యాషన్ వాక్. అశోక డెవలపర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమంలో ఆత్మవిశ్వాసంతో, అందమైన నడకతో, ఆకర్షణీయమైన దుస్తులను ధరించి తమ విశిష్టతను ప్రదర్శించారు పలువురు చిన్నారులు. ఈ కార్యక్రమం ఫ్యాషన్ భాగస్వామి అయిన రిలయన్స్ ట్రెండ్స్.. ఫ్యాషన్ వాక్లో పాల్గొన్న పిల్లలందరికీ ఆకర్షణీయమైన దుస్తులను అందించింది. అదనంగా మేక్ మై హోమ్, డెకథ్లాన్ సంస్థతో కలిసి ఈ చిన్నారులకు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా అశోక డెవలపర్స్ అండ్ బిల్డర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.జైదీప్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పరిసరాల్లోని కుటుంబాలతో బంధం ఏర్పరచుకోడానికి, షాపింగ్ చేయడానికి, ఆనందించడానికి అవకాశాలను సృష్టించడానికి అశోక వన్ మాల్ సిబ్లింగ్స్ కిడ్స్ ఫ్యాషన్ వాక్ నిర్వహించామని, ఈ కార్యక్రమం తోబుట్టువుల సంబంధాల గొప్పతనాన్ని ప్రదర్శించిందని అన్నారు.నెహ్రూ జూలాజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్చార్మినార్: వేసవి సెలవులను పురస్కరించుకుని మే నుండి జూన్ వరకూ నెహ్రూ జూలజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొనడానికి ఔత్సాహికులైన విద్యార్థులు రూ.1000 రిజి్రస్టేషన్ ఫీజు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. హైదరాబాద్ వన్యప్రాణుల జూ ఉత్సాహవంతులైన పిల్లలను వేసవి శిబిరంలో పాల్గొనేందుకు ఆహ్వానిస్తోందన్నారు. ప్రతి రోజూ బ్యాచ్ల వారీగా నిర్వహించే ఈ వేసవి క్యాంపులో ప్రతి బ్యాచ్కూ 15 నుండి 20 మంది విద్యార్థులు ఉంటారన్నారు. ఈ వేసవి శిబిరంలో జూ పార్కుకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు జూ టూర్, జూ పార్కులోని జంతువుల చరిత్ర, సమాచారం తెలుసు కోవడం, సరీసృపాలపై అవగాహన సెషన్, రాత్రి గుహ సందర్శన, ఇతర సరదా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనుభవజ్ఞులైన వన్యప్రాణుల విద్యావేత్తల నేతృత్వంలో ప్రతి బ్యాచ్కూ ప్రతి రోజూ అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద చెల్లించే రూ.1000లో స్నాక్స్, శాఖాహార భోజనంతో పాటు అభ్యర్థులకు క్యాప్, క్యాప్, నోట్ ప్యాడ్, జూ బ్యాడ్జ్, హైదరాబాద్ జూ లోగోతో కూడిన కిట్ అందిస్తారన్నారు. ఈ సమ్మర్ క్యాంపులో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకూ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన ఇన్స్టా, ఫేస్బుక్తో పాటు అధికారిక వెబ్సైట్లో లాగిన్ కావాలన్నారు. 040–2447 7355లో గానీ, 92810 07836 వాట్సాప్ నెంబర్లో గానీ సంప్రదించాలన్నారు. -
నా దారి రహదారి : రివర్స్ వాకింగ్
ప్రతి రోజూ అందరూ వాకింగ్ చేస్తారు.. అతడు కూడా అందరిలానే వాకింగ్ చేస్తాడు.. అయితే అందరికన్నా భిన్నంగా వెనక్కి నడుస్తాడు.. అదే రివర్స్ వాకింగ్ అండి. అతడే కూకట్పల్లి, వివేకానందనగర్లో నివాస ముండే అన్య శ్రీధర్. నగరంలోని ఓ ఫార్మాకంపెనీలో మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతి రోజూ 5 గంటలకే వాకింగ్ మొదలుపెడతాడు. ఇంటి నుంచి బయలుదేరే సమయంలో అందరూ ముందుకు నడుస్తుంటారు.. ఆయన మాత్రం వెనుకవైపు నడుస్తూ.. వేగంగా పరుగెత్తటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పక్కనుంచి నడవడానికి కష్టంగా ఉన్న ఈ రోజుల్లో శ్రీధర్ మాత్రం వెనుక వైపు పరుగెత్తటం విశేషం.ప్రతి రోజూ వివేకానందనగర్ కాలనీలోని వాకర్స్ రూట్లో యువకులతో సహా అందరూ ముందుకు నడుస్తుంటారు. అంతేకాకుండా వాకింగ్ చేసేవారు ఒకటిన్నర కిలోమీటర్లను సుమారు 15 నిమిషాలు నడుస్తుండగా.. శ్రీధర్ వెనుకవైపు 10 నిమిషాల్లోపు పరుగెత్తటం విశేషం. దాదాపు 17 నుంచి 20 నిమిషాల్లో రెండు రౌండ్లను రివర్స్లో పూర్తిచేస్తాడు. వ్యాయామం విషయంలో కూడా అందరూ నిలబడి కాళ్లను సైక్లింగ్లాగా వ్యాయామం చేసారు. తను మాత్రం తల కిందికి పెట్టి కాళ్ళను దాదాపు 5 నిమిషాల సేపు వాకింగ్ సైక్లింగ్ చేయటం విశేషం. అంతేకాకుండా తల కిందికి పెట్టి కాళ్లు పైకి పెట్టి 3 నిమిషాల సేపు ఉంటారు. ఈ విధంగా శ్రీధర్ ఆరు పదుల వయసులో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా వ్యాయమం చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ‘తాను గతంలో సాధారణ వాకింగ్తో పాటు వ్యాయామం చేసేవాడినని, తాను ఒక ఆర్టికల్ చదివి హృదయ సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టే విధంగా ఈ వ్యాయామం పనిచేస్తుందని గ్రహించినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఈ వ్యాయామంపై ప్రత్యేక దృష్టి సారించి వాకింగ్ చేయటం మొదలు పెట్టానని, దాదాపు మూడు సంవత్సరాలుగా రివర్స్ వాకింగ్ చేస్తూ.. తనలాంటి మరికొందరికి శిక్షణ కూడా ఇస్తున్నట్లు ‘సాక్షి’తో తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని తాను పాటిస్తానని, తన వ్యాయామం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే తనను మన్నించాలని కోరారు. -
భార్య, అత్తపై అల్లుడి దాడి
మియాపూర్(హైదరాబాద్): భార్యా భర్తల మధ్య ఏర్పడిన వివాదం దాడికి దారి తీసింది. భార్యపై భర్త కత్తితో దాడి చేయగా..అడ్డుగా వచ్చిన అత్తను సైతం కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు..సీఐ క్రాంతి కుమార్ తెలిపిన ప్రకారం..కాకినాడకు చెందిన బండారులంక మహేష్ మియాపూర్ జనప్రియనగర్ రోడ్డు నెం.5 శ్రీ వెంకట నిలయంలో భార్య శ్రీదేవి, రెండేళ్ల కుమార్తెతో కలిసి ఉంటూ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్ తన సంపాదనను ఇంటి ఖర్చులకు ఇవ్వకుండా..మద్యం తాగేందుకు ఖర్చుచేస్తున్నాడు. ఈ విషయంలో భార్య శ్రీదేవితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం శ్రీదేవి చందానగర్ హుడాకాలనీలో ఉంటున్న తల్లి మంగ ఇంటికి వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం శ్రీదేవికి ఫోన్చేసి ఇంటికి తిరిగి రమ్మని మహేష్ కోరగా..ఆమె మధ్యాహ్నం ఒంటి గంటకు కుమార్తెతో కలిసి వచ్చింది. అదేరోజు సాయంత్రం మహేష్ తన సోదరుడు సాయికుమార్ పుట్టిన రోజు ఉందని, జనప్రియ కాలనీలో ఉంటున్న తమ తల్లిదండ్రుల ఇంటికి వెళ్దామని చెప్పాడు. దీనికి శ్రీదేవి నిరాకరించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లి మంగకు ఫోన్ చేసి చెప్పగా ఆమెకూడా ఇక్కడికి వచ్చింది. దాడిని ప్రశ్నించడంతో ఆవేశానికి లోనైన మహేష్ వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కోసే కత్తి తీసుకుని వచ్చి మొదట శ్రీదేవిపై దాడి చేశాడు. వారించేందుకు వెళ్లిన అత్త మంగను విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడగా..స్థానికులు గమనించి ఇద్దర్నీ సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతించారు. ఘటనపై శ్రీదేవి భర్త మహేష్పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడు మహేష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
TS Inter Result 2025: ఈసారి కూడా అమ్మాయిలదే హవా
సాక్షి, (హైదరాబాద్): ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మళ్లీ అమ్మాయిల హవానే కొనసాగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి సత్తా చాటారు. కాగా.. రాష్ట్ర స్థాయిలోనే ఫస్టియర్లో మేడ్చల్– మల్కాజిగిరి ప్రథమ స్థానంలో నిలవగా, రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. సెకండియర్లోనూ ఈ రెండు జిల్లాలు మూడు, నాలుగో స్థానాలను కైవసం చేసుకున్నాయి. హైదరాబాద్ జిల్లా మరోసారి చతికిలపడి నిరాశే మిగిలి్చంది. మొత్తమ్మీద ఇంటరీ్మడియట్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్కు 73 శాతం ఉత్తీర్ణత లభించింది. గత ఏడాది కంటే 3 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఉత్తీర్ణత ఇలా.. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్, వృత్తి విద్యా కోర్సులతో కలిపి 73.41 శాతం, ద్వితీయ సంవత్సరంలో 73.39 శాతం ఉత్తీర్ణత లభించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ప్రథమ సంవత్సరంలో హైదరాబాద్లో 66.68 శాతం, రంగారెడ్డి జిల్లాలో 76.36, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో 77.21 శాతం, ద్వితీయ సంవత్సరంలో మేడ్చల్ జిల్లా 77.91, రంగారెడ్డి 77.53, హైదరాబాద్ 67.74 శాతం ఉత్తీర్ణత సాధించాయి.మరోసారి.. సత్తా చాటి.. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈ ఏడాది సైతం బాలికల హవానే కొనసాగింది. ప్రథమ సంవత్సరం జనరల్ కోర్సుల్లో ఫలితాలు పరిశీలిస్తే.. మేడ్చల్– మల్కాజిగిరిలో బాలికలు 82.40 శాతం, బాలురు 73.54, రంగారెడ్డి జిల్లాలో 81.92 బాలికలు, 72.24 బాలురు, హైదరాబాద్ జిల్లాలో 74.65 బాలికలు, 60.47 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో.. మేడ్చల్లో 82.21 బాలికలు, 74.56 బాలురు, రంగారెడి జిల్లాలో 82 శాతం బాలికలు, 73.70 బాలురు, హైదరాబాద్ జిల్లాలో బాలికలు 74.81, బాలురు 59.50 శాతం చొప్పున ఉత్తీర్ణులయ్యారు. -
HYD: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటింగ్కు బీఆర్ఎస్ దూరం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 78.57 శాతం పోలింగ్ నమోదైంది. 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ మినహా బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియ్ సభ్యులు పోలింగ్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ నిర్వహించనున్నారుఉదయం 10 గంటల వరకు 50 శాతం ఓట్లు నమోదు అవ్వగా, 45 మంది కార్పొరేటర్లు ఓటు వినియోగించుకున్నారు. ఎక్స్ అఫీషియో హోదాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ AVN రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ కార్పొరేటర్లు ఓటు వేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ ప్రకటించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల సంఘం వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల కోసం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. డ్యూటీలో 250 మంది పోలింగ్ సిబ్బంది.. 250 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేశారు. పోటీలో ఎంఐఎం, బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఎంఐఎం అభ్యర్దిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో ఉన్నారు.మొత్తం ఓటర్లు 112. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు. వీరిలో ఎంఐఎంకు 50, బీజేపీకి 24, బీఆర్ఎస్కు 24, కాంగ్రెస్కు 14. సరిపడ సంఖ్య బలం లేకున్నా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటర్లు కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆదేశించింది. -
విద్యుదాఘాత మరణాలపై నివేదిక ఇవ్వండి
సిటీ కోర్టులు: వరుసగా జరుగుతున్న విద్యుత్ షాక్ మరణాలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ టీజీఎస్పీడీసీఎల్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘మృత్యుపాశాలు’ కథనాన్ని సుమోటోగా స్వీకరించింది. దీనిపై మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో విద్యుత్శాఖ కారణంగా సంభవించిన మరణాలపై సమాగ్ర విచారణ జరిపి పూర్తి నివేదికను జూన్ 4లోపు సమర్పించాలని టీజీఎస్పీడీసీఎల్ను ఆదేశిస్తూ విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది. శంషాబాద్ కొందుర్గు మండలాలలో ఇటీవల జరిగిన ఘటనలతో పాటు గత ఏడాది కాలంలో 69 మంది విద్యుదాఘాతానికి గురై మరణించడం ఆందోళన కలిగించిందని పేర్కొంది. దీనికి కారణం ప్రమాదకరమైన వైర్లు, ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ సరిగా లేకపోవడం, మెయింటెనెన్స్ సిబ్బంది లేకపోవడం వల్ల ప్రజలు మృత్యువాత పడుతున్నారని కమిషన్ పేర్కొంది. జూన్ 2025 మొదటి వారంలోగా ఈ మరణాలకు సంబంధించి వివరణాత్మక నివేదికలను సమర్పించాలని సీఎండీ టీజీఎస్పీడీసీఎల్ను, తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లను కమిషన్ ఆదేశించింది.గత ఏడాది విద్యుత్ షాక్తో వర్షాకాలంలోనే ఎక్కువ మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు మరణించిన బాధిత కుటుంబాలకు సరైన పరిహారం అందకపోవడం సంబంధిత అధికారులు కూడా సరైన చర్యలు తీసుకోకపోవడమేమిటని ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం.... ప్రజలకు జీవించే హక్కుతో పాటు తమ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతోందని కమిషన్ పేర్కొంది. ఇప్పటి వరకు సంబంధింత మరణాల్లో ఎక్కువగా కారి్మకులు ఉండడం, వారి మృతదేహాలను సబ్స్టేషన్ల ముందు పెట్టి ఆందోళన చేస్తున్నా ఫలితం లేకపోవడమేంటని ప్రశ్నించింది. తదుపరి విచారణలోపు నివేదిక సమరి్పంచకపోతే నేరుగా కమిషన్ చర్యలు తీసుకుంటుందని సంబంధిత అధికారులను హెచ్చరించింది. -
ఉప్పల్ అదిరేలా SRH, ముంబై ప్లేయర్ల ప్రాక్టీస్.. విజయం ఎవరిదో (ఫొటోలు)
-
మూత్రనాళం స్థానంలో అపెండిక్స్ అమరిక.. రోబోటిక్ శస్త్రచికిత్సతో అద్భుతం
హైదరాబాద్: ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) ఆస్పత్రి వైద్యులు అసాధారణ శస్త్రచికిత్స చేసి, పశ్చిమబెంగాల్కు చెందిన వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. అతడి సొంత మూత్రపిండాన్నే శరీరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు మార్చడంతోపాటు... పూర్తిగా పాడైపోయిన మూత్రనాళం స్థానంలో అపెండిక్స్ ఉపయోగించి అతడి కిడ్నీల పనితీరును సాధారణ స్థితికి తీసుకొచ్చారు.ఈ వృద్ధుడికి 2023లో వేరేచోట మూత్రపిండాల్లో రాళ్లు తీయడానికి మామూలు శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత అతడి మూత్రనాళాలు పూర్తిగా పూడుకుపోయాయి. దాంతో క్రియాటినైన్ ప్రమాదకరంగా పెరిగిపోయి, విపరీతమైన నొప్పి, తరచు జ్వరంతో ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది.కిడ్నీలు రెండూ పాడైపోవడంతో తాత్కాలికంగా అతడికి ట్యూబులు (నెఫ్రోస్టమీలు) అమర్చి బయటి నుంచి మూత్రం పంపేవారు. పలు రాష్ట్రాలు తిరిగినా ఏ ఆస్పత్రీ చేర్చుకోకపోవడంతో చివరకు హైదరాబాద్ వచ్చారు. సమగ్ర పరీక్షలు చేసిన తర్వాత.. అతడి మూత్రనాళాలు చాలావరకు పూడుకుపోయినట్లు గుర్తించారు. ఇది చాలా అరుదు, సమస్యాత్మకం కూడా.కుడివైపు కిడ్నీ కోసం వైద్యులు ముందుగా అతడి సొంత అపెండిక్స్ తీసుకుని, పూడుకుపోయిన మూత్రనాళానికి బదులు దాన్ని అమర్చారు. అపెండిక్స్ కూడా మూత్రనాళం పరిమాణంలోనే ఉంటుంది. రోబోటిక్ శస్త్రచికిత్సతో దీన్ని మార్చారు. ఇది చాలా అరుదుగా చేసే చికిత్స. దీన్ని అపెండిక్స్ ఇంటర్పొజిషన్ అంటారు.“మూత్రనాళం బాగా పూడిపోఉయినప్పుడు దాన్ని బాగుచేయడానికి ఇది అత్యంత సృజనాత్మకమైన, మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతి. సాధారణంగా ఇలా చేయరు. కానీ ఈ రోగి కేసులో ఇదే సరైన పరిష్కారం” అని ఏఐఎన్యూలోని సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ సర్జన్,యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ తెలిపారు. ఈ చికిత్స అనంతరం అతడి కుడి కిడ్నీ బాగుపడింది. దాంతో బయట అమర్చిన ట్యూబులను తీసేశారు.సొంత కిడ్నీ మార్పిడి ఇలా.. రెండు నెలల తర్వాత అతడి ఎడమవైపు కిడ్నీ ఇంకా అలాగే ఉంది. అపెండిక్స్ కుడివైపే ఉంటుంది కాబట్టి రెండోవైపు పేగులను తీసి అమర్చవచ్చు. కానీ, అందులో ఈ వృద్ధుడికి సమస్యలు ఉండడంతో అత్యంత అరుదైన పరిష్కారాన్ని వైద్యులు ఎంచుకున్నారు. అదే.. సొంత కిడ్నీనే మార్చడం. ఈ సంక్లిష్టమైన చికిత్సలో.. రోగి ఎడమ కిడ్నీని రక్తనాళాలతో కలిపి తీశారు. తర్వాత దాన్ని కొంత కిందభాగంలో అమర్చారు. తద్వారా పాడైన మూత్రనాళాన్ని బైపాస్ చేసి, బాగున్న భాగంలోంచి మూత్రం వెళ్లేలా చేశారు.“సొంత కిడ్నీ మార్పిడి అనేది చాలా పెద్ద ఆస్పత్రుల్లోనే చేస్తారు. ఇది చిట్టచివరి పరిష్కారం. చాలా కచ్చితత్వంతో చేయాల్సిన శస్త్రచికిత్స. అతడి శరీరంలోనే అతడి కిడ్నీకి వేరే ఇల్లు ఇచ్చాం” అని కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ విజయ్ మద్దూరి తెలిపారు. ఇప్పుడా బెంగాలీ వృద్ధుడు పూర్తి సాధారణ స్థితికి చేరుకున్నారు. కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి, క్రియాటినైన్ స్థాయి సాధారణంగా ఉంది. నొప్పి, ఇతర సమస్యలూ తగ్గిపోయాయి.“ఈ కేసు వైద్యపరంగా ఓ సరికొత్త విజయం. రెండు కిడ్నీలను కాపాడేందుకు రెండు విభిన్న రకాల, అత్యాధునిక శస్త్రచికిత్సలు చేశాం. ఒకదాంట్లో అపెండిక్స్ను ఉపయోగించగా, మరోదాంట్లో సొంత కిడ్నీనే మార్చారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఇలా చేసినవాటిలో విజయవంతం అయినవే చాలా తక్కువ” అని ఏఐఎన్యూ ఆస్పత్రి ఎండీ డాక్టర్ సి.మల్లికార్జున తెలిపారు. ఈ శస్త్రచికిత్సల్లో డాక్టర్ తైఫ్ బెండెగెరి కూడా పాల్గొన్నారు. రెసిడెంట్ వైద్యులు డాక్టర్ కార్తీక్, డాక్టర్ ఆసిత్ సాయపడ్డారు. -
‘భారత్ సమ్మిట్ చరిత్రలో నిలిచిపోతుంది’
హైదరాబాద్: త్వరలో హైదరాబాద్ వేదికగా నిర్వహించబోయే భారత్ సమ్మిట్ 2025 అనేది చరిత్రలో నిలిచిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భారత్ సమ్మిట్ కు సంబంధించి ‘సాక్షి’తో మాట్లాడిన ఆయన.. ‘జాతీయ , అంతర్జాతీయ రాజకీయ, సామాజిక ,ఆర్దిక సమస్యల పై సమ్మిట్ లో చర్చ జరుగుతుంది. వందకు పైగా దేశాల నుంచి 400మందికి పైగా రాజకీయ, ఆర్థిక ,సామాజిక స్థితిగతుల లో నిష్టాతులైన వారు సమ్మిట్ కు హాజరవుతారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ లను ఆహ్వానించాం. రోహిత్ వేముల చట్టం తీసుకువస్తాం. ఈ చట్టం కోసం బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఓత్తిడి పెరుగుతుంది. హైదరాబాద్ ఇమేజ్ పెరగనుంది. ఖర్గే, సోనియా, రాహుల్ ,ప్రియాంక గాంధీ లతో పాటు కార్పోరేట్ పెద్దలకు ఆహ్వానం. భారత్ సమ్మిట్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. సమ్మిట్ నిర్ణయాలను తెలంగాణలో అమలు చేస్తాం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ ప్రతినిధులకు పరిచయం చేస్తాం’ అని భట్టి విక్రమార్క తెలిపారు.భారత్ ఫౌండేషన్ సహకారంలో ఈ నెల 25, 26వ తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ ఐసీసీ)లో భారత్ సమ్మిట్ 2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. -
శానిటరీ ప్యాడ్ల ఫ్యాక్టరీపై బీఐఎస్ దాడులు
హైదరాబాద్: ఐఎస్ఐ మార్కు లేని శానిటరీ ప్యాడ్లు సరఫరా చేస్తున్న ఓ కేంద్రంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం, కుషాయిగూడలోని ఓ కేంద్రంలో జరిగిన సోదాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న 30 వేల ప్యాడ్లు, 7వేలకు పైగా లేబుల్ కవర్లకు ఐఎస్ఐ మార్కు లేనట్లు గుర్తించిన అధికారులు వాటన్నింటినీ జప్తు చేశారు.మహిళల ఆరోగ్య రక్షణ కోసం ఐఎస్ 5405:2019 ప్రమాణాలున్న శానిటరీ ప్యాడ్లను భారత ప్రభుత్వం క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ గెజిట్ ద్వారా బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. బీఐఎస్ ధ్రువీకరణ పొందకుండా అమ్మినా, తయారు చేసినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించింది. అయితే, ఈ కేంద్రంలో ఎలాంటి ధ్రువీకరణ లేకుండా పెద్ద ఎత్తున శానిటరీ న్యాప్కిన్లు నిల్వ ఉంచినట్లు సమాచారం అందడంతో అందడంతో సోదాలు నిర్వహించినట్లు బీఐఎస్ హైదరాబాద్ శాఖ అధిపతి, సంచాలకులు పీవీ శ్రీకాంత్ తెలిపారు. జాయింట్ డైరెక్టర్లు సవిత, రాకేశ్ తన్నీరు ఆధ్వర్యంలో బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి.బీఐఎస్ చట్టం 2016లోని పలు సెక్షన్ 17 ప్రకారం భారత ప్రభుత్వం బీఐఎస్ ధ్రువీకరణ తప్పనిసరి చేసిన ఉత్పత్తులేవీ ఐఎస్ఐ మార్కు, ఎలక్ట్రానిక్ వస్తువులకు రిజిస్ట్రేషన్ మార్కు లేకుండా, బీఐఎస్ అనుమతి పొందకుండా తయారు చేసినా, విక్రయించినా, నిల్వ చేసినా రెండేళ్ల జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా మొదటిసారి, ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5లక్షల వరకూ జరిమానా రెండోసారి, తదుపరి దీనికి పదిరెట్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటివరకు భారత ప్రభుత్వం 679 ఉత్పత్తులను తప్పనిసరి చేస్తూ పలు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు విడుదల చేసింది. వీటిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ వెల్లడించారు. భారతీయ ప్రమాణాలపై ప్రతీ ఒక్క వినియోగదారుడూ అవగాహన కలిగి ఉండాలని, బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వస్తువుల నాణ్యతా ప్రమాణాలను గుర్తించాలని, ఉల్లంఘనలను గుర్తిస్తే అదే యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. -
హైదరాబాద్లో దారుణం.. భార్య, అత్తపై అల్లుడు దాడి
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో భార్యతో పాటు అత్తపై అల్లుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ నగర్లో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం.. క్యాబ్ డ్రైవర్ మహేష్.. శ్రీదేవి అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో శ్రీదేవి తల్లి మంగ తన కూతురును చూసేందుకు ఇంటికి రాగా, అయితే మహేష్, శ్రీదేవిల మధ్య మరోసారి గొడవ జరిగింది. వారిని గొడవ పడొద్దని మంగ వారించింది. దీంతో కోపోద్రిక్తుడైన మహేష్ తన భార్య శ్రీదేవి, అత్త మంగపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీదేవి స్వల్పంగా గాయపడగా.. ఆమె తల్లి మంగ తీవ్రంగా గాయపడింది. ఆమెను మియాపూర్లోని శ్రీకర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. -
ఫేస్‘బుక్కై’పోయాడు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో సుదీర్ఘ కాలం తర్వాత మరో కస్టమ్స్ ఫ్రాడ్ కేసు నమోదైంది. నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన నేరగాడు కస్టమ్స్ అధికారుల పేరు చెప్పి రూ.1.55 లక్షలు కాజేశాడు. దీనిపై బాధితుడి ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి దాదాపు రెండు నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అమెరికాలో ఉంటున్న సర్జన్ హెన్రీ రాబర్ట్ అంటూ ప్రొఫైల్ ఉండటంతో నగరవాసి యాక్సప్ట్ చేశాడు. ఆపై వాట్సాప్ కాల్స్ చేసిన రాబర్ట్ నగరవాసితో పరిచయం పెంచుకుని స్నేహం చేశాడు. తాను త్వరలోనే భారత్కు వస్తున్నానని, హైదరాబాద్ వచ్చి కలుస్తానని చెప్పాడు. పూర్తిగా నమ్మించేందుకు డమ్మీ ఫ్లైట్ టిక్కెట్స్ ఫొటోలను పంపాడు. కొన్ని రోజులకు బాధితుడికి కాల్ చేసిన రాబర్ట్ తాను ముంబై విమానాశ్రయంలో దిగానని, తన వద్ద లెక్కలు చెప్పని 1.2 లక్షల డాలర్లు ఉన్నాయని నమ్మించాడు. దీంతో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారన్న రాబర్ట్ పన్ను చెల్లించకపోతే నగదుతో పాటు తన లగేజీ సైతం జప్తు చేస్తారని చెప్పాడు. ఆపై ముంబై ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారిగా మాట్లాడిన మరో వ్యక్తి రాబర్ట్ రూ.1.55 లక్షలు పన్ను చెల్లించాలని చెప్పాడు. తాను బయటకు వచ్చాక ఆ మొత్తం ఇచ్చేస్తాంటూ రాబర్ట్ చెప్పంతో నమ్మిన నగర వాసి ఆ మొత్తం వాళ్లు చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేశాడు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో నిందితుడి అరెస్టు... నగరానికి చెందిన బాధితుడి (68) నుంచి ఏళ్ల బాధితుడి నుంచి ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.52,29,500 కాజేసిన కేసులో ఓ నిందితుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్మీడియా ద్వారా బాధితుడికి ఎర వేసిన సైబర్ నేరగాళ్లు 5పైసా క్యాపిటల్ లిమిటెడ్, బార్క్లేస్, షాండా క్యాపిటల్ గ్రూప్ లిమిటెడ్ల్లో పెట్టుబడుల పేరు చెప్పారు. ఓ టెలిగ్రాం గ్రూపులో సభ్యుడిగా చేర్చి ప్రియా అగర్వాల్, గౌరవ్ ముంజాల్ పేర్లతో ఇరువురు సలహాలు సూచనలు ఇచ్చారు. తాము చెప్పినట్లు పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ నిండా ముంచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఘజియాబాద్కు చెందిన ప్రతీఖ్ శుక్లాను అరెస్టు చేశారు. అతడిపై దేశ వ్యాప్తంగా తొమ్మిది కేసులు ఉన్నట్లు గుర్తించారు. -
Hyderabad: పారిశ్రామికవేత్త ఇంట్లో భారీ చోరీ
కాచిగూడ(హైదరాబాద్): వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచి్చంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో పారిశ్రామికవేత్త హేమ్రాజ్ (62), అతడి భార్య మీనా దుగ్గర్ (59) నివాసముంటున్నారు. కొద్ది రోజుల క్రితం వారు నేపాల్కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమ్రాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించారు. ప్రతి రోజూ వాకింగ్కు వెళ్లే హేమరాజ్ సోమవారం వాకింగ్కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచి్చంది. దీంతో అతను స్నేహితుడి ఇంటికి వచ్చి తలుపు కొట్టడంతో మత్తులో ఉన్న హేమ్రాజ్ డోర్ తీశాడు. భార్య మీనా పూర్తిగా మత్తులోకి జారుకుంది. దీనిని గుర్తించిన అతను వారిని హైదర్గూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చించాడు. ప్రస్తుతం హేమ్రాజ్ స్పృహలో ఉన్నాడని, అతని భార్య ఇంకా స్పృహలోకి రాలేదని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఈస్ట్జోన్ డీసీపీ, అడిషనల్ డీపీసీ, కాచిగూడ డిఐ, ఎస్ఐ పరిశీలించారు. క్లూస్టీంను రప్పించి ఆధారాలను సేకరించారు. నాలుగు టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్లో చిన్న ఆయుధాల తయారీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఐకామ్ టెలీ తాజాగా హైదరాబాద్లో ప్రపంచ స్థాయి చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందుకోసం యూఏఈకి చెందిన చిన్న ఆయుధాల తయారీ సంస్థ, ఎడ్జ్ గ్రూప్లో భాగమైన క్యారకల్తో జట్టు కట్టింది. రెండు సంస్థల మధ్య కుదిరిన లైసెన్సింగ్ ఒప్పందం కింద క్యారకల్ సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ నినాదం కింద ఈ ప్లాంటులో సీఏఆర్ 816 క్లోజ్–క్వార్టర్స్ అసాల్ట్ బ్యాటిల్ రైఫిల్, సీఏఆర్ 817 అసాల్ట్ రైఫిల్ మొదలైనవి ఉత్పత్తి చేస్తారు. వీటిని భారత సాయుధ బలగాలు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లు, రాష్ట్రాల పోలీస్ ఫోర్స్లు, ఎస్పీజీ మొదలైన రక్షణ రంగ విభాగాలకు సరఫరా చేయడంతో పాటు వివిధ దేశాలకు ఎగుమతి కూడా చేస్తారు. రక్షణ బలగాల పట్ల తమ నిబద్ధతకు, ఆత్మ నిర్భర్ భారత్ విజన్పై నమ్మకానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని ఐకామ్ ఎండీ సుమంత్ పాతూరు తెలిపారు. ఇరు దేశాల మధ్య రక్షణ రంగ సహకారానికి సంబంధించి సాంకేతిక బదిలీ ఒప్పందం కీలక మైలురాయిలాంటిదని క్యారకల్ సీఈవో హమద్ అల్అమెరి పేర్కొన్నారు. -
హైదరాబాద్లో జపాన్ కంపెనీ తయారీ కేంద్రం
జపాన్కు చెందిన డైఫుకు కో., లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Daifuku Intralogistics India) తెలంగాణలోని హైదరాబాద్లో అత్యాధునిక తయారీ, ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇంట్రాలాజిస్టిక్స్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఆటోమేషన్లో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ సుమారు రూ.227 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.ఈ-కామర్స్, రిటైల్, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, ఎఫ్ఎంసీజీ వంటి వివిధ రంగాలలో ఆటోమేషన్కు పెరుగుతున్న డిమాండ్ను తీర్చేలా హైదరాబాద్లోని ఈ ఇన్నోవేషన్ కేంద్రాన్ని కంపెనీ రూపొందించింది. అధునాతన ఆటోమేషన్ టెక్నాలజీలు, డిజిటల్ టూల్స్, సస్టైనబుల్ పద్ధతులను ఈ కేంద్రం సమగ్రపరుస్తుంది. ఇది 2030 నాటికి భారతదేశ లాజిస్టిక్స్ అండ్ వేర్హౌసింగ్ మార్కెట్ 650 బిలియన్ డాలర్లను దాటే అంచనాకు అనుగుణంగా ఉంటుంది.ఈ గుర్తించదగిన పెట్టుబడి భారతదేశ "మేక్ ఇన్ ఇండియా" దృష్టిని బలోపేతం చేస్తుంది. భారత-జపాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలపరుస్తుంది. అలాగే భారత్ను అత్యాధునిక ఇంట్రాలాజిస్టిక్స్ సొల్యూషన్స్కు కేంద్రంగా నిలుపుతుంది. భారత్ తమకు అత్యంత వ్యూహాత్మక గ్లోబల్ మార్కెట్లలో ఒకటిగా నిలుస్తుందని డైఫుకు కో., లిమిటెడ్ సీఈవో హిరోషి గెషిరో విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కేంద్రం భారత్, జపాన్ మధ్య గల బలమైన భాగస్వామ్యాన్ని సూచిస్తుందని డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా చైర్మన్ శ్రీనివాస్ గరిమెళ్ల అన్నారు. డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా సీఈవో అసిమ్ బెహెరా మాట్లాడుతూ ఈ అసాధారణ ఇన్నోవేషన్ పెట్టుబడి భారతదేశ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన సొల్యూషన్స్ను అందించే తమ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు. ఈ కేంద్రం ద్వారా ఇంజినీరింగ్, ఆటోమేషన్, ప్రొడక్షన్ రంగాల్లో 100 మందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. -
ఏపీ సిట్ అధికారుల అదుపులో రాజ్ కేసిరెడ్డి
హైదరాబాద్,సాక్షి: శంషాబాద్ ఎయిర్పోర్టులో రాజ్ కేసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సిట్ విచారణకు హాజరయ్యేందుకు దుబాయ్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో రాజ్ కేసిరెడ్డిని ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, విజయవాడకు తరలిస్తున్నారు. అంతకుముందు రాజ్ కేసిరెడ్డి ఆడియో విడుదలమంగళవారం సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో రాజ్ కేసిరెడ్డి ఓ ఆడియోని విడుదల చేశారు. అందులో ‘నేను రేపు(మంగళవారం) సిట్ విచారణకు హాజరవుతున్నాను. రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు సిట్ ఆఫీసుకు వస్తానని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చాను. నా ముందస్తు బెయిల్ అంశానికి సంబంధించి హైకోర్టులో వాదనలకు సమయం పట్టేలా ఉంది. కాబట్టి సిట్ విచారణకు హజరవుతున్నాను’ అని పేర్కొన్నారు.రెండురోజుల క్రితం విజయసాయి రెడ్డిపై రెండురోజుల క్రితం విజయసాయి రెడ్డిపై రాజ్ కేసిరెడ్డి ధ్వజమెత్తారు. విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్ కేసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.‘‘సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా’ అని గత ఆడియోలో పేర్కొన్నారు రాజ్ కేసిరెడ్డి. -
తెలంగాణ సెక్రటరియేట్లో నకిలీ ఉద్యోగుల కలకలం.. రేవంత్ సర్కార్ సీరియస్
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ సెక్రటరియేట్లో నకిలీ ఉద్యోగుల కలకలంపై సీఎం రేవంత్ సర్కార్ సీరియస్ అయ్యింది. సెక్రటేరియట్ భద్రత ఏర్పాట్లు, సీఎం ఎంట్రీ, ఎగ్జిట్ సీసీ కెమెరాల నిఘాపై జీఏడీ ఆరాతీ తీసింది. అయితే సీఎం రేవంత్రెడ్డి ఎంట్రీ ,ఎగ్జిట్ మార్గాల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎస్పీఎఫ్పై జీఏడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే సెక్రటరియేట్ మొత్తం 246 సీసీ కెమెరాలు మరో 30 కెమెరాలు పెట్టే యోచనలో ఉన్నట్లు నిఘూ వర్గాలు తెలిపాయి. సీఎం ఎంట్రీ ఎగ్జిట్ మార్గాలతో పాటు కీలకమైన 6వ అంతస్తులో భద్రత పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. సాధారణ ప్రజలు ఎంట్రీ అయ్యే సౌత్ ఈస్ట్ గేటుతో పాటు ఇన్సైడ్ ఎంట్రీ వద్ద మరోసారి చెకింగ్ చేయనుంది.సెక్రటరియేట్లో రెండంచెల భద్రత వలయాన్ని ఎస్పీఎఫ్ మోహరించింది. -
అబిడ్స్ చౌరస్తాకు వస్తావా కేటీఆర్..? : ఈటల సవాల్
హైదరాబాద్: గత పదేళ్లలో తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది.. అదే తెలంగాణకు కేంద్రం చేసింది అనే దానిపై చర్చకు వస్తావా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. అబిడ్స్ చౌరస్తాలో చర్చ పెట్టుకుందామా కేటీఆర్? అని ఈటల ప్రశ్నించారు.‘కాంగ్రెస్ నైజం దేశ వ్యాప్తంగా బట్టబయలైంది. మరొకవైపు కార్పోరేట్లరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయొద్దని బీఆర్ఎస్ అప్రజాస్వామిక పిలుపునిచ్చింది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలి. కేంద్ర నిధులతోనే హైదరాబాద్ అభివృద్ధి. మజ్లీస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కుటుంబ పార్టీలు.ముఖ్యమంత్రి గత విదేశీ పర్యటనలోనే లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ కనపడటలేవు. ఉన్న ఉద్యోగాలు ఇక్కడ ఉడిపోతున్నాయి. కేసీఆర్ హయంలోనే మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతకుముందు ఒక ఎమ్మెల్యే ఇంటికి ఇంకో ఎమ్మెల్యే వెళ్ళేవారు. ఇప్పుడు అది లేదు’ అని ఈటల విమర్శించారు.. -
మందు బాబులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మందు బాబులకు అలర్ట్. హైదరాబాద్లో మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈరోజు సాయంత్రం నుండి బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు మందు షాపులు మూసి వేయనున్నారు.ఈనెల 23వ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, క్లబ్లలో మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఈనెల 25వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజు కూడా వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. -
Pet lovers ఆహారం పెట్టేముందు ఆలోచించండి?! ఈ చట్టం తెలుసా?
హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఆవులు, కుక్కలు, పిల్లులతో పాటు విభిన్న రకాల పక్షులు వంటి మూగ జీవాలకు కొదవలేదు. అయితే వాటి సహజ జీవనాన్ని కొనసాగించడానికి అనువైన, అవసరమైన పర్యావరణ వ్యవస్థ లేదనేది వాస్తవ సత్యం. ఈ నేపథ్యంలో ఇలాంటి మూగజీవాలకు నగరవాసులు ఆహారం పెట్టడం అనేది సాధారణ అంశంగా మారింది. దయతో నగర పౌరులు వీధి కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి జీవులకు ఆహారం పెడుతున్నారు. ఇది మానవీయతకు నిదర్శనం అయినప్పటికీ చట్ట పరంగా, పర్యావరణ పరంగా కొన్ని పరిమితులు, నిబంధనలూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ అంశానికి సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ అంశాలపైన నగరవాసులు దృష్టి కేంద్రీకరించారు. – సాక్షి, సిటీబ్యూరో మూగ జీవాల పట్ల కనికరంగా ఉండడం అనేది సాటి ప్రాణిగా, మనుషులుగా మన బాధ్యత. ఇందులో భాగంగా వీధిలో నివసించే జంతువులు.. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు వంటి జీవులు నిరాశ్రయంగా, ఆకలితో అలమటిస్తుంటాయి. నగరంలోని ఇలాంటి ప్రాణులకు నగరవాసులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు ఆహారం అందించడం అతి సహజంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఐతే కుక్కలకు అన్నం పెట్టడం, పక్షులకు గింజలు, నీళ్లు పెట్టడం కూడా తరచూ కనిపించే దృశ్యం. అయితే నగరం, శివారు ప్రాంతాలు అటవీ ప్రాంతాలతో కలసిపోయి ఉంటుంది. ఈ నేపథ్యంలో నగరంలో సాధారణ సాధు జంతువులతో పాటు పలు సందర్భాల్లో వన్యప్రాణులు కనిపిస్తుంటాయి. ఇలా అన్ని జంతువులకూ ఆహారం అందించడంలో చట్టపరంగా కొన్ని నిబంధనలు, పరిమితులు ఉన్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.చట్టం ఏం చెబుతోంది.. మూగ జీవాలను కాపాడేందుకు భారతదేశంలో ప్రివెన్షన్ ఆఫ్ క్రూరిటీ టు యానిమల్ (పీసీఏ) యాక్ట్ – 1960 అమలులో ఉంది. ఈ యాక్ట్ ప్రకారం జీవాలకు ఉద్దేశపూర్వకంగా హాని చేయడం నేరం. కానీ జీవాలకు ఆహారం పెట్టే విషయంలో ప్రత్యేకంగా నిషేధం లేదు. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే, స్థానిక మున్సిపల్ చట్టాలు, గృహ సంఘాలు నిబంధనలు విధించవచ్చు. ఏ జీవాలకు ఆహారం వేయవచ్చు? సాధారణంగా మనుషులతో మమేకమై జీవనం కొనసాగిస్తున్న వీధి కుక్కలు, పిల్లులు వంటి జీవాలకు ప్రజలు ఆహారం అందించవచ్చు. అయితే అది బహిరంగ ప్రదేశాల్లో కాకుండా, నివాస ప్రాంగణాల్లో ఇవ్వడం మంచిది. అనవసరంగా రోడ్లపై జంతువులు గుమిగూడడం వల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నగరంలో అధికంగా ఉండే ట్రాఫిక్కు ఇది అంతరాయంగా మారుతుంది. నగరంలో ఎక్కువ సంఖ్యలో ఉండే పక్షులకు నీళ్లు, గింజలు వంటివి పెట్టవచ్చు. కాని అది ఎలక్ట్రిక్ వైర్ల దగ్గర, అపరిశుభ్ర ప్రాంతాల్లో ఉండకూడదు. ఆవులు, ఇతర జంతువుకు ఆహారం పెట్టే వారు రోడ్ల పైన కాకుండా సురక్షిత ప్రాతాల్లో పెట్టడం మంచిదని, అంతేకాకుండా ఆ జీవులు తినే ఆహారాన్ని మాత్రమే అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.వన్యప్రాణుల పట్ల జాగ్రత్త.. నగరంలో అరుదుగా కనిపించినా, అటవీ ప్రాంతానికి శివార్లలో నివసించేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జింకలు, పులులు, ఎలుగుబంట్లు వంటి అటవీ జంతువులకు ఆహారం ఇవ్వడం అటవీ చట్టం ప్రకారం నేరం. అడవి జంతువులకు ఆహారం అందించడం, వాటిని ఆకర్షించేలా చేయడం, వాటి సహజ జీవన విధానాన్ని భంగపెట్టేలా చేయడం చట్టవిరుద్ధం. వీటిని ఉపేక్షిస్తే చట్టరిత్యా కఠిన చర్యలకు, శిక్షలకు గురికాక తప్పదు. అధిక సంఖ్యలో తారసపడే కోతుల వంటి వన్య ప్రాణులకు ఆహారం అందించకూడదు. దీని వల్ల అవి సహాజంగా ఆహారాన్ని సేకరించడం క్రమంగా కోల్పోవడమే కాకుండా సులభంగా లభించే ఆహారం కోసం జనావాసాల్లోకి వలసపడతాయి. ప్రమాదకరమైన విషసర్పాల వంటి ఇతర ప్రాణులకు ఆహారం ఇవ్వకూడదు. ముఖ్యంగా ప్రమాదకర వన్యప్రాణులను ఏ విధంగా ఆకర్షించినా వాటికి, మనుషులకు శ్రేయస్కరం కాదు. భద్రతకు భంగం కలగకుండా.. మూగజీవాల పట్ల మానవీయతతో ఉండటం, వాటి సంరక్షణకు మన వంతు బాధ్యతను అందించడం మంచి విషయమే.. కానీ మానవీయత పేరుతో మనం జంతువులకు ఆహారం పెడితే, అది ఇతరుల హక్కులను, భద్రతను హరించేలా ఉండకూడదు. చట్టాన్నీ, సమాజాన్నీ గౌరవిస్తూ, జంతు సంక్షేమం పట్ల మన బాధ్యతను సమతుల్యంగా నిర్వహించాలని నిబంధలను సూచిస్తున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు, గృహ సంఘాల నిబంధనలు పాటిస్తూ.. మనుషుల ప్రేమను, కనికరాన్ని సమర్థవంతంగా చాటుకోవాలని జంతు ప్రేమికులు నినదిస్తున్నారు. -
Hyderabad: మధ్యాహ్నం ఎండలు.. సాయంత్రం ఈదురు గాలులు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో గత మూడు రోజులుగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు మండుతున్న ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. ఆ తర్వాత వాతావరణంలో మార్పులతో పూర్తిగా చల్లబడుతోంది. ఇక వర్షం ప్రారంభమైతే అతలాకుతలం చేస్తోంది. భారీ ఈదురుగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చెట్లు విరిగిపడుతున్నాయి. వాహనాలు ధ్వంసమవుతున్నాయి. విద్యుత్ వైర్ల తెగిపడుతున్నాయి. రోజువారీగా సగటున గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 36 నుంచి 39 డిగ్రీల వరకు, కనిష్టంగా 26.5 నుంచి 20.8 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ మేర వీస్తున్నాయి. అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. నగరంలో ఉదయం 7 గంటల నుంచే ఎండ పెరుగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టలేని పరిస్థితి. మరో వారం రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ఆదివారం ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుండటంతో వరుసగా మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
కూల్డ్రింక్లో విషం కలిపి.. కన్నతల్లే..
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్లో దారుణం జరిగింది. కన్నతల్లే నాలుగేళ్ల కూతురికి కూల్ డ్రింక్లో ఎలుకల మందు కలిపి ఇచ్చి చంపేసింది. అనంతరం తల్లి కృష్ణ పావని సైతం విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రగతినగర్ ఆదిత్య గార్డెన్లో ఓ అపార్ట్మెంట్లో సాంబశివరావు, తన భార్య నంబూరి కృష్ణ పావని, కూతురు జశ్వికలతో కలిసి నివాసం ఉంటున్నారు 18వ తేదీ (శుక్రవారం) సాయంత్రం ఇంట్లో భర్త లేని సమయంలో కృష్ణ పావని.. తమ కూతురు జశ్వికకు కూల్డ్రింక్లో ఎలుకల మందు తాగించి.. ఆ తర్వాత తాను తాగింది. 19వ తేదీ తెల్లవారుజామున విషం తాగినట్లు గుర్తించిన భర్త.. భార్య, కూతురిని ఆసుపత్రికి తరలించారు.ఇవాళ తెల్లవారుజామున చికిత్స పొందుతూ చిన్నారి జశ్విక మృతి చెందింది. తల్లి కృష్ణ పావని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కృష్ణ పావనికి ఆరోగ్య సమస్యల కారణంగానే దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం కృష్ణ పావని పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలోని ఐసీయులో చికిత్స అందిస్తున్నారు. -
‘ఇంటెలెక్చువల్స్ కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోంది’
హైదరాబాద్: కంపెనీల సెక్రటరీలు దేశ కార్పోరేట్ రంగానికి రూపు రేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. దేశ విదేశీ పెట్టుబడిదారులు మనదేశంలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, అందుకే మన దేశం గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా వడివడిగా ముందుకు సాగుతోందన్నారు. నగరంలో ఖైరతాబాద్ లోని ఆనంద్ నగర్ కాలనీలో ఐసీఎస్ఐ(ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా)హైదరాబాద్ చాప్టర్ నూతన భవానికి భూమి పూజ చేసిన కిషన్రెడ్డి అనంతరం మాట్లాడారు.‘ICSI హైదరాబాద్ చాప్టర్ నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. కంపెనీ సెక్రటరీలు దేశ కార్పొరేట్ రంగానికి రూపురేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. దేశ విదేశీ పెట్టుబడిదారులు మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. అందుకే మన దేశం గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా వడివడిగా ముందుకు సాగుతోంది.సత్యం వద(సత్యం పలుకు), ధర్మం చర(ధర్మం ఆచరించు) సూత్రం ఆధారంగా ICSI పనిచేస్తోంది.ప్రతి కంపెనీ సెక్రటరీ ప్రతిరోజు ఈ సూత్రాన్ని ఆధారంగా పని చేస్తే దేశ వ్యాపార రంగం నిజాయితీ పారదర్శకతతో ముందుకు సాగుతుంది.ఇప్పటికే భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మరో రెండేళ్లలోనే 5 బిలియన్ మార్క్ దాటనుంది. ఈ విజయం మీలాంటి ప్రొఫెషనల్స్ హార్డ్ వర్క్, అంకితభావం, విలువలతో కూడిన వ్యాపారం వల్లే సాధ్యమైంది. ఇప్పటికే జర్మనీ, జపాన్ లాంటి దేశాలు మన టాలెంట్ ని గుర్తించి, కంపెనీ సెక్రటరీలు, లాయర్లు, అకౌంటెంట్లను వారి దేశాల్లో పనిచేసేందుకు నియమించుకుంటున్నాయి. ఇంటెలెక్చువల్స్ కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోంది.ఇంటలెక్చువల్, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచుకోవడం అంటే కేవలం వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాదు. సమాజంతోపాటు ప్రపంచ అభివృద్ధికి దోహదపడుతుందని విషయం గుర్తుంచుకోవాలి.భారత్ ఆత్మ నిర్భరత సాధించే దిశగా కంపెనీ ICSI లాంటి సంస్థలు కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నాను’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. -
హైదరాబాద్ : గచ్చిబౌలిలో తారల సందడి (ఫొటోలు)
-
విశాలమైన ఆఫీస్.. ఫుల్ డిమాండ్
స్థిరాస్తి రంగాన్ని కరోనా ముందు, తర్వాత అని విభజించక తప్పదేమో.. మహమ్మారి కాలంలో ఇంటిలో ప్రత్యేక గది, ఇంటి అవసరం ఎలాగైతే తెలిసొచ్చిందో.. ఆఫీసు విభాగంలోనూ సేమ్ ఇదే పరిస్థితి. కోవిడ్ అనంతరం ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాలంటే ఆఫీసు స్థలం విశాలంగా ఉండక తప్పని పరిస్థితి. దీంతో విస్తీర్ణమైన కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరిగింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లో ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 25 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఇందులో 80 శాతం స్థలం పెద్ద, మధ్య స్థాయి కార్యాలయాల వాటానే ఉన్నాయి. ఈ విభాగంలో 20 లక్షల చ.అ. స్పేస్ లీజుకు పోయింది. అత్యధికంగా 35 శాతం ఐటీ సంస్థలు, 17 శాతం ఫార్మా అండ్ హెల్త్ కేర్ సంస్థలు లీజుకు తీసుకున్నాయని గ్లోబల్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ సావిల్స్ ఇండియా నివేదిక వెల్లడించింది.ఈ ఏడాది తొలి మూడు నెలల్లో దేశంలో కార్యాలయ స్థల లావాదేవీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. ఆరు ప్రధాన నగరాలలో క్యూ1లో 1.89 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ లీజుకు పోయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. 2020 తర్వాత ఈ స్థాయిలో ఆఫీసు స్పేస్ లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ముగింపు నాటికి ఆఫీసు స్పేస్ లావాదేవీలు 7.10 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా.సరఫరాలో 28 శాతం వృద్ధి.. 2025 క్యూ1లో ఆరు మెట్రో నగరాల్లో కొత్తగా మార్కెట్లోకి 86 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ సరఫరా అయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 28 శాతం అధికం. ఈ ఏడాది ముగింపు నాటికి కొత్తగా 8.15 కోట్ల చ.అ. స్థలం అందుబాటులోకి వస్తుందని అంచనా. లీజులలో వృద్ధి, సరఫరా కారణంగా ఈ త్రైమాసికం ముగింపు నాటికి ఆఫీసు స్పేస్ వేకన్సీ రేటు 15 శాతంగా ఉంది.జీసీసీల జోరు.. ఇప్పటి వరకు దేశంలోని ఆరు మెట్రోలలో 80.62 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది ముగింపు నాటికి 87.91 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా. స్థూల ఆర్థికాభివృద్ధి, స్థిరమైన ధరలు, నైపుణ్య కార్మికుల అందుబాటు తదితర కారణాలతో ఐటీ, బ్యాంకింగ్, తయారీ రంగాలలో ఫ్లెక్సీబుల్ ఆఫీసు స్పేస్ లావాదేవీలు పెరగడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థల గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుతో ఆఫీసు స్పేస్ విభాగం మరింత వృద్ధి సాధిస్తుంది. -
యూత్లోనయా ట్రెండ్, F3 : ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్
జనరేషన్ మారింది.. యూత్ లైఫ్స్టైల్ మారింది.. ఆలోచనాతీరు మారింది.. ఆధునికత రూపంలో పాశ్చాత్య సంస్కృతి దూసుకొచ్చింది. ఇప్పుడు ఎఫ్ త్రీ కీలకంగా మారింది. ఒకప్పుడు ఖలీల్ వాలీ హవేలీలు, మొగలాయి వంటకాలు, చార్మినార్ బజార్లకు ప్రసిద్ధి అయిన నగరం ఇప్పుడు మోడరన్ కల్చర్కు కేంద్రంగా మారుతోంది. పార్టీ గేమ్స్ అనేవి మోడరన్ యూత్ ఫన్ థీమ్స్గా మారాయి. ముఖ్యంగా ‘స్నూకర్‘, ‘పూల్‘, ‘డార్ట్‘, ‘షాఫుల్ బోర్డు‘, ‘బోర్డ్ గేమ్స్‘ లాంటి గేమ్స్ పబ్స్, లాంజ్లలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ గేమ్స్ హైదరాబాద్లో హైటెక్ సిటీ, గచ్చిబౌలిప్రాంతాల్లో మొదలై జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి హై ఎండ్ జోన్లను దాటింది. – సాక్షి, సిటీ బ్యూరోపార్టీ గేమ్స్ మానసిక విశ్రాంతి, స్నేహితులతో కాలక్షేపానికి మాత్రమే కాకుండా సోషల్ కనెక్టివిటీకి వేదికగా మారాయి. వాటితోపాటు వచ్చిన ఫుడ్, మ్యూజిక్, డ్రింక్ కల్చర్ యువతను మరింత ఆకర్షిస్తోంది. ఇప్పటికీ ఇది ఫుడ్ + ఫన్ + ఫ్రెండ్స్ = ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అనే తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ గేమ్స్ ద్వారా యువత మానసికోల్లాసం పొందడం, కొత్త పరిచయాలు పెంచుకోవడం, వర్క్–లైఫ్ బ్యాలెన్స్ను కాపాడుకోవడం జరుగుతోంది. ఉద్యోగాల ఒత్తిడిని తగ్గించుకునే మార్గంగా ఇవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ‘నైట్ ఔట్‘ అంటే కేవలం ఫుడ్ కాకుండా, ఆటలతో కలిపిన ఎంటర్టైన్మెంట్ను సూచిస్తోంది. నగరంలో స్నూకర్, పూల్ లాంజ్లు జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, హిమాయత్ నగర్లలో అందుబాటులో ఉండగా డార్ట్, షాఫుల్ బోర్డు గేమ్స్ గండిపేట్, ఫైనాన్షియల్ డిస్ర్టిస్క్ట్, కొండాపూర్లో బోర్డ్ గేమ్స్, సాఫ్ట్ గేమింగ్ లాంజ్లు మాదాపూర్, మణికొండ, బంజారాహిల్స్లో యువతను ఆకర్షిస్తున్నాయి. బ్రిటన్ టు భారత్... పార్టీ గేమ్స్ కల్చర్ పాశ్చాత్య దేశాల నుంచి భారత్లోకి వచ్చింది. ముఖ్యంగా యూరప్లోని బ్రిటన్ దేశంలో స్నూకర్ పురుడు పోసుకుంది. అక్కడి పబ్ సంస్కృతిలో భాగంగా బిల్లియర్డ్స్, పూల్, డార్ట్ వంటి గేమ్స్ ప్రాచుర్యం పొందాయి. కాలక్రమేణా ఈ సంస్కృతి మల్టీనేషనల్ కంపెనీల ఉద్యోగుల ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. హైదరాబాద్ వంటి ఐటీ హబ్లలో ఇది వేగంగా వ్యాపించింది. ఉద్యోగులకు ఈ గేమ్స్ రిలాక్సేషన్తోపాటు టీమ్ బాండింగ్ సాధనంగా ఉపయోగపడుతున్నాయి. ఇదొక స్టేటస్ సింబల్... ఇప్పుడు పబ్కి వెళ్తే కేవలం మ్యూజిక్, డ్రింక్స్ కాదని, మినీ టోర్నమెంట్లు, ఫ్రెండ్స్ సర్కిల్ మధ్య స్నూకర్ మ్యాచ్లు సర్వసాధారణం అయ్యాయి. కొన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగుల కోసం ఈ గేమ్స్ను కార్పొరేట్ పార్టీలలో భాగంగా ఉపయోగిస్తున్నాయి. యువతలో ఇది ఒక స్టేటస్ సింబల్గా కూడా మారుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పబ్లిక్ స్పేస్లు గేమింగ్ కల్చర్తో ముడిపడి, సాంస్కృతిక మార్పునకు సూచికలుగా మారుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతితో సమన్వయం సాధిస్తూ, నగరం తనదైన శైలితో ముస్తాబవుతోంది.ఇదీ చదవండి: అప్పుడు రోజుకూలీ, ఇపుడు కోట్ల విలువ చేసే కంపెనీకి సీఈవోఫ్రీ లేదా ప్లే అండ్ పే... నగరంలోని ఐక్యూ లాంజ్, స్ట్రైకర్ క్లబ్, ది హోపరీ, హార్ట్ కప్ కాఫీ, గేమర్స్ డెన్, సోబో కేఫ్ వంటి వాటిలో ఇలాంటి పార్టీ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. కొందరు నిర్వాహకులు ఈ గేమ్స్ తమ కస్టమర్లకు ఉచితంగా ఆడుకోవడానికి ఏర్పాటు చేస్తే, మరికొందరు మాత్రం ప్లే అండ్ పే అంటూ చార్జ్ చేస్తున్నారు. మరికొందరైతే రీ చార్జ్ గేమింగ్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు.చదవండి: అయ్యో ఎంత విషాదం కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి -
మిల్లెట్స్తో ఆరోగ్యం మెరుగు: అమల
లెట్ సీ కమ్యూనిటీ ప్రారంభం మాదాపూర్: అందరూ ఆహారంలో మిల్లెట్స్ను భాగం చేసుకుంటే ఆరోగ్యం మెరుగవుతుందని సినీనటి, సామాజిక కార్యకర్త అమల అక్కినేని అన్నారు. మాదాపూర్లోని మినర్వా గ్రాండ్ హోటల్లో శనివారం లెట్ సీ (లివింగ్ త్రూ కమ్యూనిటీ)ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహారం, ఆధ్యాతి్మకత, ఆరోగ్యం, ఉద్యమోన్యుఖత అనే నాలుగు అంశాలు మన జీవితంలో ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మిల్లెట్లను వాడుతూ ఆరోగ్యంగా, ఆర్థికంగా, ఆనందంగా ఉండాలని కోరారు. లెట్సీ ద్వారా ఫిజికల్ మీటింగ్స్, ఆన్లైన్ సమావేశాలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మధ్యతరగతి యువతను మిల్లెట్ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని ప్రశంసించారు. లెట్ సీ చైర్మన్ ప్రసన్న శ్రీనివాస్ శరకడం మాట్లాడుతూ టిపిన్స్, భోజనాల పోడులు, నూడుల్స్, పాస్తా, స్నాక్స్, మిఠాయిలు తదితర ఉత్పత్తుల గురించి వివరించారు. 50 మంది డాక్టర్లతో ఏర్పాటు చేసిన హెచ్ఎన్ఏ కౌన్సిల్ తరపున డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ మండలాల వారీగా ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు డాక్టర్లు కృషి చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అడ్వకేట్ గోషిక, సీఎ ప్రవీణ్కుమార్, మిల్లెట్ రైతులు, వినియోగదారులు, లెట్సీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెట్ ఫెస్ట్.. స్టైలిష్ డాగ్స్విభిన్న జాతులు.. వివిధ రకాల పెంపుడు కుక్కలు సందడి చేశాయి. చూపరులను ఆకట్టుకున్నాయి. శనివారం బీ2ఎం వెట్కేర్ ఆసుపత్రిలో రెయిన్బో విస్టాస్ పెట్ లవర్స్ అసోసియేషన్ సహకారంతో పెట్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ మెగా పెట్ ఫెస్ట్లో 40కిపైగా విభిన్నమైన జాతుల స్టైలిష్ డాగ్లు కనువిందు చేశాయి. పెంపుడు జంతువులను ఆకర్షించడం, వాటితో స్నేహం చేయడం, అనుభవాలను పంచుకోవడానికి పెద్ద సంఖ్యలో పెట్ లవర్స్ తరలి రావడంపై గర్వంగా ఉందని బీ2ఎం వెట్కేర్ వ్యవస్థాపకుడు సంతోష్నాయక్ అన్నారు. పెంపుడు జంతువుల సంరక్షణ చర్యలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి పెట్ ఒక ప్రత్యేకమైనదన్నారు. -
ఆడియో టేపుల కలకలం.. తెలంగాణ బీజేపీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి హత్యకు కుట్ర
మహబూబ్నగర్,సాక్షి: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కొండా ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు నిందితులు రెక్కీ నిర్వహించారు. ఇందులో భాగంగా కోర్టు, రియల్ఎస్టేట్ కార్యాలయాల వద్ద కర్నూలు, కర్ణాటకకు చెందిన రౌడీషీటర్లు అనుమానాస్పదంగా కనిపించారు.ఓ హత్యకేసులో ప్రశాంత్రెడ్డి నిందితుడు కావడం, రూ.2.5 కోట్లకు సుఫారీ కుదుర్చుకున్నట్లు పలు ఆడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ప్రశాంత్రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెలుగులోకి వచ్చిన ఆడియోల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
హైదరాబాద్లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు
రాంగోపాల్పేట(హైదరాబాద్): వ్యభిచార ముఠా వ్యవహారాన్ని రాంగోపాల్పేట పోలీసులు రట్టు చేసి ఇద్దరు విటులను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న నిర్వాహకుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దింపి డబ్బులు సంపాధిస్తున్నట్లు గుర్తించారు. రాంగోపాల్పేట ఇన్స్పెక్టర్ నర్సింగరావు తెలిపిన వివరాల మేరకు.. రాంగోపాల్పేట పీజీరోడ్డు, బాపూబాగ్ కాలనీలోని ఓ భవనం రెండో అంతస్తులో సెక్స్ వర్కర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈనెల 18న పథకం ప్రకారం దాడి చేసి ఇద్దరు విటులతో పాటు ఇద్దరు యువతులను రెడ్ హ్యాండెండ్గా పట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఉద్యోగాన్వేషణ కోసం నగరానికి వచ్చినట్లు సదరు యువతులు తెలిపారు. ఉదోగ్య ప్రయత్నంలో ఉండగా స్వప్న అనే యువతి పరిచయం అయిందని, చేతన్ అనే వ్యక్తితో కలిసి ఈ భవనంలో ఉంటున్నామని వివరించారు. పట్టుబడిన విటులు నగరానికి చెందిన మహ్మయద్ అవియాజ్ (32), ఫహాద్ హుస్సేన్ (25)పై కేసులు నమోదు చేశారు. యువతులను షెల్టర్హోంకు తరలించారు. వ్యభిచార గృహ నిర్వాహకులు స్వప్న, చేతన్ కోసం గాలిస్తున్నామన్నారు. నిర్వాహకురాలు స్వప్న వాట్సాప్, ఫోన్ నంబర్ల ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచార గృహానికి రప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.