Hyderabad
-
‘మాటలతో ఆటలాడవద్దు.. మీ గేమ్స్ చెల్లవు’
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్నికూల్చేయబోతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాటలతో ఆటగాడవద్దు. మీ గేమ్స్ చెల్లవు’ అంటూ అని తీవ్రంగా స్పందించారు. ఈ అంశంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని, బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే వారే ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తారని మండిపడ్డారు. (ఇదీ చదవండి: ‘ఆ టెస్టులు మీరే చేయించుకుంటే మీ అసలు రంగు బయటకొస్తది’)ఇదిలా ఉంచితే,. ఈరోజు(మంగళవారం) హైదరాబాద్ నగరంలో నోవాటెల్ హెటల్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో సంక్షేమం ఒక ఎత్తు అయితే.. ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన పకడ్బందీగా పూర్తి చేశాం. ఈ రెండు అంశాలు గత కొన్ని దశాబ్దాలుగా గొప్ప గొప్ప నాయకులే చేయలేకపోయారు మన ప్రభుత్వం అందరికీ చెప్పి చేసింది. ఈ రెండు అంశాలు చేయాలని ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ మొదలవుతుంది. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు ఆమోదించాము. ఎస్సీ కుల వర్గీకరణ జరిగింది. దేశంలో కొద్దిమందికి ఇష్టం లేకపోయినా భూసంస్కరణలు వంటి గొప్ప నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ గతంలో చేపట్టింది. అందుకే ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ అధికారంలో కొనసాగింది. బీసీ కుల గణన, sc వర్గీకరణ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బి ఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీలను మూట కట్టి మూలన పడేసే విషయాలు.. ఇవి వారి అస్తిత్వానికే ప్రమాదం కాబట్టి బీఆర్ఎస్, బిజెపి చేతులు కలిపి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించి కంచ గచ్చిబౌలిలో ఏనుగులు, పులులు తిరుగుతున్నట్టు బిజెపి, బీఆర్ఎస్ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించి కుట్రలు చేస్తున్నాయి. బీసీ కుల సర్వే మీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఏకంకండి, మాతో కలిసి రండి అని చెప్పి బహుజన వర్గాలను చైతన్యం చేయాలి. కులగణన ద్వారా పొందాల్సిన ఫలితాలను అందుకున్నాము. సంక్షేమ పథకాలు, బీసీ కుల సర్వే, ఎస్సీ వర్గీకరణ నిశ్శబ్ద విప్లవాలు’ అంటూ ఆయన స్పష్టం చేశారు. -
హైదరాబాద్ కంపెనీతో చేతులు కలిపిన అమెరికన్ సంస్థ: వెయ్యికి పైగా జాబ్స్..
అమెరికాకు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం 'సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్', టెక్ సేవల సంస్థ కాగ్నిజెంట్తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని.. ఇండియాలో తన మొట్టమొదటి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ)ను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. దీనిద్వారా 1,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు.కాగ్నిజెంట్ కొత్త జీసీసీ సెంటర్.. ఎంటర్ప్రైజ్ టెక్ సామర్థ్యాలు, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్లు, డేటా అనలైజ్, ఉత్పత్తి ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. నిజానికి ఇదొక ఇన్నోవేషన్ హబ్ మాదిరిగా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది.హైదరాబాద్లో దాదాపు 57,000 మంది సిబ్బందిని కలిగి ఉన్న కాగ్నిజెంట్.. దాని AI-ఆధారిత ప్లాట్ఫామ్లైన న్యూరో, ఫ్లోసోర్స్లను ఉపయోగించి సిటిజన్స్ జీసీసీకి అదనపు శక్తిని ఇవ్వనుంది. అంతే కాకుండా క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ,ఇంటెలిజెంట్ ఆటోమేషన్లో భవిష్యత్తు అవసరానికి కావలసిన పరిష్కారాలను అందిస్తుంది.అమెరికా కంపెనీ.. కాగ్నిజెంట్తో కలిసిన సందర్భంగా ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సిటిజన్స్ బ్యాంక్, కాగ్నిజెంట్ చేతులు కలపడంతో, భారతదేశ జీడీపీకి 1 ట్రిలియన్ డాలర్లు అందించే మొదటి రాష్ట్రంగా అవతరించే లక్ష్యానికి తెలంగాణ దగ్గరగా ఉందని అన్నారు. ప్రస్తుతం బలమైన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. -
మంచు లక్ష్మీ ఫ్యాషన్ షో.. వజ్రంలా మెరిసిపోయిన అనసూయ (ఫొటోలు)
-
మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ సీజన్ 2 వచ్చేస్తోంది!
హైదరాబాద్ : హైదరాబాద్ వేదికగా ఇటీవలే నిర్వహించిన మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటీఫుల్ ఈవెంట్ విజయవంతం కావడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు. దీనిలో భాగంగా మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటీఫుల్ సీజన్ 2ను ప్రకటించారు. రెండో సీజన్ కు సంబంధించిన పోస్టర్ ను ఫౌండర్ కిరణ్మయి అలివేలు , సీజన్ 1 విజేతలతో కలిసి ఆవిష్కరించారు. ఔత్సాహిక యువతులకు ఇది మంచి వేదికని కిరణ్మయి చెప్పారు. నిత్య జీవితంలోని ఆలోచనలు, ఆశయాలకు పెళ్లి ముగింపు కాదనీ, మరో అద్భుత ఆరంభమన్నారు. మగువ సౌందర్యాన్ని మరింత గ్రాండ్ గా ప్రదర్శించడానికి ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో పలు ఫ్యాషన్ షోలు, బ్యూటీ కాంటెస్ట్స్ లో పాల్గొన్న అనుభవంతో, ఔత్సాహికులకు అవకాశాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఈ వేదికను ఏర్పాటు చేశామన్నారు. వయసుతో సంబంధం లేకుండా మహిళలను ఫ్యాషన్ వేదికపై ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. అలాగే క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించడంతో పాటు సామాజిక బాధ్యతతో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటీఫుల్ ఫౌండర్ కిరణ్మయి అలివేలు చెప్పారు.ఈ సందర్బంగా తమ విజయంలో భాగమైన కుటుంబాలు, స్పాన్సర్లు, పాల్గొనేవారు, నిర్వాహక బృందానికి, మీడియాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ లక్ష్యంలో కలిసి నడిచినందుకు ధన్యవాదాలన్నారు. సీజన్ 2 ప్రకటన సందర్భంగా మొదటి సీజన్ లో విజేతలుగా నిలిచిన వారంతా ర్యాంప్ వ్యాక్ తో అలరించారు. -
హైదరాబాద్లో కుమ్మేసిన వర్షం.. మరో మూడు రోజులు వానలే
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని గంటల పాటు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే నగరంలోని పలు చోట్ల వర్షం పడుతోంది. ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, ఖైరతాబాద్, లక్డీకపూల్, సోమాజిగూడ, ఎర్రమంజిల్, తార్నాక, నల్లకుంట, విద్యానగర్, ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది.ఒక్కసారిగా వాతావరణం మారి.. వర్షం కురుస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్ల మీదకు రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షం కురుస్తోన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాగం అప్రమత్తమైంది.తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య నుంచి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశాల మీదుగా దక్షిణ గ్యాంజెటెక్ పశ్చిమ బెంగాల్ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. సగటున సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. -
నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్కు తప్పిన ప్రమాదం
హైదరాబాద్: నోవాటెల్ హోటల్ లో సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్పడి కాస్త కిందకు కుంగిపోయింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించింది. లిఫ్ట్ మొరాయించడమే కాకుండా ఓవర్ వెయిట్ కారణంగా ఉండాల్సిన ఎత్తు కంటే కొంత లోపలికి దిగిపోయింది. దీంతో సీఎం రేవంత్ సహా అధికారులు, సిబ్బంది ఆందోళన చెందారు. కాసేపు అంతా అయోమయానికి గురయ్యారు.ఈ క్రమంలోనే హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ లిఫ్ట్ ను ఓపెన్ చేసి వేరే లిఫ్ట్ లో సీఎం రేవంత్ ను పంపారు. ఈరోజు(మంగళవారం) నోవాటెల్ హోటల్ లో జరిగిన సీఎల్పీ సమావేశంలో భాగంగా రేవంత్ అక్కడకు హాజరైన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్టీలోని నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్.. పార్టీలో నిరసన గళం వినిపిస్తున్న నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక్కడ ఎవరూ పేర్లు ప్రస్తావించకుండా రేవంత్ ఆయా నేతలను ఉద్దేశించి మాట్లాడారు. పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది. మంత్రి పదవి కోరే వాళ్లు మాట్లాడితే వారికే నష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు’’ అంటూ రేవంత్ తేల్చి చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై అధిస్థానం నిర్ణయమే ఫైనల్. మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు.గతద్ది రోజులుగా పార్టీలో పదవులు తమకు కావాలంటే తమకు కావాలనే వార్ నడుస్తోంది. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులు పార్టీ పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే తమకు పదవులు రావేమోననే భయం కూడా వారిలో ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా అధిష్టానానిని తమదైన శైలిలో హెచ్చరికలు పంపుతున్నారు. దీనిపై రేవంత్ తీవ్రంగా స్పందించారు. మీ మాటల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని, అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటూ తేల్చిచెప్పారు. ఇదీ చదవండి: అధిష్టానానికి మళ్లీ తలనొప్పిగా మారిన పదవుల పంచాయితీ! -
ఎండలతో గాయ్ గాయ్.. నీళ్లల్లో హాయ్ హాయ్!
వేసవికాలం వచ్చిందంటే మండే ఎండలు భయపెడతాయి.మరి భయపెట్టే ఎండల నుంచి రక్షణపొందాలంటూ చల్ల చల్లని ప్రదేశాలు ఎక్కడున్నాయా అని వెదుక్కుంటూ ఉంటారు జనాలు. కూలెస్ట్ డెస్టినేషన్స్ వెదుక్కుంటూ ఉంటారు. వీకెండ్ వచ్చిందంటే ఈ హడావిడి ఇంకా పెరుగుతుంది. ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి తాపం తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండడంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సేద తీరేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. కొద్ది రోజులుగా నగరంలోని జల విహార్కు క్యూ కడుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో జల విహార్కు తాకిడి మరింత పెరిగింది. జలకాలాటలతో జరంత ఉపశమనం పొందారు.ఆద్యంతం.. ఉత్సాహభరితం.. వాక్ ఏ వే 2.0 కార్యక్రమం ఆదివారం ఆద్యంతం ఉత్సాహభరితంగా నిర్వహించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో 3 వేల మందికి పైగా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఆటిజంపై అవగాహన, అంగీకారం, సమగ్ర చేర్పునకు సంఘీభావంగా నిలిచారు. అందరినీ ఒక్కతాటిపై ఉంచి సమాజంలో లోతైన స్ఫూర్తిని నింపింది. మర్హం, రెసొనేటింగ్ రెసిలియన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు కుటుంబాలు, నిపుణులు, ఉపాధ్యాయులు, సోషల్ మీడియా స్టార్లు, సంస్కరణవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సినీనటి పాయల్ రాధాకృష్ణ, పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగాణి, టీఎస్ఎంసీ అధ్యక్షురాలు డా.ప్రతిభ, డా.మిన్హాజ్, డా.లోకేశ్ ఆర్జే షదాబాద్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు విజయతుపురాణి ఆధ్వర్యంలో ఎనర్జీతో నిండిన డాన్స్హిట్ సెషన్, సుధారమణి కథ చెప్పడం, రోహిణి జయంతి చేసిన మనోహరమైన బొమ్మల షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రంగుల హరివిల్లులా కారి్నవాల్, ఆటలు, సృజన్మాతక స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. మర్హం వ్యవస్థాపకుడు డాక్టర్ నవత్ లఖాని మాట్లాడుతూ.. ఎదుగుతున్న పిల్లలకు స్నేహితులు, కుటుంబం మద్దతు ఉంటుందనే భరోసాతో తల్లిదండ్రులు ఉంటారన్నారు. కానీ ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఆ భరోసా సులభంగా లభించదు. సమాజం ముందుకు రావాల్సిన సమయం ఇదేనన్నారు. -
గుంతలో పడిన బంతి తీస్తుండగా.. పైనుంచి లిఫ్టు పడి వ్యక్తి మృతి
సుభష్నగర్: గుంతలో పడిన బంతిని తీసే క్రమంలో పైనుంచి లిఫ్టు పడి ఓ వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందిన ఘటన సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూరారం డివిజన్ శ్రీకృష్ణనగర్లోని శ్రీ సాయి మణికంఠ రెసిడెన్సీ మొదటి అంతస్తులో నివసించే అక్బర్ పటేల్ (39) ఆర్ఎంపీ. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో అపార్ట్మెంట్ సెల్లార్లో పిల్లలు ఆడుతుండగా బంతి లిఫ్ట్ గుంతలో పడిపోయింది. బంతిని తీసేందుకు అక్బర్ పటేల్ లిఫ్ట్ గుంతలో తలపెట్టి తీస్తుండగా ఈ క్రమంలో ఒక్కసారిగా లిఫ్టు అతనిపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్బర్ పటేల్ స్వస్థలం కర్ణాటకలోని గుల్బర్గా. 15 ఏళ్లుగా స్థానికంగా ఆర్ఎంపీగా పని చేస్తున్నాడు. అక్బర్ పటేల్కు భార్య బిస్మిల్లా పటేల్, 7 ఏళ్ల లోపు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అక్బర్ మృతికి బిల్డర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతడి కుటుంబ సభ్యులు అపార్ట్మెంట్ వద్ద ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం సూరారం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఆ తర్వాత రాత్రి 8.40 గంటలకు సూరారం చౌరస్తాలో గంట పాటు ధర్నాకు దిగగా రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. అటు గండిమైసమ్మ చౌరస్తా, ఇటు ఐడీపీఎల్ వరకు భారీ ఎత్తున వాహనాల రాకపోకలు స్తంభించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సదరు బిల్డర్పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధిత కుటుంబానికి కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మద్దతు పలికారు. -
ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫామ్లు క్లోజ్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆరు ప్లాట్ ఫామ్లను మూసివేయనున్నారు. చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి పలు రైళ్లు మళ్లించనున్నారు. 100 రోజుల పాటు ఆరు ప్లాట్ ఫామ్లు మూసి వేయనునట్లు అధికారులు ప్రకటించారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ఓవర్ వంతెన పనులు ప్రారంభిస్తుండటంతో 115 రోజుల పాటు సగం ప్లాట్ఫామ్స్ను మూసి వేయనున్నారు. ఇవాళ నుంచి దశలవారీగా 120 జతల రైళ్లను దారిమళ్లించి వేరే స్టేషన్ల నుంచి తిప్పనున్నారు. వీటిల్లో సింహభాగం రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి రాకపోకలు సాగించనుండగా, కొన్ని నాంపల్లి, కొన్ని కాచిగూడ స్టేషన్ల నుంచి నడుస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండంతస్తుల్లో భారీ స్కై కాంకోర్స్ను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వేస్టేషన్లో ఇదే కీలక భాగం. ఇది ఏకంగా 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రయాణికులకు అన్ని వసతులు ఇక్కడే ఉంటాయి.వేచి ఉండే ప్రాంతంతో పాటు రిటైల్ ఔట్లెట్స్, రెస్టారెంట్లు, కియోస్క్లు లాంటివన్నీ ఇందులోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇది లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ఓవర్ వంతెనతో అనుసంధానమై ఉంటుంది. ఈ భారీ నిర్మాణానికి సంబంధించిన పునాదులు, కాలమ్స్ పనులు మొదలుపెడుతున్నారు.ఇందుకోసం 2–3, 4–5 ప్లాట్స్ ఫామ్స్ను 50 రోజులు చొప్పున మొత్తం వంద రోజులపాటు మూసేస్తారు. వీటిల్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటుచేసే పనులు కూడా చేపడుతారు. ప్లాట్ఫామ్స్తోపాటు రైల్వే ట్రాక్ మొత్తానికి పైకప్పు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన పనులను కూడా ఈ నాలుగు ప్లాట్ఫామ్స్తో ప్రారంభిస్తున్నారు. తర్వాత ప్లాట్ఫామ్ నంబర్ 10 వైపు పనులు చేపడుతారు.ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ నుంచి పదో ప్లాట్ఫామ్ వరకు భారీ ఫుట్ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీని పనుల కోసం మధ్యలో ఉండే ప్లాట్పామ్ 5–6 లో 500 టన్నుల సామర్థ్యంగల భారీ క్రేన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు ట్రాక్లపై ఇసుక బస్తాలు నింపి, దాని మీద క్రేన్ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం 15 రోజుల పాటు ఆ రెండు ప్లాట్ఫామ్స్ను మూసేస్తున్నారు.నిత్యం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మీదుగా 250 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిల్లో ఇప్పటికే 6 జతల రైళ్లను చర్లపల్లి టెర్మినల్ స్టేషన్కు శాశ్వతంగా మళ్లించారు. మరో 26 జతల రైళ్లను తాత్కాలిక పద్ధతిలో ఇతర స్టేషన్ల మీదుగా నడుపుతున్నారు. ఇప్పుడు 100 రోజుల పాటు సింహభాగం ప్లాట్ఫామ్స్ను మూసేస్తుండటంతో 120 జతల రైళ్లను కూడా మళ్లిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్లో రైలు సేవలు పరిమితంగానే ఉండనున్నాయి. ఆరు నెలల పాటు సికింద్రాబాద్ స్టేషన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కొనసాగనుంది. -
హైదరాబాద్ : జలవిహార్ లో జనం సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్లో దారుణం.. వృద్ధురాలిని హత్య చేసి.. శవంపై డ్యాన్స్
సాక్షి, హైదరాబాద్: కుషాయిగూడలో దారుణం జరిగింది. 70 ఏళ్ల వృద్ధురాలను యువకుడు కిరాతంగా హత్య చేశాడు. ఆమెను చంపేసిన అనంతరం మృతదేహంపై డాన్స్లు చేశాడు. మృతదేహంపై డాన్సులు చేస్తూ సెల్ఫీ వీడియో కూడా తీశాడు. ఆ సెల్ఫీ వీడియోలను తన మిత్రులందరికీ షేర్ చేశాడు. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు కమలను ఉరివేసి హత్య చేశాడుకమలాదేవికి చెందిన షాపులో యువకుడు అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో అద్దె విషయంలో యువకుడి కమలాదేవి మందలించింది. వృద్ధురాలు మందలించడంతో కక్ష పెంచుకున్న యువకుడు. ఈ నెల 11వ తేదీన వృద్ధురాలని చంపేసి తాళం వేసి పారిపోయాడు. ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. యువకుడు పంపిన వీడియో బెంగళూరులో వైరల్ కావడంతో సమాచారం పోలీసులకు చేరింది. వృద్ధురాలని హత్య చేసి పారిపోయిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
స్నేహితుడుమోసం చేశాడని.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
అమీర్పేట: స్నేహితుడు డబ్బులు తీసుకుని మోసం చేయడంతో మనస్తాపానికి లోనైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగపూర్కు చెందిన శివాని, రుడాల్ప్ ఆంటోని (30) దంపతులు అమీర్పేట ధరమ్కరం రోడ్డులో నివాసముంటున్నారు. గత కొన్నాళ్లుగా ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో భార్య కూడా ఉద్యోగం చేయాలని ఆంటోని భావించాడు. ఈ నేపథ్యంలో అతడి స్నేహితుడు విశాల్ శివానికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో అతడికి రూ.4.50 లక్షలు ఇచ్చాడు. అయితే అతను ఉద్యోగంఇప్పించకపోవడంతో ఆదివారం రాత్రి అల్వాల్లోని విశాల్ ఇంటికరి వెళ్లి గొడవ పడ్డాడు. రాత్రి ఇంటికి తిరిగి వచి్చన ఆంటోని కష్టపడి కూడబెట్టిన డబ్బు స్నేహితుడే కాజేశాడని భార్యకు చెప్పి బాధపడ్డాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అతను గదిలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శివాని స్నేహితుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా ఆంటోనీ ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్ అంబులెన్స్లో గుండెపోటుతో వ్యాపారవేత్త మృతి
సాక్షి, హైదరాబాద్: కోల్కతా నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ అంబులెన్స్లో వ్యాపారవేత్త మృతి చెందారు. అనారోగ్యంతో ఉన్న కమల్ కుమార్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి కమల్ కుమార్ను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ చేరుకోకముందే వ్యాపారవేత్త కమల్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. -
'టీచ్ ఫర్ ఛేంజ్' సెలబ్రిటీ ఫ్యాషన్ షోలో మెరిసిన తారలు (ఫోటోలు)
-
HYD: అర్ధరాత్రి పబ్లో అసభ్యకర డ్యాన్స్.. 17 మంది యువతులతో కస్టమర్స్..
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో నగరంలో కొందరు పబ్ యజమానులు అసాంఘిక కార్యక్రమాలను నడుపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని చైతన్యపురిలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. చైతన్యపురిలోని వైల్డ్ హార్ట్ పబ్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సమయానికి మించి పబ్ను నడుపుతున్నట్టు పోలీసుల దృష్టికి సమాచారం అందడంతో సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేయినట్టు పోలీసులు గుర్తించారు. పబ్కు వచ్చే కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో డ్యాన్స్ చేయిస్తున్నారు. ముంబై నుంచి యువతులను ఇక్కడికి తీసుకువచ్చి.. కస్టమర్లకు ఎర వేస్తున్నారు పబ్ యాజమాన్యం. ఈ క్రమంలో సోదాల్లో భాగంగా 17 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ నిర్వాహకుడు, కస్టమర్స్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. -
పోలింగ్కు బీఆర్ఎస్ హాజరయ్యేనా?
సాక్షి,హైదరాబాద్: త్వరలో జరగనున్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా చర్చలు జరుగుతున్నాయి. అందుకు కారణం గెలిచేందుకు అవసరమైన ఓటర్ల సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బీజేపీ బరిలో దిగడమే. ఎమ్మెల్సీని ఎన్నుకునేందుకు హైదరాబాద్ ‘స్థానిక’ కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఓటర్లుగా ఉన్నారు. ఆ లెక్కన మొత్తం ఓటర్లలో అత్యధికంగా 49 ఓట్లు ఎంఐఎంకు ఉన్నాయి. దాంతోపాటు కాంగ్రెస్తో ఉన్న అనుబంధంతో ఆ పార్టీకి, దానికి మిత్రపక్షంగా ఉన్న టీజేఎస్కు చెందిన 14 ఓట్లు ఎంఐఎంకు లభించే అవకాశాలున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకొని పోటీ లేకుండా ఎన్నిక ఏకగ్రీవంగా జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు భావించినప్పటికీ, కమలం పార్టీ తమ అభ్యర్థిని బరిలో దింపింది. దీంతో బీజేపీ ఏ ధీమాతో, ఏ నమ్మకంతో పోటీలో నిలిచిందనేది ఇప్పుడు అందరి మదిలో ప్రశ్న తలెత్తుతోంది.ఎవరికి ఎవరో.. మరో వైపు కాంగ్రెస్.. బీఆర్ఎస్.. బీజేపీ ఈ మూడూ దేనికవిగా మిగతా రెండూ కలిసి పని చేస్తున్నాయని ఎంతో కాలంగా ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నాయి. మిగతా రెండూ ఒకటేనని, తమ పార్టీ మాత్రమే వాటికి వ్యతిరేకంగా ప్రజల కోసం పని చేస్తోందని మూడు పారీ్టల నేతలూ అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలో ఎవరికి ఎవరు మద్దతుగా నిలుస్తారో, ఎవరిని వ్యతిరేకిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అంత నమ్మకం లేనిదే బీజేపీ ఎందుకు పోటీలో ఉంటుందని, మిగతా పార్టీల నుంచి తగిన హామీ లభించి ఉండవచ్చని భావిస్తున్న వారూ ఉన్నారు. ఈ ఎన్నికను సైతం ఆయా పార్టీలు, ప్రజలు పారీ్టలపరంగా చూస్తున్పటికీ, పోటీలో ఉన్న అభ్యర్థులను కానీ.. ఓటర్ల జాబితాలో కానీ వారి పేర్లు, చిరునామాలు తప్ప ఏ పారీ్టయో వెల్లడించరు. కనీసం ఏ డివిజన్ కార్పొరేటరో కూడా జాబితాలో ఉండదు. విప్ వంటివి వర్తించవు.ఆత్మ ప్రబోధానుసారంగా? ⇒ జీహెచ్ఎంసీ పాలకమండలిలో సైతం పార్టీ మారిన వారు ఒకే చోట కూర్చుంటారు తప్ప అధికారికంగా ఎలాంటి ఏర్పాట్లు చేయరు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే పారీ్టల వారీగా అభ్యర్థులను పేర్కొంటారు తప్ప.. తర్వాత పార్టీ మారినా అధికారికంగా దాన్ని ప్రకటించరు. పట్టించుకోరు. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యరి్థకి కానీ, తమ పార్టీ అధిష్ఠానం సూచించిన వారికి కానీ కచి్చతంగా ఓటేయాల్సిన పరిస్థితి ఓటర్లకు లేదు. అందువల్లే బీజేపీ ధీమాగా ఉందని చెబుతున్నారు. ⇒ అంతేకాదు.. ఇటీవల బీజేపీకి చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎంను ఓడించాల్సిందిగా పిలుపునిచ్చారు. దీంతో అసలీ ఎన్నికలో ఏం జరగనుందో అంతుచిక్కడం లేదని కొందరు కార్పొరేటర్లు అంటున్నారు. క్రాస్ ఓటింగ్ జరిగినా గుర్తించలేరు. పారీ్టలు సైతం ఫలానా వారికే ఓటేయాలని ఇంతవరకు చెప్పలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వైఖరి ఏమిటో అంతుపట్టడం లేదు. ⇒ బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదేపదే అంటున్నారు. కాంగ్రెస్ మద్దతు ఎంఐఎంకు ఉంది. జీహెచ్ంఎసీ స్టాండింగ్కమిటీ ఎన్నికలోనూ అది వెల్లడైంది. కాబట్టి కాంగ్రెస్ మద్దతిచ్చే ఎంఐఎంకు బీఆర్ఎస్ సైతం మద్దతిస్తుందా, లేక పోలింగ్కు దూరంగా ఉంటుందా అన్నది తెలియడానికి ఇంకా సమయం పట్టనుంది. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాల పర్వం కూడా ప్రారంభం కావచ్చని ఆశిస్తున్నవారూ ఉన్నారు. ప్రలోభాలను సైతం ఆత్మప్రబోధంగా చెబుతారని కార్పొరేటరొకరు వ్యాఖ్యానించారు. పారీ్టల పరంగా చూస్తే బీఆర్ఎస్కు 24 ఓట్లు, బీజేపీకి 25 ఓట్ల బలం ఉంది. -
కాకరేపుతున్న కామెంట్స్.. ఈటల వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అధినాయకత్వం ప్రయత్నిస్తుండగా, మరోవైపు కొందరు పదవులు దక్కిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే అసంతృప్తి శ్రేణుల్లో నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలో కొత్తగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షుల వ్యవహార శైలిపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో ఏడాదిలో గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు పార్టీ పరంగా గ్రౌండ్ వర్క్ (Ground Work) చేసుకోవాలని దిశానిర్దేశం చేస్తున్నారు. డివిజన్, జిల్లాలవారీగా విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ బలాబలాలు, సరిదిద్దుకోవాల్సిన అంశాలపైనా చర్చిస్తున్నారు. ఇలాంటి సమంలో పార్టీ పదవుల్లో ఉన్నవారు సమావేశాలకు గైర్హాజర్ కావడమేంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారే పార్టీ పదవుల్లో కొనసాగాలని, అలా కుదరదంటే స్వచ్ఛందంగా తప్పుకోవాలనే వాదలు గట్టిగా వినిపిస్తున్నారు.ఇటీవల కాషాయ పార్టీ మీటింగ్లో స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender ) సైతం ఇదే స్వరాన్ని వినిపించారు. మేడ్చల్ అర్బన్ జిల్లాలో బీజేపీ 25 డివిజన్లుగా విభజించింది. కొత్తగా డివిజన్ అధ్యక్షులను ఎంపిక చేసింది. అనంతరం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కొత్తగా ఏర్పాటైన వారిలో 9 మంది డివిజన్ అధ్యక్షులు హాజరు కాలేదు. దీంతో ఒకింత ఆగ్రహానికి గురైన ఈటల రాజేందర్ 70 వేల మందికి ప్రాతినిథ్యం వహించే డివిజన్ అధ్యక్షుడు పార్టీ సమావేశాలకు హాజరు కాకుంటే ఎలా, అత్యవసర పరిస్థితుల్లో రాలేనివారిని మినహాయిస్తే, మిగతావారిని ఊపేక్షించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.చదవండి: వారి మద్దతుతోనే ఈ నల్ల చట్టాన్ని తెచ్చారుదీంతో పార్టీలో ఆ 9 మంది డివిజన్ అధ్యక్షుల భవితవ్యం ఏంటనే చర్చ జరుగుతోంది. భాగ్యనగరంలోని మిగతా డివిజన్ల పరిస్థితిపైనా నిశితంగా పరిశీలించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నవారిని పక్కన పెట్టి పార్టీకి పనిచేసే వారికి పట్టం గట్టాలని పార్టీ అధిష్టానం (High Command) భావిస్తోందని నేతలు పేర్కొంటున్నారు. నేతలు సొంత పార్టీ వారే అయినా కొన్ని దఫాలు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందంటున్నారు. పదవి పొందేటప్పుడు ఉన్న ఆరాటం ఆ తర్వాత ఉండటం లేదని, పార్టీ కోసం 24 గంటలు పని చేయాల్సిందేనని పార్టీ అధిష్టానం స్పష్టం చేస్తోంది. -
పార్క్ హయత్ హోటల్లో అగ్నిప్రమాదం.. సన్రైజర్స్ టీమ్కు తప్పిన ముప్పు
హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుకుంది. హోటల్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో సిబ్బంది, అతిథులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇదే హోటల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బస చేస్తోంది. ఈ ప్రమాద సమయంలో ఎస్ఆర్హెచ్ టీమ్ సభ్యులు హోటల్లోనే ఉన్నారు. ప్రమాద విషయం తెలిసి ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో వెళ్లిపోయారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హోటల్ కు చేరుకుని పొగలను అదుపు చేశారు. మొదటి అంతస్తులో విద్యుత్ వైర్లు కాలడంతోనే ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా సన్రైజర్స్ హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 17న వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం సన్రైజర్స్ టీమ్ సోమవారం సాయంత్రం ముంబైకి బయలు దేరాల్సి ఉంది. కానీ అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కాస్త ముందుగానే ఎస్ఆర్హెచ్ టీమ్ చెక్ అవుట్ చేసింది.ఈ ఏడాది సీజన్లో సన్రైజర్స్ టీమ్ కాస్త తడబడుతోంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించింది. అయితే ఆఖరి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై మాత్రం రికార్డు విజయాన్ని ఎస్ఆర్హెచ్ అందుకుంది. 245 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ మ్యాచ్లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(141) భారీ సెంచరీతో చెలరేగాడు. -
ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డులు స్ఫూర్తిదాయకం
సాక్షి, సిటీ బ్యూరో : వ్యాపారం, సాంకేతికత, కళలు, సామాజిక సేవతో పాటు విభిన్న రంగాల్లో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళలను ట్రంప్స్ ఆఫ్ టాలెంట్ (టీఓటీ) ఆధ్వర్యంలో ‘ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్ –2025’ అవార్డులతో గౌరవించింది. హైటెక్ సిటీలోని అవసా హోటల్ వేదిక జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, వెల్నెస్ అంబాసిడర్ శిల్పారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు అవార్డులను అందించారు. ఈ వేదిక ద్వారా మహిళల ప్రయాణాన్ని స్ఫూర్తివంతమైన కథలుగా ప్రదర్శించామని ట్రంప్స్ ఆఫ్ టాలెంట్ వ్యవస్థాపకులు మహమ్మద్ ఫయాజ్ తెలిపారు. అవార్డుల జ్యూరీలో లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ ఇండియా సీఈవో శిరీష వోరుగంటి, వీహబ్ సీఈవో సీతా పల్లచోల్ల, ఐబీఎం ఎగ్జిక్యూటివ్ భాగస్వామి అనురాధ ఏ, నోవార్టిస్ కంట్రీ హెడ్ దివ్య బాల్రాజ్, తెలంగాణ తొలి గిరిజన మహిళా వాణిజ్య పైలట్ కెప్టెన్ బాబీ ఉన్నారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధిపతి మనీషా సాబూ, అబైరో క్యాపిటల్ సలహాదారు మహంకాళి శ్రీనివాసరావు, ఎడ్యు గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఫిరోజ్ సైట్ పాల్గొన్నారు. నగరంలో ప్రవాసీ ఒడియా ఫెస్టివల్ ఉత్కళ ఒడియా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ ‘పత్ ఉత్సవాలకు’ వేదికైన ఖాజాగూడ పెద్ద చెరువు రాయదుర్గం : ఒడిశా వాసులు గచ్చిబౌలి డివిజన్లోని ఖాజాగూడ పెద్ద చెరువు వద్ద సందడి చేశారు. ఉత్కళ ఒడియా యూత్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రవాసీ ఒడియా ఫెస్టివల్ ‘పత్ ఉత్సవం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో నివాసముండే ఒడిశా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్సాహాన్ని ప్రకటించారు. మొదట ఇస్కాన్ బృందం వారిచే కృష్ణ పరమాత్మ, రామలీలలపై గానామృతం నిర్వహించగా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం రోడ్ రంగోలి మురుజా, ఆతోంటిక్, ఒడియా క్యూసిన్, డిస్ప్లే, ఆర్ట్, పైకా ఆర్ట్, టైగర్ నృత్యాలు వంటివి నిర్వహించి తమ సంప్రదాయాన్ని చాటుకున్నారు. అనంతరం శంఖనాథాలతో కూడిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓద్రా, దేహం జుంబా నృత్యాలతోపాటు పిల్లల గ్లోబల్ ఆర్ట్స్ డ్రాయింగ్ పోటీలను నిర్వహించగా ఒడిశా వాసులు ఆసక్తిగా తిలకించారు. ప్రత్యేక ఆహా్వనితులుగా ఐపీఎస్ అధికారి సౌమ్యామిశ్రా, సుప్రసిద్ధ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధ పాండ్వా పాల్గొని అందరినీ మరింత ఉత్సాహపరిచారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగరంలోని ఒడిశా వాసులు పాల్గొన్నారు. తెలంగాణ రగ్బీ జాతీయ స్థాయి సభ్యత్వం ఇండియన్ ఫుట్బాల్ యూనియన్ నుంచి తెలంగాణ అసోసియేషన్కు సభ్యత్వం అధికారికంగా ప్రకటించిన ఐఆర్ఎఫ్యుతెలంగాణలో బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్ తరహాలో రగ్బీ క్రీడ కూడా అభివృద్ధి చెందనుందని తెలంగాణ రగ్బీ అసోసియేషన్ వెల్లడించింది. ఇండియన్ రగ్బీ ఫుట్బాల్ యూనియన్ నుంచి శాశ్వత సభ్యత్వం కోసం అధికారికంగా గుర్తింపు లభించిందని సంస్థ ప్రకటించింది. ఈ నూతన అనుబంధంతో తెలంగాణ రగ్బీ అసోసియేషన్ ‘ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్’ కింద శాశ్వత సభ్యులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలనూ అందించనున్నట్లు నూతన అధ్యక్షులు, లైఫ్స్పాన్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ నరేంద్ర రామ్ తెలిపారు. ఈ అధికారిక గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా రగ్బీని మెరుగుపరచడానికి, జాతీయ పాలక సంస్థతో సన్నిహితంగా సహకరించడానికి అసోసియేషన్ అనుమతిస్తుందని పేర్కొన్నారు. నూతన అధ్యక్షునిగా 2028 వరకూ మూడేళ్ల పాటు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే శక్తివంతమైన రగ్బీ సంఘాన్ని సృష్టించడానికి కలిసి పనిచేయనున్నామని తెలిపారు. ఆకట్టుకున్న మార్షల్ ఆర్ట్స్ వైశాఖీ ఉత్సవాల సందర్భంగా సాయంత్రం నగర కీర్తన్ పేరిట ఊరేగింపు నిర్వహించారు. అమీర్పేట గురుద్వారా నుంచి ప్రారంభమైన ఊరేగింపు గ్రీన్ల్యాండ్స్, క్యాంపు కార్యాలయం, పంజాగుట్ట, అమీర్పేట మీదుగా గురుగ్రంథాన్ని, సిక్కు సంప్రదాయ ఆయుధాలను ప్రదర్శనంగా ఊరేగింపు నిర్వహించారు. సిక్కు యువతీ, యువకులు చేసిన మార్షల్ ఆర్ట్స్ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ వంటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గురుగోవింద్సింగ్ వంశపారంపర్యంగా వస్తున్న ఐదు అరుదైన గుర్రాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దారి పొడవునా గురుగ్రంథానికి పూజలు చేశారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ను దారి మళ్లించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ నగర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
రన్ ఫర్ హెల్త్..
అత్యవసర ఆరోగ్య సంరక్షణ, ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు హోండా బిగ్వింగ్ డీలర్ షిప్లు, ఆటోఫిన్ హోండా, జేఎస్పీ హోండా, ఫార్చ్యూన్ హోండా బిగ్వింగ్ సంయుక్తంగా 10కే రన్ విజయవంతంగా నిర్వహించారు. గచ్చిబౌలిస్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ఔత్సాహికులు పాల్గొన్నారు. రన్నర్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ఫార్చ్యూన్ హోండా నీరవ్మోడి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ అత్యవసర ఆరోగ్య సంసరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. హోండా బిగ్వింగ్ ప్రయత్నంలో భాగంగా దీనిని ఏర్పాటు చేశామన్నారు. దీనిని యేటా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు. కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులను మొత్తం ఆరోగ్య సంరక్షణకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. హైటెక్సిటీలో 5 కె రన్.. మాదాపూర్ : ఐటీ ఉద్యోగులు 5 కె రన్లో పలువురు రన్నర్లు ఉత్సహంగా పాల్గొన్నారు. మాదాపూర్లోని హైటెక్సిటీ యశోధహస్పిటల్ వద్ద ఆదివారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 5 కె రన్ నిర్వహించారు. టీసీఎస్ ఉద్యోగులు 8500 మంది పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐటీ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రముఖ డాక్టర్లు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అభినవ్, టీసీఎస్ అధ్యక్షుడు వి.రాజన్న, ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ : జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
ముంబై పై హైదరాబాద్ పై చేయి... ఇండియన్ సినిమా అడ్రెస్ మారనుందా?
భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఇక్కడివాడే, అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడు ఇక్కడివాడే, అత్యధిక చిత్రాలు రూపొందేది ఇక్కడే...ఇలాంటి అనేకానేక విశేషాలతో ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ టాలీవుడ్కి రాజధానిగా ఉన్న హైదరాబాద్... ఇప్పుడు శరవేగంగా భారతీయ సినిమాకు రాజధానిగా మారిపోతోంది. నిజానికి ముంబై చాలా కాలంగా భారతదేశ చలనచిత్ర రాజధాని అనేది తెలిసిందే, దేశంలో ఏ భాషా చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులైనా, దర్శకులైనా, సాంకేతిక నిపుణులైనా తమ కెరీర్లో కనీసం ఒక్కసారైనా హిందీ సినిమా చేయాలని కలలు కంటారు. అలా చేయడం అంటే తమకు ప్రమోషన్ వచ్చినట్టుగా భావిస్తారు. ఒకప్పుడు దక్షిణాది సూపర్స్టార్లు అనేక మంది హిందీ సినిమాల ద్వారా బాలీవుడ్పై తమదైన ముద్ర వేయాలని విఫలయత్నం చేసినవారే.ఆ ఆధిపత్యం ఇక గతం...?అయితే ఇండియన్ మూవీపై ముంబై ముద్ర ఇక గతంగా మారనుందా? ఇప్పటిదాకా ముంబై కేంద్రంగా సాగుతున్న భారతీయ సినిమా పరిశ్రమ క్రమంగా హైదరాబాద్ తన స్థానాన్ని ఆక్రమించడంతో తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.గతంలో, బాలీవుడ్ అవకాశాల కోసం చాలా మంది తెలుగు తమిళ నటీనటులు ముంబైకి తరచుగా వచ్చేవారు. అంతేకాదు బాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు అంటే దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ ఉండేది. అక్కడి చిన్నా చితకా నటీనటులు కూడా హైదరాబాద్ వచ్చి తెలుగు సినిమాల్లో నటించాలంటే డబుల్, త్రిబుల్ ఫీజులు డిమాండ్ చేసేవారు. అయినా వాళ్లనే తెచ్చుకుని నిర్మాతలు గొప్పలు చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ రివర్స్ అయింది.ఛలో హైదరాబాద్...అంటున్న దర్శక నిర్మాతలుతెలుగులో రూపొందిన పాన్–ఇండియా చిత్రాల వెల్లువ పరిశ్రమను పునర్నిర్మించింది, హిందీ సినిమాను చాలా పెద్ద మార్కెట్లో ఓ చిన్న భాగం గా మార్చేసింది. రాజమౌళి బాహుబలి సిరీస్ నుంచి, మనవాళ్లు పాన్–ఇండియా చిత్రాల వైపు మళ్లడం మరింత పెరిగింది. అకస్మాత్తుగా ఊపందుకున్న ఈ ట్రెండ్తో ఉక్కిరి బిక్కిరవుతున్న ముంబై చిత్రనిర్మాత దర్శకులు ఆ స్థాయి చిత్రాల కోసం దక్షిణ భారత పరిశ్రమపై, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న వారిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ముంబై నుంచి దర్శక నిర్మాతలు ఇక్కడి నటీనటుల కాల్షీట్స్ కోసం ప్రయత్నించే క్రమంలో హైదరాబాద్ వస్తున్నారు.ముంబైకి చెందిన కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు కూడా తెలుగు సినిమా నిర్మాతలతో ప్రాజెక్ట్ల గురించి చర్చించేందుకు హైదరాబాద్కు ఛలో అంటున్నారు.నటీనటులు సైతం అదే బాట...ముంబైకి చెందిన చాలా మంది నటులు నటీమణులు క్రమం తప్పకుండా హైదరాబాద్కు వస్తున్నారు, నిర్మాతలు దర్శకులతో నిత్యం టచ్లో ఉంటున్నారు. తెలుగు దర్శకుడు సందీప్ వంగా యానిమల్ సినిమా ద్వారా బాబీ డియోల్కి అందించిన బాక్సాఫీస్ హిట్ లాగే పాన్–ఇండియా చలనచిత్రాలు తమ కెరీర్ పునరుజ్జీవనాన్ని అందిస్తాయని ఆశిస్తూ బాలీవుడ్లోని అగ్రశ్రేణి నటీనటులు కూడా హైదరాబాద్కు చెందిన చిత్ర నిర్మాత దర్శకులతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారు.తిరిగొస్తున్న వలస ప్రముఖులుదూరపు కొండల నునుపును చూసి ముచ్చటపడిన పలువురు దర్శకులు, నటీనటులు తూచ్ అనుకుంటున్నారు. గతంలో దర్శకుడు పూరీ జగన్నాధ్, ముంబైలో స్థిరపడాలని భావించాడు. అయితే తిరిగి హైదరాబాద్కు మారాలని నిర్ణయించుకున్నాడు. అలాగే ఇక్కడ అవకాశాలు బాగున్నా సరే బాలీవుడ్ ఛాన్సుల కోసం పెట్టె బేడా సర్ధుకున్న పలువురు తారలు సైతం తిరిగి హైదరాబాద్ వైపు చూస్తున్నారు. నిజానికి ప్రస్తుతం ఒక్క తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళ, మళయాళ చిత్రాలు సైతం భారతీయ సినిమా రంగంలో సత్తా చాటుతున్నాయి. ఇలా మొత్తంగా దక్షిణాది చిత్రాలు భారీ విజయాలు నమోదు చేస్తున్న నేపధ్యంలో ఏర్పడిన పరిస్థితి హైదరాబాద్కు లాభించిందని చెప్పాలి. మిగిలిన ఏ దక్షిణాది భాషా చిత్ర పరిశ్రమకూ హైదరాబాద్ లాంటి వైవిధ్యభరిత అవకాశాలు అందించే అత్యాధునిక నగరం లేకపోవడం కూడా మరో కారణం. ఇటీవల బాలీవుడ్ తారలు, ప్రముఖులు హైదరాబాద్లో రెస్టారెంట్లు, జిమ్స్, బొటిక్స్ తదితర వ్యాపారాలు ప్రారంభిస్తూ హైదరాబాద్కు తరచుగా రాకపోకలు సాగించేందుకు మరికొన్ని కారణాలు సృష్టించుకుంటున్నారు. ఇలాంటి వ్యాపారాల్లో టాలీవుడ్ ప్రముఖులు సైతం పార్ట్నర్స్గా మారుతున్నారు. -
అంబేద్కర్ మదిలో ‘హైదరాబాద్’.. కలకత్తా, ముంబైలను కాదంటూ..
నేడు (ఏప్రిల్ 14) అంబేద్కర్ జయంతి. దేశంలోని దళితుల అభ్యన్నతికి పాటు పడిన అంబేద్కర్(Ambedkar)కు హైదరాబాద్పై ప్రత్యేక అభిప్రాయం ఉంది. అప్పట్లో హైదరాబాద్ను రెండో రాజధానిగా చేయాలని అంబేద్కర్ సూచించారు. కొంతకాలం దీనిపై చర్చ జరిగింది. అయితే మారిన కాలంతో పాటు చోటుచేసుకున్న పరిణామాలతో ఈ అంశం కొంతమేరకు మరుగున పడింది.భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి రెండో రాజధాని(Second capital) అవసరమనే ఆలోచనను 1950వ దశకంలో తన పుస్తకం 'థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్'లో ప్రతిపాదించారు. ఈ పుస్తకంలో ఆయన దేశానికి రెండో రాజధాని అవసమని పేర్కొన్నారు. తద్వారా ఉత్తర-దక్షిణ ఉద్రిక్తతలను తొలగించేందుకు మార్గం ఏర్పడుతుందన్నారు. ఒక్క రాజధాని భారతదేశానికి సరిపోతుందా? అని అంబేద్కర్ ప్రశ్నించారు. దేశ రెండో రాజధానిగా కలకత్తాను ఎంచుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కలకత్తా టిబెట్కు సమీపంలో ఉందని, అలాగే ముంబై సముద్ర తీరంలో ఉండటం వల్ల అది కూడా రెండో రాజధానిగా సురక్షితం కాదని అంబేద్కర్ భావించారు. ఈ దశలో చివరగా ఆయన హైదరాబాద్(Hyderabad)ను ఎంచుకున్నారు. ఈ ప్రాంతపు భౌగోళిక స్థానం దేశంలోని అన్ని దిశల నుంచి సమాన దూరంలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని అంబేద్కర్ పేర్కొన్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్- బొలారం ప్రాంతాలను చీఫ్ కమిషనర్ ప్రావిన్స్గా ఏర్పాటు చేసి, భారతదేశ రెండో రాజధానిగా చేయాలని అంబేద్కర్ నాడు సిఫారసు చేశారు.అంబేద్కర్ ఈ సూచనను భాషాపరమైన రాష్ట్రాలు ఏర్పడకముందే, అంటే 1960కి ముందు చేశారు. అయితే నేడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో భాగంగా ఉంది. రాష్ట్ర విభజన సమయంలో రెండో రాజధాని వాదన వినిపించింది. కాగా అంబేద్కర్ నాగ్పూర్ను రెండో రాజధానిగా పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని పలువురు విశేషంగా చెబుతుంటారు. అంబేద్కర్ 1956లో నాగపూర్లో బౌద్ధమతాన్ని స్వీకరించి, లక్షలాది మందిని కుల వివక్ష నుంచి విముక్తి చేసే చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.ఇది కూడా చదవండి: నేడు తమిళుల ఉగాది.. సొంత భాషలోనే శుభాకాంక్షలు చెప్పుకుంటున్న జనం -
మూడు రోజుల క్రితమే వివాహం.. ఫలక్నామా రౌడీషీటర్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫలక్నామా రౌడీ షీటర్ మాస్ యుద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు.. అతడిపై దాడి చేసి హత్యకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. ఫలక్నామా రౌడీషీటర్ మాస్ యుద్ధీన్ ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. రెయిన్బజార్లో కొందరు వ్యక్తులు మాస్యుద్దీన్పై కత్తితో దాడి చేసి అతడిని హతమార్చారు. అయితే, అతడి ప్రత్యర్థులే యుద్ధీన్ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇదిలా ఉండగా.. మాస్ యుద్దీన్కు మూడు రోజుల క్రితమే వివాహం జరిగినట్టు తెలుస్తోంది. -
హైదరాబాద్లో మరో లిఫ్ట్ ప్రమాదం.. ఆర్ఎంపీ డాక్టర్ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మరో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. సూరారంలోని ఓ రెసిడెన్సీలో లిఫ్ట్ మీద పడటంతో అక్బర్ పాటిల్ (39) అనే ఆర్ఎంపీ వైద్యుడు మృతి చెందారు. అపార్ట్మెంట్ లిఫ్ట్ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్ గుంతలోకి తలపెట్టినప్పుడు పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్ పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.నగరంలో వరుస లిఫ్ట్ ప్రమాదాలు భయపెడుతున్నాయి. గత నెలలో నాంపల్లిలో లిఫ్ట్లో ఇరుక్కుని నరకం అనుభవించి చిన్నారి కన్నుమూసిన ఘటన తెలిసిందే. మరో ఘటనలో మెహదీపట్నంలోని ఆసిఫ్నగర్ ఠాణా పరిధి సంతోష్నగర్కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్ లిఫ్ట్లో ఇరుక్కుని మరణించడం విషాదం నింపింది. -
Hyd: బస్సు కింద పడి యువకుడు దుర్మరణం.. రోడ్డుపై బంధువుల ఆందోళన
హైదరాబాద్: నగరంలోని బాలా నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు బస్సు కింద పడి దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసులు ఆపడంతో తప్పించుకునే క్రమంలో అదుపు తప్పి బస్సు కింద పడ్డాడు ఆ క్రమంలోనే బస్సు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఐడీపీఎల్ నుంచి బాలా నగర్ రోడ్డు మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడు మృతి వార్త తెలుసుకున్న బంధువులు బాలా నగర్-ఐడీపీఎల్ ప్రధాన రహదారిపైకి వచ్చి ధర్నా చేపట్టారు. యువకుడు మృతికి ట్రాఫిక్ పోలీసులే కారణమంటూ ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ నిరసన చేపట్టారు. దాంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఐడీపీఎల్ నుంచి బాలా నగర్ వరకూ కిలో మీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. దాంతో వాహన దారులు తీవ్ర కష్టాల్లో పడ్డారు. -
ఈ నెల 19న హైదరాబాద్లో సభ.. వక్ఫ్ బిల్లుపై అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్,సాక్షి: వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థులు ఉండాలనడం సబబా అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. వక్ఫ్(సవరణ)చట్టం–2025పై అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్పై వచ్చే వారం సుప్రీం కోర్టు విచారించనుంది.ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థులు ఉండాలనడం సబబా. కొత్త చట్టంతో కబ్జా చేసిన వాళ్లే యజమానులుగా మారుతారు. చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 19న హైదరాబాద్లో సభ నిర్వహిస్తున్నాం. ప్రధాని మోదీ తెచ్చిన వక్ఫ్ చట్టసవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు,నితీష్ సహకారంతోనే నల్ల చట్టం తెచ్చారు’ అని వ్యాఖ్యానించారు. వక్ఫ్(సవరణ)చట్టం–2025 అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటుండగా.. ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ఉంటారని సుప్రీంకోర్టు వెబ్సైట్ పేర్కొంది. -
KTR: ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా’
హైదరాబాద్,సాక్షి: సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ల నిర్ణయాలకు కాలపరిమితిని నిర్ధేశించిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆదివారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. పాలనలో అడ్డంకులు సృష్టించడానికి బీజేపీ,కాంగ్రెస్ జాతీయ పార్టీలు లెక్కలేనన్ని సార్లు గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేశాయి. అసెంబ్లీ స్పీకర్లచే రాజ్యాంగ దుర్వినియోగాన్ని కూడా.. సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి నిర్ణయించాలని ఎక్స్లో పేర్కొన్నారు. Welcome the Hon’ble Supreme Court’s decision to set a timeline for decisions of GovernorsCountless times, both BJP and Congress have abused the institution of Governor to create hindrances in Governance Supreme Court should also take into cognisance the rampant abuse of… https://t.co/Oj2hTA2hWd— KTR (@KTRBRS) April 13, 2025 -
SRH vs PBKS : ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
-
Hyd: ప్రశాంతంగా ముగిసిన హనుమాన్ శోభాయత్ర
హైదరాబాద్: నగరంలో జరిగిన హనుమాన్ జయంతి శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఈరోజు(శనివారం) గొలిగూడ నుంచి తాడ్ బండ్ వరకు కొనసాగిన హనుమాన్ శోభాయత్ర కాషాయమయంతో నిండిపోయింది. సుమారు 12 కిలోమీటర్ల మేర విజయవంతంగా కొనసాగింది హనుమాన్ శోభాయాత్ర. అడుగడునా పటిష్ట బందోబస్తు నడుమ శోభాయాత్ర జరగ్గా, బైక్ ర్యాలీలతో భక్తులు ఇందులో పాల్గొన్నారు. హనుమాన్ శోభాయాత్రకు ఇళ్ల దగ్గర ఉన్న భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ శోభాయత్రం అంతా జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో హోరెత్తింది.. -
హైదరాబాద్లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర (ఫోటోలు)
-
రాజాసింగ్తో బండి సంజయ్ చర్చలు సఫలం
హైదరాబాద్ : బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజాసింగ్ తో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో ఎన్ గౌతంరావు అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ వ్యతిరేకించడంతో బండి సంజయ్ రంగంలోకి దిగారు. అయితే గౌతంరావును గెలిపించడానికి కృషి చేస్తానని బండి సంజయ్ కు రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ లైన్లలోనే పని చేస్తానని రాజాసింగ్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలలో కార్పొరేటర్లతో కో ఆర్డినేషన్ చేస్తానని రాజా సింగ్ తెలిపారు. ఈ క్రమంలోనే గౌతంరావును అక్కడకు రప్పించి రాజాసింగ్ తో కరాచలనం చేయించారు బండి సంజయ్. దీనిలో రాజాసింగ్, గౌతంరావులు పరస్పరం శాలువాలతో సత్కరించుకున్నారు. అదే సమయంలో పార్టీలో ఇబ్బంది లేకుండా చూసుకుంటానని రాజాసింగ్కు బండి సంజయ్ కూడా భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ పోటీలో ఉండాలని బండి సంజయ్ పట్టుబట్టి మరీ అక్కడ అభ్యర్థిని నిలబెట్టారు. దీనిలో భాగంగా హైదరాబాద్ లోనే తిష్టవేసిన బండి సంజయ్.. కార్పోరేటర్లతో కూడా సమావేశమయ్యారు. హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలుగోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తో భేటీ సందర్భంగా ముందుగా పాతబస్తీలోని ఆకాష్ పురి హనుమాన్ దేవాలయానికి బండి సంజయ్ చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయానికి చేరుకునే క్రమంలో రాజాసింగ్.. బండి సంజయ్కు స్వాగతం పలికారు. కేటీఆర్ పై విమర్శలుబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు బండి సంజయ్. హెచ్ సీయూ భూముల అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ ఉన్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ‘ బీజేపీ ఎంపీ ఉంటే పేరు ఎందుకు బయటపెట్టడం లేదు. కేటీఆర్ కళ్లు, చెవులు దొబ్బినాయ్.. వాడు, వీడు అని మాట్లాడుతున్నాడు. HCU భూముల కోసం కోట్లడింది మేము. ఎబివిపి కార్యకర్తలు ఇప్పటికీ జైల్ లో ఉన్నారు. HCU భూముల అమ్మకుండా కోర్టు అడ్డుకుంటుందని మాకు నమ్మకం ఉంది. రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీలో ఎటువంటి విభేదాలు లేవు’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. -
ఆంధ్రలో 85 వేలు.. తెలంగాణలో 75 వేల కేసుల నమోదు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘క్షయవ్యాధితో దేశవ్యాప్తంగా 2023లో మూడు లక్షల మంది మృతి చెందారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు భారత్లో నమోదవుతున్నాయి. క్షయ వ్యాధిని ముందే గుర్తిస్తే మరణాలను నివారించవచ్చు. సవాల్గా మారిన క్షయ వ్యాధి నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా పని చేయాలి’... (హైదరాబాద్ సీసీఎంబీలో జరుగుతున్న రీజినల్ ప్రాస్పెక్టివ్ అబ్జర్వేషనల్ రీసెర్చ్ ఫర్ టీబీ (రిపోర్టు) ఇండియా 14వ సదస్సులో పరిశోధకుల సూచనలివి.) ఈ ఫొటోలోని వ్యక్తి పేరు ఎట్టి కృష్ణారావు. ములుగు జిల్లా వాజేడు మండలం నాగారం గ్రామం. టీబీ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు.. కాగా పెద్ద కొడుకు పెళ్లి చేసుకొని వేరుగా ఉంటున్నాడు. కూతురికి, మరో కొడుక్కి పెళ్లి కావలసి ఉంది. ఉన్న అరెకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, కూలి పనులకు వెళ్లి భార్య సత్యమ్మ, కొడుకు, కూతురితో కలిసి కుటుంబాన్ని పోషిస్తోంది. ట్యూబర్ క్యులోసిస్ (Tuberculosis) (క్షయ వ్యాధి) మళ్లీ విస్తరిస్తోంది. కనీస జాగ్రత్తలు తీసుకోని అనేక మందిని కబళిస్తోంది. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ వ్యాధి ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. 2023–24లో దాదాపు 24.25 లక్షల మంది కొత్తగా టీబీ బారిన పడగా, 2024–25లో ఆ సంఖ్య 25,34,112కు చేరింది. ఈ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా చూస్తే టీబీ కేసుల్లో భారత్లోనే 26% ఉన్నాయని ఆ శాఖ అంచనా వేసింది. కాగా దేశవ్యాప్తంగా ట్యూబర్ క్యులోసిస్ (టీబీ) నిర్మూలనకు.. ప్రభుత్వం ఏటా సగటున సుమారు రూ. 2వేల కోట్ల చొప్పున.. ఐదేళ్లలో రూ.10,032.75 కోట్లు ఖర్చు చేసింది. అయినప్పటికీ చాపకింద నీరులా టీబీ వ్యాధి విస్తరిస్తూనే ఉంది. మొదటిస్థానంలో ఉత్తరప్రదేశ్ క్షయ వ్యాధి (టీబీ) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. 2023–24లో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో 6,13,851 మందికి టీబీ వ్యాధి సోకగా 5,66,490 మందికి విజయవంతంగా చికిత్స చేశారు. 2024–25కు వచ్చేసరికి ఆ సంఖ్య 6,70,590లకు చేరింది. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర 2,05,909 కేసుల నుంచి 2,14,670 కేసులతో నిలిచింది. బిహార్లో 2023–24లో 1,84,706 మందికి టీబీ సోకగా, 1,55,580 మందికి వైద్యసేవల ద్వారా నయం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024–25లో ఆ రాష్ట్రంలో టీబీ సోకిన వారి సంఖ్య 2,03,853లుగా సర్వేలో తేలింది. గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్లోనూ వ్యాధి తీవ్రత ఉంది. లక్షద్వీప్లో అతితక్కువగా 2023–24లో 13,2024–25లో 14 కేసులు నమోదవగా.. లద్దాఖ్లో 328 నుంచి 318 కేసులకు తగ్గగా, అండమాన్ నికోబార్లో 488 కేసుల నుంచి 533కు పెరిగాయి.డయ్యూ డామన్లో 822 కేసుల నుంచి 790కు తగ్గగా, గోవాలో 1,823 కేసుల నుంచి 1,973కు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్లో 2023–24లో 86,033 కేసులు నమోదు కాగా, ఆ ఏడాది 82,225 కేసులకు విజయవంతంగా చికిత్స చేయగా.. 2024–25లో 81,804 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 72,100లో 66,459 మందికి చికిత్స చేయగా, కొత్తగా 74,711 మంది టీబీ నిర్ధారణయింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 2023–24లో 24,25,550 కేసులను గుర్తించి చికిత్స అందించి 21,60,483 మందికి నయం చేయగా, 2024–25లో నిర్వహించిన సర్వే, పరీక్షల్లో 25,34,112 మందికి వ్యాధి ఉన్నట్లు నిర్దారించి.. వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నివేదికలో వెల్లడించింది. క్షయవ్యాధి విస్తరిస్తుందిలా.. క్షయ.. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా సంభవించే అంటువ్యాధి. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేయడంతో పాటు ఇతర అవయవాలకు కూడా సోకుతుంది. టీబీ గాలి ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. ఊపిరితిత్తుల టీబీ ఉన్నవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా ఉమ్మి వేసినప్పుడు, అవి టీబీ క్రిములను గాలిలోకి పంపుతాయి. అయితే ఈ వ్యాధి సోకితే సాధారణ లక్షణాలలో బరువు తగ్గడం, రెండోది దీర్ఘకాలిక దగ్గు, అలసటలు ఉంటాయి. ఛాతీ ఎక్స్–రే, ఇతర పరీక్షల ద్వారా టీబీని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గుర్తిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో టీబీ వ్యాధి వ్యాప్తిపై ఇంటింటి సర్వే నిర్వహించి స్ఫుటమ్ (కఫం) సేకరించి పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్గా గుర్తించిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు మందులు, నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తున్నారు. కాగా 2025 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతుండగా, టీబీ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.తండ్రి మరణంతో ఇబ్బందులు టీబీ వ్యాధి నిర్ధారణయ్యాక.. వైద్య పరీక్షలు చేసుకుని మందులు వాడినా.. మా తండ్రి ఎట్టి కృష్ణారావు నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. నాతో పాటు అమ్మ, అన్న, చెల్లి ఉన్నారు. పెద్దదిక్కుగా ఉన్న మా నాన్న మృతితో ఇబ్బందుల్లో పడ్డాం. అరెకరం భూమితో పాటు కూలి చేసుకుంటూ అమ్మ, మేము బతుకుతున్నాం. ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలి. – ఎట్టి బాలకృష్ణ, (టీబీ మృతుడుకృష్ణారావు కుమారుడు), నాగారం, ములుగు జిల్లావిరివిగా కఫం పరీక్షలు.. చికిత్స ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఏటా టీబీ సోకిన వారిని గుర్తించేందుకు స్పుటమ్ (కఫం) పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈసారి 6,315 పరీక్షలు నిర్వహించి.. 402 మందిని జిల్లాలో గుర్తించి వారికి వైద్య సేవలు అందిస్తున్నాం. వైద్య శిబిరాల్లో రోగులను గుర్తించి టీబీ నివారణ చికిత్స అందిస్తున్నాం. నిక్షయ్ పోషణ్ కింద చికిత్స పూర్తయ్యే వరకు నెలకు రూ.1,000 వారి ఖాతాలో జమ చేస్తున్నాం. – ఎ.అప్పయ్య, డీఎంహెచ్వో, హనుమకొండ జిల్లా -
హైదరాబాద్లో పెరుగుతున్న స్మార్ట్ ఇళ్లు..
సాక్షి, సిటీబ్యూరో: కరోనా తర్వాత ఇంటి స్వరూపం మారిపోయింది. ఇంటిలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారిత భద్రతా ఉపకరణాల వినియోగం పెరిగింది. రియల్ టైమ్లో ట్రాక్ చేసే స్మార్ట్ కెమెరాలు, డిజిటల్ లాక్స్, స్మార్ట్ వీడియో డోర్ బెల్స్, లైట్లు, కర్టెన్లు ప్రతిదీ స్మార్ట్గా మారిపోయాయి. వేలిముద్ర, ఐరిష్ చూపిస్తే చాలు ఆటోమెటిక్గా ఇంటి తలుపులు తెరుచుకుంటాయి.ఇంట్లో మనం లేకపోయినా ఎవరైనా అతిథులొస్తే ఫోన్లో నుంచే గుమ్మం తెరిచి స్వాగతం పలకొచ్చు. గదిలోకి రాగానే లైట్లు వాటంతటవే ఆన్, ఆఫ్ అవుతుండటం వంటి ఎన్నో ప్రత్యేకతలుంటాయి. చాలా మంది బిల్డర్లు ఇంటి నిర్మాణ సమయంలోనే ఈ స్మార్ట్ ఉపకరణాలను జోడిస్తున్నారు.కోకాపేట, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ హైదరాబాద్లోని హైఎండ్ ప్రాజెక్ట్లలో ఈ తరహా ఐఓటీ ఉపకరణాల ప్రాజెక్ట్లు ఎక్కువగా నిర్మాణంలో ఉన్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలు ఉండే వారు వ్యక్తిగత గృహాలలో సైతం వీటిని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరిగా మారింది. -
హైదరాబాద్ : ఘనంగా ఉస్మానియా మెడికల్ కళాశాల స్నాతకోత్సవం (ఫొటోలు)
-
ఉప్పల్లో ప్రాక్టీస్ అదరగొట్టిన SRH, పంజాబ్ ప్లేయర్స్ (ఫొటోలు)
-
నేడు వీర హనుమాన్ విజయ యాత్ర
సుల్తాన్బజార్: వీర హనుమాన్ విజయ యాత్రకు అంతా సిద్ధమైంది. గౌలిగూడ రాంమందిర్ నుంచి తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగనున్న బైక్ ర్యాలీకి వీహెచ్పీ, భజరంగ్దళ్ నాయకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ 17వేల మంది పోలీసు బలగాలతో పాటు సాయుధ బలగాలు బందో బస్తు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శనివారం ఉదయం 8 గంటలకు గౌలిగూడ రాంమందిర్లో విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ ఆధ్వర్యంలో యజ్ఞంతో యాత్ర ప్రారంభం కానుంది. కోఠి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తాలో బహిరంగ సభ.. ర్యాలీలో దాదాపు 2 లక్షల మంది హనుమాన్ భక్తులు బైక్ ర్యాలీగా తరలివచ్చే వారిని ఉద్దేశించి కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో వీహెచ్పీ, భజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ తలపెట్టారు. కార్యక్రమానికి ముఖ్య వక్తగా విశ్వహిందూ పరిషత్ నేత, పార్లమెంట్ మాజీ సభ్యుడు రామ్విలాస్ దాస్ వేదాన్ పాల్గొంటారు. శోభా యాత్ర రూట్ ఇలా.. వీర హనుమాన్ విజయయాత్ర ఉదయం 8 గంటలకు యజ్ఞంతో ప్రారంభమై వివిధ శకటాలతో గౌలిగూడ రాంమందిర్ నుంచి కోఠి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా, సుల్తాన్బజార్ చౌరస్తా, రాంకోఠి క్రాస్రోడ్, కాచిగూడ క్రాస్రోడ్, వైఎంసీఏ మీదుగా నారాయణగూడ ఫ్లైఓవర్, ఆర్టీసీ క్రాస్రోడ్ అశోక్నగర్ క్రాస్రోడ్, గాం«దీనగర్, బన్సీలాల్పేట్ జంక్షన్, బైబిల్ హౌస్, బాటా, రాంగోపాల్పేట్, సీటీఓ జంక్షన్, రాయల్ ప్యాలెస్ నుంచి తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు సాగుతుంది. -
హైదరాబాద్లో క్విక్ కామర్స్ హవా
కిరాణా సరుకులు కావాలా? 10 నిమిషాల వ్యవధిలోనే ఇంటి వద్దకే వచ్చేస్తాయి! సొంత మొబైల్లోని క్విక్ కామర్స్ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన తరువాత నిమిషాలలోపే ఇంటికి అవసరమైన బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు వంటి కిరాణా సరుకులన్నీ వచ్చేస్తున్నాయి. ఆన్లైన్ ఈ కామర్స్ యాప్స్ ద్వారా క్విక్ కామర్స్ (త్వరిత వాణిజ్యం) దేశంలో ప్రస్తుతం 31.33 శాతం వార్షిక వృద్ధిరేటుతో వేగంగా విస్తరిస్తోంది. కాగా 2025–2030 మధ్య సంవత్సరానికి 44.9 శాతం వృద్ధి రేటుతో ఈ రంగం దూసుకుపోనుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో టెక్ జనం ఎక్కువ కావడంతో తెలంగాణలో క్విక్ కామర్స్ (Quick Commerce) మరింత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బిగ్బాస్కెట్, జెప్టో, స్విగ్గీ, బ్లింకిట్, డంజో లాంటి సంస్థలు రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు మరిన్ని నగరాల్లో వినియోగదారుల ఇళ్లకే గ్రోసరీని తీసుకెళ్తూ ఆదరణ పొందుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా వేర్హౌజ్ ఏర్పాటు చేసుకొని ఈ–కామర్స్ వ్యాపారంలో దూసుకుపోతున్న అమెజాన్ సంస్థ ‘అమెజాన్ తేజ్’ పేరుతో క్విక్ కామర్స్ రంగంలో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ‘జెప్టో’ సంస్థ అత్యధిక వృద్ధిరేటుతో హైదరాబాద్ మార్కెట్ను ఆక్రమించుకుంటోంది. కాగా ‘అమెజాన్ తేజ్’ రంగంలోకి దిగితే పరిస్థితి ఆ సంస్థకు అనుకూలంగా మారుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కాగా రాష్ట్రంలో హైదరాబాద్లో మొదలైన క్విక్ కామర్స్ జోరు వరంగల్, కరీంనగర్ (Karimnagar) వంటి నగరాలకు కూడా విస్తరిస్తోంది. – సాక్షి, హైదరాబాద్ఎక్కడికక్కడ గోడౌన్లతో...క్విక్ కామర్స్ అంటే కిరాణా సరుకులు, చిరుతిండ్లు, ఇంటి సామగ్రి కొన్ని నిమి షాల్లోనే వినియోగదారుని ఇంటికి చేర్చడ మే. తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున గోడౌన్లు ఏర్పాటు చేసుకొని బిగ్బాస్కెట్ (బీబీ నౌ), అమెజాన్ (తేజ్), జెప్టో, స్విగ్గీ (ఇన్స్టా మార్ట్), బ్లింకిట్, డంజో మొదలైన సంస్థలు క్విక్ కామర్స్ రంగంలో పనిచేస్తున్నాయి. బిగ్ బాస్కెట్ సంస్థకు హైదరాబాద్లో దాదాపు 400 వరకు చిన్న గిడ్డంగులు ఉండగా, గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉండే వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. అమెజాన్ ఇప్పటికే 24 గంటల్లో సేవలు అందించేలా ఈ కామర్స్ (e Commerce) వ్యాపారంలో దూసుకుపోతుండగా, కొత్తగా హైదరాబాద్ కేంద్రంగా ‘తేజ్’ సేవలను ప్రారంభించ నుంది. తద్వారా కిరాణా, చిన్నస్థాయి విద్యుత్ సామగ్రి, పండ్లు వంటి వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. జెప్టో సంస్థ కిరాణా, చిరుతిండ్లు, సౌందర్య సామగ్రితో పాటు గృహావసరాలకు అవసరమైన అన్నింటినీ 10 నిమిషాల్లో సరఫరా చేసే హామీతో దూసుకుపోతుంది.గచ్చిబౌలి, హైటెక్సిటీ, బంజారాహిల్స్ (Banjara hills) మొదలుకొని హైదరాబాద్ లోని అడ్డగుట్ట, పాతబస్తీ వంటి వందలాది ప్రాంతాల్లో గ్రోసరీ గోడౌన్లను ఏర్పాటు చేసుకొని సేవలు అందిస్తుంది. ఇక హోటళ్ల నుంచి ఆహారాన్ని వినియోగదారులకు అందించే సేవల్లో ఉన్న స్విగ్గీ కూడా క్విక్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. స్విగ్గీ ఇన్స్టా మార్ట్ పేరుతో కిరాణా, ఇంటి సామగ్రితో పాటు మెడికల్స్ను కూడా 15 నుంచి 20 నిమిషాల్లో సరఫరా చేస్తోంది. హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్లోనూ ఈ సంస్థ విస్తరించడం గమనార్హం. గ్రోఫర్స్ పేరుతో దశాబ్దం క్రితం ప్రారంభమై పేరు మార్చుకొని ‘బ్లింకిట్’గా సేవలందిస్తున్న మరో సంస్థ కూడా హైదరాబాద్లో జొమాటో సహకారంతో పెద్దఎత్తున గోడౌన్లను ఏర్పాటు చేసుకొని వినియోగదారులకు సేవలు అందిస్తోంది. డంజో అనే మరో సంస్థ కూడా క్విక్ కామర్స్ రంగంలో హైదరాబాద్లో సేవలు అందిస్తోంది.హైదరాబాద్లో క్విక్ కామర్స్ వాటా 10 శాతం 2024 చివరి నాటికి భారతదేశంలో క్విక్ కామర్స్ మార్కెట్ విలువ సుమారు 5 బిలియన్ డాలర్లు. ఇది 2025 చివరి నాటి కి 6–7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్లో రిటైల్ మార్కెట్ (Retail Market) సుమారు రూ. 20,000 –25,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తే, క్విక్ కామర్స్ వాటా దాదాపు 8 నుంచి 10 శాతం ఉంటుంది. అంటే రూ. 8,000 కోట్ల నుంచి రూ. 2,500 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ వాటా యువత, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కామర్స్ సంస్థలకు వచ్చే ఆర్డర్లు ప్రతిరోజూ లక్ష నుంచి లక్షన్నర వరకు ఉండొచ్చని అంచనా. వీటి విలువ రూ. 5 కోట్లకు పైనే ఉండొచ్చు. కాగా ఈ క్విక్ కామర్స్ మార్కెట్లో కూడా బిగ్ బాస్కెట్ (Big Basket) సంస్థ ప్రధాన వాటాను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ ఇవే30 నుంచి 40 శాతం వాటా ఈ సంస్థకే ఉండగా, ఇప్పుడు జెప్టో, బ్లింకిట్ సంస్థలు పోటీ పడుతున్నాయి. జెప్టో 5 నుంచి 10 నిమిషాల్లో నిత్యా వసర వస్తువులు, కూరగాయలు, పండ్లతో పాటు వినియోగదారుడు కోరిన వస్తువులన్నింటినీ అందిస్తూ ఇప్పటికే 20 శాతం వాటాను సొంతం చేసుకొని మరింత వేగంగా విస్తరిస్తోంది. వినియోగదారులకు ఆఫర్లతో ఈ సంస్థ హైదరాబాద్లో క్విక్ కామర్స్ రంగంలో తన ఆధిపత్యాన్ని పెంచుకుంటోంది. అమెజాన్ (Amazon) సంస్థ ‘తేజ్’ ద్వారా క్విక్ కామర్స్ రంగంలో 20 శాతం వా టాను సొంతం చేసుకునే అవకాశం ఉంది. స్విగ్గీ ఇన్స్టా మార్ట్, బ్లింకిట్, డంజో వంటి సంస్థల వాటా మరో 20 శాతం వరకు ఉంటుంది.భవిష్యత్తులో చిన్న నగరాలకు విస్తరణతెలంగాణలో క్విక్ కామర్స్ రంగం మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్తో పాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి నగరాలతో పాటు హైదరాబాద్ను ఆనుకొని ఉన్న కొన్ని పట్టణాలకు కూడా ఈ సేవలు అందనున్నాయి. అమెజాన్ ‘తేజ్’ రాకతో పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. వేగం, నాణ్యత, తక్కువ ధరలు ఇచ్చే సంస్థలే ఈ రంగంలో పైచేయి సాధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్ జగ్జీవన్కుమార్, రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్ఆర్సీ) చైర్మన్గా మరో రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నియమితులయ్యారు. హెచ్ఆర్సీ సభ్యులుగా శివాడి ప్రవీణ, బి.కిషోర్లను ప్రభుత్వం నియమించింది.దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 5 తేదీన (శనివారం) సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన సెలక్షన్ కమిటీ అభ్యర్థుల జాబితాను వడపోసి వీరి పేర్లను ఖరారు చేశారు.జస్టిస్ ఏ.రాజశేఖర్రెడ్డి ప్రొఫైల్ నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సిర్సనగండ్ల గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో 1960, మే 4న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జయప్రద, రామానుజరెడ్డి. హైదరాబాద్లోని ఏవీ కాలేజీ నుంచి పట్టభద్రులైన ఆయన కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బంగారు పతకం పొందారు. 1985, ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. తొలుత మహమూద్ అలీ వద్ద ప్రాక్టీస్ చేశారు. నాలుగేళ్ల తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్ మొదలెట్టారు.2004లో హైకోర్టు న్యాయవాదుల సంఘం (హెచ్సీఏఏ) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2004లో కేంద్ర ప్రభుత్వానికి సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్గా, 2005లో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, సర్వీస్ టాక్స్కు సీనియర్ స్టాండింగ్ కౌన్సెల్గా కూడా పని చేశారు. 2013, ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన.. 2014లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022, ఏప్రిల్లో పదవీ విరమణ చేశారు.జస్టిస్ షమీమ్ అక్తర్ ప్రొఫైల్ 1961, జనవరి 1న నల్లగొండలో రహీమున్నీసా బేగం, జాన్ మహమ్మద్కు జన్మించారు. నల్లగొండ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకామ్ చదివారు. నాగ్పూర్లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి న్యాయపట్టా పొందారు. 1996లో హైదరాబాద్ బషీర్బాగ్లోని పీజీ కాలేజ్ ఆఫ్ లా నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 2006లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. 2002లో నల్లగొండ జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత పలు కోర్టుల్లో పనిచేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా, ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్గా విధులు నిర్వహించారు. హైకోర్టులో రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా పనిచేశారు. 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2022 డిసెంబర్లో పదవీ విరమణ చేశారు. -
శిక్షణే వినూత్న లక్షణం..! వేసవి సెలవులను ఉపయోగించుకోండిలా..!
విద్యార్థుల చదువులు, యువత కాలేజీల పోటీ వాతావరణానికి, ఒత్తిడికి వేసవి ఒక విరామం, వినోదం. అయితే హైదరాబాద్ నగరం వేసవి సెలవుల్లో విద్యార్థులు, యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకునేందుకు అనేక సమ్మర్ క్యాంపులకు వేదికగా మారింది. ఇందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం నుంచి సృజనాత్మక రంగాల వరకూ, శారీరక దృఢత్వం నుంచి వ్యక్తిత్వ వికాసం వరకూ విస్తరించి ఉన్న ఈ క్యాంపులు, విద్యా జీవితానికి వెలకట్టలేని అనుభవాలను అందిస్తున్నాయి. ఈ రెండు నెలల కాలాన్ని ఇంటి పట్టునే ఉండి వృథా చేయకుండా ఇటు విజ్ఞానం, అటు వినోదం సమ్మిళితంగా ఈ వేసవి శిబిరాలు ఏర్పాటు చేస్తుండటం విశేషం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు మారుతున్న అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోడానికి ఈ తరం ఎక్కువ ఆసక్తి చూపిస్తోందనేది నిపుణుల మాట. ఇందులో భాగంగా వైట్ హాట్ జేఆర్, కోడింగ్ నింజాస్, హ్యాకర్ కిడ్, ఎస్పీ రోబోటిక్స్ మేకర్ ల్యాబ్ వంటి సంస్థలు ప్రాథమిక స్థాయి నుంచి అడ్వాన్డ్స్ లెవెల్ వరకూ కోడింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి రంగాల్లో శిక్షణ అందిస్తున్నాయి. స్పెషల్ ఇంటర్న్షిప్ మాడ్యూల్స్ సహా ప్రాజెక్టు ఆధారిత శిక్షణ ద్వారా విద్యార్థులకు రియల్–వరల్డ్ పరిజ్ఞానం అందిస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో ఈ సంస్థల శిక్షణా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ తరం కళాత్మకం వైపే.. విద్య, వృత్తి పరమైన నైపుణ్యాలు ఎన్ని ఉన్నా ఏదో ఒక కళలో ప్రావీణ్యముండటం ఈ తరంలో సెలబ్రిటీ హోదాగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా వైరల్స్ పుణ్యమా అని వినూత్న వ్యక్తిత్వానికి కళలు ఒక ప్రామాణికంగా మారాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నగరవాసుల దృష్టి కళల వైపు మళ్లిందనే చెప్పాలి. నగరంలోని రవీంద్ర భారతి అకాడమీ, శిల్పా రామం ఆర్ట్ క్యాంప్, కల్పతరు వంటి విభిన్న కళా వేదికలు, సంస్థలు.. పెయింటింగ్, సంగీతం, నృత్యం, థియేటర్ ఆర్ట్స్ వంటి రంగాల్లో వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా శిల్పారామం ప్రాంగణంలో నిర్వహించే కళాకారుల వర్క్షాపులు, విద్యార్థులకు దేశీయ కళల పట్ల అవగాహన పెంపొందించడంలో మైలురాయిగా నిలుస్తున్నాయి. ఫిట్ అండ్ స్పోర్ట్స్.. నగర వాసుల సక్సెస్ మంత్ర ఏదైనా ఉందంటే.. అది ఆరోగ్యం, ఫిట్నెస్ అని ఠక్కున చెప్పేస్తారు. ఆరోగ్య శిక్షణ, క్రీడలు, ఫిట్నెస్ రంగాలకు నగరంలో మంచి డిమాండ్, ఆదరణ ఉంది. అంతే కాకుండా ఈ రంగాల్లోని శిక్షణా అంశాలపై హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ స్థాయి కేంద్రాలు ఉండటం విశేషం. డెకథ్లాన్ అకాడమీ, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఫిట్ కిడ్స్ హైదరాబాద్ వంటి సంస్థలు స్విమ్మింగ్, యోగా, మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్ ట్రైనింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఈ శిక్షణల ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, క్రమశిక్షణ, టీం వర్క్, ఫోకస్ వంటి విలువలు పెంపొందుతున్నాయి. అంతేకాకుండా కేవలం చదువులు మాత్రమే కాదు.. క్రీడలతోనూ అంతర్జాతీయ గుర్తింపు, ఉన్నత స్థాయి జీవితానికి నాంది పలకవచ్చని చెప్పడానికి పలువురు నగర క్రీడాకారులే నిదర్శనం. చేయూతనిస్తే అద్భుతాలే.. సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులు, యువత కొత్త ప్రపంచాన్ని అన్వేíÙంచే అవకాశం పొందుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లోని ఆసక్తులను గుర్తించి, అనుగుణమైన శిక్షణలకు ప్రోత్సహించగలిగితే, వారు భవిష్యత్తులో విశ్వాసంతో ముందుకు సాగుతారని నిర్వాహకులు, నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసానికీ పెద్దపీట.. అదనపు నైపుణ్యాలను కోరుకునే నగర వాసులు ఎవరైనా సరే.. వ్యక్తిత్వ వికాస శిక్షణలో ప్రవేశించడానికే మొగ్గు చూపుతున్నారు. వీరి ఆసక్తికి అనుగుణంగా ది పర్సనాలిటీ స్కూల్, టైమ్ కిడ్స్, ఉద్భవ్ అకాడమీ వంటి ప్రత్యేక సంస్థలు కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్, లీడర్షిప్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఇవి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో, యువత భవిష్యత్తుకు మార్గం చూపడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగాలను పొందడంలోనూ, ఉపాధి రంగాల్లో రాణించడంలోనూ ఈ వ్యక్తిత్వ వికాస శిక్షణ ఎంతో ఆత్మ విశ్వాసాన్ని, స్థైర్యాన్ని పెంపొందిస్తుందని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతున్న మాట. (చదవండి: సమ్మర్లో కాటన్ డ్రెస్లతో స్టైలిష్గా ఉండొచ్చు ఇలా..!) -
HYD: హిట్ అండ్ రన్ కేసు.. కారు ఢీకొని బీఫార్మసీ విద్యార్థిని మృతి
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్ అబ్దుల్లా పూర్ మెట్లో హిట్రన్ కేసు నమోదైంది. ఈ దుర్ఘటనలో బైక్పై వెళుతున్న యువతి దుర్మరణం చెందగా.. యువకుడు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.హైదరాబాద్ పోలీసుల వివరాల మేరకు.. గురువారం రాత్రి తెనాలికి చెందిన ప్రదీప్ వర్మ మద్యం సేవించాడు. అనంతరం, తన స్కోడా కారుతో బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో కోహెడ వద్ద తన కారుతో బైక్ను ఢీ కొట్టాడు. అక్కడి నుంచి కారుతో పరారయ్యాడు. ప్రదీప్ వర్మ కారు ఢీకొట్టడంతో బైక్పై వెళుతున్న బీఫార్మసీ విద్యార్థిని స్పందన అక్కడికక్కడే మరణించింది. ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే బైక్ను ఢీకొట్టిన తరువాత కోహెడ నుంచి చైతన్యపురి వస్తుండగా ప్రదీప్ కారుపై పోలీసులకు అనుమానం వచ్చింది. కారు అద్దం పగలడం, అనుమానాస్పదంగా డ్రైవ్ చేస్తుండటంతో ప్రదీప్ కారును చైతన్య పురి పోలీసులు అడ్డగించారు. కారును ఆపి ప్రశ్నించారు. కారు డ్యామేజ్ అయ్యింది.. రిపేర్కి వెళ్తున్నానని ప్రదీప్ బుకాయించే ప్రయత్నం చేశాడు. అద్దంపై రక్తపు మరకలు, జుట్టు ఉండటంతో.. అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. కోహెడ వద్ద ప్రమాదం జరిగినట్లు సమాచారం రావడంతో.. అక్కడ యాక్సిడెంట్ చేసింది ఈ కారే అని చైతన్యపురి పోలీసులు గుర్తించారు. హిట్ అండ్ రన్లో మృతి చెందిన విద్యార్థిని కొప్పు స్పందన(19)ది యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం చిల్లపూర్ స్వగ్రామం. ఘట్ కేసర్లోని ప్రైవేట్ హాస్టల్లోఉంటూ నగరానికి చెందిన ఓ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతోంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
హైదరాబాద్లో భారీ వర్షం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో భారీ గాలులు మొదలయ్యాయి. పలు చోట్ల వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, పంజాగుట్ట, అమీర్పేట్ ఎస్ఆర్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడు గంటల పాటు హైదరాబాద్ నగరంలో గాలి దుమారంతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.తెలంగాణలో పలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ భద్రాద్రి ములగు భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది.హైదరాబాద్లో హైడ్రా డిజాస్టర్ టీం అప్రమత్తమైంది. మొదలైన భారీ గాలులు వీస్తుండటంతో చెట్ల కొమ్మలు విరిగిపడే ప్రమాదాలు అధికంగా ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ ప్రజలను అధికారులు సూచించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి సర్దార్ నగర్, రావిరాల,తుక్కుగూడ, శ్రీనగర్, ఇమామ్ గూడా, హర్షగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాష్టంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గాలిలో తేమ శాతం పెరిగి గాలి దుమారంతో వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్లో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. వికారాబాద్, సంగారెడ్డిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఈ రెండు జిల్లాలకు వచ్చే మూడు గంటల పాటు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో వచ్చే మూడు గంటల పాటు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. -
‘ఉప్పల్’లో మరింత ఫాస్ట్గా జియో నెట్వర్క్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా క్రికెట్ ఉత్సాహం ఊరకలెత్తుతున్న తరుణంలో ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ప్రేమికులకు నిరవధిక డిజిటల్ అనుభవం అందించేందుకు రిలయన్స్ జియో ముందుకు వచ్చింది. ప్రతి మ్యాచ్ కు 50,000 మందికి పైగా ప్రేక్షకుల రాకను దృష్టిలో పెట్టుకుని, జియో తన 4జీ, 5జీ నెట్వర్క్ ను స్టేడియం లోపల, బయటా బలోపేతం చేసింది.మ్యాచ్ హైలైట్లు రికార్డ్ చేయడం దగ్గర నుంచి వీడియో కాల్స్ చేయడం వరకు.. స్టేడియంలో ఉన్న అభిమానులు ఇప్పుడు జియో అత్యాధునిక మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవల ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ను ఆస్వాదించగలుగుతున్నారు. స్టేడియంలో జియో హై-స్పీడ్ ‘జియోనెట్’ వై-ఫై సేవలను కూడా అందిస్తోంది. జియోనెట్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడానికి స్మార్ట్ఫోన్ ఉంటే చాలు. మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి, ఓటీపీతో నిర్ధారించిన తర్వాత, జియో నెట్ కు కనెక్ట్ అవుతారు. ప్రతి సెషన్ కస్టమర్ కు 480 నిమిషాల హై-స్పీడ్ వైఫైని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.దేశవ్యాప్తంగా ప్రధాన క్రికెట్ స్టేడియాలలో 2,000 కంటే ఎక్కువ ప్రత్యేక సెల్లను ఏర్పాటు చేసి, జియో ఈ సీజన్లో నెట్వర్క్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది. స్టాండలోన్ 5జీ ఆర్కిటెక్చర్, నెట్వర్క్ స్లైసింగ్, క్యారియర్ అగ్రిగేషన్ సాంకేతికత ఆధారంగా ఈ వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు, అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన 5జీ అనుభవాన్ని అందిస్తున్నాయి. -
TG: ఎన్నారై అడ్వయిజరీ కమిటీ నియామకం
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్నారై పాలసీపై అధ్యయనం చేయడానికి అడ్వయిజరీ కమిటీని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం జీవో విడుదల చేశారు. రెండేళ్ల కాలపరిమితి గల ఈ కమిటీ చైర్మన్గా ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ అధికారి, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ గా గల్ఫ్ వలసల నిపుణులు మంద భీంరెడ్డి లను నియమించారు. జిఎడి ప్రోటోకాల్, ఎన్నారై విభాగానికి చెందిన జాయింట్ సెక్రెటరీ స్థాయి ఐఏఎస్ అధికారి కమిటీకి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. కమిటీలో గౌరవ సభ్యులుగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ లను నియమించారు. గల్ఫ్ వలసలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కలిగిన ప్రవాసీ కార్మిక నాయకులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, డా. లిజీ జోసెఫ్, చెన్నమనేని శ్రీనివాస రావు, కొట్టాల సత్యంనారా గౌడ్, గుగ్గిల్ల రవిగౌడ్, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల లను కమిటీ సభ్యులుగా నియమించారు. సీఎం హామీ నేపథ్యంలో..గత సంవత్సరం ఏప్రిల్ 16న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ తాజ్ దక్కన్ లో గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గల్ఫ్ తదితర గమ్యస్థాన దేశాలలోని అల్పాదాయ తెలంగాణ వలస కార్మికులకు ఆయా దేశాలలో లభిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. దేశంలోని కేరళ, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో గల్ఫ్ కార్మికులకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రవాసీ కార్మికుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, పరిష్కారాలను కనుగొనడానికి ఈ కమిటీ గల్ఫ్ దేశాలను కూడా సందర్శిస్తుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా... సమగ్ర ప్రవాస భారతీయుల విధానం (ఎన్నారై పాలసీ) రూపకల్పనతో పాటు, తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ తదితర దేశాల్లోని తెలంగాణ ప్రవాసీ కార్మికుల సంక్షేమ బోర్డు) ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. -
మందు బాబులకు షాక్.. ఎల్లుండి వైన్ షాపులు బంద్
సాక్షి, హైదరాబాద్: ఎల్లుండి(శనివారం) వైన్ షాపులు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలలో మద్యం షాపులు షాపులు బంద్ కానున్నాయి. ఈనెల 12వ తేదీన హనుమాన్ జయంతి నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు.పోలీసుల ఆదేశాలతో ఈ నెల 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి... మరుసటి రోజు 13వ తేదీ ఉదయం 6 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మద్యం దుకాణాలతో పాటు బార్లు, కల్లు కాంపౌండ్లు కూడా మూసివేయాలని పోలీసులు స్పష్టం చేశారు. పోలీస్ శాఖ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవంటూ సీపీ హెచ్చరించారు.రహస్యంగా మద్యం విక్రయాలు జరిపితే లైసెన్స్ కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. హనుమాన్ జయంతి రోజున మతపరమైన అల్లర్లు చోటు చేసుకుంటాయనే నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. -
హైదరాబాద్ సహా తెలంగాణలో పలు చోట్ల వాన
హైదరాబాద్, సాక్షి: క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల గురువారం మధ్యాహ్నాం నుంచి వర్షాలు మొదలయ్యాయి. రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తోంది. దీంతో ఉక్కపోత నుంచి ప్రజలు ఊరట పొందుతున్నారు.హైదరాబాద్ నగరంలో.. మియాపూర్, చందానగర్, మదీనాగూడ, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వాన కురిసింది. సాయంత్రంకల్లా మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షం పడే అవకాశం ఉంది. ఇక.. నారాయణఖేడ్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వానలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రాత్రికల్లా.. సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రెండు, మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రైతాంగం అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచనలు జారీ చేసింది.ఆరెంజ్ అలర్ట్జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలున్నాయి. ఈ క్రమంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. -
జింకల మృతికి కారణమైన వారిపై చర్యలేవీ?: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో నియమ నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు మండిపడ్డారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అన్ని ఆధారాలతో క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులతో సుప్రీం కోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని కలిశామన్నారు. రైతు ఒక్క చెట్టు కొడితే కేసు నమోదు చేస్తున్నారు.. రైతుకు ఒక చట్టం.. రేవంత్ రెడ్డికి ఒక చట్టమా?’’ అంటూ హరీష్రావు ప్రశ్నించారు.‘‘కంచె చేను మేసినట్టిగా ప్రభుత్వం వేలాది చెట్లు నరికివేసింది. వైల్డ్ లైఫ్ యాక్ట్, వాల్టా యాక్ట్ ఉల్లంఘించి ప్రభుత్వం వ్యవహరించింది. మూడు జింకలు చనిపోయాయి. వన్య ప్రాణుల గూడును చెదరగొట్టారు. జింకల మృతికి కారణమైన అధికారులపైన చర్యలేవీ? పర్యావరణ విధ్వoసం జరిగితే అటవీ అధికారులు నిద్ర పోతున్నారా?. ప్రైవేట్ భూమి అయినా అందులో చెట్లు పెరిగితే అందులో వన్య ప్రాణులు గూడు ఏర్పాటుచేసుకుంటే అది అటవీ భూమిగా పరిగణిస్తారు. 10 హెక్టార్ల కంటే ఎక్కువ భూమి ఉంటే.. అందులో చెట్లు ఉంటే అది అటవీ భూమిగానే పరిగణిస్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కంచ గచ్చిబౌలిలో చెట్లు నాటారు’’ అని హరీష్రావు గుర్తు చేశారు.హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ సెలవు దినాలు చూసుకుని మరి జేసీబీలతో చెట్లు నరికివేశారు. కంచ గచ్చి బౌలి భూములు హెచ్సీయూ అధీనంలో ఉందని గతంలోనే ఆర్డీవో, కలెక్టర్ కలెక్టర్ లేఖ రాశారు. సీఎం రేవంత్ ఈ భూమిని మాడ్యూగేట్ చేసి 10 వేల కోట్ల అప్పు తెచ్చారు. అప్పు ఇప్పించిన బ్రోకర్కు 169 కోట్ల 83 లక్షలు చెల్లించారు. ఈ భూములను అమ్మి సీఎం రేవంత్ 40 వేల కోట్లు తేవాలని సీఎం రేవంత్ ప్రయత్నం’’ అంటూ హరీష్రావు ఆరోపించారు.సుప్రీoకోర్టు ఆదేశాల ఉల్లంఘన జరుగుతుంది. నిన్న సాయంత్రం టీజీఐఐసీ భూమి అని బోర్టులు ఏర్పాటు చేశారు. కంచ భూముల విధ్వంసంలో పోలీస్ శాఖ పాత్ర కూడా ఉంది. గతంలో కొత్త సచివాలయం నిర్మించే సమయంలో చెట్లు నరకొద్దంటూ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్లిన రేవంత్కు ఇన్ని చెట్లు నరకొద్దూ అని తెలియదా?. యూనివర్సిటీ భూములు తమకే చెందాలని విద్యార్థులు అడిగితే వారిపై కేసులు పెట్టారు. ఈ ప్రభుత్వం శాశ్వతo కాదు’’ అని హరీష్రావు వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్ సిటీలో ప్రతిష్టాత్మక జాజ్ ఫెస్టివల్
ప్రతిష్టాత్మక వరల్డ్ జాజ్ ఫెస్టివల్కు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. వరల్డ్ జాజ్ ఫెస్టివల్ ఆధ్వర్యంలోని 5వ ఎడిషన్ ఢిల్లీతో ప్రారంభమవుతుంది. ఈ ఫెస్టివల్లో భాగంగా ఢిల్లీ అనంతరం పుణె, బెంగళూరు, ముంబైలలో కొనసాగి హైదరాబాద్లో ముగింపు పలుకనుంది. నగరంలోని శిల్పకళా వేదికగా ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ ఈ జాజ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్టివల్లో నెదర్లాండ్స్, సెర్బియా, టర్కీ, బెల్గ్రేడ్, బ్రెజిల్ తదితర దేశాల నుంచి ప్రముఖ సంగీత కళాకారులు పాల్గొంటారు. 2020లో ప్రారంభించిన ఈ ఉత్సవం ప్రపంచం నలుమూలల నుంచి జాజ్ సంగీతానికి విశ్వవ్యాప్త వేదికను ఏర్పాటు చేసింది. దీనికి ముంబై, పుణె, బెంగళూరులో అద్భుత ప్రశంసలు లభించాయి.ఉత్సవానికి వివిధ దేశాలకు చెందిన కాన్సులేట్ అధికారులు, అగ్రశ్రేణి కార్పొరేట్ ప్రముఖులు, ప్రసిద్ధ మీడియా ప్రముఖులు పాల్గోనున్నారు. ఈ ఉత్సవం ప్రపంచంలోని అతిపెద్ద జాజ్ సంగీత ఉత్సవాల్లో ఒకటైన నెదర్లాండ్స్కు చెందిన అమెర్స్ఫోర్ట్ జాజ్ ఫెస్టివల్తో కలిసి నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్లో రౌండ్ మిడ్నైట్ ఆర్కెస్ట్రా గ్రాజియెల్లా హన్సెల్ రివెరో, లూకాస్ సాంటానా (బ్రెజిలియన్), దక్షిణాఫ్రికా జాజ్ సంచలనం డారెన్ ఇంగ్లిష్, ఫెమ్కే మూరెన్ గ్రూప్ కరోలినా బ్రస్సే, ఆస్ట్రేలియన్ సాక్స్ మెజీషియన్ ఆడమ్ సిమ్మన్స్, పాంగ్ సాక్స్ప్యాక్గర్ల్ తదితర పాన్ వరల్డ్ ఆర్టిస్టులు జాజ్ మ్యూజిక్తో సందడి చేయనున్నారు.18న నగరంలో వైట్థాన్–2025కంటి క్యాన్సర్పై అవగాహన, నిధుల సేకరణ నిమిత్తం ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మే 18న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ‘వైట్థాన్–2025’ జరుగానుంది. ఇందులో భాగంగా బుధవారం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, ఐ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హెడ్ డాక్టర్ స్వాతి కలికి మాట్లాడుతూ కంటి క్యాన్సర్పై అవగాహన, నిధుల సేకరణే ఈ రన్ ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రాథమిక దశలోనే దీనిని గుర్తించవచ్చన్నారు. కంటి క్యాన్సర్తో పోరాడుతున్న పేద పిల్లలకు ఉచితంగా చికిత్స అందించనున్నామని తెలిపారు. ఈ ఏడాది అధికారిక మస్కట్ ‘పియర్లీ’ అన్నారు. ఇది కంటిలో ‘వైట్ రిఫ్లెక్స్’ (లూయకోకోరియా)ను ప్రదర్శిస్తుందన్నారు. ఇది రెటినోబ్లాస్టోమా క్యాన్సర్ లక్షణాల్లో ఒకటన్నారు. తల్లిదండ్రులు, సంరక్షకులు వైద్య సహాయం పొందాలన్న సందేశాన్ని ప్రచారం చేయడంలో సహాయపడుతుందన్నారు.21 కేఎం, 10 కేఎం, 5కేఎం, 3కేఎం రన్స్ ఉన్నాయన్నారు. ఈ ఏడాది కొత్తగా పరిచయం చేసిన 21 కేఎం హాఫ్ మారథాన్ ఉందన్నారు. గత కొన్నేళ్లుగా ఈ రన్ ద్వారా సమీకరించిన నిధులతో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉచితంగా మూడు వేలకు పైగా చికిత్సలు చేసిందన్నారు. ఇలాంటి కేసుల్లో 90 శాతం పిల్లల ప్రాణాలు కాపాడగలిగామన్నారు. అయితే చికిత్సకు ఆలస్యంగా రావడం వల్ల కేవలం 45 శాతం కేసుల్లో మాత్రమే చూపు తేగలిగామన్నారు. ప్రాథమిక దశలో రెటినోబ్లాస్టోమాను గుర్తించగలిగితే సులభంగా చికిత్స చేయవచ్చని తెలిపారు. వైట్థాన్ కోసం మే 18 లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 99591 54371, 99639 80259 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.సాలార్జంగ్ మ్యూజియంలో ఫొటో ఎగ్జిబిషన్ సాలార్జంగ్ మ్యూజియంలోని సెంట్రల్ బ్యాంక్ సాలార్జంగ్ మ్యూజియం ఆధ్వర్యంలో భగవాన్ మహావీర్పై ఏర్పాటు చేసిన 62వ స్పెషల్ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ను సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ ఆశీష్ గోయల్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాలార్జంగ్ మ్యూజియం క్యూరేటర్లు ఘన్శ్యామ్ కుసుం, ఆర్బి.నాయక్, అసిస్టెంట్ కమాండెంట్ మురళీధరణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
వార్నీ.. ఎయిర్పోర్టును కూడా వదలరా!
మనోళ్లకు ఖాళీ స్థలం కనబడితే చాలు చెత్తంతా డంప్ చేసేస్తారు. ఇంటిలోని చెత్తనంతా మూటకట్టి మరీ ఖాళీ జాగాల్లోకి విసిరేస్తుంటారు. ఇక నగరాల్లో అయితే చెప్పాల్సిన పనిలేదు. హైదరాబాద్లో ఎయిర్పోర్టును వద్దల్లేదీ 'చెత్త మనుషులు'. బేగంపేట ఎయిర్పోర్టును ఆనుకుని ఉన్న కాలనీల నుంచి చెత్త ముంచెత్తడంతో బల్దియా అధికారులు రంగంలోకి దిగారు. ఎయిర్పోర్టులో చెత్త వేయొద్దంటూ దండోరా వేయించి మరీ చెప్పారు.బేగంపేట ఎయిర్పోర్ట్ (Begumpet Airport) ప్రహరీని ఆనుకుని ఉన్న బస్తీ నివాసితులు తమ ఇళ్ల నుంచి వచ్చే చెత్తా చెదారం, ఇతరత్రా వ్యర్థాలను ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో వేయకుండా జీహెచ్ఎంసీ శానిటేషన్ వాహనాలకు అందించాలంటూ బుధవారం ఆయా బస్తీల్లో అవగాహన (Awareness) కలిగించారు.ఎయిర్పోర్ట్ సమీప బస్తీలైన శ్యాంలాల్ బిల్డింగ్స్ తాతాచారి కాలనీ, భగత్సింగ్ నగర్ తదితర బస్తీలకు చెందిన ప్రజలు ఇళ్లలోని వ్యర్థాలను విమానాశ్రయ ప్రాంగణంలోకి వేస్తున్నారు. వీటిని తినడానికి వివిధ రకాల పక్షులు వస్తున్నాయి. ఈ క్రమంలో టేకాఫ్ అయ్యే, ల్యాండింగ్ అయ్యే క్రమంలో విమానాలకు ఇవి అడ్డుగా వస్తున్నాయి. ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో చెత్త, వ్యర్థాలను పడేయడంతో కలుగుతున్న ఇబ్బందులను ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు జీహెచ్ఎంసీ (GHMC) దృష్టికి తీసుకువచ్చారు.చదవండి: ఇక 15 నిమిషాల్లోనే ల్యాండ్ రిజిస్ట్రేషన్ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ (Airport Authority) అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ బేగంపేట సర్కిల్ డీసీ డాకూ నాయక్, శానిటేషన్ సిబ్బంది ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యర్థాలను విమానాశ్రయం ప్రాంగణంలోకి డంప్ చేయవద్దని ఇంటింటికి తిరిగి అవగాహన కలిగిచారు. అలాగే డప్పు చాటింపు వేయించారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ట్రాలీ ఆటోల్లోనే చెత్త వేయాలని సూచించారు. కార్యక్రమంలో శానిటేషన్ అధికారులు ఎస్ఎస్ ధనాగౌడ్, జవాన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. డీఆర్ఎఫ్ బృందాలకు హైడ్రా కమిషనర్ కితాబుహైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు చేసిన డీఆర్ఎఫ్ బృందాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) అభినందించారు. బుధవారం హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను, గత వారం కురిసిన భారీ వర్షం నేపథ్యంలో మూసీనదిలో చిక్కుకున్న ఇద్దరిని డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి.బుద్ధభవన్లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో వీరిని అభినందించిన రంగనాథ్ ప్రమాదం ఎలా వస్తుందో తెలియదని, డీఆర్ఎఫ్ బృందాల అనునిత్యం అప్రమత్తతతో ఉండాలని సూచించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లు చేసిన డీఆర్ఎఫ్ మార్షల్ ఫకృద్దీన్, సహాయక సిబ్బంది ఎ. రమేష్, ఎన్.శ్రీనివాస్, ఎండీ ఇమాముద్దీన్, కె.కార్తీక్ కుమార్లను రంగనాథ్ ప్రశంసించారు. -
లేడీస్ హాస్టల్లోకి ఎందుకెళ్లావ్ బ్రో
-
Hyderabad: క్షణికావేశం..పెను విషాదం!
హయత్నగర్: భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న తగాదా ఇరువురి ఉసురు తీసింది. 11 నెలల బాలుడిని అనాథను చేసింది. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలు పోలీసులు తెల్పిన మేరకు ఇలా ఉన్నాయి. సంపంగి నగేష్ (25), శిరీష(20) భార్యాభర్తలు. రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 11 నెలల కుమారుడు ఉన్నాడు. హయత్నగర్ ముదిరాజ్ కాలనీలో నివసిస్తూ జీహెచ్ఎంసీ కార్మికులుగా పని చేస్తున్నారు. మంగళవారం భార్యా భర్తల మధ్య చిన్న వివాదం తలెత్తింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష క్షణికావేశంలో..ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శిరీష తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నగేష్ ను అదుపులోకి తీసుకున్నారు. బంధువుల పూచీకత్తుతో రాత్రి 9 గంటలకు వదిలి పెట్టారు. ఆవేదనతో భర్త ఆత్మహత్య... భార్య మరణంతో తీవ్ర ఆవేదనకు గురైన నగేష్ బుధవారం తెల్లవారుజామన హయత్నగర్లోని రిలయన్స్ డిజిటల్ షోరూం భవనం పైకి ఎక్కి కిందకు దూకాడు. రక్తం మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించిన పోలీసులు..నగేష్ ఒక్కడే భవనంపైకి ఎక్కి కిందకు దూకినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పాపం పసికందు... భార్యా భర్తలిద్దరూ ఒక రోజు తేడాలో ఆత్మహత్యకు పాల్పడడంతో ముదిరాజ్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన 11 నెలల బాలుడిని చూసి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
హైదరాబాద్ నగరంలో మరో సమగ్ర సర్వే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో వరద నివారణ చర్యల కోసం కిర్లోస్కర్, వాయెంట్స్ సొల్యూషన్స్, జేఎన్టీయూ, ఓయూల నిపుణులు వివిధ సర్వేలు చేసినా, వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో నగరంలో వానొస్తే.. సమస్యలు షరా మామూలుగానే కనిపి స్తున్నాయి. తాము చేపట్టిన చర్యలతో గతంలో కంటే తీవ్రత తగ్గిందని అధికారులు చెబుతున్నా.. ప్రజలు మాత్రం పెదవి విరుస్తున్నారు. రెయిన్వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్తోనూ ఆయా ప్రాంతాల్లో సమస్యలు తగ్గాయని అధికారులు అంటుండగా.. తగ్గలేదని ప్రజలు చెబుతున్నారు. శాటిలైట్ ఇమేజెస్తో నాలాల సర్వే జరపాలని కూడా భావించారు. తాజాగా గ్రేటర్ నగరంలోని నాలాలతోపాటు చెరువులకు సంబంధించి కూడా సమగ్ర సర్వే (comprehensive survey) నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. వివిధ అంశాల వారీగా.. ‘ఇంటిగ్రేటెడ్ స్టార్మ్ వాటర్ మేనేజ్మెంట్’ పేరిట నిర్వహించనున్న ఈ సర్వేలో వెల్లడయ్యే అంశాలతో శాశ్వత నివారణ చర్యటు చేపట్టనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సర్వేలో భాగంగా నగర శివార్ల వరకు ఉన్న నాలాలు, దాదాపు 185 చెరువుల ప్రాంతాల్లోని పరిస్థితుల్ని పరిశీలిస్తారు. నగరంలో ఎంత మోస్తరు వర్షం వస్తే నాలాల్లో, చెరువుల్లో చేరే వరద నీరెంత.. ఎక్కడి నుంచి వాననీరు నాలాల నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తోంది.. నాలాల డిశ్చార్జి సామర్థ్యమెంత.. వరదల వల్ల సదరు నాలా, చెరువుల ప్రదేశాల్లో తరచూ ముంపు బారిన పడే ప్రాంతాలేవీ? ఇలా వివిధ అంశాల వారీగా క్షేత్రస్థాయిలో సర్వే చేయనున్నారు.సర్వే నివేదికకు అనుగుణంగా అవసరమైన పరిష్కార చర్యలు చేపడతారు. ఈ మేరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు పేర్కొన్నారు. అనుమతి వచ్చాక సర్వే చేయనున్నారు. సర్వేలో భాగంగా సమస్యల పరిష్కారానికి ఇప్పటికే చేసిన పనులెన్ని.. వాటివల్ల ఏ మేరకు సమస్య పరిష్కారమైంది.. ఇంకా చేయాల్సిందెంత..? వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైడ్రా, ట్రాఫిక్ విభాగాల సమన్వయంతో.. మరోవైపు ప్రస్తుతం కురుస్తున్న, రాబోయే వర్షాకాలంలో వరద నీరు రోడ్లపై నిల్వకుండా చేసేందుకు హైడ్రా, ట్రాఫిక్ విభాగాల సమన్వయంతో పని చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. నగరంలో రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను ప్రధానంగా 141 ఉన్నట్లు గుర్తించారు. ఈ 141 ప్రాంతాల వద్ద వర్షాల సందర్భంగా ఎదురయ్యే నీటినిల్వ, ట్రాఫిక్ సమస్యల్ని సత్వరం పరిష్కరించేందుకు మూడు విభాగాలతో కమిటీలు ఏర్పాటు చేస్తారు.చదవండి: 15 నిమిషాల్లోనే స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కమిటీలో జీహెచ్ఎంసీతోపాటు హైడ్రా, ట్రాఫిక్ విభాగాల నుంచి సిబ్బంది ఉంటారు. ప్రతి ప్రాంతం వద్ద జీహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది ఉంటారు. వారి నుంచి అందే సమాచారంతో మిగతా విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి నీటి నిల్వ, ట్రాఫిక్ ఇబ్బందులు వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లు సమావేశమైన సందర్భంగా తీసుకున్న నిర్ణయానికనుగుణంగా ఈ చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. -
15 నిమిషాల్లోనే ల్యాండ్ రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు మరింత సులువు కానున్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దస్తావేజుల నమోదు కోసం గంటల తరబడి నిరీక్షించే పనిలేకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. రిజిస్ట్రేషన్ల శాఖ సరికొత్త సంస్కరణలో భాగంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలుకు సిద్ధమైంది. మొదటి దశలో ప్రయోగాత్మకంగా మహా హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 10వ తేదీ(గురువారం) నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలు కానుంది. గ్రేటర్ పరిధిలోని ఆజంపుర, చిక్కడపల్లి, మేడ్చల్ ఆర్వో, కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలుకు రిజిస్ట్రేషన్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజుకు కనీసం 48 స్లాట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వలన జరిగే జాప్యాన్ని నివారించడానికి సబ్–రిజిస్ట్రార్ కార్యాలయా నికి కనీసం రోజు వారి పని వేళలను కనీసం 48 స్లాట్లుగా కేటాయిస్తారు. దస్తావేజుదారులు నేరుగా registration.telangana.gov.in వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ రోజు నిర్దేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోని వారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారు. నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో దస్తావేజులు స్వీకరిస్తారు.144 స్లాట్ల వరకు.. గ్రేటర్ పరిధిలో స్థిరాస్తి దస్తావేజుల తాకిడి అధికంగా గల సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అత్యధికంగా స్లాట్స్ అందుబాటులో ఉంటాయి. 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాలలో ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తారు. ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ ఆఫీసుల్లో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్భందిని నియమించారు. ఈ కార్యాలయంలో 144 స్లాట్స్ అందుబాటులో ఉంటాయి. చదవండి: శామీర్పేట్ కారిడార్పై పీటముడి.. హెచ్ఎండీఏ తర్జనభర్జనమరోవైపు స్లాట్ బుకింగ్ (Slot Booking) విధానాన్ని దష్టిలో పెట్టుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రీ ఆర్గనైజేషన్ చేశారు. అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని అనుసంధానం చేసి పనిభారాన్ని సమానం చేయడానికి చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట–సరూర్నగర్ సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల అధికార పరిధిని విలీనం చేశారు.సొంతంగానే.. స్థిరాస్తి దస్తావేజులు నమోదు చేసుకునే వారు డ్యాకుమెంట్ రైటర్లపై ఆధారపడకుండా స్వయంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి వెబ్సైట్లో ఒక మాడ్యూల్ని ప్రవేశపెట్టారు. మొదటగా సేల్ డీడ్ (Sale Deed) దస్తావేజుల కోసం వెసులుబాటు ఉంది. రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజుపైన అమ్మినవాళ్లు, కొన్నవాళ్లు, సాక్షులు సబ్ రిజిస్ట్రార్ సంతకాలు చేయడానికి చాలా సమయం పట్టడం వలన దస్తావేజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది. దీనిని నివారించడానికి రిజిస్ట్రేషన్ (registration) ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్ ఇ–సిగ్నేచర్ సిస్టంను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఈనెల చివరిలోగా అందుబాటులోకి రానుంది. -
‘కేసీఆర్ది సాగు భాష..రేవంత్ది చావు భాష’
హైదరాబాద్,సాక్షి: దేవుని మీద ఒట్టు పెట్టి.. దేవుణ్నే మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ(BRS Silver jubilee) సభను విజయంతం చేయాలని సంగారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. బుధవారం సంగారెడ్డిలో బీఆర్ఎస్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం కేసీఆర్ వైపు చూస్తోంది. రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైంది. ఎల్ఆర్ఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారు. జీవో 58,59ను కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టింది. రైతు రుణమాఫీ, 4వేల ఫించను సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయి.13 లక్షల పేదల పిల్లలకు కళ్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత కేసీఆర్ది. రేవంత్ మాయ మాటలతో మోసం చేశారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే.. రేవంత్ పడగొట్టారు. తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ గ్రోత్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్,ఇతర ఆదాయాలు తగ్గిపోయాయి.కేసీఆర్ చెట్టు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరికాడు. చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 4వందల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని, అడవిలోని మూగజీవులను చంపిన శాపం రేవంత్దే. కేసీఆర్ది సాగు భాష..రేవంత్ రెడ్డిది చావు భాష.ఢిల్లిలో ధర్నా,సమావేశం పెడితే రేవంత్ రెడ్డి పిలిస్తే రాహుల్ గాందీ రాలేదు.రేవంత్ పాలన ఆగమాగం అయ్యింది.. మంత్రులే ఆయన మాట వినే పరిస్థితి లేదు.దేవుని మీద ఒట్టు పెట్టి.. దేవున్నే మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కునారిల్లిపోయింది. అన్ని వర్గాలు దివాళా తీశారు.మెట్రో రైలు, ఫార్మా ప్రాజెక్టులు ముందుకు సాగటం లేదు.కాంగ్రెస్ పాలనలో తాగునీరు, కరెంటు కష్టాలు మొదలయ్యాయి.ఏడాది తిరగకుండానే లక్షా50 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ది. పదేళ్ల కేసీఆర్ పాలన దేశంలో నంబర్ వన్ గా మారింది.. ధాన్యాగారంగా మారింది. ప్రజలు ప్రస్తుతం కేసీఆర్ను కోరుకుంటున్నారు. వరంగల్ జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి’ అని పిలుపు నిచ్చారు. -
మా అబ్బాయి గాయపడ్డాడు.. వారికి నా కృతజ్ఞతలు: పవన్
సాక్షి, అమరావతి: సింగపూర్లో వేసవి శిక్షణ తరగతులకు వెళ్లిన తన రెండవ కుమారుడు మార్క్ శంకర్.. అక్కడ తరగతి గదిలో మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడని, ప్రాణాపాయమైతే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. హైదరాబాద్లోని తన నివాసం వద్ద సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ క్రమంలో తాను అరకు పర్యటనలో భాగంగా గిరిజన గ్రామాల సందర్శనలో ఉండగా ప్రమాదం గురించి తన భార్య అన్నా నుంచి ఫోన్ కాల్ వచ్చిందన్నారు. ఆ తర్వాత ఇక్కడ (హైదరాబాద్)కు వచ్చానన్నారు. ప్రమాదం చిన్నదే అని తొలుత భావించానని, అయితే ఒక చిన్నారి మృతి చెందడంతో పాటు 30 మంది గాయాల పాలవ్వడం తీవ్రంగా కలచి వేసిందన్నారు. ప్రమాదంలో చిన్నారి మార్క్ శంకర్ చేతులు, కాళ్లపై గాయాలయ్యాయని, ఆ సమయంలో దట్టమైన పొగ పీల్చడంతో అది ఊపిరితిత్తుల్లోకి చేరినట్టు వైద్యులు తెలిపారన్నారు. దాని నుంచి ఉపశమనం కలిగించేందుకు బ్రాంకోస్కోపీ జరుగుతోందని, ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు స్పష్టం చేశారని చెప్పారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తొలుత గుర్తించి, పిల్లలను కాపాడిన భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారు వెంటనే స్పందించడం వల్ల చాలా మంది పిల్లల ప్రాణాలను కాపాడగలిగారన్నారు.‘పిల్లలు తరగతి గదులకు వెళ్లి సురక్షితంగా తిరిగి వస్తారని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటాం. ఇలాంటి వార్తలు వినాల్సి వచ్చినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఏడేళ్ల మార్క్ శంకర్కు ప్రమాదంలో చిన్న గాయాలు అయినప్పటికీ, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో అది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఈ ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ రోజు నా పెద్ద కుమారుడు అకీరానందన్ పుట్టిన రోజు. దురదృష్టవశాత్తు ఈ రోజు నా చిన్న కుమారుడికి గాయాలు అవడం బాధాకరం. విషయం తెలిసిన వెంటనే ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది.ప్రధాని నరేంద్ర మోదీ.. మార్క్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. వెంటనే సింగపూర్లో తగు వైద్య ఏర్పాట్లు చేయాలని భారత హై కమిషనర్కు ఆదేశాలిచ్చారు. అరకులో ఉండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానికి, సీఎంకు ధన్యవాదాలు. ఆపద సమయంలో వెంటనే స్పందించి నిండు మనసుతో మార్క్ శంకర్ బాగుండాలని అభిలాషించిన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సహచర సినీ ప్రముఖులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జనసేన శ్రేణులు, ఇతరులందరికీ కృతజ్ఞతలు. ఈ రాత్రి (మంగళవారం)కి కుమారుడి వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాను’ అని చెప్పారు. కాగా, ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతికి గురయ్యామని బీజేపీ రాష్ట్ర «అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. -
మీది కడుపుకోతా?.. మరి అసలైన తల్లిదండ్రులది?
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీరు పిల్లలను కొన్నారు.. వారు మీ పిల్లలే అనే ఆలోచనతో మీకు ఆ బాధ ఉంటుంది. అందుకే మీపై మేము కేవలం సానుభూతి చూపించగలం. అంతకుమించి మీకు న్యాయమైతే చేయలేం కదా?’అంటూ.. 2024లో హైదరాబాద్లో పసికందులను దత్తతకు తీసుకున్న తల్లిదండ్రులను ఉద్దేశించి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. మీరు చెప్పినదానిని బట్టి చూస్తే మీదేనా కడుపు కోతా? మీది కడుపుకోత అయినప్పుడు అసలైన తల్లిదండ్రులది ఏమనాలి? అంటూ ప్రశ్నలు సంధించింది. ఢిల్లీ, పుణే నగరాల్లోని ఆసుపత్రుల్లో ఒకరోజు, రెండు రోజుల పసికందులను దొంగలించి హైదరాబాద్కు తీసుకొచి్చ.. పిల్లలు లేని వారికి దత్తత పేరుతో అమ్మకాలు చేపట్టారు. మే 22న ఫీర్జాదిగూడలో ఓ పసికందును విక్రయిస్తుండగా మేడిపల్లి పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టు కుని కేసు నమోదు చేయడంతో.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. తమ పిల్లల్ని తమకు ఇవ్వాలని కొనుగోలు చేసిన తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా.. కొనుగోలు చేసిన వారికి అనుకూలంగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిoది. శిశు సంక్షేమ కమిటీ ఈ తీర్పును ద్విసభ్య ధర్మాసనం వద్ద సవాల్ చేయగా.. ప్రభుత్వానికి సానుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ గత ఫిబ్రవరిలో పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై మంగళవారం జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ కె వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిల్లలు లేరు అందుకే దత్తత తీసుకున్నాం పిల్లలు లేని కారణంగానే.. ఆ పసికందులను దత్తత తీసుకున్నట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రీనివాస్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ పిల్లలతో తమకెంతో భావోద్వేగం ఉన్నట్లు తెలిపారు. తమ నుంచి పిల్లలను స్వాధీనం చేసుకున్న నాటి నుంచి తాము విలవిలలాడుతున్నామని, వారిని తిరిగి తమకు అప్పగించాలని కోరారు. చట్టపరమని మేము ఎలా చెబుతాం? ‘మీరు తీసుకున్నదే ఇల్లీగల్ (చట్టవిరుద్ధం)గా.. మమ్మల్ని న్యాయం చేయమంటే మేం లీగల్ (చట్టపరం) అని ఎలా చెబుతాం? కొనుగోలు చేసిన వారిలో రెండు రోజుల పసికందులున్న విషయం గమనించారా? కన్న ఆ తల్లి క్షోభ మీకు ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? మీరు చేస్తున్నదితప్పు అని మీ మనస్సాక్షికి అనిపించలేదా’అంటూ నిలదీసింది. ఈ విషయంలో మేం కేవలం మీపై సానుభూతి మాత్రమే చూపించగలం. కన్న తల్లిదండ్రుల నుంచి చిన్నారులను దత్తత తీసుకున్న వాళ్లు కాదు మీరు, పర్చేజ్ చేసిన వాళ్లు అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. -
శామీర్పేట్ కారిడార్పై పీటముడి.. హెచ్ఎండీఏ తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి శామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్కు రక్షణ శాఖ పీటముడి వేసింది. సుమారు 18.10 కిలోమీటర్ల మార్గంలో చేపట్టనున్న ఈ కారిడార్ కోసం తిరుమలగిరి, అల్వాల్ మార్గంలో రక్షణ శాఖకు చెందిన భూములను సేకరించాల్సి ఉంది. ఈ క్రమంలో కొన్ని నిర్మాణాలను కూడా తొలగించే అవకాశం ఉంది. దీంతో తొలగించనున్న వాటిని తిరిగి నిర్మించి ఇచ్చిన తరువాతే కారిడార్కు భూమిని అందజేస్తామని రక్షణశాఖ అధికారులు మెలిక పెట్టారు. దీంతో హెచ్ఎండీఏ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.ఈ మార్గంలో రక్షణ శాఖకు చెందిన రెండు భారీ రిజర్వాయర్లు ఉన్నాయి. 5 లక్షల లీటర్ల గ్యాలన్ల సామర్ధ్యంతో ఒకటి, 2.5 లక్షల గ్యాలన్లతో మరో రిజర్వాయర్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతానికి తాగునీరు లభిస్తోంది. ఈ రెండింటిని ఎలివేటెడ్ కారిడార్ కోసం తొలగించాల్సి వస్తోంది. దీంతో ఈ భారీ రియర్వాయర్లకు మరోచోట స్థలం కేటాయించి నిర్మించి ఇవ్వాలని రక్షణ శాఖ హెచ్ఎండీఏను కోరింది. ఈ మార్గంలో తొలగించే భవనాలకు భూమి మాత్రమే పరిహారంగా కాకుండా భవనాలను కూడా తిరిగి నిర్మించి ఇవ్వాలని అధికారులు అంటున్నారు.ఈ మేరకు హెచ్ఎండీఏ, రక్షణ శాఖల మధ్య వివిధ అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయి. అన్ని అంశాలపై ఇరు వర్గాలు ఒక అవగాహనకు వస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు కదిలే అవకాశం లేదు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 197 ఎకరాల భూమి సేకరణకు అధికారులు ప్రణాళికలను రూపొందించారు. ఇందులో 113.48 ఎకరాలు రక్షణ శాఖ నుంచి సేకరించాల్సి ఉంది. సుమారు రూ.2 వేల కోట్ల (పరిహారం చెల్లింపుసహా) నిర్మాణ అంచనాలతో ఈ కారిడార్ను ప్రతిపాదించారు.15వ తేదీ వరకు గడువు ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్కు ఈ నెల 15న బిడ్డింగ్ గడువు ముగియనుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులను అందజేయవచ్చని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ కారిడార్ నిర్మాణం కోసం ఆసక్తి గల సంస్థల నుంచి గత నెలలో టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డెయిరీఫామ్ ఎలివేటెడ్ కారిడార్కు అనుమతి లభించిన నేపథ్యంలో హెచ్ఎండీఏ అధికారులు నిర్మాణ పనులపై దృష్టి సారించారు. ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు 5.4 కిలోమీటర్ల కారిడార్లో బేగంపేట్ విమానాశ్రయం వద్ద సుమారు 600 మీటర్ల పొడవుతో సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు.విమానాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని ఎలివేటెడ్కు ప్రత్యామ్నాయంగా సొరంగమార్గం నిర్మించాల్సి ఉంది. ప్యారడైజ్ నుంచి సికింద్రాబాద్, తాడ్బండ్, బోయిన్పల్లి మీదుగా డెయిరీఫామ్ వరకు నిర్మించనున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ కోసం రూ.652 కోట్ల వ్యయంతో ప్రణాళికలను రూపొందించారు. భూసేకరణ కోసం అయ్యే ఖర్చులతో కలిపి ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1,550 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ కారిడార్ నిర్మాణంతో నగరానికి ఉత్తరం వైపు 44వ జాతీయ రహదారి మార్గంలో మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మిల్, ఆదిలాబాద్ వైపు నుంచి నగరానికి వాహనాల రాకపోకలకు అంతరాయాలు తొలగనున్నాయి. -
KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్,సాక్షి: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెట్టనున్నట్లు తెలిపారు.వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే పార్టీ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Celebrations) కోసం బీఆర్ఎస్ (brs) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు మేరకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని జన సమీకరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు.ఈ తరుణంలో కేటీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ,హెచ్సీయూ భూముల వ్యవహారంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండవ తెలుగు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. అందుకే భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఇది అతిపెద్ద బహిరంగ సభ అవుతుంది. ఈ సారి డిజిటల్ మెంబర్షిప్ ప్రవేశపెడుతున్నాం. అన్ని జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. సిల్వర్ జూబ్లీ సందర్భంగా నెలకో కార్యక్రమం జిల్లాల్లో నిర్వహిస్తాం.అమెరికా దుందుడుకు నిర్ణయాల వల్ల స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు నష్టపోయారు. మోదీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా మౌనం ఎందుకు?. తర్వాత దెబ్బ తెలంగాణపై పడబోతుంది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఫార్మా ఎగుమతులు ఉంటాయి. వాటిపై ఎఫెక్ట్ ఉండబోతుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.రాష్ట్రంలో నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు BRS పార్టీ మొదలుపెట్టినవి కాదు. లగచర్ల,మూసీ పునరుజ్జీవనం, హెచ్సీయూ విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు. ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూలాజికల్ పార్క్ నివేదికలోనే అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని చెప్పింది. జంతువుల వ్యధకు కారణమైన వారిపై కచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం. HCU విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టారా?ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా. హెచ్సీయూలో 400 ఎకరాలు కాదు దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. అన్ని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డిని కాపాడుతుంది బండి సంజయ్’ అని వ్యాఖ్యానించారు. -
మరో ఇండోర్లా.. భాగ్యనగరం కాగలదా..?
ఆ నగరం.. ఒకప్పుడు చెత్త కుప్పలతో నిండి ఉండేది, విచ్చలవిడిగా పందులు, కుక్కలు తిరుగుతుండేవి.. వాటి విసర్జన కుప్పలు ఈగల సమూహాలతో వీధులు నిండిపోయేవి.. ఇలాంటి అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల మధ్య నుంచి.. తనను తాను మార్చుకుంటూ.. కొత్తగా మలుచుకుంటూ ఇప్పుడు అత్యంత పరిశుభ్ర నగరంగా అవతరించింది ఇండోర్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా.. ఇండోర్ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి? ఈ స్థానంలో మన హైదరాబాద్ నగరం కూడా చోటు దక్కించుకోగలదా? దేశంలోని 471 పట్టణాలు, నగరాల్లో అత్యంత పరిశుభ్రమైన నగరం అనే అవార్డును ఎనిమిది సంవత్సరాలుగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం గెలుస్తూనే ఉంది. ఇదే ఇండోర్ నగరం 2017కి ముందు, పరిశుభ్రత ర్యాంకింగ్స్లో 25వ స్థానంలో ఉంది. దీనికి కారణాలేమిటి? మన ఇండియాలోనే ఉన్నామా? ‘మనం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చినప్పుడు, రోడ్డు చూడగానే భారతదేశంలో లేమేమో అనిపిస్తుంది, అంత పరిశుభ్రంగా ఉంటుంది అని నగరం నుంచి ఉద్యోగ బాధ్యతల నిమిత్తం తరచూ ఇండోర్కు రాకపోకలు సాగించే కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ నితీష్ అంటున్నారు. మన నగరంలో పలు కుటుంబాలు తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటాయి. కానీ ముందు తలుపు నుంచి కొన్ని అడుగుల దూరంలో చెత్త కుప్పలుగా పోగుబడి ఉంటుంది. ‘ఆ కుప్ప ప్రాంతం వేరొకరి బాధ్యతగా భావిస్తారు. దీంతో తమ పరిశుభ్రమైన ఇంటికి దుర్వాసనతో కూడిన ఆ చెత్త కుప్ప మీదుగా వెళ్లడంలో ఎవరూ ఎటువంటి ఇబ్బందీ పడరు’ అయితే ఇండోర్లో దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తుందని చెప్పారాయన. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న కొన్ని ఇండోర్ ‘విజయ’విశేషాలు.. క్లీన్ టూ విన్.. పేవ్మెంట్లు, రోడ్ డివైడర్లు రీసైకిల్ చేసిన నీటి గొట్టాలను కలిగి ఉంటాయి. అక్కడి చెత్త వ్యాన్లు ఇండోర్ నంబర్ వన్గా మారింది అనే జింగిల్ను పదే పదే ప్లే చేస్తుంటాయి. ఆ శబ్దం తమను సమీపిస్తుండగానే జనం తమ ఇళ్లలో నుంచి తమ చెత్త బుట్టలతో బయటపడతారు. అతి చిన్న సందులో ఉండే వేలాది విభిన్న రంగుల డబ్బాల నుంచి వ్యర్థాలను తొలగించి, శుద్ధి చేసే విధానం అమలు చేసేందుకు దాదాపు 850 మంది పారిశుధ్య సిబ్బంది సైన్యం తరహాలో సిద్ధంగా ఉంటుంది. ఇవీ కీలకాంశాలు.. జీపీఎస్ ట్రాకింగ్ ఉపయోగించి, ఓ ప్రత్యేక బృందం చెత్త వ్యాన్ల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంది, వారు తమ పనిని నిర్ధేశించిన విధంగా చేస్తున్నారో లేదో సునిశితంగా పరిశీలిస్తారు. గృహస్థుల వ్యర్థాలను తడి, ఎల్రక్టానిక్స్, ప్లాస్టిక్స్, నాన్ప్లాస్టిక్, బయోమెడికల్, ప్రమాదకర పదార్థాలుగా విభజన జరుగుతుంది. వ్యర్థాలను ఇంధనంగా, కంపోస్టుగా మార్చి రైతులకు ఎరువుగా విక్రయిస్తున్నారు. చాలా రెస్టారెంట్లు మొబైల్ కంపోస్టింగ్ వ్యాన్లను రెస్టారెంట్స్ బయట ఉంచుతాయి. పండ్లు, కూరగాయల మార్కెట్లో వివిధ రకాల వ్యర్థాల కోసం వేర్వేరు డబ్బాలు ఏర్పాటు చేసి ఉంటాయి. అక్కడ ఒక యంత్రం కూడా ఉంది. ఇది వ్యర్థాలను సిటీ బస్సుల కోసం వాడే, అలాగే వంటకు ఉపయోగించే ఇంధనంగా మారుస్తుంది. తమ నగరం పరిశుభ్రత పరంగా దేశంలోనే నెంబర్ వన్ అనే టైటిల్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే ఒక ఇంధనంగా మారింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని పాఠశాల విద్యార్థులు ప్రతి రోజూ ప్రతిజ్ఞ చేస్తారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైనా చెత్త వేసినట్లు గుర్తిస్తే వెంటనే జరిమానాలు విధించడం లాంటి కట్టుదిట్టమైన చట్టాలు ఉన్నాయి. స్థానిక ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పరిశుభ్రత పోటీలను నిర్వహిస్తున్నారు. మతపరమైన గ్రంథాలను ఆధారం చేసుకుని, పరిశుభ్రత అవసరాన్ని తలకెక్కించడానికి, మత పెద్దలను కూడా ఈ కార్యక్రమంలో భాగం చేశారు. హోలీ వంటి పండుగల సందర్భంగా, వీధులు, భవనాలు రంగులతో తడిసినప్పుడు, అదనపు వాహనాలు నీటి ట్యాంకర్లు నగరాన్ని శుభ్రం చేయడానికి శరవేగంగా బయటకు వస్తాయి. ప్రజలు ప్రభుత్వాలు తలచుకుంటే ఇండోర్ విజయాన్ని మన నగరంలో కూడా పునరావృతం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ‘స్వచ్ఛందంగా ముందుకొచ్చే ప్రజానీకం, దృఢమైన చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం ఉంటే తరతరాలుగా వస్తున్న కొన్ని ‘చెత్త’ అలవాట్లు మారతాయి’ అంటున్నారాయన. (చదవండి: కోర్టులు ఆమెను గౌరవించాయి..! ఐనా ఆ ఒక్క ఉద్యోగమే కాదు..) -
శ్రవణ్ ఫోన్లపైనే సిట్ ఫోకస్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణ!
హైదరాబాద్,సాక్షి: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ6గా ఉన్న శ్రవణ్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణను ఎదుర్కోనున్నారు. విచారణలో శ్రవణ్ రావు వినియోగించిన రెండు ఫోన్లు కీలకం కానున్నాయి.ఇప్పటికే శ్రవణ్ రావు రెండు సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా గత ఎన్నికల సందర్భంగా శ్రవణ్ రావు వాడిన ఫోన్లను స్వాధీనం చేయాలని సిట్ నోటీసులు జారీ చేసింది.దీంతో రెండోసారి సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు ఓ పాత తుప్పు పట్టిన ఫోన్ ఇచ్చారు. ఆ తుప్పు పట్టిన ఫోన్ను చూసిన విచారణ అధికారులు విస్మయానికి గురయ్యారు. సుప్రీంకోర్టు స్పష్టంగా సిట్ విచారణకు సంపూర్ణంగా సహకరించాలని ఆదేశించినా శ్రవణ్ రావు సహకరించకపోవడం వారిని అసంతృప్తికి గురి చేసింది. తాము అడిగిన రెండు సెల్ ఫోన్లతో పాటు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానంతో ఈనెల 8వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ ఆయన సిట్ ఎదుట హాజరు కానున్నారు. -
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. నిందితుల అప్పీల్ పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానం.. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్ షేక్కు ఉరి శిక్ష విధించింది.2013లో జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 130 మంది వరకు గాయపడ్డారు. ఈ కేసులో కీలక నిందితుడు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2016లో ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు.ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 2013, ఫిబ్రవరి 21న హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో పేలుళ్లు సంభవించాయి. ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేసింది. 157 మంది సాక్ష్యాలను నమోదుచేసింది. ఈ ఘటనలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది.అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు.. నిందితులకు మరణశిక్షను విధించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్ను 2013లో నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. -
HYD: మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద లారీ బీభత్సం
హైదరాబాద్,సాక్షి: మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి నుంచి మియాపూర్ వైపు వేగంగా వచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్స్పైకి లారీ దూసుకెళ్లింది. అంబ్రెల్లాను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ట్రాఫిక్ విధులు ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ సింహాచలం మరణించారు. కానిస్టేబుళ్లు వికేందర్,రాజవర్థన్లు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ..
హైదరాబాద్: బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని ఓ యువకుడు చేసిన ప్రచారం పాతబస్తీలో హల్చల్ సృష్టించింది. ఢిల్లీకి చెందిన వకీల్ గత కొంత కాలంగా పాతబస్తీ రామనాస్పుర రోడ్డులో కింగ్ పేరుతో కటింగ్ షాపును నిర్వహిస్తున్నాడు. నెల రోజుల నుంచి బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున యువకులు క్యూలో నిలబడి మందు పెట్టించుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించింది. వకీల్ మొదట బట్టతల గుండు కొట్టి రూ.100 తీసుకొని తర్వాత జుట్టు మొలిపించేందుకు కెమికల్ను బట్టతలపై రాసేవాడు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో నగరవ్యాప్తంగా కొందరు బట్టతల ఉన్న వారు ఆందోళన చేపట్టినట్లు సమాచారం. ఉన్న కాస్త జుట్టు కూడా పోయిందంటూ ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎవరు ఫిర్యాదు చేయలేదని కాలాపత్తర్ ఇన్స్పెక్టర్ ఆసిఫ్ తెలిపారు. గుండు గీసి కెమికల్స్ రాసి పంపిన షకీల్ భాయ్.. సైడ్ ఎఫెక్ట్… pic.twitter.com/l2rKpDE1x1— Telugu Scribe (@TeluguScribe) April 7, 2025 -
ఏడు అడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
హైదరాబాద్: అధిక ఎత్తు కారణంగా విధుల నిర్వహణకు అహ్మద్ అనే కండక్టర్ ఇబ్బంది పడుతున్నాడని ఇటీవల వచ్చిన వార్తలపై మంత్రి పొన్నం స్పందించారు.ఏడు అడుగుల ఎత్తు ఉన్న అహ్మద్ మెహిదీపట్నం డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారు. బస్సు 6.4 అడుగులు ఎత్తు మాత్రమే ఉండడటంతో మెడ వంచి ఉద్యోగం చేయాల్సి వస్తోంది. దీంతో ఆయన మెడ, వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. వచ్చి ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ విషయం సీఎం రేవంత్ దృష్టికి వచ్చిందని, అతనికి ఆర్టీసీలో వేరే బాధ్యతలు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు సూచించారు. కారుణ్య నియామకం..అమీన్ అహ్మద్ అన్సారీ హైదరాబాద్ చాంద్రాయణగుట్ట షాహీనగర్ లో నివాసం ఉంటున్నారు. ఆయన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేశారు. ఆయన అనారోగ్యంతో 2021లో మరణించగా కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తిచేసిన అన్సారీకి మెహిదీపట్నం డిపోలో కండక్టర్ గా ఉద్యోగం ఇచ్చారు. అతడు ఏడడుగుల పొడవు ఉండటంతో విధులు నిర్వర్తించడం సవాల్ గా మారింది. బస్సుల్లో రోజూ సగటున ఐదు ట్రిప్పుల్లో 10గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు అతనికి సరైన మరో ఉద్యోగం ఆర్టీసీ లో ఇవ్వగలరు @SajjanarVC గారికి ఆదేశం- మీ పొన్నం ప్రభాకర్ https://t.co/zadYYAMYhM— Ponnam Prabhakar (@Ponnam_INC) April 6, 2025 -
తుది దశలో ఆ మెట్రో డీపీఆర్లు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ ‘బి’విభాగం కింద ప్రతిపాదించిన నార్త్ సిటీ, ఫోర్త్ సిటీ మెట్రో ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు (డీపీఆర్లు) తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం మూడు కారిడార్ల అలైన్మెంట్లు, నిర్మాణ వ్యయంపై అంచనాలను సిద్ధం చేస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ (హెచ్ఏఎంఆర్ఎల్) సంస్థ తుది మెరుగులు దిద్ది ప్రభుత్వానికి నివేదికలు అందజేయనుంది. మొదట్లో భావించినట్లుగా డబుల్డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్లకు అవకాశం ఉండకపోవచ్చన్నారు.జేబీఎస్ నుంచి మేడ్చల్ మార్గంలో డెయిరీ ఫాం వరకు హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ మార్గంలో బేగంపేట్ ఎయిర్పోర్టు వద్ద 600 మీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు. దీంతో డబుల్ డెక్కర్పై ప్రతిష్టంభన నెలకొంది. మెట్రో కోసం ప్రత్యేకంగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ ఓఆర్ఆర్ వరకు ప్రతిపాదించిన రూట్లో కూడా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ సాధ్యాసాధ్యాలపై సాంకేతిక, ఇంజనీరింగ్ నిపుణులు త్వరలో ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. ఈ రూట్లో కూడా హెచ్ఎండీఏ ఎలివేటెడ్ కారిడార్ను ప్రతిపాదించింది. ప్రస్తుతం కంటోన్మెంట్ ఏరియాలో రక్షణశాఖ నుంచి భూముల సేకరణపై ప్రతిష్టంభన నెలకొంది. రక్షణ శాఖ అధికారులతో హెచ్ఎండీఏ అధికారులు తాజాగా సమావేశమయ్యారు. మరోవైపు ఫోర్త్ సిటీకి ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్లో కొన్ని కిలోమీటర్లు భూమార్గంలో మెట్రో పరుగులు తీయనుంది. ఆరు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. దశల వారీగా పనులుజేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24 కి.మీ, జేబీఎస్ నుంచి శామీర్ పేట్ వరకు 21 కి.మీ, ఫ్యూచర్సిటీ వరకు 41 కి.మీ. మెట్రో కారిడార్ల డీపీఆర్ల కోసం హెచ్ఏఎంఆర్ఎల్ దశలవారీగా క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించింది. ఈ కారిడార్లలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్తోపాటు భవిష్యత్తులో పెరగనున్న వాహనాల రద్దీపై ఇప్పటికే నివేదికలను రూపొందించారు. అలాగే జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, పర్యావరణ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేసి నివేదికలను సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మెట్రో రాక వల్ల నార్త్సిటీ వైపు వాహనకాలుష్యం భారీగా తగ్గుముఖం పట్టనుందని అంచనా. భూసామర్థ్య పరీక్షల్లో భాగంగా మేడ్చల్ మార్గంలో 14 చోట్ల, శామీర్ పేట్ మార్గంలో 11 చోట్ల పరీక్షలు పూర్తిచేశారు. రెండో దశలో మొత్తం 162 కి.మీ. మెట్రో రెండో దశలో ఇప్పటికే 5 కారిడార్లలో 76.4 కి.మీ.తోపాటు ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కి.మీ., శామీర్పేట్ ఓఆర్ఆర్ వరకు 22 కి.మీ, ఫ్యూచర్సిటీ కారిడార్ 41 కి.మీ. చొప్పున మొత్తం 8 కారిడార్లలో 162.4 కి.మీ. వరకు మెట్రో కారిడార్లు విస్తరించనున్నారు. మెట్రో మొదటి దశలోని 69 కి.మీ.తో కలిపితే హైదరాబాద్లో మెట్రో సేవలు 231.4 కి.మీ.కు పెరగనున్నాయి. మొదట విస్తరించనున్న 5 కారిడార్లలో 2028 నాటికి సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు, నార్త్సిటీ, ఫోర్త్సిటీ కారిడార్లతో కలిపి సుమారు 12 లక్షల మంది ప్రయాణించవచ్చని అంచనా. 2030 నాటికి మెట్రో ప్రయాణికులు 15 లక్షలు దాటే అవకాశం ఉంది. కాగా, హెచ్ఏఎంఆర్ఎల్ ఎండీగా ఎన్విఎస్ రెడ్డిని త్వరలో తిరిగి నియమించనున్నట్లు సమాచారం. -
పుష్పక్ బస్సుల్లో రూట్ పాస్లు
తెలంగాణ ఆర్టీసీ పుష్పక్ బస్సుల్లో రూట్పాస్లను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఎక్కడి నుంచైనా ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించేందుకు నెలవారీ పాస్లు ఉన్నాయి. అలాగే కొన్ని నిర్దిష్టమైన మార్గాల్లో మాత్రమే ప్రయాణం చేసేందుకు అనుగుణంగా రూట్పాస్లు దోహదం చేస్తాయి. ఎయిర్పోర్ట్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. 53 పుష్పక్ సర్వీసులు.. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 53 పుష్పక్ ఏసీ బస్సులు (AC Buses) ఎయిర్పోర్టుకు నడుస్తున్నాయి. 24 గంటల పాటు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్పోర్టు ప్రయాణికుల కోసం వీటిని నడుపుతున్న సంగతి తెలిసిందే. కానీ ఎయిర్పోర్టు (Airport) నుంచి నగరంలోకి వచ్చే బస్సులకు లభించినట్లు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లే సర్వీసులను ప్రయాణికులు ఆదరించడం లేదు. దీంతో పుష్పక్ ఆక్యుపెన్సీ 60 శాతానికే పరిమితమవుతోంది. ప్రతిరోజూ సుమారు 55 వేల మంది డొమెస్టిక్ ప్రయాణికులు, మరో 15 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా పుష్పక్లను నడుపుతున్నప్పటికీ ఆదరణ తక్కువగానే ఉంది. దీంతో వివిధ మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీ (RTC) ప్రణాళికలు రూపొందిస్తోంది.నాలుగు రూట్లలో.. సుమారు 12 వేల మందికి పైగా ఉద్యోగులు ఎయిర్పోర్టులో పనిచేస్తున్నట్లు అంచనా. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న ఈ ఉద్యోగులంతా వివిధ మార్గాల్లో ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిని ఆకట్టుకొనేందుకు ఆర్టీసీ రూట్ పాస్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు నెలవారీ పాస్లతో పాటు తమ అవసరాలకు అనుగుణంగా ఈ నాలుగు మార్గాల్లో రూట్పాస్లను తీసుకోవచ్చు. చదవండి: హైదరాబాద్ పరిధిలో పాతాళానికి భూగర్భ జలాలురూట్పాస్లు ఇలా.. నగరంలో ఎక్కడి నుంచైనా ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించేందుకు నెలవారీ పాస్ రూ.5,260 శంషాబాద్ నుంచి ఎయిర్పోర్టు వరకు రూ.2,110 ఆరాంఘర్, బాలాపూర్ నుంచి ఎయిర్పోర్టుకు రూ.3,160 ఎల్బీనగర్, గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్టుకు రూ.4,210 -
గతేడాది కంటే మరింత పాతాళానికి..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూగర్భ జలాలు రోజురోజుకూ పాతాళానికి చేరుకుంటున్నాయి. వేసవి నేపథ్యంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. మహా హైదరాబాద్ (Hyderabad) శరవేగంగా విస్తరిస్తూ కాంక్రీట్ జంగిల్గా మారుతుండటమే ఈ దుస్థితికి ప్రధాన కారణమని పర్యావరణ వేత్తలు అంటున్నారు. మరోవైపు వర్షపునీరు, ఆయా అవసరాలకు వినియోగించిన నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు.ఎండలు ముదురుతుండటంతో భూగర్భజలాల మట్టం (Ground Water Level) రోజురోజుకూ లోతుకు పడిపోతోంది. కేవలం రెండు నెలల వ్యధిలోనే 10 నుంచి 23 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, అమీర్పేట్, సరూర్నగర్, మారేడుపల్లి మండలాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతాల్లో రోజువారీ అవసరాలకు నీరు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. దీంతో నగరవాసులు నీటి ఎద్దడితో అవస్థ పడుతున్నారు.శివారులో మరింత... కోర్సిటీ (Core City) కంటే శివారు ప్రాంతాల్లోనే భూగర్భనీటి మట్టం మరింత కిందికి దిగజారుతోంది. ఒకప్పటి శివారు ప్రాంతాలన్నీ ఇప్పుడు నగరంలో అంతర్భాగమయ్యాయి. పంట భూములన్నీ రియల్ ఎస్టేట్ (Real Estate) వెంచర్లుగా మారగా, చెరువులు, కుంటలు దాదాపు కనుమరుగయ్యాయి. భారీ నిర్మాణాలు జరుగుతుండటంతో బోరు బావుల తవ్వకాలు బాగా పెరిగాయి. వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడినప్పటికీ భూమిలోకి నీరు ఇంకకపోవడం, చెరువులు, కుంటలు మాయమవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి.మూడు నెలల నుంచే... వర్షకాలంలో పడిన వర్షాలతో ఈ ఏడాది జనవరి వరకు ఆశాజనకంగా కన్పించిన భూగర్భ జలాలు ఆ తర్వాత దిగువకు పడిపోవడం గమనార్హం. హైదరాబాద్ పరిధిలో ఏప్రిల్ నాటికి సగటున 10.10 మీటర్ల నుంచి 20 మీటర్ల వరకు భూగర్భజలాల నీటిమట్టాలు దిగువకు పడిపోయాయి. గత రెండేళ్లలో భూగర్భజలాల నీటిమట్టం పరిస్ధితి పరిశీలిస్తే పాతబస్తీలో సగటున 7.91 మీటర్లు, సికింద్రాబాద్ డివిజన్లో 12.30 మీటర్లకు నీటిమట్టం పడిపోయింది. రంగారెడ్డి జిల్లా (Rangareddy District) పరిధిలో 15 నుంచి 18 మీటర్ల వరకు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో 13.42 మీటర్లకు దిగువకు పడిపోయాయి. -
హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
హైదరాబాద్: హెచ్సీయూవిద్యార్థులపై నమోదు చేసిన కేసులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నీర్ణయం తీసుకుంది. హెచ్ సీయూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులపై ఏ కేసులు అయితే నమోదయ్యాయో వాటిని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై హెచ్ సీయూ విద్యార్థులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కంచ భూముల్ని అభివృద్ధి పేరుతో విక్రయిస్తే ఊరుకోబోమంటూ తెలంగాణ సర్కారును హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అక్కడ ప్రభుత్వం చేపట్టబోతున్న చర్యలను కొన్ని రోజుల క్రితం అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వారిపై కేసులు నమోదయ్యాయి. వీటిని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ఈరోజు(సోమవారం) స్పష్టం చేయడంతో విద్యార్థులకు ఊరట లభించింది.మంత్రుల కమిటీ సమావేశంలో నిర్ణయంHCU కంచె గచ్చిబౌలి సమస్యపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ సెక్రటేరియట్ లోసమావేశమైంది. ఈ భేటీలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ నటరాజన్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి యూనివర్శిటీస్ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు హాజరయ్యారు. ఈ మేరకు పలు విజ్ఞప్తులు చేశారు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు. ఇందులో విద్యార్థులపై కేసులతో పాటు యూనివర్శటీ క్యాంపస్ నుంచి పోలీస్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ఇటీవల నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకుంది ప్రభుత్వం. జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది.ఇదిలా ఉంచితే, కంచ భూముల వ్యహహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఇటీవల కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే.. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూముల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారంటూ ప్రశ్నించింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. -
తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు!
హైదరాబాద్: దక్షిణ మధ్య బంగాళాఖాతాంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు బీహార్ నుంచి ఈశాన్య జార్ఖండ్, చత్తీస్గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఫలితంగా వచ్చే మూడు రోజులు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణంహైదరాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఈరోజు(సోమవారం) హైదరాబాద్ తో పాటు మహబూర్ నగర్, మేడ్చల్, మల్కాజగిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇక భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రేపు(మంగళవారం) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉంది. -
వాంటెడ్స్ వేలల్లో! కింగ్ మేకర్స్ ఐదుగురు నైజీరియన్లే
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా 2020-24 మధ్య నమోదైన మాదకద్రవ్యాల కేసుల్లో 8,822 మంది ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వీరిలో ఐదుగురు నైజీరియన్లు అత్యంత కీలకమని, దేశవ్యాప్తంగా డ్రగ్స్ సిండికేట్ను వాళ్లే నడిపిస్తున్నారని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్బీ) అధికారులు గుర్తించారు. 2023లో పోలీసులు రూ.94.39 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేయగా, అది ఇది గత ఏడాది నాటికి రూ.148.09 కోట్లకు చేరింది. ఈ కేసుల్లో సూత్రధారులు కంటే పాత్రధారులు మాత్రమే చిక్కుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన డ్రగ్స్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీజీఏఎన్బీ అధికారులు వాంటెడ్గా ఉన్న వారి కోసం గాలిస్తోంది. అప్పట్లో నేరుగా వచ్చిమాదకద్రవ్యాల క్రయవిక్రయాలన్నీ సోషల్ మీడియా, డార్క్ వెబ్ కేంద్రంగా సాగుతున్న విషయం తెలిసిందే. వీటిలోనే పెడ్లర్లు, సప్లయర్లు, కన్జ్యూమర్ల మధ్య బేరసారాలు పూర్తవుతున్నాయి. ఒకప్పుడు ఆన్లైన్లో డబ్బు డిపాజిట్ చేయించుకునే పెడ్లర్లు సిటీకి వచ్చి డ్రగ్స్ అందించి వెళ్లే వాళ్లు. అయితే టీజీఏఎన్బీ, హెచ్–న్యూ వంటి ప్రత్యేక విభాగాలు ఏర్పడిన తర్వాత డ్రగ్స్ దందాపై నిఘా పెరిగింది. వరుస పెట్టి డెకాయ్ ఆపరేషన్లు చేసిన అధికారులు, సిబ్బంది జాతీయ, అంతర్జాతీయ పెడ్లర్స్ను పట్టుకున్నారు. దీంతో తెలంగాణకు వచ్చి డ్రగ్స్ సరఫరా చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. కొరియర్స్, డెడ్ డ్రాప్ విధానాల్లో... సోషల్ మీడియా ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్న పెడ్లర్లు ఆన్లైన్లోనే నగదు చెల్లింపులు అంగీకరిస్తున్నారు. ఆపై కొరియర్ పార్శిల్ చేయడం లేదా సప్లయర్ను పిలిపించుకొని మాదకద్రవ్యాలను అందిస్తున్నారు. ఈ సప్లయర్లు సైతం నేరుగా కన్జ్యూమర్ని కలవట్లేదు. దీనికోసం డెడ్ డ్రాప్ విధానం అవలంభిస్తున్నారు. మాదకద్రవ్యాన్ని ఓ ప్రాంతంలో ఉంచి ఆ ప్రాంతం ఫొటో, లోకేషన్లను వారికి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధిక కేసుల్లో కన్జ్యూమర్లు, కొన్ని కేసుల్లో సర్లయర్లు చిక్కుతున్నారు. పెడ్లర్స్ మాత్రం దొరక్కపోవడంతో ఆయా కేసుల్లో వాంటెడ్స్ పెరుగుతున్నారు. గత ఏడాది భారీగా పెరిగిన కేసులు... మాదకద్రవ్యాల కేసులు, అరెస్టు అయిన నిందితుల సంఖ్య 2023 కంటే 2024లో గణనీయంగా పెరిగింది. 2023లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదైన కేసుల సంఖ్య 1487గా, అరెస్టు అయిన నిందితుల సంఖ్య 2170గా ఉంది. గత ఏడాది ఇవి 3074, 5205కు పెరిగాయి. 2020–24 మధ్య ఐదేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 7131 కేసులు నమోదు కాగా, వీటిలో 23,547 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 14,725 మంది మాత్రమే అరెస్టు కాగా, ఇప్పటికీ 8822 మంది పరారీలోనే ఉన్నారు. ఈ వాంటెడ్స్ కోసం టీజీఏఎన్బీ, హెచ్–న్యూ, టాస్క్ఫోర్స్, ఎస్ఓటీలతోపాటు స్థానిక పోలీసులూ గాలిస్తున్నారు. ఆ ఐదుగురూ అత్యంత కీలకం రాష్ట్రంలోనే కాదు... దేశ వ్యాప్తంగా వివిధ మెట్రో నగరాల్లో విస్తరించి ఉన్న డ్రగ్ నెట్వర్క్లో నైజీరియన్లే కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రధాన పెడ్లర్స్, సర్లయర్స్లో వీళ్లే ఎక్కువగా ఉంటున్నారు. తెలంగాణకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిలో ఐదుగురు నైజీరియన్లు కీలకమని టీజీఏఎన్బీ గుర్తించింది. వీరిలో డివైన్ ఎబుక సుజీపై ఎనిమిది, పీటర్ న్వాబున్వన్నా ఒకాఫర్, నికోలస్ ఒలుసోలా రోటిమీ, మార్క్ ఒవలబిలపై నాలుగు చొప్పున, అమోబి చుక్వుడి మూనాగోలుపై ఒక కేసు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో ఆధారాలు లభించడంతో నిందితులుగా చేర్చామని అధికారులు చెప్తున్నారు. 2023–24ల్లో డ్రగ్స్ దందాలో ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో సూడాన్, కెన్యా, నైజీరియా, సోమాలియా, టాంజానియా, లైబీరియాలకు చెందిన 11 మందిని పోలీసులు నగరంలో గుర్తించి ఆయా దేశాలకు తిప్పిపంపారు. -
హైదరాబాద్ లో దారుణం.. గర్భవతిపై బండరాయితో భర్త దాడి
-
పసలేదు బ్రో.. సన్రైజర్స్ ఆట తీరుపై అభిమానుల నిరాశ (ఫొటోలు)
-
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై విచక్షణా రహితంగా సిమెంట్ బ్రిక్తో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ జిల్లా కోట్పల్లికి చెందిన మహ్మత్ బస్రత్(32) కోల్కత్తాకు చెందిన షబానా పర్వీన్(22)ను 2024 అక్టోబర్లో పెళ్లి చేసుకున్నాడు. హఫీజ్పేట్లోని ఆదిత్యనగర్లో నివాసం ఉంటున్నారు. బస్రత్ తల్లిదండ్రులతో పర్వీన్ తరచు గొడవ పడుతుండటంతో రెండు నెలల క్రితం వేరు కాపురం పెట్టాడు. కాగా పర్వీన్కు వాంతులవుతుండడంతో రాఘవేంద్ర కాలనీలోని సియాలైఫ్ హాస్పిటల్లో చేర్పించాడు. ఏప్రిల్1న రాత్రి 10 గంటలకు డిశ్చార్జి చేయగా బయటకు వచ్చి ఇద్దరు గొడవపడ్డాడు. కోపంతో బస్రత్ తన్నడంతో షబానా పర్వీన్ కిందపడి పోయింది. అక్కడ ఉన్న రెండు సిమెంట్ బ్రిక్లతో దాదాపు 15 సార్లు తల, శరీరంపై మోదాడు. చనిపోయిందనుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడి చికిత్సపొందుతోంది. వైద్యులు నిర్వహించిన పరీక్షలలో మూడు నెలల గర్భిణి అని తేలిందని, షబానా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/St6JwDt1Ti— ChotaNews App (@ChotaNewsApp) April 7, 2025 -
ఆర్ట్ ఫెస్ట్.. అదిరేట్టు.. !
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగర వేదికగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎఫ్) దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కళాకారులతో, ఔస్తాహికులతో సందడి నెలకొంది. హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి అత్తాపూర్లోని కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్ వేదికగా నడుస్తున్న ఫెస్ట్లో 200 మందికి పైగా ప్రముఖ కళా కారులు రూపొందించిన 3,500 పైగా వైవిధ్యమైన కళారూపాలను ప్రదర్శించారు. ఇందులో 25 ఆర్ట్ గ్యాలరీలతో, 100 ఎయిర్ కండీషన్డ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖ కళాకారులు భాగస్వామ్యమవుతున్న ఈ ఆర్ట్ ఫెస్ట్ ఆదివారంతో ముగిసింది. ఎంఎఫ్ హుస్సేన్ వారసత్వానికి నివాళి.. ప్రఖ్యాత భారతీయ కళాకారుడు ఎంఎఫ్ హుస్సేన్ మేనల్లుడు ఫిదా హుస్సేన్ ఎక్స్క్లూజివ్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళా ప్రదర్శన ఫెస్ట్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేదికగా తన మామతో ఉన్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు. భారతదేశం నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఎంఎఫ్ హుస్సేన్ కళను పదిలపరచడంలో ప్రత్యేక బాధ్యతను తీసుకున్నట్లు వెల్లడించారు. 2006 నుంచి 2011 వరకూ ఎంఎఫ్ హుస్సేన్ బహిష్కరణ సమయంలో అతను దుబాయ్, ఖతార్లో తనతో నివసించారని పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయన సృజనాత్మకతను తాను పరిరక్షించానని, ఇందులో భాగం 2017లో హుస్సేన్ సెరిగ్రాఫ్లను భారతదేశానికి తిరిగి ఇచ్చే పనిని చేపట్టానని, ఇది తమ కళా వారసత్వానికి నిదర్శనమని అన్నారు. అనంతరం ముంబై, బరోడాలో ఎంఎఫ్ హుస్సేన్ కళను ప్రదర్శించడం, సమకాలీన కళాకారులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఎక్స్క్లూజివ్ ఆర్ట్ గ్యాలరీని స్థాపించానని తెలిపారు. సృజనాత్మకతలో తత్వ శాస్త్రం.. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన అంజలి ప్రభాకర్ సృజనాత్మకత ఇండియన్ ఆర్టి ఫెస్ట్లో విశేషంగా ఆకట్టుకుంది. జీవితంలోని వివిధ కోణాలను, తత్వశాస్త్రంపై ఆమెకున్న లోతైన అవగాహనను చిత్రాల ద్వారా ప్రదర్శించారు. విజయం, ప్రేమ, ఆధ్యాత్మికతతో పాటు జీవితంలోని అనేక ఆచరణాత్మక అంశాలను అంజలి చిత్రీకరించారు. పెయింటింగ్లో నైపుణ్యం, 3డీ మ్యూరల్ ఆర్ట్, మధుబని పెయింటింగ్, క్రిస్టల్ రెసిన్, సెఫోరిక్స్, అబ్స్ట్రాక్ట్ వంటి కళల్లో తన సృజనాత్మకతను ఈ ఫెస్ట్లో ప్రదర్శించారు.భారత్తో పాటు విదేశాల్లో తాను సోలో, గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్లో పాల్గొన్నానని, తాను రాసిన పుస్తకం ‘ట్యూన్స్ ఆఫ్ లైఫ్’ విడుదలైందని, ప్రస్తుతం ‘మహిళల మానసిక ఆరోగ్యంలో ఆర్ట్ థెరపీ ప్రభావాన్ని అన్వేషించడం’ అనే అంశంపై పీహెచ్డీ ఎంట్రీని చేస్తున్నట్లు తెలిపారు. 16 ఏళ్లుగా అంజలి ఇన్నోవేటివ్ ఆర్ట్ శిక్షకురాలిగా కృషి చేస్తున్నానని అన్నారు. 2017లో ఇండోర్ మిరాజ్ నేషనల్ ఆర్ట్ ఫెస్ట్, బోపాల్ ‘ఆర్ట్ ఆల్కెమీ’, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ (ఆష్మి ఇనీషియేటివ్ గాంధీ ఆర్ట్ గ్యాలరీ) వంటి ప్రదర్శనలో తన చిత్రాలకు ప్రశంసలు లభించినట్లు తెలిపారు. (చదవండి: ఇంటి రుచులకు కేరాఫ్.. హోమ్ చెఫ్..!) -
హైదరాబాద్లో మితిమీరిన శబ్ద కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాహనాల మోత దడ పుట్టిస్తోంది. అవసరం లేకున్నా మోగిస్తున్న హారన్లతో రహదారులు దద్దరిల్లిపోతున్నాయి. గచ్చిబౌలి, జీడిమెట్ల, ఉప్పల్, ఫలక్నుమా, హుస్సేన్సాగర్ తదితర ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో శబ్దాలు నమోదవుతున్నాయి. కొన్ని హాట్ స్పాట్లలో 110 డెసిబుల్స్ నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. దీని ప్రభావం వినికిడి శక్తి, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 8 గంటల మధ్య.. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం.. నగరంలో వివిధ ప్రాంతాలను బట్టి శబ్ద తీవ్రత 45 నుంచి గరిష్టంగా 65 డెసిబుల్స్ మధ్య ఉండాలి. అయితే.. జూబ్లీహిల్స్, అబిడ్స్, తార్నాక, గచి్చబౌలి, జూపార్క్, ఫలక్నుమా, ఉప్పల్, హుస్సేన్సాగర్, సనత్నగర్, జీడిమెట్ల, గడ్డపోతారం తదితర ప్రాంతాల్లో సాయంత్రం వేళల్లో 100 డెసిబుల్స్ మించిపోతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గచి్చ»ౌలి– ఉప్పల్ దారిలో మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 8 గంటల మధ్య 110 డీబీ శబ్దం నమోదవుతోంది. మోటారు వాహన చట్టం ప్రకారం అనవసరంగా హారన్ మోగించడం నిషేధం. సిటీ పరిధిలో మోటారు సైకిల్, కారు, ఆటో, బస్సు, లారీ, ఇతర ప్రైవేటు వాహనాలకు భారీ శబ్దాలు వచ్చే హారన్, సైలెన్సర్లు బిగిస్తున్నారు. పోలీసులు అప్పుడప్పుడు స్పెషల్ డ్రైవ్లో మోటారు సైకిళ్ల సైలెన్సర్లపై చలానాలు విధిస్తున్నారు. మిగతా హెవీ వెహికిల్స్పై మాత్రం దృష్టి పెట్టడం లేదు. నగరం నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా తదితర ప్రాంతాలకు వెళ్లే ట్రావెల్ బస్సులు భారీ శబ్దాలు వచ్చే హారన్లతో సాయంత్రం వేళల్లో మోత మోగిస్తున్నాయి. గతంలో ఒక దఫా ఆర్టీసీ బస్సులపై కేసులు నమోదు చేసిన అధికారులు తదుపరి తనిఖీలను మాత్రం విస్మరించారు. ఆటోమేటిక్ చలానా సిస్టం.. నగరంలో శబ్ద కాలుష్యాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి ట్రాఫిక్ పోలీసులు 2020లో సిగ్నళ్ల వద్ద అకౌస్టిక్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఫలితంగా సిగ్నల్ దగ్గర పరిమితికి మించి ఎవరైనా హారన్ మోగించినా, ఇంకా ఏ ఇతర కారణాలతోనైనా నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువ శబ్దం చేస్తే ఈ మీటర్ ఆటోమేటిక్గా ఫొటో తీసి, చలానా వేస్తుంది. అప్పట్లో కోవిడ్ ప్రభావంతో ఇది ప్రతిపాదనలకే పరిమితమైంది. కర్ణభేరి పగిలితే కష్టమే.. పరిమితికి మించి శబ్దం చేయడం వల్ల వినికిడి లోపం వస్తుంది. 20 డీబీ వకు సేఫ్. నగరంలో సుమారు 70 డీబీ నమోదవుతోంది. ఇది కొంత ప్రమాదకరమే. కళ్లు తిరగడం, ట్యూమర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. పనిలో ఏకాగ్రత దెబ్బ తింటుంది. చెవిలోని కర్ణభేరి పగిలితే మళ్లీ దాన్ని పునరుద్ధరించలేం. – భూపేందర్ రాథోడ్, ప్రొఫెసర్, ఈఎన్టీ హెచ్ఓడీ, గాంధీ ఆసుపత్రిహారన్ను వీడితే 50 శాతం ధ్వని కాలుష్యం తగ్గుతుంది.. 2017 మోటారు వెహికిల్ చట్టం ప్రకారం ప్రమాదమనిపిస్తే తప్ప డ్రైవర్ హారన్ మోగించరాదు. దీన్ని ఎవరూ పాటించడంలేదు. హారన్కు బదులు బ్రేక్ వినియోగించాలి. హారన్ వినియోగించకపోతే సుమారు 50 శాతం సమస్య పరిష్కారమవుతుంది. – నరేష్ రాఘవన్, రహదారి భద్రత నిపుణులు గూబ గుయ్! -
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
చేవెళ్ల: వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. చేవెళ్ల హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండే గోవిందగారి పురుషోత్తంరెడ్డికి రెండేళ్ల కిత్రం హైదరాబాద్లోని కాళీమందిర్కు చెందిన తరుణి అలియాస్ యమున(30)తో వివాహ జరిగింది. కొన్నేళ్ల పాటు వారిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. అనుకోకుండా శనివారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె గదిలో గడియ పెట్టుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంత పిలిచినా బయటకు రాకపోవటంతో కుటుంబసభ్యులు తలుపు తెరిచి చూడగా విగత జీవిగా కనిపించింది. దీనిపై మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. యువతి అదృశ్యం నాగోలు: ఇంట్లో నుండి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..బండ్లగూడ ఇందు అరణ్య అపార్ట్మెంట్లో నివాసముండే సంకేపల్లి నిహారిక(28) ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. ఈ నెల5న ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి రాత్రైనా రాలేదు. కుటుంబ సభ్యు లు ఫోన్ చేయగా స్విచ్ఛా ఫ్ వచి్చంది. స్నేహితులు, బంధువులతో ఆరా తీసి నా ఫలితం లేకపోవడంతో ఆదివారం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇంటి రుచులకు కేరాఫ్.. హోమ్ చెఫ్..!
ఇంట్లో వంటలు చేస్తూ.. అదే చేత్తో ఏదో వేణ్నీళ్లకు చన్నీళ్లు అన్నట్లు పరిమితంగా కేటరింగ్ సేవలు కూడా అందించే హోమ్ చెఫ్స్ అనేది ఇప్పుడు పాత చరిత్ర. స్టార్ హోటల్స్ అధిపతులతో మీటింగ్లూ, బడా రెస్టారెంట్లలో ఈటింగ్లూ వెరసి పాపులర్ హోమ్చెఫ్స్ జాబితాలో లిస్టింగ్లూ కామన్గా మారుతోంది.. ప్రస్తుతం నడుస్తున్న చరిత్రకావచ్చు.. ట్రెండ్ కావచ్చు.. మొత్తానికి ఇంటి రుచులకు కేరాఫ అడ్రస్గా నిలుస్తున్నారు హోమ్ చెఫ్స్.. హైదరాబాద్ నగరంలో రెస్టారెంట్ ఫుడ్ ఫెస్టివల్స్లో హోమ్ చెఫ్లు ఎక్కువగా పాల్గొంటున్నారు. ప్రత్యేకమైన శైలితో భోజనప్రియులకు కొత్త అనుభవాలు పంచుతున్నారు. హోమ్ చెఫ్స్ కూడా వింత రుచులను వండి వడ్డిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రాంతీయ ప్రత్యేకతలను అచ్చంగా అదే విధంగా అందించడం వీరితోనే సాధ్యమవుతుండడంతో నగరంలోని దాదాపు ప్రతి స్టార్ హోటల్, టాప్ క్లాస్ రెస్టారెంట్ వీరి సేవలను వినియోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి. లోకల్.. రుచులుఇటీవల సోమాజిగూడలోని ఆక్వా, ది పార్క్లో జరిగిన ‘బోనాలు ఫెస్ట్’ దప్పళం, (మేక ఆఫల్) మేక తల కూర వంటి వంటకాలతో తెలంగాణ అచ్చమైన రుచులను ప్రదర్శించింది అంటే కారణం దానికి సారథ్యం వహించింది ఓ హోమ్ చెఫ్. అదే విధంగా రాయలసీమ రుచుల పండుగకు గానీ, గోదావరి ఘుమఘుమలు వడ్డించాలన్నా గానీ.. నగరంలోని హోమ్ చెఫ్స్కు జై కొట్టాల్సిందే అంటున్నాయి రెస్టారెంట్స్. గచ్చిబౌలిలోని షెరటాన్ హోటల్ ఏకంగా ఏడుగురు హోమ్ చెఫ్స్తో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి సందడి సృష్టించింది. ఈ ఫెస్టివల్లో ఆర్కిటెక్ట్ అయిన మీరా, ప్రీ స్కూల్ యజమాని అయిన స్ఫూర్తి, నిజామీ వంటకాలను ఇంటి నుంచే అందించే షహీన్, మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తున్న శ్రియ.. ఇలా భిన్న రంగాలకు చెందిన మహిళలు పాకశాస్త్రంలో ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ రుచుల పండుగకు సారధ్యం వహించారు. ఇతర నగరాల నుంచి.. ఇంటి వంటకు, ఇంతి వంటకు రెస్టారెంట్స్ పెద్ద పీట వేయడం అనేది స్థానిక మహిళల వరకే పరిమితం కాలేదు. పలు నగరాల నుంచి కూడా హోమ్ చెఫ్స్ నగరానికి తరలి వచ్చేందుకు ఇది దోహదం చేస్తోంది. ఇటీవలే నాగా క్యూలినరీ ట్రయల్స్: గోవా నుంచి హోమ్ చెఫ్ అలిస్టైర్ లెథోర్న్ వచ్చిది పార్క్లో నాగా వంటకాలను ప్రదర్శించారు. ఫ్యూజన్ ఫుడ్తో పాటు క్లాసిక్ నాగా వంటకాలను అందించారు. (చదవండి: అరే..! మరీ ఇలానా..! గర్ల్ఫ్రెండ్ కోసం ఎంత పనిచేశాడంటే.?)అమ్మతో ఆరంభం.. అత్తమ్మతో నైపుణ్యం.. నగరంలోని మారియట్ హోటల్ వేదికగా గత నెల్లో బొహ్రా క్యుజిన్ను నగరవాసులకు రుచి చూపించారు అలిఫియా అమ్రేలివాలా. తన భర్త అజీజ్తో సహా వచ్చి కొన్ని రోజుల పాటు నగరానికి గెస్ట్గా ఉండి.. తమ వెరైటీ వంటకాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘చిన్నప్పటి నుంచి వంట చేయడం ఇష్టం, అమ్మ దగ్గర కొంత నేర్చుకున్నా, పెళ్లి తర్వాత, మా అత్తగారి నుంచి మరిన్ని నైపుణ్యాలను అలవర్చుకున్నా.., నా భర్త అజీజ్ కుటుంబ వ్యాపారాన్ని నిర్వహిస్తుండగా, నేను ఇంటి పరిసరాల్లోనే క్యాటరింగ్ ప్రారంభించా. కాలక్రమంలో నా భర్త కూడా సహకారం అందిస్తుండడంతో మా మెనూ విస్తరించాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఫుడ్ ఫెస్ట్లు నిర్వహించి, పలు నగరాల నుంచి ఆహ్వానాలు వస్తుండడంతో పూణె, హైదరాబాద్లోనూ ఫుడ్ ఫెస్ట్లను ఏర్పాటు చేశాం. హైదరాబాదీలు మా వంటకాలను రుచి చూసి, వావ్ ఇవి వెరైటీగా బాగున్నాయి అంటూ కొనియాడడం మాకు ఎంతో సంతృప్తిని అందించింది. – అలియా, హోమ్ చెఫ్, ముంబై (చదవండి: Golden Chariot Tour: ప్రైడ్ ఆఫ్ కర్నాటక విత్ గోవా..జస్ట్ ఒకే రైలుబండిలో..!) -
కన్నుల పండువగా శోభాయాత్ర భారీగా తరలివచ్చిన భక్తులు (ఫొటోలు)
-
హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర
హైదరాబాద్: నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఆదివారం సాయంత్రవేళ అంబర్ పేటలో శోభాయాత్ర ర్యాలీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ..శ్రీరామ నవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హిందువులందరూ ఉత్సవాలను శోభాయామానంగా నిర్వహించడం శుభపరిణామం. దేశంలోని లక్షలాది గ్రామాల్లో అనేక దేవాలయాల్లో యువకులు ఏకమై శోభాయాత్రలు, సీతారాముల కళ్యాణం పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయం. అయోధ్యలో రామమందిర నిర్మాణం తరువాత భక్తులలో మరింత పట్టుదల, భక్తిశ్రద్ధలు పెరిగాయి. ఇది మంచి శుభపరిణామం’ అని అన్నారు కిషన్ రెడ్డి. -
హెచ్సీయూ వివాదం.. కేటీఆర్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి, హెచ్సీయూ రక్షణకు చేతులు కలపాలంటూ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. హెచ్సీయూ భూముల వివాదం నేపథ్యంలో రేవంత్ సర్కార్ తీరును లేఖలో ఎండగట్టారు. 400 ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడింది. 734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు, 10 క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా ఆపుదాం అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.‘‘ప్రభుత్వం ఆర్థిక లాభం కోసం పర్యావరణంపై దాడి చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణం నాశనం చేసే ప్రణాళికలు కొనసాగిస్తోంది. విద్యార్థుల నిరసనకు సలాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుతంగా అడవి రక్షణకు పోరాడుతున్నారు. విద్యార్థులపై అపవాదులు, యూనివర్సిటీని తరలించే బెదిరింపులు ప్రభుత్వ రియల్ ఎస్టేట్ మనస్తత్వానికి నిదర్శనం’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.ఎకో పార్క్ పేరుతో సరికొత్త మోసం. అడవిని కాపాడే బదులు భూమి ఆక్రమణకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. నిరసనలు కొనసాగితే హెచ్సీయూని "ఫోర్త్ సిటీ"కి తరలిస్తామని హెచ్చరిక తప్పు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులకు మద్దతుగా నిలవాలి. కంచ గచ్చిబౌలి, యూనివర్సిటీని కాపాడుతామని పార్టీ నుంచి హామీ హామీ ఇస్తున్నాము. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించి, భూమి విక్రయాన్ని రద్దు చేయాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
ఇల్లు కొనే ట్రెండ్.. కరోనాకు ముందు, తర్వాత..
కరోనా తర్వాత నుంచి గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారాయి. నివాస కొనుగోళ్ల ట్రెండ్ను కరోనాకు ముందు, ఆ తర్వాత అని విభజించాల్సిన పరిస్థితి వచ్చింది. కోవిడ్ కంటే ముందు ఇల్లు కొనాలంటే మొదటి ప్రాధాన్యత బడ్జెట్ ఎంత అనే.. కానీ, కరోనా తర్వాత బడ్జెట్ అంటే లెక్కేలేదు. విస్తీర్ణమైన ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోమహమ్మారితో వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో ఇంటిలో గడిపే సమయం పెరిగింది. మరోవైపు ఐసొలేషన్ కారణంగా విశాలమైన, ప్రత్యేక గదుల అవసరం ఏర్పడింది. దీంతో గృహ కొనుగోలుదారులు క్రమంగా విశాలమైన ఇళ్లకు మారిపోతున్నారు. అప్పటిదాకా 2 బీహెచ్కే వాసులు.. క్రమంగా 3 వైపు.. 3 బీహెచ్కే వాసులు నాలుగు పడక గదుల్లో ఉండేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో గ్రేటర్లో ఇంటి విస్తీర్ణాలు క్రమంగా పెరుగుతున్నాయి. కస్టమర్ల అభిరుచులకు తగినట్టుగా డెవలపర్లు కూడా విశాలమైన ఇళ్లనే నిర్మిస్తున్నారు. 4 బీహెచ్కేకు ఆదరణ.. స్థిరమైన ధరలు, అధిక రాబడుల కారణంగా హైదరాబాద్లో ప్రాపర్టీలలో పెట్టుబడులకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద కుటుంబాలు, విలాసవంతమైన జీవనశైలి, ఆధునిక వసతులు కోరుకునేవారు ఎక్కువగా 4 బీహెచ్కే అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తున్నారు. మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కొంపల్లి, కూకట్పల్లి వంటి ప్రాంతాలలో 4 బీహెచ్కే అపార్ట్మెంట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. సైనిక్పురి, యాప్రాల్, నాచారం, మల్లాపూర్, తార్నాక, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లోని యూనిట్లకూ ఆదరణ బాగానే ఉంది. వీటి సగటు ధర రూ.1.78 కోట్ల నుంచి ఉన్నాయి.గ్రేటర్లో పెరిగిన విస్తీర్ణాలు.. హైదరాబాద్లో ఏటేటా అపార్ట్మెంట్ల విస్తీర్ణాలు పెరుగుతున్నాయి. 2014లో నగరంలో ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 1,830గా ఉండగా.. 2018 నాటికి 1,600లకు తగ్గాయి. నాలుగేళ్లలో ఏకంగా ఫ్లాట్ల సైజు 13 శాతం తగ్గింది. కోవిడ్ కాలంలో ఇంట్లో గడిపే సమయం ఎక్కువైపోయింది. దీంతో ఇంటి అవసరం తెలిసొచ్చింది. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్లతో ఇంట్లో ప్రత్యేక గది అనివార్యమైపోయింది. దీంతో ఇంటి విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2019లో నగరంలో ఫ్లాట్ల సగటు విస్తీర్ణం 1,700 చ.అ.లుగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 2,200 చ.అ.లకు పెరిగింది.45 శాతం డిమాండ్.. కరోనా కంటే ముందు లగ్జరీ గృహాలైన 4 బీహెచ్కే ఫ్లాట్లకు 27 శాతం డిమాండ్ ఉండగా.. ఇప్పుడది ఏకంగా 45 శాతానికి పెరిగిందని అనరాక్–ఫిక్కీ హోమ్ బయ్యర్స్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. గత ఐదేళ్లలో దేశంలోని ఏడు నగరాల్లో అపార్ట్మెంట్ల విస్తీర్ణాలు 32 శాతం మేర పెరిగాయి. 2019లో సగటు ఫ్లాట్ సైజు 1,145 చ.అ.లుగా ఉండగా.. ఇప్పుడది 1,513 చ.అ.లకు పెరిగింది. -
హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభాయాత్ర
-
సత్వర స్పందనతోనే.. స్కామ్ బట్టబయలు
తమిళనాడు కడలూరు జిల్లాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్రాంచ్ మేనేజర్గా పని చేసిన ఓ మహిళ కుమారుడు తరచు ఆ బ్యాంక్కు వచ్చి వెళ్తుండే వాడు. ఇలా ఆ కార్యకలాపాలన్నీ తెలుసుకున్న ఈ బాబు– తనకు పరిచయస్థులైన మరో ఇద్దరితో కలిసి అక్కడి పన్రుటిలో ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ తెరిచాడు. ఈ బ్రాంచ్ మూడు నెలలు బాగానే నడిచినా, 2020 జూలైలో పోలీసులకు ఫిర్యాదు అందటంతో, ముగ్గురు నిందితులను జైలుకు పంపారు. దాంతో బ్రాంచ్ మూతపడింది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడానికి కారణమేమిటంటే, అక్కడకు వచ్చే కస్టమర్లతో ముగ్గురు నకిలీ ఉద్యోగులూ అత్యంత మర్యాదగా ప్రవర్తిస్తూ, వారి సమస్యలపై సత్వరం స్పందిస్తుండటమే!ఇలాంటి స్పందన కారణంగానే హైదరాబాద్లోనూ నకిలీ బ్యాంక్ గ్యారంటీల స్కామ్ బయట పడింది. దీనిపై 2023 జనవరి 15న కేసు నమోదు చేసుకున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు అదే నెల 28న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రభుత్వ రంగంతో పాటు బ్యాంకింగ్ సెక్టార్లోనూ కొన్ని అంశాల్లో తీవ్ర జాప్యం ఉంటుంది. ప్రధానంగా ఉత్తర ప్రత్యుత్తరాలకు రోజులు, వారాలే కాదు అవసరమైతే నెలలు కూడా వేచి చూడాలి. అయితే ఓ బ్యాంక్ గ్యారంటీ అంశానికి సంబంధించి ఈ–మెయిల్ పంపిన ఐదు నిమిషాల్లోనే జవాబు వచ్చేస్తే? అలాంటి స్పందనపై రాష్ట్ర ప్రభుత్వ అధికారికి వచ్చిన సందేహమే ఈ నకిలీ బ్యాంక్ గ్యారంటీల స్కామ్ను వెలుగులోకి తెచ్చింది.పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నకిలీ బ్యాంక్ గ్యారంటీ పత్రాల తయారీ అడ్డాలు ఉన్నాయి. సరైన అర్హతలు లేని కంపెనీలు కాంట్రాక్టులు దక్కించుకోవడానికి, బ్యాంకు రుణాలు పొందడానికి నకిలీ బ్యాంక్ గ్యారంటీలు ఉపకరిస్తూ ఉంటాయి. కోల్కతా ముఠాలకు దేశవ్యాప్తంగా ఏజెంట్లు ఉంటారు. వరంగల్కు చెందిన లోన్ ఏజెంట్ నాగరాజు వారిలో ఒకడు. చెన్నైకి చెందిన హర్షిత ఇన్స్ ఫ్రా ఇంజనీరింగ్ కంపెనీ అప్పట్లో రాష్ట్రంలో కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంది. వీటి కోసం హర్షిత సంస్థ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు బ్యాంకు గ్యారంటీలు సమర్పించాల్సి వచ్చింది. సాంకేతిక, అనివార్య కారణాల నేపథ్యంలో కొన్ని వ్యాపార సంస్థలు, కొందరు కాంట్రాక్టర్లు ఈ బ్యాంక్ గ్యారంటీల కోసం ఏజెంట్ల సహాయం తీసుకుంటూ ఉంటారు. దీనికోసం కొందరు ఏజెంట్ల వద్దకు వెళ్తే, మరికొందరు ఏజెంట్లు కమీషన్ల కోసం వీళ్లను వెతుక్కుంటూ వస్తుంటారు. అప్పట్లో నాగరాజు స్వయంగా హర్షిత ఇన్ఫ్రా ఎండీని కలిశాడు. ఆయనకు అవసరమైన బ్యాంకు గ్యారంటీలు అందిస్తానని, అందుకు కొంత కమీషన్ చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. వ్యాపార రంగంలో బ్యాంక్ గ్యారంటీలు సాధారణమే కావడంతో హర్షిత ఇన్ఫ్రా ఎండీ అంగీకరించారు. నాగరాజుకు కొన్నేళ్ళ క్రితం రాజస్థాన్కు చెందిన నరేష్ వర్మ ద్వారా కోల్కతా వాసులు నీలోత్పల్ దాస్, శుభ్రజిత్ ఘోషాల్లతో పరిచయమైంది. ఈ నలుగురూ కలసి గతంలో అనేక బ్యాంకులకు సంబంధించిన బ్యాంక్ గ్యారంటీ పత్రాలను వివిధ కంపెనీలకు అందించారు. ఈ వ్యాపారం చేసే వారికి అనేక బ్యాంకులతో ఒప్పందాలు ఉంటాయి. నిర్ణీత సమయానికి గ్యారంటీ పత్రం తీసుకోవడానికి కొన్ని నిబంధనలు పాటించడంతో పాటు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బు మిగుల్చుకోవాలని భావించిన ఆ నలుగురూ హర్షిత సంస్థకు మాత్రం ఇండస్ఇండ్ బ్యాంక్ పేరుతో నకిలీ పత్రాలు తయారు చేసి అందించారు. ఇవి నకిలీవని తెలియని హర్షిత సంస్థ వాటిని అర్బన్ డెవలప్మెంట్ శాఖకు దాఖలు చేసి కాంట్రాక్టు పనులు కూడా పొందింది. కాంట్రాక్టర్లు, కాంట్రాక్టులు పొందిన సంస్థల నుంచి ఈ బ్యాంకు గ్యారంటీ పత్రాలు పొందే ప్రభుత్వ విభాగాలు సాధారణంగా క్రాస్ చెక్ చేయవు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆ బ్యాంక్ను సంప్రదించి సందేహ నివృత్తి చేసుకుంటాయి. ఈ ఉత్తరప్రత్యుత్తరాలు ఈ–మెయిల్ ద్వారా జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ విభాగాలు, బ్యాంక్ గ్యారంటీ తీసుకున్న సంస్థలు క్రాస్ చెక్ చేస్తాయని తెలిసిన కోల్కతా ద్వయం– ఇలా వచ్చే ఈ–మెయిల్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని మెయిల్ ఐడీలు రూపొందించింది. హర్షిత ఇన్ఫ్రా సంస్థ ద్వారా అందుకున్న బ్యాంక్ గ్యారంటీలను సరిచూడాలని భావించిన అర్బన్ డెవలప్మెంట్ అధికారి అందులో ఉన్న ఈ–మెయిల్కు సంప్రదించారు. ఫలానా బ్యాంక్ గ్యారంటీ లేఖ మీరు జారీ చేసిందేనా? అని ప్రశ్నించారు. ఈ–మెయిల్ను అందుకున్న శుభ్రజిత్ బ్యాంకు అధికారి మాదిరిగానే స్పందిస్తూ, అవి నిజమైనవేనంటూ బదులిచ్చాడు. కేవలం ఐదు నిమిషాల్లోనే సమాధానం రావడంతో అర్బన్ డెవలప్మెంట్ అధికారి సందేహించారు. దీంతో కోల్కతాలోని బ్రాంచ్ నుంచి వచ్చిన జవాబును, ఆ బ్యాంకు గ్యారంటీలను పత్రాలను మరోసారి సరిచూడాలని భావించారు. వీటిని ముంబైలోని ఇండస్ఇండ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయానికి ఈ–మెయిల్ ద్వారా పంపి తమ సందేహాలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని చూసిన అక్కడి అధికారులు అవాక్కయ్యారు. గ్యారంటీ పత్రాల్లో పేర్కొన్న ప్రాంతంలో తమకు అసలు బ్రాంచ్ లేదని స్పష్టం చేశారు. తమ ఈ–మెయిల్ ఐడీలు కూడా అలా ఉండవని తెలిపారు. దీంతో ఈ శాఖ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఉన్నతాధికారులు దీని దర్యాప్తును సీసీఎస్కు బదిలీ చేశారు. మరోపక్క అసలు విషయం తెలుసుకున్న హర్షిత సంస్థ కూడా నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నమోదైన కేసు కూడా సీసీఎస్కు బదిలీ అయింది. వీటిని దర్యాప్తు చేసిన అధికారులు మొత్తం నలుగురు నిందితులనూ అరెస్టు చేశారు. వీరిపై అభియోగపత్రాలు సైతం దాఖలు కావడంతో ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణ సాగుతోంది. -
#SRHvsGT : సిరాజ్, గిల్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే (ఫొటోలు)
-
MMTS Train: రైల్వే భద్రత కట్టుదిట్టం!
సికింద్రాబాద్– మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార యత్నం ఘటన రైల్వే పోలీసుల డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. ఘటన జరిగి 15 రోజులు గడిచినా ఈ కేసు మిస్టరీ వీడనేలేదు. అధునాతన సాంకేతికతను సొంతం చేసుకున్నామంటూ గొప్పలు చెప్పే నగర పోలీసులు.. అత్యాచార యత్నం కేసు గుట్టు విప్పలేకపోయారు. కాగా.. ఈ ఘటన రైల్వే పోలీసులకు కనువిప్పు కలిగించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. ఇటు జీఆర్పీ, అటు ఆర్పీఎఫ్ పోలీసు బాస్లు మహిళలే ఉండడంతో ఎంఎంటీఎస్ రైళ్లు, రైల్వేస్టేషన్లలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. తనపై లైంగిక దాడికి యత్నించడంతో ఓ యువతి బోగీ నుంచి కిందకు దూకిన ఘటనతో ఎంఎంటీఎస్ రైళ్లలో నిరంతర పోలీసు భద్రత అందుబాటులోకి వచి్చంది. ఉదయం 5 మొదలు అర్ధరాత్రి 12 గంటల వరకు రైల్వే పోలీసులు ఎంఎంటీఎస్ రైళ్లలో పహారా కాసేలా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలోని అన్ని మార్గాల్లో రాకపోకలు సాగించే ఎంఎంటీఎస్ రైళ్లలో ఒక్కో రైలుకు ఇద్దరు ఆర్పీఎఫ్ సిబ్బంది విధుల్లో ఉంటున్నారు. ఇందుకోసం వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసిన ఆర్పీఎఫ్ ఆఫీసర్లు ఏ రూటు ఎంఎంటీఎస్లో ఎవరు డ్యూటీలో ఉన్నారు? ఆ రైలులో మహిళల బోగీల పరిస్థితి ఏంటన్న విషయాన్ని వీడియో కాల్స్, ఫోటోల పోస్టింగ్ల ద్వారా ఆరా తీస్తున్నారు. రైలు బోగీల్లో సీసీ కెమెరాలు.. నగరంలో నడుస్తున్న నాలుగైదు ఎంఎంటీఎస్ రైళ్లలో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. సత్వరమే అన్ని ఎంఎంటీఎస్లలోని మహిళల బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే అంశాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు పరిశీలిస్తున్నారు. మహిళలు వారికి కేటాయించిన బోగీల్లో మాత్రమే ఎక్కాలని అవగాహన కలిగిస్తున్నారు. స్టేషన్లలో భద్రత పెంపు.. 30 స్టేషన్ల నుంచి సుమారు 92 వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో 40 నుంచి 60 వేల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నట్టు అంచనా. అత్యాచార ఘటనకు ముందు కేవలం 9 ఎంఎంటీఎస్ స్టేషన్లలో మాత్రమే ఒక్కో స్టేషన్లో ఒక్కో కానిస్టేబుల్ చొప్పున విధుల్లో ఉండేవారు. ఘటన అనంతరం ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉండే 15 రైల్వేస్టేషన్లలో ఆర్పీఎఫ్ పోలీసు పికెటింగ్లు ఏర్పాటు చేశారు. ఆర్పీఎఫ్ పోలీసుల్లో కూడా సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో జీఆర్పీ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమేణా అన్ని స్టేషన్లలో పోలీసు పహారా ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అత్యాచార యత్నం ఘటన నేపథ్యంలో రైల్వే పోలీసులు తీసుకుంటున్న రక్షణ చర్యల పట్ల మహిళా ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైలు బోగీల్లోనే కాకుండా ఎంఎంటీఎస్ స్టేషన్లలోనూ భద్రత పెంచాలని చెబుతున్నారు. ఇది నిరంతర కొనసాగించాలని కోరుతున్నారు.ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం రైల్వే ప్రయాణికులకు రక్షణ కలి్పంచడం కోసం ప్రత్యేక మొబైల్ బృందాలను ఏర్పాటు చేశామని జీఆర్పీ సికింద్రాబాద్ ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. మహిళలు ప్రమాదకర పరిస్థితులు ఎదురైన సందర్భాల్లో 139 నెంబర్కు కాల్ చేయాలని కోరారు ఒక్కో రైలుకు ఇద్దరేసి గార్డులను ఎస్కార్టు డ్యూటీలో నియమించామని ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యురిటీ ఆఫీసర్ దేబాస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ తెలిపారు. -
Banjara Hills: అడిగిన పాట వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా..
హైదరాబాద్ : తాను కోరిన పాటను ప్రసారం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ యువతి బెదిరించడంతో ఛానల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని ఓ టీవీ ఛానెల్ రోజూ మ్యూజిక్ కార్యక్రమాన్ని లైవ్లో ప్రసారం చేస్తుంది. ఓ యువతి ఈ కార్యక్రమానికి ప్రతిరోజూ ఫోన్ చేస్తూ ఒకే పాటను కోరుకుంటుంది.ఒకసారి ప్రసారం చేసిన తర్వాత కూడా మళ్లీ ఫోన్ చేసి అదే పాట కావాలంటూ పట్టుబడుతూ నిర్వాహకులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఫోన్లో అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే బాగుండదంటూ హెచ్చరించేది. తాజాగా శనివారం ఫోన్ చేసిన ఆమె నేను కోరిన పాటను వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. దీంతో ఆందోళన చెందిన టీవీ నిర్వాహకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శోభాయాత్రకు సర్వం సిద్ధం
అబిడ్స్: శ్రీరామ నవమి శోభాయాత్రకు పలు శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా చారిత్రాత్మక సీతారామ్బాగ్ ఆలయం నుంచి శ్రీరామనవమి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనున్నారు. సీతారామ్బాగ్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర కోఠి హనుమాన్టేక్డీ వరకు కొనసాగుతుంది. సీతారామ్బాగ్ నుంచి భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుక నిర్వహించనున్నారు. ధూల్పేట మాగ్రా నుంచి ఆనంద్సింగ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి పాల్కీ యాత్ర నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ధూల్పేట్ గంగా»ౌలి నుంచి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర కొనసాగుతుంది. మూడు ప్రాంతాల నుంచి కొనసాగే శోభాయాత్రలు మంగళ్హాట్ ప్రధాన రోడ్డులోని అనిత టవర్ వద్ద కలుస్తాయి. పాల్కీ యాత్రకు ఎమ్మెల్సీ కవిత పూజలు ధూల్పేట మాగ్రా నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ నవమి పాల్కీ యాత్రను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారు.మధ్యాహ్నం 12 గంటలకు పూజలు నిర్వహించి యాత్రలో పాల్గొంటారని నిర్వాహకులు ఆనంద్సింగ్, పప్పుమాత్రేలు తెలిపారు. రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి శోభాయాత్ర ఆదివారం ఒంటిగంటకు ప్రారంభమవుతుంది. గంగా»ౌలి నుంచి రాజాసింగ్ ఈ శోభాయాత్రను ప్రారంభిస్తారు. శోభాయాత్ర కొనసాగే రూట్.. శ్రీరామ నవమి శోభాయాత్ర, పాల్కీ శోభాయాత్ర, రాజాసింగ్ శోభాయాత్రలు మంగళ్హాట్లో కలుసుకొని పురానాపూల్, జుమ్మేరాత్బజార్, చుడీబజార్, భేగంబజార్ ఛత్రి, సిద్దిఅంబర్బజార్, గౌలిగూడ,పుత్లీబౌలి, కోఠి హనుమాన్ టేక్డీ వరకు కొనసాగుతాయి. ఊరేగింపులో శ్రీరాముడితో పాటు పలు దేవుళ్ల విగ్రహాలుంటాయి.సీసీ కెమెరాలతో పోలీసుల నిరంతర పర్యవేక్షణనగర పోలీసులు 20 వేల మంది పోలీసులతో శోభాయాత్రకు భారీ ఎత్తున బందోబస్తు చేస్తున్నారు. సీతారామ్బాగ్ నుంచి యాత్ర కొనసాగే హనుమాన్ టేక్డీ వరకు వేలాది మంది పోలీసులతో బందోబస్తు చేపడుతారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, నగర జాయింట్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్లు బందోబస్తును స్వయంగా పర్యావేక్షిస్తారు. సౌత్వెస్ట్జోన్ డీసీపీ చంద్రమోహన్, ఈస్ట్జోన్ డీసీపీ బాలస్వామి, సెంట్రల్జోన్ డీసీపీ శిల్పవల్లీలు శోభాయాత్రకు తమ తమ పోలీస్స్టేషన్ల సిబ్బంది, అదనపు బలగాలతో బందోబస్తు చేపడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్రను పర్యావేక్షిస్తారు. పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు.. శ్రీరామ నవమి శోభాయాత్రకు పోలీస్ శాఖతో పాటు జీహెచ్ఎంసీ, ఆర్ అండ్బీ, విద్యుత్, వాటర్బోర్డు, ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మూడు లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు వాటర్బోర్డు జనరల్ మేనేజర్ జాన్ షరీఫ్ తెలిపారు. వాహనాల దారి మళ్లింపు శ్రీరామ నవమి శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో వాహనాలను ఇతర ప్రాంతాల మీదుగా పోలీసులు దారిమళ్లిస్తున్నారు. సీతారామ్బాగ్కు వచ్చే వాహనాలను మల్లేపల్లి, నాంపల్లి మీదుగా దారిమళ్లిస్తారు. బోయిగూడ కమాన్ నుంచి దారుసలాం ఆగాపూరా మీదుగా, పురానాపూల్ నుంచి వాహనాలను జియాగూడ కార్వాన్ వైపు, బేగంబజార్ నుంచి వచ్చే వాహనాలను గోషామహాల్, ఇతర ప్రాంతాలకు దారిమళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తెలంగాణ తాజా పరిస్థితులపై ఏఐసీసీ ఫోకస్.. రంగంలోకి మీనాక్షి నటరాజన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాజా పరిస్థితులపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. మంత్రుల కమిటీతో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై మీనాక్షి చర్చించారు. ఒకట్రెండు రోజుల్లో హైకమాండ్కు మీనాక్షి నివేదిక ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, హెచ్సీయూ భూముల అంశంపై ప్రజాసంఘాలు, పర్యావరణ వేత్తలతో కమిటీ వేశామని తెలిపారు. మంత్రివర్గ కమిటీతో ఇదే అంశం మీద చర్చిస్తున్నామని చెప్పారు. ఏకపక్షంగా కాకుండా అందరి వాదనలు వింటామని.. ఏం చేయాలనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.ఎప్పుడు ఎవరితో మాట్లాడాలి అనే వివరాలు ప్రకటిస్తామని ఆమె తెలిపారు. విద్యార్థుల లేఖలపై సమాచారం సేకరిస్తామని.. ప్రతిపక్షాల ఆరోపణలపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని మీనాక్షి నటరాజన్ వెల్లడించారు. -
హెచ్సీయూ వివాదం: ఏఐ ఫేక్ వీడియోలపై సీఎం రేవంత్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై సీఎం రేవంత్రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్ వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల రేవంత్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేసింది.కంచ గచ్చిబౌలి లోని సర్వే నెంబర్ 25లో ఉన్న భూముల్లో గత 25 ఏండ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఐఎస్బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు బిల్డింగ్ లు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ బిల్డింగ్లను నిర్మించారని.. వాటిని నిర్మించేటప్పుడు ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకు వచ్చారు.అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు కూడా లేవన్నారు. అలాంటప్పుడు అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందని సమావేశంలో చర్చ జరిగింది. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.వాస్తవాలు వెల్లడించేలోగా అబద్ధాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావటం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అధికారులు సీఎంకి వివరించారు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్లోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేశారని పోలీసు అధికారులు సీఎంకు వివరించారు. వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు కూడా వాటినే నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయిందని అన్నారు.ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా ఠండన్ లాంటి వాళ్లందరూ ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫొటోలు, వీడియోల పోస్టు చేసి సమాజానికి తప్పుడు సందేశం చేరవేశారని సమావేశంలో చర్చ జరిగింది. ఈ భూములపై మొట్టమొదటగా ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ జా కొద్ది సేపట్లోనే తన పోస్టును తొలిగించి క్షమాపణలు చెప్పారని, కానీ మిగతా ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియో ప్రచారం చేశారని అధికారులు అభిప్రాయపడ్డారు. కంచె గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందని ఈ సమావేశంలో చర్చ జరిగింది.ఇదే తీరుగా ఇండో పాక్, ఇండో చైనా సరిహద్దుల్లాంటి వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తుల్లో యుద్ధాలు జరిగే ప్రమాదముంటుందని చర్చ జరిగింది. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫొటోలు కరోనా వైరస్ను మించిన మహమ్మారిలాంటివని ఈ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టేలా అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ టూల్స్ను సమకూర్చుకోవాలని సీఎం సూచించారు -
మైనర్ల డ్రైవింగ్.. బండి ఆర్సీ సస్పెండ్!
సాక్షి, హైదరాబాద్: పద్నాలుగేళ్ల పిల్లాడు పాఠశాలకు ద్విచక్ర వాహనంపై వస్తుంటాడు.. పదహారేళ్ల కుర్రాడు జూనియర్ కాలేజీకి స్పోర్ట్స్ బైక్ తెస్తాడు.. పదిహేడేళ్ల యువకుడు కళాశాలకు హైస్పీడ్ (High Speed) వాహనం లేదా కారులో రాకపోకలు సాగిస్తాడు.. నగరంలో నిత్యం కనిపించే దృశ్యాలివి. ఇలాంటి మైనర్లు నగరంలో అనేక మంది అమాయకులను బలి తీసుకోవడంతో పాటు వాళ్లూ ప్రాణాలు కోల్పోతున్నారు. మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదని, వాళ్లు వాహనం నడుపకూడదని తల్లిదండ్రులు, కుటుంబీకులు సహా అందరికీ తెలుసు. అయితే ఎవరూ పక్కాగా పట్టించుకోవట్లేదు. ఈ పరిస్థితులన్ని పరిగణనలోకి తీసుకున్న సిటీ ట్రాఫిక్ చీఫ్ జోయల్ డెవిస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రైవింగ్ చేస్తూ మైనర్లు చిక్కితే ఆ వాహనం రిజిస్ట్రేషన్ను రద్దు చేయనున్నారు. దీనికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ శనివారం నుంచి ప్రారంభమవుతుందని శుక్రవారం ఆయన ప్రకటించారు. కఠిన చట్టాలు లేకపోవడం వల్లే.. ప్రస్తుతం అమలులో ఉన్న మోటారు వెహికిల్ యాక్ట్ (Motor Vehicles Act) ప్రకారం మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండే అవకాశం లేదు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో మాదిరి ఇక్కడ కఠిన చట్టాలు లేకపోవడంతోనే మైనర్లు వాహనాలపై విజృంభిస్తున్నారు. అక్కడ మైనర్లు డ్రైవింగ్ చేస్తూ వస్తే వారితో పాటు తల్లిదండ్రులకూ జరిమానా విధిస్తారు. ఆ జరిమానాలు భారీ స్థాయిలో ఉండటం, మూడు ఉల్లంఘనలకు మించితే తల్లిదండ్రుల లైసెన్స్ పూర్తిగా రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయి. ఇక్కడ అంతటి కఠిన చట్టాలు లేకపోయినా.. ఇప్పటి వరకు అధికారులు ఎంవీ యాక్ట్లోని సెక్షన్ 180 ప్రకారం ఓ మైనర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) లేని వ్యక్తి కానీ వాహనం నడిపితే... అతడితో పాటు వారికి వాహనం అందించిన దాని యజమానికీ జరిమానా విధిస్తున్నారు. ఇక నుంచి ఆ చట్టంలోని 199 (ఎ) సెక్షన్ను వినియోగించాలని జోయల్ డెవిస్ (Joel Davis) నిర్ణయించారు. ఈ సెక్షన్ ప్రకారం వాహనం నడుపుతూ చిక్కిన మైనర్కు జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) ఏడాది పాటు సస్పెండ్ అవుతుంది. సాధారణంగా 18 ఏళ్లు నిండిన వ్యక్తి మొదట లెర్నింగ్ లైసెన్స్, ఆపై శాశ్వత లైసెన్స్ తీసుకోవచ్చు. అయితే డ్రైవింగ్ చేస్తూ చిక్కిన మైనర్కు మాత్రం 25 ఏళ్ల నిండే వరకు ఈ రెండింటిలో ఏదీ తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎవ్వరూ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని జోయల్ డెవిస్ కోరుతున్నారు. ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ రోడ్డు ప్రమాదాలు, అందులో మృతుల్ని తగ్గించడంతో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.చదవండి: ఏదో ఒకరోజు వస్తామంటారు.. ఏ రోజు వస్తారో తెలియదు! -
ఏదో ఒకరోజు వస్తామంటారు.. ఏ రోజు వస్తారో తెలియదు!
సాక్షి, హైదరాబాద్: హిమాయత్నగర్కు చెందిన ఓ వ్యక్తి సంగారెడ్డి జిల్లా కోత్లాపూర్లో పదేళ్ల క్రితం నాలుగు వందల చదరపు గజాల స్థలం కొనుగోలు చేశారు. 2020లో ఎల్ఆర్ఎస్ (LRS) కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఫీజు చెల్లించాలని నోటీస్ వచ్చింది. కానీ.. ఆ స్థలం చెరువుకు దగ్గరలో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు నీటిపారుదల, రెవెన్యూ అధికారుల అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఎల్ఆర్ఎస్ నిబంధనల ప్రకారం కూడా ఇప్పుడు రెవెన్యూ, నీటిపారుదల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే హెచ్ఎండీఏ నుంచి ప్రొసీడింగులు లభిస్తాయి. కానీ.. రెవెన్యూ, నీటిపారుదల అధికారుల కోసం ఎదురుచూస్తూ సదరు వ్యక్తి తన స్థలం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది.ఏదో ఒకరోజు వస్తామని అధికారులు చెబుతున్నారు. ఏ రోజు వస్తారో తెలియక సదరు వ్యక్తి నిత్యం హిమాయత్నగర్ (Himayat Nagar) నుంచి కోత్తాపూర్కు, సంగారెడ్డికి తిరగాల్సి వస్తోంది. ఇది ఒక్క కోత్లాపూర్కు చెందిన బాధితుడి సమస్య మాత్రమే కాదు. చాలామంది దరఖాస్తుదారులు నీటిపారుదల, రెవెన్యూ అధికారుల అలసత్వం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగించినప్పటికీ సాంకేతిక చిక్కులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పథకాన్ని సద్వియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఫీజులు చెల్లించాలా.. వద్దా..? చెరువులు, కుంటలు తదితర నీటి వనరులకు 200 మీటర్ల దూరంలో ఉన్న స్థలాలకు రెవెన్యూ, నీటిపారుదల శాఖల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఎల్ఆర్ఎస్ ఫీజు నోటీసు అందుకున్నవారు ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు ఉంది. క్షేత్రస్థాయి తనిఖీల్లో ఆ స్థలం నీటి వనరులను ఆనుకొని ఉన్నట్లు తేలితే చెల్లించిన ఫీజును తిరిగి దరఖాస్తుదారుల ఖాతాలో జమ చేస్తారు. కాగా.. ప్రాసెసింగ్ పేరిట 10 శాతం వసూలు చేస్తారు. దీంతో చాలామంది ముందస్తుగా ఫీజులు చెల్లించేందుకు వెనకడుగు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తి చేసిన తరువాతనే ఫీజు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల మధ్య సమన్వయ లోపం తదితర కారణాలతో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి వర్గాలు శివారు ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేశారు. అలాగే.. వివిధ జిల్లాలకు చెందినవారు సైతం నగరానికి చేరువలో సొంత స్థలాలను కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఘట్కేసర్, పోచారం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో స్థలాలను కొనిపెట్టుకున్నారు. ఇలా వివిధ చోట్ల కొనుగోలు చేసిన వాళ్లంతా అటు అధికారుల చుట్టూ, ఇటు తమ స్థలాల వద్దకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ప్రొసీడింగులు లభిస్తాయో లేదోననే సందేహంతో ఫీజులు చెల్లించేందుకు వెనకడుగు వేస్తున్నారు. హెచ్ఎండీఏ (HMDA) కార్యాలయంతో పాటు పలు మున్సిపల్ కార్యాలయాలకు బాధితులు బారులు తీరుతున్నారు. ఎల్–1, ఎల్–2 స్థాయిలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు.సర్వర్ల డౌన్తో అవస్థలు.. సాంకేతిక కష్టాలు అధికారులను సైతం వదలడం లేదు. తరచూ సర్వర్లు డౌన్ కావడంతో అకస్మాత్తుగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ స్తంభించిపోతోంది. తిరిగి ఆన్లైన్ (Online) సేవలను పునరుద్ధరించేవరకు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ‘ఒక్కో జోన్లో నలుగురైదుగురు టెక్నికల్ సిబ్బంది పని చేస్తున్నప్పటికీ రోజుకు 40 ఫైళ్లు కూడా పరిష్కరించలేకపోతున్నాం’ అని ఒక అధికారి తెలిపారు.చదవండి: హైదరాబాద్లో రియల్ఎస్టేట్ ధరలు పెరిగే సూచనలుసర్వర్ డౌన్ (Server Down) కావడంతో గంటకోసారి ‘ఎర్రర్’ వచ్చేసి పనులు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. హెచ్ఎండీఏలో సుమారు 3.44 లక్షల దరఖాస్తులు ఉండగా.. ఇప్పటి వరకు 40 వేలుకూడా పూర్తి కాకపోవడం గమనార్హం. ఎల్ఆర్ఎస్ ఫీజుల రూపంలో హెచ్ఎండీఏకు రూ.1,500 కోట్లు వస్తాయని అంచనా. కాగా.. ఇప్పటి వరకు రూ.120 కోట్ల ఆదాయం కూడా లభించలేదు. -
హైదరాబాద్: టవర్స్పై నుంచి దూకిన ఇన్కంట్యాక్స్ అధికారిణి
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. గాంధీనగర్లో ఇన్కంట్యాక్స్ ఆఫీసర్ జయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీజీవో టవర్స్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. భవనంపై నుంచి దూకి.. దీంతో తీవ్ర గాయాలతో పడివున్న ఆమెను స్థానికులు గుర్తించి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు సమాచారం. జయలక్ష్మి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనారోగ్య కారణాల వల్లనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సీతారాముల కల్యాణం.. చూతము రారండీ..
శ్రీ సీతారాముల కల్యాణానికి నగరం నలుమూలలా ఉన్న రామాలయాలు ముస్తాబయ్యాయి. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన ఆలయం ‘అమ్మపల్లి’ దేవస్థానం. ఏకశిలా రాతి విగ్రహంతో.. దశావతారంలో మకర తోరణం కలిగి శ్రీ సీతారామ లక్ష్మణులు ఇక్కడ కొలువయ్యారు. యేటా రామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ శివారులోని అమ్మపల్లిలోని ఈ ఆలయం 18వ శతాబ్దంలో నిర్మించినట్లు ప్రశస్థి. ఇక్కడి ఆలయ, ప్రాకారాల నిర్మాణాల గురించి ఎలాంటి లిఖిత పూర్వక ఆధారాలూ లేకపోయినా.. అప్పటి నిర్మాణ శైలి, విగ్రహ రూపాలను బట్టి 18వ శతాబ్దం నాటివిగా పురావస్తు శాఖ అంచనా వేస్తోంది. నర్కూడలోని అమ్మపల్లి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో రెండు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, ధ్వజారోహణం నిర్వహించారు. ఆదివారం ఉదయం 11.49 గంటలకు స్వామి కల్యాణం జరుగనుంది. భక్తుల సౌకర్యార్థం ప్రధాన ఆలయం చుట్టూ క్యూలైన్లు, ఇతర ఏర్పాటు చేస్తున్నారు అధికారులు.ఎత్తయిన ఆలయ గోపురం.. అమ్మపల్లి ఆలయానికి ఎత్తయిన గోపురం ప్రత్యేక ఆకర్షణ. సుమారు 80 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో ఈ గోపురం నిర్మితమైంది. ఆలయ గోపురం, ప్రాకారాలు చారిత్రక కళా నైపుణ్యాన్ని చాటి చెబుతాయి. ఆలయానికి ఈశాన్యంలో కోనేరు, వెనకాల మరో కోనేరు ఆకర్షణీయంగా నిలుస్తాయి. ఎదురుగా ఉన్న మంటపంలో యేటా శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. మంటప సమీపంలో నగారా, రథశాల ఉన్నాయి. శ్రీరామ లింగేశ్వర, శ్రీ ఆంజనేయస్వామి ఉప ఆలయాలు ఉన్నాయి.గద్వాల్ సంస్థానం నుంచి విగ్రహాలు.. నిజాం దర్బార్లో వివిధ హోదాల్లో పని చేసిన రాజా భవానీ ప్రసాద్ భటా్నగర్ 1790లో దేవాలయం పనులను ప్రారంభించగా.. 1802లో విగ్రహ ఆవిష్కరణను కేరళకు చెందిన పూజారి వెంకటరమణాచారి, రాజా భవానీ ప్రసాద్ల నేతృత్వంలో గద్వాల్ సంస్థానం నుండి శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలను తీసుకొచ్చి అత్తాపూర్ రాంబాగ్లో విగ్రహా ప్రతిష్టాపన చేశారు. దీనికి మూడో నిజాం సికిందర్ జా ముఖ్య అతిథిగా హజరయ్యారు. నాటి నుంచి నేటి వరకూ వారి వారసులు ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. 300 సంవత్సరాలు గల ఈ దేవాలయానికి భక్తులు అధికంగా వస్తుంటారు. భద్రాది రాములోరి కల్యాణం జరిగే సమయంలోనే అత్తాపూర్ రాంబాగ్ దేవాలయంలో అత్యంత వైభవంగా కల్యాణ ఉత్సవం ఆనవాయితీగా వస్తుంది.అత్తాపూర్ రాంబాగ్లో.. అత్తాపూర్ : అత్తాపూర్ రాంబాగ్లోని చారిత్రాత్మక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం కల్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. ఇప్పటికే దేవాలయాన్ని రంగులు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ మహోత్సవం, 7న దశమి రోజున రథోత్సవంతో పాటు లంకా దహనం, 8న సీతారామలక్ష్మణులకు దోపుసేవ, 9న వీధి సేవతో పాటు చక్రతీర్థం వంటి కార్యక్రమాలతో ముగుస్తాయని పూజారి తిరుమల దేశభక్త ప్రభాకర్, శ్రీనివాస్లు వెల్లడించారు. -
రైలుకిందపడి నర్సు ఆత్మహత్య
సికింద్రాబాద్: ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం ఒక యువతి మౌలాలి–చర్లపల్లి రైల్వేస్టేషన్ మధ్య గల రైల్వే ట్రాక్పైకి వచ్చింది. ఆమెను గుర్తించిన కీ మ్యాన్ వారిస్తున్నా వినకుండా మౌలాలి నుంచి చర్లపల్లి వైపు వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకుని ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలంలో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలు వరంగల్ ఉర్సుకు చెందిన రవికుమార్ కుమార్తె మాదారపు లత (30)గా గుర్తించారు. హన్మకొండలోని శ్రీలక్ష్మి ఆసుపత్రిలో ఆమె నర్సుగా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని, గతంలోనూ ఇంట్లో చెప్పకుండా మహబూబాబాద్ రైల్వేస్టేషన్కు వెళ్లిందని, సమాచారం అందుకుని తాము తిరిగి ఇంటికి తీసుకువచ్చినట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటికి వచ్చిందని, చర్లపల్లి వైపు వెళుతుందని తాము ఊహించలేదన్నారు. ఇదిలా ఉండగా మృతురాలి హ్యాండ్బ్యాగులో లభించిన లేఖలో హిందూ సంప్రదాయం ప్రకారం తన అంత్యక్రియలు నిర్వహించాలని పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. -
నేను డీఎస్పీని..పదండి పోలీస్స్టేషన్కు..
హైదరాబాద్: నంబర్ ప్లేట్ లేని కారుకు పోలీస్ స్టిక్కర్ తగిలించుకుని వెళ్లిన ఆగంతకులు గదిలో ఉన్న ఇద్దరు సినీ పరిశ్రమకు చెందిన యువకులను కిడ్నాప్ చేసి అచ్చంపేటకు తీసుకువెళ్లి చితకబాదిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..కడప జిల్లాకు చెందిన భూమిరెడ్డి కిషోర్రెడ్డి టీవీ నటులు ఇంద్రాణి, మేఘనలకు పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. టీవీ సీరియళ్లకు డ్రైవర్గా పనిచేస్తున్న సందీప్రెడ్డి, ఓ తెలుగు ఛానల్లో కాస్ట్యూమర్గా పనిచేస్తున్న పల్లె శివ ముగ్గురూ కలిసి శ్రీకృష్ణానగర్లో అద్దెకు ఉంటున్నారు. అచ్చంపేట సమీపంలోని బీకే ఉప్పనూతల గ్రామానికి చెందిన శివ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ కలిసి నాలుగు రోజుల క్రితం పెద్దలకు చెప్పకుండా పారిపోయారు. ఈ నేపథ్యంలో ఆమె సోదరుడు సోహెల్తో పాటు మరో ఇద్దరు యువకులు గురువారం రాత్రి కిషోర్రెడ్డి గదికి వచ్చారు. తాము పోలీసులమని, శివ ఆచూకీ చెప్పాలని అతడిని చితకబాదారు. తమకు ఏమీ తెలియదని చెప్పినా వినిపించుకోకపోగా, తాము పోలీసులమంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పదండి అంటూ కిషోర్, సందీప్లను కారులో ఎక్కించుకుని తక్కుగూడకు తీసుకెళ్లి మళ్లీ కొట్టి, ఫోన్లు లాక్కున్నారు. అక్కడి నుంచి ఉప్పనూతల గ్రామానికి తీసుకెళ్లడంతో అప్పటికే అక్కడ అప్పటికే రెండు కార్లలో సిద్ధంగా ఉన్న మరో 10 మంది యువకులతో కలిసి వారిని మరోసారి తీవ్రంగా కొట్టారు. అనంతరం బాధితులను అచ్చంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. టీవీ నటి ఇంద్రాణికి కిషోర్ ఫోన్ చేసి చెప్పడంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించింది. బాధితులు కూడా అచ్చంపేట పోలీస్స్టేషన్లో జరిగిన విషయాన్ని చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీసుల నగరానికి తిరిగి వచ్చిన కిషోర్, సందీప్ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సోహెల్, ఇబ్బూతో పాటు ప్రియురాలి పెదనాన్న, వారి బంధుమిత్రులపై కేసు నమోదు చేశారు. కిషోర్, సందీప్లను కిడ్నాప్ చేసింది నకిలీ పోలీసులని తేల్చారు. అమ్మాయి అడ్రస్ కనుక్కునేందుకు వారిని కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. జూబ్లీహిల్స్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
MLC Elections: బలం మజ్లిస్దే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో ఓటర్ల (కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు) బలం ఎంఐఎం (మజ్లిస్)కే ఎక్కువగా ఉన్నందున ఆ పార్టీ అభ్యర్థి గెలవడం నల్లేరు మీద నడకేనని, ఆ లెక్కన మిగతా పార్టీలేవీ కూడా తమ అభ్యర్థిని కూడా బరిలో దింపకుండా ఎన్నిక ఏకగ్రీవమే కాగలదని ఇప్పటిదాకా అందరూ భావించారు. నామినేషన్ల చివరి రోజున ఊహించని విధంగా బీజేపీ కూడా తమ అభ్యర్థిని బరిలో దింపడంతో పోలింగ్ నాటికి ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో తమ పార్టీకి బలం లేదన్నది బీజేపీకి తెలియనిది కాదు.. అయినా రంగంలోకి దిగిందంటే లోపాయికారీగా ఏదో జరుగుతోందన్న ప్రచారానికి తావిచి్చంది. జీహెచ్ఎంసీలో 25 అసెంబ్లీ నియోజకవర్గాలు, 150 వార్డులున్నప్పటికీ, ఈ ‘స్థానిక’ ఎన్నికల్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 81 కార్పొరేటర్ల డివిజన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు ఈ స్థానిక సంస్థలో ఓటేసేందుకు ఎంపిక చేసుకున్న ఎమ్మెల్సీలు, ఎంపీలు సైతం ఉన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి ఓటర్లుగా బీజేపీ నుంచి తాజాగా ఒక రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్, ఇద్దరు ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డిలు చేరారు. ఓటర్లుగా చేరేందుకు ఇక ఎవరికీ అవకాశం లేదు. గడువు ముగిసిపోయింది. రాబోయే మేయర్ స్థానంపై అవగాహనతో..? ఇటీవల కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన దాసోజు శ్రవణ్ ఇంకా ప్రమాణం చేయనందున వారు ఓటర్లు కాలేదని సమాచారం. తాజా సమాచారం మేరకు సైతం అన్ని పార్టీల కంటే ఎంఐఎంకే ఎక్కువ బలం ఉంది. ఆ పార్టీకి చెందిన ఓటర్లు 49 మంది ఉన్నారు. ఇక తర్వాత స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఎలాగూ తమ అభ్యర్థిని బరిలోకి దింపదని, ఎంఐఎంకు మద్దతునిస్తుందని, రాబోయే జీహెచ్ఎంసీ మేయర్ స్థానాన్ని సైతం దృష్టిలో ఉంచుకొని ఈ అవగాహనకు వచి్చనట్లు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం తమ అభ్యర్థిని బరిలో దించకుండా కాంగ్రెస్కు మద్దతునట్లుగానే అందరూ భావిస్తున్నారు. మద్దతు కూడగట్టే ధీమాలో బీజేపీ.. మారుతున్న రాజకీయ పరిస్థితులతో ఎంఐఎంతో పోరాడి గెలిచేందుకు తాము ఇతర పార్టీల మద్దతు కూడగట్టగలమనే ధీమాలో బీజేపీ ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల ఎన్నికలప్పుడు ఒక పార్టీలో ఉండి ఇప్పుడు వేరే పార్టీలో చేరిన వారు కూడా ఎందరో ఉన్నారు. వారిలో ఎందరు ఇప్పుడు తాముంటున్న పార్టీ అభ్యర్థికే ఓటు వేస్తారో చెప్పలేని పరిస్థితి. దాంతో కాంగ్రెస్ మద్దతిచ్చే ఎంఐఎంకు ఎందరు ఓటు వేస్తారో కూడా చెప్పలేమంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారు తమపై పెత్తనం చెలాయిస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ కార్పొరేటర్లలో ఉంది. వాస్తవానికి కార్పొరేటర్ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్నుంచి ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే గెలిచినప్పటికీ, వారీ ఎన్నికలో ఓటర్లు కారు. ఇక కార్పొరేటర్లలో.. బీఆర్ఎస్ నుంచి వచి్చన కార్పొరేటర్లే కాంగ్రెస్ ఓటర్లుగా ఉన్నారు. ఇలా వివిధ అంశాలు, వ్యక్తిగత పరిచయాలు, అభిమానాలు, తదితరమైన వాటితో తాము బలంగా పోటీనివ్వగలమన్న ధీమాతోనే బీజేపీ బరిలో దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వైఖరి ఏమిటన్నది కూడా ఆసక్తిగా మారింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వేటికవిగా మిగతా రెండూ ఒకటేనని ఆరోపిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏం జరగనుంది? బీఆర్ఎస్ ఎటు మొగ్గుచూపనుంది? కాంగ్రెస్, బీజేపీలు ఏం చేయనున్నాయి? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. -
విద్యాశాఖపై సమీక్ష.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్యవస్థ రూపకల్పనకు సమగ్ర విధాన పత్రం రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి విద్యా కమిషన్ను ఆదేశించారు. శుక్రవారం ఆయన విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత వ్యయమైనా వెనుకాడమంటూ స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా విధానపత్రం ఉండాలని, అదే సమయంలో అది ఆచరణకు దూరంగా ఉండకుండా చూసుకోవాలని సీఎం సూచించారు.విద్యా రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, ఉపాధ్యాయుల నియామకం, అమ్మ ఆదర్శ కమిటీలు, పుస్తకాలు, యూనిఫాంల పంపిణీతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వివరించారు. ప్రాథమిక దశలో అందే విద్యతోనే పునాది బలపడుతుందని.. ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తే ఉన్నత చదువుల్లో విద్యార్థులు మరింత మెరుగ్గా రాణించగలరని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావల్సిన మార్పులపై సమాజంలోని వివిధ సంఘాలు, ప్రముఖులతో చర్చించి మెరుగైన విధాన పత్రం రూపొందించాలని సీఎం సూచించారు. వనరులు సద్వినియోగం చేసుకోవాలని, విద్యా వ్యవస్థలో తెలంగాణ అగ్రగామిగా ఉండేందుకు దోహదపడేలా సూచనలు, సలహాలు ఉండాలని సీఎం సూచించారు. వివిధ రాష్ట్రాల్లోని పర్యటనలు, ఆయా రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ప్రాథమిక విద్యలో అనుసరిస్తున్న విధానాలను విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.1960 దశకం నుంచి ప్రస్తుతం వరకు విద్యా వ్యవస్థలోని తీసుకువచ్చిన పలు సంస్కరణలు క్రమేణా విద్యార్థుల సృజనాత్మక శక్తి, ఆలోచనాధోరణిని ఎలా హరించి వేశాయో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ వివరించారు. విద్యా వ్యవస్థలో మార్పులకు పరీక్షల విధానం, పాఠశాలల్లో తనిఖీలు, జీవన నైపుణ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను ఆయన సూచించారు. -
కంచ గచ్చిబౌలి భూ వివాదం.. పోలీసుల కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే.. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూముల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ఈ వ్యవహారంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం లేని వ్యక్తులు ఆ భూముల్లోకి వెళ్లరాదని స్పష్టం చేశారు. ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.మరోవైపు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్ శాంతికుమారి భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై డిప్యూటీ సీఎంకు సీఎస్ నివేదిక ఇచ్చారు. ఈ నెల 16 లోపు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయి నివేదికపై సమావేశంలో చర్చించారు. హెచ్సీయూ విద్యార్థులు, ప్రజా సంఘాలతో భేటీ తర్వాత పూర్తి స్థాయి నివేదిక రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ భూ వివాదంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారంటూ ప్రశ్నించింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది. భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకుండా స్టే విధించింది. తమ ఆదేశాల విషయంలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల అంశాన్ని అమికస్ క్యూరీ పరమేశ్వర్ గురువారం ఉదయం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసును సుమోటోగా తీసుకున్న ధర్మాసనం.. వారాంతం సెలవులను సద్విని యోగం చేసుకుని అధికారులు చెట్లను నరికివేయడంలో తొందరపడ్డారని అభిప్రాయపడింది. -
కంచ గచ్చిబౌలి భూ వివాదం.. డిప్యూటీ సీఎంకు సీఎస్ రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్ శాంతికుమారి భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై డిప్యూటీ సీఎంకు సీఎస్ నివేదిక ఇచ్చారు. ఈ నెల 16 లోపు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పూర్తి స్థాయి నివేదికపై సమావేశంలో చర్చించారు. హెచ్సీయూ విద్యార్థులు, ప్రజా సంఘాలతో భేటీ తర్వాత పూర్తి స్థాయి నివేదిక రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.కాగా, కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే.. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూముల్లో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.చట్టాన్ని ఎలా మీ చేతుల్లోకి తీసుకుంటారంటూ ప్రశ్నించింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలో వంద ఎకరాల్లో చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన విషయమని, అంత అత్యవసరం ఏమొచ్చిందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. -
హైదరాబాద్ లోకల్బాడీ ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసన్ ఎఫెండ్ను ఆ పార్టీ ఖరారు చేసింది. 2009లో నూర్ ఖాన్ బజార్, 2016లో డబిర్ పురా కార్పొరేటర్గా ఆయన గెలుపొందారు. 2019లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంఐఎం అవకాశం ఇచ్చింది. 2023లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పదవి కాలం పూర్తవ్వగా.. తిరిగి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం అవకాశం ఇచ్చింది.కాగా, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తరపున ఎన్ గౌతంరావు, ఎంఐఎం తరపున మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.బీజేపీ, ఎంఐఎంతో పాటు మరో రెండు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు దాఖలయ్యాయి. పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్ణయించాయి. కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం ఏకగ్రీవం అవుతుందనే సమయంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ నామినేషన్తో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొననుంది. ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. 25 తేదీన కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలు ప్రకటించనున్నారు. -
కమనీయం..‘రమణీ’యం
నగరంలో నిత్యం కళాభిమానుల్ని పలుకరించే పలు ముఖ్యమైన కూడళ్లలో కనిపించే కళాత్మకత వెనుక ఆయన సృజన ఉంటుంది. నగరవాసులు, నగరేతరులైన కళాభిమానులు సందర్శించే పలు శిల్పాకృతుల వెనుక నగరం కళల రాజధాని కావాలనే కల సాకారం చేసుకోవాలనే తపన ఉంది. అలుపెరుగని ఆ తపన పేరు ఎంవీ.రమణారెడ్డి. దాదాపు మూడు దశాబ్దాల కళా ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నగర శిల్ప కళాకారునితో ముచ్చటించిన సందర్భంగా ఆయన పంచుకున్న జ్ఞాపకాల ప్రయాణం ఆయన మాటల్లోనే.. – సాక్షి, సిటీబ్యూరో జన్మతః సిద్దిపేట వాస్తవ్యుడైనా నగరంలోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి స్కల్ప్చర్ (శిల్పకళ)లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో గోల్డ్ మెడలిస్ట్గా నిలిచాడు.. ఆ తర్వాత నుంచి నా కళా ప్రయాణం నగరంతో మమేకమై సాగింది. అడుగడుగునా.. ఆవిష్కరణ.. నగరానికి తలమానికమైన ఎయిర్పోర్ట్లోని నోవోటెల్ హోటల్తో మొదలుపెడితే.. నగరంలోని అనేక చోట్ల, ముఖ్య కూడళ్లలో కొలువుదీరిన కళాకృతులెన్నో రూపొందించాను. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మక తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం రూపకల్పనలో ప్రధాన ఆర్కిటెక్ట్గా పనిచేయడం ద్వారా అందిన ఎన్నో భావోద్వేగాలను మరచిపోలేని అనుభవం. అదే విధంగా ఢిల్లీ రిపబ్లిక్ వేడుకల్లో మన రాష్ట్రం తరపున శకటం రూపకల్పన మరో చిరస్మరణీయ జ్ఞాపకం. నగరం విశ్వనగరంగా మారనుందని ఆనాడే జోస్యం చెబుతూ.. విప్రో సర్కిల్లో ఏర్పాటైన తొలి అత్యాధునిక శిల్పాకృతి.. స్టేట్ గ్యాలరీలోని గాంధీజీ స్టీల్ వర్క్స్, రవీంద్రభారతిలోని శిల్పాకృతులు, మెట్రో రైల్ కోసం 30 అడుగుల స్టెయిన్ లెస్ స్టీల్ స్కల్ప్చర్ పైలాన్ కాన్సెప్ట్ డిజైన్, ‘శిల్పారామం’ కోసం 25 అడుగుల స్టెయిన్ లెస్ స్టీల్ శిల్పం.. అలాగే టీజీపీఎస్సీ లోగో కావచ్చు ప్రపంచ తెలుగు మహాసభల సదస్సు లోగో. వంటివెన్నో నా నగరం కోసం.. నా రాష్ట్రంలో నన్ను మమేకం చేశాయి. కల సాకారం కావాలని.. ప్రస్తుతం నగరంలో కళలకు అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఇలా అన్ని వైపుల నుంచి మంచి సహకారం లభిస్తోంది. దీన్ని ఉపయోగించుకుని మరింత మంది కళాకారులు వెలుగులోకి రావాలి. ఆర్ట్ అనేది అభిరుచి మాత్రమే కాదు అద్భుతమైన కెరీర్ కూడా అనే నమ్మకం యువతలో రావాలి. నగరం కళాసాగరం కావాలి. అదే నా తపన.. ఆలోచన అందుకు అనుగుణంగానే నా కార్యాచరణ.ఎన్నో హోదాలు.. పురస్కారాలు.. తెలంగాణ రాష్ట్రం నుంచి 2020లో న్యూఢిల్లీలో లలిత్ కళా అకాడమీ, మొదటి జనరల్ కౌన్సిల్ మెంబర్గా ఎంపికయ్యా. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి అధ్యక్షుడిగా 2015 నుంచి 3 సార్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పాటు సొసైటీ సభ్యుల సంఖ్య పెంచడంలోనూ కృషిచేశా. తద్వారా సొసైటీని చురుకుగా మార్చగలిగాను. నేను అందించిన సేవలకు గానూ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘విశిష్ట పురస్కారం’ అందుకున్నా. నేనే స్వయంగా ‘బయో–డైవర్సిటీ ఈస్తటిక్స్’ యాన్ ఆర్టిస్టిక్ రిఫ్లెక్షన్ అనే పుస్తకం రచించగా.. నా గురించి ‘ఎంవి. రమణారెడ్డి.. పాత్ టూ ఆరి్టస్టిక్ బ్రిలియన్స్.. ఏ జర్నీ పేరిట నా ప్రయాణాన్ని రచయిత కోయిలీ ముఖర్జీ ఘోష్ లిఖించారు. -
పెళ్లి చీరలు కార్చోబీ సొబగులు : ఈ వివరాలు తెలుసా మీకు?
పెళ్లి చీరలు, ఫ్యాషన్, పంజాబీ సూట్స్, ఫ్యాన్సీ, మహిళల సూట్స్కు జిగేల్మనిపించేలా చేసే వర్క్నే కార్చోబీ వర్క్ అంటారు. నగరంలోని పలువురు మహిళలు దశాబ్దాలుగా ఈ కళనే ఉపాధిగా ఎంచుకుని జీవిస్తున్నారు. ఇలాంటి వర్క్ చేసేవారిని కార్చోబీ కళాకారులు అంటారు. వీరు వివిధ రకాల వ్రస్తాలకు జిగేల్ మనిపించే రీతిలో అల్లికలు, డిజైన్లను అద్దుతారు. – గోల్కొండ వ్రస్తాలకు కళాకారుల సృజన నగరంలో కుటీర పరిశ్రమగా ఉపాధి అవకాశాలు కార్చోబీ అల్లికలతో మహిళలకు చేతినిండా పని సూట్లు, చీరలకు జిగేల్మనే మెరుపులు తగ్గుతున్న ఆదాయం.. ప్రస్తుతం నగరంలో కార్చోబీ పని చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ఈ పనిని చేయించుకునే వ్యాపారులు కారి్మకులకు ఇచ్చే కూలిని తగ్గిస్తున్నారు. గతంలో ఒక్కో కార్చోబీ కార్మికుడు ఒక చీరపై పనిచేస్తే కనీసం రెండు వేలు సంపాదించేవాడు. ప్రస్తుతం కార్మికుల సంఖ్య పెరుగుదలతో చీరకు రూ.వెయ్యి కూడా లభించడంలేదని చెబుతున్నారు. పోటీ పెరుగుతుండడంతో, మెషీన్లతో డిజైన్స్ వేయించడం లాంటివి అందుబాటులోకి రావడంతో తమ ఉపాధికి గండిపడుతోందని గత 30 ఏళ్లుగా కార్చోబీ పనిచేస్తున్న అఫ్జల్ చెబుతున్నాడు. తగ్గుతున్న ఆదాయం.. ప్రస్తుతం నగరంలో కార్చోబీ పని చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ఈ పనిని చేయించుకునే వ్యాపారులు కారి్మకులకు ఇచ్చే కూలిని తగ్గిస్తున్నారు. గతంలో ఒక్కో కార్చోబీ కార్మికుడు ఒక చీరపై పనిచేస్తే కనీసం రెండు వేలు సంపాదించేవాడు. ప్రస్తుతం కార్మికుల సంఖ్య పెరుగుదలతో చీరకు రూ.వెయ్యి కూడా లభించడంలేదని చెబుతున్నారు. పోటీ పెరుగుతుండడంతో, మెషీన్లతో డిజైన్స్ వేయించడం లాంటివి అందుబాటులోకి రావడంతో తమ ఉపాధికి గండిపడుతోందని గత 30 ఏళ్లుగా కార్చోబీ పనిచేస్తున్న అఫ్జల్ చెబుతున్నాడు. గిట్టుబాటు ధరతో సరి.. వస్త్ర వ్యాపారులు నేరుగా పని ఇస్తుండడంతో గిట్టుబాటు ధర వస్తుందని, గతంలో కార్చోబీ పనిలో దళారులదే ఇష్టారాజ్యంగా ఉండేదని, ఇచ్చిందే తీసుకోవాలన్నట్లు ఉండేదని, అయితే ప్రస్తుతం ఒక్కో కార్మికుడు హాఫ్ శారీకి రూ.1500, చీర కొంగుకు వెయ్యి లభిస్తున్నాయి అని చెబుతున్నారు. అదే ఫ్యాన్సీ సూట్ అయితే ఫుల్ సూట్కు రూ.2వేలు, త్రీపీస్ సూట్కు మూడు వేలు లభిస్తున్నాయి. ఇక కార్చోబీ పనికి అవసరమయ్యే చంకీలు, దారాలు, ఇతర వస్తువులను వ్యాపారులే సరఫరా చేస్తారు. షోరూమ్లలో, షోకేజీలలో జిగేల్ మనిపించే సూట్లు, చీరల అందం వెనుక కార్చోబీ కళాకారుల పనితనం అద్భుతమైందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. -
ఆత్మీయ సమ్మేళనాల వికృత ఫలితాలా ఇవి!
పూర్వవిద్యార్థులందరూ కలిసి కొన్ని ఏళ్లు, దశాబ్దాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటున్నారంటే.. ఎవ్వరికైనా సరే చాలా మంచి ముచ్చటగా అనిపిస్తుంది. ఎంతోకాలం కిందట కలిసి చదువుకుని, కొన్ని సంవత్సరాలుగా.. ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు తెగిపోయిన పరిస్థితుల్లో బతుకుతెరువు బాటలో పడి యాంత్రికంగా గడుపుతున్న జీవితాలకు.. అలాంటి ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఒక మంచి నవనీత లేపనంలా అనిపిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే అలూమ్ని, గెట్ టుగెదర్ కాన్సెప్టులతో వచ్చిన మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, 93 లాంటి సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద తిరుగులేని విజయాల్ని నమోదు చేశాయి.ప్రస్తుతం ఆధునిక సాంకేతికత, కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సోషల్ మీడియా తదితర అనేక కారణాల వల్ల.. పాత కాలం మిత్రుల ఆచూకీ కనిపెట్టడం సులువుగా మారుతున్న తరుణంలో.. ఇంకా ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళ్లనాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. యాభయ్యేళ్ల కిందట కలిసి చదువుకున్న వృద్ధులు కూడా.. ఇలాంటి సమావేశాలు నిర్వహించుకుంటూ.. అప్పటికి జీవించి ఉన్న తమ గురువులను ఆహల్వానించి సత్కరించుకుంటూ.. తమ తమ అప్పటి ఆనందానుభూతులను నెమరు వేసుకుంటూ గడుపుతున్నారంటే.. ఆ పూర్వవిద్యార్థుల సమ్మేళనాలకు ఉన్న ప్రాధాన్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.అయితే.. ఇలాంటి సమ్మేళనాలకు కొన్ని వికృత ఫలితాలు కూడా ఉంటాయని తెలిస్తే మనం నివ్వెరపోతాం. ఆత్మీయ సమ్మేళనాల పుణ్యమాని చిన్నప్పటి ప్రేమానుబంధాలు తిరిగి మొగ్గతొడిగే సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. పరిస్థితుల్ని బట్టి వారి మధ్య ఆత్మీయ బంధాలు బలపడుతుంటాయి. కానీ.. పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో హైస్కూలు జీవితం నాటి ప్రియుడి కాంటాక్ట్ దొరకడం, దానిని వాడుకుంటూ భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధం కొనసాగించడం అనేది వింటేనే వెగటు పుట్టిస్తుంది. అలాంటిది.. ఆ ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం అన్నెం పున్నెం ఎరుగని, తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను ఒక తల్లి తన చేతులతోనే కడతేర్చిందంటే.. మనం నిర్ఘాంతపోతాం. కడుపు మండుతుంది. పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు ఇలాంటి వికృత ఫలితాలను కూడా ఇస్తున్నాయా? అని ఆవేదన చెందుతాం. సంగారెడ్డిలో వెలుగుచూసిన సంఘటన సమాజంలో పతనమవుతున్న నైతిక విలువల తీరును, ఒక మంచి అనుభూతి కోసం జరిగే మంచి పనులను ఎలాంటి వికృత పోకడలతో భ్రష్టు పట్టిస్తున్నారనే వైనాన్ని తెలుసుకోవడానికి మంచి ఉదాహరణ అవుతోంది.సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో ఇటీవల ఒక దారుణం జరిగింది. రజిత- చెన్నయ్య దంపతుల పిల్లలు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. తల్లి రజిత కడుపునొప్పితో విలవిల్లాడుతూ ఆస్పత్రి పాలైంది. భర్తతో తగాదాలు, కుటుంబ సమస్యల కారణంగా ఆమె ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి పెట్టి చంపేసి, తాను ఆత్మహత్యకు పాల్పడిందని తొలుత పోలీసులు భావించారు. భర్త పాత్రపై అనుమానాలు వచ్చాయి. షాపు నుంచి తెచ్చిన పెరుగు కలిపి పెట్టానని, అంతకుమించి ఇంకేం తెలియదని ఆ తల్లి బుకాయించే ప్రయత్నమూ చేసింది. కానీ అసలు వాస్తవాలు నెమ్మదిగా వెలుగులోకి వచ్చాయి.రజిత అలియాస్ లావణ్య ఇంటర్మీడియట్ చదువుతుండగా 2013లో చెన్నయ్యతో పెళ్లయింది. వారికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ కలిగారు. ఆరునెలలుగా రజిత టెన్త్ క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల ఆ ఆత్మీయ సమ్మేళనం కూడా జరిగింది. అప్పటినుంచి.. హైస్కూలు నాటి ప్రియుడు శివతో ఆమె అనుబంధం పెరిగింది. అది వివాహేతర సబంధానికి దారితీసింది. పెళ్లిచేసుకోమని అడిగింది. అయితే ముగ్గురు పిల్లల తల్లిని ఎలాచేసుకుంటానంటూ శివ తిరస్కరించాడు. పిల్లల అడ్డు తొలగితే పోతుందని వారిద్దరూ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పిల్లలను చంపేస్తే ఆ నేరం భర్త మీదకు వెళుతుందని కూడా ప్లాన్ చేసినట్టు వినిపిస్తోంది. మొత్తానికి రజిత.. పెరుగన్నంలో విషం కలిపి ముగ్గురు పిల్లలకు తినిపించి, వారి గొంతు నులిమి చంపేసింది. తాను కడుపునొప్పితో బాధపడుతున్నట్టుగా నాటకమాడింది గానీ.. పోలీసుల విచారణలో బాగోతం మొత్తం బయటపడింది. వివాహేతర సంబంధం కోసం, ప్రియుడితో శాశ్వతంగా కలిసి ఉండడం కోసం పిల్లల్ని తల్లులే కడతేర్చే దుర్మార్గాలు మనం ఇంకా అనేకం సమాజంలో చూస్తున్నాం. కానీ.. అలాంటి ఒక దుర్మార్గానికి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మూలకారణం కావడం ఇక్కడ శోచనీయమైన విషయం.పూర్వవిద్యార్థుల సమ్మేళనాలు ఎంతో గొప్పవి. జీవితంలో పసితనం నాటి స్నేహాలు, ప్రేమలు, ఆప్యాయతలు కొన్ని దశాబ్దాల యెడబాటు తర్వాత.. మళ్లీ చిగురించడం మానసికంగా గొప్ప ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి గెట్ టుగెదర్ కార్యక్రమాల వల్ల.. యాంత్రికంగా మారుతున్న జీవితాల్లో తిరిగి జీవనోత్సాహాన్ని నింపుకోగలుగుతారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు చాలాచోట్ల బాగా సక్సెస్ అవుతుంటాయి. అయితే ఇంత మంచి కార్యక్రమాలు కూడా కొన్ని వికృత ఫలితాలకు దారితీస్తున్నాయని తెలిస్తే బాధ కలుగుతుంది. రజిత- శివ లాంటి వాళ్లు ఇలాంటి కార్యక్రమాలనే సాటి సమాజం అనుమానించే విధంగా చేస్తున్నారనడంలో సందేహం లేదు. నైతిక, సామాజిక విలువల స్పృహ లేకపోవడం మనుషుల్ని ఎంతకైనా దిగజారుస్తుందని తెలుసుకోవడానికి, అమృతాన్ని అందించిన క్షీరసాగరమధనంలోంచే గరళం కూడా పుడుతుందని గ్రహించడానికి ఇది మంచి ఉదాహరణ.:: ఎం.రాజేశ్వరి -
Summer Camps నటన నుంచి నాట్యం వరకు సై అంటున్న యువత
మనిషన్నాక కాస్తంత కళాపోషణుండాలోయ్..లేదంటే మనిషికీ.. గొడ్డుకీ తేడా ఏంటి? అని అలనాటి నటుడు.. రావు గోపాలరావు అన్న మాటలను ఈ తరం యువత చెవికెక్కించుకుందో ఏమోగానీ.. చదువులతో పాటు ఏదో ఓ వృత్తిలోనో, కళలోనో ప్రావీణ్యం పొందుతున్నారు. దీనికి అనుగుణంగానే నగర వాసులు తమ ఆసక్తిని వివిధ రంగాలపై కనబరుస్తున్నారు. ఏదో ఒక కళను నేర్చుకునేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే ఔత్సాహికులకు విభిన్న కళల్లో శిక్షణ ఇచ్చేందుకు పలు వేదికలు ఏర్పడుతున్నాయి. హస్తకళలు మొదలు, పెయింటింగ్, సంగీతం, నేచురల్ క్రాఫ్ట్స్, డ్రాయింగ్, డ్యాన్సింగ్ (కూచిపూడి, భరత నాట్యం, వెస్ట్రన్), వివిధ రకాల క్రీడలు, కళల్లో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో చిన్నారులకు, విద్యార్థులకు, యువతకు విభిన్న కళలపై శిక్షణ అందించేందుకు వివిధ సంస్థలు ఇప్పటికే ఏర్పాట్లు చేశాయి. పలు ఆర్ట్ స్టూడియోలు ఆర్ట్ క్యాంపెయిన్స్ ప్రారంభించాయి. – సాక్షి, సిటీబ్యూరో కళ ఒక వినూత్న వ్యక్తిత్వానికి నిదర్శనం. కళ సంతృప్తి, సాంత్వనకు ప్రతిబింబం.. కళ ఒత్తిడికి ఒక ఉపశమన మార్గం. కళ అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం. ఒకప్పుడు కళలంటే 64 కళలని నిర్వచించే వారు. కానీ ప్రస్తుతం కళకు కాదేదీ అనర్హం అనేలా మారింది. పెయింటింగ్, డ్రాయింగ్, డ్యాన్సింగ్, మొదలు పేపర్ క్రాఫ్టింగ్, పాటరీ మేకింగ్, మ్యూజిక్, మ్యాజిక్, ఆర్కిటెక్చర్, రెసిన్ వర్క్స్, సాహిత్యం, ఫ్యాషన్ డిజైనింగ్, స్టైలింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే వందల కళలు యువతను ఆహ్వానిస్తున్నాయి. సాంస్కృతిక కళలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ప్రస్తుతం అధునాతన కళలు, కళాత్మక పద్ధతులు ఆవిష్కృతమవుతున్నాయి. ఈ కళలను కొందరు ట్రెండ్గా నేర్చుకుంటుంటే.. మరి కొందరు తమ భవిష్యత్తును కళారంగం వైపు మలచుకోవడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ కళలను ఆదరించడంలో, ఆస్వాదించడంలో సాంస్కృతిక కళలు, మోడ్రన్ ఆర్ట్స్ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. కళా విలాసం.. మొదటి నుంచీ కళలంటే సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక నృతకళలపైనే ఎక్కువ ఆసక్తి చూపించే వారు. అయితే ప్రస్తుతం అవి విలాసవంతమైన కళలుగా మారిపోయాయి. ఈ కళలు నేరి్పంచే వారు, సంస్థలు తక్కువగా ఉండటం.. అదే సమయంలో ఔత్సాహికుల సంఖ్య పెరగడంతో సంప్రదాయ కళల విలువ అమాంతం పెరిగిపోయింది. ఈ కళలలో శిక్షణను అందించడానికి నగరం నలుమూలలా ట్రైనింగ్ సెంటర్లు వెలిశాయి. ఇంటికొచ్చి మరీ నేరి్పంచే వారు కూడా ఉన్నారు. నగర వేదికగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోనూ కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు నెల నుంచి రెండేళ్ల వరకూ శిక్షణను అందించే కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. నగరంలోని రవీంద్రభారతి, శిల్పారామం, శిల్పకళావేదిక, త్యాగరాయ గాన సభ వంటి వేదికలు వీరందరికీ కళా ప్రదర్శనకు వేదికలుగా నిలుస్తున్నాయి. వినూత్న ఆవిష్కరణలు.. మారుతున్న కాలానికి అనుగుణంగా కళల్లోనూ వినూత్న ఆవిష్కరణలు వస్తున్నాయి. ముఖ్యంగా రెసిన్ ఆర్ట్ వర్క్, పాటరీ మేకింగ్, అక్రిలిక్ పెయింటింగ్, వెస్ట్రన్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, సాల్సా డ్యాన్సింగ్ వంటి కళలకు మంచి క్రేజ్ పెరుగుతోంది. ఈ తరం యువతకు హస్తకళల పట్ల ఆసక్తి పెరిగింది. ప్రధానంగా గ్రామీణ, గిరిజన హస్తకళల్లో నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం నగరంలోని పలు ఆర్ట్ స్టూడియోలు వారాంతాల్లో, రెండు నెలల కోర్సులుగా వీటిపై శిక్షణ అందిస్తున్నారు. స్టోన్కార్వింగ్, పేపర్ క్రాఫ్ట్, లీఫ్ ఆర్ట్ వంటి వినూత్న కళలకు జై కొడుతున్నారు. మరికొందరు థియేటర్ ఆర్ట్స్ అంటూ సినిమాల వరకూ వెళుతున్నారు. కొందరైతే ఇల్యూజన్ పేరిట విభిన్న కళలకు శ్రీకారం చుడుతున్నారు. ట్రెండ్గా ఇంటీరియర్ ఆర్ట్.. ఇంటీరియర్ కళ అన్నా, ఇంటీరియర్ కళాకృతులన్నా ఈ తరానికి ఇష్టం పెరిగింది. ఇందులో భాగంగా కళాకృతులను తయారు చేయడం నేర్చుకోడానికి అమితంగా ఇష్టపడుతున్నారు. ఇంటిని అందంగా అలంకరించే టెర్రకోట బొమ్మలు, మట్టి పాత్రలు, దారం అల్లికలు వంటివి తయారు చేయడంలో మేము శిక్షణ ఇస్తున్నాం. నగరంలోని కార్ఖానాలో ఎర్త్ అండ్ ఆర్ట్ అనే మా స్టూడియోలో స్టోన్ కారి్వంగ్, బ్లాక్ ప్రింటింగ్, రేడియం తదితర వర్క్షాపులను నిర్వహిస్తున్నాం. అవసరమైన మెటీరియల్ మేమే అందిస్తాం. – ఫాతిమా ఖుజీమా, ఎర్త్ అండ్ ఆర్ట్ స్టూడియో కళాకారులదే భవిష్యత్తు.. జీవితాన్ని సరికొత్తగా ఆస్వాదించాలనుకునే వారు కనీసం ఏదో ఒక కళలో ప్రావీణ్యం సంపాదిస్తారు. కళాత్మకత అనేది ఒక జీవన విధానం. ఇందులో భాగంగా నేను చెక్కపై కళాకృతులను సృష్టించే ఆర్ట్లో ప్రావీణ్యం సాధించాను. గ్రామీణ వాతావరణం నుంచి వచ్చాను. కాబట్టి అందమైన గ్రామీణ ఇతివృత్తాలను చెక్కుతుంటాను. వీటికి నగరంలో మంచి ఆదరణ లభిస్తోంది. భవిష్యత్తులో కళతో ప్రయాణం చేసే వారికి ప్రత్యేక గౌరవం, గుర్తింపు లభిస్తుంది. – సాయికుమార్, ప్రముఖ వుడ్ ఆర్టిస్ట్ డిజైనింగ్పై ఆసక్తి.. ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ డిజైనింగ్ ఆర్ట్స్ సైతం ట్రెండ్గా మారాయి. మిగతా కళలు ఎలా ఉన్నా ఈ ఫ్యాషన్ సంబంధింత కళలు సంతృప్తితో పాటు వృత్తిపరమైన ఆర్థిక సౌలభ్యాన్ని సైతం అందిస్తుండటం విశేషం. నగరంలోని పలు బొటిక్లు, జ్యువెలరీ మేకింగ్ సంస్థలు ఈ ఫ్యాషన్ డిజైనర్లకు ఉపాధి అవకాశాలు కలి్పస్తున్నారు. దీంతో డిజైనర్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. -
Hyderabad Rains : హైదరాబాద్లో వర్ష బీభత్సం.. చిత్రాల కోసం క్లిక్ చేయండి
-
జీహెచ్ఎంసీలో తగ్గిన భవన నిర్మాణ అనుమతులు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు కొంత తగ్గుముఖం పట్టాయి. గత ఆర్థిక సంవత్సరంలో 13,641 భవన నిర్మాణాలకు అనుమతులివ్వగా, తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం (2024–25)లో అవి 13,421కి తగ్గాయి. అయినప్పటికీ ఆదాయం మాత్రం కొంత పెరిగింది. క్రితంసారి రూ.1107.29 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.1138.44 కోట్ల ఆదాయం సమకూరింది. హై రైజ్ భవనాలు (High-rise buildings) సైతం క్రితం కంటే తగ్గాయి. క్రితంసారి 130 హై రైజ్ భవనాలకు అనుమతులు జారీ కాగా.. ఈసారి 102 హై రైజ్ భవనాలకు మాత్రమే అనుమతులు జారీ అయ్యాయి. హై రైజ్ భవనాల్లో ఇనిస్టిట్యూషనల్ భవనాలు, ఆస్పత్రుల వంటివి మాత్రం గతం కంటే ఈసారి పెరిగాయి. గతంలో అలాంటివి కేవలం 12 మాత్రం ఉండగా, ఈసారి 46కు పెరిగాయి. దీంతో ఆదాయం (income) పెరిగింది. 50 అంతస్తుల భవంతికి అనుమతి తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొండాపూర్లో జీ+49 అంతస్తులతో 50 అంతస్తుల నివాస భవనానికి అనుమతులు జారీచేశారు. 165.95 మీటర్ల ఎత్తుతో 8 టవర్లుగా ఈ నిర్మాణానికి అనుమతులు జారీ అయినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. నేటి నుంచి ‘బిల్డ్ నౌ’’ జీహెచ్ఎంసీ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల్ని మరింత సరళీకరించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత ‘బిల్డ్ నౌ’ (BuildNow) పోర్టల్ ద్వారానే కొత్త దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ కె. శ్రీనివాస్ తెలిపారు. భవన నిర్మాణాలకు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారంతా ‘బిల్డ్ నౌ’లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇటీవలే దీన్ని సీఎం రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించడం తెలిసిందే. వ్యక్తిగత నివాస భవనాలు 75 చదరపుగజాల్లోపు ఇళ్లకు ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్, పదిమీటర్ల లోపు ఎత్తు, 500 చదరపు గజాల్లోపు వాటికి ఇన్స్టంట్ అప్రూవల్ ఇస్తారు. అంతకు మించిన వాటికి సింగిల్విండో ద్వారా అనుమతులు జారీ చేస్తారు. చదవండి: యువ ఐఏఎస్ అధికారికి ఫ్యూచర్ సిటీ పగ్గాలు! -
ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ లో సైతం..
హైదరాబాద్: 70 ఏళ్ల వయసుకు పైబడిన వాళ్లకు ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఉన్న హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం అందించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఉన్న హాస్పిటల్స్ లో సైతం ఇది అమలు చేయాలని నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి 1 వతేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం ద్వారా 70 ఏళ్లు పైబడిన వయో వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షల వరకూ ఆరోగ్య బీమా అందించనుంది. ఈ స్కీమ్ అమలుకు సంబంధించిన ఒక జాబితాను రాష్ట్ర వైద్య అధికారలు నెట్ వర్క్ హాస్పిటల్స్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ కార్డులో ఉన్న వయసు ఆధారంగా కుటుంబలోని వయో వృద్ధులకు రూ. 5 లక్షల వరకూ ఉచిత వైద్యం పొందే అవకాశం ఏర్పడింది. -
హైదరాబాద్లో వర్ష బీభత్సం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షం, ఈదురుగాలులతో రాజధాని హైదరాబాద్ నగరంలో లొతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ను సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.రోడ్ల పై నీటి నిల్వలు లేకుండా ట్రాఫిక్ సమస్య, విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, విభాగాలు సమన్వయం తో పని చేయాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసి వాహనదారులు త్వరగా ఇళ్లకు చేరుకునేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేపట్టే సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లు పడుతున్నందున జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు -
చార్మినార్ నుంచి ఊడిపడ్డ పెచ్చులు.. తప్పిన పెను ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. గతంలో మరమ్మతులు చేసిన చోటే మళ్లీ పెచ్చులు ఊడి కిందపడ్డాయి. భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న చార్మినార్ నుంచి పెచ్చులు పడటంతో పర్యాటకులు పరుగులు తీశారు. పెచ్చులూడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. పరిస్థితిని సమీక్షించారు. ఊడిపోయిన పెచ్చులను జీహెచ్ఎంసీ సిబ్బంది శుభ్రం చేశారు. చార్మినార్కు మరోమారు మరమ్మతులు చేస్తామని అధికారులు వెల్లడించారు.హైదరాబాద్లో ఇవాళ అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం మధ్యాహ్నాం నుంచి ఉరుములతో, మెరుపులతో భారీగా వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు ఏరులై పారుతోంది. హైదరాబాద్లో భారీ వర్షం కారణంగా రోడ్లు నీట మునిగాయి. పంజాగుట్ట-ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మెర్క్యూరీ హోటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. -
Hyd: భారీ వర్షానికి కారుపై విరిగి పడిన చెట్టు
హైదరాబాద్: నగరంతో తెలంగాణలోని పలు చోట్ల అకాల వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్న ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ లో పలు చోట్ల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్ లో కొన్ని చోట్ల కుండ పోత వర్షం కురవగా, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడింది. ఈ వర్షానికి జన జీవనం స్తంభించింది. వర్షం కారణంగా చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో వాహనదారులు అవస్తలు తప్పలేదు.మరొకవైపు ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే దారిలో ఓ చెట్టు విరిగి కారుపై పడింది. దాంతో అప్రమత్తం కావడంతో వారు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కారుపై చెట్టు పడిన వెంటనే రెస్య్కూ ఆపరేషన్ లో ఉన్న పోలీసులు సకాలంలో స్పందించారు. కారులో ఉన్న ముగ్గుర్ని ముందుగా బయటకు తీసేశారు. కారుపై పడ్డ చెట్టును అక్కడ నుంచి తొలగించే పనిలో ఉన్నారు డీఆర్ఎఫ్ సిబ్బంది. హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా దంచికొడుతున్న వానలు -
హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా దంచికొడుతున్న వానలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో పలు జిల్లాలలో వాతావరణం ఒక్కసారిగా మారింది. గురువారం మధ్యాహ్నాం నుంచి ఉరుములతో, మెరుపులతో భారీగా వర్షం ఎడతెరిపి ఇవ్వకుండా దంచికొడుతోంది. దీంతో రోడ్లపై నీరు ఏరులై పారుతోంది. భారీ వర్షం కారణంగా ప్రజలు ఉక్కపోత నుంచి ఊరట పొందుతున్నప్పటికీ.. అకాల వర్షంతో రైతన్నలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండగా.. సంగారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్లోనూ కుంభవృష్టి కురిసింది. హైదరాబాద్లో భారీ వర్షం కారణంగా రోడ్లు నీట మునిగాయి. పంజాగుట్ట-ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మెర్క్యూరీ హోటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ముందస్తు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల ఏకధాటిగా రెండు గంటలపాటు వాన కురవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. శ్రీశైలంలోనూ నాన్ స్టాప్గా వానపడడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు నాగర్కర్నూల్లో పిడుగు ధాటికి ఇద్దరు మహిళలు మృతి చెందారు.మరో మూడు నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే క్యుములో నింబస్ కారణంగా.. ఉత్తర తెలంగాణకు వడగండ్లు, ఉరుములు మెరుపులతోనూ వానలు పడొచ్చని హెచ్చరిస్తోంది. అకాల వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికారులు ముందస్తు సూచనలు చేశారు. అయినప్పటికీ కొన్ని చోట్ల పంటలు నాశనం కాగా, కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైనట్లు తెలుస్తోంది. -
కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల కొట్టివేతపై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లు కొట్టివేతపై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 7 వరకు చెట్లు కొట్టొద్దని హైకోర్టు స్టే ఇచ్చింది. కోర్టు ఆదేశాలున్నప్పటికీ చెట్ల కొట్టివేత కొనసాగుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు ఈనెల 7కు హైకోర్టు వాయిదా వేసింది.కాగా, చెట్లు నరకడాన్ని వెంటనే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే వరకు అక్కడ ఎలాంటి పనులు చేయొద్దని ఏసీజే జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం తేల్చిచెప్పింది. సుదీర్ఘ వాదప్రతివాదనల వల్ల సమయం ముగియడంతో తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. ఇవాళ(గురువారం) విచారణ జరిపిన న్యాయస్థానం.. చెట్లు కొట్టివేతపై స్టే విధించింది.కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ)కి బదిలీ చేసి చదును చేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలయ్యాయి. ‘ఐటీ, ఇతర అవసరాల కోసం ఎకరం రూ. 75 కోట్ల మేర సంస్థలకు కేటాయించేలా కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల అటవీ భూమిని టీజీఐఐసీకి సర్కార్ కేటాయించింది. ఈ మేరకు గతేడాది జూన్ 26న రెవెన్యూ శాఖ తీసుకొచ్చిన జీవో 54ను కొట్టేయాలి. అక్కడ 40 జేసీబీ తవ్వకాలతో సర్కార్ చెట్లను తొలగిస్తూ వృక్ష, జంతుజాలాన్ని నాశనం చేస్తోంది’ అని పిటిషనర్లు ఆరోపించారు. -
మూడేళ్ల వయసులో తల్లి దూరం.. తండ్రి రెండో పెళ్లి.. బామ్మే అమ్మగా మారి! (ఫొటోలు)
-
భల్లే భల్లే.. పంజాబీ ఫుడ్ ఫెస్టివల్
నగరం విభిన్న సంస్కృతులకు నిలయమే కాకుండా ఆహార వైవిధ్యానికి కూడా కేంద్రంగా నిలుస్తోంది. దీనికి ప్రతిగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విభిన్న ప్రాంతాలకు చెందిన వంటకాలు నగరంలో అలరిస్తుంటాయి. ఇందులో భాగంగానే సికింద్రాబాద్లోని రాయల్ రెవ్ హోటల్ వేదికగా ప్రతిష్టాత్మక పంజాబీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. పంజాబ్ సంప్రదాయ పంటల పండుగ ‘పంజాబీ ఫుడ్ ఫెస్టివల్‘ను అమృత్సర్ గ్యాస్ట్రోనమికల్ యాత్రలో భాగంగా ఈ నెల 4 నుంచి 13వ తేదీ వరకు రాయల్ రెవ్ హోటల్, లాజీజ్ మల్టీక్యూసిన్ రెస్టారెంట్ వేదికగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించి బుధవారం రాయల్ రేవ్ హోటల్ వేదికగా పంజాబీ పసందైన వంటకాలతో ప్రముఖ పంజాబీ మాస్టర్ చెఫ్ రాజుసింగ్ సోన్వాల్ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకంగా రూపొందించిన మెనూలో మటన్ బెలిరామ్, రారా మటన్, సాగ్ మీట్, తందూరీ కుక్కడ్, కుక్కడ్ మఖన్వాలా, మచ్లీ టిక్కా, మచ్లీ అమృత్సరి వంటి మాంసాహార వంటకాలు ఉన్నాయన్నారు. శాఖాహారులు పనీర్ టిక్కా జలంధరి, పెథివాలి టిక్కీని ఆస్వాదించవచ్చు. వీటితో పాటు మరెన్నో అందుబాటులో ఉన్నాయన్నారు. చదవండి:35 ఏళ్ల నాటి డ్రెస్తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియో -
హలీమ్ @ రూ.వెయ్యి కోట్లు!
సాక్షి, సిటీబ్యూరో: రంజాన్ వచ్చిoదంటే హైదరాబాదీలకు ముందుగా గుర్తుకు వచ్చేది హలీమే. ఈ మాసంలో ప్రత్యేకంగా లభించే హలీమ్ కోసం మాంసప్రియులు తహతహలాడతారు. ఈసారి రికార్డు స్థాయిలో జరిగిన హలీమ్ అమ్మకాలే దానికి నిదర్శనం. ఏకంగా రూ.వేయి కోట్ల మేర హలీమ్ వ్యాపారం జరిగిందని అంచనా. దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్లో హలీమ్ విక్రయాలు సాగాయని వ్యాపారులు చెబుతున్నారు. పోషకాలతో కూడిన రుచికరమైన హలీమ్ కేంద్రాలు, హోటళ్లు రంజాన్ నెలంతా కిటకిటలాడాయి. ప్రతి హోటల్ ముందు ప్రత్యేక బట్టీలు, కౌంటర్ల ద్వారా విక్రయాలు సాగాయి. ఈ సీజన్లో దాదాపు 50 లక్షల ప్లేట్ల హలీమ్ అమ్మకాలు జరిగినట్లు హైదరాబాద్ హోటళ్ల సంఘం చెబుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 20 శాతం అధికంగా హలీమ్ అమ్మకాలు సాగాయని అంటోంది. కేవలం హోటళ్లలోనే కాదు ఫుడ్ డెలివరీ యాప్లలోనూ హలీమ్కే ఆహారప్రియులు ఓటేశారు. టేక్ ఆవేలు, స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్లతో హలీం అమ్మకాలు ఒక రేంజ్లో సాగాయి. ఆరువేల విక్రయ కేంద్రాలు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 6 వేల చిన్నా, చితక హలీమ్ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధాన రెస్టారెంట్లు వీటికి అదనం. చిన్న, మధ్య తరగతి రెస్టారెంట్లే కాదు స్టార్ హోటళ్లలోనూ రంజాన్ సీజన్ మెనూలో హలీం డిష్ను తప్పనిసరి చేశారు. హైదరాబాదీ బిర్యానీని హలీం ఓవర్ టేక్ చేసి మెనూలో టాప్లో నిలిచింది. చిన్న హలీం కేంద్రాల్లో రోజుకు దాదాపు వంద పేట్ల చొప్పున అమ్మకాలు జరిగితే, పేరున్న హోటళ్లు, కేంద్రాల్లో సుమారు 500–600 ప్లేట్ల హలీం విక్రయించారని అంచనా. వీకెండ్లలో 25 శాతం అధికం..హలీమ్ ప్లేట్ ధర రూ.100 నుంచి 320 వరకు పలికింది. ఎక్కువ శాతం మటన్ హలీమ్ సెంటర్లు ఉండగా, పలు ప్రాంతాల్లో చికెన్, బీఫ్ కేంద్రాలు కూడా వెలిశాయి. వీటిలో అత్యధికంగా 70 శాతం మేర పాతబస్తీలోనే ఉన్నాయి. సగటున రోజుకు దాదాపు రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. సాధారణ రోజుల కంటే వీకెండ్లలో 25 శాతం అధికంగా విక్రయాలు జరిగాయని జహంగీర్ అనే హలీం కేంద్ర నిర్వాహకుడు తెలిపారు. పాతబస్తీతో పోలిస్తే సైబరాబాద్లో హలీం జోష్ ఎక్కువగా ఉందని, పేరొందిన ఫుడ్ బ్లాగర్స్ కూడా హలీంను ప్రమోట్ చేసేలా వార్తలు ఇవ్వడం అమ్మకాలకు కలిసొచ్చిందని షెరటన్ హోటల్ మేనేజర్ నాసర్ చెప్పారు. -
హైదరాబాద్లో మెట్రో సేవలకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ఎల్బీ నగర్-అమీర్పేట్ మధ్య మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. మియాపూర్- ఎల్బీ నగర్ మెట్రో రైలులో సాంకేతిక సమస్య ఏర్పడింది. వెంటనే సిబ్బంది స్పందించి.. సమస్యను పరిష్కరించారు. అసెంబ్లీ స్టేజీ దగ్గర అరగంట పాటు రైలును నిలిపివేయగా, గాంధీ భవన్ స్టేజీ దగ్గర మరో 10 నిమిషాలు నిలిపివేశారు. అనంతరం యథావిధిగా మెట్రో సేవలు కొనసాగాయి. గతంలోనూ మెట్రో రైలు సర్వీసులకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. అంతరాయాలు ఎక్కువగా ఉదయం, రాత్రి ఆఫీసుల నుంచి రాకపోకలు సాగించే సమయాల్లో ఏర్పడుతుండడంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. -
యువ ఐఏఎస్ అధికారికి ఫ్యూచర్ సిటీ పగ్గాలు!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యూచర్ సిటీ (Future City) అభివృద్ధిలో కీలకమైన అడుగు పడనుంది. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)కి కమిషనర్ను నియమించనున్నారు. చురుకైన యువ ఐఏఎస్ అధికారిని ప్రాజెక్ట్ సారథిగా నియమిస్తే బాగుంటుందనే భావనలో సీఎం రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదిస్తున్న ఫోర్త్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్సీడీఏ (FCDA) పరిధిని ప్రత్యేకంగా భావిస్తోంది.ప్రపంచ ప్రఖ్యాత ఐటీ, ఫార్మా, క్రీడారంగాలకు ప్రాధాన్యతనిస్తున్న సర్కారు.. ఆ మేరకు జోన్లను కూడా నిర్దేశిస్తోంది. వీటన్నింటిని గమనంలోకి తీసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు అంతర్జాతీయ నగరాలపై అవగాహన ఉన్న యువ అధికారులకు దీని పాలనపగ్గాలు కట్టబెట్టే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. గతంలో రంగారెడ్డి జిల్లా (Rangareddy District) కలెక్టర్లుగా వ్యవహరించిన కె.శశాంక( 2013), డాక్టర్ ఎస్.హరీశ్(2015) పేర్లను పరిశీలిస్తోంది. ఈ ప్రాంతంపై వీరికి స్పష్టమైన అవగాహన ఉండడం కలిసొచ్చే అంశంగా భావిస్తోంది. అలాగే గోపి (2016) పేరును కూడా పరిగణనలోకి తీసుకుంటున్న సర్కారు.. అతి త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.90 పోస్టులకు గ్రీన్సిగ్నల్.. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత గ్రేటర్లో ఫోర్త్ సిటీ (Fourth City) అవసరం ఉందని సీఎం రేవంత్ నిర్ణయించారు. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. మహేశ్వరం, ఆమన్గల్, కడ్తాల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల ఏడు మండలాల్లోని 56 గ్రామాలు ఎఫ్సీడీఏ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే ఎఫ్సీడీఏ కోసం కొత్తగా 90 పోస్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటిలో 34 రెగ్యులర్ పోస్టులు కాగా..మిగిలిన 56 పోస్టులను ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఎఫ్సీడీఏ కమిషనర్ నియామకం పూర్తవగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణం మరింత వేగం పుంజుకుంటుందని అధికారులు చెబుతున్నారు. నాలుగేళ్లలో కార్యరూపం.. ఇప్పటికే ఫోర్త్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం ప్రారంభమవగా పనులు చకచకా సాగుతున్నాయి. ఉగాది తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో ఫ్యూచర్ సిటీకి అన్ని ప్రాంతాల నుంచి అనుసంధానం చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి సైతం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మరోవైపు ఫ్యూచర్ సిటీలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను సైతం తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసింది. వచ్చే నాలుగేళ్లలో ఫ్యూచర్ సిటీకి ఓ రూపం తీసుకువచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.చదవండి: కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్! -
Bird Flu : హైదరాబాద్లో బర్డ్ఫ్లూ కలకలం.. వేల కోళ్లు మృత్యువాత
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్లో బర్డ్ప్లూ (bird flu) వైరస్ కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. నాలుగురోజుల క్రితం మండలంలోని ఓ పోల్ట్రీ ఫామ్లో వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన వైద్య శాఖ అధికారులు కోళ్ల రక్త నమూనాలను సేకరించారు. తాజాగా, ఆ కోళ్ల రక్త నమూనా ఫలితాలు విడుదలయ్యాయి.బర్డ్ ఫ్లూ వల్లే ఆ కోళ్లు మృత్యువాత పడినట్లు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దు అని పోల్ట్రీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందా?పక్షులకు వచ్చే జలుబు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా టైప్ –ఏ వైరస్లు వ్యాధి కారకాలు. కోవిడ్–19 కారక కరోనా వైరస్లో మాదిరిగానే ఈ వైరస్లోనూ పలు రకాలు ఉన్నాయి. తక్కువ ప్రభావం చూపేవి కొన్ని.. అధిక ప్రభావం చూపేవి మరికొన్ని. రెండో రకం వైరస్లు కోళ్లు ఇతర పక్షులకు తీవ్రస్థాయిలో ప్రాణ నష్టం కలిగిస్తాయి. సాధారణంగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్లను ‘‘హెచ్’’, ‘‘ఎన్’’రకాలుగా వర్గీకరిస్తారు. సాధారణంగా ఈ వైరస్లు మనుషుల్లోకి ప్రవేశించవు కానీ.. కొన్నిసార్లు జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి. ప్రాణాలు కోల్పోవడమూ సంభవమే. కోళ్లు ఇతర పౌల్ట్రీ పక్షుల వ్యర్థాలను ముట్టుకోవడం ద్వారా వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ.మనుషులకూ సోకుతుందా?మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశాలు అరుదు. కానీ హెచ్5, హెచ్7, హెచ్9 రకాల వైరస్లు మాత్రం మనుషుల్లోకి ప్రవేశిస్తాయని ఇప్పటికే రూఢీ అయ్యింది. వైరస్ సోకిన పక్షులను తాకడం, వాటి స్రావాలతో కలుషితమైన ఉపరితలాలను ముట్టుకోవడం ద్వారా మనుషులకూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. బాగా వండిన కోడిగుడ్లు, చికెన్లతో వ్యాధి సోకే అవకాశాలు లేవు.ఇతరులకు సోకుతుందా? జలుబు లాంటి లక్షణాలే కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో న్యుమోనియా, శ్వాస సమస్యలు, మరణమూ సంభవించవచ్చు. మనుషుల నుంచి ఇతరులకు బర్డ్ఫ్లూ సోకదు.ఎలాంటి పక్షులకు సోకుతుంది?కోళ్లు, బాతులు, హంసలు, నెమళ్లు, కాకుల వంటి పక్షులపై బర్డ్ఫ్లూ ప్రభావం ఉంటుంది. కోళ్లలో అతిసారం, కాలి పంజా ప్రాంతాలు వంకాయ రంగులోకి మారడం, తల, కాళ్లు వాచిపోవడం, వంటివి కనిపిస్తాయి. ముక్కు, ఊపిరితిత్తుల నుంచి వెలువడే ద్రవాల ద్వారా ఈ వ్యాధి పక్షుల్లో వ్యాపిస్తుంది. వ్యాధికి గురైన పక్షుల మలం తగిలినా చాలు. కలుషిత ఆహారం, నీరు ద్వారానూ వ్యాపిస్తుంది.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?బాగా ఉడికించిన తరువాత మాత్రమే చికెన్, గుడ్లు వంటివి తినాలి. ఉడికించని పక్షి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉంచడం మేలు. పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారు వ్యక్తిగత శుభ్రతను కచ్చితంగా పాటించాలి. కోళ్లఫారమ్లలో పనిచేసేటప్పుడు చేతులకు కచ్చితంగా తొడుగులు వేసుకోవడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, ఎన్95 మాస్కులు ధరించడం, పీపీఈ కిట్లు, కళ్లజోళ్లు వాడటం ద్వారా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. -
HCU విద్యార్థులపై లాఠీ ఛార్జ్
-
కొత్త మెట్రో రైళ్లకు నిధుల బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: కొత్త మెట్రో రైళ్లకు నిధుల కొరత బ్రేకులు వేస్తోంది. నగరంలోని వివిధ కారిడార్లలో ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 5 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ మేరకు కొత్త రైళ్లను కొనుగోలు చేయాలని రెండేళ్ల క్రితమే హైదరాబాద్ మెట్రోరైల్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పట్లో నాగ్పూర్ మెట్రో రైళ్లను లీజుకు తీసుకోవాలని భావించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదు. అనంతరం సొంతంగా కొనుగోలు చేసేందుకు సైతం ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రోరైల్ సన్నాహాలు చేసింది. ఈ మేరకు బెంగళూరు కేంద్రంగా మెట్రోరైళ్లను తయారు చేస్తోన్న భారత్ ఎర్త్మూవర్స్ లిమిటెడ్ సంస్థతో సంప్రదింపులు కూడా జరిపారు. కానీ పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్కు ఇప్పుడు నిధుల కొరత అతి పెద్ద సవాల్గా మారింది. గత పదేళ్లలో మెట్రో నష్టాలు సుమారు రూ.6500 కోట్లకు చేరుకున్నట్లు అంచనా. ఈ పరిస్థితుల్లో ప్రతి రోజు ఒకవైపు ప్రయాణికుల అవసరాలకనుగుణంగా రైళ్లను నడుపుతూనే మరోవైపు అదనపు నిధులను కేటాయించి కొత్త రైళ్లను కొనుగోలు చేయడం కొంత కష్టంగానే మారినట్లు అధికారులు చెబుతున్నారు.ఏటేటా నష్టాలే... నగరంలో మెట్రో రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి వరుసగా నష్టాలు నమోదవుతున్నాయి. రైళ్ల నిర్వహణలో ప్రయాణికుల నుంచి టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయం ఏ మాత్రం సరిపోవడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం, ఎల్బీనగర్ నుంచి మియాపూర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ కారిడార్లలో ప్రతిరోజు 57 రైళ్లు సుమారు 1050 ట్రిప్పులు తిరుగుతున్నాయి. ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.45 గంటల వరకు మెట్రోలు అందుబాటులో ఉండేవిధంగా వేళలను కూడా పొడిగించారు. రోజుకు 5 లక్షల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను కలి్పంచేందుకు అదనపు ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేయడం, డిజిటల్ సేవల విస్తరణ, లాస్ట్మైల్ కనెక్టివిటీ పెంపు, తదితర సేవలపైన ఎల్అండ్టీ దృష్టి సారించింది. ప్రస్తుతం 2 కిలోమీటర్ల కనిష్ట దూరానికి రూ.10 నుంచి గరిష్టంగా 26 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.60 చొప్పున చార్జీలు అమలవుతున్నాయి. అయినప్పటికీ గత పదేళ్లలో ప్రయాణికుల నుంచి టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయం నష్టాలను ఏ మాత్రం భర్తీ చేయలేదు. పైగా ఏటేటా నష్టాలే నమోదై ఇప్పుడు రూ.6500 కోట్లకు చేరాయి. చార్జీల పెంపు అనివార్యమా... ఈ పరిస్థితుల్లో నగరంలో మెట్రోరైళ్ల నిర్వహణకు టిక్కెట్ చార్జీల పెంపు అనివార్యంగా మారినట్లు అధికారవర్గాల అంచనా. ‘2017 నుంచి ఇప్పటి వరకు చార్జీలు పెంచలేదు. ఇదే సమయంలో ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఒకటి, రెండు సార్లు చార్జీలను సవరించారు. ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన సదుపాయాలు కలి ్పంచేందుకు చార్జీల పెంపు కొంత ఊరటనివ్వగలదని భావిస్తున్నాం.’ అని ఓ అధికారి వివరించారు. ప్రభుత్వం నుంచి సానుకూలత కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్రం నుంచి రావలసిన రూ.200 కోట్లు లభించినా కొంత మేరకు ఊరట కలుగుతుందని పేర్కొన్నారు.కనీసం 10 రైళ్లు అవసరం... ప్రస్తుతం నగరంలో 57 రైళ్లు ఉన్నాయి. ఒక్కో ట్రైన్కు 3 కోచ్లు ఉంటాయి. వెయ్యి ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. మరో 10 రైళ్లను అదనంగా కొనుగోలు చేయగలిగితే 30 కోచ్లు వినియోగంలోకి వస్తాయి. దాంతో కనీసం రోజుకు 1.5 లక్షల నుంచి 2 లక్షల మందికి అదనంగా ప్రయాణ సదుపాయం కల్పించేందుకు అవకాశం ఉంటుంది. 3 కోచ్లు ఉన్న ఒక ట్రైన్కు రూ.65 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. తయారీ సంస్థల నుంచి రైళ్లను కొనుగోలు చేయడంతోపాటు నగరానికి తరలించడం కూడా ఎంతో ముఖ్యం. ఈ లెక్కన 10 రైళ్లకు సుమారు రూ.650 కోట్లకు పైగా నిధులు అవసరం. కొత్త రైళ్ల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదా, చార్జీలను పెంచేందుకు అవకాశం ఇవ్వడం పరిష్కారంగా భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. -
కలిసి నడుద్దాం...
రోజూ వాకింగ్ చేస్తూ ఉంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని మనకు తెలిసిందే! వాకింగ్ చేసేవారు గ్రూప్గా కలిసి పర్యావరణ ఆరోగ్యాన్నీ బాగు చేద్దామనుకుంటే... ఆ పనిని హైదరాబాద్ కె రన్నర్స్ గ్రూప్ మూడేళ్లుగా చేస్తోంది. ఈ గ్రూప్లో డాక్టర్లు, ఐటీ నిపుణులు, గృహిణులు సభ్యులుగా ఉన్నారు. వృత్తి, ఉద్యోగాలు, పిల్లల బాధ్యతలు నిర్వర్తిస్తూనే పర్యావరణ, ఆరోగ్య అవగాహననూ స్వచ్ఛందంగా కల్పిస్తూ ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తున్నారు. పర్యావరణ హితం కోరేవారంతా తమతో కలిసి నడవచ్చు అంటూ చెబుతున్న ఈ గ్రూప్ సభ్యుల సూచనను మనమూ అమలుచేద్దాం...విందు వినోదాలలో పాల్గొనడం మన చుట్టూ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించుకోవడానికి. ఆ ఆనందంలో పర్యావరణానికి హాని చేస్తున్నామా అనే ఆలోచన చేయడమే కాదు మేలు కలిగే పనులనూ అమలులో పెట్టి చూపుతోంది కె రన్నర్ గ్రూప్. మూడేళ్లక్రితం ఇద్దరితో మొదలైన ఇప్పుడు 35 మందితో తమ చుట్టూ ఉన్నవారికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తోంది. విందు కార్యక్రమాలలో యూజ్ అండ్ థ్రోకు ‘నో’ చెబూతూ స్టీల్ ప్లేట్స్ను వెంట తీసుకెళుతున్నారు. వాకింగ్కి వెళుతూ రోడ్డు పక్కల పడి ఉన్న ప్లాస్టిక్ను సేకరించి, గార్బేజ్కు పంపిస్తున్నారు. వారాంతాల్లో చెరువులు, కోటలలో పేరుకు పోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నారు. వీధుల్లో చేరే మూగజీవాలకు ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పనుల ఒత్తిడిలోనూ అనేక ప్రయోజనకర పనులను ఎంచుకుంటున్నారు.వాకింగ్ చేస్తూ... ప్లాస్టిక్ సేకరిస్తూ...మా గ్రూప్లో నలభై ఏళ్ల నుంచి అరవై ఏళ్ల వయసు వాళ్లున్నారు. ఎవరి కాలనీలలో వారు రోజూ వాకింగ్, రన్నింగ్ చేసినా ప్రతి నెలా అందరూ కలిసేలా కంటి ఆరోగ్యం, క్యాన్సర్ అవేర్నెస్, ఉమెన్ పవర్.. అంటూ రన్ని ఏర్పాటు చేస్తుంటాం. దీనిలో భాగంగానే మా చుట్టూ ఉన్నవారిలో ఆరోగ్య స్పృహ పెంచడం, ప్లాస్టిక్ ఫ్రీ జోన్స్ని చేయాలనుకున్నాం. అందుకే, రోజూ వాకింగ్ వెళ్లినా వెంట ఓ బ్యాగ్ తీసుకెళ్లి, పడేసిన ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ సేకరించి, ఒక చోట డంప్ చేస్తున్నాం. ఇటీవల భువనగిరి ఫోర్ట్, అక్కడి చెరువు వద్ద ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా చేయాలని సంకల్పించుకొని, వెళ్లి మా పనులు మొదలుపెట్టాం. రైతులు–వినియోగదారుల మధ్య దళారులు లేకుండా 35 కుటుంబాలకు నేరుగా కూరగాయలు, ఇతర ధాన్యం చేరేలా చూస్తున్నాం. ఇప్పుడు నేరుగా కస్టమర్లే రైతులు అడిగి, తమకు కావల్సినవి తెప్పించుకుంటున్నారు. రైతులు పువ్వులతో చేసిన ఆర్గానిక్ కలర్స్ని మా గ్రూప్ అంతా హోళీకి ఉపయోగించాం. – శోభా కార్తీక్, కరాటే ఇన్స్ట్రక్టర్పార్టీకి వెళితే... స్టీల్ ప్లేట్, స్పూన్బయట పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి, మా గ్రూప్ సభ్యులు యూజ్ అండ్ త్రో వస్తువులు వాడవద్దని ముందే నిర్ణయించుకున్నాం. దీంతో నేను మా పాప కోసం కేక్ కొనడానికి బేకరీకి వెళ్లినా వెంట స్టీల్ బాక్స్ తీసుకెళతాను. ఏదైనా పార్టీకి వెళ్లినా స్టీల్ ప్లేట్, స్పూన్, టీ కప్పు వెంటే ఉంటుంది. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. చెప్పడమే కాదు చేసి చూపితేనే అందరూ ఈ పద్ధతిని అవలంబిస్తారు. కొత్తపేటౖ రెతు మార్కెట్కి వెళ్లినప్పుడు అక్కడివాళ్లు టీ కోసం యూజ్ అండ్ త్రో కప్స్ ఎక్కువ వాడుతుండటం చూశాం. వాటిల్లో తాగడం ఆరోగ్యానికీ మంచిది కాదు.అందుకని, సిరామిక్ కప్పుల సెట్స్ తీసుకెళ్లి అక్కడి వర్కర్స్కి ఇచ్చి, ఎందుకు ప్లాస్టిక్ మంచిదో కాదో వివరించి వచ్చాం. మా రన్నర్స్ గ్రూప్లోని 28 మందిమి కలిసి ఇటీవల భువనగిరి కోట శుభ్రం చేయడానికి వెళ్లాం. అక్కడంతా రేపర్స్, పాలిథిన్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్... కనిపించాయి. మైక్రో ప్లాస్టిక్కి అయితే కొదవే లేదు. మేం కోట దిగి కిందకు వచ్చేసరికి వెంట తీసుకెళ్లిన బ్యాగులన్నీ నిండిపోయాయి. మా గ్రూప్లో జంతుప్రేమికులూ ఉన్నారు. వీధికుక్కలు దాడి చేస్తున్నాయని వాటిని కొట్టడం, చంపడం చేస్తుంటారు. వాటికి సరైన ఆహారం లేకనే అలా చేస్తుంటాయి. కారణాలు అన్వేషించాలి కానీ, చంపేస్తే ఎలా? అందుకే వాటికి కావల్సిన ఆహారం వండిపెట్టడం, అనారోగ్యంగా ఉన్నవాటికి చికిత్స అందించటం వంటివి గత పదేళ్లుగా చేస్తున్నాం. న్యూస్ పేపర్స్ని సేకరించి, స్కూల్ పిల్లల చేత బ్యాగులు చేయించి కూరగాయల మార్కెట్ దగ్గర కస్టమర్లకు ఇవ్వాలనే ప్లాన్ చేస్తున్నాం. – శ్రావణి, ఆర్కిటెక్ట్బంధుమిత్రులలోనూ అవగాహనమా గ్రూప్లో మల్టీ టాస్కింగ్ చేస్తున్న లాయర్లు, డాక్టర్లు, సాఫ్ట్వేర్లు, వివిధ రంగాలలో వర్క్ చేస్తున్నవారున్నారు. సిటీలో వివిధ చోట్ల నుంచి రన్లో పాల్గొనడానికి వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతిరోజూ వాకింగ్, రన్నింగ్కి కేటాయించే టైమ్, తీసుకోవాల్సిన హెల్తీ ఫుడ్ గురించి ఎవరి ఫిట్నెస్ బట్టి వారికి షెడ్యూల్ చేసుకుంటాం. నోబుల్ కాజెజ్ రన్స్ అన్నింటిలోనూ పాల్గొంటుంటాం. ఈ ప్రయోజనాలను మరికొందరికి అందించాలనే ఆలోచనతో బంధు, మిత్రులలోనూ, మా పిల్లలను కూడా రన్నర్స్ గ్రూప్లలో పాల్గొనేలా ఎంకరేజ్ చేస్తున్నాం. చుట్టూ ఉన్నవారిలో ఆరోగ్య అవగాహనతో ప్లాస్టిక్ ఫ్రీ జోన్స్ చేయాలనుకున్నాం. రన్ గ్రూప్ పార్టీలలో పర్యావరణ హితంగా ఏమేం చేయచ్చు అనే అంశాల మీద చర్చించుకొని, వారాంతాల్లో ఆ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాం. – డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్ -
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఐదు రోజుల పాటు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భానుడి భగభగల నుంచి కాస్త ఊరట లభించనుంది. తెలంగాణలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపు, ఎల్లుండి ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు పడతాయని.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణం కేంద్రం తెలిపింది.ఇక..వర్ష ప్రభావంతో ఏప్రిల్ 2, 3 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కొన్నాళ్ల కిందట అకాల వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. -
హెచ్సీయూ భూముల వివాదం.. మంత్రులతో రేవంత్ అత్యవసర భేటీ
సాక్షి, హైదరాబాద్: మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. హెచ్సీయూలో ఆందోళనపై సీఎం చర్చించారు. ఈ భేటీకి భట్టి విక్రమార్క, శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క హాజరయ్యారు. హెచ్సీయూతో పాటు కీలక అంశాలపై మంత్రుల బృందం చర్చించినట్లు సమాచారం. కాగా, హెచ్సీయూలో ఉద్రికత్త నెలకొంది. యూనివర్సిటీ ముట్టడికి సీపీఎం, బీజేవైఎం నేతలు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.కాగా, కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములకు సంబంధించి మొదలైన వివాదం క్రమంగా ముదురుతోంది. భూములు తమవంటే తమవేనంటూ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) వేర్వేరు వాదనలు వినిపిస్తూ ‘ప్రకటనల యుద్ధానికి’ తెరలేపాయి. మరోవైపు వర్సిటీ భూములు కాపాడుకుంటామంటూ విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. విపక్షాలు వారి పోరాటానికి మద్దతు పలకడమే కాకుండా, ప్రభుత్వ వైఖరిపై విరుచుకు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం కంచె గచ్చిబౌలి భూముల వివాదమే హాట్ టాపిక్గా మారింది.కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని 2004 లో చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ అకాడమీకి అ ప్పగించింది. అయితే ఆ కంపెనీకి సామర్థ్యం లేద ని, కంపెనీ బోగస్ అని ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం ఆ కేటాయింపుల్ని రద్దు చేసింది. ఈ రద్దుపై ఐఎంజీ కోర్టును ఆశ్రయించింది. 21 ఏళ్ల పాటు జరిగిన న్యాయపోరాటం త ర్వాత ఆ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ భూములను ప్రభుత్వం టీజీఐఐసీకు కేటాయించింది. ఆ భూ ములను అభివృద్ధి చేసి పరిశ్రమలకు విక్రయించాల ని టీజీఐఐసీ నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ భూములు హెచ్సీయూవి అంటూ విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో వివాదం మొదలైంది. -
23 గజాలు రెండు అంతస్తుల భవనం
హనుమకొండ: సొంత ఇంటి కల నెరవేరాలంటే.. అందుకు తగిన స్థలం ఉండాలి. కనీసం 100 గజాల జాగా లేకపోతే సౌకర్యవంతమైన ఇల్లు కట్టలేం. కానీ ఓ వ్యక్తి 23 గజాల స్థలంలోనే రెండతస్తుల ఇల్లు నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా పరకాల (Parakala) పట్టణంలోని 22వ వార్డుకు చెందిన ఫార్మసీ ఉద్యోగి కాపర్తి రాజు తల్లి భారతమ్మ పెంకుటింట్లో నివాసం ఉండేది. కాగా రాజు కుమారుడు దత్తు అదే స్థలంలో తన నానమ్మ కోసం సొంత ప్లాన్తో రూ.7 లక్షలు ఖర్చు పెట్టి, 23 గజాల స్థలంలోనే రెండు అంతస్తుల ఇల్లు నిర్మించాడు. గ్రౌండ్ఫ్లోర్లో పార్కింగ్, స్టోర్ రూం, మొదటి అంతస్తులో వంటగది, డైనింగ్ హాల్, రెండో అంతస్తులో అటాచ్డ్ బాత్రూంతో బెడ్రూమ్ నిర్మాణం చేసి స్థానికులనే కాక ఇంజనీర్లను సైతం ఆశ్చర్యపడేలా చేశాడు. సెంచరీ బనానా సెలబ్రేషన్నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలోని గొర్లోనిబాయి గ్రామంలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంబుల లచ్చమ్మకు సోమవారంతో 100 సంవత్సరాలు నిండాయి. ఈ క్రమంలో ఉగాది పండుగ సందర్భంగా ఐదుగురు కుమారులు బాలకృష్ణయ్య, రాములు, వెంకటయ్య, భీమన్న, సుఖ్దేవ్తోపాటు పుట్టింటికి వచ్చిన ఆమె ముగ్గురు కుమార్తెలు, మనవళ్లు, మునిమనవళ్లు అరటిపండ్లతో తులాభారం నిర్వహించారు. తల్లిదండ్రులను భారంగా చూసే ఈ రోజుల్లో అమ్మకు వందేళ్ల పండుగ నిర్వహించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈమె వంశాంకురంగా 65 మంది ఉండటం విశేషం. -
14 ఏళ్లుగా.. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్ర
నగరంలోని సనత్నగర్కు చెందిన శ్రీనివాస రామానుజ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు, బాటసారులకు సేవలందిస్తోంది. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్రలా మారుతోంది. ప్రతి రోజూ మధ్యాహ్నం మితాహారాన్ని అందిస్తూ అభాగ్యుల ఆకలి తీరుస్తోంది. యేటా రెండు నెలల పాటు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం వేసవి కావడంతో మంగళవారం నుంచి మరోసారి ఈ మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. – సనత్నగర్ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 ఏళ్లుగా అన్నార్థుల ఆకలి తీరుస్తోంది శ్రీనివాస సమాజ సేవా సమితి. స్థానిక బీకేగూడ పార్కు వద్ద రోజుకు 250 నుంచి 300 మంది వరకూ మధ్యాహ్నం మిత భోజనాన్ని వడ్డించేందుకు సీనియర్ సిటిజన్స్ సిద్ధమయ్యారు. దాతల సహకారంతో.. రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున దాతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు పోటీపడు తుంటారు. అయితే రోజుకో దాత అనే సంప్రదాయాన్ని ట్రస్ట్ కొనసాగిస్తూ వస్తోంది. దాతల కోరిక మేరకు పుట్టిన రోజు, పెళ్లిరోజు వంటి కొన్ని ప్రత్యేక తేదీల్లో వారి పేరున నలుగురికీ ఆహారాన్ని పంచుతోంది. ఈ యేడాదికి గానూ ఇప్పటికే జూన్ 2 వరకూ అన్ని రోజులకు సరిపడా దాతలు తమ తేదీలను బుక్ చేసుకున్నారు. రోజుకు రూ.5వేల చొప్పున.. ఒక్కో దాత నుంచి రోజుకు రూ.5వేల చొప్పున మాత్రమే స్వీకరిస్తారు. వీటితో రుచికరమైన వంటకాలను అందిస్తారు. బగారా రైస్, టమాటా రైస్, జీరా రైస్, కర్రీ, పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, స్వీట్స్తో పాటు ప్లేట్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కలిపి రూ.5,000 గా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ట్రస్ట్కు నగదు, చెక్కు రూపంలో స్వీకరిస్తారు. దాతల సహకారం అపూర్వం.. మంగళవారం ఉదయం 11.30 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ఈ మితాహార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇలాంటి అపూర్వమైన కార్యక్రమంలో దాతల సహకారం అపూర్వం. దీనికి సీనియర్ సిటిజన్స్ తోడవ్వడం మా అదృష్టం. వారి సహకారం మరువలేనిది. ఏటా మాదిరిగానే చలివేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన శ్యాంసుందర్రాజ్కు కృతజ్ఞతలు. – పార్థసారథి, శ్రీనివాస రామానుజ ట్రస్టీ -
HCU భూములపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలి.. లేదంటే
హైదరాబాద్,సాక్షి: కంచ గచ్చిబౌలి (kancha gachibowli)లో వివాదం నెలకొన్న 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (hcu) భూముల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay Kumar) వ్యాఖ్యానించారు.హెచ్సీయూ భూముల వేలాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. అక్కడ వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు మంగళవారం హెచ్సీయూలో పర్యటించేందుకు బీజేపీ నేతలు బయల్దేరారు. ఈ క్రమంలో హెచ్సీయూ భూములపై బండి సంజయ్ మాట్లాడారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలోనిది. అటవీ శాఖ పరిధికి చెందిన భూముల్లో మొక్కల్ని నరకాలన్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదం తీసుకోవాలి. ఇదే అంశంపై గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. వట ఫౌండేషన్ అనే ఎన్జీవో దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూములను వేలం వేయడం కుదరదు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోంది. చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోంది. ఆ భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండు కోవాలనుకోవడం దుర్మార్గం.గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా?. కంచె గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. తక్షణమే గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని’ హెచ్చరించారు. -
హైదరాబాద్లో విదేశీ మహిళపై గ్యాంగ్ రేప్
హైదరాబాద్: మీర్పేట్లో విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. లిఫ్ట్ పేరిట ఆమెను ఎక్కించుకుని వెళ్లిన కొందరు యవకులు ఘాతుకానికి ఒడిగట్టారు.మీర్పేట వద్ద వాహనాల కోసం ఎదురు చూస్తున్న విదేశీయురాలిని లిఫ్ట్ వంకతో తీసుకెళ్లారు. ఆపై పహాడీషరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు అయ్యింది. సదరు బాధితురాలు జర్మనీకి చెందిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
ప్రజాసేవే లక్ష్యం
పట్టుదల, తపన, దానికి తగ్గ సాధన తోడైతే ఎంతటి లక్ష్యమైనా తలొంచి తీరుతుందని గ్రూప్వన్ టాపర్ లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి నిరూపించారు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంక్ సాధించానన్న విషయం తెలిసిన దీపిక ముందు కొద్దిసేపటి వరకు అది కలే అనుకున్నారు. నిజమేనని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలారు. గ్రూప్1 పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించడానికి ఆమె పడిన కష్టం, తల్లిదండ్రుల ప్రోత్సాహం అన్నీ కలిపి ఆమెను మొదటి స్థానంలో నిలిపాయి. వివరాలు ఆమె మాటల్లోనే ..‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. ఉండేది సఫిల్గూడప్రాంతంలో. అమ్మ పద్మావతి గృహిణి, నాన్న కృష్ణ కొమ్మిరెడ్డి రిటైర్డ్ సీనియర్ ఆడిట్ ఆఫీసర్. పదో తరగతి సఫిల్గూడలోని డీఏవీ పాఠశాల, ఇంటర్ నారాయణగూడ శ్రీ చైతన్య, 2013లో మెడిసిన్ లో 119వ ర్యాంక్తో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశా. మాస్టర్స్ డిగ్రీ చేయడం కోసం అమెరికా వెళ్లాను. అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతురిని. అందుకే డాక్టరుగా ఇక్కడే ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నా. కానీ అనుకోకుండా నా దృష్టి సివిల్స్పై మళ్లడంతో ఆ దిశగా ప్రయత్నించాలనుకున్నాను. అందుకు అమ్మానాన్నలు కూడా అంగీకరించారు. అదేసమయంలో గ్రూప్స్కు నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకున్నా. ఆలోచన వచ్చిందే తడవుగా సిలబస్ చెక్ చేశాను. పాత ప్రశ్నాపత్రాలు పరిశీలించాను. ప్రిపరేషన్ సులభమనే అనిపించింది. దాంతో కోచింగ్కు వెళ్లాలనిపించలేదు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్1 పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను. 2020లో మొదటిసారిగా యూపీఎస్సీ పరీక్ష రాశా! కాని, అది నేను అనుకున్నంత సులువు కాదని మూడు ప్రయత్నాలు విఫలం అయ్యేవరకు అర్థం కాలేదు. దాంతో అంతవరకు ఆప్షనల్గా ఉన్న తెలుగు బదులు ఆంత్రపాలజీని ఎంచుకుని గత ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ పై దృష్టి సారించాను. అలాగే గత సెప్టెంబర్లో యూపీఎస్సీ మెయిన్స్, అక్టోబర్లో టీజీపీఎస్సీ మెయిన్స్ కూడా రాశాను. ఈ సంవత్సరం మార్చి16న యూపీఎస్సీ ఇంటర్వ్యూకి హాజరయ్యాను.. ఆ ఫలితాలు వస్తాయనుకుంటే ఈ ఫలితాలు ముందుగా వచ్చాయి.సివిల్స్ సాధనే ఆశయం...నా జీవితాశయం సివిల్స్.. కెరీర్లో ఎదుగుదలతోపాటు ప్రజాసేవ చేయాలన్నది నా ఆకాంక్ష. త్వరలోనే వీటిని సాధిస్తానన్న నమ్మకం ఉంది. రోజూ కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే చదివేదాన్ని. పరీక్షల సమయంలో మాత్రం 8– 9 గంటలు చదువుకునేదాన్ని. పరీక్షల సమయంలో మా అమ్మ కూడా నాతోపాటే జాగారం చేసేది. వొత్తిడి అనిపించినప్పుడు సరదాగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్లం. పుస్తక పఠనం ముందునుంచే ఇష్టం. పాటలు పాడటం నా హాబీ. వొత్తిడి సమయంలో ఇవి నాకు చాలా ఉపయోగపడ్డాయి.’’ అంటూ ముగించారు దీపిక.సోషల్ మీడియాను సక్రమంగా ఉపయోగించుకోవాలికోచింగ్ల మీద ఆధార పడి సమయం, డబ్బును వృథా చేయద్దు. సోషల్ మీడియాలో చాలా మంచి సమాచారం అందుబాటులో ఉంది. దానిని సరిగా ఉపయోగించుకోగలగాలి. కెరీర్లో రాణించడానికి అవసరమైన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకుని అందుకు తగ్గట్టు కృషి చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ధైర్యంగా ఎదుర్కొని గమ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలి. అప్పుడే ఆశయాన్ని సాధించగలం. – డా. లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి, గ్రూప్ వన్ టాపర్ – పవన్ కుమార్ పలుగుల, సాక్షి, ఉప్పల్/ కాప్రా -
SRH Vs HCA వివాదంపై సీఎం రేవంత్ సీరియస్
సాక్షి,హైదరాబాద్ : హెచ్సీఏ- సన్ రైజర్స్ హైదరాబాద్ వివాదంపై సీఎం రేవంత్రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్నివేధింపులు గురి చేసి పాసులు అడిగిన విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని సూచించారు. విజిలెన్స్ డీజీ కొత్తకోట శశ్రీకాంత్కు ఆదేశాలు జారీ చేశారు.ఎస్ఆర్హెచ్ను పాసులు విషయంలో ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పాసుల వ్యవహారంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. తాజా, ఇదే అంశంపై సీఎం రేవంత్ సైతం స్పందించారు. అసలేం జరిగిందంటే?ఉచిత పాస్ల విషయంలో (ఐపీఎల్ 2025) సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. పాసుల కోసం హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తీవ్రంగా వేధిస్తున్నాడని సన్రైజర్స్ మేనేజ్మెంట్ సంచలన ఆరోపణలు చేసింది. ఇలా చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని బెదిరించింది. ఈ అంశానికి సంబంధించి సన్రైజర్స్ జనరల్ మేనేజర్ టిబి శ్రీనాథ్ హెచ్సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు ఓ ఘాటు లేఖ రాశారు.ఇలాంటి ప్రవర్తన సహించంఉచిత పాస్ల కోసం హెచ్సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్మోహన్ రావు వేధింపులు తీవ్రమయ్యాయి. ఇలాంటి ప్రవర్తనను మేము ఏమాత్రం సహించం. ఇలాగే కొనసాగితే మేము వేదికను మార్చుకునేందుకు మేం వెనకాడం. మేము ఉప్పల్ స్టేడియంను హోం గ్రౌండ్గా ఎంచుకుని మ్యాచ్లు ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది. ఇలా అయితే లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరుతున్నాం. తద్వారా ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా యాజమాన్యానికి తెలియజేయగలరు. మీకు ఇష్టం లేకపోతే మీరు కోరుకున్నట్లే హైదరాబాద్ నుంచి తరలిపోతామని సన్రైజర్స్ ప్రతినిథి హెచ్సీఏ కోశాధికారికి రాసిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా హెచ్సీఏతో కలిసి పనిచేస్తున్నాము. గత సీజన్ నుండి మాత్రమే ఈ సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాము. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి ప్రతి సీజన్లో 50 కాంప్లిమెంటరీ టికెట్లు (F12A బాక్స్) ఇస్తున్నాము. ఈ ఏడాది వారు అదనంగా మరో 20 టికెట్లు అడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చినప్పుడు పరస్పరం చర్చించి స్నేహపూర్వక పరిష్కారానికి వస్తామని వారికి తెలియజేసాము.హెచ్సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్అయినా పట్టించుకోకుండా హెచ్సీఏ ప్రతినిథులు ఓవరాక్షన్ చేశారు. SRH-LSG మ్యాచ్ రోజున సీటింగ్ బాక్స్కు (F3) తాళం వేశారు. మేము అడిగిన అదనపు టికెట్లు ఇవ్వకపోతే తాళం తెరవమని బెదిరించారు. గత రెండేళ్లలో హెచ్సీఏ నుంచి మా సిబ్బందికి ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఈ ఏడాదే చాలాసార్లు మా వారిని బెదిరించారు. ఇది ఏమాత్రం సహించరానిది. మేము స్టేడియంకు అద్దె చెల్లిస్తున్నాము. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా ఆధీనంలో ఉండాలి అని శ్రీనాథ్ తన ఈ-మెయిల్లో హైలెట్ చేశారు. కాగా, ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) హోం గ్రౌండ్గా ఉన్న విషయం తెలిసిందే. -
Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)
-
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంపు
-
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంపు
-
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంపు
-
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెంపు
-
తెలంగాణకు మళ్లీ వర్షాలు, నాలుగు రోజులపాటు..
హైదరాబాద్: తెలంగాణలో భానుడి భగభగల నుంచి కాస్త ఊరట లభించనుంది. మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భూ ఉపరితలం వేడెక్కిన ప్రభావంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని తెలిపింది.రేపు రాత్రి(ఏప్రిల్ 1వ తేదీ) నుంచి మూడో తేదీ వరకు వానలు కురుస్తాయని, అయితే 4వ తేదీన వర్ష ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఊరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశమూ ఉందని హెచ్చరించింది. ఏయే జిల్లాలపై ఈ ప్రభావం ఉంటుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.ఇక..వర్ష ప్రభావంతో ఏప్రిల్ 2, 3 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కొన్నాళ్ల కిందట అకాల వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. -
HCU వద్ద హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించ వద్దని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం 200 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంలా మారింది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో ఆదివారం వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు జేసీబీలతో పోలీసుల కాపలా నడుమ వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లోకి వచ్చారు. దట్టమైన పొదలు, చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు. అది గమనించిన కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకునేసరికి పోలీసులు చుట్టుముట్టారు.Hyderabad Central University witnessed police brutality.Students peacefully protesting against CM @revanth_anumula remarks calling HCU students “cunning foxes” and opposing a land grab near their campus were met with violence lathi charge, phones smashed, voices silenced.… pic.twitter.com/25oHPIGoXH— Harish Rao Thanneeru (@BRSHarish) March 30, 2025ఈ క్రమంలో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ.. జీవ వైవిధ్యానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని నినదిస్తూ అక్కడికి చేరుకున్న విద్యార్థులపై పోలీసులు రెచ్చిపోయారు. కాళ్లు, చేతులు పట్టుకొని నేలపై ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. అరెస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని వర్సిటీలో పరిగెత్తిస్తూ మరీ లాఠీలతో చితకబాదారు. 200 మందికి పైగా విద్యార్థులను రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఠాణాలకు తరలించే క్రమంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినందుకు హెల్మెట్లు, ప్రొటెక్షన్ షీల్డ్తో విచక్షణా రహితంగా కొట్టారు. కొందరు పోలీసులు తమను బూతులు తిట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.Save our university land from being auctioned for private entities. University is an intellectual power house,don't kill the progress of the Telangana. Save our land.@KTRBRS @BRSHarish @Krishank_BRS @dhanyarajendran @revathitweets @bainjal @CharanT16 @RahulGandhi @priyankagandhi pic.twitter.com/81zQ3APMVd— sree charan (@mscharan) March 30, 2025బట్టలు చిరిగినా వదలకుండా..పోలీసుల అరాచకాన్ని ప్రశ్నించిన ఆడపిల్లలను మహిళా పోలీసులు జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వ్యాను ఎక్కించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో విద్యార్థినులు గాయాలపాలయ్యారు. బట్టలు చిరిగిపోయినా పట్టించుకోకుండా విద్యార్థులను లాకెళ్లారు. అడ్డుకోబోయిన యువకులను కాళ్లు, చేతులు పట్టుకుని వ్యాన్లో పడేశారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ తోటి విద్యార్థులు వర్సిటీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. బయటకు రాకుండా నిర్బంధించడంతో అక్కడే కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. Mohabbat Ka Dukaan at HCU today. Kudos to @RahulGandhi & Congress sarkaar You have outdone yourselves pic.twitter.com/NPZOqG7Uoh— KTR (@KTRBRS) March 30, 2025 -
విద్యార్థులపై ఇష్టానుసారం దాడి చేస్తారా?, ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ((Hyderabad Central University)ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు.హెచ్సీయూలో భూముల వేలం వివాదాన్ని వ్యవతిరేకిస్తూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనతో భారీగా మొహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి సెంట్రల్ వర్శిటీలో ఉద్రిక్తతపై బండి సంజయ్ స్పందించారు. ‘విద్యార్థులపై లాఠీఛార్జీ అమానుషం. ప్రభుత్వ భూములను తెగనమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?. భావితరాలకు గజం జాగా కూడా మిగిల్చరా? పోలీసుల ద్వారా భయాందోళనలకు గురిచేసి కాంగ్రెస్ పాలన చేయాలనుకుంటోంది. వర్శిటీ భూములకే రక్షణ లేకపోతే ఎలా?. ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది.భూముల రక్షణ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఇష్టానుసారం దాడి చేస్తారా?.తక్షణమే అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలి. హెచ్సీయూ భూముల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు. -
హెచ్సీయూ వద్ద మళ్లీ ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ(హెచ్ సీయూ) భూముల విక్రయాన్ని నిరసిస్తూ విద్యార్థి లోకం ఆందోళన చేపట్టింది. భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ గత రాత్రి(శనివారం) నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో యూనివర్శిటీ వద్ద భారీగా పోలీసుల్ని మోహరించి ఆందోళనను అణిచివేయాలని ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు’(ఆదివారం) యూనివర్శిటీ పరిధిలోని పచ్చచెట్లను నరికివేయడానికి ప్రభుత్వం పూనుకుంది. వర్శిటీ పక్కన ఉన్న భారీ స్థలంలో చెట్లను కొట్టివేస్తుండగా విద్యార్ధులు అడ్డగించారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్శిటీ మెయిన్ గేటుకు తాళం వేశారు పోలీసులు. యూనివర్శిటీ ప్రాంగణంలో జేసీబీలతో చెట్లను కూల్చివేసి నేలను చదును చేసే యత్నం చేస్తున్నారు. విద్యార్థులు అరెస్టు..ఎస్ఎఫ్ఐ ఖండనఆందోళనకు దిగిన విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఆందోళనను అణచివేసే క్రమంలో పెద్ద ఎత్తున అరెస్టులు కొనసాగుతున్నాయి. దీన్ని తెలంగాణ ఎస్ఎఫ్ఐ ఖండించింది. అహంకారంతో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేసిన విద్యార్థులను విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది. HCU విద్యార్ధులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండించండి. ఎక్కడ ఎడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం , నియంతృత్వం, అహంకారం తో వ్యవరిస్తున్న రేవంత్ రెడ్డి తక్షణమే బేషరతుగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి.@VP_Sanu @KTRBRS @TV9Telugu @NtvTeluguLive @ndtv @V6News @MayukhDuke pic.twitter.com/49WFvdScad— SFI Telangana (@TelanganaSfi) March 30, 2025 ఇదీ వివాదం.. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను ఎప్పటికప్పుడు ఏదో సాకు చూపి వెనక్కు లాక్కుంటున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వర్సిటీ ఏర్పడిన 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. మొదట 2300 ఎకరాల్లో హెచ్సీయూను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని ఆరోపిస్తున్నారు.తాజాగా టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు నిర్ణయించడంతో విద్యార్థి సంఘాలు, వర్కర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పోరాటానికి దిగారు. వీరంతా జేఏసీగా ఏర్పడి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈ స్థలం హెచ్సీయూది కాదని, అందుకే కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి చేసేందుకు 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే జరిగితే ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే.హెచ్సీయూ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, హెచ్సీయూ భూములు (HCU Lands) వర్సిటీ అవసరాలకే వినియోగించేలా చొరవ చూపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. చుట్టూ ఐటీ కారిడార్ ఉండడంతో ఈ భూముల విక్రయం ద్వారా భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 400 ఎకరాలను విక్రయిస్తే మార్కెట్ విలువ ప్రకారం రూ.10 వేల కోట్లు వస్తుందని ప్రభుత్వ అంచనా వేసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. -
హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో కొత్త కార్ల బుకింగ్
హైదరాబాద్ నగరంలో పలు సాంస్కృతిక వేదికల్లో ఉగాది (Ugadi) ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు భాషా సాంస్కృతి శాఖ ఆధ్వరంలోనే కాకుండా పలు సాహిత్య, సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో కళ, నృత్య ఉత్సవాలు, సాహిత్య వేడుకలు, ఉగాది పురస్కారాల సంబరాలను నిర్వహిస్తున్నారు. వారాంతాలతో పాటు సోమవారం రంజాన్ పండుగ కూడా కలిసి రావడంతో మూడు రోజుల సెలవులను ఆస్వాదించడానికి ఈ వేదికలను ఎంచుకుంటున్నారు.సోషల్ మీడియాలో షష్ట గ్రహ కూటమి.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో షష్ట గ్రహ కూటమి ((Shasta Graha Kutami) అనే అంశం వైరల్గా మారింది. అరుదుగా సంభవించే ఈ షష్ట గ్రహాల కూటమి వల్ల పలు మార్పులు సంభవిస్తాయని, ముఖ్యంగా రాశులపై ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్యులు, పండితులు వెల్లడిస్తున్నారు. 2019లో సంభవించిన ఈ షష్ట గ్రహ కూటమి అనంతరం కరోనా (Corona) మహమ్మారి విజృంభించిందని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. కానీ, విశ్వంలో నిత్యం ఏర్పడే మార్పుల్లో భాగంగానే ఈ ఆరు గ్రహాల కూటమి, అంతకు మించి ఎలాంటి ప్రభావాలూ ఉండబోవని నగరానికి చెందిన పరిశోధకులు సోషల్మీడియా (Social Media) వేదికగా పోస్టులు షేర్ చేస్తున్నారు. ఉగాదికి కోరిక తీరింది.. వసంతానికి శుభారంబంగా అందరి జీవితాల్లోనూ వసంత శోభ వరించాలని ప్రకృతి దీవెనలతో నూతన సంవత్సరాది ప్రారంభమవుతోంది. అయితే ఈ ఏడాది అందరి చూపు నూతన వాహనాలపై పడింది. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా వాహనాలపై టాక్స్ పెరగనుందని నివేదికలు చెబుతున్న నేపథ్యంలో ఈ ఉగాదికి నగరవాసులు భారీ సంఖ్యలో కొత్త వాహనాలను బుకింగ్ చేసుకున్నారని ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.చదవండి: హైదరాబాద్లో రియల్ఎస్టేట్ పతనంతెలుగు సంవత్సరాది.. అందరికీ ఇష్టమైన ఉగాది..! జీవితంలో అన్ని అనుభవాలను, అనుభూతులను సముపాళ్లలో ఆస్వాదించాలనే మంచి సందేశాన్నందిస్తూ నూతన తెలుగు ఏడాదికి ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలో నగరమంతా కొంగొత్త ఆశలతో పండుగ శోభ వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి ఆంధ్రా, దసరాకు తెలంగాణ (Telangana) ఊళ్లకు ప్రయాణమయ్యే నగరవాసులు.. ఉగాదికి మాత్రం నగరంలో ఉండటానికే ప్రధాన్యమిస్తున్నారు. ఈ సందర్భంగా నగరమంతా ఉగాది సంబరాల ఏర్పాట్లు, షాపింగ్ సందడితో కనిపిస్తోంది. మరోవైపు సాంస్కృతికప్రదర్శనలు, ఉగాది పురస్కారాలు, సాహిత్య కార్యక్రమాలు వంటి ఉత్సవాలకు సిద్ధమైంది. – సాక్షి, సిటీబ్యూరో -
జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ ..!
హైదరాబాద్: టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి నటిస్తూ నిర్మిస్తున్న సినిమాలో భాగంగా ఆఫీస్ ను ప్రారంభించారు. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమాను నిర్మించడంతో పాటూ అందులో నటిస్తున్నారు జగ్గారెడ్డి. ఉగాది పండుగ సందర్భంగా సినిమా ఆఫీస్ ను నందినగర్ లో ప్రారంభించారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి చిత్రానికి వడ్డీ రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు.సినిమా ఆఫీస్ ప్రారంభోత్సవంలో భాగంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘నేను ఇటీవల ఢిల్లీ లో చెప్పినట్టు జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా స్టార్ట్ చేస్తున్నాము. ఉగాది పండుగ సందర్భంగా సినిమా ఆఫీస్ ను ప్రారంభించాము. నా నిజ జీవితంలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ సినిమా వుంటుంది. నా నిజ జీవితం పాత్రలో నేను నటిస్తున్నాను. మిగతా విషయాలు త్వరలో ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు.జగ్గారెడ్డి కూతురు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ.. నాన్న జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్ కి వచ్చారు. ఆయన జీవితం ఒక ఇన్సిరేషన్ అని పేర్కొన్నారు. -
ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం
నాంపల్లి: నిలోఫర్ ఆసుపత్రిలో ఒకే కాన్పులో ఓ మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు. కోలుకున్న తల్లీపిల్లలను శనివారం డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని హస్తినాపురం ప్రాంతానికి చెందిన అమృత (24) పురిటి నొప్పులతో ఫిబ్రవరి 22న నిలోఫర్లో అడ్మిట్ అయ్యారు. ఏడున్నర నెలలకి పురిటి నొప్పులు రావడంతో నిలోఫర్ వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి పెద్దాపరేషన్ చేశారు. ఈ కాన్పులో ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వీరి బరువు 1.6 కేజీ, 1.5 కేజీ, 1.4 కేజీ, 1.2 కేజీలుగా ఉన్నారు. శిశువులకు పుట్టుకతో శ్వాస సంబంధమైన సమస్య తలెత్తడంతో వెంటిలేటర్పై ఉంచారు. నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.రవికుమార్, ఎన్హెచ్ఓడీ డిపార్ట్మెంట్ ఆఫ్ నియోనటాలజీ ప్రొఫెసర్ ఎల్.స్వప్న పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో పదిరోజుల పాటు చికిత్సలు అందించారు. నిలోఫర్ వైద్యుల పర్యవేక్షణలో పిల్లలు ఇన్ఫెక్షన్, కామెర్లు, కంటి సమస్యల నుంచి బయటపడ్డారు. 35 రోజుల ట్రీట్మెంట్ తర్వాత నలుగురు పిల్లలు డిశ్చార్జ్ అయ్యారు. -
‘తెలంగాణ రైజింగ్’కు ఆ దేశాలు వద్దు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ‘భారత్ సమ్మిట్’(తెలంగాణ రైజింగ్)కు కొన్ని దేశాల వారిని పిలవొద్దని కేంద్రం ఆంక్షలు విధించింది. అరబ్దేశాలు, ఆ దేశాలకు సహకరిస్తున్న మరికొన్ని దేశాల వారిని పిలవకుండా రైజింగ్ జరుపుకోమని సూచనలు చేసింది. ఆయా దేశాల ప్రతినిధులు భారత్కు వస్తే సంకేతాలు మరోలా బయటకు వెళతాయనే ఆలోచనతోనే తాము వద్దు అంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్కు.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్రం సూచించిన వివిధ దేశాల పేర్లు తొలగించి, కొత్త పేర్లతో మరో లేఖ ఇవ్వడానికి రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. మీ ఆలోచన మంచిదే.. కానీ వాళ్లు వద్దు ‘రాబోయే 25 సంవత్సరాల్లో తెలంగాణను సమున్నతంగా నిలిపేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవండి. ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ పేరుతో నిర్వహించబోయే ‘భారత్ సమ్మిట్’కు పలు దేశాల వారిని పిలవాలని అనుకుంటున్నాం. దీనికి మీ మద్దతు, అనుమతి అవసరం’అంటూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ను సీఎం రేవంత్ కోరారు. ఈ నెల 13న ఢిల్లీలో జైశంకర్ను కలసి అందుకు సంబంధించిన లేఖను అందచేశారు.ఆ లేఖలో పలు దేశాల పేర్లు పొందుపరిచారు. కాగా, ‘తెలంగాణ రైజింగ్ పేరుతో మీరు నిర్వహించ తలపెట్టిన భారత్ సమ్మిట్ అభినందనీయం. మీఆలోచన మంచిదే.. అయితే, వీటిలో ఉన్న అరబ్ దేశాలు, అరబ్ దేశాలకు సహకరిస్తున్న కొన్ని దేశాల పేర్లు తొలగించండి. వాళ్లు భారత దేశానికి రావడం మాకు ఇష్టం లేదు. వాళ్లు ఇక్కడకు వచ్చి ఏదైనా మాట్లాడితే, భారత్తో స్నేహపూర్వకంగా ఉన్న దేశాలకు తప్పుడు సంకేతాలు అందుతాయి. కాబట్టి, ఆయా దేశాల పేర్లు తొలగించి మీరు ఏ కార్యక్రమమైనా పెట్టుకోండి, మాకేమీ ఇబ్బంది లేదు’అంటూ సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి జైశంకర్ బదులిచ్చారు. ఆ దేశాల పేర్లు తొలగించకపోతే కష్టమే? ఇదిలా ఉండగా రష్యా, ఉక్రెయిన్ల మధ్య, అలాగే ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య, మయన్మార్లో అంతర్గతంగా కొంతకాలంగా యుద్ధాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దేశాలకు కొన్ని దేశాలు మద్దతు తెలుపుతుండగా, కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో యుద్ధాలు జరిగే దేశాలు, వాటికి సహకరిస్తున్న దేశాల వారిని భారత్కు పిలవడం మనకు నష్టమని కేంద్రం భావిస్తోంది. వారిని మినహాయించి ఎవరు వచ్చినా తమకేమీ ఇబ్బంది లేదని కేంద్రం చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ గొప్పతనం చాటిచెప్పాలని, అందుకే ఆయా దేశాల వారిని ఇక్కడకు ఆహ్వానిస్తున్నట్లు సీఎం రేవంత్ చెబుతున్నారు. సీఎం ఆలోచన మంచిదే అయినప్పటికీ కేంద్రానికి మాత్రం కొన్ని దేశాల వాళ్లు ఈ తరుణంలో ఇక్కడకు రావడం ఇష్టం లేదని, ఆ దేశాల పేర్లు తొలగించి కొత్తగా పేర్లు ఇస్తే అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని విశ్వసనీయ సమాచారం. లేనిపక్షంలో తెలంగాణలో భారత్ సమ్మిట్ జరగడం కష్టమేనని కేంద్ర సర్వీసుల్లోని అధికారులు అంటున్నారు. -
అరుదైన శస్త్ర చికిత్సతో వృద్ధుడి గుండె పదిలం
హైదరాబాద్ : ఆరోగ్య సంరక్షణలో విశ్వసనీయత, మెరుగైన ఆరోగ్య ఫలితాలతో ప్రాణాలకు కాపాడటంతో కాపాడటంతో అద్వితీయంగా కృషి చేస్తున్న ఆలివ్ హాస్పిటల్... గుండె సంబంధిత వ్యాధి చికిత్సలో అరుదైన మైలురాయిని చేరుకుంది. వైద్య రంగంలో అత్యంత క్లిష్టమైనది కాగా, ట్రాన్సాకాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ (TAVR) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రంగంలో ఈ విప్లవాత్మక శస్త్రచికిత్స ప్రక్రియను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ కృతిక్ కులకర్ణి, ఆలివ్ హాస్పిటల్ లోని కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ ఆసిఫ్ సంయుక్తంగా నిర్వహించారు. తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్, రెగర్జిటేషన్ ఉన్న వృద్ధి రోగులకు TAVR ఒక ప్రాణాలను రక్షించే పరిష్కారం. ఇది సాంప్రదాయ ఓపెన్-హార్ట్ సర్జరీకి ఇదొక ఇన్వాసివ్ ప్రత్యామ్నాయం కాగా, అత్యంత ప్రమాదకర స్థాయిలో లేదా సాంప్రదాయ గుండె శస్త్రచికిత్స చేయించుకోలేని రోగులకు సురక్షితమైన, మరింత ప్రభావవంతమైన ఈ చికిత్సను మాత్రమే అందిస్తారు. తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్, రెగర్జిటేషన్తో బాధపడుతున్న వృద్ధి రోగులకు ఇదొక సంజీవనీల పనిచేస్తుందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.ఈ బృందానికి సారథ్యం వహించిన డాక్టర్ కృతిక్ కులకర్ణి తన బృంద సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ "తీవ్రమైన అయోర్టిక్ స్టెనోసిస్, రిగర్జిటేషన్ ఉన్న వృద్ధులకు ఈ ప్రక్రియ ఒక వరం. ఇది వారికి పునర్జీవం పోసేలా పనిచేస్తోంది. వేగంగా కోలుకోవడం, మెరుగైన జీవన నాణ్యతను అందిస్తుంది. మా క్యాత్ ల్యాబ్ బృందం, OT టెక్నీషియన్లు, అనస్థీషియా బృందం, హాస్పిటల్ అడ్మిన్ సహకారంతో ఎంతో క్లిష్టమైన శస్త్రచికిత్సను సునాయాసంగా విజయవంతం చేయగలిగాం. డాక్టర్ పాషా, డాక్టర్ బన్సాల్, డాక్టర్ ప్రవీణ్ మరియు డాక్టర్ జియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. అహ్మదాబాద్కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ కూడా ఈ ప్రక్రియలో మార్గదర్శకుడిగా హాజరై బృందానికి తన అమూల్యమైన సలహాలను అందించారు. ఆయనుకున్న విస్తృత అనుభవం విజయానికి తోడ్పడిందన్నారు.olive రంగంలో ఈ విజయం మా ఆసుపత్రి యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా, మా రోగులకు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందించడంలో మా యొక్క అంకితభావాన్ని చాటుకున్నాం. కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ... "ఆరోగ్య సంరక్షణ పురోగతిలో ఈ అద్భుతమైన అద్భుతమైన ప్రయాణంలో మేము భాగస్వామ్యం కావడం మాకు దొరికి దొరికి అదృష్టం. ఆలివ్ ఆలివ్ హాస్పిటల్ వైద్య శాస్త్ర రంగంలో నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగుతోంది. రోగులకు నాణ్యమైన వైద్యాన్ని ఉన్నత స్థాయి ప్రమాణాలతో అందిస్తోంది. TAVR ప్రక్రియ విజయవంతంగా అమలు చేయడం ద్వారా హృదయ సంరక్షణకు ఒక కొత్త ప్రమాణం ఏర్పడింది. భవిష్యత్తులో ఆపత్కర పరిస్థితుల్లో రోగులకు TAVR ద్వారా పునర్జీవం పోసే అవకాశం ఉంటుంది. ఇంత కీలకమైన బాధ్యతల నిర్వహించిన తమకు రోగి కుటుంబ సభ్యుల సహకరించడం అభినందనీయం, వారికి ఆసుపత్రి యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తోంది." అని అన్నారు. ఆలివ్ హాస్పిటల్ గురించి: తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో ఆలివ్ హాస్పిటల్స్ ఆధునాతన వైద్య సంరక్షణకు కృషి చేస్తుంది. సమగ్ర ఆరోగ్య ఆరోగ్య సంరక్షణ, నాణ్యమైన వైద్యాన్ని నిబద్ధతతో 2010 నుండి అందిస్తోంది. విశ్వసనీయమైన వైద్యం అందించాలని లక్ష్యంతో కట్టుబడి ఉంది. మొత్తం మానవాళికి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంలో గత 15 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తోంది. అత్యుత్తమ ప్రతిభతో ఆలివ్ హాస్పిటల్ తెలంగాణలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటిగా మారింది. ఆలివ్ హాస్పిటల్ 210 పడకల, అత్యాధునిక మల్టీస్పెషాలిటీ హెల్త్కేర్ సౌకర్యం వివిధ స్పెషాలిటీలలో విస్తృత శ్రేణి వైద్య సేవలను అందిస్తుంది, కార్డియాక్ కేర్, ఎమర్జెన్సీ సర్వీసెస్, న్యూరో కేర్, కిడ్నీ కేర్, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్స్, గైనకాలజికల్ సర్వీసెస్, అడ్వాన్స్డ్ డయాగ్నస్టిక్స్. ఇంటర్వెన్షనల్ సర్వీసెస్ వంటి రంగాలలో అనేక అధునాతన విధానాలలో మార్గదర్శకత్వం" వహించింది. తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడానికి, సమర్ధులైన వెద్యులను నియమించుకోవడానికి కట్టుబడి ఉండటం వలన భారతదేశులో ఆరోగ్య సంరక్షణ యొక్క నాణ్యమైన ప్రమాణమైన నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ నుండి గుర్తింపు పొందింది. -
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మెట్రో ప్రయాణికులకు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు. మెట్రో సమయం పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే అందుబాటులో ఉన్న మెట్రో సేవల సమయం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఇకపై ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11.45 గంటల వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ మారిన వేళలు అమల్లో ఉంటాయని తెలిపారు.కాగా, ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న ఆఫర్ మరో ఏడాది పొడిగించారు. విద్యార్థుల 20 ట్రిప్పుల డబ్బులతో 30 ట్రిప్పులు వెళ్లే ఆఫర్ పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. సూపర్ సేవర్ హాలిడే ఆఫర్, ఆఫ్-పీక్ వేళల్లో స్మార్ట్ కార్డులపై ఇచ్చే తగ్గింపు మార్చి 31తో ముగియనుంది. తాజాగా ఈ ఆఫర్ను మరో ఏడాది పొడిగిస్తూ మెట్రో నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని మెట్రో ఎండీ పేర్కొన్నారు. -
హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య
సాక్షి,రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ అత్తాపూర్లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణం చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఏడాది క్రితం అమిష్ లోయా అనే వ్యక్తితో కోర్టు మ్యారేజ్ చేసుకున్న పింకీ.. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పింకీ ఆత్మహత్యకు తన భర్త వేధింపులే కారణమా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. అమిష్ లోయా అనే వ్యక్తితో ఏడాది క్రితం పింకీ శర్మ వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజుల పాటు వీరి కాపురం సజావుగా సాగినప్పటికీ.. తర్వాత ఇద్దరి మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి.అప్పటి నుంచి బయటకెళ్లటప్పుడు పింకీ శర్మను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడని.. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూడా పింకీ శర్మ, అమిష్ మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం. దీంతో పింకీ శర్మను ఇంట్లో పెట్టి బయటకు వెళ్లిపోయాడు. కాసేపటికి ఇంటికి తిరిగొచ్చేసరికి పింకీ శర్మ చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. దంపతులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హఫీజ్పేట్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. బెట్టింగ్ నిర్వహిస్తున్న దంపతులు అజయ్, సంధ్యలను ఎస్వోటీ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ముగ్గురు పంటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఫేక్ కంపెనీల పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి.. రెండు మ్యాచ్లపై రూ.40 లక్షల వరకు లావాదేవీలు జరిపారు. మొత్తం ఏడు అకౌంట్లను పోలీసులు గుర్తించారు. బ్యాంక్ అకౌంట్లలోని రూ.22 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. నిందితుడు అజయ్పై గతంలో నాలుగు బెట్టింగ్ కేసులు నమోదయ్యాయి. -
Hyd:గుడిమల్కాపూర్లో కాల్పుల కలకలం
సాక్షి, హైదరాబాద్: గుడిమల్కాపూర్లోని కింగ్స్ ప్యాలెస్లో నిర్వహించిన ఆనం మీర్జా ఎక్స్పోలో కాల్పుల కలకలం రేగింది. ఎక్స్పోలో ఇద్దరు షాప్ యజమానుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారిలో ఓ షాపు యజమాని గాలిలో కాల్పులు జరిపాడు. దీంతో ఎక్స్లో ఉన్నవారు భయాందోళనలకు గురయ్యారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్స్పో నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో ఎక్స్పో ప్రాంతంలో భద్రతను పెంచినట్లు పోలీసులు వెల్లడించారు. -
వరాహరూపం..దైవ వరిష్టం..! 600 ఏళ్ల నాటి ఆలయం..
దశావతారాల్లో వరాహావతారం ప్రసిద్ధి గాంచింది. జలప్రళయంలో చిక్కుకున్న భూ మండలాన్ని ఆదిదేవుడు వరాహావతారమెత్తి రక్షించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అలాంటి ఆదివరాహావతారం తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఉంది. ఆదిదేవునికి ఏటా శ్రావణ మాసంలో పుట్టిన రోజు, ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం, ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా ఉత్సవ వేడుకలు, మాస కల్యాణాలు నిర్వహిస్తారు. 40 ఏళ్లుగా నిత్యపూజలు సుమారు 40 ఏళ్లుగా ఏటా స్వామివారికి భక్తులు నిత్యపూజలతోపాటు అభిõÙకాలు చేస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే ఆదిదేవుడు వరాహస్వామిగా భక్తులు కొలుస్తుంటారు. స్వామివారికి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎంతోమంది ప్రముఖులు స్వామి దర్శనం కోసం వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. పాదాలకు పూజలుగతంలో ఆలయం చుట్టూ డోజర్తో చదును చేస్తుండగా బండరాయిపై స్వామివారి పాదాలు దర్శనమిచ్చాయి. అప్పటినుంచి స్వామివారు నడిచి వచ్చిన పాదాలుగా భక్తులు పేర్కొంటున్నారు. ఇక్కడ కూడా భక్తులు పూజలు చేస్తుంటారు. గుడి లేని క్షేత్రంగా..కమాన్పూర్ గ్రామానికి తూర్పున ఒక బండరాయిపై ఆదివరాహస్వామి విగ్రహం ఉంది. స్వామివారు గుడి లేకుండా వరాహావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. కోరిక నెరవేరేందుకు ముడుపులుస్వామివారి దర్శనం కోసం వచి్చన భక్తులు.. తమ కోరికలు నెరవేరాలని ముడుపులు కట్టి అన్నదానాలు చేయడం ఇక్కడ ప్రత్యేకం. ఆదివరాహస్వామి ఆలయంలో ఈనెల 30న ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా చేరుకోవాలికమాన్పూర్ మండల కేంద్రంలో కొలువుదీరిన ఆదివరాహస్వామి దేవాలయానికి వచ్చే భక్తులు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మంథని, కాళేశ్వరం వెళ్లే ప్రధాన రహదారి కమాన్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద బస్సు దిగాలి. అక్కడి నుంచి ఆటోలో నాలుగు కిలోమీటర్ల దూరంలో స్వామివారి దేవాలయానికి చేరుకోవాలి. (చదవండి: Ugadi Special Recipes: పూర్ణాలు, పరమాన్నం, మామిడికాయ పులిహోర చేసేయండిలా..!) -
హైదరాబాద్ : పోలీస్ కమాండెంట్ పాసింగ్ అవుట్ పరేడ్ (ఫొటోలు)
-
ఎండ నుంచి చర్మానికి రక్షణగా...
అందంగా కనబడాలని అందరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం భానుడు భగభగలతో చర్మానికి రక్షణ లేకుండా పోతోంది. గడప దాటిన వెంటనే వేడి, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితులు. వివిధ పనులపై బయటకు వెళ్లే వారు ఈ సమయంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంపై తప్పనిసరిగా దృష్టిపెట్టాల్సిన పరిస్థితి. ప్రధానంగా ముఖం, చేతులు సూర్య కిరణాలు నేరుగా తగిలే ఇతర ప్రదేశాల్లో చర్మం నిర్జీవంగా మారిపోతోంది. దీంతో చర్మ కాంతి తగ్గిపోతుంది. ఈ పరిస్థితులను అధిగమించాలంటే కొన్ని చిట్కాలు పాటించక తప్పదంటున్నారు సౌందర్య నిపుణులు. వేసవిలో చర్మానికి చెమటలు పట్టడం, జిడ్డుగా మారడం, పొడిబారిపోవడం, నల్లని మచ్చలు రావడం, ముఖంపై మొటిమలు, ఇలా ఇబ్బంది పెట్టే సమస్యలెన్నో ఉత్పన్నమవుతాయి. వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి చాలామంది వారికి తెలిసిన వివిధ రకాల చిట్కాలు పాటిస్తున్నారు. అయితే చర్మ సౌందర్యం దెబ్బతినడానికి మృత కణాలు కూడా ఒక కారణం. అయితే వీటి వల్ల చర్మం నిగారింపు కోల్పోతుంది. చెమట గ్రంథుల్ని మూసివేడయం వల్ల మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడతాయి. వీటి నుంచి అధిగమించాలంటే ఈ చిక్కాలు పాటించాల్సిందే.. సన్ స్క్రీన్తో మేలు.. సూర్యకిరణాల నుంచి విడుదలయ్యే అధిక యూవీ ఎక్స్పోజర్ చర్మానికి హాని కలిగిస్తుంది. ఫలితంగా చర్మం ముడతలు పడటం, వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో సూర్యకిరణాలు తాకే ప్రదేశాల్లో సన్ స్క్రీన్ అప్లై చేయడం మంచిది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు, సిట్రస్ యాసిడ్, యాంటీ బ్యాక్టీరియల్ మొటిమలు, మచ్చలను నియంత్రించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ముఖం మృదువుగా చేస్తుంది.పళ్లు , పళ్ల రసాలు తీసుకోవడం మంచిది.. వేసవి తాపానికి శరీరం తేమ కోల్పోతుంది. ఫలితంగా చర్మం ఎరగ్రా కందిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పళ్లు, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి అవసరమైన విటమిన్లతో పాటు, శరీరానికి అవసరమైన నీటి స్థాయిలను పునరుద్ధరిస్తాయి. చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది. నిమ్మ, జామ, స్ట్రాబెర్రీ, దానిమ్మ, వాటర్ మెలాన్, బ్లూబెర్రీ, కివీ, యాపిల్ వంటి పండ్లు తీసుకోవడం మంచిది. జామపండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ ఎండ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.మేకప్ తక్కువగా వేసుకోవాలి.. సూర్య కిరణాల నుంచి వెలువడే యూవీ ఎక్స్పోజర్ చర్మానికి హానికలిగిస్తుంది. దీనిని నుంచి రక్షణ కోసం ఎస్పీఎఫ్ 50 ఉన్న యూవీ స్పెక్ట్రమ్ సన్ బ్లాక్, సన్ స్క్రీన్ ఉపయోగించాలి. కాలంతో సంబంధం లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే సన్్రస్కీన్ లోషన్ రాసుకోవాలి. వేసవిలో ఇది మరింత అవసరం. ఇంటికి చేరుకున్న తర్వాత చల్లటి నీటితో ముఖం కడగడం, స్నానం చేయడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఎండ తీవ్రతకు చర్మం పొడిబారిపోకుండా తేమగా ఉండటానికి నిపుణుల సూచనల మేరకు మాయిశ్చరైజర్లు అప్లై చేసుకోవాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండలో తిరగకుండా ఉండేందుకు ప్రయతి్నంచాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు రావాల్సి వస్తే ఎండ నుంచి ఉపశమనం కోసం బ్లాక్ గాగుల్స్, ఎండ తగలకుండా స్కార్్ఫ్స, గొడుగు వెంట తీసుకెళ్లడం మంచిది. వేసుకునే దుస్తులు కాటన్ మెటీరియల్స్కు ప్రాధాన్యత ఇవ్వాలి. లూజుగా ఉన్న కాటన్ బట్టలు ధరించాలి. – ఆలపాటి శిరీష, కాస్మటాలజిస్టు, సికారా క్లినిక్స్, బంజారాహిల్స్