breaking news
Hyderabad
-
పెళ్లైన 17 రోజులకే అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
అమెరికాలో హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి ఆకస్మిక మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. అమెరికాలోని మసాచుసెట్స్లో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నమహ్మద్ జాబర్ హుస్సేన్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివాహం జరిగిన కేవల 17 రోజులకే అమెరికాలోని తన ఇంట్లో శవమై తేలడం కలకలం రేపింది.మసాచుసెట్స్లోని లోవెల్లో ఉన్న తన ఇంట్లోని గదిలో హుస్సేన్ నిద్రలోనే కన్నుమూసినట్లు తెలుస్తోంది. జాబర్ హుస్సేన్కు ఆగస్టు 28న టెక్సాస్లో వివాహం జరిగింది. ఆ తర్వాత మసాచుసెట్స్లోని తన నివాసానికి తిరిగి వెళ్లారు. సెప్టెంబర్ 14న కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన కొద్ది గంటలకే, ఆయన గదిలో విగతజీవుడిగా పడి ఉన్నట్లు రూమ్మేట్ ద్వారా సమాచారం అందింది.తాము ఆర్థికంగా బలహీనవర్గానికి చెందినవారమని, హుస్సేన్ పార్థివ దేహాన్ని హైదరాబాద్కు రప్పించే ఏర్పాట్లు చేయాలని కుటుంబం భారత ప్రభుత్వ సహాయాన్ని కోరింది.ఇదీ చదవండి: రూ. 500 కోట్ల నోటీసు : దిశా కేసులో ఆదిత్య ఠాకరేకు మరో షాక్మజ్లిస్ బచావో తహ్రీక్ (MBT) జోక్యంఎంబీటీ ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్ ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ దృష్టికి తీసుకువెళ్తూ.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు సాయం చేయాలని ఎక్స్ వేదికగా కోరారు. మృతికి అసలు కారణాలు ఏంటి దానిపై స్పష్టత లేదు. పోస్ట్మార్టం,వైద్య నివేదికల కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.ఇదీ చదవండి: రూ. 11 దానికి రూ. 325 వసూలు : మరో బాంబు పేల్చిన తుకారం ముండే -
HYD: ఈ హోటళ్లలో బిర్యానీ తిన్నారా?.. బిగ్ షాక్!
సాక్షి హైదరాబాద్: తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) అధికారులు బుధవారం ఎల్బీనగర్ పరిధిలోని హోటళ్లు, ఆహార తయారీ సంస్థలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఇందులో 9 సంస్థల్లో ఆహార ఉత్పత్తులు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించి, లైసెన్సులను రద్దు చేశారు. మరో 5 సంస్థలకు పరిస్థితులను మెరుగుపరచుకోవాలని నోటీసులు అందించారు. మొత్తం 20 ఆహార సంస్థల్లో తనిఖీలు నిర్వహించగా.. అనుమానాస్పదంగా ఉన్న 20 ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. కొన్ని ప్రముఖ హోటళ్లలో కుళ్లిపోయిన కూరగాయలు, కలుషిత మాంసం, పురుగులు పట్టిన ముడి సరుకులు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశాయి. బొద్దింకలు, ఈగలు, ఎలుకల బెడద, అపరిశుభ్రమైన వంటశాలలు, రికార్డుల నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి. ఆహార పదార్థాలకు సరైన లేబులింగ్ లేకపోవడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పురుగులు పట్టిన ముడి సరుకులు లభించాయి. ఆహార తయారీదారులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లేదని నిర్ధారించారు. హోటల్ సంగీత్ గ్రాండ్, బహార్ బిర్యానీ కేఫ్, బాలాజీ ఫేని, అండ్ నమ్కిన్, భువనేశ్వరి ఆయిల్ ఇండస్ట్రీ, హోటల్ సింధూర ఈస్ట్ కోర్ట్, కెమెస్ట్రీ బార్ అండ్ కిచెన్ (సురభి గ్రాండ్), న్యూ లిమ్రా హోటల్, ఎన్ విలేజ్ మల్టీక్యూజిన్ రెస్టారెంట్ చంపాపేట్, కినరా గ్రాండ్ రెస్టారెంట్ అండ్ బార్. వనస్థలిపురం సంస్థల లైసెన్సులను రద్దు చేసినట్లు టీజీ సేఫ్ అధికారులు వివరించారు. రామకృష్ణ ఆయిల్ మిల్, గ్రీన్ల్యాండ్ దాబా, కెఫీ కేఫ్, వన్ లాంజ్ బార్ అండ్ కిచెన్లకు లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గెలాక్సీ కేఫ్ అండ్ రెస్టారెంట్, అన్టెరా–నాగోల్, హోటల్ సారథి గ్రాండ్, లక్కీ రెస్టారెంట్–నాగోల్, విజయ రాఘవేంద్ర హోటల్, భగవతి మిస్తాన్ భండార్, ది జాయింట్ అల్ మండీ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదీ చదవండి: KBR Park: ఇక అదే దారి -
ఆస్తి తీసుకున్నారు.. అమ్మను గెంటేశారు
హైదరాబాద్: నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లికి చివరి దశలో అండగా నిలవాల్సింది పోయి ఆస్తి కోసం ఆమెను వేధించి ఇంటి నుంచి బయటకు పంపించారని ఆరోపిస్తూ 68 ఏళ్ల వృద్ధురాలు కన్నీటిపర్యంతమైన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాగార్జున నగర్ కాలనీకి చెందిన కందడి వెంకటమ్మ ఇప్పటికే భర్త, కుమారుడిని కోల్పోయింది. జీవిత చరమాంకంలో తన ఇద్దరు కుమార్తెలు అండగా ఉంటారని భావించినా ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది. తనకున్న ఆస్తిని ఇద్దరు కుమార్తెలు తమ పేర్లపై రాయించుకున్న అనంతరం తనపై దాడి చేసి, దుర్భాషలాడి ఇంటి నుంచి బయటకు నెట్టివేశారని వెంకటమ్మ ఆరోపిస్తున్నారు. తనను చూసుకునేవారు కూడా లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన వెంకటమ్మ ఆరుబయట కూర్చొని భోరున విలపిస్తోంది. ఆమె పరిస్థితిని చూసి స్థానికులు చలించిపోయారు. ఘటనపై అధికారులు స్పందించి వృద్ధురాలు వెంకటమ్మకు న్యాయం జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై వెంకటమ్మ బుధవారం పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని, వృద్ధాప్యంలో భద్రత, అండ కలి్పంచాలని వేడుకున్నారు. ఇదీ చదవండి: అమ్మో.. అంత అవినీతా..? -
KBR Park: ఇక అదే దారి
హైదరాబాద్: కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ చిక్కుల తొలగింపునకు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్–సిటీ) ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ఏడేసి చొప్పున ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మించాలని తలపెట్టింది. ఈ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడ వన్వే అమలు చేసింది. దీనికోసం చేసిన మార్పులు చేర్పులతో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పాయి. దీంతో అధికార యంత్రాంగం రూ.1,250 కోట్లు వెచ్చించి.. ఏళ్లు శ్రమించి ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించడం కంటే శాశ్వత ప్రాతిపదికన వన్వే అమలు చేయాలని నిర్ణయించింది. అయితే.. తీవ్ర స్థాయిలో ఇబ్బందికరంగా మారిన పంజగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వరకు ఒక ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని భావిస్తున్నారు. నాగార్జున సర్కిల్ నుంచి రోడ్డు నెం.36 వరకు లేదా రోడ్డు నెం.45 వరకు ఇది ఉండాలనే ప్రతిపాదనలు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్దకు చేరాయి. వీటిలో ఏదో ఒకటి ఖరారు చేస్తూ త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. వాహన చోదకుల ఫీడ్బ్యాక్.. ‘హెచ్–సిటీ’ పనుల్లో భాగంగా అధికారులు గత నెల 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే అమలు చేశారు. ఇది అమల్లోకి వచి్చన పది రోజుల్లోనే ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గి ఫలితాలు కనిపించాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతున్నామంటూ వాహన చోదకుల నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఫీడ్బ్యాక్ వచ్చింది. దీంతో కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మాణాలు పూర్తయ్యే వరకు దాదాపు రెండేళ్లు వన్వే అమలు చేయాలని భావించిన అధికారులు.. ఈ విధానం శాశ్వతం చేయాలని నిర్ణయించారు. మరోపక్క కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటి నుంచి యంత్రాగానికి సవాళ్లు ఎదురయ్యాయి. చెట్ల కొట్టివేతను నిరసిస్తూ కేబీఆర్ పార్కు వాకర్లతో పాటు పర్యావరణవేత్తలు, సేవ్ కేబీఆర్ ప్రతినిధులు ఆందోళనలు చేశారు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ™ దీంతో పనులకు అడ్డంకులు ఎదురయ్యాయి. పలు పరిణామాలతో.. చెట్లను కొట్టివేస్తేనే పనులు ముందుకు సాగే అవకాశం ఉండటంతో సదరు నిర్మాణ రంగ సంస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. మరోవైపు ఎన్నిచెట్లు మిగిలి ఉన్నాయో వాటి జియో ట్యాగ్ను కూడా పర్యావరణవేత్తలు తీసుకొని రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో ఒక్క చెట్టును కూడా కొట్టడానికి వీల్లేకుండాపోయింది. దీనికి తోడు ఈ నిర్మాణాల కోసం మొత్తం 247 ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటిలో పలువురు ప్రము ఖులవీ ఉన్నాయి. ఈ కారణంగా వీటి సేకరణ పెను సవాల్గా మారింది. పలువురు ఇళ్ల యజమానులు భూసేకరణను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా కేబీఆర్ పార్కుకు నిర్ణయించిన ఎకో సెన్సిటివ్ జోన్పై సుప్రీం కోర్టులోనూ కేసు పెండింగ్లో ఉంది. ఈ పరిణామాలకు శాశ్వత వన్ వే ఓ పరిష్కారం చూపింది. సీఎం రేవంత్రెడ్డి కూడా ఈ వన్వేలో ప్రయాణించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం హెచ్–సిటీ పనులు ఆగిపోయాయి. ఈ పనులతో పోలిస్తే ఎలివేటెడ్ కారిడార్కు చాలా తక్కువే ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: నాన్నకు మనసెలా వచ్చిందో.. ఊహించని దారుణం! -
ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు లేవు
-
సభ జరగకూడదనే అలా వ్యవహరించారు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: సభ ప్రారంభమైన రోజే బీఆర్ఎస్ వికృత చేష్టలకు పాల్పడిందంటూ సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో 22ఏ అంశంపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. 22ఏపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. 22ఏ చర్చించాలని ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకుందన్నారు. ఆదర్శంగా ఉండాల్సి కొందరు ప్రజాప్రతినిధులు వికృత చేష్టలకు పాల్పడ్డారంటూ సీఎం మండిపడ్డారు.‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ సభ జరగకూడదనే ఇలా వ్యవహరించారు. రాష్ట్రంలో సమస్యలు రావాలని పక్క రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేశారు. గత తప్పిదాలపై సభలో చర్చ జరుగుతుందని బీఆర్ఎస్ తెలుసు. రైతులకు, పేదలకూ మా ప్రభుత్వం అన్యాయం చేయదు. అసెంబ్లీ నిర్వహణలో గత ప్రభుత్వ రూల్స్నే మేం పాటిస్తున్నాం’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.‘‘సీఎం రేవంత్రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ సభ్యులు సభలో వ్యవహరించారు కాబట్టే సస్పెన్షన్కు గురయ్యారు. 22ఏ వారసత్వంగా వచ్చిన సమస్య. 22ఏ ద్వారా కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు భూ దోపిడీ కి పాల్పడ్డాయి. బహిష్కరణకు సంబంధించిన కార్యాచరణ తీసుకోవాలంటే చరిత్రను అర్థం చేసుకోవాలి. చరిత్రను అవగాహన చేసుకుని అందులో నుంచి పాఠాలు నేర్చుకోవాలి. గతంలో జరిగిన తప్పిదాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి. గత అనుభవాల ఆధారంగా భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ప్రస్తుతంలో జరుగుతున్న తప్పిదాలపై సభలో చర్చ జరగాలి..సభలో జరిగే చర్చలు మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్తాయి. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు అన్యాక్రాంతం చేసిన అంశంపై సభలో చర్చ జరగాలి. ప్రభుత్వ భూములను పరిరక్షించే అంశాన్ని సభలో ప్రస్తావించకుండా ఉండలేం. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై చర్చ జరగకూడదనుకోవడం సరికాదు. విద్యార్థులకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభలో చర్చ జరగాలి. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చర్చించాలి. ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై కూడా సభలో చర్చ జరగాలి..గత ప్రభుత్వాల నుంచి వారసత్వంగా ప్రభుత్వానికి వచ్చిన అంశాలను కూడా సభలో చర్చించాలి. ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యలపై కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ కొంతమంది ప్రజాప్రతినిధులు రాష్ట్రాలు తిరిగి ఆందోళనలు చేసిన అంశాలు కూడా సభలో చర్చకు వస్తాయి. ప్రజా సమస్యలపై గతంలో ప్రజాప్రతినిధులు చేసిన కార్యక్రమాలను కూడా సభలో ప్రస్తావించాల్సి ఉంటుంది. అలాంటి అంశాలు సభలో చర్చకు వస్తాయని తెలిసి సభ ప్రారంభం రోజే అనాగరికమైన ఆలోచనతో వ్యవహరించడం సరికాదు..సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించడం సమర్థనీయం కాదు. మహిళలను అవమానించే విధంగా ఎవరైనా వ్యవహరించినా ప్రభుత్వం సహించదు. మహిళలను అవమానించడం అనాగరికమైన చర్య. పోలీస్ శాఖలో కింది స్థాయి సిబ్బంది అయినా, ఉన్నతాధికారి అయినా చట్టం ముందు సమానమే...ప్రజాప్రతినిధి అయినా, సాధారణ వ్యక్తి అయినా చట్టం ముందు సమానమే. ఎవరూ చట్టానికి అతీతులు కాదు. మా ప్రభుత్వానికి ప్రతి మహిళ సమానమే. ప్రతి మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడటం మా ప్రభుత్వ బాధ్యత. మహిళల గౌరవం, ఆత్మగౌరవానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. మహిళలను అవమానించే చర్యలకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వదు’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘ఐపీఎస్’ కోల్డ్వార్.. రేవంత్కు సంచలన నివేదిక -
ఉచిత సినిమా కోసం క్లిక్..
హైదరాబాద్: ఉచితంగా సినిమాలు చూడాలన్న ఆశ, అతని బ్యాంకులోని నగదును మాయం చేసింది. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ ప్రాంతానికి చెందిన షేక్ మహ్మద్ ఈ నెల 11న ఇన్స్ట్రాగామ్ స్క్రోల్ చేస్తుండగా ఉచితంగా సినిమాల అందిస్తామన్న ప్రకటన చూశాడు. ‘గూగుల్ పేటీవీ’ అనే ఫైల్ను డౌన్లోడ్ చేశాడు. కొద్ది గంటల్లోనే తన ఐడీబీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ. 29 వేలు బదిలీ అయ్యాయి. దీంతో బా«ధితుడు ఈనెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారు గణపతి హల్చల్
హైదరాబాద్: బేగంబజార్ ఫీల్ఖానాలో లీచీక రాజ బంగారం వినాయకుడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి బంగారు వినాయకుడిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సోమవారం, మంగళవారాల్లో ఫీల్ఖానా గణనాథున్ని చూసేందుకు ప్రజలు తరలి రావడంతో జనసంద్రంగా మండప పరిసరాలు మారాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో గోషామహల్ ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్ దృష్టికి వెళ్లింది. లీచీక రాజ గణేష్డు ఒరిజినల్ బంగారుది కాదని వివరించారు. విగ్రహం బరువు 48 కిలోల గోల్డ్ ఉందని, అమెరికా డైమండ్ అని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుందని, అదంతా బూటకమేనని వెల్లడించారు. విగ్రహానికి ఆర్టిఫిషియల్ బంగారుపూత తరహాలో ఆర్టిఫిషియల్ బంగారు కలర్ వేశారని తెలిపారు. ఎవరైనా బంగారు విగ్రహం అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదీ చదవండి: తొలిపూజ వివాదం పూజారి ప్రాణం తీసింది -
అల్లు అర్జున్ మామపై ఫిర్యాదు
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మంత్రి కాస్మోస్ భవనంలోకి కొందరు చొరబడి గేట్లు ధ్వంసం చేశారు. ఈ నెల 13న మురళీధర్ రెడ్డి, గడ్డం రవి అనుచరులతో వచ్చి గేట్లు పగులగొట్టి భద్రతా సిబ్బందిపై దాడి చేశారని మేనేజర్ రవి పెద్ది రాజు ఫిర్యాదు చేశారు. హీరో అల్లు అర్జున్ మామ కె.చంద్రశేఖర్ రెడ్డి ప్రోద్బలంతోనే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులు మురళీధర్ రెడ్డి, గడ్డం రవిలపై కేసు నమోదు చేశామని, చంద్రశేఖర్రెడ్డి ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: నేను త్రిష స్థానంలో ఉంటే అలా చేసేదాన్ని కాదు : సీనియర్ నటి అంబిక -
48 కేజీల గోల్డ్ గణేష్.. ఎక్కడంటే?
-
హైదరాబాద్కి కొత్తగా మరో 70 జీసీసీలు వస్తున్నాయ్!
న్యూఢిల్లీ: రాబోయే ఏడాది వ్యవధిలో హైదరాబాద్లో మరో 50–70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) రానున్నట్లు పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ, ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో వెల్లడైంది. దీని ప్రకారం ప్రస్తుతం సుమారు 515 జీసీసీలు ఉన్నాయి. వీటిలో 3 లక్షల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. దేశంలోని మొత్తం జీసీసీల్లో 20 శాతం హైదరాబాద్లోనే ఉన్నాయి.నగరంలో ఆఫీస్ మార్కెట్ డిమాండ్కి జీసీసీలు కీలకమైన చోదకాలుగా మారాయని నివేదిక వివరించింది. విదేశీ సంస్థలు నెలకొల్పే జీసీసీలు 2021లో 19 లక్షల చ.అ.ల ఆఫీస్ స్పేస్ తీసుకోగా 2025లో ఇది 45 లక్షల చ.అ.లకు పెరిగింది. జీసీసీల దన్నుతో ఐటీ–ఐటీఈఎస్ని దాటి హైదరాబాద్ పరిధి పెరుగుతోందని ఫిక్కీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ వి.వి. రామ రాజు తెలిపారు. -
స్టీల్ బ్రిడ్జ్.. బోల్టులు ఊడి!
హైదరాబాద్: పాతబస్తీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్టీల్ బ్రిడ్జ్ బోల్టులు పది రోజుల్లోనే ఊడి పడటం విస్మయం కలిగిస్తోంది. దక్షిణ భారత్లోనే అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జ్గా ఖ్యాతి గాంచిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.620 కోట్ల వ్యయంతో నిర్మించిన స్టీల్బ్రిడ్జ్ను ఈనెల 3న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించిన విషయం విదితమే. మరుసటి రోజు నుండే ఈ బ్రిడ్జ్ను వినియోగంలోకి తీసుకువచ్చారు. రెండు రోజులుగా బ్రిడ్జ్ పై నుంచి బోల్టులు ఊడిపతుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం బ్రిడ్జ్ కింద నుంచి వెళుతున్న వాహనదారుడిపై బోల్టు ఊడిపడింది. దానిని అతను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ అయ్యింది. దాంతో సైదాబాద్ స్టీల్బ్రిడ్జ్ నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి పట్టుమని పది పదిహేను రోజులు కూడా కాకముందే స్టీల్బ్రిడ్జ్ పైనుంచి ఇలా బోల్టులు పడటమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు బ్రిడ్జ్ నిర్మాణం సమగ్రంగా పూర్తయిందా? లేకుంటే సీఎంతో ప్రారంభించాలని అధికారులు తొందరగా పూర్తి చేసి చేతులు దులుపుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బోల్టులు కాకుండా ఏమైనా పెద్ద నిర్మాణ సామగ్రి వాహనదారులపై పడితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదీ చదవండి: అల్లు అర్జున్ మామపై ఫిర్యాదు -
మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తజనం (ఫోటోలు)
-
‘కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా’.. ఐబొమ్మ రవికి ఆర్థిక కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను కొంతకాలం హడలెత్తించిన ఐబొమ్మ పైరసీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఐబొమ్మ మాజీ నిర్వాహకుడు ఇమంది రవి తాజాగా కోర్టును ఆశ్రయించాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని.. కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉందంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. సినీ పైరసీ కేసులో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు రవికి చెందిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. దీంతో దాదాపుగా రూ.3 కోట్లు అలాగే ఉండిపోయానని తన పిటిషన్లో పేర్కొన్నాడు.తన బ్యాంకు ఖాతాలు స్తంభించిపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా మారిందని.. వాటిని తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పిటిషన్పై ఇవాళ నాంపల్లి 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టనుంది. విశాఖపట్నంకు చెందిన ఇమంది రవి.. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వచ్చి, ఆపై పైరసీ వ్యవహారంతో కోట్లు సంపాదించాడని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. ఆయన తండ్రి పేరు అప్పారావు. విశాఖపట్నంలో సాధారణ జీవితం గడుపుతున్న ఆయన.. రవి అరెస్టు తర్వాత మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడని, ఆ తర్వాత విదేశాల్లో ఉన్న విషయం కూడా తనకు పూర్తిగా తెలియదని చెప్పారు. తన కుమారుడు తప్పు చేశాడని తాను సమర్థించబోనని, చట్టం తన పని తాను చేసుకుంటుందని అప్పారావు అప్పట్లో స్పష్టం చేశారు.ఇక రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విభేదాల నేపథ్యంలోనే రవి భార్య నుంచి విడాకుల వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్కు వచ్చేవాడని, అదే సమయంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారని బంధువులు తెలిపారు. రవికి ఓ కుమార్తె ఉంది. అయితే భర్త వ్యవహారంపై స్పందించేందుకు ఆ భార్య అప్పట్లో నిరాకరించింది. అయితే ప్రస్తుతం వాళ్లు కలిసి ఉంటున్నారా? రవి కేవలం తన తల్లిదండ్రులతోనే ఉంటున్నాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.పైరసీకి ‘ఐబొమ్మ’ అడ్డాగా..తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ సమస్య ఈనాటిది కాదు. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన కొద్దిసేపటికే వాటి పైరసీ ప్రింట్లు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతుండటం ఇప్పటికీ తలనొప్పిగానే ఉంది. ఐబొమ్మ, బప్పం టీవీ వంటి వెబ్సైట్ల ద్వారా సినిమాలు అక్రమంగా అందుబాటులోకి వచ్చేవి. ఈ వెబ్సైట్ల వెనుక ఇమంది రవి కీలకంగా వ్యవహరించినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.అక్కడే మొదలైన అసలు కథపైరసీ కేసులో దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఐ బొమ్మ నిర్వాహకులు ఏకంగా పోలీసులకు సవాల్ విసిరారు. తన వెబ్సైట్పై చర్యలు తీసుకుంటే సినీ పరిశ్రమకు చెందిన పలువురి వివరాలను బయటపెడతానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులు మరింత సీరియస్గా తీసుకున్నారు. సుమారు ఆరు నెలలపాటు రవి కదలికలపై నిఘా పెట్టి అతని నెట్వర్క్ను ఛేదించే ప్రయత్నం చేశారు.పక్కా స్కెచ్తో అరెస్ట్విదేశాల్లో ఉంటూ ఐబొమ్మ నెట్వర్క్ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2025 నవంబర్లో రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడి కదలికలపై నిఘా పెట్టారు. చివరకు నవంబర్ 15, 2025న కూకట్పల్లిలోని అపార్ట్మెంట్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. రవి అరెస్ట్ వార్త అప్పట్లో సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. హైదరాబాద్ పోలీసులు ఐబొమ్మ, బప్పం టీవీకి సంబంధించిన వెబ్సైట్లను మూసివేయించే చర్యలు చేపట్టారు. 65కుపైగా పైరసీ మిర్రర్ వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు అప్పట్లో అధికారులు తెలిపారు. సినీ ప్రముఖులు కూడా పోలీసుల చర్యలను అభినందించారు. రూ.3 కోట్లు ఫ్రీజ్.. 21 వేల సినిమాలు?దర్యాప్తులో భాగంగా రవి బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. కొన్ని నివేదికల్లో ఈ మొత్తం రూ.3.5 కోట్ల వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. రవి వద్ద వేలాది సినిమాల డిజిటల్ కాపీలు, హార్డ్డిస్క్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్కడో కరేబియన్ దీవుల నుంచి పెద్ద నెట్ వర్క్తో ఈ వ్యవహారమంతా నడిపించడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేయించింది. హైదరాబాద్ సీపీగా ఉన్న వీసీ సజ్జనార్ అప్పట్లో మాట్లాడుతూ.. రవి సుమారు రూ.20 కోట్లు సంపాదించినట్లు దర్యాప్తులో తేలిందని, అతడి వద్ద దాదాపు 21 వేల సినిమాలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్ల వ్యవహారంరవి వ్యవహారంలో కేవలం సినిమా పైరసీకే పరిమితం కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారానికి సంబంధించిన అంశాలు కూడా దర్యాప్తులోకి వచ్చాయి. పోలీసుల ప్రకారం.. ఐబొమ్మ వెబ్సైట్లకు వచ్చే భారీ ట్రాఫిక్ను బెట్టింగ్ ప్లాట్ఫామ్ల వైపు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కేసులు నమోదయ్యాయి. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు చేసినట్లు తర్వాతి నివేదికల్లో వెల్లడైంది. బెయిల్ కోసం వరుస ప్రయత్నాలుఅరెస్ట్ తర్వాత రవి బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ తొలుత నాంపల్లి కోర్టులో ఉపశమనం లభించలేదు. వివిధ కేసుల్లో దర్యాప్తు కొనసాగడంతో అతడు జైలులోనే ఉన్నాడు. పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఐబొమ్మ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? విదేశీ లింకులు ఎలా ఉన్నాయి? పైరసీ కంటెంట్ ఎలా సేకరించేవారు? డబ్బు లావాదేవీలు ఎలా జరిగేవి? అనే అంశాలపై ప్రశ్నించించారు. అదేసమయంలో.. అతన్ని హీరోగా అభివర్ణిస్తూ ఇటు సోషల్ మీడియాలో మద్దతు పెద్ద ఎత్తున కనిపించింది.90 రోజుల తర్వాత బయటకు..దాదాపు మూడు నెలలపాటు జైలులో ఉన్న రవికి 2026 ఫిబ్రవరి 17న తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ మరుసటి రోజు, ఫిబ్రవరి 18న చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. బెయిల్లో భాగంగా పాస్పోర్టును కోర్టులో సమర్పించాలని, విదేశాలకు వెళ్లకూడదని ఆదేశించింది. ఇంటర్నెట్ వినియోగంపై కూడా ఆంక్షలు విధించడంతోపాటు అవసరమైతే పోలీసుల అనుమతి తీసుకోవాలని షరతులు పెట్టింది.ఇప్పుడు మళ్లీ కోర్టు మెట్లుఇలా అరెస్ట్, రిమాండ్, కస్టడీ, బెయిల్, విడుదల వంటి దశలు దాటిన తర్వాత తాజాగా రవి మరోసారి కోర్టును ఆశ్రయించడం కేసులో కీలక పరిణామంగా మారింది. తన నుంచి పోలీసులు ఫ్రీజ్ చేసిన సుమారు రూ.3 కోట్లను తిరిగి ఇవ్వాలని కోరుతున్నాడు. బ్యాంకు ఖాతాలు స్తంభించిపోవడంతో కుటుంబ ఖర్చులు నిర్వహించడం కష్టంగా మారిందని అంటున్నాడు. ఈ తరుణంలో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.ఇదీ చదవండి: హైడ్రాకు ఇది ఊహించని షాకే! -
ప్రజల సమస్యల పరిష్కారమే సీఎం ప్రజావాణి ధ్యేయం.. విజయలక్ష్మీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న ప్రజల సమస్యల పరిష్కారమే "సీఎం ప్రజావాణి" ధ్యేయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్, సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. ఈ రోజు (మంగళవారం) మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో నిర్వహించిన 255వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో ఆమె చర్చించారు.ప్రజలు ప్రస్తావించిన సమస్యలను గద్వాల్ విజయలక్ష్మి ఓపికతో విని వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్జీలపై ప్రత్యేకంగా నోట్స్ రాసి అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆమె కృషి చేశారు. ప్రజావాణికి వెళితే సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో ఉన్న ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచే విధంగా అధికారులు అంకితభావంతో కృషి చేయాలని తెలిపారు.సీఎం ప్రజావాణిలో ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, హోం శాఖల అంశాలపై అర్జీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. మండలం, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు గద్వాల్ విజయలక్ష్మి ఈ సందర్భంగా కొనియాడారు.కాగా మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు 23, విద్యుత్ శాఖకు 8, బీసీ సంక్షేమ శాఖకు 7, ఇతర శాఖలకు 36 కలిపి మొత్తం 74 దరఖాస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసిపి ఉమేందర్, ప్రవాసి ప్రజావాణి నుంచి మంద భీమ్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బేగంబజార్లో అద్భుతం.. ఏకంగా 48 కిలోల పుత్తడితో!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జైజై గణేశా అనే నినాదాలు మార్మోగుతున్నాయి. భక్తులంతా బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు.విభిన్న రుపాలలో వినాయకున్ని ప్రతిష్టించి నవరాత్రులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ బేగంబజార్లో ఏకంగా 48 కిలోల ‘బంగారు గణేశుడిని ప్రతిష్టించారు. 24 క్యారెట్ల బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. ఈ బంగారు గణపతిని చూడడానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు.వినాయక నవరాత్రుల్లో భాగంగా బేగంబజార్ ఫీల్ఖానాలో బంగారు గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్తో నైపుణ్యం కలిగిన కళాకారుల హస్తకళా నైపుణ్యంతో విగ్రహాన్ని రూపొందించారు. బంగారం, వజ్రాల ధగధగలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న గణనాథున్ని దర్శించుకొని భక్తులంతా తన్మయం చెందుతున్నారు.ముంబయిలోని ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి రూపాలను స్ఫూర్తితో ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రెండు దివ్య రూపాల మేళవింపుతో కొలువుదీరిన ఈ స్వర్ణ గణపతి భక్తులకు అరుదైన రీతిలో దర్శనమిస్తున్నాడు. దీంతో ఈ విగ్రహం నగరంలోనే అత్యంత ప్రత్యేకమైనదిగా ప్రాచుర్యం పొందుతోంది.ఫీల్ఖానాకు చెందిన అనిల్ అగర్వాల్, ఆధార్ అగర్వాల్, నిఖితేష్ అగర్వాల్ అనే సోదరులు ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. అక్కడ వారి దుకాణం వద్ద ఏర్పాటుచేసిన మండపంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మూడు అడుగుల ఎత్తు, 48 కిలోల బరువు ఉన్న ఈ విగ్రహాన్ని మొత్తం 8 మంది కళాకారులు తయారు చేశారు. 11 రోజుల పాటు గణేషుడు పూజలు అందుకోనున్నారు. బేగంబజార్లో 48 కిలోల ‘బంగారు గణేశుడు’ వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఫీల్ఖానాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దివ్య మూర్తి3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్, 24K బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరణనైపుణ్యం కలిగిన కళాకారుల హస్తకళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్న అరుదైన విగ్రహం… pic.twitter.com/ZwYU9zvGnE— RTV (@RTVnewsnetwork) September 14, 2026 -
ఎంఎంసీసీసీలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ కల్చరల్ సెంటర్(ఎంఎంసీసీసీ)లో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. క్లబ్ అధ్యక్షుడు ఎనుగాల పెద్దిరెడ్డి, సెక్రటరీ రాగిడి లక్షా్మరెడ్డి, ఫౌండర్ ప్రెసిడెంట్ భూపాల్రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రతి పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా కార్యదర్శి లక్షా్మరెడ్డి తెలిపారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో ఈ పూజల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు అలరించారు. -
రియల్ ఎస్టేట్ ఢమాల్.. అసలు కారణాలు ఇవే..!
-
తెలంగాణలో కొత్త పెన్షన్ల దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్!
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో కొత్త పెన్షన్ల దరఖాస్తు దారులకు అలెర్ట్. కొత్తగా పెన్షన్ అప్లయ్ చేసుకోవాలనుకునే వారి గడువు నేటితో (సెప్టెంబర్ 15) ముగియనుంది. అర్హులైన పేదలు ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే, ఇవాళ్టిలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ కొత్త పెన్షన్ల కోసం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది (సుమారు 4.8 లక్షలకు పైగా) దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 25 నాటికి క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలాఖరు వరకు అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అర్హతలను పరిశీలిస్తారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత, అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్నారు. అర్హులైన నిరుపేదలు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. -
కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యవస్థల తీరుపై మండిపడుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘కొన్నిసార్లు దాడులు, హత్యలు నేరుగా ప్రాణం తీయడంతో మొదలవవుని, పూర్తి భద్రత ఉండాల్సిన పోలీస్ స్టేషన్లోనే, యూనిఫామ్ ధరించిన అధికారుల కళ్ల ముందే, అత్యంత పక్కాగా ప్లాన్ చేసిన దాడితో మొదలవుతాయని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలే ఈ గూండాగిరిని ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నాయని, ఇదే తీరు కొనసాగితే త్వరలోనే రోడ్లపై దాడులు, మూకదాడులు, హింస మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.పోలీస్ స్టేషన్ లోపల తన పీఆర్ మహేష్ మాణిక్య, పీఏ మహేందర్ రెడ్డిలపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అణచివేతకు తలవంచని తెలంగాణలోని ఏ సామాన్య పౌరుడికైనా రేపు ఈ పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణ పూర్తి అరాచకత్వం అంచున నిలిచిందని విమర్శిస్తూ..‘వెల్ డన్ కాంగ్రెస్.. వెల్ డన్ రాహుల్ గాంధీ’ అంటూ వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. Lynching doesn’t always start as an act of killingSometimes it starts as a carefully planned attack inside a fully functional police station, in front of uniformed officialsThe way goodaism is being sponsored and enabled by state machinery, I am worried that very soon we will…— KTR (@KTRBRS) September 14, 2026 -
620 కోట్ల కుంభకోణం.. భారత్లో తలదాచుకున్న నిందితుడు!
అమెరికాలో సుమారు రూ. 620 కోట్ల విలువైన భారీ మెడికేర్ కుంభకోణానికి పాల్పడి, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఓ భారతీయ వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్లో తలదాచుకున్నట్లు తెలిసింది. మహమ్మద్ ఖదీర్ ఖాన్ అనే ఈ నిందితుడు నగరంలోనే ఉన్నాడని అమెరికా పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక అధికారులు అతడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.టెక్సాస్లోని రిచర్డ్సన్లో ఖదీర్ ఖాన్ 'అమెరికన్ ప్రీమియర్ ల్యాబ్స్' పేరుతో ఒక జెనెటిక్ టెస్టింగ్ ల్యాబొరేటరీని నిర్వహించేవాడు. 2023 ఆగస్టు నుంచి 2024 అక్టోబర్ మధ్య కాలంలో, అమెరికా ప్రభుత్వ మెడికేర్ పథకం కింద సుమారు 93 మిలియన్ డాలర్ల విలువైన నకిలీ క్లెయిమ్లను అతడు సృష్టించాడు. వీటి ద్వారా ప్రభుత్వం నుంచి 65 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 620 కోట్లు) అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో తేలింది. వైద్యుల వివరాలు, సంతకాలను ఫోర్జరీ చేసి ఈ భారీ మోసానికి పాల్పడినట్లు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్బీఐ, ఆరోగ్య శాఖల సంయుక్త విచారణలో వెల్లడైంది.ఈ కుంభకోణం బయటపడటంతో అధికారులు ఖాన్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి, అతడిని 'మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్'గా ప్రకటించారు. అయితే, అప్పటికే అతను అమెరికా నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం ఖాన్ హైదరాబాద్లోనే ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో, శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల జాబితాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరవ్యాప్తంగా గాలిస్తున్నారు.ఇదీ చదవండి: జేడీయూ యూటర్న్.. షాక్లో బీజేపీ! -
పోలీస్ స్టేషన్లో దాడి యత్నంపై సమగ్ర దర్యాప్తు చేయాలి..
సాక్షి, హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్స్టేషన్లో విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో, పీఏపై కొందరు ముసుగులు ధరించిన వ్యక్తులు దాడికి యత్నించినట్లు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.పండగ రోజున సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో దాదాపు 15 మంది ముసుగులు ధరించి ఇంటరాగేషన్ రూమ్లోకి వెళ్లినట్లు తెలిపారు. అయితే, అక్కడున్న బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు వారిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు.దీంతో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్స్టేషన్లోనే ఇలాంటి ఘటన జరగడం తీవ్ర విషయమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అయితే, ముసుగులు ధరించిన వ్యక్తులు పోలీస్స్టేషన్లోకి ఎలా వచ్చారు? వారెవరు? వారి వెనుక ఎవరున్నారు? అనే విషయాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.ఘటనకు సంబంధించి పోలీస్స్టేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి వివరాలను సేకరించాలని ఆయన సూచించారు. అలాగే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల పూర్తి ఫుటేజ్ను ఎలాంటి మార్పులు లేకుండా భద్రపరచాలని డిమాండ్ చేశారు. సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించి అసలు ఏం జరిగిందో తేల్చాలని అన్నారు.హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఘటనపై స్పందించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా విచారణ జరిపి, దాడికి యత్నించిన వ్యక్తులను గుర్తించాలని అన్నారు. ఘటన వెనుక ఉన్న వారిని కూడా గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: కవిత జోరు.. మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త సారథులు -
కవిత జోరు.. మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త సారథులు
రాష్ట్రంలో మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఇన్ చార్జీలను ప్రకటించారు. మెదక్ లోక్ సభ సహా పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా సోమవారం నూతన నియామకాలు ప్రకటించారు. ఇప్పటికే 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ చార్జీలను ప్రకటించిన కవిత తాజా నియామకాలతో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జీలను నియమించారు. గతంలో మాదిరిగానే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జీలు, జిల్లా అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు పెద్దపీట వేశారు.అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీలు1) ఆదిలాబాద్ గోపు వేణుగోపాల్ యాదవ్ (బీసీ)2) మహబూబ్ నగర్ దొడ్ల సౌజన్య రెడ్డి (ఓసీ)3) సికింద్రాబాద్ కంటోన్మెంట్ చింతల రాజలింగం (ఎస్సీ)4) కుత్బుల్లాపూర్ ఎత్తరి మారయ్య (బీసీ)5) ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి విజయ్ కిరణ్ రెడ్డి (ఓసీ)6) నిజామాబాద్ అర్బన్ కందాడి మోహికా రెడ్డి (ఓసీ)7) నిజామాబాద్ రూరల్ బానోత్ నరేశ్ నాయక్ (ఎస్టీ)8) నిర్మల్ డాక్టర్ మాల్వె చంద్ర ప్రకాశ్ (బీసీ)9) ఖానాపూర్ మేస్రం దయాకర్ (ఎస్టీ – గోండు)10) అంబర్ పేట్ కంచగిరి ప్రవీణ్ కుమార్ (బీసీ)11) ఖైరతాబాద్ దేవరి చంద్రశేఖర్ (బీసీ)12) జూబ్లీ హిల్స్ హలీమా బేగమ్ (ముస్లిం)13) హుజూరాబాద్ కోకట్ల సంతోష్ యాదవ్ (బీసీ)14) పటాన్ చెరు తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి (ఓసీ)15) దేవరకొండ నేనావత్ శివ నాయక్ (ఎస్టీ)16) నాంపల్లి సయ్యద్ మతీన్ అహ్మద్ (ముస్లిం)17) ఇల్లెందు వాసం రామకృష్ణ దొర (ఎస్టీ – కోయ)18) అశ్వారావుపేట సోడెం వెంకట్ (ఎస్టీ – కోయ)మెదక్ లోక్ సభ నియోజకవర్గ ఇన్చార్జీమద్ది శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షులు1) రంగారెడ్డి పురం మహేందర్ రెడ్డి (ఓసీ)2) సంగారెడ్డి మాసన్నగారి బాలయ్య (ఎస్సీ)3) ఆదిలాబాద్ బాపురావు రాథోడ్ (ఎస్టీ)4) నిర్మల్ లోకిని రాము (ఎస్టీ)5) కొమ్రం భీం ఆసిఫాబాద్ కిరిమిల వినోద్ చారి (బీసీ)6) మంచిర్యాల ఊదరి చంద్రమోహన్ గౌడ్ (బీసీ)7) మేడ్చల్ – మల్కాజిగిరి నవీన్ గోగికర్ (బీసీ)8) మహబూబ్ నగర్ డాక్టర్ ఎర్రంశెట్టి వెంకట్రామ్ మూర్తి (బీసీ)9) నిజామాబాద్ మంథెన నవీన్ రెడ్డి (ఓసీ)10) కరీంనగర్ గుంజపడుగు హరిప్రసాద్ (బీసీ)11) భద్రాద్రి కొత్తగూడెం సముద్రాల క్రాంతి కుమార్ (బీసీ)12) గ్రేటర్ హైదరాబాద్ (సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ లు సహా), వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ (ఓసీ)జిల్లా ప్రధాన కార్యదర్శులు1) నిజామాబాద్ దొంత ప్రవీణ్ (ఎస్సీ)2) మేడ్చల్ మల్కాజిగిరి శీలం వీరేందర్ (ఎస్సీ)3) మంచిర్యాల తంగళ్లపల్లి అరుణ్ కుమార్ (బీసీ)టీఆర్ఎస్ అనుబంధ విభాగాలుఎంబీసీ విభాగంరాష్ట్ర అధ్యక్షుడు కుమ్మరి శివశంకర్ప్రధాన కార్యదర్శి హకీంకారి సురేందర్ జీతెలంగాణ న్యాయ రక్షణ విభాగంరాష్ట్ర అధ్యక్షుడు అప్పాల నరేందర్ యాదవ్టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వింగ్గ్లోబల్ ప్రెసిడెంట్ విజయ్ కూరబోయినగ్లోబల్ జనరల్ సెక్రటరీ సుమన్ బల్మూరిట్రేడ్ అండ్ కామర్స్ వింగ్రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ గరినెప్రధాన కార్యదర్శి రామ్ ప్రతాప్ శ్రీవాస్తవ్టీఆర్ఎస్ వీస్టేట్ యూనివర్సిటీస్ ఇన్ చార్జి డాక్టర్ సిమ్రాల చిన్నలింగమయ్య (అశోక్ యాదవ్)స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ చార్జి బండారు శ్రీనివాస్ గౌడ్జూనియర్/పాలిటెక్నిక్/డిగ్రీ/పీజీ ఇన్ చార్జి వల్లకొండ అజయ్ రెడ్డిటీఆర్ఎస్ సోషల్, డిజిటల్ మీడియారాష్ట్ర అధ్యక్షుడు ఆకాశ్ కొల్లూరుప్రధాన కార్యదర్శి సందీప్ బెల్లంపల్లిజాయింట్ సెక్రటరీ కొలకాని మనోహర్జాయింట్ సెక్రటరీ తేజా చౌదరిజాయింట్ సెక్రటరీ కవిత మేరుజాయింట్ సెక్రటరీ పాలె నిషాటీఆర్ఎస్ ముస్లిం మైనారిటీ విభాగంరాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ సుహైబ్టీఆర్ఎస్ రైతు విభాగంరాష్ట్ర అధ్యక్షుడు పొన్నమనేని బాలాజీ రావుటీఆర్ఎస్ బంజారా విభాగంరాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్టీఆర్ఎస్ జర్నలిస్ట్ విభాగంరాష్ట్ర అధ్యక్షుడు వంగ మహేందర్ రెడ్డితెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టీఆర్ టీయూ)రాష్ట్ర అధ్యక్షుడు దేవల వీరన్నఇదీ చదవండి: ఒమన్లో జరగాల్సిన ఇరాన్ కీలక భేటీ.. వాయిదా! -
పోలీస్ స్టేషన్లోనే కేటీఆర్ పీఏ, పీఆర్వోలపై దాడి.. వాళ్ల పనేనా?
సాక్షి,హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్లు విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. ఇటీవల అసెంబ్లీ గేట్ నంబర్-3 వద్ద జరిగిన ఆందోళనల ఘటనకు సంబంధించి పోలీసులు వీరిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా పోలీసులు వారికి 41ఏ సీఆర్పీసీ (35(3) BNS) కింద నోటీసులు అందించారు.విచారణ ముగిసే సమయానికి పోలీస్ స్టేషన్ వెలుపల భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. స్టేషన్ గేటు వద్ద నుంచి వెంటనే వెళ్లిపోవాలని పోలీసులు సూచించగా, తాము బయటే ఉంటామని కార్యకర్తలు పట్టుబట్టడంతో అక్కడ తోపులాట, ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్లో తన పీఏ, పీఆర్వోలపై దాడి జరిగిన పరిణామాలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ట్వీట్ చేశారు. ‘హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైఫాబాద్ పోలీసుస్టేషన్లోకి ఏకంగా గుండాలు అక్రమంగా చొరబడి నా పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీల రాజ్యం, గుండాల రాజ్యం నడుస్తోంది. ఇది కాంగ్రెస్ గుండాల పనా ?? లేక మఫ్టీలో పోలీసులకే ముసుగులు వేసి కుట్రపన్ని ఈ దాడి చేయించరా ?? వెంటనే దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.రాజకీయ కక్షతో పెట్టిన పోలీసు కేసు విచారణ కోసం స్టేషన్కు పిలిపించి ఖాకీల సమక్షంలో ఈ దాడి చేయించడం వెనక ముమ్మాటికి ముఖ్యమంత్రి హస్తం ఉంది. ఉదయం విచారణకు రమ్మని చెప్పి చీకటి పడే వరకూ కాలయాపన చేయడం చూస్తే, ముందే ఈ దాడి చేయాలన్న కుట్ర పన్నినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. హైకోర్టు తదుపరి ఆదేశాల వరకూ మహేష్, మహేందర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో కక్ష సాధింపులో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనకు హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి.ముసుగు ధరించిన గుండాల దాడిలో గాయపడ్డ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డికి వెంటనే రక్షణ కల్పించి వారికి మెరుగైన చికిత్స అందించాలి. పోలీస్ స్టేషన్ లోపల, బయట ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని వెంటనే భద్రపరచాలి. ఈ అరాచక పర్వానికి పాల్పడిన ప్రతి ఒక్క కాంగ్రెస్ గుండాను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు’అని పేర్కొన్నారు.మరోవైపు తమపై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ పీఏ, పీఆర్వోలు కూడా పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ఈ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైఫాబాద్ పోలీసుస్టేషన్ లోకి ఏకంగా 15 మంది గుండాలు అక్రమంగా చొరబడి నా పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీల రాజ్యం, గుండాల రాజ్యం నడుస్తోంది. ఇది కాంగ్రెస్ గుండాల పనా…— KTR (@KTRBRS) September 14, 2026 -
కేటీఆర్ పీఏ,పీఆర్వో విచారణలో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన తీరును పరిశీలించేందుకు పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇద్దరినీ అసెంబ్లీ ప్రాంతానికి తీసుకెళ్లేందుకు సైఫాబాద్ పోలీసులు ప్రయత్నించగా, పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తీవ్ర వాదనలు చోటుచేసుకున్నాయి.అసెంబ్లీ ఎదుట ఈ ఘటన ఎలా జరిగిందనే కోణంలో కూపీ లాగుతున్న పోలీసులు, సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం కేటీఆర్ పీఏ, పీఆర్వో అక్కడికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే దీనిని న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. నిబంధనల ప్రకారం ముందుగా నోటీసులు ఇవ్వాలని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఈ విచారణ కొనసాగుతోందని న్యాయవాదులు ఆరోపించారు.మరోవైపు, ఈ వివాదం మధ్యలోనే కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్ఓ మహేష్ స్పందిస్తూ.. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం తామే స్వయంగా అసెంబ్లీ వరకు నడుచుకుంటూ వస్తామని చెప్పడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఈ విచారణ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
కొండా సురేఖను అధిష్టానం పిలిచిందా?
సాక్షి, హైదరాబాద్: ఉద్దేశపూర్వకంగానే స్పీకర్పై వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమంలో దళిత కార్డును కేసీఆర్ ఎలా వాడారో చూశాం. గద్దర్, అందెశ్రీని ఏ రకంగా అవమానించారో ప్రజలకు తెలుసు. కేసీఆర్ 2003లో ఇచ్చిన హామీలపై డాక్యుమెంట్ విడుదల చేస్తున్నా.. కేసీఆర్ ఇచ్చిన హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి’ అని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు.‘‘దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు? హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు. అంబేద్కర్ విగ్రహం పెడితే సరిపోదు ఆ మహాభావుని సలహాలు, విలువలు ఆచరణలో పెట్టాలి. దళితులు నడిచిన నేలను శుద్ధి చేయడం దారుణం. దళిత జాతిని కేసీఆర్ అవమానించారు. కేసీఆర్ రాజకీయాన్ని శుద్ధి చేయాలి. ప్రజాస్వామ్య దేశంలో ఇంతకంటే దారుణం మరోటి లేదు’’ అని మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు.‘‘దళితులకు అత్యున్నత పదవులు ఇచ్చి కాంగ్రెస్ గౌరవించింది. రీల్ మాక్ అసెంబ్లీ పెట్టడం కాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ను ప్రతిపక్ష నాయకుడిని చేయండి. పదేళ్ల బీఆర్ఎస్ బీసీ,దళిత, మైనార్టీ వ్యతిరేక పాలనను ప్రజలు మరిచిపోలేదు. దళిత స్పీకర్ను అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. మీనాక్షీ విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు. మీనాక్షి విషయంలో అధిస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.ఆ అంశంపై సమాచారం లేదు..‘‘కొత్త ఇంఛార్జ్ విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. కొండా సురేఖను అధిష్టానం పిలిచిందన్న అంశంపై నాకు సమాచారం లేదు’’ అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. కాగా, కొండా సురేఖ.. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ పర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.ఇదీ చదవండి: కొండా సురేఖది.. నాది ఒకే మాట.. సుస్మితది మాత్రం..: కొండా మురళి -
హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)
-
ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తొలిపూజ
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్లో కొలువుదీరిన 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు తొలిపూజ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్లు గవర్నర్కు స్వాగతం పలికారు.ఖైరతాబాద్లో ఈ ఏడాది (72వ సంవత్సరం) 69 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిని రూపొందించారు. మహాగణపతి ఎత్తు, వెడల్పును బట్టి ఆగమ శాస్త్రంలో సూచించిన విధంగా కంటి ఎత్తు, వెడల్పు కచ్చితమైన స్కేలు ప్రకారం తీర్చిదిద్ది కంటిపాపను అమరుస్తామని.. తద్వారా వినాయకుడు నలు వైపుల నుంచి భక్తులకు ఆశీర్వాదం ఇచ్చే విధంగా ఉంటుందని శిల్పి రాజేంద్రన్ తెలిపారు.వినాయక చవితి సందర్భంగా నగరం పండగ కళను సంతరించుకుంది. గణనాథుడి పూజలతో భక్తులు తరించనున్నారు. కాగా.. పూజా సామగ్రి ధరలు చుక్కలనంటాయి. నగరంలోని బేగంబజార్, సుల్తాన్ బజార్, గోషామహల్, మెహిదీపట్నం తదితర మార్కెట్లలో గత ఏడాదితో పోలిస్తే అన్ని పూజా సామగ్రి ధరలు 40 నుంచి 50 శాతం పెరిగినట్లు ప్రజలు చెబుతున్నారు.సాధారణంగా రూ.500–600తో చిన్న పూజకయ్యే ఖర్చు ఈ ఏడాది కనీసం రూ.1,200 నుంచి రూ.1,500కు చేరిందని అంటున్నారు. పూలు, పండ్లతో పాటు గరిక, తమలపాకులు, అరటి ఆకులు, జిల్లేడు, మారేడు తదితరాల ధరలు పెరిగాయి. వినాయకుడికి నైవేద్యంగా పెట్టే మోదకాలు, స్వీట్లు, లడ్డూలకు డిమాండ్ పెరగడంతో ధరలు చుక్కలనంటాయి.ఇదీ చదవండి: ఎల్లలు లేని వినాయకుడు.. వివిధ దేశాల్లో.. -
HYD Rains: చెరువును తలపించిన కృష్ణానగర్ వీధులు
-
తెలంగాణలో వాన మోత.. ఈ 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వాతావరణ శాఖ రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, మెదక్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షాలు పడే సూచనలున్నాయి. మరోవైపు మరో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.రాత్రి దంచి కొట్టిన వానతెలంగాణ అంతటా గత రాత్రి భారీ వర్షాలు దంచి కొట్టాయి. హైదరాబాద్ సహా జనగామ, భద్రాద్రి, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలను ముంచెత్తాయి. కొడకంట్లలో 12 సెం.మీ, పాల్వంచలో 11.7 సెం.మీ. రామన్నపేట, దేవురుప్పలలో 10.8 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్లోనూ ఈ వేకువ జాము నుంచి ఎడతెరిపి లేకుండా రెండు గంటల సేపు గట్టి వాన పడడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. -
నార్సింగి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
గ్రేటర్ పరిధిలో జరిగిన నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. మిత్రుడి పుట్టిన రోజు వేడుకకు స్నేహితులతో కలిసి ఆనందంగా వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పడంతో ఇంటర్ విద్యార్థి అసువులు బాశాడు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన కోకాపేటలో చోటుచేసుకోగా.. రోడ్డు పక్కన స్తంభాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ బాలుడు దుర్మరణం చెందిన మరో ఘటన అత్తాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. కీసర ఓఆర్ఆర్ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చెందగా, రాంగ్రూట్లో వచ్చిన ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టడంతో బాలుడు మృత్యువాత పడిన ఘటన ఎల్బీనగర్ పరిధిలో జరిగింది. హైదరాబాద్: కూకట్పల్లికి చెందిన మదన్మోహన్ రెడ్డి (17) ఇంటర్ విద్యార్థి. మిత్రుడి పుట్టి న రోజు వేడుకల కోసం శనివారం రాత్రి మరో స్నేహితుడికి చెందిన కారు తీసుకుని వెళ్లాడు. వేడుకల అనంతరం కోకాపేట వైపు వెళ్లి వద్దామంటూ స్నేహితులతో కలిసి ఇన్నోవా కారులో బయలుదేరారు. కోకాపేట నియోపోలిస్ వ్యూపాయింట్ వద్ద తెల్లవారు జామున కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. కారు నడుపుతున్న మదన్మోహన్రెడ్డి డోరులో నుంచి బయటికి వచ్చి పక్కనే ఉన్న స్తంభానికి తగలటంతో తలకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులు మద్యం తాగిన ఆనవాళ్లు ఉన్నాయని కోకాపేట సెక్టార్ ఎస్సై మహేందర్, నార్సింగి ఇన్స్పెక్టర్ డి. విష్ణువర్ధన్రెడ్డి చెప్పారు. స్తంభాన్ని బైక్ ఢీకొని.. వేగంగా దూసుకు వచ్చిన ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టిన దుర్ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో మైనర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. కార్వాన్ మొగల్ నగర్కు చెందిన పదో తరగతి విద్యార్థి (14), అదే ప్రాంతానికి చెందిన మరో బాలుడితో కలిసి ద్విచక్ర వాహనంపై కార్వాన్ నుంచి హైదర్గూడ వెళ్తున్నారు. వేగంగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని అదుపు చేయలేక రోడ్డుపక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని ఇన్స్పెక్టర్ సీతయ్య తెలిపారు. రాంగ్ రూట్లో వచ్చి.. ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వచ్చి డివైడర్ను ఢీకొట్టడంతో బాలుడు చనిపోగా, మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మలక్పేటకు చెందిన సయ్యద్ మాజ్ హుస్సేన్ (16), నారాయణగూడకు చెందిన హంజాలా, న్యూ మలక్పేటకు చెందిన అలీఖాన్ స్నేహితులు. ముగ్గురు కలిసి ఆదివారం తెల్లవారు జామున నమాజు కోసం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఉదయం 6.30 గంటలకు ఎల్బీనగర్ చౌరస్తా సితార హోటల్ వద్ద రాంగ్ రూట్లో వచ్చి డివైడర్ను ఢీకొట్టారు. ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. సయ్యద్ మాజ్ హుస్సేన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిగతా ఇద్దరు స్నేహితులు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి : ముందే పక్కా ప్లాన్.. హోటల్ గదిలో దారుణం -
ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్పై తెగిపడ్డ విద్యుత్ తీగలు
సాక్షి, హైదరాబాద్: మౌలాలి దగ్గర ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్పై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అప్రమత్తమైన లోకోపైలట్ రైలును వెంటనే నిలిపివేశారు. భారీ శబ్దాలు ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు.. రైలు దిగి పరుగులు తీశారు. రైలు విజయవాడ నుంచి సికింద్రాబాద్కు వస్తుండగా ఈ ఘటన జరిగింది.ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ తీగలను రైల్వే అధికారులు పునరుద్ధరించారు. అనంతరం ప్రయాణికులను అదే రైలులో సికింద్రాబాద్కు తరలించారు. ఈ ఘటనపై రైల్వే, విద్యుత్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక లోపం కారణంగానే విద్యుత్ తీగలు తెగిపడినట్లు అధికారులు నిర్థారించారు. -
ఖైరతాబాద్ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)
-
హైదరాబాద్లో వినాయక చవితి సందడి (ఫోటోలు)
-
ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!
హైదరాబాద్: ఓ మేనమామే ఆరేళ్ల వ యసున్న కోడలిపై అఘాయిత్యానికి ఒ డిగట్టాడు. కుము రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆల స్యంగా ఆదివారం వెలుగు లోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ రాఖీ పండుగకు తన ఆరేళ్ల కూతురును తీసుకుని కాగజ్నగర్ పట్టణంలోని తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చింది.ఈ సమయంలో కూతురు అమ్మమ్మ దగ్గర ఉంటానని మారాం చేయడంతో అక్కడే వదిలి వెళ్లింది. అయితే బాలిక మేనమామ అయిన శశిధర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. శశిధర్కు వివాహమైనా భార్య పుట్టింట్లోనే ఉంటోంది.మూత్రం ఆగిపోవడంతో..ఐదు రోజులుగా బాలికకు మూత్రం రాకపోవడంతో కడుపు ఉబ్బిపోయింది. రెండు రోజుల క్రితం బాలిక అమ్మమ్మ తన కూతురుకు సమాచారం ఇచ్చింది. దీంతో తల్లి పుట్టింటికి వెళ్లి కూతురును తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షలు చేసి బాలికపై లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించారు. సోదరుడిపైనే అనుమానం వచ్చిన తల్లి పుట్టింటికి వెళ్లి రోదిస్తూ తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ విషయం స్థానిక కౌన్సిలర్, కాలనీ పెద్దలకు ఆదివారం తెలిసింది.కాలనీలో విషయం వ్యాపించడంతో కాలనీ వాసులు నిందితుడి ఇంటిని చుట్టుముట్టారు. మానవ మృగాన్ని ప్రజల మధ్యలోనే శిక్ష విధించాలని ఆందోళన చేశారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ ప్రేమ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు గంటల తర్వాత పోలీసులు నిందితుడిని ద్విచక్రవాహనంపై పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో జోరుగా వాన -
హైదరాబాద్లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో జోరుగా వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాల్, గాజులరామారం, కూకట్పల్లి, మియాపూర్లో వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రాజేంద్రనగర్, మణికొండ, టోలిచౌకిలోనూ వర్షం కురుస్తోంది.మరోవైపు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.వర్షం సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల కింద ఉండకుండా జాగ్రత్త పడాలని సూచించారు. వాహనదారులు రోడ్లపై నీరు నిలిచిన చోట నెమ్మదిగా ప్రయాణించాలని, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.ఇదీ చదవండి: ఏఐ.. రాక్షసి!! -
భారతీయ భాషలు దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు
హైదరాబాద్: భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి భారతీయ భాషలు ప్రతిబింబాలని, అవి దేశ సమున్నత సాంస్కృతిక వారసత్వానికి అమూల్యమైన ప్రతీకలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఈ నెల 14 వ తేదీన జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు.హిందీతో పాటు భారతీయ భాషల పరిరక్షణ, ప్రోత్సాహం ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. భాషలు ప్రజలను అనుసంధానిస్తూ పరస్పర అవగాహన, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని, భాషా వైవిధ్యాన్ని గౌరవించడం ద్వారా జాతీయ సమైక్యత మరింత బలోపేతం అవుతుందని గవర్నర్ ఆకాంక్షించారు.ఇదీ చదవండి: తెలంగాణ ప్రజలకు గవర్నర్ వినాయక చవితి శుభాకాంక్షలు -
2లక్షలు వసూలు చేసిన హిజ్రాలపై కేసు
-
భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు
-
వివాహేతర సంబంధాల యాప్.. టాప్–5లో హైదరాబాద్!
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధాల యాప్ల వినియోగంలో దేశంలోని టాప్–5 నగరాల్లో హైదరాబాద్ ఉన్నట్లు తేలింది. డిస్క్రీషన్ డేటింగ్(రహస్య డేటింగ్) పేరిట వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకోవడానికి కెనడాకు చెందిన ఓ యాప్ అడ్డాగా మారింది. తాజాగా ఆ విదేశీ యాప్ సంస్థ ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం దేశంలో 5 లక్షల మందికిపైగా యాక్టివ్ యూజర్లు ఉండగా.. ఇందులో హైదరాబాద్కు చెందిన 1.10 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. యూజర్ల సంఖ్య ఆధారంగా దేశంలోనే టాప్–5 నగరాల్లో భాగ్యనగరం ఉందని కంపెనీ పేర్కొంది. ఐటీ కారిడార్లు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల నుంచే 60 శాతం ట్రాఫిక్ తమ యాప్నకు వస్తోందని వెల్లడించింది. మొత్తం యూజర్లలో 68 శాతం మంది 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారు ఉంటున్నారట. కొన్ని నివేదికల ప్రకారం..ఈ యాప్ కొత్త సబ్స్క్రైబర్లలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది.యాప్ ఫీచర్లలో గోప్యతఇండియా యూజర్ ట్రెండ్స్ అండ్ డేటా ప్రైవసీ నివేదిక ప్రకారం.. ఈ యాప్ అందించే రహస్య ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఫొటోలను బ్లర్ చేసుకొనే అవకాశం ఉండటం, క్రెడిట్ కార్డులతో చెల్లింపుల విధానం, బ్యాంక్ స్టేట్మెంట్లలో యాప్పేరు కనిపించకుండా బిల్లింగ్ చేయడం వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉండటం వల్ల ఇది ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారికి ఆకర్షణీయంగా మారుతోంది.పోలీసులు, సైబర్నిపుణుల హెచ్చరికలుడేటింగ్ యాప్ల కోసం వెంపర్లాడే వారిని సైబర్నేరగాళ్లు బెదిరించి దోచుకొనే ప్రమాదం ఉందని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రై మ్ గణాంకాల ప్రకారం డేటింగ్ యాప్లకు సంబంధించిన ఫిర్యాదులు మూడేళ్లలో 40% పెరిగాయి. మరోవైపు డిజిటల్ గోప్యతకు 100% గ్యారంటీ ఉండదని, బ్లాక్మెయిల్, ఆర్థిక మోసాల ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివాహేతర సంబంధాల వల్ల సామాజికంగా, మానసికంగా ఎదురయ్యే పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైవాహిక బంధాలు బలహీనపడ్డాయని డేటింగ్యాప్లను ఆశ్రయించడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని చెబుతున్నారు. ఇదీ చదవండి: ముకేశ్ కళ్ల గురించి దేబ్జానీ-నాగ్ డిస్కషన్ -
బొల్లారం ఆయుధాల కేసు.. భార్య నిలదీయడంతో నోరు విప్పిన మల్లేష్?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బొల్లారం ఆర్మీ ఏరియాలో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితుడు మల్లేష్ను పోలీసులు అరెస్ట్ చేయగా.. చోరీ చేసిన సైనిక ఆయుధాలను విక్రయించి డబ్బు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. అయితే మల్లేష్ వెనుక పెద్ద అక్రమ ఆయుధాల నెట్వర్క్ ఉందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.అయితే, కేసు తీవ్రతను పోలీసులు మల్లేష్ భార్య, మామకు వివరించినట్లు తెలుస్తోంది. దీంతో భర్తను భార్య గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ఆయుధాలు చోరీ చేసి ఉంటే తప్పును ఒప్పుకోవాలని ఆమె హెచ్చరించడంతో.. చివరకు మల్లేష్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. మరోవైపు.. మల్లేష్ మొబైల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. అక్రమ ఆయుధాల సరఫరాదారులతో అతడికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా దేశీయ ఆయుధ సరఫరాదారులతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులకు ఆధారాలు దొరకకుండా కీలక వాట్సాప్ చాట్లు, ఆడియో, వీడియో కాల్స్, ఇతర లాగ్లను డిలీట్ చేసినట్లు వెల్లడైంది.దీంతో సైబర్ క్రైమ్, ఎఫ్ఎస్ఎల్ నిపుణుల సహకారంతో డిలీట్ చేసిన డేటాను తిరిగి రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాట్స్, మీడియా ఫైల్స్, కాల్ డేటా వంటి కీలక ఆధారాలు బయటకు వస్తే మల్లేష్ ఎవరెవరితో సంబంధాలు కొనసాగించాడు? ఆయుధాల కోసం ఎవరితో డీల్ చేశాడు? అనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్మీ ప్రాంగణం నుంచి ఒక్కడే ఆయుధాలు చోరీ చేయడం సాధ్యమేనా? అనే అనుమానాలు పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మీలోని ‘ఇంటి దొంగల’ సహకారం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది.చోరీ చేసిన ఆయుధాలను మల్లేష్ ఎవరికి విక్రయించేందుకు ప్రయత్నించాడు? గ్యాంగ్స్టర్లకా.. ఇతర నేరస్తులకా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయుధాల కోసం జరిగిన ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. డిజిటల్ పేమెంట్లు, బ్యాంకు ఖాతాలు లేదా హవాలా మార్గాల్లో ఏమైనా డబ్బు చేతులు మారిందా? అన్నదానిపైనా దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో మల్లేష్ అరెస్టుతో ఆగకుండా.. ఈ కేసు వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ను బయటకు తీసే పనిలో పోలీసులు ఉన్నారు.ఇదీ చదవండి: సురేఖకు హైకమాండ్ నుంచి పిలుపు.. -
అసెంబ్లీ గంట మోగితే.. రూ. కోట్లలోనే ఖర్చు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో స్పీకర్ గంట మోగించగానే చర్చ మొదలవుతోంది. కానీ ఆ గంట మోగడం వెనుక ప్రతి గంటకు రూ. 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చవుతుందని ఢిల్లీకి చెందిన స్వతంత్ర ఎన్జీవో సంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సేకరించిన గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే శాసనసభ నడవాలంటే తెరవెనుక పెద్ద సైన్యమే పనిచేస్తుంది. 250 మంది అసెంబ్లీ సచివాలయ సిబ్బంది, మార్షల్స్, 300 మంది పోలీసులు, శాసనసభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడానికి వివిధ శాఖలకు చెందిన సుమారు 400 మంది సెక్షన్ ఆఫీసర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అసెంబ్లీకి వస్తారు. వారందరికీ ఓవర్ టైం అలవెన్స్, భోజనం, రవాణా ఖర్చు ప్రభుత్వానిదే. దీనికితోడు అసెంబ్లీ హాల్లో ఏసీలు, లైటింగ్, లైవ్ టెలికాస్ట్, వాటి నిర్వహణ సిబ్బంది, క్యాంటీన్, కాగితాల ముద్రణ ఖర్చులు అదనం. ఇవి కాకుండా సభ జరిగే రోజున ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రోజువారీ భత్యం రూ. 2,000, ప్రయాణ భత్యం, హైదరాబాద్లో ఉచిత బంగ్లా, కారు, ఇద్దరు పీఏల జీతాలను ప్రభుత్వమే భరిస్తుంది. సభకు హాజరు కాకపోయినా జీతం వస్తుంది కానీ డైలీ అలవెన్స్ మాత్రం సభకు వస్తేనే లభిస్తుంది. ఇలా అన్నీ కలిపితే కేవలం ఒక రోజుపాటు (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లెక్కన) రాష్ట్ర శాసనసభ నిర్వహణకు దాదాపు రూ. కోటి నుంచి రూ.కోటిన్నర దాకా ఖర్చవుతుంది. గతంలో ఒక బ్రీఫింగ్ మీటింగ్కే రూ. 13.59 లక్షలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతేడాది రాష్ట్ర అసెంబ్లీ 149 గంటలపాటు జరిగిందని పీఆర్ఎస్ నివేదిక చెబుతోంది. ఇదీ చదవండి :కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది? -
ఆర్టీసీ బస్సు బీభత్సం.. యువతి అక్కడికక్కడే మృతి!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువతి మృతి చెందగా, ఊబర్ టూవీలర్ డ్రైవర్ గాయాలతో బయటడ్డాడు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా వెంకటరాయపురానికి చెందిన వజ్జిపర్తి హేమ దుర్గ (26) అమీర్పేటలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని ఓ కార్ల షోరూంలో కస్టమర్ రిలేషన్íÙప్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. శనివారం మధ్యాహ్నం సెల్ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు అమీర్పేట హాస్టల్ నుంచి ఊబర్ బైక్ బుక్ చేసుకుంది. అమీర్పేట బిగ్బజార్ వెనకవైపు శ్రీనగర్ కాలనీ రోడ్డులో వీరు వెళ్తున్న వాహనాన్ని కూకట్పల్లి డిపో బస్సు ఢీకొట్టింది. వెనక కూర్చున్న హేమ దుర్గ కిందపడడంతో ఆమె తలపైనుండి బస్సు చక్రాలు వెళ్లాయి. దీంతో హేమదుర్గ అక్కడికక్కడే మృతి చెందింది.ఊబర్ బైక్ డ్రైవర్ ఒరిస్సాకు చెందిన హిమాంచల్ పట్రో గాయాలపాలయ్యాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు హేమ దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ షేక్ అన్వర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి... -
ముందస్తు బుకింగ్: నిమజ్జనానికి వాహనం కావాలా? ఆర్టీఏ కీలక ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనోత్సవానికి కావలసిన వాహనాలను ముందస్తుగా బుక్ చేసుకునేందుకు ఆర్టీఏ సదుపాయం కల్పించింది. మండపాల డిమాండ్ మేరకు వాహనాలను అందజేసేందుకు చర్యలు చేపట్టింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నుంచి తమకు చేరే కూపన్లకు అనుగుణంగా వాహనాలను అందజేయనున్నట్లు హైదరాబాద్ జేటీసీ డాక్టర్ కె.వెంకటరమణ తెలిపారు.క్యూర్ పరిధిలో 14 చోట్ల వాహనాలను సేకరించి మండపాల నిర్వాహకులకు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. భారీ ట్రేలర్లు మొదలుకొని టస్కర్లు, లారీలు, డీసీఎంలు, టాటా ఏస్లు వంటి వివిధ రకాల వాహనాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఇందుకోసం ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వాహన తనిఖీ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గతేడాది కంటే ఈ సారి వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా.మండపాల నిర్వాహకులు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధుల నుంచి ముందస్తుగా కూపన్లు తీసుకొని తమను సంప్రదించాలని జేటీసీ తెలిపారు.ఖైరతాబాద్, అంబర్పేట్ జీహెచ్ఎంసీ గ్రౌండ్స్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం, కాటేదాన్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలీ జీఎంసీ బాలయోగి స్టేడియం, నాగోల్ డ్రైవింగ్ ట్రాక్, కర్మన్ఘాట్ మందమల్లమ్మ ఫంక్షన్ హాల్, మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయం, మేడ్చల్ రవాణా కార్యాలయం, మియాపూర్ క్రాస్రోడ్స్, పటాన్చెరు, తదితర 14 చోట్ల వాహనాలను అందజేయనున్నారు.అనుభవం, నైపుణ్యం కలిగిన డ్రైవర్లు మాత్రమే నిమజ్జన వాహనాలను నడపాలని, రోడ్డుభద్రత నిబంధనలు కచ్చితంగా పాటించాలని జేటీసీ వెంకటరమణ పేర్కొన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వొద్దన్నారు.నిమజ్జన వాహనాల అద్దెలు..రెండు ఆక్సిల్ కలిగిన భారీ ట్రేలర్లు లేదా టస్కర్ : రూ.33000మూడు ఆక్సిల్ కలిగిన ట్రేలర్లు, టస్కర్లు : రూ.350002 టైర్ల సామర్ధ్యం కలిగిన హెవీగూడ్స్ వాహనాలు: రూ.రూ.4500. (డీజిల్ ఖర్చు, డ్రైవర్కు రూ.500 బత్తా అదనం.)6 టైర్ల సామర్ధ్యం కలిగిన లారీలకు : రూ.3500,మిడిల్ గూడ్స్ వెహికల్స్కు : రూ.2500డీసీఎం వంటి లైట్గూడ్స్ వెహికల్స్కు : రూ.2000,టాటాఏస్లు : రూ.1500ఇదీ చదవండి: ఏనుగు బొజ్జ.. చిన్న ఎలుక.. ఇందులో ఇంత పెద్ద తత్త్వమా? -
56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్తో ‘56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ?’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, బీజేపీ నాయకుడు తాడూరి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.మూడు మంత్రి పదవులు బీసీలకే ఇవ్వాలిప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులను తక్షణమే బీసీలకు కేటాయించాలని సమావేశం ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరింది. వడ్డెర, కుమ్మరి, నాయీబ్రాహ్మణ వంటి ఇప్పటివరకు తగిన ప్రాతినిధ్యం పొందని బీసీ కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.రెండు దశాబ్దాల్లో తగ్గిన ప్రాతినిధ్యంటి.చిరంజీవులు మాట్లాడుతూ.. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు బీసీలు మంత్రులుగా ఉండగా, 2014లో నలుగురికి, 2018లో ముగ్గురికి, ప్రస్తుతం ఇద్దరికి తగ్గారని గణాంకాలతో వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీసీల మంత్రివర్గ ప్రాతినిధ్యం మరింత పడిపోయే ప్రమాదం ఉందన్నారు. జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలు పరిపాలనలో మైనారిటీగా మారడం సామాజిక న్యాయానికి విరుద్ధమన్నారు.సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. మెజారిటీగా ఉన్న బీసీలు రాజకీయ అధికారంలో మాత్రం మైనారిటీ స్థాయిలో ఉండటం బాధాకరమన్నారు. శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడాలని, జనగణనలో ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలని కోరారు.‘ఓట్లు మనవి.. సీట్లు వారివా?’బీసీలకు కేవలం ఓటు హక్కు కాకుండా జనాభా ప్రాతిపదికన అధికారంలోనూ వాటా కావాలని బాలగోని బాలరాజుగౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కోసం అన్ని ప్రజాస్వామిక శక్తులు ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.అలాగే, తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీలను విభజించి వారి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కటకం నరసింహారావు బీసీ హక్కుల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమం నిర్మించాలని కోరారు. గుజ్జ సత్యం రానున్న కాలం బీసీలదేనన్నారు.తదుపరి వట్టే జనార్దన్ యాదవ్ మాట్లాడుతూ.. యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవుల్లో కనీసం ఒకటి యాదవులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విఠల్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు రాజకీయంగా అన్యాయం జరిగిందన్నారు.బీసీలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కావాలిజనాభాలో మెజారిటీగా ఉన్నప్పటికీ బీసీలకు అధికారంలో తగిన వాటా దక్కడం లేదని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఓట్లు మనవి.. సీట్లు వారివా?’ అనే పరిస్థితి మారాలని, బీసీలు ఓటు బ్యాంకుగా కాకుండా రాజకీయ నిర్ణయాధికారంలో భాగస్వాములు కావాలని స్పష్టం చేసింది.జనగణనలో ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించడం, బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, గణాంకాలతో కూడిన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం, బీసీ కులాలు, సంఘాలు, మేధావులు ఐక్యంగా ముందుకు సాగడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.అడ్వొకేట్ రాజు మాట్లాడుతూ.. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీలు సాధించిన విజయం వారి ఐక్యతకు నిదర్శనమన్నారు. పొన్నం దేవరాజు మాట్లాడుతూ బీసీ అడ్వొకేట్లు తమ హక్కులు, రాజకీయ, సామాజిక ప్రాతినిధ్యం కోసం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎర్ర సత్యనారాయణ, సూర్యనారాయణ, రిటైర్డ్ డీఆర్వో ఇలి వెంకన్న, దుర్గయ్యగౌడ్, మెట్టు సూర్యప్రకాశ్, బైరి శేఖర్, కర్ణాటి మనోహర్, చిన్నారాములు, ముదిరాజ్, చెన్న శ్రీకాంత్, బొంగు ప్రసాద్, నీరజ గౌడ్, లింగేశ్, చోళ రాజేశ్వర్, యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ వాటా దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని సమావేశం స్పష్టం చేసింది. -
Hyderabad: గణపయ్య భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త
సాక్షి, హైదరాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం నుండి సెప్టెంబర్ 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వెల్లడించారు. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లయిన జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా సాగే ఈ రవాణా సౌకర్యాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ ప్రత్యేక బస్సులు జేబీఎస్ నుండి ప్రారంభమై ప్యాట్నీ, బాటా, బోట్ క్లబ్, ట్యాంక్ బండ్, ఐమాక్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, గాంధీ భవన్, అఫ్జల్గంజ్, సీబీఎస్/ఎంజీబీఎస్, విమెన్స్ కాలేజ్, జె.గార్డెన్, గవర్నమెంట్ ప్రెస్, ఐ.ఎస్. సదన్, పిసల్బండ, మిధాని టి.షిప్, బాలాపూర్ ఎక్స్ రోడ్, శివాజీ చౌక్ల మీదుగా బాలాపూర్ గణేష్ మండపానికి చేరుకుంటాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా జేబీఎస్ వద్ద ఉదయం 6:00 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమై రాత్రి 21:55 గంటల వరకు ప్రతి 40 నుండి 50 నిమిషాల వ్యవధితో నిరంతరాయంగా బస్సులు నడుస్తాయి.అలాగే బాలాపూర్ గణేష్ మండపం నుండి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7:55 గంటలకు ప్రారంభమై రాత్రి 23:50 గంటల వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ గణేష్ ఉత్సవాల వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎండీ నాగిరెడ్డి వివరించారు. -
దారుణం.. వెంబడించి మరి కారుతో బైకును ఢీ
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో దారుణం జరిగింది. ఫ్రీ లెప్ట్ రూట్లో కారు అద్దాని పొరపాటును బైక్ తాకింది. దీంతో దానిపై ఆగ్రహం చెందిన కారు డ్రైవర్ ఆ దంపతుల బైక్ను వెంబడించారు. కారుతో దారుణంగా ఢీకొట్టారు. దీంతో ఇద్దరు దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
హెచ్ఎండీఏ పర్మిషన్ ఇస్తే.. హైడ్రా కూలగొడుతుందా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం హైడ్రా అవలంభిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఒకవైపు హెచ్ఎండీఏ పర్మిషన్ ఇస్తుంటే.. మరొకవైపు హైడ్రా వచ్చి కూలగొడుతుందా? అని నిలదీశారు. ‘‘హెచ్ఎండీఏ పర్మిషన్ ఇస్తుంది.. హైడ్రా వచ్చి కూలగొడుతుంది’’ ఇదే ప్రస్తుతం జరుగుతుంది అంటూ అసహనం వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోతే ప్రజల్లో విశ్వాసం కోల్పోతామన్నారాయన. హైడ్రా-హెచ్ఎండీఏల మధ్య సమన్వయం లేని కారణంగా పర్మిషన్లు ఇవ్వడం- ఆపై కూలగొట్టడమే జరుగుతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘ క్యూర్ ఏరియాలో అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరం. ప్రతీ నెల సమన్వయ కమిటీ సమావేశం జరగాలి. ప్రభుత్వ శాఖలే పర్మిషన్ ఇచ్చి.. ప్రభుత్వ శాఖలే కూలగొడితే ప్రజలకు ప్రభుత్వం పై నమ్మకం పోతుంది. హైడ్రా, హెచ్ఎండీఏ మధ్య సమన్వయం అవసరం. ఇలా లేకపోతే హెచ్ఎండీఏ పర్మిషన్లు ఇవ్వటం, మరొకవైపు హైడ్రా వచ్చి కూలగొట్టడమే అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ నేతలపై కేసులు.. వారిపై మౌనం ఎందుకు?: కేటీఆర్ -
హైదరాబాద్ గన్ పార్క్ వద్ద హైటెన్షన్ అసెంబ్లీ ముందు నిరసన
-
ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)
-
ఉల్లికి మళ్లీ రెక్కలు!
సాక్షి, హైదరాబాద్: ఉల్లి ఉలికిపాటుకు గురిచేస్తోంది. ధరల ఘాటు కన్నీళ్లు పెట్టిస్తోంది. జూలైలో కిలో రూ.20 ఉండగా.. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.60 నుంచి 70 వరకు పలుకుతోంది. కాలనీల్లో రూ.80– 90 వరకు అమ్ముతున్నారు. దీంతో కూరల్లో ఉల్లి వాడాలంటేనే వణుకు పుట్టించే పరిస్థితి నెలకొందని గృహిణులు చెబుతున్నారు. లెక్కేసుకుని మరీ కొంటున్నామని అంటున్నారు. హోటళ్లు, కేటరింగ్ వాళ్లు టిఫిన్లు, భోజనాల్లో ఉల్లి వాడకం తగ్గించడం గమనార్హం. నాసిక్లో వర్షాలతో.. ఉల్లి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం సరఫరా తగ్గిపోవడమే. మలక్పేట మార్కెట్కు గతంలో ప్రతిరోజూ సుమారు 25 వేల బస్తాలు వచ్చేవి. ప్రస్తుతం 15 వేలకు పడిపోయాయి. నగరానికి ఉల్లి ఎక్కువగా మహారాష్ట్రలోని నాసిక్ నుంచే వస్తుంది. అక్కడ భారీ వర్షాలకు పంట మునిగింది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు లేక దిగుబడి పడిపోయింది. ఈ ప్రభావం నగరంపై పడింది. మరో నెల రోజుల పాటు ఉల్లి ధరలు మండుతూనే ఉంటాయని నగర వ్యాపారులు చెబుతున్నారు. అక్టోబర్లో కొత్త పంట వస్తేనే ధరలు తగ్గే అవకాశముంది. -
రూ.20 కోట్ల చిట్టీలు.. దంపతులు మాయం! అసలు కథేంటి?
హైదరాబాద్: చిట్టీల పేరుతో ప్రజల నుంచి రూ.20 కోట్లు వసూలు చేసిన దంపతులు అదృశ్యమయ్యారు. 15 రోజులుగా ఆ దంపతులు కనిపించకుండా పోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు శుక్రవారం హెచ్ఎంటీ హిల్స్లోని వారి ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు.. హెచ్ఎంటీ సాయిచరణ్ కాలనీకి చెందిన సీత, రమణా రెడ్డి దంపతులు చిట్టీల వ్యాపారం మొదలుపెట్టారు.అయితే చిట్టీల వాయిదాలు పూర్తయినప్పటికీ తమకు రావాల్సిన సొమ్ము ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని అడిగేందుకు వెళితే వాయిదా వేస్తూ తీరా కనిపించకుండా పోయారు. అందరికి చిట్టీల డబ్బు రూపంలో సుమారు 20 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని బాధితులు పేర్కొంటున్నారు. చిట్టీలు పాడుకున్న వారికి సకాలంలో డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారు.పైగా తమకు కోర్టు ద్వారా నోటీసులు పంపించడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సొమ్మును తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే బాధితులు ఆరోపిస్తున్నట్లుగా కాకుండా ..రూ.60 లక్షలు మోసపోయినట్లు ఆరుగురు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. మిగతా వారు కూడా ఫిర్యాదు చేస్తే కేసు దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఇవీ చదవండి: ‘క్యూర్’ బిల్లు.. హైదరాబాద్ పాలనలో కీలక మార్పులే! -
‘క్యూర్’ బిల్లు.. హైదరాబాద్ పాలనలో కీలక మార్పులే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో శుక్రవారం ప్రతిపాదించిన ‘తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు– 2026’ (‘క్యూర్’ బిల్లు) కార్పొరేషన్లకు పాలన బాధ్యతలు అప్పగిస్తూనే.. కీలక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి విస్తృత పర్యవేక్షణ, ఆదేశాలు, అధికార బదలాయింపు, సంస్థల పునర్వ్యవస్థీకరణ, అవసరమైతే నేరుగా బాధ్యత చేపట్టే అధికారాలను కలి్పస్తున్నట్లు ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి.సీఎం చైర్మన్గా అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ క్యూర్ పాలనకు ముఖ్యమంత్రి చైర్మన్గా అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తారు. విధాన దిశ, ప్రాధాన్యాలు, ప్రణాళికలు, వివిధ శాఖల సమన్వయంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది.అధికారులతో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ కన్వీనర్గా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. కార్పొరేషన్ల కమిషనర్లు, సీపీలు, కలెక్టర్లు, విద్యుత్, జలమండలి, మెట్రో, ఆర్టీసీ, హైడ్రా అధికారులు సభ్యులుగా ఉంటారు.నిరంతర వైఫల్యం, విధులు నిర్వర్తించలేకపోవడం, అధికార దుర్వినియోగం లేదా ఆర్థిక ముప్పు వంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కార్పొరేషన్లను రద్దు చేయవచ్చు. అయితే.. ముందుగా కారణాలు వెల్లడించి వివరణకు అవకాశం ఇవ్వాలి.మేయర్, డిప్యూటీ మేయర్పై చర్య విధుల్లో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, చట్టపరమైన ఆదేశాల ఉల్లంఘన, అధికార దుర్వినియోగం వంటి సందర్భాల్లో ప్రభుత్వం మేయర్, డిప్యూటీ మేయర్ను తొలగించవచ్చు. అంతకు ముందు వివరణకు అవకాశం కల్పించాలి.కమిషనర్ నియామకంకమిషనర్ను ప్రభుత్వం నియమిస్తుంది. అయితే.. నిరంతర వైఫల్యం, కార్పొరేషన్ తీర్మానాల అమలులో నిర్లక్ష్యం వంటి కారణాలతో మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది తొలగించాలని ఓటు వేస్తే ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు.రికార్డులు కోరడం, తనిఖీలు చేయించడం, విధులు నిర్వర్తించాలని ఆదేశించడం, సంబంధిత తీర్మానాలను నిలిపివేయడం/రద్దు చేయడం, అవసరమైతే ప్రత్యామ్నాయ వ్యక్తిని నియమించడం, మేయర్ లేదా సభ్యులను సస్పెండ్ చేయడం వంటి అధికారాలు ప్రభుత్వానికి ఉంటాయి.ఆదేశాలు పాటించకపోతే నేరుగా జోక్యం ప్రభుత్వ ఆదేశాలను కార్పొరేషన్ లేదా సంబంధిత సంస్థ అమలు చేయకపోతే, వివరణకు అవకాశం ఇచి్చన అనంతరం ప్రభుత్వం ఆ పనిని తానే చేపట్టే అవకాశం ఉంటుంది.సర్కిళ్లు, జోన్ల పునర్వ్యవస్థీకరణ వార్డులు, సర్కిళ్లు, జోన్ల ఏర్పాటు, సరిహద్దుల మార్పు, విలీనం లేదా రద్దుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. వివిధ శాఖల పరిధులను కూడా వీటితో సమన్వయం చేయవచ్చు.ప్రత్యేక డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వరదలు, భారీ వర్షాలు, ఇతర విపత్తుల నివారణ, సిద్ధత, స్పందన, పునరుద్ధరణ కోసం ప్రత్యేక క్యూర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. నీటి చార్జీకి అదనంగా ప్రభుత్వం నిర్ణయించే రేట్ల ప్రకారం సివరేజీ చార్జీ విధించవచ్చు. అడ్వర్టయిజ్మెంట్స్ రెగ్యులేటరీ కమిటీ ద్వారా హోర్డింగులు, సైన్ బోర్డులు, ఇతర ప్రకటనల అనుమతులు, నియంత్రణ చేపట్టనున్నారు. పనుల బదలాయింపు ఒక కార్పొరేషన్ , అథారిటీ లేదా ఏజెన్సీకి ఉన్న బాధ్యత, అధికారం లేదా విధిని ప్రభుత్వం మరో సంస్థకు బదలాయించవచ్చు. అవసరమైతే సంయుక్తంగా నిర్వహించేలా కూడా చేయవచ్చు.ఇవి కూడా చదవండి: తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు కీలక బిల్లులు..! ముందున్నవి ఇవే! -
మహాగణపతి దర్శనానికి వెళ్తున్నారా? ఈ రూట్లు గుర్తుంచుకోండి!
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ పెరగడంతో ఈ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 11 నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి.జోయెల్ డేవిస్ తెలిపారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి మింట్ కాంపౌండ్ వైపునకు వెళ్లే వాహనాలను నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు.సైఫాబాద్ ఓల్డ్ పీఎస్ నుంచి రాజ్దూత్ చౌరస్తా మీదుగా ఖైరతాబాద్ మహాగణపతి వైపునకు వెళ్లే వాహనాలను ఎక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు. ఎక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా ఐమ్యాక్స్ వైపు ట్రాఫిక్కు అనుమతి లేదు. ఈ వాహనాలను సచివాలయ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ప్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్ పోస్టాఫీస్ లైన్ మీదుగా రైల్వే గేటు వైపు వెళ్లే వాహనాలను లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు.ఈ సంవత్సరం భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఖైరతాబాద్, షాదాన్ కాలేజీ, అయోధ్య, నిరంకారి, పాత సైఫాబాద్ పోలీస్స్టేషన్, మింట్ కాంపౌండ్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం జంక్షన్, నెక్లెస్ రోటరీ, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడవచ్చని, అందువల్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.వాహనాల పార్కింగ్ వాహనాల పార్కింగ్ కోసం నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే భక్తులు రేస్ కోర్స్ రోడ్డు, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ మైదానం, ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలు పార్కు చేసుకోవాలని, ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే భక్తులు విశ్వేశ్వరయ్య భవన్ ప్రాంతంలో వాహనాలు పార్కు చేసుకోవాలని తెలిపారు.ఇవీ చదవండి: తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు కీలక బిల్లులు..! ముందున్నవి ఇవే! -
మహానగరానికి కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: రాజధాని మహానగర భవిష్యత్తు రూపురేఖలను సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈమేరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026 (టీక్యూర్ బిల్లు)ను ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో సభ్యులకు పంపిణీ చేసింది. ఈ బిల్లుపై శనివారం సమగ్ర చర్చ జరగనుంది. 1956లో అప్పటి నగర అవసరాలకు అనుగుణంగా రూపొందిన మున్సిపల్ చట్టాల స్థానంలో ఆధునిక నగర అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర పాలనా వ్యవస్థను తీసుకురావడం బిల్లు ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం విస్తరించిన హైదరాబాద్ భౌగోళిక, జనాభా, ఆర్థిక అవసరాలకు పాత చట్టాలు సరిపోవడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. పాత జీహెచ్ఎంసీ పరిధితో పాటు చుట్టుపక్కల విలీన ప్రాంతాలను సమన్వయంతో అభివృద్ధి చేయడం, ప్రభుత్వ శాఖలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం, పౌర సేవలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఉంది. మూడు కార్పొరేషన్లు.. ఒకే సమన్వయం క్యూర్లోని ప్రాంతాల్ని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలుగా మూడు కార్పొరేషన్లుగా నిర్వహించే ప్రతిపాదనకు చట్టబద్ధ రూపం లభించనుంది. వీటి సమన్వయం కోసం ‘క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్’ను ఏర్పాటు చేయనున్నారు. మహానగర స్థాయి వ్యూహాత్మక ప్రాధాన్యాలను ఈ కౌన్సిల్ నిర్దేశించనుంది.సామాన్యుల నెత్తిన బాంబుసామాన్య ప్రజలపై నేరుగా ప్రభావం చూపే అంశాల్లో ఆస్తిపన్ను మార్పు ప్రధానమైనది. ప్రస్తుతం అమల్లో ఉన్న సంవత్సర అద్దె విలువ (ఏఆర్వీ) విధానానికి బదులుగా ఆస్తి మూలధన/రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ (సీవీఎస్) తేనున్నారు. దీనిద్వారా పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను రెట్టింపు, అంతకంటే ఎక్కువ కానుంది. ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నును ‘బేస్ ప్రాపర్టీ ట్యాక్స్’, కొత్త విధానంలో లెక్కించే పన్నును ‘బెంచ్మార్క్ ప్రాపర్టీ ట్యాక్స్’గా పరిగణించే విధానం ఉంది. కొత్త లెక్క ప్రకారం పన్ను ఎక్కువగా వస్తే ఒక్కసారిగా మొత్తం భారాన్ని మోపకుండా, క్రితం ఏడాది పన్నుపై ఏటా గరిష్టంగా 20 శాతం చొప్పున పెంచుతూ బెంచ్మార్క్ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.ఉదాహరణకు ప్రస్తుతం రూ.10వేలు పన్ను ఉండి, కొత్త విధానంలో రూ.20వేలు వస్తే.. మొదటి ఏడాది రూ.12,000, రెండో ఏడాది రూ.14,400, మూడో ఏడాది రూ.17,280 చొప్పున పెరుగుతూ చివరకు రూ.20వేలు స్థాయికి చేరుతుంది. కొత్త విధానంలో పన్ను తక్కువగా వచ్చినా వెంటనే ఆ తగ్గింపు ప్రయోజనం అందదు. బేస్ ట్యాక్స్నే కొనసాగిస్తూ భవిష్యత్లో క్యాపిటల్ వాల్యూ ఆధారంగా లెక్కించిన పన్ను దానికంటే ఎక్కువైనప్పడు కొత్త విధానాన్ని వర్తింపచేయనున్నారు. ప్రతి ఆస్తికి యూనిక్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూపీఐఎన్) కేటాయించడం ద్వారా ఆస్తుల గుర్తింపు, పన్నుల నిర్వహణ, కొనుగోలు–అమ్మకాల్లో పారదర్శకత పెరగనుంది.ఒక్క చాన్స్సెక్షన్ 160 కింద 2015, అక్టోబర్ 28 నాటికి పూర్తయిన, కొన్ని నిబంధనలకు విరుద్ధమైన లేదా అనుమతి లేని నిర్మాణాలకు జరిమానాతో ఒకసారి క్రమబద్ధికరణకు అవకాశం కల్పించే నిబంధన ఉంది. ఆ తేదీ నాటికే నిర్మాణం పూర్తయిందని అఫిడవిట్ ఇవ్వాలి. తప్పుడు అఫిడ విట్ సమర్పిస్తే క్రిమినల్ చర్యలకు అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటు భవిష్యత్తులో చేపట్టే అక్రమ నిర్మాణాలకు వర్తించదు. అక్రమ నిర్మాణాలను నిలిపివేయడం, వివరణ కోరడం, నిర్మాణ సామగ్రిని స్వా«దీనం చేసుకోవడం, కూల్చివేతకు ఆదేశించడం వంటి అధికారాలు కమిషనర్కు ఉంటాయి. సాధారణంగా భవనా న్ని సీజ్ చేయడానికి 24 గంటల ముందస్తు నోటీసు అవసరం కాగా, ప్రజా భద్రతకు అత్యవ సర ముప్పు ఉన్న పరిస్థితుల్లో ముందస్తు నో టీసు లేకుండానే సీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆక్యుపెన్సీ సరి్టఫికెట్ లేని భవనాలకు నీరు, విద్యుత్, మురుగునీటి కనెక్షన్లు ఇవ్వకుండా ని బంధనలు కఠినతరం చేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కనెక్షన్లు ఇచ్చిన అధికారులపైనా చర్యలకు అవకాశం ఉంటుంది. నిబంధనలకు విరుద్ధమైన ఆస్తుల అమ్మకం, బహుమతి, లీజ్, తనఖా, మారి్పడి వంటి బదలాయింపులపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అవసరమైతే వాటిని 22ఏ నిషేధిత జాబితాలో చేర్చవచ్చు.సింగిల్ విండో.. నైట్ ఎకానమీ వ్యాపారాలకు వివిధ శాఖల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సింగిల్ విండో ఆన్లైన్ లైసెన్సింగ్ వ్యవస్థను తేనున్నారు. ఎంపిక చేసిన నైట్ ఎకానమీ జోన్లలో రాత్రివేళల్లో వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలకు చట్టబద్ధమైన అవకాశం కల్పించడం ద్వారా నగర ఆర్థిక వ్యవస్థను 24 గంటల కార్యకలాపాల దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు తదితర మౌలిక సదుపాయాల నిర్వహణకు ఏఐ, డిజిటల్ మ్యాపింగ్, సాంకేతిక పర్యవేక్షణను విస్తరించనున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ఆహార విక్రయ కేంద్రాల తనిఖీలు, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. భవనాలు, లేఅవుట్ల అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు నిర్ణీత వ్యవధిలో దరఖాస్తుపై నిర్ణయం తీసుకోకపోతే అది పైస్థాయి అధికారుల వద్దకు వెళ్లే విధానం ఉంటుంది. అక్కడ కూడా నిర్ణయం రాకపోతే డీమ్డ్ అప్రూవల్కు అవకాశం కల్పించే నిబంధనలు ఉన్నాయి. అయితే ఇది నిబంధనలను పక్కన పెట్టే ‘ఆటోమేటిక్ అనుమతి’కాదు. ‘హైడ్రా’కు మరిన్ని అధికారాలు వరదలు, చెరువులు, నాలాలు, ఆక్రమణల నియంత్రణలో హైడ్రాకు కీలక అధికారాలను కల్పించే నిబంధనలు ఉన్నాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలా ప్రాంతాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలపై కఠిన చర్యలకు వీలు కలి్పస్తున్నారు. మున్సిపల్ వివాదాల త్వరిత పరిష్కారానికి ప్రత్యేక అప్పిలేట్ వ్యవస్థ, ప్రత్యేక మేజి్రస్టేట్ కోర్టుల ఏర్పాటుకు కూడా బిల్లు మార్గం చూపుతోంది. -
తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు కీలక బిల్లులు..! ముందున్నవి ఇవే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ప్రభుత్వం ముఖ్యమైన బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. ప్రజా విశ్వాసం సవరణ బిల్లు–2026తో పాటు కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వీటితోపాటు రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ, ఎల్నినో ప్రభావం, నివారణ చర్యలపై కూడా స్వల్పకాలిక చర్చలు జరగనున్నాయి.అయితే, ప్రజా విశ్వాసం సవరణ బిల్లు–2026ను మంత్రి శ్రీధర్బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లులోని ప్రతిపాదనలు, వాటి వల్ల కలిగే మార్పులపై సభ్యులు చర్చించనున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందేలా తీసుకురానున్న మార్పులపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది.మరో కీలక బిల్లుగా కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లు అసెంబ్లీ ముందుకు రానుంది. ఈ బిల్లును సీఎం రేవంత్రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో పట్టణాభివృద్ధి, పాలనను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం, వివిధ సంస్థల మధ్య సమన్వయం వంటి అంశాలు ఇందులో ప్రధానంగా ఉండనున్నాయి.రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ అంశంపైనా ఈరోజు అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. 22ఏ కింద భూముల రిజిస్ట్రేషన్లకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలపై సభ్యులు చర్చించనున్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్రెడ్డి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీంతో 22ఏపై ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇక ఎల్నినో ప్రభావం, దాని వల్ల రాష్ట్రంలో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు, ముందస్తు నివారణ చర్యలపైనా అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై సభ్యులు చర్చించనున్నారు. దీంతో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు పలు కీలక నిర్ణయాలు, చర్చలకు వేదిక కానున్నాయి.ఇవి కూడా చదవండి: బీసీల జనాభా లెక్కలు తేల్చాలి.. కులగణన తప్పనిసరి: మంత్రి శ్రీహరి -
బీసీల జనాభా లెక్కలు తేల్చాలి.. కులగణన తప్పనిసరి: మంత్రి శ్రీహరి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీల జనాభా ఎంత ఉందో కచ్చితంగా తేల్చడంతోపాటు.. వారి సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన గణాంకాలు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీల కులగణనను తప్పనిసరిగా చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో కులగణనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు ఎవరో ఇచ్చిన దానం కాదని, సామాజిక న్యాయం కోసం దశాబ్దాలుగా సాగిన పోరాటం ఫలితంగా లభించిన హక్కు అని స్పష్టం చేశారు.బీసీలకు న్యాయం చేయాలంటే ముందుగా వారి జనాభా ఎంత ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. వారి జనాభాతోపాటు విద్య, ఉద్యోగాలు, ఆర్థిక పరిస్థితి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై కచ్చితమైన సమాచారం ఉంటేనే ప్రభుత్వాలు సరైన విధానాలను రూపొందించగలవని తెలిపారు. డేటా లేకుండా బీసీలకు ఎంత వాటా కల్పించాలో ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు.మండల్ కమిషన్ నుంచి రిజర్వేషన్ల వరకు..బీసీల హక్కుల కోసం దేశంలో జరిగిన పరిణామాలను మంత్రి ప్రస్తావించారు. 1953లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం కాకా కాలేల్కర్ కమిషన్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. అనంతరం 1979లో బి.పి. మండల్ కమిషన్ ఏర్పడి దేశవ్యాప్తంగా బీసీల సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ సిఫారసు చేసిందని, 1990లో ఆ సిఫారసుల అమలుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని గుర్తుచేశారు.1992లో ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక మార్గదర్శకాలు ఇచ్చిందని మంత్రి తెలిపారు. 1993లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) ఏర్పడిందని, 2018లో 102వ రాజ్యాంగ సవరణ ద్వారా దానికి రాజ్యాంగ హోదా లభించిందన్నారు. ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలు అన్ని వర్గాలకు సమానంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించేందుకు జస్టిస్ రోహిణి కమిషన్ను కూడా కేంద్రం ఏర్పాటు చేసిందని తెలిపారు.తెలంగాణ కుల సర్వే చారిత్రక నిర్ణయంతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే సామాజిక న్యాయానికి పునాది వేసిందని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ వర్గానికి ఎంత జనాభా ఉంది? వారి సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత? రాజకీయంగా వారి వాటా ఎంత? వంటి అంశాలపై స్పష్టత రావడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని చెప్పారు.ఇది కేవలం జనాభా లెక్కలు సేకరించే కార్యక్రమం కాదని.. సామాజిక న్యాయానికి బలమైన పునాది అని మంత్రి పేర్కొన్నారు. బీసీల హక్కులను సాధించేందుకు అవసరమైన గణాంక ఆధారాలను ఈ సర్వే అందిస్తుందని తెలిపారు.‘జిత్నీ ఆబాదీ.. ఉత్నా హక్’రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కలలుగన్న సామాజిక సమానత్వం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన ‘జిత్నీ ఆబాదీ.. ఉత్నా హక్’ నినాదం సామాజిక న్యాయానికి దిశానిర్దేశం చేస్తోందన్నారు. జనాభాలో ఏ వర్గానికి ఎంత వాటా ఉంటే.. అవకాశాలు, అధికారంలోనూ అంతే వాటా ఉండాలనే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్నప్పటికీ బీసీల జనాభా లెక్కలు తేల్చేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తోందని మంత్రి ప్రశ్నించారు. బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియకుండా వారికి ఎంత వాటా ఇవ్వాలో ఎలా నిర్ణయిస్తారని అన్నారు. బీసీలకు సామాజిక న్యాయం అందించాలంటే వారి జనాభా, సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై ఖచ్చితమైన గణాంకాలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు లేదు?బీసీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. బీసీల సమస్యలు, వారి అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా పర్యవేక్షించే వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. బీసీల జనాభా లెక్కలు తేల్చడంతోపాటు వారి హక్కులకు అనుగుణంగా సామాజిక న్యాయం అందించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో బీసీల కులగణనను స్పష్టంగా చేర్చాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. బీసీలను లెక్కించడం ద్వారా వారి జనాభాకు అనుగుణంగా హక్కులు, అవకాశాలు కల్పించేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. ‘కులగణన చేపట్టండి.. సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయండి’ అని కేంద్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.ఇవీ చదవండి: సీఎం ప్రజావాణికి 101 దరఖాస్తులు.. అత్యధికంగా రెవెన్యూ సమస్యలే! -
‘అందుకే విద్యాశాఖను నా వద్ద ఉంచుకున్నా’
హైదరాబాద్: విద్యాశాఖ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ అని, ముఖ్యమంత్రి విద్యాశాఖను నిర్వహిస్తున్నారంటే ఆ శాఖు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లేనని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 11వ తేదీ) అసెంబ్లీ వేదికగా సీఎం విద్యాశాఖను తన వద్దే ఉంచుకోవడంపై వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చారు. ‘విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ. ముఖ్యమంత్రి విద్యాశాఖను నిర్వహిస్తున్నారంటే ఆ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టే. విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష చేస్తే మొత్తం ప్రభుత్వ వ్యవస్థ పాల్గొంటుంది. చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ సహా అధికారులు సమీక్షకు హాజరవుతారు. మంత్రిగా విద్యాశాఖ సమీక్ష చేస్తే సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రమే హాజరవుతారు. ముఖ్యమంత్రిగా విద్యాశాఖను సమీక్షిస్తే మొత్తం వ్యవస్థను ఒకే, టేబుల్పైకి తీసుకురాగలుగుతాం. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉంటుంది. విద్యాశాఖకు ఫుల్టైమ్ మంత్రి లేరని పరిమిత సమాచారంతో విమర్శలు చేయడం సరికాదు. వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ప్రభుత్వం పనిచేస్తోంది. పేదలకు మేలు జరిగే శాఖలను ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించాలి. న్యాయశాఖ, విద్యాశాఖ వంటి కీలక శాఖలను నా వద్దే ఉంచుకున్నా. ప్రజాస్వామ్యంలో పీఎం, సీఎం, డీఎం అత్యంత శక్తివంతమైన పదవులు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న అధికార పరిధి అత్యంత కీలకమైనది. మంత్రులందరూ ముఖ్యమంత్రికి సహాయక వ్యవస్థగా పనిచేస్తారు. అధికారులు, ఇతర వ్యవస్థలు కూడా ప్రభుత్వానికి సహాయక వ్యవస్థలే. పేదలకు మేలు చేసే నిర్ణయాలు వేగంగా తీసుకోవడమే లక్ష్యంప్రైవేటు విద్యా వ్యవస్థలో రెండున్నరేళ్లకే పాఠశాలకు పంపిస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఐదేళ్లకు పాఠశాలకు పంపిస్తున్నారు. అందుకే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు చూస్తున్నారు. నర్సరీ, ఎల్.కే.జీ విధానంతో పాటు ఇంగ్లీష్ భాష కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు చూస్తున్నారు. అందుకే ప్రభుత్వం పాఠశాలల్లో మొట్ట మొదటిసారిగా ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రారంభించాం. ఈ ఏడాది 64 వేల మంది ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తున్నాం. నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సెంట్రలైజ్డ్ కిచెన్స్ డిజైన్ చేసి నాణ్యమైన హైజెనిక్ బ్రేక్ ఫాస్ట్, భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నాం. పదేళ్లు వాళ్లు పట్టించుకోకపోతే మేం ఆధికారంలోకి రాగానే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాం. ఒక రేవంతన్నగా మేం ఇన్ని చేసినా ఎప్పుడూ చెప్పుకోలేదు’ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కొండా సురేఖ బర్తరఫ్పై కేటీఆర్ రియాక్షన్ ఇదే -
జాతీయ టోర్నీలో సత్తా చాటిన నైశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని బెలగావిలో జరిగిన ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) పురుషుల టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన గణగామ నైశిక్ రెడ్డి సత్తా చాటాడు. డబుల్స్ విభాగంలో తన భాగస్వామి ప్రబీర్ చావ్డాతో కలిసి రన్నరప్గా నిలిచాడు. ఫైనల్లో రెండో సీడ్ ఓగేష్ జయప్రకాశ్–సూరజ్ ప్రబోధ్ జోడీ చేతిలో 3–6, 0–6తో నైశిక్–ప్రబీర్ జోడీ ఓటమి పాలయ్యింది. అంతకముందు సెమీఫైనల్లోఈ జంట 6–2, 6–1తో ఆయుష్ శర్మ–ఆదిత్య మోర్ జోడీపై విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఇక ప్రీ క్వార్టర్ ఫైనల్లో ప్రబీర్ చావ్డా-నైశిక్రెడ్డి జోడీ 7–5, 6–2తో సోమ సుహాస్–కౌశిక్ అరుణ్కుమార్ జోడీపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.నైశిక్ రెడ్డి ప్రస్తుతం సురేష్ కృష్ణ టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. మాజీ ఒలింపియన్, డేవిస్ కప్ క్రీడాకారుడు విష్ణువర్ధన్ మార్గదర్శకత్వంలో తన ఆటతీరును మరింత మెరుగుపరుచుకుంటున్నాడు. బెలగావి టోర్నమెంట్లో రన్నరప్గా నిలవడం ద్వారా నైశిక్ మరోసారి తన సత్తాను చాటాడు.Read: 'అతడో క్రికెట్ పిచ్చోడు; ద్రవిడ్ యజమానిలా ఫీలవుతున్నాడు' -
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహబూబ్నగర్లోలో రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో రిటైర్డ్ అధికారి నివాసం ఉంటున్నారు. బుల్లెట్స్ ఇచ్చే అమ్నేషన్ సెక్షన్ ఇంచార్జి సహకారంతో చోరీ చేశారు. ఈ కేసుల కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ మీడియాకు తెలిపారు.‘‘గత నెల ఆగస్టు 30న తెల్లవారుజామున మద్రాస్ రెజిమెంట్ ఆయుధ గారంలో జరిగిన చోరీ కేసును చేధించాం. మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధగారంలో కొన్ని ఆయుధాలు ఆ రోజు దొంగిలించబడ్డాయి. 30వ తేదీ ఉదయం ఆర్మీ ఉద్యోగి వినోద్ కుమార్ తాళాలు పగలగొట్టి ఉన్న విషయం గుర్తించి ఆర్మీ అధికారులను అప్రమత్తం చేశాడు. ఆ తర్వాత బ్రిగేడియర్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఏడు పిస్టళ్లతో పాటు నాలుగు ఏకే 203, ఒక ఇన్సాస్ నైట్ విజన్ బైనాక్యులర్ చోరీకి గురయ్యాయి. రెండో బిల్డింగ్ నుంచి మందగుండు ఉన్న బాక్సులు మిస్ అయ్యాయి...ఉమ్మడిగా మల్కాజిగిరి పోలీసులు, మిలిటరీ ఇంటెలిజెన్స్, సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేశారు. మొదటి దశలో ఇన్సైడర్ వ్యక్తులు తప్ప బయట వ్యక్తులు చోరీ చేసే అవకాశం లేదు అని నిర్ధారణకు వచ్చాము. సులువుగా కేసు క్లోజ్ అవుతుందనుకున్నాం.. కానీ కాలేదు. అనుమానితులను ప్రశ్నిస్తే ఎలాంటి లీడ్ దొరకలేదు. అనుమానితులను ప్రశ్నిస్తే ఎలాంటి లీడ్ దొరకలేదు. ఆయుధ గారానికి ఎవరెవరికి అనుమతి ఉంది. వారిని లిస్ట్ ఔట్ చేశాము. ముందుగా పది మందినీ గుర్తించాము. ఆయుధగారం వద్దకు ఆరుగురు సభ్యుల మూవ్మెంట్ కంటిన్యుగా ఉంటుంది. వారిని షార్ట్ లిస్ట్ చేసి విచారించారు...ఏడుగురు ఎలక్ట్రిషియన్, ప్లంబర్.. పనిష్మెంట్ పై వెళ్లిన 36 మందిని కూడా గుర్తించాం. లీవ్లో వెళ్లిన 54 మందిని గుర్తించి విచారించాము. సర్వీస్లో ఇండిసిప్లిన్ కారణంగా విధులకు దూరంగా ఉన్న ఏడుగురును కూడా విచారించాము. కోపంతో ఎవరైనా ఇలా చేశారా అనే కోణంలో అని దర్యాప్తు చేశాము. వారం రోజులు భిన్న కోణాల్లో క్రాస్ వెరిఫికేషన్ చేశాము. డ్రగ్ మాఫియా కనెక్షన్ యాగిల్లో దర్యాప్తు చేశాము.. స్పై నెట్వర్క్ కోణంలో కూడా విచారణ చేశాము. బృందాలుగా ఏర్పడి సీసీటీవీ డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్. మొబైల్ సిగ్నల్స్ ఈ కేసు దర్యాప్తు చేశారు. ముందుగా ఇద్దర్ని మెయిన్ సస్పెక్ట్గా భావించాం.. ఆయుధగారంలో ఇంఛార్జ్ వినోద్ కుమార్ శ్రీరామ్ ప్రసాద్ అనుమానితులుగా భావించి విచారించాం...ఇద్దర్ని విచారించిన కూడా ఎటువంటి క్లూ దొరకలేదు.. ఇదే క్రమంలో ఏడుగురు పెన్షన్ అవుట్ పర్సన్స్లో ఇద్దర్ని విచారించాం. ప్రకాశం జిల్లాను చెందిన ఓ హవల్దార్తో పాటు, మల్లేష్ అనే మరో హవల్దార్ విచారించారు. జూన్ ముప్పై తేదీన మల్లేష్ను హెల్త్, ఇన్ డిసిప్లిమరీ కారణంగా తీసేసారు. మల్లేష్ కంటోన్మెంట్ పక్కనే ఉన్న బాలాజీ నగర్లో ఉంటాడు అతనిపై అనుమానం రావడంతో అన్ని కోణంలో చెక్ చేశాము. ఏడో తేదీ మల్లేష్ను నాగర్ కర్నూల్లో ప్రశ్నించాము. ఆ సమయంలో సరిగా స్పందించలేదు. దీంతో అనుమానం పెరిగింది. అతని మొబైల్ను తీసుకుని అతన్ని నాగర్ కర్నూలు పోలీసులకు వాచ్లో పెట్టమని అడిగాము. మొబైల్లో చెక్ చేయగా వాట్సాప్ కాల్ లాగ్, చాట్లు అన్ని క్లియర్ చేసే ఉంది. విచారణలో అతను సమాధానం ఇచ్చే తీరు కూడా సస్పెక్ట్ అనిపించింది. అందుకే అతన్ని 8, 9 తేదీలలో విచారణకు రమ్మని చెప్పాము. అతని విచారణకు రాకుండా తప్పించుకున్నాడు.. ఆ తర్వాత భార్యకు కేసు తీవ్రత వివరించాం...ఆమె అతన్ని పదవ తేదీన విచారణకు తీసుకువస్తానని చెప్పింది. విచారణకు వచ్చే క్రమంలో భార్య అతన్ని గట్టిగా నిలదీసింది. దీంతో మల్లేష్ భార్య ముందు నిజం ఒప్పుకున్నాడు. దీంతో వారు మాకు సమాచారం ఇచ్చారు. అనంతరం మల్లేష్ నుండి వెపన్స్ రికవరీ చేశారు. 30వ తేదీ రాత్రి ఆయుధగారం వద్ద అతని కదలికలు ఉన్నాయి. 28, 29న ఆయుధాల చోరీ కోసం అతను రెక్కీ చేసాడు. సీసీటీవీ రాత్రి పూట పని చేయదని అతనికి తెలుసు. 30 నుండి రాత్రి బాలాజీ నగర్ నుండి కార్గిల్ గేట్ గుండా లోపలికి వచ్చాడు. ఆయుధ గారంలో తాళం పగల గొట్టి ఆయుధాలను ఒక్కొకటి తీసుకు చీకటి ఉన్న ప్రాంతంలో పెట్టాడు. మందగుండు ఉన్న గది దగ్గకు వెళ్ళి గంట సేపు శ్రమించి తాళం పగల గొట్టాడు. తాళం పగల గొట్టి మందగుండి సామాగ్రి తీసుకుని వెళ్ళాడు. ..దాదాపు గంట పాటు లోపలే ఉండి మందుగుండు సామగ్రిని ఆయుధాలను స్కూటీ లో పెట్టుకుని రెండు కిలోమీటర్ దూరంలో టెంపుల్ దగ్గర పెట్టాడు. మళ్ళీ వెనక్కి వచ్చి మ్యాగజీన్ కవర్ కోసం మళ్ళీ తిరిగి వెళ్ళాడు. అక్కడే ఉన్న ఆర్మీ జవాన్ అతని ప్రశ్నించగా తాను మద్రాస్ రెజిమెంట్ అని చెప్పాడు. ఆ తర్వాత మ్యాగజీన్లను బ్యాగ్లో పెట్టుకుని బాలాజీ నగర్లో ఉన్న ఇంటికి నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు వెళ్ళాడు. తిరిగి ఇంటి నుండి గుడి వద్దకు కారులో వచ్చి అక్కడ నుండి ఆయుధాలు తీసుకుని అక్కడ అచ్చంపేట వైపు వెళ్ళాడు...ఓఆర్ఆర్, సాగర్ హైవే, బొంగులూరు గేట్ వైపు వెళ్ళాడు. సీసీటీవీలు ఉంటాయి శ్రీశైలం హైవేను అవాయిడ్ చేశాడు. దిండి దగ్గర వెహికల్లో ఎక్కించుకుని పేమెంట్ తీసుకుని ఎవిడెన్స్ క్రియేట్ చేసాడు. ఉదయం పది గంటలకు అచ్చంపేట చేరుకున్నాడు. అక్కడే సొంత ఇంటి ముందు గడ్డివాము లాంటి ప్రాంతంలో మట్టి తీసి కప్పేశాడు. మళ్లీ ఐదు ఆరు రోజుల తర్వాత వాటిని తీసి పదరా గ్రామానికి షిఫ్ట్ చేశాడు. ఎనిమిదవ తేదీన మళ్ళీ ఆయుధాలను ఇంటికి తీసుకు వెళ్ళాడు. దీని తర్వాత పదవ తేదీ భార్య హైదరాబాద్ తీసుకుని వస్తున్న క్రమంలో నిజం ఒప్పుకుంటాడు. దీంతో కేసు కొలిక్కి వచ్చింది.. పది రోజుల పాటు కేసు ఆందోళన కలిగించింది’’ అని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. -
హైదరాబాద్ లో ఆకట్టుకున్న వెరైటీ గణనాథులు (ఫొటోలు)
-
బంజారా హిల్స్ లో బిగ్ యాక్సిడెంట్ మహిళలకు తీవ్ర గాయాలు
-
రాష్ట్రంలో 30 శాతం కమిషన్ ప్రభుత్వం నడుస్తోంది.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్, రెవెన్యూ మంత్రి కలసి భూదోపిడికి తెగబడుతున్నారని రాష్ట్రంలో గిరిజనుల, అసైన్డ్ భూములు మాయమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భూముల వివాదంతోనే మంత్రిని బర్తరఫ్ చేశారన్నారు. రాష్ట్రంలో 30 శాతం కమిషన్ ప్రభుత్వం నడుస్తుందని. సీఎం సొంత నియోజకవర్గంలో భూముల కోసం గిరిజనులపై దాడి చేశారన్నారు. ఈ రోజు శుక్రవారం బీఆర్ఎస్ భవన్లో 22ఏ బాధితులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ హయాంలో భూముల విలువ భారీగా పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 22ఏ అంశంతో కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో భూదోపిడి విచ్చలవిడిగా జరుగుతుందని మంత్రులు దండుపాళ్యం ముఠాలా తయారయ్యారన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములపై సీఎం రేవంత్ కన్నేశారని మూసీ పేరుతో వేల ఎకరాలు దోచుకున్నారని ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ ఆయన సోదరుడికి ఐదు ఎకరాల భూమిని కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుందని కాంగ్రెస్పై కేటీఆర్ ధ్వజమెత్తారు.22ఏ వల్ల లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 22ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఓ బాధితుడు 22ఏతో మా స్థలాలకు లోన్లు రాక ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ను కలిసినా సమస్య పరిష్కారం కాలేదన్నామని తమ ఆవేదనని వెల్లిబుచ్చుకున్నారు. -
కోల్కతా బొగ్గు కుంభకోణం.. హైదరాబాద్లో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: కోల్కతా బొగ్గు కుంభకోణానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు చేపడుతుంది. ఈ రోజు శుక్రవారం ఉదయం కోల్కతానుంచి హైదరాబాద్లో ఈడీ ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. హైదరాబాద్లోని AMR కంపెనీలో తనిఖీలు చేపడుతుంది. అదే విధంగా టాలీవుడ్లో ప్రముఖ ప్రొడ్యూసర్గా ఉన్న మహేశ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపడుతుంది. కోల్కతా, హైదరాబాద్, జార్ఖండ్లలోని ప్రముఖ రాజకీయ నేతలకు ఆయన బినామీగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. -
కేపీహెచ్బీ: అర్ధరాత్రి లాఠీ ఝళిపించిన ఎస్సై మౌనిక
కేపీహెచ్బీ అంటేనే రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న చర్చ కొంతకాలంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ దీనిపై జరిగే చర్చ చాలామందికి తెలిసే ఉంటుంది. తాజాగా ఇలాంటి కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రివేళల్లో రోడ్డుపై వెళ్లేవారిని ఆకర్షిస్తూ హల్చల్ చేస్తున్న పలువురిని కేపీహెచ్బీ సెక్టార్ ఎస్ఐ మౌనిక లాఠీతో తరిమికొట్టారు.కేపీహెచ్బీ ఫోర్త్ ఫేజ్ సరీ్వస్ రోడ్డు సమీపంలో కొన్ని రోజులుగా ట్రాన్స్జెండర్లు రాత్రి వేళల్లో ఆగడాలకు పాల్పడుతున్నారు. ఇటీవల వీరిని ఇన్స్పెక్టర్ విజయ్కుమార్ ఠాణాకు పిలిపించి హెచ్చరించారు. అయినా మార్పు రాలేదు. చెట్ల పొదల వద్ద రాత్రి వేళల్లో రోడ్డుపై వెళ్లేవారిని ఆకర్షిస్తూ హల్చల్ సృష్టిస్తున్నారు. విషయం తెలుసుకున్న సెక్టార్ ఎస్ఐ మౌనిక బుధవారం రాత్రి కారులో వచ్చి లాఠీ తీసుకుని చెట్ల పొదల్లోకి రావడంతో ట్రాన్స్జెండర్లు పరుగులు పెట్టారు. ఎస్ఐ ధైర్యంగా వెళ్లి ట్రాన్స్జెండర్లను తరిమి కొట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పక్కన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు ఆమె సూచించారు. పలువురు ట్రాన్స్జెండర్లపై కేసులు నమోదు చేశారు.ఇప్పటికే హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో పోలీసులు ఈసారి కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రోడ్ల పక్కన, నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ మౌనిక స్థానికులకు సూచించారు.At this point, KPHB is starting to look less like a residential area and more like Hyderabad’s unofficial red-light district.⁰How the hell did this happen? 🤦♀️ pic.twitter.com/ISCRPcCXl1— Shika Reddy (@Shika_Reddy) September 10, 2026 -
ప్రకృతి డేంజర్ సిగ్నల్స్.. ఇది వానా కాలమా.. ఎండా కాలమా!
-
కాబోయే భర్తతో వీడియో కాల్ లో ఉండగానే సూసైడ్
-
నేడు 5వ రోజు కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
తెలంగాణ: రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నేడు ఐదో రోజు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధి, మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.ముఖ్యమంత్రి అసెంబ్లీలో కోర్ అర్బన్ రీజియన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పట్టణ ప్రాంతాల పరిధి, అభివృద్ధి, పరిపాలనకు సంబంధించిన అంశాలకు ఈ బిల్లు ప్రాధాన్యత కలిగినదిగా భావిస్తున్నారు. అలాగే మున్సిపాలిటీల నాలుగో సవరణ బిల్లును కూడా సీఎం సభ ముందుకు తీసుకురానున్నారు.మరోవైపు ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ బిల్లును మంత్రి శ్రీధర్బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత, నిబంధనలకు సంబంధించిన మార్పులపై ఈ బిల్లు ద్వారా చర్చ జరిగే అవకాశం ఉంది.ఇక జనగణనలో బీసీ, ఓబీసీల అంశంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. జనగణనలో వెనుకబడిన తరగతులకు సంబంధించిన వివరాల నమోదు, వారి జనాభా లెక్కింపునకు సంబంధించిన అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.అలాగే విద్యారంగ కార్యక్రమాలపై మరో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించిన పథకాలు, కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై సభ్యులు చర్చించనున్నారు. దీంతో ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.ఇవి కూడా చదవండి: ట్రాన్స్కోకు ఆయిల్ పరేషాన్ -
తెలంగాణకు వర్ష హెచ్చరిక.. ఈ రెండు రోజులు జాగ్రత్త!
తెలంగాణ: రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు వర్షాల ప్రభావం ఉండొచ్చని, ముఖ్యంగా 12, 13 తేదీల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని చెబుతోంది. దీంతో గతంలో అంచనా వేసిన దానికంటే వర్షాలు ముందుగానే మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోంది. ఇది క్రమంగా బలహీనపడి విదర్భ ప్రాంతంలో బలహీన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.అయితే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉండకపోవచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసి 50 నుంచి 70 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.హైదరాబాద్తో పాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ ఈ రెండు రోజులు మోస్తరు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సెప్టెంబర్ 12న వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దీంతో ప్రజలు వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో మాత్రం అల్పపీడనం ప్రభావం తక్కువగా ఉండొచ్చని అంచనా. అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 15 నుంచి 17 మధ్య వర్షాలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని, వాతావరణ పరిస్థితులను బట్టి తాజా అంచనాల్లో మార్పులు ఉండొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. -
సీఎం రేవంత్ రెడ్డికి జాజుల శ్రీనివాస్ గౌడ్ వినతి
హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతి జనగణనలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కాలం చేర్చకుండా అన్యాయం చేసిందని, తెలంగాణ రాష్ట్ర తరహా లోనే ఓబీసీ కాలం చేర్చి, ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణనపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారునేడు రాష్ట్ర అసెంబ్లీలో వడ్డెర ఫెడరేషన్ చైర్మన్ గుంజ రేణుక, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, సంచార జాతుల సంఘం రాష్ట్ర నేతలు కాటేపల్లి వీరస్వామి, తిప్పిరి శెట్టి శ్రీనివాసులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తో జాజుల శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి వినతి పత్రాన్ని అందజేశారుబీసీ కులాల లెక్కలు సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందని, కేంద్ర ప్రభుత్వం తరఫున ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా జాజుల కోరారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో ఉన్న 51 కులాలను సంచార జాతులుగా డీఎన్టీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 10 నీ విడుదల చేసిందని, ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారురాష్ట్రంలోని 30 లక్షల మంది సంచార జాతులకు విముక్తి దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా జరిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఇదే సమయంలో ఈ నెలాఖరులో హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగే సంచార జాతుల విముక్తి దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని వారు కోరారు. సీఎంతో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వడ్డెర ఫెడరేషన్ చైర్మన్ గుంజ రేణుక, సంచార జాతుల సంఘాల నేతలు కాటేపల్లి వీరస్వామి, తిప్పిరి శెట్టి శ్రీనివాస్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి ఉన్నారు -
ఆ 55 ఎకరాలు.. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్
-
ప్రకృతి డేంజర్ సిగ్నల్స్ ఇది వానా కాలమా.. ఎండా కాలమా..!
-
Video: హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు బీభత్సం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: బాటసింగారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో ఆటోను తప్పించబోయి.. పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో రెండు కార్లు, ఆటో ధ్వంసమయ్యాయి. దిల్సుఖ్నగర్ డిపో బస్సు.. చౌటుప్పల్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. బంక్లోని డీజిల్ పంపు వరుకు దూసుకెళ్లడంతో పరికరాలు కూడా విరిగిపడ్డాయి. బంక్ సిబ్బంది, అక్కడ ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు.కామారెడ్డి జిల్లాలో..కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ రైల్వే గేటును ఆటో ఢీకొట్టింది. దేవగిరి ఎక్స్ప్రెస్ కోసం గేటు వేస్తుండగా ఘటన జరిగింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. రైల్వే గేట్ ధ్వంసం కావడంతో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.సూర్యాపేట జిల్లాలో..సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజి వద్ద లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన భోజనం కోసం ఆపిన రెండు లారీలను మరో లారీ బలంగా ఢీకొట్టింది. డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి విజయనగరం వెళ్తుండగా ఘటన జరిగింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. జాతీయ రహదారి-65 పై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. -
పునరుజ్జీవనం పేరిట విధ్వంసం వద్దు, మూసీ నదిని కాపాడుకుందాం!
సాక్షి, హైదరాబాద్: మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయవద్దు అంటూ మూసీ జన ఆందోళన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్లోని ధర్నా చౌక్లో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జీవనదిగా విరాజిల్లిన మూసీ నదిని కలుషితం చేయకుండా కాపాడాలని, నదిని కాపాడుకుందాం - ప్రజా హక్కులను రక్షించుకుందాం అంటూ వాణిజ్య కాంక్రీట్ నిర్మాణాల నుంచి రక్షించుకోవాలని, నిర్వాసితుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పర్యావరణ వేత్తలు, సామాజిక ఉద్యమ కారులు ఈ పోరాటాన్ని చేపట్టారు.పర్యావరణవేత్తలు డా బాబూరావు, డా. దొంతి నరసింహా రెడ్డి గార్లు ఈ ప్రాజెక్ట్ వల్ల ఏర్పడబోయే పర్యావరణ అంశాలను వివరించారు. మూసి కాలుష్యానికి కారణం బస్తీలు కాదు పరిశ్రమలని తెగేసి చెప్పారు. మూసి పై కొత్త నిర్మాణాలను తక్షణమే నిలిపి వేయాలన్నారు. మూసీ పునరుజ్జీవనం పేరిట వేలాది కుటుంబాలను బలవంతంగా నిర్వాసితులను చేసే ప్రమాదకరమైన ప్రణాళికలని మండిపడ్డారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదనీ, కానీ సహజ సిద్ధమైన నదీ వ్యవస్థను, పర్యావరణ పునరుద్ధరణను కాపాడుతూ సరైన నది పరీవాహక ప్రాంత ప్రణాళితో, సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందజేయాలని ప్రజాసంఘాలు, పర్యావరణవేత్తలు డిమాండ్ చేశారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట కాంక్రీట్ జంగల్ చేయవద్దని ఈ సందర్బంగా పలువురు వక్తలు కోరారు.మూసీ నది కలుషితం కాకుండా చేయడంతోపాటు, ప్రాజెక్ట్ డిపిఆర్లో బాధితులను సంప్రదించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులు, సామాజిక కార్యకర్తలు వేలాదిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ధూల్పేట్లో గణేశ్ విగ్రహాల జోరు
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి అంటే.. హైదరాబాదీలకు గుర్తుకు వచ్చేది భారీ గణపతి విగ్రహాల తయారీకి అడ్డా ధూల్పేట్.. సుందర్ కళాకార్ వంటి నిష్ణాత విగ్రహ తయారీ నిపుణులకు ధూల్పేట్ కేరాఫ్ అడ్రస్గా ఉంది. ఇక్కడ తయారయ్యే విగ్రహాలు ఇతర రాష్ట్రాలకే కాకుండా.. ఆస్ట్రేలియా వంటి దేశాలకు కూడా వెళ్తాయి. వినాయక చవితి నేపథ్యంలో.. సాక్షి ఫ్యామిలీ ధూల్పేట్లోని గణేశ్ విగ్రహ కళాకారులు, కొనుగోలుదారులను పలకరించింది. ఆ వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. -
హోటలే ఇల్లు.. సిటీలో నయా ట్రెండ్!
నగరంలో ఒకటి రెండు రోజులు ఉండాలంటే హోటల్ గదులు, నెలల తరబడి ఉండాలంటే ఇల్లు అద్దెకు తీసుకునే ధోరణికి భిన్నంగా.. రోజులు, నెలల తరబడి ఉండడానికి కూడా స్టార్ హోటల్కే ఓటేసే ధోరణి పెరిగింది. విభిన్న రంగాల వారు పనుల నిమిత్తం నగరంలో తాత్కాలిక బస కావాలని ఆశించడం అంతకంతకూ పెరుగుతుండడంతో స్టార్ హోటళ్లలో అపార్ట్మెంట్ కల్చర్ కూడా ఊపందుకుంది. – సాక్షి, సిటీబ్యూరోహోటల్ గదులను విస్తరించడం కొత్త విషయం కాకపోవచ్చు కానీ గచ్చిబౌలిలోని షెరటాన్ హోటల్ తాజాగా మరో 42 అపార్ట్మెంట్లను అందుబాటులోకి తీసుకురావడం ఇప్పుడు చెప్పుకోదగ్గ విశేషం. దీంతో కలిపి ఆ హోటల్లో మొత్తం 98 అపార్ట్మెంట్లకు చేరడం గమనార్హం. మొత్తం 228 సాధారణ గదులు ఉంటే దాదాపు అందులో సగం అపార్ట్మెంట్లు ఉండడం గమనార్హం. ప్రస్తుతం నగరంలో ఊపుమీదున్న హోటల్–అపార్ట్మెంట్ ట్రెండ్కి ఇదో చిన్న ఉదాహరణ. పన్నెండేళ్ల క్రితమే.. దాదాపు 12 ఏళ్ల క్రితం బంజారాహిల్స్లోని స్టార్ హోటల్ పార్క్ హయత్ సర్వీస్ అపార్ట్మెంట్లకు శ్రీకారం చుట్టింది. దాదాపు ఇంటిని తలపించే సింగిల్, డబుల్ బెడ్ గదులతో ఉండే ఈ అపార్ట్మెంట్లు అప్పట్లో కేవలం కార్పొరేట్ ఉద్యోగుల అవసరాలను మాత్రమే తీరుస్తూ ఉండేవి. రానురానూ విభిన్న రంగాల నుంచీ ఈ తరహా హోటల్ అవసరాలకు డిమాండ్ పెరిగింది. ఐటీతో పాటు డేటా సెంటర్లు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా, సినిమా, టీవీ తదితర రంగాల నుంచి వీటికి ఆదరణ పెరిగింది. దీంతో ఐదారేళ్లుగా నగరంలో నెలకొల్పే ప్రతీ స్టార్ హోటల్లోనూ ఈ తరహా అపార్ట్మెంట్లు తప్పనిసరిగా మారాయి. ఏమిటీ సర్వీస్డ్ అపార్ట్మెంట్లు? ఇవి పేరుకు తగ్గట్టుగా ఉండే సాదా సీదా అపార్ట్మెంట్లు కాదు. వాషింగ్ మెషీన్, డిష్వాషర్, తాగునీరు, కిచెన్ తదితర రోజువారీ జీవనానికి అవసరమైన సౌకర్యాలతో పాటు అవసరాన్ని బట్టి చెఫ్స్, హౌస్ కీపింగ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండటమే వీటి ప్రత్యేకత. హోటల్ సరీ్వస్తో పాటు ఇంటి సౌకర్యాలు కూడా కలగలిపి ఉంటాయన్నమాట. ఇటీవల ఓ స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన కొత్త అపార్ట్మెంట్లలో 35 చదరపు మీటర్ల స్టూడియో, 61 చదరపు మీటర్ల వన్ బెడ్రూమ్, 88 చదరపు మీటర్ల టు బెడ్రూమ్ ఉన్నాయి. అంతేకాకుండా గార్డెన్ వ్యూ, సిటీ వ్యూ, ఆర్ఆర్ఆర్ వ్యూస్ కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రధాన పోషకులు వీరే.. నగరంలో ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు, కొత్తగా కంపెనీలో చేరే ఉద్యోగులు, విదేశీ కంపెనీల ప్రాజెక్టులపై నెలల తరబడి పనిచేసే నిపుణులు, జీసీసీ ఉద్యోగులు, సినిమా అనుబంధ రంగాలకు పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు, కొత్తగా హైదరాబాద్కు బదిలీపై శాశ్వత ఇల్లు చూసుకునే వరకు ఉన్నతోద్యోగులు.. వీటికి ప్రధాన పోషకులుగా మారారు.ఖరీదైనా.. కావాల్సిందే.. ఆయా హోటళ్లలో వన్ బెడ్రూం అపార్ట్మెంట్ 90 చదరపు మీటర్లు, టు బెడ్రూం టెర్రస్ అపార్ట్మెంట్ 145 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫాంలో తేదీ, గది రకాన్ని బట్టి స్టూడియోలకు రోజుకు సుమారు 10,000 నుంచి రూ.16,000, వన్ బెడ్రూం అపార్ట్మెంట్లకు రూ 12,000 నుంచి రూ.20,000 ధరల్లో ఉన్నాయి. పన్నులు, భోజనం, ప్రత్యేక ఆఫర్లు, సీజన్, ఎన్ని రోజులు/నెలలు బస చేస్తారు? అనే వాటి ఆధారంగా ప్యాకేజీల ధరలు మారుతాయి. ఏదేమైనా నగరంలో ‘హోటల్.. హోమ్’ అనే కొత్త సంస్కృతి పుట్టుకొస్తోందని చెప్పవచ్చు. -
హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లేకుండానే జుట్టు పెరుగుదల.. డా.స్తుతి ప్రత్యేక చికిత్స
భారతదేశంలో ప్రముఖ డెర్మటాలజిస్ట్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హెయిర్ స్పెషలిస్ట్ డా. స్తుతి ఖరే శుక్లా జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్న వారికి ఆశాకిరణంగా నిలుస్తున్నారు. ఆమెను చాలామంది ప్రేమగా 'హెయిర్ గ్రోత్ క్వీన్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడే ప్రత్యేక చికిత్సా విధానాలతో ఆమె దేశ, విదేశాల్లో ఎంతోమందికి సేవలు అందిస్తున్నారు. ఆమె సెప్టెంబర్ 26, 27 తేదీల్లో హైదరాబాద్లో ఎలిమెంట్స్ ఆప్ ఏస్థటిక్స్ క్లినిక్, 2వ అంతస్తు, మెడ్9 హెల్త్ కేర్, ఇండస్ఇండ్ బ్యాంక్ పక్కన, ఫేస్ 1, కమలపురి కాలనీ, బంజారాహిల్స్, హైదరాబాద్, తెలంగాణ, 500073 చిరునామాలో అందుబాటులో ఉంటారు.Address: Elements of Aesthetics Clinic, 2nd Floor, Med9 Health Care, beside INDUSIND Bank, Phase 1, Kamalapuri Colony, Banjara Hills, Hyderabad, Telangana 500073హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్డా. స్తుతి రూపొందించిన ప్రత్యేకమైన.. హెయిర్ గ్రోత్ బూస్టర్ నాన్-సర్జికల్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ జుట్టు రాలడం, బట్టతల వంటి సమస్యలకు పరిష్కారంగా నిలుస్తోంది. కేవలం 5 నిమిషాల్లో నిర్వహించే ఈ ప్రత్యేకమైన చికిత్స.. శస్త్రచికిత్సతో కలిగే నొప్పి, కోలుకునే సమయం వంటి ఇబ్బందులు లేకుండా జుట్టు పెరుగుదలకు తోడ్పడేలా రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ చికిత్స ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా ఇంటి నుంచే పొందే అవకాశం కూడా ఉంది.శస్త్రచికిత్స లేకుండా జుట్టు తిరిగి పెరిగేలా చేయడంలో ఆమె చూపిన అద్భుతమైన ఫలితాలకు గాను, డాక్టర్ స్తుతి ప్రఖ్యాత హెల్త్ కేర్ లీడర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆమె ఇటీవల సుష్మితా సేన్, సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలాలతో పాటు మిస్ యూనివర్స్ ఇండియా 2026కు జ్యూరీగా వ్యవహరించారు. ఆమె హెయిర్ కేర్ నిపుణురాలు కూడా.డెర్మటాలజీలో అంతర్జాతీయ అనుభవండా. స్తుతి ఖరే శుక్లా విద్యా, వైద్య రంగాల్లో అంతర్జాతీయ అనుభవాన్ని సంపాదించారు. ఆమె భారతదేశంలో డెర్మటాలజీలో పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడంతో పాటు, ప్రపంచంలోని ప్రముఖ వైద్యులు, ప్రసిద్ధ ఆసుపత్రుల నుంచి నాలుగు అంతర్జాతీయ ఫెలోషిప్లు ఉన్నాయి. లాస్ ఏంజెల్స్లోని డా. జైన్ ఒబాగీ సెంటర్లో అడ్వాన్స్డ్ స్కిన్ హెల్త్ ట్రీట్మెంట్, నాష్విల్లేలోని డా. గోల్డ్ స్కిన్ కేర్ సెంటర్లో కాస్మెటిక్ డెర్మటాలజీ, సింగపూర్లోని నేషనల్ స్కిన్ సెంటర్లో డెర్మటోసర్జరీ, బ్యాంకాక్లోని సిరిరాజ్ హాస్పిటల్లో లేజర్స్కు సంబంధించిన ప్రత్యేక శిక్షణ పొందారు.హైదరాబాద్తోపాటు ప్రధాన నగరాల్లో..అంతర్జాతీయ అనుభవాన్ని సంపాదించిన తరువాత భారత్కు తిరిగి వచ్చిన డా. స్తుతి జుట్టు పెరుగుదల చికిత్స రంగంలో తనదైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు. ఆమె నిర్వహిస్తున్న 'ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్థెటిక్స్' క్లినిక్లు ముంబై, హైదరాబాద్, నాగ్పూర్ మొదలైన నగరాల్లో ఉన్నాయి.డాక్టర్ స్తుతి ఖరే శుక్లా.. జుట్టు పెరుగుదల చికిత్స అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన జుట్టు రాలడం సమస్యలతో బాధపడుతున్న ఎందరో రోగుల జీవితాలను ఈమె మార్చివేశారు. దీంతో చికిత్సల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్యం, ఆసియా తదితర ప్రాంతాల నుంచి కూడా చాలామంది సంప్రదిస్తుంటారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న రోగులకు ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా చికిత్సా మార్గదర్శకాలు అందించడం సాంకేతికత ద్వారా సాధ్యమవుతోంది.బట్టతలకు చెక్బట్టతలతో బాధపడుతూ, కొన్ని సందర్భాల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్కు అనుకూలంగా లేని రోగులు కూడా నాన్-సర్జికల్ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ను ఆశ్రయిస్తున్నారు. వారసత్వంగా వచ్చే జుట్టు రాలడం, తీవ్రమైన బట్టతల, అరుదైన జన్యుపరమైన జుట్టు సమస్యలు, హార్మోన్ల కారణంగా వచ్చే హెయిర్ లాస్, పీసీఓడీకు సంబంధించిన జుట్టు రాలడం వంటి వివిధ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఆమె సేవలు అందిస్తున్నారు.ఒకప్పుడు బట్టతలతో.. కానీ ఇప్పుడుఅమెరికాలోని టెక్సాస్కు చెందిన హరీష్ రెడ్డి ఒకప్పుడు తీవ్రమైన బట్టతల సమస్యతో బాధపడ్డారు. జుట్టు పెరుగుదలకు గతంలో చాలా చికిత్సలు తీసుకుని నిరాశ చెందారు. కానీ స్తుతి అందించిన హెయిర్ ట్రీట్మెంట్ ద్వారా జుట్టు పెరుగుదలలో గణనీయమైన మార్పు కనిపించిందని ఆయన తన అనుభవాన్ని సంతోషంగా వెల్లడించారు.డాక్టర్ స్తుతి ఖరే శుక్లా చికిత్స గురించి మరింత తెలుసుకోవడానికి, @dr.stutikhareshukla ఇన్స్టాగ్రామ్ సందర్శించండి.అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి +91 626 196 7835 నంబర్కు కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ చేయవచ్చు.Instagram Page : https://instagram.com/dr.stutikhareshuklaWebsite : https://www.drstutikhareshukla.in/YouTube : https://youtube.com/@DrStutiKhareShuklaEmail : drstutikhareshukla@gmail.comDisclaimer : ఈ సమాచారాన్ని ఎలిమెంట్స్ ఆఫ్ ఏస్థటిక్స్ క్లినిక్స్ రూపొందించింది. -
కన్నబిడ్డనే అమ్మాలనుకుంది..
హైదరాబాద్: నవజాత శిశువును విక్రయించడానికి యత్నించిన మహిళపై కేసు నమోదు చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఎన్టీఆర్ నగర్కు చెందిన ముఖ్తార్ బేగ్ (62) చిన్న కుమార్తెకు సంతానం లేకపోవడంతో చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలనుకున్నారు. ఈ నెల 7న ఓ అపరిచిత మహిళ 8 రోజుల వయసున్న శిశువుతో వచ్చింది. రూ.లక్షకు పాపను అమ్ముతానంది. ఆమె ప్రవర్తనపై అనుమానంతో ముఖ్తార్ బేగ్ తిరస్కరించారు. 8న రాత్రి సదరు మహిళ మళ్లీ వచ్చి తన పెద్ద కుమార్తె పెళ్లికి డబ్బులు కావాలంటూ రూ.30 వేలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చింది. ఆమె ప్రవర్తనతో అనుమానించిన ముఖ్తార్ బేగ్.. వెంటనే ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించి, శిశువుతో సహా మహిళను పోలీసులకు అప్పగించారు. విచారణలో సదరు మహిళ బిహార్ రాష్ట్రం కిషన్గంజ్ జిల్లా దిఘల్బ్యాంక్ మండలం పలాస గ్రామానికి చెందిన లాల్మోన్ ఖాటూన్ (34), భర్త ఎండీ సుల్తాన్గా తేలింది. ప్రస్తుతం ఈమె పహాడీషరీఫ్లో కూలిపనులు చేస్తూ నివసిస్తోందని, విచారణలో ఆ మహిళే నవజాత శిశువుకు తల్లి అని నిర్ధారించారు. తల్లీబిడ్డలను రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణ పర్యవేక్షణలో ఉంచినట్లు ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. చదవండి: సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం! -
పుట్టింటికి పంపడం లేదని నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్: తనను పుట్టింటికి పంపడానికి భర్త నిరాకరిస్తున్నాడని మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన ముద్దం నాగలక్ష్మీ (18) వివాహం ఏడు నెలల క్రితం అదే జిల్లా తూడికుర్తి మండలానికి చెందిన మాదగాని శేఖర్ (32)తో జరిగింది. ఓ హోటల్లో పనిచేస్తున్న శేఖర్ భార్యతో కలిసి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–4లోని సుఖ్దేవ్నగర్లో ఉంటున్నాడు. కొంతకాలంగా నాగలక్ష్మీ పుట్టింటికి వెళ్తానని భర్తను అడుగుతోంది. కొద్ది రోజుల తర్వాత వెళ్లాలని శేఖర్ సర్దిచెప్పి డ్యూటీకి వెళ్లిన కొద్దిసేపటికే ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల రాఖీల పండుగ, బోనాల పండుగ సందర్భంగా అల్లుడు శేఖర్ తన కూతురిని పుట్టింటికి పంపలేదని, దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఎస్ఐ సంధ్యారాణి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం! -
కోకాపేట్లో ‘గోల్డెన్’ చాన్స్.. అ‘ధర’గొట్టిన భూములు
సాక్షి, సిటీబ్యూరో: కోకాపేట్ మరోసారి కేక పుట్టించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) బుధవారం కోకాపేట్ నియోపోలిస్, గోల్డెన్ మైల్ సైట్–1లోని స్థలాలకు ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించింది. ఈ బిడ్డింగ్లో గోల్డెన్ మైల్ సైట్–1లోని 0.70 ఎకరాల స్థలానికి భారీ స్పందన లభించింది. ఎకరాకు రూ.70 కోట్లుగా కనీస ధరను నిర్ణయించగా, బిడ్డింగ్లో ఎకరాకు రూ.115 కోట్ల లెక్కన రూ.81 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ స్థలం ట్రయాంగిల్లా ఉన్నప్పటికీ అంచనాలకు మించిన స్పందన లభించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నగరానికి పడమటి వైపున ఉన్న డిమాండ్ను ఇది మరోసారి చాటిచెప్పింది. గతంలో హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో ఎకరానికి కనీస ధర రూ.100 కోట్లు గా ప్రతిపాదించిగా అనూహ్యంగా రూ.151.25 కోట్లకు అమ్ముడైంది. ఈ సారి రూ.70 కోట్ల కనీస ధరపైన బిడ్డింగ్లో రూ.115 కోట్లకు అమ్ముడు కావడం గమనార్హం.నియోపోలిస్ మరోసారి... నియోపోలిస్ లేఅవుట్లోని ప్లాట్ నంబర్ 17లో ఉన్న 4.59 ఎకరాలకు కూడా బుధవారం బిడ్డింగ్ నిర్వహించారు. దీనికి ఒకే ఒక్క బిడ్ దాఖలైంది. ఈ బిడ్ ధర ఎకరాకు రూ.120 కోట్లుగా నమోదైంది. ఒకే బిడ్ రావడం వల్ల మరోసారి వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తెలంగాణలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్న్యూస్..
తెలంగాణ: రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఇచ్చిన ఏడేళ్ల వయోపరిమితి సడలింపునకు అదనంగా మరో మూడేళ్లు పెంచడంతో మొత్తం పదేళ్ల వరకు వయోపరిమితి సడలింపు అందుబాటులోకి వచ్చింది.తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టే నియామకాలకు ఈ సడలింపు వర్తించనుంది. పోలీస్ శాఖతో పాటు ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)లోని కానిస్టేబుల్ పోస్టులకు ఇది వర్తించనుంది. అలాగే, కానిస్టేబుల్తో సమాన హోదా కలిగిన ఇతర పోస్టులకు కూడా ఈ అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.దీంతో వయోపరిమితి కారణంగా ఇప్పటివరకు పోలీస్ ఉద్యోగాలకు దూరమైన పలువురు అభ్యర్థులకు మరోసారి అవకాశం లభించనుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా పోలీస్ నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ నిర్ణయం ఊరటనివ్వగా, రాబోయే నియామకాల్లో అర్హత కలిగిన మరికొందరు అభ్యర్థులు పోటీ పడేందుకు అవకాశం ఏర్పడింది.అయితే ఈ అదనపు మూడేళ్ల సడలింపుకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పోలీస్ శాఖలోని పీసీ డ్రైవర్ పోస్టులకు ఈ సడలింపు చెల్లదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులకు సంబంధించిన వయోపరిమితి నిబంధనలను ప్రత్యేకంగా పరిశీలించాలి.ఈ వయోపరిమితి పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9, 2026న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఏడేళ్ల సడలింపునకు మరో మూడేళ్లు కలపడంతో మొత్తం పదేళ్ల వరకు సడలింపు లభించనుంది.దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్ విభాగాల్లో కానిస్టేబుల్, సమాన హోదా పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చనుంది. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న వయస్సు, విద్యార్హతలు, శారీరక ప్రమాణాలు, ఇతర అర్హతలను అభ్యర్థులు తప్పనిసరిగా పరిశీలించాలని ప్రభుత్వం సూచించింది.ఇవి కూడా చదవండి: ఇందిరమ్మ టవర్స్ డిపాజిట్ వాపస్ -
ఆటగాళ్ల వేలం పూర్తి.. సీజన్-2 కూడా హైదరాబాద్లోనే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో క్రీడా ఉత్సాహాన్ని నింపిన ‘సెంటర్ కోర్ట్ పికిల్బాల్ లీగ్’ (సీసీపీఎల్) రెండో సీజన్కు కూడా మళ్లీ హైదరాబాదే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఆటగాళ్ల వేలం పూర్తయింది. థాయిలాండ్లోని ఫుకెట్ వేదికగా సెప్టెంబరు 3 నుంచి 6 వరకు నిర్వహించిన సీజన్-2 ఆటగాళ్ల వేలం ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. గత ఏడాది 'హైదరాబాద్ పికిల్బాల్ లీగ్' (హెచ్పీఎల్) పేరిట 8 ఫ్రాంచైజీ జట్లతో ప్రారంభమైన ఈ టోర్నీ ఇప్పుడు 'సీసీపీఎల్'గా మరింత ఆకర్షణీయంగా రెండో సీజన్కు సిద్ధమైంది. ఈ లీగ్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది.ముగిసిన ఆటగాళ్ల వేలం..రిటెన్షన్ల హంగామాపుకెట్లోని 'కోకోనట్ పికిల్బాల్ సెంటర్'లో రెండో సీజన్ కోసం క్రీడాకారుల వేలం నిర్వహించారు. దీనికి ముందే పలు ఫ్రాంచైజీలు తమ కీలక ఆటగాళ్లను రిటెయిన్ చేసుకున్నాయి. గత సీజన్ చాంపియన్ మ్యావెరిక్స్ జట్టు శ్రీకర్ మొతుకూరిని అట్టిపెట్టుకోగా, రన్నరప్ ఆల్ స్టార్స్ జట్టులోకి సమీర్ వర్మ తిరిగి వచ్చాడు. మిఖిల్ తుమ్మలపల్లి, వివేక్ రెడ్డి తమ పాత ఫ్రాంచైజీల తరఫునే బరిలోకి దిగనున్నారు. కరుణేష్ రెడ్డి, అభయ వేమూరి, గోపీనాథ్ రెడ్డి కూడా రిటెయిన్ ఆటగాళ్ల జాబితాలో నిలిచారు.పూర్తి కొత్త జట్టుతోమరోవైపు.. చార్జర్స్ జట్టు మాత్రం భిన్నమైన వ్యూహాన్ని అమలు చేసింది. ఒక్కరిని కూడా రిటెయిన్ చేసుకోకుండా నేరుగా ఫుల్ బడ్జెట్తో వేలంలోకి దిగి కొత్త జట్టును నిర్మించుకుంది. రిటెన్షన్ తర్వాత మిగిలిన స్థానాలను భర్తీ చేసేందుకు ఆయా ఫ్రాంచైజీలు వేలంలో పోటాపోటీగా తలపడ్డాయి.ఆరు వారాల్లో రెండో సీజన్"లీగ్ ప్రస్థానం హైదరాబాద్లోనే ప్రారంభమైంది. ఇక్కడి నుంచే ఫ్రాంచైజీ ఆధారిత పికిల్బాల్ లీగ్ సామర్థ్యాన్ని గుర్తించాం. తొలి సీజన్ అనుభవాలతో రెండో సీజన్ ను మరింత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం" అని సెంటర్ కోర్ట్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకుడు యశ్వంత్ బియ్యాల తెలిపారు. మరో సహ వ్యవస్థాపకుడు విక్రాంత్ రావు మాట్లాడుతూ.. ఆటగాళ్ల రిటెన్షన్లు, ప్రీ-ఆక్షన్ పిక్స్ ద్వారా ఈ సీసన్లో ఫ్రాంచైజీల వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయో స్పష్టమైందని పేర్కొన్నారు. పుకెట్లో వేలం ప్రక్రియ పూర్తి కావడంతో లీగ్ ప్రారంభానికి ఆరు వారాల సమయం ఉంది. జట్లన్నీ సమాయత్తమవ్వడానికి ఇది సరైన సమయమని నిర్వాహకులు వెల్లడించారు. -
కుళ్లిన మాంసం.. పాడైన కేకులు.. ఏం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: నగరంలో అంతటా రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లలో టీజీ సేఫ్ బృందం తనిఖీలు చేపట్టింది. కూకట్పల్లిలో భూలక్ష్మీ మెస్లో కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఉప్పల్ పిస్తా హౌస్లో..కాగా, ఉప్పల్ బ్రాంచ్ పిస్తా హౌస్ కేక్ తిన్న ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. కుళ్లిపోయిన కేక్ అమ్మారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేక్ తిన్న కాసేపటికే వాంతులు అయ్యాయన్న బాధితులు.. కేక్ నుంచి దుర్వాసన వచ్చిందని చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇటీవల అత్తాపూర్లోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో హెచ్– ఫాస్ట్, ఫుడ్సేప్టీ అధికారుల తనిఖీల్లో ఫ్రిజ్లో కుళ్లిన మాంసాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. గడువు ముగిసిన ఐస్క్రీమ్లు, కుళ్లిపోయిన పండ్లను గుర్తించారు. ఏప్రిల్ నెలలో మంగళ్హాట్లో కుళ్లిపోయిన మేకలు, గొర్రెల మాంసం విక్రయ గోడౌన్పై పోలీసులు దాడులు నిర్వహించగా.. సుమారు వెయ్యి కిలోల మాంసం విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు.నగరంలోని పలు హోటళ్లకు, రెస్టారెంట్లకు, ఫంక్షన్ హాళ్లలో జరిగే శుభ కార్యాలకు మాంసాన్ని సరఫరా చేస్తున్నాడు. మహారాష్ట్ర, హరియాణా, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల నుంచి అఫ్రోజ్ నాణ్యత లేని మాంసాన్ని విడిభాగాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.ఇదీ చదవండి: మాస్క్ పెట్టుకున్నా.. మచ్చ పట్టించింది! -
ఆర్మీ ఆయుధాల చోరీ కేసు.. కీలక విషయాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో ఆయుధాలు ఒకేసారి చోరీ కాలేదని అధికారులు విచారణలో గుర్తించారు. 3 నెలలుగా ఆయుధాలు ఒక్కొక్కటిగా మాయమైనట్లు తెలిపారు. 4 ఏకే 47 రైఫిల్స్, 2 రైఫిల్స్, 9పిస్టోల్స్ చోరీ జరిగినట్లు గుర్తించారు. 2 వేలకు పైగా బుల్లెట్లు చోరి అయినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఆయుధాల చోరీ కేసులో ముగ్గురు అధికారులను ఆర్మీ ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. -
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-
AlphaGeo: డేంజర్ జోన్ లో హైదరాబాద్.. ప్రకృతి వార్నింగ్
-
రష్మీ.. మమకారం
పెంపుడు జంతువులు ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానమని, వాటి పరిరక్షణ చాలా అవసరమని నటి రష్మీ గౌతమ్ అన్నారు. మంగళవారం శ్రీనగర్కాలనీలో ‘ది ఎనిమల్ ప్లేస్’ పేరిట ఏర్పాటు చేసిన వెటర్నరీ క్లినిక్ను ఆమె ప్రారంభించారు. పెంపుడు జంతువులు మానసిక ప్రశాంతత, సంతోషాన్ని అందిస్తాయన్నారు. పెంపుడు జంతువుల కోసం అత్యాధునిక చికిత్సలు, సేవలను అందిస్తున్నామని డాక్టర్ సలీం మస్కటీ, డాక్టర్ మార్షా గాబ్రియేల్ పేర్కొన్నారు. -హైదరాబాద్ -
ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)
-
మాస్క్ పెట్టుకున్నా.. మచ్చ పట్టించింది!
హైదరాబాద్: పోలీసులు గుర్తించకుండా మాస్క్ పెట్టుకొని దొంగతనానికి పాల్పడిన నిందితుడిని కనురొమ్మలపై గాయం వల్ల ఏర్పడిన ఓ మచ్చ పట్టించింది. దొంగతనం జరిగిన 48 గంటల్లోనే జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్రోడ్ నెం.10లో నివసించే ప్రముఖ మద్యం వ్యాపారి శైలేందర్ సింగ్ బగ్గా ఇంట్లోకి గత నెల 31న ఓ దొంగ ప్రవేశించి అల్మారాలోని నగలు తస్కరించి పరారయ్యారు.అంతకుముందు ఇదే రోడ్డులో రెండు ఇళ్లల్లో దొంగతనానికి యత్నించి విఫలమై మూడో ఇల్లు శైలేందర్ సింగ్ బగ్గా ఇంట్లో పది తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించగా ఆయన భార్య నీలు కౌర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఇక్కడ సీసీ ఫుటేజీలు, వేలి ముద్రలు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి మాస్క్ ధరించగా కనురొమ్మలపై గాయం వల్ల ఏర్పడ్డ ఓ మచ్చను పోలీసులు గమనించారు. పాత నేరస్తుల కదలికలను పరిశీలించిన కనురొమ్మలపై మచ్చ ఉన్న వ్యక్తిని గుర్తించారు.గత నెల మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసిన కేసులో నిందితుడి వివరాలు నమోదయ్యాయి. ఈ మచ్చ ఆధారంగా పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించి నిందితుడిని గుర్తించారు. పెందుర్తికి చెందిన గౌరేష్(27) బంజారాహిల్స్రోడ్ నెం. 2లోని ఇందిరానగర్లో అద్దెకు ఉంటూ జూనియర్ ఆరి్టస్ట్గా పని చేస్తున్నాడు. ఈజీ మనీ కోసం దొంగతనాలపై దృష్టి పెట్టాడు. శైలేందర్ సింగ్ బగ్గా ఇంట్లో పది తులాల బంగారం దొంగతనం చేసి అందులో కొంత విక్రయించి గోవాకు ఫ్లైట్లో వెళ్ళాడు.గోవాలో ఓ క్యాసినోలో జూదం ఆడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకొచ్చారు. బంగారం రికవరీ చేసే దిశలో పలు కోణాల్లో విచారణ కొనసాగుతున్నది. చోరీ జరిగిన 48 గంటల్లోనే క్రైం పోలీసులు నిందితుడిని పట్టుకోవడంలో విజయం సాధించారు. నిందితుడు గౌరేష్ గతంలో మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోనూ దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చి పేకాట కోసం జూబ్లీహిల్స్లో దొంగతనం చేశాడు. -
కేటీఆర్ అరెస్టు.. ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఎర్రవల్లికి బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను హకీంపేట వద్ద పోలీసులు అరెస్టు చేసి బోయిన్పల్లి పీఎస్కు తరలించడంతో బోయిన్పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఆయనకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు బోయిన్పల్లి పోలీసు స్టేషన్కు తరలివచ్చారు.ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ పరస్పర దాడులకు దారితీసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేటీఆర్ను బోయిన్పల్లికి తరలిస్తున్నారని సమాచారం అందుకున్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్, బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్లు పెద్ద సంఖ్యలో అనుచరులతో పీఎస్ వద్దకు చేరుకున్నారు. కేటీఆర్ను పోలీసు స్టేషన్లోపలికి తీసుకెళ్లకుండా వాహనాలకు అడ్డుపడ్డారు.సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, గూడెం మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు అసెంబ్లీ నుంచి నేరుగా బోయిన్పల్లి పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. ఇంతలోనే స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సైతం అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడటంతోపాటు వారిని పోలీసు స్టేషన్ ఆవరణ నుంచి తరిమేయడం ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. కేటీఆర్ను సాయంత్రం 4 గంటల వరకు పోలీసు స్టేషన్లోనే నిర్బంధించారు. చివరకు ఆయనను సొంతపూచీకత్తుపై విడుదల చేయగా, అక్కడే విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఖండిస్తూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేటీఆర్, హరీశ్రావుపై క్రిమినల్ కేసు సాక్షి, హైదరాబాద్: శాసనసభ గేట్ నంబర్–3 వద్ద సోమవారం చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై సైఫాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. ఇందులో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనభాపక్ష ఉప నేత టి.హరీశ్రావు సహా 14 మంది ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్నారు.పోలీసులపై తోపులాట, దాడి, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సైఫాబాద్ పోలీసులకు ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలస్వామి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేపట్టారు. వీరిలో ఎవరిపాత్ర ఏమిటో తేల్చ డానికి వివిధ వీడియోలు, ఫొటోలు అధ్యయనం చేస్తున్నారు. గేట్–3 వద్ద జరిగిన మొత్తం ఘటన వీడియో ఫుటేజీలో నమోదై ఉన్నట్లు ఫిర్యాదులో తెలిపారు.సీసీ కెమెరా దృశ్యాలు, అసలు వీడియో రి కార్డింగుల ఆధారాలను సేకరించి ప్రతి ఒక్కరి పాత్ర ను నిర్ధారించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్, హరీశ్రావుతోపాటు డి.సు«దీర్రెడ్డి, గంగుల, పాడి కౌశిక్రెడ్డి, జి.జగదీశ్వర్రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, కోవా లక్ష్మీ, సబిత, సంజయ్, విజయు డు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, తాతా మధు, నవీన్ కుమార్రెడ్డిని నిందితులుగా పేర్కొన్నారు.ఇవి కూడా చదవండి: తప్పు చేసిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి -
తప్పు చేసిన సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతామధుతోపాటు మరో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డిలపై కఠిన చర్యలు తీ సుకోవాలని పలువురు మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. స్పీకర్ను అవమానించడం బీఆర్ఎస్ అహంకారపూరిత ధోరణికి నిదర్శనమని వారు ఆరోపించారు.మరోవైపు నల్లబ్యాడ్జీలతో మండలికి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. సభ జరుగుతున్నంత సేపు వెల్లోకి దూసుకొచ్చి ‘వీ వాంట్ జస్టిస్.. పోలీసుల దౌర్జన్యం నశించాలి.. అక్రమ కేసులు ఎత్తివేయాలి’అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో సభను చైర్మన్ పలుసార్లు వాయిదా వేశారు. మంగళవారం చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సభను ప్రారంభిస్తూ..సోమవారం సభ బయట జరిగిన ఘటనల్లో ఇద్దరు ఎమ్మెల్సీలపై కేసు నమోదు చేసిన విషయాన్ని సభ్యుల దృష్టికి తెచ్చారు. అనంతరం ఈ అంశంపై చర్చను ప్రారంభించారు.కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ‘నిన్న జరిగిన సంఘటన బాధాకరం. స్పీకర్ పదవి అత్యంత గౌరవప్రదమైనదని, ఆ పదవిలో ఉన్న వ్యక్తిపై కులపరమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. తాతా మధు వ్యాఖ్యలతో ప్రజల్లో సభ పట్ల ఉన్న గౌరవం సన్నగిల్లే అవకాశం ఉంది’మహేశ్గౌడ్ అన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను అరగంట వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ గుత్తా ప్రకటించారు.అనంతరం సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ గతంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శంభీపూర్రాజు, తాతా మధు, నవీన్కుమార్లు తనపై పుస్తకాలు చించి విసిరారని, ఆ పుస్తకాల్లోని పిన్నులు గుచ్చుకుంటే గాయం అయ్యేదని..పెద్దల సభలో సభ్యులు హుందాగా ప్రవర్తించాలని పదేపదే సూచిస్తున్నట్టు తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు వారి స్థానాల్లోకి వెళ్లి కూర్చుంటే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు కొనసాగించారు. అనంతరం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ స్పీకర్పై పరుషపదజాలం వాడడం నిమ్న జాతులను అవమానించడమేనని, ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ది దళిత వ్యతిరేక స్వభావమని విమర్శించారు. మహిళా పోలీసులపైనా బీఆర్ఎస్ సభ్యులు దాడి చేశారని, ఈ విషయంపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. సబితాఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల విషయంలో దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, స్పీకర్పై అవమానకరమైన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ స్పీకర్ను ఎమ్మెల్సీ తాతా మధు అసభ్య పదజాలంతో దూషించడం దురదృష్టకరమన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, స్పీకర్ అంటే పారీ్టలకతీతంగా గౌరవం ఇవ్వాలని, అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ళీ అంతకు ముందు ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, శంకర్నాయక్, ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ దళితులపట్ల బీఆర్ఎస్ ఈ ధోరణి సరికాదన్నారు. అనంతరం టీ బ్రేక్ ఇస్తూ చైర్మన్ సభను వాయిదా వేశారు.ఇవి కూడా చదవండి: ఫామ్హౌస్లో జరిగిన కుట్రే -
ఫామ్హౌస్లో జరిగిన కుట్రే
సాక్షి, హైదరాబాద్: శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్పై ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు యావత్ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని, ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన అవమానం కాదని, మొత్తం చట్టసభకు జరిగిన ఘోర అవమానమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో రచ్చ ఆషామాషీగా జరిగింది కాదని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని చెప్పారు. ఈ నెల 7 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమైతే..ఒక రోజు ముందు 6వ తేదీన ఫామ్హౌస్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం పెట్టి కుట్రకు తెరలేపారని తీవ్ర ఆరోపణలు చేశారు.ఉగ్రవాద సంస్థలు తమ భావజాలాన్ని నూరిపోసి పంపించిన తరహాలో బీఆర్ఎస్ సభ్యులను ప్రేరేపించి పంపించారని విమర్శించారు. కుట్రదారుల డైరెక్షన్లో కొందరు బీఆర్ఎస్ సభ్యులు పాత్రధారులుగా సభలో ప్రవర్తించారని, ప్రధాన సూత్రధారులు బీఆర్ఎస్ అత్యున్నత నాయకత్వమేనని విమర్శించారు. స్పీకర్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం శాసనసభలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రతిపాదించిన తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ డిప్యూటీ సీఎం మాట్లాడారు. సభాపతి తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం.. తెలంగాణ సమాజం సంస్కారం, సంస్కృతి, మహిళల గౌరవానికి సంబంధించిన సమస్య అని భట్టి విక్రమార్క అన్నారు.రూపుమాపని మానసిక అస్పృశ్యత: దామోదర స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా మానసిక అస్పృశ్యత రూపుమాపలేదని మంత్రి దామోదర రాజనర్సింహ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మాకు అవమానాలు, పోరాటాలు కొత్తకాదు. దళితుల చరిత్ర అంటే పోరాటాల చరిత్ర. ఆత్మగౌరవ చరిత్ర. ఆత్మగౌరవమే మా అలంకారం. ఆత్మగౌరవమే మా స్ఫూర్తి. ఆ ఆత్మగౌరవంతోనే ఈ స్థాయికి వచ్చాం’అని మంత్రి అన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగితే యువత తిరగబడుతుందని, ముఖ్యంగా దళిత సమాజాన్ని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి, ఎన్నో కష్టాలను అధిగమించి అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ స్పీకర్గా ఉన్నత స్థానానికి చేరుకున్న గడ్డం ప్రసాద్కుమార్ను అవమానించడం బాధాకరమన్నారు.ఇవీ చదవండి: తిట్టింది నా తల్లిని.. నీ తల్లిని కాదు -
తిట్టింది నా తల్లిని.. నీ తల్లిని కాదు
సాక్షి, హైదరాబాద్: రెండోరోజూ శాసనసభ అట్టుడికింది. మంగళవారం జరిగిన సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య, స్పీకర్–హరీశ్రావు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే సోమవారం అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణ.. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం.. అదే సమయంలో సభాపతి గడ్డం ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం సభను కుదిపేసింది.సభలో సభ్యులను ఉద్దేశించి అంతగా మాట్లాడని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురై హరీశ్రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. హరీశ్రావు లేచి సోమవారం జరిగిన ఘటనను ప్రస్తావించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. ‘మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగింది. వారిపై కేసులు పెట్టారు. మరి వారిపై దాడి చేసిన పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారు? ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు.ఆగ్రహించిన స్పీకర్– హరీశ్పై ఆగ్రహంహరీశ్ మాటలపై స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ వెంటనే స్పందించారు. మహిళా సభ్యుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని స్పష్టం చేశారు. జరిగిన ఘటనపై ఇప్పటికే పోలీసుల నుంచి నివేదిక కోరినట్టు చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటానన్నారు. స్పీకర్ సమాధానంతో సంతృప్తి చెందని బీఆర్ఎస్ సభ్యులు నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ బెదిరింపులకు నేను భయపడను. మీరు చేస్తున్నది తప్పు’అంటూ ప్రతిపక్ష సభ్యులను హెచ్చరించారు. అంతలోనే అసెంబ్లీ బయట తనపై, తన తల్లిపై చేసిన వ్యాఖ్యల అంశాన్ని స్పీకర్ ప్రస్తావించారు. ‘మీరెందుకు ఆవేశపడుతున్నారు హరీశ్ ? నా సంగతేంటో చెప్పు? మీ తల్లిని ఎవరూ తిట్టలేదు. నా తల్లిని తిట్టారు. మీరు ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఆవేశపడాల్సింది నేను. బీఆర్ఎస్ నాయకులు మీ తల్లి గురించి మాట్లాడలేదు.. నా తల్లి గురించి మాట్లాడారు. దీనిపై ఏం చేద్దామో ముందు చెప్పండి’అని స్పీకర్ తీవ్ర భావోద్వేగానికి గురవడంతో సభలో కొద్దిసేపు నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.స్పీకర్ను అవమానిస్తే ఊరుకుంటారా : మంత్రి శ్రీధర్బాబుఈ సమయంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు జోక్యం చేసుకున్నారు. మహిళా ఎమ్మెల్యేల ఘటనపై ప్రభుత్వం కూడా నివేదిక కోరిందని, నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్పారు. అదే సమయంలో సభాపతిని అవమానించేలా వ్యవహరించడం, బెదిరించడం సరికాదన్నారు. సభ్యుడు రాంచంద్ర నాయక్ కూడా బీఆర్ఎస్పై తీవ్రంగా మండిపడ్డారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ స్పీకర్ స్థానంలో దళితుడిని కూర్చోబెట్టడం ఇష్టం లేకనే కేసీఆర్ సభకు రావడం లేదని ధ్వజమెత్తారు. గతంలో దళితులను అవమానించిన చరిత్ర కేసీఆర్దని, స్పీకర్పై కాగితాలు విసిరారని దళితుడైన సంపత్కుమార్ను, కోమటిరెడ్డిని సభ నుంచి బహిష్కరించారని గుర్తు చేశారు.మహిళలను ముందు పెట్టి.. మీరు వెనుకా: సీతక్కఅసెంబ్లీ వద్ద జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ.. సబితా ఇంద్రారెడ్డిని ఎవరు తోశారని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టి మీరు వెనుక ఉండటం ఏమిటని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారిపై బీఆర్ఎస్ నేతలు చేయిచేసుకున్నారని, దీనికి సంబంధించిన దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.వెల్లోకి బీఆర్ఎస్ సభ్యులుఇరువర్గాల వాదనలు కొనసాగుతుండగా బీఆర్ఎస్ సభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభా వెల్లోకి వెళ్లారు. కొందరు సభ్యుల చేతుల్లో ఉన్న ప్లకా ర్డులను చీఫ్ మార్షల్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడి యం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళం మరింత పెరిగింది. బీఆర్ఎస్ మహిళా సభ్యులపై జరిగిన దౌర్జన్యం. అవమానంపై ప్లకార్డులు పెట్టుకొని పోడియంలోకి సభ్యులు మళ్లీ దూసుకెళ్లారు.22ఏపై బీజేపీ ఆందోళనబీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి 22ఏ నిషేధిత జాబితా అంశంపై చర్చకు పట్టుబట్టా రు. బీజేపీ సభ్యులు కూడా ప్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో సభలో ఒకవైపు బీఆర్ఎస్–కాంగ్రె స్ మధ్య వాగ్వాదం, మరోవైపు 22ఏ అంశంపై బీజే పీ నిరసనతో పరిస్థితి మరింత గందరగోళంగా మా రింది. బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లడంతో మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండటంతో సభను కొనసాగించే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో స్పీకర్ సభను ఉదయం 10.45 గంటలకు వాయిదా వేశారు. సభ వాయిదా అనంతరం సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పీకర్ చాంబర్కు వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆ తర్వాత సభ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తిరిగి ప్రారంభమై కొనసాగింది. క్షమాపణ చెప్పాడు.. మళ్లీ ఎందుకు: హరీశ్రావుహరీశ్రావు మరోసారి జోక్యం చేసుకొని.. స్పీకర్ పట్ల తమకు గౌరవం ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఇప్పటికే క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. ఆ వ్యాఖ్యలపై కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు. ‘స్పీకర్ గారంటే మాకు గౌరవం ఉంది. వ్యక్తిగతంగా కూడా మీ పట్ల గౌరవం ఉంది. అయితే మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒక తప్పుకు ఎన్ని శిక్షలు వేస్తారు’అని ప్రశ్నించారు.ఇవి కూడా చదవండి: అసలు హరీశ్రావుకు మైక్ ఇవ్వొద్దు.. కానీ ఇచ్చా -
హబ్లో జోరు.. హుషారు
కథ డిమాండ్ చేస్తే చాలు.. తమ సినిమాల షూటింగ్స్ కోసం దేశ విదేశాలు చుట్టేస్తుంటారు మేకర్స్. పైగా తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా పరిధి దాటి అంతర్జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటుతోంది. అందుకే కాబోలు స్వదేశంతో పాటు బడ్జెట్ ఎక్కువ అయినా విదేశాల్లోనూ షూటింగ్స్కి ఏమాత్రం వెనకాడటం లేదు. పలు సినిమాల చిత్రీకరణలు మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరుగుతుంటే మరికొన్ని మూవీస్ షూటింగ్స్ విదేశాల్లోనూ జరుగుతున్నాయి.అయితే మెజారిటీ సినిమాలు మాత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమ హబ్గా చెప్పుకునే హైదరాబాద్లోనే జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో పలు సినిమా షూటింగ్లు జోరుగా, హుషారుగా సాగుతున్నాయి. చిరంజీవి, ప్రభాస్, మహేశ్బాబు, గోపీచంద్, శర్వానంద్, శ్రీ విష్ణు... వంటి పలువురు హీరోలు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారు. మరి... ఆ విశేషాలేంటో ఓ లుక్కేద్దాం. కాలేజ్లో కాకా... చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’. ఈ సినిమాకి బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా ఇది. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాలో నివేతా పేతురాజ్, అనశ్వర రాజన్, సునీల్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని సిటీ కాలేజ్లో జరుగుతోంది.ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట డైరెక్టర్ బాబీ. చిరంజీవిని ఇప్పటి వరకు చూడని సరికొత్త తరహా పాత్రలో చూపించనున్నారట ఆయన. ‘‘చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేసిన ‘కాకా’ టైటిల్ గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా ప్రకటన నుంచే ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ గ్లింప్స్ స్టైల్, యాక్షన్, మాస్ అప్పీల్తో ఆ అంచనాలను మరింత పెంచింది. చిరంజీవిని రెండు విభిన్నమైన లుక్స్లో చూపించిన విధానం, పవర్ఫుల్ విజువల్స్, మ్యూజిక్, యాక్షన్ కలిసి గ్లింప్స్ను ఆసక్తికరంగా మార్చాయి. మిడిల్ క్లాస్ అవతార్లో చిరంజీవి చాలా సహజమైన చార్మ్తో కనిపించగా, యంగ్ వెర్షన్లో ఆయన యాటిట్యూడ్, ఎనర్జీ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ తన డైనమిక్ విజువల్స్తో గ్లింప్స్ను మరింత ఆసక్తికరంగా మలిచారు. తమన్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాను నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లేలా ఉంటాయి. ‘గ్యాంగ్ లీడర్’ మూవీలోని ఐకానిక్ ‘గ్యాంగ్ గ్యాంగ్...’ పాటను రీమిక్స్ చేసి ఉపయోగించడం నోస్టాల్జియాతో పాటు చిరంజీవి స్టైల్కు మరింత స్వాగ్ను జోడించింది. సంక్రాంతి సందర్భంగా ‘కాకా’ సినిమాని 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. అజీజ్ నగర్లో... వరుస పాన్ ఇండియన్ మూవీస్తో దూసుకెళుతున్నారు ప్రభాస్. ఏకకాలంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నారాయన. ఓ వైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం చేస్తున్న ప్రభాస్.. మరోవైపు ‘ఫౌజీ’ మూవీలో నటిస్తున్నారు. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ప్రభాస్తో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి. ‘‘భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీగా ‘ఫౌజీ’ని రూపొందిస్తున్నాం. ఇప్పటివరకూ ఎప్పుడూ కనిపించని రగ్డ్, ఎమోషనల్ లుక్లో కనిపించనున్నారు ప్రభాస్. డిసెంబరు 3న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించి, విడుదల చేసిన ప్రభాస్ సరికొత్త పోస్టర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన ఓ యోధుడిలా, రక్తంతో తడిసిన దుస్తులు, శరీరమంతా గాయాలతో, చుట్టూ నేలకూలిన సైనికుల మధ్య తుపాకీని పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చున్న ప్రభాస్ లుక్ అందర్నీ బాగా ఆకట్టుకుంది. 2026లో అత్యంత భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘ఫౌజీ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా డిసెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. శంషాబాద్లో... మహేశ్బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వారణాసి’. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లో మహేశ్బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. ‘‘సూపర్స్టార్ మహేశ్బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ‘వారణాసి’ నుంచి మహేశ్ రెండు స్పెషల్ స్టిల్స్ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రెండు స్టిల్స్ చూస్తే ‘వారణాసి’ సినిమా సోల్, రుద్ర పాత్ర తీరు అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. శతాబ్దాలను దాటి ప్రపంచాన్ని చుట్టివచ్చే ఓ వ్యక్తి ప్రయాణంగా సాగే ఇతిహాసం ఇది. ఇందులో ఒక వ్యక్తి అసాధారణ ప్రయాణం అతడిని భారతదేశంలోని పవిత్ర జలాల నుంచి భూమి మారుమూల ప్రాంతాలకు తీసుకువెళుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వారణాసి’ని గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు, 120 దేశాల్లో విడుదల చేసేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ‘వారణాసి’లో శ్రీరాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు మహేశ్. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్లో విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ’. ఈ చిత్రం ద్వారా ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనార్కలి నజర్ హీరోయిన్గా తెలుగులో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. గోపీచంద్తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ‘‘విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ ‘సింగ’ వంటి భారీ ప్రాజెక్ట్తో ముందుకొస్తోంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 12న ‘సింగ’ టైటిల్తో పాటు ఆయన లుక్ను రివీల్ చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.యాక్షన్, ఎమోషన్, డ్రామా కలగలిపిన పవర్ఫుల్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. గోపీచంద్ను కొత్త కోణంలో చూపించేలా వెంకట్ ఒక గ్రిప్పింగ్ కథని సిద్ధం చేశారు. ఈ మూవీ నుంచి గడ్డం, మీసం, చెవిపోగు, రక్తం, చెమటతో కనిపించే రగ్డ్ అవతార్లో రిలీజ్ చేసిన గోపీచంద్ లుక్ ఆయన అభిమానులకు పర్ఫెక్ట్ బర్త్డే ట్రీట్గా నిలిచింది. టైటిల్ టీజర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో రూపొందింది. ఫైట్ మాస్టర్గా సక్సెస్ అందుకున్న వెంకట్ దర్శకుడిగా హీరోను ఎంత పవర్ఫుల్ మాస్ లుక్లో చూపించారో ఈ గ్లింప్స్తోనే నిరూపించారు. ఈ సినిమా కోసం గోపీచంద్ ట్రాన్స్ఫర్మేషన్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. కెమెరామెన్ షామ్దత్. అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో గ్రాండ్గా తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు అద్భుతమైన సినీ అనుభూతిని అందించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం ’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ముచ్చింతల్లో... శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఆరంభం అయింది. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతో పాటు ముఖ్యమైన నటీనటులు పాల్గొంటున్నారట. ‘‘పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘భోగి’. శర్వానంద్–సంపత్ నందిల కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్ ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన, లెన్తీ యాక్షన్ షెడ్యూల్ను రంపచోడవరం అడవుల్లోని కఠినమైన, సవాల్తో కూడిన ప్రదేశాల్లో తెరకెక్కించాం. దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో రూపొందించిన ఈ పోరాట సన్నివేశాలు సినిమాకి హైలెట్గా నిలుస్తాయి. ఈ చిత్రంలోని శర్వానంద్ రగ్డ్, గ్రాండ్ స్కేల్ విజన్కు ప్రశంసలు లభించాయి. పల్లెటూరి యువతిగా కథానాయిక అనుపమా పరమేశ్వరన్ కనిపించిన ఫస్ట్ లుక్కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాని ఆగస్టు 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ వాయిదా పడింది. శంకర్పల్లిలో... హీరో శ్రీ విష్ణు–డైరెక్టర్ రామ్ అబ్బరాజులది హిట్æ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘సామజ వరగమన’. ఈ మూవీలో రెబ్బా మోనికా జాన్ హీరోయిన్గా నటించారు. అనిల్ సుంకర, రాజేష్ దండ నిర్మించిన ఈ మూవీ 2023 జూన్ 28న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులకు పూర్తి వినోదాలు అందించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టింది.‘సామజ వరగమన’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, యలమంచి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘వెన్నెల’ కిషోర్, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. శ్రీవిష్ణుతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెకక్కిస్తున్నారట రామ్ అబ్బరాజు. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపిస్తుందని యూనిట్ పేర్కొంది. ఆర్ఎఫ్సీలో... తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో వరలక్ష్మి శరత్కుమార్, సముద్ర ఖని, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషించారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024 జనవరి 12న విడుదలైన బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘జై హనుమాన్’ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆంజనేయస్వామి పాత్రను ‘కాంతారా’ మూవీ ఫేమ్ రిషభ్ శెట్టి పోషిస్తున్నారు.‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ హంపీలోని అంజనాద్రి బెట్టలో ఆరంభం అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... ‘జై హనుమాన్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ వర్మ. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేశాడు? అన్న నేపథ్యంలో ‘జై హనుమాన్’ రూపొందుతోంది. ‘హనుమాన్’లో హనుమంత్గా నటించిన తేజ సజ్జా ‘జై హనుమాన్’లోనూ అదే పాత్రలో కనిపించనున్నారు. హీరో రానా దగ్గుబాటి ఓ కీలక పాత్ర పోషించనున్నారట.సంబరాల జోరు ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతుండగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్పై ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లిలో జరుగుతోంది. సాయిదుర్గా తేజ్తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలు రూపొందిస్తున్నారట రోహిత్ కేపీ. ‘‘ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది’’ అని యూనిట్ పేర్కొంది.ఇదిలా ఉంటే... పైన పేర్కొన్న సినిమాలే కాదు... మరికొన్ని సినిమాల చిత్రీకరణలు కూడా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
తెలంగాణ పోలీస్ శాఖలో బదిలీలు.. కొత్త పోస్టింగ్లు
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో 17 మంది డీఎస్పీ స్థాయి అధికారులకు బదిలీలు, పోస్టింగ్లు కల్పిస్తూ డీజీపీ సి.వి.ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫారసుల మేరకు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ అయిన అధికారులను వెంటనే రిలీవ్ చేసి, వారికి కేటాయించిన కొత్త స్థానాల్లో విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత యూనిట్ అధికారులను డీజీపీ ఆదేశించారు.అధికారులు ఎవరెవరు.. ఎక్కడికి బదిలీ అయ్యారంటే..?1. కె. బాలకృష్ణారెడ్డి – వెయిటింగ్లో ఉన్న ఆయనను మల్కాజిగిరి సైబర్ క్రైమ్స్ ఏసీపీగా నియమించారు.2. ఎస్.జి. శివశంకర్ – ప్రస్తుతం మల్కాజిగిరి సైబర్ క్రైమ్స్ ఏసీపీగా ఉన్న ఆయనను బదిలీ చేసి హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.3. ఎస్కే అబ్దుల్ రహ్మాన్ – వెయిటింగ్లో ఉన్న ఆయనకు జయశంకర్ భూపాలపల్లి డీసీఆర్బీ డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు.4. ఏ. రవికుమార్ – వెయిటింగ్లో ఉన్న ఆయనను జగిత్యాల డీసీఆర్బీ డీఎస్పీగా నియమించారు.5. బి. నందిరామ్ నాయక్ – వెయిటింగ్లో ఉన్న ఆయనకు హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలోని డీజీ కంట్రోల్ రూమ్ డీఎస్పీగా బాధ్యతలు అప్పగించారు.6. బి. సోమ్నారాయణ్ సింగ్ – వెయిటింగ్లో ఉన్న ఆయనను తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ) డీఎస్పీగా నియమించారు.7. జె. వెంకటేశ్వర్రావు – వెయిటింగ్లో ఉన్న ఆయనకు మెదక్ డీసీఆర్బీ డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు.8. బి. కిషన్కుమార్ – వెయిటింగ్లో ఉన్న ఆయనను హైదరాబాద్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఏసీపీగా నియమించారు.9. ఎల్. రమేష్కుమార్ – వెయిటింగ్లో ఉన్న ఆయనకు హైదరాబాద్ సిటీ సీటీసీ ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారు.10. ఎన్. శ్రీనివాస్రెడ్డి – వెయిటింగ్లో ఉన్న ఆయనను సంగారెడ్డి డీసీఆర్బీ డీఎస్పీగా నియమించారు.11. కాదేరు వెంకట్రెడ్డి – వెయిటింగ్లో ఉన్న ఆయనకు తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ) డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు.12. కొమల్ల సుబ్బరామిరెడ్డి – వెయిటింగ్లో ఉన్న ఆయనను హైదరాబాద్ సిటీ సీసీఎస్ అండ్ డీడీ ఏసీపీగా నియమించారు.13. ఎస్. సుదర్శన్ – వెయిటింగ్లో ఉన్న ఆయనకు హైదరాబాద్ సిటీ సీసీఎస్ అండ్ డీడీ ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారు.14. ఎన్. శంకర్ – వెయిటింగ్లో ఉన్న ఆయనను హైదరాబాద్ సెక్రటేరియట్ సెక్యూరిటీ ఏసీపీగా నియమించారు.15. పి. విజయ్కుమార్ – వెయిటింగ్లో ఉన్న ఆయనకు వెస్ట్జోన్ రోడ్ సేఫ్టీ డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు.16. కె. భాస్కర్ – ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న ఆయనను బదిలీ చేసి తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ) డీఎస్పీగా నియమించారు.17. ఎం. వెంకట నర్సయ్య – ప్రస్తుతం ఆదిలాబాద్ డీసీఆర్బీ డీఎస్పీగా పనిచేస్తున్న ఆయనను బదిలీ చేసి సీఐడీ డీఎస్పీగా నియమించారు. -
పోలీస్స్టేషన్లో కేటీఆర్, హరీష్.. ఉద్రిక్తంగా మారిన ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: బోయిన్పల్లి పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీఎస్ ముందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకొని పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తి తోపులాట జరిగింది. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇతర ముఖ్య నేతలు బోయనపల్లి పీఎస్లోనే ఉన్నారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.కాగా పోలీస్ స్టేషన్లోనూ బీఆర్ఎస్ నేతలకు రక్షణ లేకుండా పోయిందని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. దీంతో పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈనేపథ్యంలో పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘర్షణ వాతావరణంతో హైదరాబాద్ -సిద్ధిపేట రహదారిపై భారీగా ట్రాఫిక్ జామయ్యింది. శామీర్పేట దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు జవహర్ నగర్ పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీమంత్రి హరీశ్ రావును పోలీసులు అరెస్టు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. హరీశ్ రావును వెంటనే విడుదల చేయాలని స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు పీఎస్ లోనికి వెళ్లడానికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇదీ చదవండి..కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్ -
భాగ్యనగరంలో ‘మూల్ – ది ఆరిజిన్'
ఆర్ట్ కనెక్ట్, గోండ్వానా ఆర్ట్ ప్రాజెక్ట్ సహకారంతో, మధ్య భారతదేశంలోని దేశీయ కళా సంప్రదాయాల మూలాల్లోకి తొంగిచూసే 'మూల్ – ది ఆరిజిన్' అనే ప్రదర్శనను అందిస్తోంది. ఇది కళలు ఎలా రూపాంతరం చెందుతూ..సరికొత్తగా ఎలా వ్యక్తీకరణను పొందుతున్నాయో ఈ ప్రదర్శన చూపిస్తుంది. ఈ ప్రధర్శన ఈ నెల 10 నుంచి సెప్టెంబర్ 13 వరకు హైదరాబాద్, ఫిల్మ్ నగర్లోని రామానాయుడు స్టూడియోస్ సమీపంలోని స్పిరిట్ కనెక్ట్లో జరగనుంది. దీని ప్రధాన ఉద్దేశ్యం మన మూలాల్లో తిరిగి వెళ్లడం, అలాగని గతంలోకి వెళ్లమని కాదట. ఈ ప్రదర్శనలో కళఖాండాలు తమ మూలాలతో ఎలా గాఢంగా పాతుకుపోయి ఉంటాయో నేటి ప్రపంచానికి తెలియజేస్తాయని అంటున్నారు నిర్వహకులు. సుపరిచితమైన చిహ్నాలు, నమునాలు ఎలా కళాకారుల నుంచి మార్పులు సంతరించుకున్నాయో తెలియజేస్తుందట ఈ ప్రదర్శన. ఇక్కడ సంప్రదాయన్ని స్థిరంగా నిలిచిపోయే వస్తువుగా ప్రదర్శించకుండా సజీవ భాషగా, మన వారసత్వంగా కళాకారులు ముందుకు తీసుకెళ్తారనేది చెప్పడానికే ఈ ప్రదర్శన అని ఈ ఆర్ట్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకులు చెబుతున్నారు.(చదవండి: ఏఐ టూత్ బ్రెష్..దెబ్బకు నోటి సమస్యలకు చెక్!) -
HYD: సరూర్నగర్లో గజం రూ.1,64,000
సాక్షి, హైదరాబాద్: సరూర్నగర్లోని 4,356 చదరపు గజాల స్థలానికి సోమవారం హెచ్ఎండీఏ బిడ్డింగ్ నిర్వహించింది. గజానికి రూ.1,50,000 కనీస ధర నిర్ణయించగా, అత్యధికంగా రూ.1,64,000 నమోదైంది. వేలం ద్వారా రూ.71.44 కోట్ల ఆదాయం సమకూరింది. వేలం వేసిన భూమి.. సరూర్నగర్లోని ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాలకు దగ్గరగా ఉండడంతో వ్యాపార వర్గాల నుంచి అనూహ్యమైన స్పందన లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్ను ఈ ధర ప్రతిబింబించిందని తెలిపారు. చదవండి: ‘ఎవరినీ వదలిపెట్టం..’ స్పీకర్ను ఓదార్చిన సీఎం రేవంత్ -
గణేశ్ మండపాలు.. సజ్జనార్ కీలక ట్వీట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. లక్షా నలభై వేల గణేష్ మండపాల సిద్ధమవుతున్నాయని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ట్వీట్ చేశారు. ఆన్లైన్లో గణేశ్ మండపాల నమోదు తప్పనిసరి అన్నారు. గణేశ్ మండపాల వివరాలను ఉత్సవ నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తుగానే ఆన్లైన్ ద్వారా నమోదు (ఇంటిమేషన్) చేసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. ‘‘నిర్వాహకులు వెంటనే http://policeportal.tspolice.gov.in/index.htm పోర్టల్ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవాలి. తుది నిమిషం దాకా వేచిచూడకుండా అధికారిక పోర్టల్ ద్వారా సమాచారం అందించి హైదరాబాద్ సిటీ పోలీస్కు సహకరించాలి. మండపాల ఏర్పాటు, నిమజ్జన వివరాలు ముందుగానే తెలిస్తే ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తగిన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు యంత్రాంగానికి వీలవుతుంది’’ అని సజ్జనార్ పేర్కొన్నారు.మరోవైపు, గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో డీజేల మోత మోగిస్తే సహించేది లేదని పోలీసులు తేల్చిచెబుతున్నారు. శబ్ద కాలుష్యంతో వృద్ధులు, గర్భిణులు, నవజాత శిశువులు తీవ్ర అనారోగ్యానికి గురవుతుండటంపై దాఖలైన పిటిషన్లను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు.. నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు ఈ దిశగా దృష్టి సారించారు.ఈ ఏడాది ఉత్సవ కమిటీలకు పోలీసుల అనుమతి లభించాలంటే కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మండపంలో శబ్ద పరిమితులు దాటవని, రాత్రి 10 గంటల తర్వాత మైకులు ఆపివేస్తామని నిర్వాహకులు రాతపూర్వక పత్రం సమర్పించాలి. డీజే, సౌండ్ సిస్టమ్స్ సరఫరా చేసే యజమానులకు ముందస్తుగానే పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు.గతేడాది గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. గతేడాది శబ్ద కాలుష్య నియమావళిని దాటిన వారిపై 250కి పైగా కేసులు నమోదు చేయగా, 150కి పైగా భారీ డీజే సెట్లు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈసారి ఉల్లంఘనలకు పాల్పడితే డీజే పరికరాలతో పాటు రవాణా చేసిన వాహనాలను కూడా జప్తు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
Climate Risk Alert: డేంజర్ జోన్లో హైదరాబాద్!
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉన్న నగరాల జాబితాలో హైదరాబాద్ నిలిచింది. ప్రపంచంలోని 72 ప్రధాన నగరాలపై నిర్వహించిన తాజా అధ్యయనంలో అహ్మదాబాద్ అత్యంత ప్రమాదకర నగరంగా, హైదరాబాద్ రెండో అత్యంత ప్రమాదకర నగరంగా నిలిచాయి. జియోస్పేషియల్ ఏఐ సంస్థ ఆల్ఫాజియో ఈ ర్యాంకింగ్ను రూపొందించింది. నగరాలు ఎదుర్కొనే వాతావరణ విపత్తుల ముప్పుతోపాటు వాటిని తట్టుకుని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్ని కూడా సంస్థ పరిగణనలోకి తీసుకుంది.వరదలు, తీవ్రమైన వేడి, కరువు, కార్చిచ్చు, హరికేన్ గాలులు తదితర ముప్పులను అంచనా వేశారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, పాలన, విధానపరమైన చర్యలు, మౌలిక సదుపాయాలు, వరద నిరోధక నిర్మాణాలు, అధిక సామర్థ్యం కలిగిన డ్రైనేజీ వ్యవస్థలు వంటి అంశాల ఆధారంగా ఆయా నగరాల సామర్థ్యాన్ని పరిశీలించారు.వాతావరణ ముప్పులను తట్టుకునే సామర్థ్యంలో అమెరికాలోని చికాగో మొదటి స్థానంలో నిలిచింది. సమశీతోష్ణ అక్షాంశంలో ఉండటం, మంచినీటి వనరులకు చేరువగా ఉండటం, హరికేన్ ముప్పు తక్కువగా ఉండటం దీనికి కలిసొచ్చాయి. వాతావరణ సంబంధిత ముప్పులను ఎదుర్కొనేందుకు నగరం మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టింది. వరదలు, నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన ‘డీప్ టన్నెల్ ప్రాజెక్ట్’ ఇందులో ఒకటి.ఆల్ఫాజియో వ్యవస్థాపకుడు, సీఈఓ పరాగ్ ఖన్నా మాట్లాడుతూ.. ముప్పులను మాత్రమే కాకుండా వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా తమ విధానం పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. ర్యాంకింగ్లో అహ్మదాబాద్ చివరి స్థానంలో నిలిచింది. నదీ తీర ప్రాంతంలో ఉన్న ఈ నగరానికి వరదల ముప్పు అధికంగా ఉందని, గుర్తించిన ప్రమాదాలకు అనుగుణంగా తగిన స్థాయిలో సన్నద్ధత లేదని అంచనా పేర్కొంది. దక్షిణాసియా నగరాలు కూడా అత్యంత తక్కువ వాతావరణ నిరోధకత కలిగిన నగరాల జాబితాలో ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్, ముల్తాన్, ఢాకా, లాహోర్, కోల్కతా, ఫైసలాబాద్, కరాచీ, చిట్టగాంగ్ దిగువ 10 స్థానాల్లో ఉన్నాయి. వరదలు, రుతుపవనాల ప్రభావం దీనికి కారణమని వెల్లడైంది.అమెరికాలోని ఫీనిక్స్ అత్యంత ప్రమాదకర నగరంగా గుర్తించగా, దీనికి ఇక్కడి తీవ్రమైన వేడి ప్రధాన కారణంగా నిలిచింది. మరోవైపు అడిస్ అబాబా, మెల్బోర్న్, బార్సిలోనా, అంకారా తదితర నగరాలు అత్యంత నిరోధకత కలిగిన 10 నగరాల్లో చోటు దక్కించుకున్నాయి. వాతావరణ ముప్పుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నది మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుందని ఆల్ఫాజియో పేర్కొంది. తీవ్రమైన వేడి.. విద్యుత్ వ్యవస్థలపై ఒత్తిడి పెంచుతుందని, బలమైన విద్యుత్ గ్రిడ్లు, ప్రత్యామ్నాయ మౌలిక సదుపాయాలు విద్యుత్ అంతరాయాల ప్రభావాన్ని తగ్గించగలవని తెలిపింది. నేపాల్, టిబెట్లో ఇటీవల సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు లోయలు, దిగువ ప్రాంతాల్లోని నివాసాలకు ఉన్న ముప్పును కూడా స్పష్టం చేశాయి.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ సభకు భారీ క్రేజ్.. బేజారెత్తిన బుక్మైషో! -
కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం!
హైదరాబాద్: కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో భౌరంపేట్లోని రుద్ర సంస్థ సమీపంలో ఓ కారు మంటల్లో కాలిపోతోందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే ఓ వ్యక్తి మంటల్లో కాలిపోయి ఉన్నాడు.భౌరంపేట్లోని ప్రణీత్ ప్రణవ్ మిడోస్కు చెందిన కార్తీక్(40)గా పోలీసులు గుర్తించారు. లాండ్రీ బిజినెస్ చేసే అతను రెండున్నర సంవత్సరాలుగా భార్యకు దూరంగా ఉంటున్నాడని తెలిసింది. ఆరోగ్య సమస్యలకు తోడు ఆర్థిక సమస్యలు ఉండటంతో కారులో నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇవి కూడా చదవండి: పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది? -
పెళ్లైన ఆరు నెలలకే డాక్టర్ ఆత్మహత్య.. అసలేం జరిగింది?
హైదరాబాద్: వివాహం జరిగిన ఆరు నెలల్లోనే ఓ ఆయుర్వేదిక్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతికి చెందిన కాక కీర్తి (28) క్యూర్ ఆర్థో ఆసుపత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తూ కుషాయిగూడ, వైష్ణవి ఎంక్లేవ్లో నివాసం ఉంటోంది. ఏడాది నుంచీ ఇక్కడే ఉంటున్న డాక్టర్ కీర్తి ఆరు నెలల క్రితం తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాఘవను వివాహం చేసుకుంది.పనిపై భర్త రాఘవ తిరుపతికి వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో వంటగదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రికి చెందిన మరో డాక్టర్ ఇంటి పైపోర్షన్లోనే కీర్తి అద్దెకు ఉంటోంది. సోమవారం విధులకు హాజరు కాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది కీర్తి ఇంటి యజమానికి సమాచారమిచ్చారు. దీంతో వారు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.కాగా కీర్తి మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లైన 6 నెలలకే ఆమె ఇలా ఆత్మహత్యకు పాల్పడటంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారం క్రితం తిరుపతికి వెళ్లిన భర్త ఎందుకు తిరిగిరాలేదు... భార్యతో గొడవపడి వెళ్లాడా లేక ఏదైనా పనిపై వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు తిరుపతి నుంచి బయలుదేరారని, వారిచ్చే ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి తెలిపారు.ఇవీ చదవండి: కువైట్లో భారీ డీజిల్ మోసం.. భారతీయులు సహా 41 మంది అరెస్ట్! -
ఏడాది గడిచినా మెట్రో టేకోవర్ పూర్తి కాలేదు.. అసలు సమస్య ఏంటి?
సాక్షి, హైదరాబద్: చర్చలు, సంప్రదింపులు, సమావేశాలతో మెట్రో మొదటి దశ స్వా«దీన ప్రక్రియ ఏడాది కాలన్ని పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రభుత్వం అధికారికంగా ఈ ప్రాజెక్టును స్వా«దీనం చేసుకున్నట్లు ప్రకటించినప్పటికీ ఎల్అండ్టీ సంస్థకు ఇంకా రుణాలు చెల్లించలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఎల్అండ్టీ నిర్వహణలోనే ఉంది. రెండో దశ పైన కేంద్రం నుంచి సానుకూలమైన స్పందన లభించినప్పటికీ మొదటి దశ టేకోవర్ పూర్తయితే తప్ప రెండోదశపై ముందడుగు వేయలేని పరిస్థితి.ఎల్అండ్టీకి చెల్లించాల్సిన రూ.1461.47 కోట్లతో పాటు రూ.13,538.53 కోట్ల బ్యాంకు రుణాల రీఫైనాన్సింగ్ కోసం ఐఆర్ఎఫ్సీ నుంచి ఎస్బీఐ క్యాపిటల్ సంస్థను ఆశ్రయించడం మినహా ఈ ఏడాది కాలంలో ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. రుణ సేకరణ కోసం మెట్రోరైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ ఇటీవల ముంబయిలో ఎస్బీఐ క్యాపిటల్ సంస్థతో సమావేశమై రుణాల చెల్లింపు కోసం నిధులను త్వరగా అందజేయాలని కోరారు.స్వాదీన ప్రక్రియ ప్రారంభం ఇలా...రెండో దశకు అనుమతినివ్వాలని కోరుతూ ప్రభుత్వం 2024లో కేంద్రాన్ని కోరింది. డీపీఆర్లను అందజేసింది. కానీ సాంకేతిక సమస్యల దృష్ట్యా తొలిదశ నిర్వహణపై ఎల్అండ్టీతో స్పష్టమైన ఒప్పందం కుదుర్చుకుంటే మినహా అనుమతినివ్వలేమని కేంద్రం చెప్పింది.ఈ క్రమంలో ఎల్అండ్టీ సంస్థతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా అప్పటికే రూ.5000 కోట్ల అప్పుల భారం పడడంతో ఇక మెట్రో రైళ్లను నడుపలేమంటే గతేడాది సెపె్టంబర్ మొదటి వారంలో ఎల్అండ్టీ చేతులెత్తేసింది. మెట్రో నుంచి వైదొలగనున్నట్లు స్పష్టంగా ప్రకటించింది.ఎల్అండ్టీ నుంచి మొదటి దశను స్వా«దీనం చేసుకోనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. ఆ తరువాత స్వా«దీన ప్రక్రియలో అడుగులు పడ్డాయి.ఒప్పందం కుదిరింది...ఎల్అండ్టీ సంస్థ నుంచి పూర్తి ఈక్విటీ కొనుగోలు (షేర్ పర్చేస్ అగ్రిమెంట్) కోసం ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎల్ అండ్ టీ (ఎల్అండ్టీ) సంస్థకు చెందిన 100 శాతం ఈక్విటీ వాటాను రూ.1,461.47 కోట్లు చెల్లించి కొనుగోలు చేయడానికి షేర్ పర్చేస్ అగ్రిమెంట్ (ఎస్పీఏ)కుదుర్చుకుంది.ఎల్ అండ్ టీ పేరిట ఉన్న సుమారు రూ.13,538.53 కోట్ల రుణాన్ని రీఫైనాన్స్ చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ బదిలీ విలువ సుమారు రూ.15,000 కోట్లుగా ఖరారైంది.ఐఎఆర్ఎఫ్సీ నుంచి నిధులను సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. కానీ తుది దశలో ఆ సంస్థ నిరాకరించడంతో ఈ ప్రక్రియ మొదటికొచ్చింది.ఇవీ చదవండి: నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధం.. 47 చెరువుల్లో ఏర్పాట్లు! -
నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధం.. 47 చెరువుల్లో ఏర్పాట్లు!
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు గ్రేటర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు విస్తృత ఏర్పాట్లకు సిద్ధమవుతున్నాయి. భారీ విగ్రహాల నిమజ్జనం, లక్షలాది మంది భక్తుల రాక, ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, చెత్త పేరుకుపోవడం వంటి సవాళ్లను దృష్టిలో పెట్టుకుని అధికారులు వివిధ విభాగాల సమన్వయంతో కార్యాచరణ రూపొందించారు. నిమజ్జన ప్రాంతాల వద్ద క్రేన్లు, ఈతగాళ్లు, పడవలు, వైద్య శిబిరాలు, మొబైల్ టాయిలెట్లు, పారిశుద్ధ్య బృందాలను అందుబాటులో ఉంచనున్నారు.జీహెచ్ఎంసీలో 47 చెరువులు.. జీహెచ్ఎంసీ పరిధిలో 47 సరస్సులు, చెరువుల వద్ద నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో 17 సరస్సులు, 30 చెరువులు, కొలనులు ఉన్నాయి. వీటి వద్ద 110 క్రేన్లు కేటాయించే ప్రణాళిక సిద్ధమైంది. ఖైరతాబాద్, అంబర్పేట, జల్పల్లి, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ ప్రాంతంలో 41 క్రేన్లు, ఎన్టీఆర్ గ్రౌండ్ వద్ద 21 క్రేన్లు ఉంటాయి. నిమజ్జన ప్రాంతాల వద్ద 770 మంది పారిశుద్ధ్య సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు.సైబరాబాద్ పరిధిలో 54 నిమజ్జన కేంద్రాలు సిద్ధమవుతున్నాయి. వీటిలో 32 సరస్సులు, 13 బేబీ పాండ్లు, 7 తాత్కాలిక పాండ్లు, ఒక పోర్టబుల్ పాండ్, మరో పాండ్ ఉన్నాయి. 81 క్రేన్లు, 1,138 మంది పారిశుద్ధ్య సిబ్బంది, 130 టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. జీడిమెట్ల, చింతల్ ప్రాంతాల్లో కొత్త తాత్కాలిక నిమజ్జన పాండ్లను ప్రతిపాదించారు. దుర్గం చెరువు, అంబీర్ చెరువు, పరికి చెరువు, ఐడీఎల్ లేక్, ఊర చెరువు, పెద్ద చెరువు లతోపాటు కొల్లూరు, అమీన్పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లోనూ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు షిఫ్టుల్లో 1,138 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.కేబుళ్ల తొలగింపు..తాత్కాలిక లైట్లు నిమజ్జన కేంద్రాలు, ఊరేగింపు మార్గాల్లో ఫోకస్ లైట్లు, తాత్కాలిక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు వేలాడుతున్న కేబుళ్లను తొలగించనున్నారు. చెట్ల కొమ్మల తొలగింపు, గుంతల పూడ్చివేత, రోడ్ల మరమ్మతులు, ఫుట్పాత్లకు రంగులు వేయడం వంటి పనులు చేపట్టనున్నారు.రంగంలో గణేశ్ యాక్షన్ టీమ్స్ నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో చెత్త పేరుకుపోకుండా గణేశ్ యాక్షన్ టీమ్స్(జీఏటీ)ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆయా మార్గాల వారీగా పారిశుద్ధ్య సిబ్బంది, శానిటరీ సూపర్వైజర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లను కేటాయించి మూడు షిఫ్టుల్లో పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు. నిరంతరంగా విద్యుత్ సరఫరా: సీఎండీ ఖైరతాబాద్: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటుందని, అలాగే ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన గణేష్ ఉత్సవాలపై సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యమైన మండపాలు, ఊరేగింపు మార్గాలు, నిమజ్జన కేంద్రాల వద్ద అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్టాండ్బై జనరేటర్లు ఏర్పాటు చేయాలని, నగరానికి విద్యుత్ సరఫరా అందించే 220 కేవీ, 132 కేవీ స్టేషన్లపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు.ఎంఎంసీలో 40 ప్రాంతాల్లో..మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 40 నిమజ్జన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. భారీ విగ్రహాల తరలింపు, నిమజ్జన ప్రక్రియ కోసం 84 క్రేన్లు, 1,356 మంది పారిశుద్ధ్య సిబ్బంది, 62 మొబైల్ టాయిలెట్లు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా మూడు కార్పొరేషన్ల పరిధిలోనూ చెరువుల వద్ద క్రేన్లు..రోడ్లపై జీఏటీలు, వినాయకులను తరలించే మార్గాల్లో బారికేడ్లు.. అత్యవసర సేవలకు వైద్య, ఫైర్, రెస్క్యూ బృందాలు, విద్యుత్, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బంది సిద్ధంగా ఉండనున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించేందుకు మూడు కార్పొరేషన్ల కమిషనర్లు కర్ణన్, సృజన, వినయ్కృష్ణారెడ్డి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.ఇవి కూడా చదవండి: తెలంగాణకు ఇది చీకటి రోజు -
దాడికి రేవంత్రెడ్డిదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి హోదాలో రేవంత్రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. ‘ఆడ బిడ్డల చీరలు లాగి.. గొంతులు పట్టి.. జుట్టు లాగుతారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజాపాలన?..’ అని నిలదీశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామనే భయంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలను సభలోకి రాకుండా పోలీసులతో దాడులు చేయించారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ భయపడుతోంది..తప్పు చేయకుంటే ప్రజా సమస్యలను ఎజెండాలో పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో తమకూ ఉందని అన్నారు. ‘రాహుల్గాంధీ నల్ల టీ షర్టు వేసుకుని, నినాదాలు చేస్తూ పార్లమెంట్కు వెళ్తే అడ్డుకోరు.. మేం అదే చేస్తే పోలీసులు అడ్డుకుంటారా?..’ అని నిలదీశారు. రేవంత్రెడ్డి గతంలో నిరసన తెలిపే హక్కు ఏడో గ్యారంటీ అని చెప్పారని, ఇప్పుడు తమ నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.గతంలో మేం క్షమాపణ చెప్పాం..సీఎం కూడా ఎమ్మెల్యేనే అని, స్పీకర్ పక్షపాత వైఖరి వీడి అందరికీ సమాన నిబంధనలు వర్తింపజేయాలని కేటీఆర్ కోరారు. తమ ఎమ్మెల్సీ తాతా మధుకు అనని మాటలను ఆపాదిస్తూ అసలు దాడి ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో డీకే అరుణకు మనస్తాపం కలిగినప్పుడు కేసీఆర్ ఆదేశాలతో తాము క్షమాపణ చెప్పామని, అదే తమ సంస్కారమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని, మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకు, సీఎం క్షమాపణ చెప్పే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.దళితులపై రేవంత్ కపట ప్రేమదళితులపై రేవంత్రెడ్డి కపట ప్రేమ చూపుతున్నారని కేటీఆర్ విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే దళిత, గిరిజన డిక్లరేషన్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దళిత బంధును ఎత్తివేసి రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.6 లక్షలు, అసైన్డ్ భూములకు పట్టాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 30 శాతం వాటా వంటి హామీలను అమలు చేయలేదని విమర్శించారు. దళిత వ్యతిరేకి, మహిళా వ్యతిరేకి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. తమ ఎమ్మెల్యేలపై దాడి ఘటనపై హైకోర్టును ఆశ్రయించామని, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు.జగదీశ్రెడ్డికి పరామర్శనిమ్స్లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని కేటీఆర్ సోమవారం సాయంత్రం పరామర్శించారు. అసెంబ్లీ ప్రాంగణం వద్ద పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య జరిగిన తోపులాటలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన క్షేమ సమాచారాన్ని కేటీఆర్ వైద్యులనడిగి తెలుసుకున్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు. -
డయాబెటిస్కు హెచ్బీఏ1సీ ఎలాగో...సీవోపీడీకి ఈ పరీక్షా అలా!
డయాబెటిస్కు ‘హెచ్బీఏ1సీ’ ఉన్నట్టే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీవోపీడీ) అనే లంగ్స్ వ్యాధికి ఓ పరీక్ష ఉంటే ఎంత బాగుంటుంది! దాదాపు రూ. 7,000 ఖర్చయ్యే చోట రూ. 100 కే పరీక్ష అందుబాటులోకి వస్తే పేదలకు ఎంత ఉపయోగంగా ఉంటుంది!! ఈ పరీక్ష రూపకల్పన కోసం ఓ పధ్నాలుగేళ్ల చిన్నారి తన ఏఐ పరిజ్ఞానంతో సాంకేతిక సహకారం అందిస్తే ఎంత అబ్బురంగా ఉంటుంది! అలాంటి ఓ కలను సాకారం చేసేందుకు హైదరాబాద్కు చెందిన డాక్టర్ అనూరాధ నేతృత్వంలో ‘మేధాంకుర’ సభ్యులు శ్రమించి... ఆ పరీక్షను విజయవంతం చేశారు. దాంతో ఆ సాంకేతికతకు ప్రతిష్ఠాత్మకమైన ‘బీఎంజే డిజటల్ ఇన్నోవేషన్ అవార్డు – సౌత్ ఏషియా–2026’ లభ్యమైంది. ఈ సందర్భంగా తమ సాంకేతికత అందుబాటులోకి వస్తే వ్యాధిగ్రస్తులకూ, పేదలకూ ఎంత ప్రయోజనకరంగా ఉంటుందనే అంశాలను ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ అనూరాధ చెబుతున్నారు. ఆ వివరాలన్నీ ఆమె మాటల్లోనే...→ చక్కెరపాకంలో గులాబ్జామూన్లా...మా పరీక్ష గురించి చెప్పే ముందు హెచ్బీఏ1సీ గురించి కాస్త వివరిస్తాను. మరీ వైద్యపరమైన అంశాలతో కాకుండా... మామూలు వ్యక్తులకూ అర్థమయ్యే భాషలో చె΄్పాలంటే... మన రక్తకణాలను కాసేపు గులాబ్జామూన్ లనుకుందాం. మన రక్తంలోకి చక్కెర బాగా ఇంకిపోయిన పాకం అనుకుంటే... మూడు నెలల పాటు మన రక్తకణాలు ఆ పాకంలో బాగా నానిపోయాయని భావించవచ్చు. మర్నాడు రక్తపరీక్ష ఉండగా... పేషెంట్ ఆ ముందు రాత్రి ఏమీ తినకుండా పరీక్షకు వెళ్తే రక్తంలో చక్కెర మోతాదులు తక్కువగా కనిపించవచ్చు. కానీ మూణ్ణెల్ల పాటు రక్తకణాలు బాగా నానిపోయి ఉన్నాయనుకోండి. ఆ విలువలను మాయ చేయడం కష్టం కదా. డయాబెటిస్కు అందుబాటులో ఉన్న ఈ పరీక్ష తరహాలోనే ఊపిరితిత్తుల వ్యాధి అయిన ‘క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్’ (సీవోపీడీ)కి కూడా ఉంటే పేషెంట్స్కు ఉపయోగకరంగా ఉంటుందని రూపొందించిందే ఈ పరీక్ష.→ శ్వాసకు అడ్డంకి కల్పించే సీవోపీడీ... ‘క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిజీస్’ (సీవోపీడీ) అనేది లంగ్స్కు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి. వాయు కాలుష్యం, పొగతాగే అలవాటు, మహిళలు వంట పొగకు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతుండటం, దుమ్ము, రసాయనాల ప్రభావంతో ఈ సమస్య తలెత్తుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దీర్ఘకాలిక దగ్గు, కఫం, ఆయాసం, ఛాతీలో బిగుతు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సుదీర్ఘకాలంలో ఊపిరితిత్తులు తమ ఎలాస్టిసిటీని కోల్పోతూ ఉండటం వల్ల ఊపిరితీసుకోవడం కష్టంగా మారుతుంది. → వ్యాధి తీవ్రత తెలుసుకోవడమిలా...ప్రస్తుతం సీఓపీడీ పేషెంట్స్ లంగ్స్ పనితీరును ప్రధానంగా ‘స్పైరోమెట్రీ’ పరీక్షతో అంచనా వేస్తున్నారు. అయితే సీవోపీడీకి సంబంధించి పేషెంట్ ఆసుపత్రికి వచ్చిన రోజున అతడి పరిస్థితి ఎలా ఉందన్నదే ఈ పరీక్షతో తెలుస్తుంది. ఈ పరీక్షను రెండు నెలల వ్యవధిలో చేశామనుకోండి. అప్పుడు ఆ రెండు నెలల మధ్యనున్న కాలంలో వ్యాధి తీవ్రతల్లో వచ్చిన మార్పులను గుర్తించడం కష్టమవుతుంది. దాంతో కొందరిలో వ్యాధి ముదురుతున్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించే ముప్పుండగా, మరికొందరికి అవసరానికి మించి చికిత్స అందించే అవకాశమూ ఉంది. ఓ ప్యాథాలజిస్ట్ గా నేను సీవోపీడీ వ్యాధి గురించి పరిశోధించగా... నా భర్త, మెడికల్ ఆంకాలజిస్ట్ అయిన డాక్టర్ సురేశ్ ఈ మార్కర్లపై పరిశోధన చేశారు. పధ్నాలుగేళ్ల చిన్నారి చక్రిక మా పరిశోధనకు సాంకేతిక, ఏఐ పరిజ్ఞానాన్ని సమకూర్చారు. → కేవలం వంద రూపాయలకే... ఈ వ్యాధికి గురవుతున్నవారిలో 90 శాతానికిపైగా అల్ప, మధ్య ఆదాయ వర్గాలకు చెందినవారే. ఇప్పటికి అందుబాటు లో ఉన్న పరిజ్ఞానంతో రూ. 7,000 వరకు ఖర్చవుతుంది. కానీ మా పరీక్ష అందుబాటులోకి వస్తే రూ.100 ఖర్చుతోనే ఈ పరీక్ష చేయవచ్చు. మా ప్రక్రియ వల్ల గ్రామీణ,ఆరోగ్య కేంద్రాల్లోనూ కూడా నిర్వహిస్తూ... మామూలు పీహెచ్పీలోనూ సీవోపీడీ బాధితులకు వైద్యసేవలు అందించవచ్చు.ఈ పరిశోధనకు బీఎంజే డిజిటల్ ఇన్నోవేషన్ అవార్డు!హైదరాబాద్లోని ‘మేధాంకుర’ సంస్థకు ప్రతిష్ఠాత్మకమైన ‘బీఎంజే డిజిటల్ ఇన్నోవేషన్’ అవార్డు లభ్యమైంది. బీఎంజే అనేది మెడికల్ జర్నల్స్లో అత్యంత పురాతనమైన జర్నల్స్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ఈనెల 5 (శనివారం) నాడు న్యూఢిల్లీలో నిర్వహించిన బీఎంజే అవార్డ్స్–సౌత్ ఏషియా కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేశారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో పేషెంట్స్కు అందించే వైద్యసేవలను మరింతగా మెరుగుపరిచిన ప్రాజెక్టులకు దక్షిణాసియా స్థాయిలో ఈ పురస్కారం అందిస్తారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మేధాంకుర ఆసుపత్రి వైద్యసేవలు, పరిశోధన–అభివృద్ధి, రోగ నిర్ధారణ, ఫార్మసీ, కృత్రిమ మేధ ఆధారిత ఆరోగ్య వేదికల విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణ, వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేని ప్రాంతాల ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా మేధాంకుర సంస్థ పనిచేస్తోంది. – యాసీన్ -
ఆటో ఛార్జీలు పెరగనున్నాయా? తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణ: రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఆటో ఛార్జీల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్, పర్మిట్ల సమస్యలు, బీమా వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఆటో కార్మికుల సమస్యలపై సుదీర్ఘ చర్చఆటో డ్రైవర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులు చర్చించారు. గత ఆగస్టు 23న జరిగిన సమావేశంలో ప్రస్తావించిన సమస్యలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను కూడా సమీక్షించారు. సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేలా వివిధ శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.2012 తర్వాత పెరగని ఆటో ఛార్జీలుఆటో ఛార్జీల పెంపునకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2012 తర్వాత ఛార్జీలు పెరగలేదని, ప్రస్తుతం పెరిగిన నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని కొత్త ఛార్జీలను నిర్ణయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం రవాణా శాఖ అధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఛార్జీలు ఎంత మేర పెంచాలన్న అంశాన్ని పరిశీలించిన అనంతరం కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా ఛార్జీల పెంపును అమలు చేసే అవకాశం ఉంది.ఆర్టీసీ ఈవీ ఆటోలపై దుష్ప్రచారమేటీజీఎస్ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అలాంటి విధానంపై ఎలాంటి చర్చ జరగడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విషయంలో ఆటో డ్రైవర్లు, కార్మికులు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.ఓలా, ఉబెర్ తరహాలో ప్రభుత్వ ప్రత్యేక యాప్ఆటో డ్రైవర్లు, ప్రయాణికులకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ను తీసుకురావడానికి చర్యలు జరుగుతున్నాయి. ఓలా, ఉబెర్, ర్యాపిడో తరహాలో పనిచేసే యాప్ రూపకల్పనపై ఇప్పటికే ఐటీ శాఖ మంత్రికి లేఖ రాసినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చేలా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డుఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాతిపదికన చర్యలు తీసుకోనుంది. ఈ ప్రతిపాదనను కేబినెట్లో చర్చించిన అనంతరం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టే దిశగా ముందుకు వెళ్లనున్నట్లు మంత్రులు తెలిపారు. బోర్డు ద్వారా ఆటో కార్మికుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది.పెండింగ్ పర్మిట్లకు పరిష్కారంజీఓ ఎంఎస్ నంబర్ 263 కింద తిరస్కరించబడిన కేసులతో పాటు గడువు ముగిసిన పర్మిట్లకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్లో ఉన్న ఆటో రిక్షా పర్మిట్ల కోటాను విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.అగ్రిగేటర్ పాలసీపై ప్రత్యేక అధ్యయనంఅగ్రిగేటర్ల ద్వారా వైట్ ప్లేట్ వాహనాల వినియోగంపై ఆటో సంఘాలు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేంద్రం ప్రకటించిన అగ్రిగేటర్ పాలసీలో ద్విచక్ర వాహనాలను కూడా వినియోగించే అవకాశం ఉన్నందున దీనిపై రాష్ట్ర స్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. రవాణా శాఖ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అగ్రిగేటర్ పాలసీపై సమగ్రంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీనివల్ల ఉపాధి అవకాశాలపై కూడా ప్రభావాన్ని పరిశీలించనున్నారు.ఇతర జిల్లాల ఆటోలపై నిబంధనలు కఠినంఇతర జిల్లాలకు చెందిన ఆటోలు హైదరాబాద్ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా తిరగకుండా చర్యలు తీసుకోవాలని ఆటో సంఘాల ప్రతినిధులు కోరారు. దీనిపై రవాణా శాఖ స్పందిస్తూ నిబంధనలను అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. నిబంధనల అమలులో నగరంలోని ఆటో కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి సూచించారు.సారథి పోర్టల్ సమస్యకు పరిష్కారంఆటో రిక్షా డ్రైవింగ్ లైసెన్స్ కేటగిరీ విషయంలో సారథి పోర్టల్లో స్పష్టత లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఎల్ఎంవీ లైసెన్స్ ఉన్నవారు ఆటో నడిపే విషయంలో అమల్లో ఉన్న నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి స్పష్టత కోరనున్నట్లు తెలిపారు.18,700 ఆటోలకు రూ.1.50 లక్షల సాయంహైదరాబాద్లో డీజిల్, పెట్రోల్ ఆటోల స్థానంలో పర్యావరణహిత వాహనాలను ప్రోత్సహించేందుకు రెట్రోఫిట్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరంలోని సుమారు 18,700 ఆటోలకు ఒక్కో వాహనానికి రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల సమన్వయంతో సుమారు రూ.200 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఆటో డ్రైవర్లకు ప్రత్యేక బీమా పాలసీఆటో డ్రైవర్ల ప్రమాదాలు, సహజ మరణాల సమయంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ప్రత్యేక బీమా పథకాన్ని తీసుకురావడంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ అంశంపై కార్మిక శాఖతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఆటో డ్రైవర్లతో పాటు ఇతర వర్గాలకు కూడా రక్షణ కల్పించేలా ‘ఇందిరమ్మ పాలసీ’ తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు.సమస్యల పరిష్కారానికి శాఖల సమన్వయంఆటో డ్రైవర్లు, కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు ఆటో కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, అడిషనల్ కమిషనర్ రమేష్, జేటీసీలు చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, వెంకట రమణతో పాటు కార్మిక శాఖ, పోలీస్, ట్రాఫిక్ శాఖల అధికారులు, వివిధ ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO
-
ఎయిర్పోర్టులో నందూస్ కపుల్ను పట్టుకున్న పోలీసులు!
-
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సాక్షి,హైదరాబాద్: యూకే వీసా స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లండన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి పరారీలో ఉన్న ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన నందన దంపతులపై గతంలోనే కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆమె కదలికలను గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు అప్రమత్తమై ఆమెను అదుపులోకి తీసుకున్నారు.లండన్లో పర్మినెంట్ ఉద్యోగాలు, భారీ వేతనాలు ఇప్పిస్తామని నందన దంపతులు పలువురికి ఆశ చూపారు. ఈ నకిలీ ఉద్యోగాల ఆశతో నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న అనంతరం, ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ నిమిత్తం ఆమెను ఏపీలోని కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఈ మోసంలో ఆమె భర్త మధుకర్ పాత్రపై కూడా పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. నందనపై ఉన్న కేసులు, లుక్అవుట్ నోటీసుల ఆధారంగా పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు.👉ఇదీ చదవండి : నందూస్ వరల్డ్లో ఏం జరుగుతోంది? -
బతికున్నారని.. తిరిగొస్తారని..
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడే చేరుకున్నామంటూ సమాచారం ఇచ్చినవారు కొందరు.. ఇందాకే బయలుదేరామంటూ కబురందించినవారు ఇంకొందరు.. ఇంకాసేపట్లో గమ్యం చేరుకుంటామనే మాటచెప్పిన వారు మరికొందరు.. ఆ కొద్దిసేపటికే వారంతా అదృశ్యమయ్యారు. అప్పటి వరకు మాట్లాడిన, సంబంధాలు కలిగి ఉన్నవారు ఆకస్మిక జల ప్రళయంలో నగరానికి చెందిన సుమారు 15 మంది వరకు గల్లంతైనట్లు సమాచారం. గత నెల 26న నేపాల్లో హఠాత్ వరదల్లో ఆచూకీ లేకుండాపోయినవారి కుటుంబీకుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఇంకా కొన్ని ప్రయత్నాల అనంతరం అదృశ్యమైన వారి స్థితి ఇదంటూ అక్కడి, ఇక్కడి ప్రభుత్వాలు ప్రకటించాల్సి ఉంది. అయితే బాధిత కుటుంబాలు మాత్రం తమవారు బతికున్నారని.. ఎప్పటికైనా తిరిగి వస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ జ్ఞాపకాల్లో కుటుంబాలు.. నగరానికి చెందిన నేపాల్ వరద బాధిత కుటుంబాల్లో ఎవరిని పలకరించినా అదృశ్యమైన వారి జ్ఞాపకాలే వెంటాడుతున్నాయని చెబుతున్నారు. తమవాళ్లు తిరిగి వస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే రోజులు గడిచిపోతున్నాయని చెబుతున్నారు. విహార/తీర్థ యాత్ర తమకు ఇంతటి విషాదాన్ని మిగిలుస్తుందని ఊహించలేదని కన్నీంటి పర్యంతమవుతున్నారు. కొందరు కుటుంబీకులు తమ వారి కోసం నేపాల్ వరకు వెళ్లి ఎంతో ఆశతో గాలించి నిరాశతో తిరిగి వచ్చారు. ఆ వరదల్లో తప్పిపోయిన వాళ్లల్లో కొందరు ఇటీవలే వచ్చినట్లు వివిధ రాష్ట్రాల నుంచి వార్తలు వస్తున్నాయని, తమ వాళ్లు కూడా అలానే మృత్యుంజయులు కావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఆ చిరునవ్వుల కోసం..నాగోలు: నేపాల్ వరదల్లో గల్లంతైన ఎల్బీనగర్ వాస్తు కాలనీకి చెందిన సుహాసినీ రెడ్డి (44) ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు. భారత రాయబార కార్యాలయం అధికారులు ఆమె జాడను కనుగొనాలని తల్లిదండ్రులు మహేందర్రెడ్డి, ప్రేమలతా రెడ్డి కోరుతున్నారు. ఆ్రస్టేలియాలో ఉన్న భర్త సంజీవరెడ్డి, పెద్ద కుమారుడు భారత్కు వచ్చి అనంతరం నేపాల్ వెళ్లారు. భారత రాయబార అధికారులతో మాట్లాడి సుహాసిని ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. కానీ.. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో తిరిగి భారత్కు చేరుకున్నారు. సుహాసిని సమాచారం ఇప్పటికీ తెలియకపోవడంతో దిక్కతోచని స్థితిలో ఉన్నారు. ఆమె సురక్షితంగా తిరిగి వస్తుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చదవండి: ‘నువ్వంటే నాకిష్టం..నా కోరిక తీర్చు’ -
ఉత్సాహంగా.. గంగ తెప్పోత్సవం ఫొటోలు
-
పబ్లో అర్ధరాత్రి ఘర్షణ
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి దాటిన తరువాత ఒక స్టార్ హోటల్ పబ్లో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒక వర్గంలో రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్ సోదరుడు సైతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ దసపల్లా హోటల్లోని ఎనిమిదో అంతస్థులో ‘కారా కారా’ పేరుతో పబ్ ఉంది. శనివారం రాత్రి దాదాపు 2.10 గంటల ప్రాంతంలో పబ్లో దాదాపు 200 మందికిపైగా ఉన్నారు. అదే సమయంలో పబ్లో గోడకు, టేబుల్కు మధ్యలో ఉన్న అనిల్ కుమార్యాదవ్ సోదరుడు అరవింద్ యాదవ్ (టిల్లు)ను దాటుకొని వెళ్లడానికి మరో యువకుడు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న అరవింద్ యాదవ్ స్నేహితులు యువకుడిపై దాడికి దిగారు. ఇది గమనించిన యువకుడి స్నేహితులు సైతం ఒక్కసారిగా రెచ్చిపోయి అరవింద్తోపాటు అతని స్నేహితులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పబ్లో రణరంగం చోటచేసుకొంది. బీరు సీసాలతో చేతులు, కాళ్లతో దాడికి దిగబడటంతో చుట్టు ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఉద్రిక్త వాతవారణం చోటుచేసుకొంది. ఈ గొడవలో ఒక యువతి కింద పడిపోయింది. అదే సమయంలో పబ్లోని బౌన్సర్లు వచ్చి ఇరువర్గాలను అడ్డుకొని అక్కడి నుంచి కిందకు పంపారు. వీరంతా హోటల్ సెల్లార్లోకి చేరుకుని అక్కడా ఘర్షణకు దిగారు. కొన్ని కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాల్లో కొందరికి గాయాలయ్యాయి. ఈ దాడుల్లో దాదాపు 30 నుంచి 40 మంది వరకు ఉన్నట్లు తెలుస్తుంది. హోటల్ నిర్వాహకులతోపాటు అక్కడే ఉన్న కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో ఇరువర్గాలు పరారయ్యారు. విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హోటల్లో అద్దాలు పగిలి ఉండటంతోపాటు, బల్లలు, కురీ్చలు దెబ్బతిని ఉండటాన్ని గుర్తించారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీల్లో అరవింద్ యాదవ్ టోపీ ధరించి ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఐ సందీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు పబ్పై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొందరిని విచారిస్తున్నారు. దాడుల్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సమయానికి మించి పబ్ను నడపడంతో మరో కేసు సైతం సుమోటోగా నమోదు చేశారు. -
ముషీరాబాద్ గణేష్ ఆగమన్ వేడుకల్లో విషాదం..
-
ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఆర్టీసీ-మెట్రో రైల్ ఉమ్మడి పాస్
హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణాలు చేసేవారికి గుడ్న్యూస్. ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాసులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ జారీ చేయాలనీ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. నెలవారీ, రోజువారీ పాసులను జారీ చేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ మేరకు మెట్రో, ఆర్టీసీ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి పాస్ జారీ చేయడానికి సాంకేతిక పరంగా సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు. ఉమ్మడి ఛార్జీలను త్వరితగతిన ఖరారు చేసి వెంటనే పాసుల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఇదీ చదవండి: ఇక ఈ కవలలకు జీవితాంతం పోలీసు ఉద్యోగం రాదు! -
నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్ సెలెబ్రెటీలు (ఫోటోలు)
-
నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..
-
‘సర్’ ఒక సాకు మాత్రమే.. కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది: రాంచందర్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ చుట్టూ మాటల యుద్ధం ముదురుతోంది. ఓ వైపు ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని కాంగ్రెస్ విమర్శలు చేస్తుండగా.. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ పార్టీ ఓటమి తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.రాంగోపాల్పేట్ డివిజన్కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఎస్ఐఆర్, విద్యావ్యవస్థపై ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపిస్తున్నారని రాంచందర్రావు అన్నారు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేరళలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ విజయం సాధించిందని ఆయన గుర్తుచేశారు. దీంతో ఎస్ఐఆర్ కారణంగానే బీజేపీ గెలుస్తుందన్న కాంగ్రెస్ వాదనలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఆ ఓటమికి ముందుగానే ఎస్ఐఆర్ను కారణంగా చూపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని రాంచందర్రావు పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రక్రియను అడ్డుపెట్టుకుని బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించి, మజ్లిస్కు కాంగ్రెస్ ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్ఐఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని విమర్శించారు.విద్యావ్యవస్థపై తీవ్ర అసంతృప్తిరాష్ట్రంలోని విద్యావ్యవస్థ పరిస్థితిపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. టీచర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ముందుగా విద్యావ్యవస్థను చక్కదిద్దడంపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యాశాఖను సమర్థంగా నిర్వహించడం ప్రభుత్వం వల్ల కాకపోతే.. ఆ శాఖను వేరే వారికి అప్పగించాలని రాంచందర్రావు డిమాండ్ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై బీజేపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వీధుల్లో పోరాటం చేయడంతో పాటు అవసరమైతే న్యాయస్థానాల్లోనూ పోరాడతామని తెలిపారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఇవి కూడా చదవండి: అసెంబ్లీలో ‘వెయ్యి రోజుల’ సమరం! -
గణేష్ మండపాల వద్ద డీజేలపై ప్రత్యేక నజర్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి కొద్దిరోజుల్లో మొదలు కానున్న నేపథ్యంలో మండపాల వద్ద శబ్ద కాలుష్యంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. డీజేల మోత మోగిస్తే స హించేది లేదని తేలి్చచెబుతున్నారు. శబ్ద కాలుష్యంతో వృద్ధులు, గర్భిణులు, నవజాత శిశువులు తీవ్ర అనారోగ్యానికి గురవుతుండటంపై దాఖలైన పిటిషన్లను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు.. నిబంధనలు కచి్చతంగా అమలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు ఈ దిశగా దృష్టి సారించారు.సౌండ్ పెంచితే సీజ్ ఖాయం.. నగర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల్లో డీజే సిస్టంలపై పోలీసులు సైలెంట్ అటాక్ ప్రారంభించారు. శబ్ద తీవ్రతను కొలిచేందుకు ప్రత్యేకంగా డెసిబుల్ మీటర్లతో ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి లౌడ్ స్పీకర్లు, డీజేలు వాడటానికి వీల్లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నివాస ప్రాంతాల్లో 55 డెసిబుల్స్, పగటిపూట గరిష్టంగా అనుమతించిన స్థాయులనే పాటించాలి. స్కూళ్లు, కళాశాలలు, ఆస్పత్రులు, కోర్టుల చుట్టూ 100 మీటర్ల పరిధిని నో నాయిస్ జోన్గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో శబ్దం చేస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.హామీ పత్రం ఇస్తేనే అనుమతి ఈ ఏడాది ఉత్సవ కమిటీలకు పోలీసుల అనుమతి లభించాలంటే కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మండపంలో శబ్ద పరిమితులు దాటవని, రాత్రి 10 గంటల తర్వాత మైకులు ఆపివేస్తామని నిర్వాహకులు రాతపూర్వక పత్రం సమరి్పంచాలి. డీజే, సౌండ్ సిస్టమ్స్ సరఫరా చేసే యజమానులకు ముందస్తుగానే పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. గతేడాది గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. గతేడాది శబ్ద కాలుష్య నియమావళిని దాటిన వారిపై 250కి పైగా కేసులు నమోదు చేయగా, 150కి పైగా భారీ డీజే సెట్లు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈసారి ఉల్లంఘనలకు పాల్పడితే డీజే పరికరాలతో పాటు రవాణా చేసిన వాహనాలను కూడా జప్తు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చదవండి: అప్పుడు ఓనర్.. ఇప్పుడు డ్రైవర్! -
హైదరాబాద్లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)
-
ఒకనాటి ఆదివారం
హైదరాబాద్లో ఆదివారం కూడా ఒక ఆదివారమా? దాని ఆయుష్షు ఆరేడు గంటలకు మించి ఉండదు. బద్దకంగా లేచామా... స్విగ్గిలో ఆర్డర్ పెట్టామా... తిని చేయి కడిగి ఫోన్ చూసుకునేలోపు సోమవారం వచ్చేస్తుంది. ఆదివారం సాయంత్రం నుంచే సోమవారం వచ్చేస్తుంది. సాయంత్రపు చీకటి నుంచే మరుసటి రోజు గుబులు, దిగులు చుట్టుముడుతుంది. ఆదివారం మజా అంటే అదా?అసలు ఒకప్పటి ఆదివారాలు ఎలా ఉండేవి? 1980ల కాలపు ఆదివారం... చిన్నప్పటి ఆదివారం... కేలండర్లో ఎర్ర రంగుతో ఊరించే ఆదివారం... అప్పట్లో ఒక్కో ఆదివారం 36 గంటల సేపైనా ఉండేది. వారానికి సరిపడా ఊపిరి పోసేది. పిల్లా జెల్లా ఊరు వాడా అందరూ ఆదివారం కోసం ఎదురుచూసే వారు. ఆదివారం వస్తే ఊరు బంద్. వినోదం విడుదల. ఆదివారం వస్తే టీ కొట్లు, దోసెల బండ్లు కిటకిటలాడేవి. తీరుబడిగా పేపర్ చదువుతూ ఆ వారమంతా ఊళ్లో జరిగిన విశేషాలపై వ్యాఖ్యానాలు వినిపించేవి. మధ్యాహ్నం మటనో చికెనో వొండాలి కాబట్టి అమ్మకు టిఫిన్ బరువు వేయకుండా దోసెలు తెచ్చుకుంటే ఆ చట్నీకి స్వర్గం చచ్చుకుంటూ కనిపించేది. ఫలానా చోట వేట కోసి కువ్వలు పోస్తే కూరకు పోయేవాడొకడు. సైకిల్కి కోడిని కట్టేసి ఇంటికి పట్టుకుపోతూ ఒకడు. పేకాట ΄్లాన్లో ఉండే మగాళ్ల బాడీ లాంగ్వేజ్ను ఏ ఎక్స్పర్టూ కూడా కనిపెట్టలేడు. అల్లం వెల్లుల్లి మానవజాతి కోసం త్యాగం చేసే రోజు అది. పచ్చి కొబ్బరి నూరే శబ్దానికి మించి ఇళయరాజా ట్యూన్ ఉంటుందా? ఆ రోజు ఉదయం నుంచే రేడియోను ధారాళంగా పెట్టొచ్చు. సరే... టీవీలో భారతం రావడానికి టైమ్ ఉండనే ఉంది.ఆదివారం రోజు పిల్లలందరూ ఎవరూ చెప్పకనే యోగాసనాలు వేసి హెల్త్ను బెటర్ చేసుకునేవారు. గోలీ ఆసనం, బొంగరం ఆసనం, కర్రాబిళ్ల ఆసనం, సైకిల్ తొక్కే ఆసనం, ఊరి నాలుగు దిక్కుల్లో ఉన్న నలుగురు బంధువుల దగ్గరకు నడకాసనం వేస్తూ వెళ్లి సాయంత్రం ఫస్ట్షోకు సరిపడా చిల్లర సమకూర్చుకునే ఆసనం.... పనులకు విరామం ఇచ్చి ఇళ్లల్లో ఉండే మగవాళ్లు సుష్టుగా భోం చేసి కునుకుకు ఉపక్రమిస్తే ఆడవాళ్లు బ్యాటరీ రేడియోతో పెరట్లో చేరి మధ్యాహ్నం మూడు గంటల నాటకాన్ని పేలు చూసుకుంటూ, గోరింటాకు పెట్టుకుంటూ, జ్యోతిచిత్రలో జయసుధ కట్టుకున్న చీరను పరీక్షిస్తూ వినేవారు. సాయంత్రం ఐదుగంటలకు సైకిలేసుకొని బాబాయి వచ్చేవాడు. లేకపోతే రిక్షాలో మేనత్తా మేనమామ వచ్చేవారు. కాదంటే నడుచుకుంటూ పిన్ని వచ్చేసేది. మరి ఆదివారం వచ్చేది బంధువులు కలవడానికేగా. ఊళ్లు చిన్నవి. మనసులు పెద్దవి. దూరాలు కురచవి. మనుషులకు మాటలే మత్తు పదార్థాలుగా ఉండేవి. అందరి కాపురాల ప్రసారం ప్రతి ఒక్కరి రిపోర్టింగ్లో అందరికీ తెలిసేది. కొట్లు మూసేసిన ఊరిలో సాయంత్రాలు పని లేకుండా నడవడం ఒక వింత. సినిమా హాళ్ల దగ్గర తప్ప ఇంకెక్కడా మనుషులుండరు. బాల్కనీ టికెట్లు ముందే తెచ్చుకున్న కుటుంబాలు స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకుని బింకంగా నడుచుకుంటూ పోతుంటే వాళ్లు సినిమాకు వెళుతున్నారని అందరికీ తెలిసిపోయేది. ‘ఎలా ఉంటే అలా’ అవతారాలతో దొరికిన సినిమాకు దూసుకెళ్లే శాల్తీల దూకుడూ స్పెషలే. ఇవన్నీ పట్టని వారికి సాయంత్రం టీవీలో పాత సినిమా చుక్కలు చుక్కలుగా వచ్చినా చక్కగా అర్థమయ్యేది. ఆదివారం వస్తే పిల్లలు ఆడే ఆ ఎర్ర మట్టి వీధులు, మనుషుల రాకకై తెరిచి పెట్టే ఆకుపచ్చ తలుపులు, ఆ అరుగు కబుర్లు, ఆ యాంటెన్నా కోసం అరిచిన అరుపులు... వాటిలో తిప్పలు ఉన్నా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇవాళ్టి ఆదివారాలు ఏ జ్ఞాపకాలు మిగల్చని శుష్కమైన ఆదివారాలు. జీవితంలో వెలుగులు పెరిగాయి, వసతులు పెరిగాయి, జీతాలు వేలల్లో నుంచి లక్షల్లోకి పెరిగాయి. కానీ ఈ ఆదివారం భలే గడిచింది అనే మాట తక్కువగా వినిపిస్తోంది. గత కాలము మేలు వచ్చు కాలము కంటే అంటే ఇదేనా? ఓ ఆదివారమా... నువ్వు తెచ్చే విశ్రాంతికీ వినోదానికీ కూడా రాజీనామా చేసే బతుకును బతుకుతున్నామా?అవును. పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయింది. -
ఆడి కొత్త మోడల్.. ఆవిష్కరించిన హీరో సుమంత్
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆడి సెంట్రల్ షోరూమ్లో ఆడి ఇండియా కొత్త క్యూ3 మోడల్ కారును ప్రముఖ హీరో సుమంత్ ఆవిష్కరించారు. శనివారం ఆడి సెంట్రల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా హీరో సుమంత్ మాట్లాడుతూ.. వీవీసీ గ్రూప్తో తనకు ఎన్నో ఏళ్లుగా మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఆడి క్యూ3 మోడల్ అద్భుతంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం వాహనాల్లో క్యూ3 ఒకటిగా నిలవనుందని అన్నారు. సరికొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన న్యూ క్యూ3 కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వీవీసీ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో న్యూ క్యూ3 మోడల్ను అధికారికంగా లాంచ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, వచ్చే నెల నుంచి వాహనాల డెలివరీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.సరికొత్త ఫీచర్లు, అధునాతన సాంకేతికతతో న్యూ క్యూ3 వినియోగదారుల ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. ఈ వాహనానికి ఇప్పటికే అద్భుతమైన స్పందన లభిస్తోందని, ఆల్ ఇండియా స్థాయిలోనూ భారీగా బుకింగ్స్ వస్తున్నాయని చెప్పారు. ఆడి న్యూ క్యూ3కు వినియోగదారుల నుంచి లభిస్తున్న స్పందన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీవీసీ గ్రూప్ డైరెక్టర్లు విశాల్ చౌదరి, వికాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు భారీ డేటా సెంటర్.. రూ.70 వేల కోట్ల పెట్టుబడి!
తెలంగాణలో భారీ పెట్టుబడులకు మరో అడుగు పడింది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలిచే ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడితో.. 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ సమీపంలోని.. కొంగరకలాన్ ఫ్యూచర్ సిటీలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో.. తెలంగాణ ప్రభుత్వం, టీసీఎస్, హైపర్ వాల్ట్ ప్రతినిధుల మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణను దేశంలోని ప్రముఖ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ప్రపంచ స్థాయి ప్రమాణాలతో..తెలంగాణలో ఓపెన్ ఏఐకు అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా ఉండనుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. వన్ గిగావాట్ సామర్థ్యం కలిగిన ఈ డేటా సెంటర్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నట్లు తెలిపారు.డేటా సెంటర్లకు.. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవలు వంటి రంగాల నుంచి భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద డేటా సెంటర్ తెలంగాణలో ఏర్పాటు కావడం రాష్ట్ర డిజిటల్ ఎకానమీకి మరింత బలం చేకూరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.దావోస్ భేటీతో మొదలై..ఈ ప్రాజెక్టు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు కీలకమని ప్రభుత్వం చెబుతోంది. ఎందుకంటే.. జనవరిలో దావోస్లో టీసీఎస్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు.తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న 'తెలంగాణ రైజింగ్' పాలసీ, అలాగే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై టాటా సన్స్ చైర్మన్ ఆసక్తి చూపారని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి చేసిన చర్చల అనంతరం టాటా గ్రూప్ ఈ భారీ ప్రాజెక్టుకు సిద్ధమైనట్లు వెల్లడించింది. ప్రస్తుతం టాటా గ్రూప్కు చెందిన సంస్థల్లో.. తెలంగాణలోనే సుమారు 83 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త ప్రాజెక్టుతో రాష్ట్రంలో టాటా గ్రూప్ కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉంది.ఏడువేల ఉద్యోగాలుతెలంగాణలో ప్రారంభం కానున్న..ఈ భారీ డేటా సెంటర్ నిర్మాణాన్ని 18 నుంచి 24 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సుమారు 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా డేటా సెంటర్ నిర్మాణం, నిర్వహణ, సాంకేతిక సేవలు, విద్యుత్, భద్రత, మౌలిక వసతులు వంటి అనేక రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.ఫ్యూచర్ సిటీకి ప్రాధాన్యంరూ.70 వేల కోట్ల పెట్టుబడి.. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయి అని ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచ స్థాయి డేటా సెంటర్ ఏర్పాటు కావడం ద్వారా.. ఫ్యూచర్ సిటీ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది.కాగా.. ఇప్పటికే ఫ్యూచర్ సిటీని భవిష్యత్ టెక్నాలజీ, పరిశ్రమలు, ఆధునిక మౌలిక వసతులకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ భారీ పెట్టుబడి మరిన్ని అంతర్జాతీయ, జాతీయ సంస్థలను తెలంగాణ వైపు ఆకర్షించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.మెండుగా బ్లూ కాలర్ ఉద్యోగాలుఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, బ్లూ కాలర్ ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కానీ, టాటా గ్రూప్ చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా బ్లూ కాలర్ ఉద్యోగాలు పెరుగుతాయని అన్నారు. అందుకే.. తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు యువతలో పెంచడం ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు.రేడియల్ రోడ్డు.. రతన్ టాటాకు అంకితంఫ్యూచర్ సిటీకి మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడానికి.. త్వరలోనే కొంగరకలాన్ ఫ్యూచర్ సిటీకి రేడియల్ రోడ్డును నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ రహదారిని భారతరత్న రతన్ టాటాకు అంకితం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అంతే కాకుండా.. తెలంగాణను పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా మార్చి, భారీ పరిశ్రమలు, టెక్నాలజీ సంస్థలను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లుతెలంగాణను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడంలో.. భారీ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. 2037 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తోందని సీఎం తెలిపారు. టాటా, టీసీఎస్, హైపర్ వాల్ట్ వంటి సంస్థల భారీ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.Hyderabad just landed India's Largest AI Data Centre.1 GW capacity. ₹70,000 Cr investment. 7,000+ jobs.HyperVault (@TataCompanies ) + @TCS bet big on Telangana's AI future. #TelanganaRising2047 #AI #Hyderabad @OpenAI @OffDSB @revanth_anumula https://t.co/xW4eJPpk42 pic.twitter.com/LSwf5juCtT— Telangana Rising 2047 (@TGRising2047) September 5, 2026 -
ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు
-
చిన్నారి ఎక్కడ? అని అడిగితే.. భార్యపై భర్త పైశాచికం!
హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధిస్తూ.. ఓ భర్త...భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మేడిపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. మల్లాపూర్కు చెందిన లాలుతో 2023లో చెంగిచెర్లకు చెందిన రత్నావత్ అనిత (21)కు ప్రేమవివాహం జరిగింది.వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. రెండు నెలలుగా అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో అనిత నెలరోజుల క్రితం ఆర్టీసీ కాలనీలోని తన పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 2న లాలు వచ్చి కుమార్తెను తీసుకెళ్లాడు. మళ్లీ 3న చెంగిచెర్లకు వచ్చాడు. అయితే కూతురిని తీసుకురాలేదు.మనవరాలు ఎక్కడ ఉందని అనిత తండ్రి లాలుని ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురై ఇంట్లో ఉన్న పెట్రోల్ను అనితపై పోసి నిప్పంటించాడు. కుమార్తెను రక్షించేందుకు అనిత తల్లి ప్రయత్నించే క్రమంలో ఆమెకు కూడా మంటలు అంటుకున్నాయి. బయట ఉన్న అనిత తండ్రి కేకలు విని వెంటనే వచ్చి మంటలను ఆర్పి, అనంతరం 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఇవి కూడా చదవండి: తీజ్ వేడుకల వివాదం.. జేఎన్టీయూహెచ్లో కర్రలతో దాడులు -
తీజ్ వేడుకల వివాదం.. జేఎన్టీయూహెచ్లో కర్రలతో దాడులు
హైదరాబాద్: జేఎన్టీయూహెచ్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. హాస్టల్ గదుల్లో దాక్కున్న విద్యార్థులను తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లి దాడి చేశారు. బుధవారం రాత్రి తీజ్ వేడుకల్లో మధ్య తలెత్తిన వివాదంతో విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఓ విద్యార్థి మరో విద్యార్థిని ప్రవర్తన మార్చుకోవాలని చెప్పడంతో వారిద్దరి మధ్య తోపులాట జరిగింది. వీరికి మిగతా విద్యార్థులు సర్ది చెప్పి పంపించారు.ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వా గౌతమి, మంజీరా హాస్టళ్ల వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున చేరి పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో మిగతా విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ వేరే హాస్టళ్ల గదులకు వెళ్లిపోయారు. వర్సిటీ సిబ్బంది సమాచారంతో కేపీహెచ్బీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణలో గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘర్షణకు కారకులైన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేఎన్టీయూహెచ్ ప్రిన్సిపాల్ జీవీ నరసింహారెడ్డి చెప్పారు. విచారణ చేస్తున్నాం: డీసీపీ జేఎన్టీయూహెచ్లో గొడవకు కారణమైన ఇరువర్గాల విద్యార్థులపై కేసులు నమోదు చేయడంతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ తెలిపారు. శుక్రవారం ఏసీపీ రవికిరణ్రెడ్డి, ఇన్స్పెక్టర్ విజయ్కుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు. వర్సిటీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్, హాస్టల్ నిర్వాహకులను, ఇతర సిబ్బందితో విచారణ చేపట్టినట్టు తెలిపారు. ర్యాగింగ్ కారణంగా గొడవ జరిగిందనే విషయం వాస్తవం కాదన్నారు.కేసులు ఇలా.. కాట్రావత్ నవీన్ నాయక్ ఫిర్యాదు మేరకు రాజు, ఆనంద్, వసంత్, దుర్గా ప్రసాద్, ఆదిత్య, సాగర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అదే విధంగా వసంత్నాయక్ ఫిర్యాదు మేరకు నవీన్ నాయక్, ప్రశాంత్, సందీప్, ఇస్మాయిల్, వెంకట్, చక్రి, సాత్విక్, ప్రకాష్లపై కేసులు నమోద య్యాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ప్రశాంత్, సందీప్, పూజిత్, రాజే‹Ù, సన్నీ, ఇస్మాయిల్, ఇమ్మాన్యుయేల్లపై కేసులు నమోదు చేశారు. -
KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!
-
రియల్ ఎస్టేట్లో కీలక సంస్కరణలు
సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణ అనుమతుల విధానం మరింత సులభతరం చేసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఎంప్యానెల్డ్ థర్డ్ పార్టీలు ఇచ్చే సాంకేతిక పరిశీలన, తనిఖీ నివేదికల ఆధారంగా పట్టణ స్థానిక సంస్థలు నిర్ణయాలు తీసుకునే విధానానికి అవకాశం కల్పిస్తూ ఆగస్టు 1న జీఓ 229ను జారీ చేసింది. దీంతో ఆమోదిత లేఅవుట్లలో 500 చదరపు మీటర్ల వరకు ప్లాట్ విస్తీర్ణం, 10 మీటర్ల వరకు ఎత్తు ఉన్న వ్యక్తిగత నివాస భవనాలకు ఎంప్యానెల్డ్ థర్డ్ పార్టీ తనిఖీ నివేదిక ఆధారంగా అనుమతి లేదా తిరస్కరణ జారీ చేయవచ్చు. అలాగే 300 చ.మీటర్ల వరకు ప్లాట్, 10 మీటర్ల వరకు ఎత్తు ఉన్న భవనాలకు కంప్లీషన్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ విషయంలోనూ థర్డ్ పార్టీ తనిఖీ నివేదిక పరిగణనలోకి తీసుకోవచ్చు.200 చదరపు మీటర్ల వరకు ప్లాట్, ఏడు మీటర్ల వరకు ఎత్తు ఉన్న వ్యక్తిగత భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవడం ఐచ్ఛికమని జీఓ పేర్కొంది. కానీ భవన నిబంధనలు, జోనింగ్ రెగ్యులేషన్లు, మాస్టర్ప్లాన్, ఇతర చట్టబద్ధమైన ప్రమాణాలను సడలించే అధికారం మాత్రం థర్డ్ పారీ్టలకు లేదు. ఆ అధికారం సంబంధిత మున్సిపల్ కమిషనర్ వద్దే ఉంటుంది. కేసుల కేటాయింపు, తనిఖీలు, ఆడిట్, ఉల్లంఘనలపై చర్యలు వంటి పర్యవేక్షణ వ్యవస్థను కూడా జీఓ సూచించింది. ఇదే సంస్కరణలను మరింత పటిష్ఠమైన భద్రతా ప్రమాణాలతో హైరైజ్ భవనాలు, గ్రూప్ హౌసింగ్, గేటెడ్ కమ్యూనిటీలు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, మిక్స్డ్ యూజ్ ప్రాజెక్టులకు దశలవారీగా విస్తరించాలని స్థిరాస్తి వర్గాలు కోరుతున్నాయి. పెద్ద ప్రాజెక్టులకు ఇబ్బందులు..పెద్ద నిర్మాణ ప్రాజెక్ట్ల అనుమతికి అగ్నిమాపక, ట్రాఫిక్ పోలీసు, కాలుష్య నియంత్రణ మండలి, జలమండలి, విద్యుత్ సంస్థలు, అవసరమైన చోట ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పర్యావరణ విభాగాల అనుమతులు, ఎన్ఓసీలు అవసరమవుతాయి. నిర్మాణదారుడు ఒక్కో శాఖను సంప్రదించాల్సి వస్తోంది. ఒకే పత్రాలు, డ్రాయింగ్లు, సాంకేతిక వివరాలను పలుమార్లు సమర్పించాలి. ఒకవేళ అభ్యంతరాలు వస్తే డిజైన్ను పలుమార్లు మార్చాల్సి వస్తోంది. దీంతో కాలయాపన జరిగి ప్రాజెక్టు వ్యయం పెరుగుతోంది. ఈ భారం పరోక్షంగా గృహ కొనుగోలుదారుడిపై పడే అవకాశం ఉంటుంది. ఒకే దరఖాస్తు అన్ని శాఖల సమన్వయం హైరైజ్, గ్రూప్ హౌసింగ్, కమర్షియల్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం నిజమైన సమగ్ర డిజిటల్ సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నిర్మాణదారుడు ఒకేసారి దరఖాస్తు, భూమి పత్రాలు, మాస్టర్ప్లాన్ వివరాలు, ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్లు, స్ట్రక్చరల్ కాన్సెప్ట్, ఫైర్ సేఫ్టీ ప్లాన్, ట్రాఫిక్ అధ్యయనం, నీరు–డ్రైనేజీ వివరాలు, విద్యుత్, పర్యావరణ సమాచారాన్ని సమర్పించాలి. ఆన్లైన్లోనే అవసరమైన శాఖలు ఎన్ఓసీలను అందజేయాలి. తీవ్రమైన ప్రజా భద్రత లేదా చట్టపరమైన అంశం బయటపడితే తప్ప, ఇప్పటికే పరిశీలించిన అంశాలను పదేపదే తిరిగి తెరవకుండా స్పష్టమైన విధానం ఉండాలి. పారదర్శకతకు వీలు.. జీఓ 229 విధానాలను హైరైజ్, గ్రూప్ హౌసింగ్, కమర్షియల్ ప్రాజెక్టులకు విస్తరించాలి. దీంతో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూనే, పరిశీలనను వృత్తిపరంగా, పారదర్శకంగా, నిర్ణీత గడువులో పూర్తి చేసే వీలుంటుంది. ఈ మంచి సంస్కరణను సమగ్ర సింగిల్ విండో వ్యవస్థగా అభివృద్ధి చేస్తే, తెలంగాణ నిర్మాణ అనుమతుల్లో వేగం, పారదర్శకత, భద్రతకు దేశానికే ఆదర్శంగా నిలవగలదు. – మారం సతీశ్కుమార్, ప్రెసిడెంట్, గ్రేటర్ ఈస్ట్ జోన్ అసోసియేషన్ -
నిజంగా అర్హులేనా..!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్ల లక్కీడ్రాలో ఎంపికైన లబ్ధిదారుల అర్హతను నిర్ధారించే ప్రక్రియ మొదలైంది. లాటరీలో ఎంపికైన వారి దరఖాస్తుల్లో పేర్కొన్న వివరాలు వాస్తవమేనా? నిబంధనల ప్రకారం వారు అర్హులేనా? అనే అంశాలను తేల్చేందుకు హౌసింగ్ బోర్డు, కార్పొరేషన్కు చెందిన సుమారు 80 మంది అధికారులు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగారు.లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరిస్తూ.. ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అక్కడికక్కడే నమోదు చేస్తున్నారు. కోర్ సిటీ పరిధిలోని 16 ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్లో ఎల్ఐజీ ఇళ్లను కేటాయించేందుకు కంటోన్మెంట్లో 120, మిగిలిన నియోజకవర్గాల్లో 480 మంది చొప్పున లలబ్ధిదారులతో పాటు వెయిటింగ్ లిస్ట్ కోసం మరికొంత మందిని కూడా లాటరీ ద్వారా ఎంపిక చేశారు.గురువారం లలబ్ధిదారుల అర్హతను నిర్ధారించే క్షేత్రస్థాయి పరిశీలనను హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం స్వయంగా పరిశీలించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో లక్కీడ్రాలో ఎంపికైన బషీర్బాగ్ షేర్గేట్ సమీపంలో నివసిస్తున్న లబ్ధిదారుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివరాలను స్వయంగా యాప్లో అప్లోడ్ చేశారు. దరఖాస్తు వివరాలతో పోల్చి.. ఇళ్లకు దరఖాస్తు చేసుకునే సమయంలో లలబ్ధిదారుల నుంచి ఎలాంటి ధ్రువపత్రాలను తీసుకోలేదు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సేకరిస్తున్న వివరాలను అప్పట్లో దరఖాస్తులో పొందుపరిచిన సమాచారంతో అనుసంధానించి పరిశీలిస్తున్నారు. లలబ్ధిదారులు పదేళ్లుగా అదే నివాసంలో ఉంటున్నారా? అంతకుముందు ఎక్కడ నివసించారు? ఇంటి నిర్మాణ పరిస్థితి? కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు? తదితర వివరాలను ఆరా తీస్తున్నారు.ఇంటి ఫొటోలను యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. మరోవైపు లక్కీడ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారుల వివరాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు కూడా అధికారులు అవకాశం కల్పించారు. అభ్యంతరాలను క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిన అంశాలతో సమగ్రంగా పరిశీలించి.. అర్హులైన వారి తుది జాబితాను ఖరారు చేయనున్నారు.10 వరకు ఎల్ఐజీ ఇళ్ల దరఖాస్తుల గడువు పెంపు ఇందిరమ్మ ఎల్ఐజీ ఇళ్ల కోసం ముషీరాబాద్, గోషామహల్, ఎల్బీ నగర్, చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 10 వరకు పొడిగించినట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతం తెలిపారు. ఈ నెల 3 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఉండగా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోనికి తీసుకొని మరో వారం వరకు పెంచినట్లు తెలిపారు. అల్పాదాయ వర్గాల ప్రజల సొంత ఇంటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ పథకంలో ఇండ్లు పొందేందుకు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఇవి కూడా చదవండి: కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ -
కిరాణా కొట్టు నుంచి కోట్ల అక్రమ సామ్రాజ్యం! ఎవరీ నీతుబాయి?
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు గుడుంబా విక్రయం.. ఆ తర్వాత గంజాయి వ్యాపారం.. చిన్న స్థాయిలో మొదలైన దందా క్రమంగా భారీ నెట్వర్క్గా మారింది. అనేక ప్రాంతాలకు విస్తరించింది. గంజాయి విక్రేతలు, వినియోగదారులకు ఆమె కేంద్రంగా మారింది. అంచెలంచెలుగా ఎదిగింది. ధూల్పేట్లో కిరాణా దుకాణం ముసుగులో గంజాయి విక్రయాలను ప్రారంభించిన నీతుబాయి.. రూ.కోట్లలో అక్రమ వ్యాపార సామ్రాజ్యానికి డాన్గా మారింది.ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, డెలివరీ సిబ్బంది లక్ష్యంగా సామ్రాజ్యాన్ని విస్తరించింది. వరుసగా కేసులు నమోదైనా, పలుమార్లు అరెస్టయినా.. పీడీ యాక్ట్ కింద నిర్బంధించినా.. ఆమె దందా మాత్రం కొనసాగడం గమనార్హం. గంజాయి విక్రయాలతో ప్రారంభించి హవాలా వ్యాపారం దిశగా సాగింది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగింది. నీతుబాయి స్వస్థలం ధూల్పేట్ అయినప్పటికీ, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, డెలివరీ బాయ్లను లక్ష్యంగా చేసుకోవడానికి నానక్రామ్గూడలోని లోథాబస్తీలో చిన్న కిరాణా దుకాణం ప్రారంభించింది.అంగూరిబాయి (అరుణాబాయి)తో పాటు ఒడిశా, ఏపీ సరిహద్దు ప్రాంతాల ద్వారా గంజాయి దిగుమతి చేసుకునేది. కిలో గంజాయిని రూ.8వేలకు కొనుగోలు చేసి 5 గ్రాముల చిన్న పొట్లాలుగా మార్చి, ఒక్కో పొట్లాన్ని రూ.500 కి విక్రయించేది. ఈ లెక్కన కిలోపై రూ. 50 వేల వరకు నికర లాభం ఆర్జించేది. ఆమె కుటుంబం మొత్తం కూడా ఈ అక్రమ వ్యాపారంలో భాగస్వాములే.రోజుకు సగటున రూ.10 లక్షల విక్రయాలు రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు అమ్మకాలు జరిగేవని ఎక్సైజ్ అధికారుల దాడుల్లో తేలింది. నీతుబాయిపై 18కి పైగా ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి. గతంలో గచ్చిబౌలి పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. 2024లో 22.6 కిలోల గంజాయి, రూ.22.10 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నారు.నీతుబాయి నేరపూరిత సంపాదనపై ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎంఎఎల్ఏ చట్టం కింద మనీ లాండరింగ్ కేసులు నమోదు చేసి, నానక్రామ్గూడలోని ఇంట్లో సోదాలు నిర్వహించింది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతాల్లో వేలాది మంది ఐటీ ఉద్యోగులు, ఉన్నత ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఆమె వ్యాపారాన్ని విస్తరించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇక్కడి నైట్లైఫ్ కూడా ఇందుకు దోహదం చేసినట్లు చెప్పారు.ఇవీ చదవండి: రేవంత్ బ్లాక్మెయిల్... అందుకే ఉద్వాసన -
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తీజ్ వేడుకల్లో విద్యార్థులు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.గౌతమి, మంజీరా హాస్టల్ విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పరస్పరం దాడులకు దిగడంతో జేఎన్టీయూలో టెన్షన్ వాతావరణ ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న కేపీహెచ్బీ పోలీసులు పరిస్థితి అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
ఫ్రిజ్లో మృతదేహం కేసులో ప్రధాన నిందితుడికి ఊరట
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పదిహేనేళ్ల క్రితం హైదరాబాద్లో కలకలం రేపిన కరీంనగర్ యువకుడి కిడ్నాప్, హత్య కేసులో ప్రధాన నిందితుడిని సుప్రీంకోర్టు నిర్దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. మృతదేహాన్ని ఫ్రిజ్లో దాచిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడు కొండపాక శ్రీధర్ అలియాస్ శేఖర్ (ఏ1) దాఖలు చేసిన అప్పీల్పై గురువారం తీర్పు వెలువరించింది. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదును ఉమ్మడి హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో ఆరుగురు నిందితుల్లో ఒకరు విచారణ దశలోనే చనిపోగా, మిగిలిన ఐదుగురికి కింది కోర్టు జీవిత ఖైదు ఖరారు చేసిందన్నారు. కానీ, పైకోర్టు నలుగురిని నిర్దోషులుగా విడుదల చేసి, శ్రీధర్కు మాత్రమే శిక్షను సమర్థించిందని తెలిపారు. అతడు ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నట్లు కచ్చితమైన ఆధారాలు లేవని, ఇప్పటికే 16 ఏళ్లుగా జైలుకే పరిమితమయ్యాడని, బెయిల్ వచ్చినా పూచీకత్తు సమర్పించలేని స్థితిలో ఉన్నాడని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేసింది. కింది కోర్టులో శిక్ష పడిన నలుగురిని హైకోర్టు విడుదల చేస్తే, వారిపై ప్రభుత్వం ఎందుకు అప్పీల్కు వెళ్లలేదని నిలదీసింది. సహ నిందితులను వదిలేసి, ఒకే వ్యక్తిపై హత్యానేరాన్ని ఎలా నిర్ధారిస్తారని వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఏం జరిగిందంటే... జగిత్యాలకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు 2011 జూన్లో హైదరాబాద్కు వచ్చి అదృశ్యమయ్యాడు. కిడ్నాపర్లు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో, బాధితుడి తండ్రి లక్షన్నర రూపాయలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. ఆ బ్యాంక్ లావాదేవీలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఉప్పల్లోని ఓ అపార్ట్మెంట్లో గాలింపు చేపట్టారు. అక్కడి 402వ నంబరు ఫ్లాట్లోని ఫ్రిజ్లో శ్రీనివాస్ మృతదేహం ప్లాస్టిక్ కవర్లు, వైర్లతో చుట్టి కుళ్లిన స్థితిలో కనిపించింది. ఈ కేసులో కరీంనగర్ కోర్టు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. హైకోర్టు శ్రీధర్ మినహా నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుపైనే శ్రీధర్ సుప్రీంను ఆశ్రయించాడు. -
గాల్లోనే ఆహుతి చేస్తుంది
భారత రక్షణ రంగ సాంకేతికతలో హైదరాబాద్ స్టార్టప్ సరికొత్త చరిత్ర లిఖించింది. శత్రువుల డ్రోన్ దాడులను గగనతలంలోనే అత్యంత వేగంగా తిప్పికొట్టే ’ఆహుతి మార్క్–2’ ఎలక్ట్రిక్ మల్టీరోటర్ డ్రోన్ ఇంటర్సెప్టర్ను అపొలియాన్ డైనమిక్స్(డిఫెన్స్ స్టార్టప్ కంపెనీ)తయారు చేసింది. ఈ డ్రోన్ గంటకు 498 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకొని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరును అధికారికంగా నమోదు చేసుకుంది. తద్వారా దక్షిణ ఆసియాలోనే అత్యధిక వేగ పరిమితిని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్లో ఈ స్టార్టప్ 2025లో ప్రారంభమైంది. సంస్థ వ్యవస్థాపకులు జయంత్ ఖత్రి, శౌర్య చౌదరి నేతృత్వంలో ఈ సాంకేతికత రూపుదిద్దుకుంది. అమన్ విరానీ, మానస్ విచారే, ఇషాన్ సూరిలతో కూడిన ప్రతిభావంతమైన బృందం ఈ రికార్డు స్థాయి డ్రోన్ను రాత్రింబగళ్లు కష్టపడి అభివృద్ధి చేసింది. ముఖ్యంగా హై–స్పీడ్ డ్రోన్ పైలట్ అయిన అమన్ విరానీ ఈ డ్రోన్ ప్రయోగాత్మక పరీక్షల్లో, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.పాత రికార్డులు బద్దలు.. గతంలో భారతదేశంలో మల్టీరోటర్ డ్రోన్ల గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లుగా నమోదైంది. అయితే ఆహుతి మార్క్–2 ఆ పాత రికార్డును భారీ వ్యత్యాసంతో అధిగమించింది. 2025లో రూపొందించిన మొదటి తరం ’ఆహుతి’ డ్రోన్ గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందుకోగలిగింది. కేవలం ఒకే సంవత్సరంలో ఈ బృందం పాత నమూనాను పూర్తిగా ప్రక్షాళన చేసి, సరికొత్త సాంకేతికతతో పునర్నిర్మించింది. దీనివల్ల డ్రోన్ వేగం ఏకంగా 66 శాతం పెరిగి గంటకు 498 కిలోమీటర్లకు చేరుకుంది. దక్షిణ ఆసియాలోనే ఇంతటి వేగవంతమైన మల్టీరోటర్ డ్రోన్ మరొకటి లేదని కంపెనీ చెబుతోంది. డ్రోన్ ఇంటర్సెప్టర్ అంటే శత్రువుల డ్రోన్లను గాల్లోనే గుర్తించి, వాటిని అడ్డుకుని, నాశనం చేసే ఒక అధునాతన రక్షణ వ్యవస్థ. సరళంగా> చెప్పాలంటే డ్రోన్లను వేటాడే మరో డ్రోన్ లేదా మిస్సైల్ అన్నమాట.యుద్ధ వ్యూహాలలో మార్పులు..ప్రస్తుత ఆధునిక యుద్ధాలలో తక్కువ ఖర్చుతో కూడిన ‘షాహెద్’రకానికి చెందిన డ్రోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇటువంటి చౌకబారు శత్రు డ్రోన్లను ఎదుర్కొనేందుకు లక్షల రూపాయల విలువైన ఖరీదైన క్షిపణులను ఉపయోగించడం ఆర్థికంగా భారం అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే అపొలియాన్ డైనమిక్స్ ఈ అత్యాధునిక ఇంటర్సెప్టర్ను తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చింది. శత్రువుల దాడిని తిప్పికొట్టడంలో వేగమే అత్యంత కీలకమని, గంటకు 498 కిలోమీటర్ల వేగంతో తాము ఏ రకమైన వైమానిక ముప్పునైనా సమర్థవంతంగా అడ్డుకోగలమని సంస్థ వ్యవస్థాపకులు ధీమా వ్యక్తం చేశారు. సైన్యానికి సరఫరా..ఈ అసాధారణ వేగాన్ని అందుకోవడానికి డ్రోన్ ఫ్రేమ్, ప్రొపల్షన్ వ్యవస్థ, మోటార్ల అమరికను సుమారు పది సార్లు పునఃసమీక్షించి మార్పులు చేశారు. ఈ డ్రోన్ ప్రయాణించే సమయంలో ఒకేసారి 400 యాంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని గ్రహిస్తుంది. ఇదే దీని వేగానికి ప్రధాన కారణం. భారత సైన్యం సహకారంతో బాబినా, గోపాల్పూర్ వంటి సైనిక ఫైరింగ్ కేంద్రాలలో ఈ వ్యవస్థలను విజయవంతంగా పరీక్షించారు. ఇప్పటికే ఈ సంస్థ భారత సైన్యానికి గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కామికేజ్ డ్రోన్లను సరఫరా చేసింది.క్రూజ్ క్షిపణి లక్ష్యంగా..ప్రమాదకర సరిహద్దు ప్రాంతాలలో మానవ రహిత వ్యవస్థలను ఉపయోగించడం ద్వారా సైనికుల ప్రాణాలను కాపాడటమే కంపెనీ ముఖ్య ఉద్దేశం. అగ్ని క్షిపణి కార్యక్రమానికి మాజీ ప్రోగ్రామ్ డైరెక్టర్గా వ్యవహరించిన ప్రొఫెసర్ ఎం.రామ మనోహర బాబు ప్రస్తుతం ఈ సంస్థ సలహా మండలిలో సేవలందిస్తున్నారు. ఈ సంస్థ 2032 నాటికి వేలాది కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల భారీ పవర్ క్రూజ్ క్షిపణి ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
హైదరాబాద్లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తున్నారా?
హైదరాబాద్: అబిడ్స్లోని ఇస్కాన్ (ISKCON) ఆలయంలో ఆ ఆలయ యాజమాన్యం నిర్వహించనున్న "శ్రీ కృష్ణాష్టమి మహోత్సవం" సందర్భంగా.. భక్తుల రద్దీ, రాకపోకలను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబరు 4 తెల్లవారుజామున 4 గంటల నుంచి సెప్టెంబరు 5 అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయి.ఈ దారుల్లో వెళ్లొద్దుయూసుఫ్ & కంపెనీ, జవహర్లాల్ నెహ్రూ రోడ్డు, అబిడ్స్ సర్కిల్, పాత హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్, చిరాగ్ అలీ లేన్, నాంపల్లి స్టేషన్ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాహనదారులు వీలైనంత వరకు ఈ దారుల్లో వెళ్లొద్దు.ట్రాఫిక్ మళ్లింపులుభక్తుల రాకపోకలు, అప్పటి ట్రాఫిక్ పరిస్థితులను బట్టి అబిడ్స్ ఇస్కాన్ ఆలయ సమీపంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. గన్ఫౌండ్రీ, తిలక్ రోడ్ జంక్షన్ నుండి నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్ను జిపిఓ (GPO) జంక్షన్ వద్ద 'హాట్ అండ్ గో' పద్ధతిలో నియంత్రిస్తారు. రద్దీ ఎక్కువగా ఉంటే ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు. జాంబాగ్ రోడ్ , ఎస్.ఎ. బజార్ మసీదు నుండి జిపిఓ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ను కూడా 'హాట్ అండ్ గో' పద్ధతిలోనే నియంత్రిస్తారు. రద్దీ పెరిగితే జిపిఓ జంక్షన్ వైపు అనుమతించకుండా ఎంజే మార్కెట్ వద్ద గాంధీ భవన్, చాపెల్ రోడ్ వైపు మళ్లిస్తారు. నాంపల్లి తాజ్ ఐలాండ్ నుండి కోఠి బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే ట్రాఫిక్ను సాధారణ మార్గమైన భారత్ పెట్రోల్ పంప్ వద్ద ఎడమ మలుపు తీసుకుని, సమాచార హక్కు భవన్ (పాత ఎసిబి లేన్), యూసుఫ్ & కంపెనీ, ట్రూప్ బజార్ మీదుగా కోటి బ్యాంక్ స్ట్రీట్ వైపు అనుమతిస్తారు. అలాగే బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి వచ్చే ట్రాఫిక్ను పాత హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వైపు అనుమతించకుండా, ఎంజే మార్కెట్ రోడ్ వైపు మళ్లిస్తారు.ఆర్టీసీ (RTC) బస్సుల మళ్లింపులుఇస్కాన్ ఆలయ పరిసర మార్గాల గుండా వెళ్లే ఆర్టీసీ బస్సులను భక్తుల రద్దీ ఆధారంగా మళ్లిస్తారు. రంగమహల్ , జాంబాగ్ రోడ్ నుండి వచ్చే బస్సులను ఎంజే మార్కెట్ జంక్షన్ వద్ద కుడివైపు ఉన్న జిపిఓ జంక్షన్ లేదా అబిడ్స్ సర్కిల్ వైపు వెళ్లనివ్వకుండా, గాంధీ భవన్ రోడ్ లేదా నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తారు (ఇక్కడ జాంబాగ్ వద్ద ఆర్టీసీ కంట్రోలర్ విధి నిర్వహణలో ఉంటారు). ఎస్.ఎ. బజార్ మసీదు లేదా అఫ్జల్గంజ్ నుండి వచ్చే బస్సులను ఎంజే మార్కెట్ జంక్షన్ వద్ద నేరుగా జిపిఓ జంక్షన్ వైపు వెళ్లనివ్వకుండా, గాంధీ భవన్ రోడ్ లేదా నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తారు (ఇక్కడ ఎస్.ఎ. బజార్ వద్ద కంట్రోలర్ ఉంటారు). లిబర్టీ, బషీర్బాగ్ నుండి వచ్చే బస్సులను బిజేఆర్ సర్కిల్ వద్ద జిపిఓ జంక్షన్ వైపు అనుమతించకుండా, ఏ.ఆర్. పెట్రోల్ పంప్ వైపు మళ్లిస్తారు (ఇక్కడ బిజేఆర్ సర్కిల్ వద్ద కంట్రోలర్ ఉంటారు). రవీంద్ర భారతి లేదా హెచ్టిపి జంక్షన్ నుండి వచ్చే బస్సులను ఏ.ఆర్. పెట్రోల్ పంప్ వద్ద ఎడమవైపు బిజేఆర్ సర్కిల్ వైపు వెళ్లనివ్వకుండా, నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తారు (ఇక్కడ ఏ.ఆర్. పెట్రోల్ పంప్ వద్ద కంట్రోలర్ విధి నిర్వహణలో ఉంటారు).పార్కింగ్ ఏర్పాట్లు, సూచనలుఅబిడ్స్ ఇస్కాన్ ఆలయానికి విచ్చేసే భక్తుల వాహనాల కోసం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పార్కింగ్ వసతి ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ట్రాఫిక్ రద్దీకి గురికాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్లైన్ నంబర్ 9010203626కు ఫోన్ చేయొచ్చు. -
ప్రాజెక్ట్ సంజీవని.. 15 బ్రీత్ అనలైజర్ల అందజేత
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత పటిష్టం చేసేందుకు కీలక అడుగు పడింది. 'సేవ్లైఫ్ ఫౌండేషన్' (SLF) హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు 15 అత్యాధునిక బ్రీత్ అనలైజర్లను అందజేసింది. 'వర్టిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్' మద్దతుతో నడుస్తున్న 'ప్రాజెక్ట్ సంజీవని'లో భాగంగా ఈ పరికరాలను పంపిణీ చేసినట్లు తెలిపింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ (IPS) డి. జోయల్ డేవిస్, వర్టిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి.వి.ఎమ్. కిరణ్ బాబు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ హ్యాండోవర్ 'ప్రాజెక్ట్ సంజీవని'లో ఒక భాగం. ఇది దేశంలోనే మొదటి పూర్తి స్థాయి రోడ్డు ప్రమాదాల తక్షణ వైద్య సహాయం హైవే రెస్క్యూ ప్రోటోకాల్. తెలంగాణ ప్రభుత్వం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో సేవ్లైఫ్ ఫౌండేషన్ ఈ పైలట్ ప్రాజెక్ట్ను అమలు చేస్తోంది. హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వరకు ఉన్న 251 కిలోమీటర్ల 'NH-44' కారిడార్లో దీనిని నిర్వహిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సేవలు అందించేందుకు 2026 ఏప్రిల్లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఇప్పుడు అందిన సరికొత్త బ్రీత్ అనలైజర్ల ద్వారా ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అడ్డుకునేందుకు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను వేగంగా నిర్వహించేందుకు ట్రాఫిక్ పోలీసులకు వీలవుతుంది.మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల దేశవ్యాప్తంగా 2024లోనే 3,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ కొత్త పరికరాల వల్ల స్పాట్లోనే వేగంగా, స్పష్టమైన ఆధారాలతో డ్రైవర్లను పరీక్షించే వీలుంటుంది. దీనివల్ల నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులువవుతుంది. ఈ ప్రాజెక్ట్ను తెలంగాణలోని ఇతర జాతీయ రహదారులతో పాటు దేశవ్యాప్తంగా విస్తరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ (IPS) డి. జోయల్ డేవిస్ మాట్లాడుతూ, నగరంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి మరియు ప్రజల ప్రాణాలను కాపాడటానికి ట్రాఫిక్ పోలీస్ విభాగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. రోడ్డుపై తమ అధికారులు ఎదుర్కొనే అతిపెద్ద సవాళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి అని, దీనిపై కఠినమైన నిఘా ఉంచడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. 'ప్రాజెక్ట్ సంజీవని' కింద అందిన ఈ బ్రీత్ అనలైజర్లు తమ అధికారుల సామర్థ్యాన్ని మరింత పెంచుతాయని, మద్యం తాగి వాహనాలు నడిపే వారిని వేగంగా, కచ్చితత్వంతో పట్టుకోవడానికి ఇవి సహాయపడతాయని తెలిపారు. తమకు మద్దతుగా నిలిచిన సేవ్లైఫ్ ఫౌండేషన్ మరియు వర్టిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
హైదరాబాద్లో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నిరక్షరాస్యులైన ముగ్గురు వ్యక్తులు బతుకుదెరువు కోసం గిగ్ వర్కర్లుగా మారారు. స్మార్ట్ఫోన్లో రీల్స్ చూసి నకిలీ నోట్ల తయారీ విధానం తెలుసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో దొరికిన ఫోన్ నంబర్లో సంప్రదించి ముడిసరుకు, ఉపకరణాలు పొందారు. వాటర్ మార్కు కోసం ర్యాపింగ్ కవర్లను నైపుణ్యంతో కత్తిరించి వాడారు. ఇలా రూపొందిన నకిలీ నోట్లను రాత్రి వేళల్లో వైన్, పాన్షాపుల వద్ద మారి్పడి చేస్తూ శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కారు. కేసు వివరాలను బుధవారం రాజేంద్రనగర్లోని కార్యాలయంలో అదనపు డీసీపీ కేఎస్ రావు వెల్లడించారు. నల్లగొండ జిల్లా వాడిపట్ల చింతల్ తండాకు చెందిన సమీప బంధువులు రమావత్ రాము అలియాస్ మహమ్మద్, రమావత్ మోతిలాల్ గిగ్ వర్కర్లు కాగా, రమావత్ గాంధీ ఆటోడ్రైవర్. బతుకుతెరువు కోసం నగరానికి వలస వచ్చి బాలాపూర్లో నివసిస్తున్నారు. ఈ త్రయం తేలిగ్గా డబ్బు సంపాదించడానికి అనువైన మార్గాలను అన్వేషించింది. ఈ నేపథ్యంలోనే రాము తన స్మార్ట్ఫోన్లో ఓ ఇన్స్టా్రగామ్ రీల్ చూశాడు. నాగోల్ బండ్లగూడకు చెందిన చెర్ల సు«దీర్ పోస్టు చేసిన రీల్లో నకిలీ నోట్లు ఎలా తయారు చేయాలో ఉంది. దీంతో రాము.. ఈ విషయం మోతీలాల్, గాం«దీలకు చెప్పాడు. వాళ్లూ అంగీకరించడంతో ఇన్స్టాలోనే దొరికిన ఫోన్ నంబర్లో సంప్రదించి స్కానర్, కలర్ ప్రింటర్లతో పాటు కట్టర్, బాండ్ పేపర్లు కొన్ని రసాయనాలు ఖరీదు చేశాడు. వాటర్ మార్క్ సైతం ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.200 నోట్లను స్కాన్ చేసిన ఈ ముగ్గురూ కలర్ ప్రింటర్ ద్వారా బాండ్ పేపర్పై ప్రింట్ తీశారు. వీటిని కత్తిరించడంతో పాటు వాటర్ మార్క్ కోసం ర్యాపింగ్ కవర్లు కత్తిరించి, చాకచక్యంగా అతికించి అసలైన నోటుగా చేసి బాలాపూర్, శంషాబాద్ ప్రాంతాల్లోని వైన్, పాన్ షాపుల్లో రాత్రి సమయంలో మార్చారు. రూ.లక్ష అసలు కరెన్సీ ఇస్తే రూ.2.5 లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామంటూ పరిచయస్తులకు సమాచారం అందించారు. మరోపక్క ఓ పాన్షాప్ నిర్వాహకుడు నగదును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లగా వాటిలో నకిలీ నోట్లు ఉన్నట్లు తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం బాలాపూర్లో రాము, మోతిలాల్, గాంధీలను పట్టుకున్నారు. రూ.2.91 లక్షల నకిలీ కరెన్సీతో పాటు సామగ్రి, ప్రింటర్, స్కానర్ స్వా«దీనం చేసుకున్నారు. మన చావును ఇలా తెలుసుకోవచ్చట.. షాకిస్తున్న జపాన్ అధ్యయనం! -
సారీ రాధికా.. గుడ్బై
హైదరాబాద్: భార్య పుట్టినరోజు నాడే ఓ ఐటీ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లాకు చెందిన రమేష్ (40), రాధిక దంపతులు కూకట్పల్లి దేవి నగర్లోని భాస్కర ప్యాలెస్లో నివాసముంటున్నారు. రమేష్ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 1న భార్య రాధిక పుట్టినరోజు కావడంతో ఆమె అక్క, తమ్ముడు ఇంటికి వచ్చారు. అందరూ కలిసి ట్యాంక్ బండ్కు వెళదామని రమేష్ను కోరగా.. తాను రానని చెప్పడంతో వారు వెళ్లారు. ఇంట్లో ఉన్న రమేష్ అర్ధరాత్రి భార్యకు ‘పొరపాటు జరిగింది సారీ గుడ్ బై’ అని మెసేజ్ పంపాడు. కంగారుపడిన భార్య వెంటనే ఇంటికి వచ్చి చూడగా, అప్పటికే రమేష్ చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని విగతజీవుడిగా పడి ఉన్నాడు. భార్య పుట్టినరోజే భర్త ఇలా ప్రాణం తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను చంపిన భార్య -
HYD: ఆర్మీ క్యాంప్ సమీపంలో డిటోనేటర్ల కలకలం..
సాక్షి, మల్కాజ్గిరి: హైదరాబాద్లోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్ సమీపంలో డిటోనేటర్లు కలకలం రేపాయి. ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ సమీపంలో ఓ ప్లాస్టిక్ బకెట్లో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభించడంతో ఆర్మీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కాగా, ఫైరింగ్ రేంజ్ వెనుక గోడ సమీపంలో ఉన్న బకెట్లో మొత్తం 8 బండిల్స్లో 160 డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇవి 33A సైజు కమర్షియల్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లుగా అధికారులు గుర్తించారు. ఆర్మీ సిబ్బంది సమాచారంతో బొల్లారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డిటోనేటర్లను పరిశీలించేందుకు మల్కాజ్గిరి బాంబ్ డిస్పోజల్ టీమ్కు సమాచారం అందించారు. డిస్పోజల్ టీమ్ సూచనల మేరకు డిటోనేటర్లను ఆర్మీ సిబ్బంది సురక్షితంగా భద్రపరిచారు. అవి అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో ఆర్మీ క్యాంప్ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఇదీ చదవండి: కొండా సురేఖ ఎపిసోడ్కు ఎండ్ కార్డు? -
హైదరాబాద్లో అతిపెద్దదైన స్టీల్ బ్రిడ్జి
హైదరాబాద్: నగరంలోనే అతిపెద్దదైన నల్లగొండ ఎక్స్రోడ్ స్టీల్ బ్రిడ్జి (సైదాబాద్) ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ స్టీల్ వంతెనను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. మొదట మలక్పేట అక్బర్బాగ్లోని ఫైర్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం బ్రిడ్జి మీదుగా సీఎం కాన్వాయ్ సంతోష్నగర్–యాదిగిరి «థియేటర్ వరకు వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి అదే బ్రిడ్జి మీదుగా వచ్చి నల్లగొండ క్రాస్రోడ్ వద్ద యూటర్న్ తీసుకుని మలక్పేట ఫైర్ స్టేషన్, చంచల్గూడ జైలు రోడ్ మీదుగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణకు చేరుకుంటుంది. ఇక్కడ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. కాగా రూ.620 కోట్ల వ్యయంతో 3.23 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి నగరంలోనే అతి పెద్దది. ఇంతకు ముందు ఇందిరాపార్క్ నుండి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి 2.3 కి.మీ ఉండగా..సైదాబాద్ స్టీల్బ్రిడ్జి దీనిని అధిగమించనుంది. స్టీల్బ్రిడ్జ్ నిర్మాణం కింది భాగంలో ఇరువైపులా రహదారులను సైతం అధికారులు పూర్తిగా ఆధునీకరించారు. పచ్చదనం పెంపునకు కూడా చర్యలు చేపట్టారు. ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బుధవారం ప్రాజెక్టు అధికారులతో కలిసి స్టీల్ బ్రిడ్జి వద్ద ఏర్పాట్లు పర్యవేక్షించారు. సౌత్ రేంజ్ అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, సౌత్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, అడిషనల్ డీసీపీ ఎంఏ మాజీద్ తదితరులు సీఎం పర్యటించే ప్రాంతాలను తనిఖీ చేశారు. చంచల్గూడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో నిర్వహించనున్న బహిరంగ సభ వద్ద ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మలక్పేట, సైదాబాద్ ఏసీపీలు రాజా వెంకట్రెడ్డి, వెంకట్రెడ్డి, ఇన్స్పెక్టర్లు బ్రహ్మమురారి, వెంకట్రెడ్డి ఉన్నారు.చదవండి: అనుమానంతో భార్యను చంపిన భర్త -
మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని వలస నేతలు, కేబినెట్ మంత్రులను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఢిల్లీ చేరిన తరుణంలో కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ అంతర్గత విభేదాలను మరోసారి బట్టబయలైనట్లైంది. ‘కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని ఉన్న అసలైన నేతలను పక్కనబెడుతున్నారు. వేరే పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన కొందరు నేతలు పార్టీని కబ్జా చేస్తున్నారు. మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెళ్లగొట్టాలని చూస్తున్నారు అంటూ పరోక్షంగా కేబినెట్లోని కీలక నేతలను, పార్టీలోని వలస నేతలను లక్ష్యంగా చేసుకుని ధ్వజమెత్తారు.తనకు పదవుల పట్ల ఆశ లేదని చెప్తూనే, సమయం వచ్చినప్పుడు పదవులు అవే వెతుక్కుంటూ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కచ్చితంగా ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టిస్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని, అయితే ఆ హామీ నెరవేరకపోవడంపై ఆయన తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది.పదవుల కంటే రాజకీయాల్లో, ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు రావడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. పేద ప్రజల సమస్యలను పక్కనబెట్టి సొంత ప్రయోజనాల కోసం పనిచేసే సంస్కృతి మారాలని, అభివృద్ధి పనులు నిలిచిపోవడంపై తాను గళం విప్పుతూనే ఉంటానని రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు.👉ఇదీ చదవండి : ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖకు ఊహించని ట్విస్ట్ -
కండరాలు, గుండె పనితీరుకు ఆ విటమిన్ అత్యంత కీలకం..!
ఎముకల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీరంలోని కండరాలు, గుండె పనితీరును మెరుగుపరచడంలో విటమిన్–డీ2 కంటే విటమిన్–డీ3 అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని హైదరాబాద్లోని ఐసీఎమ్ఆర్– జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) పరిశోధనలో తేలింది. ముఖ్యంగా శరీరంలో విటమిన్ లోపం ఉన్నప్పుడు, దాని నుంచి కోలుకునే ప్రక్రియలో విటమిన్–డీ3 కీలక పాత్ర పోషిస్తుందని మగ ఎలుకలపై జరిపిన ప్రయోగం ద్వారా స్పష్టమైంది. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ పత్రిక ‘మాలిక్యులర్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్’లో ప్రచురితమయ్యాయి.పరిశోధనలో ఏం తేలిందంటే.. కండరాల పుష్టి: విటమిన్–డీ2తో పోలిస్తే విటమిన్–డీ3 తీసుకున్న ఎలుకలలో కండరాల పరిమాణం, కండరాల పీచు పరిమాణం, పట్టుకునే బలం గణనీయంగా పెరిగాయి.గుండె ఆరోగ్యం: గుండె కండరాల సంకోచవ్యాకోచాలు, గుండెకు సంబంధించిన జీవక్రియలలో విటమిన్–డీ3 అద్భుతమైన ఫలితాలను చూపించింది.శక్తి జీవక్రియలు: కండరాలవృద్ధికి, శరీరంలో శక్తి ఉత్పత్తికి సంబంధించిన రసాయన ప్రక్రియలను విటమిన్–డీ3 వేగవంతం చేసింది.పరిశోధన ఇలాగవిటమిన్–డీ సాధారణంగా డీ–2, డీ–3 గా రెండు రూపాల్లో లభిస్తుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాల కోసం ప్రయోగశాలలో పెరుగుతున్న మగ ఎలుకల మీద ప్రయోగం చేశారు. ఒక సమూహానికి విటమిన్–డీ2, మరొక సమూహానికి విటమిన్–డీ3, ఇంకొక సమూహానికి రెండింటి మిశ్రమాన్ని, చివరి సమూహానికి విటమిన్–డీ లేని ఆహారాన్ని ఇచ్చారు.గుండె నిర్మాణాన్ని రక్షించడంలో..శరీరంలో కాల్షియం స్థాయిలను క్రమబద్ధీకరించడంలో ఈ రెండు విటమిన్లు సమానంగా పనిచేసినప్పటికీ, కండరాలు, గుండె నిర్మాణాన్ని రక్షించడంలో విటమిన్–డీ3 ఎంతో శక్తివంతమైనదని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆయేషాఇస్మాయిల్ వివరించారు. భవిష్యత్తులో ప్రజలకు అందించే విటమిన్ అనుబంధ ఆహారాలు (సప్లిమెంట్లు), పౌష్టికాహార పెంపుదల (ఫోర్టిఫికేషన్) కార్యక్రమాలలో కీలక మార్పులకు ఈ ఫలితాలు ఉపయోగపడతాయని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ భారతి కులకర్ణి పేర్కొన్నారు. మానవులపై దీని ప్రభావాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరిన్ని విస్తృత పరిశోధనలు అవసరమని తెలిపారు. (చదవండి: ఆటిజం పిల్లలకు ప్రత్యేక చట్టాలున్నాయి!) -
పోలీస్ స్టేషన్ లో ఆనంద్ సాయి కొడుకు సందీప్
-
Hyd: సెప్టెంబర్ లోనూ ఇంతే.. వర్షాలపై IMD హెచ్చరిక
-
జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్.. ఇచట ఇన్స్పెక్టర్ లేరు!
హైదరాబాద్: వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు ఇన్స్పెక్టర్ను నియమించడంలో తాత్సారం జరుగుతుంది. వారం రోజులు గడుస్తోన్నా ఇన్స్పెక్టర్ నియామకంలో ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఏ అధికారి వచ్చినా 10 వారాలు కూడా ఉండకుండా సస్పెన్షన్లకు గురవుతుండడంతో ఈసారి ఎస్హెచ్వో నియామకంలో మరింత పారదర్శకత ఉండేలా చేపట్టాలని యోచిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి నివాసముండే పరిధి ఠాణాలోనే వరుస వివాదాలు చోటుచేసుకుంటుండడంపై ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి నివాసంతో పాటు సీఎం క్యాంప్ కార్యాలయ కిందికి వచ్చే ఈ పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్లు విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తుండడంతో పాటు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ పోలీసు శాఖకే మచ్చతెచ్చారు. దీంతో ఇటీవల లైంగిక వేధింపుల కేసులో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డిని సస్పెండ్ చేసి, ఆయన స్థానంలో ముత్తుయాదవ్ను నియమించారు. ఆయన కూడా విధి నిర్వహణలో తీవ్ర నిరక్ష్యాన్ని కనబరచడమే కాకుండా మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై చర్యలు తీసుకోవడంలోనూ, ఆయనను అరెస్టు చేయడంలోనూ అశ్రద్ధ వహించారు. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులు పారిపోవడానికి ఆస్కారం కలిగించారనే ఆరోపణలతో గత నెల 25న ముత్తుయాదవ్పై వేటుపడింది. అప్పటి నుంచి ఇక్కడ ఇన్స్పెక్టర్ను నియమించడానికి ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జల్లెడపడుతున్న నిఘా వర్గాలు సీఎం రేవంత్రెడ్డి నివాసం ఉండే ఈ ఠాణాకు సమర్ధుడైన ఇన్స్పెక్టర్ను నియమించాలని, ఆ స్థాయి అధికారి కోసం నిఘా వర్గాలు జల్లెడపడుతున్నాయి. అటు ఇంటెలిజెన్స్, ఇటు ఎస్బీ ఈ ఠాణాకు ఇన్స్పెక్టర్ను నియమించడంలో కీలకపాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ఇన్స్పెక్టర్ నియామకంలో పాత్ర ఉండే అధికారులను పక్కనబెట్టి ఈసారి గుర్తించిన ఉన్నతాధికారుల ప్రమేయంతో ఈ పోస్టును భర్తీ చేయాలని యోచిస్తున్నారు. అందుకే నియామకంలో ఆలస్యం జరుగుతుందని పేర్కొంటున్నారు. దగ్గరపడుతున్న వినాయక చవితి వేడుకలు వినాయక చవితి వేడుకలు దగ్గర పడుతుండడంతో జూబ్లీహిల్స్ ఠాణాకు ఇంకా ఇన్స్పెక్టర్ను నియమించకపోవడంతో వినాయక మండపాల కమిటీ ప్రతినిధుల సమావేశాలు, మైత్రి కమిటీ సమావేశాలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాల వద్ద నిఘాతో పాటు అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడం, రౌడీ షిటర్ల బైండోవర్, నిమజ్జనోత్సవాల్లో జాగ్రత్తలు, నిమజ్జనోత్సవ రూట్లు.. ఇలా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి కీలకమైన బాధ్యతలు ఉంటాయి. ఇన్స్పెక్టర్ను నియమించకపోవడంతో నవరాత్రులతో పాటు నిమజ్జనోత్సవాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముందుకుసాగని కేసులు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో నేరాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ముఖ్యంగా దొంగతనాల సంఖ్య పెరుగుతుంది. కేసుల ఛేదనలో పోలీసులు ముందుకువెళ్లలేకపోతున్నారు. దీనికి ఆదేశాలు ఇచ్చి తగిన సూచనలు ఇచ్చే అధికారి లేకపోవడంతో నేరాల మిస్టరీని ఛేదించలేకపోతున్నారు. పూర్తిస్థాయి జూబ్లీహిల్స్ లేకపోవడంతో ఎఫ్ఐఆర్ల నమోదు చేయడంలోనూ, బాధితులకు న్యాయం చేయడంలోనూ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పరిశీలనలో ముగ్గురు జూబ్లీహిల్స్ ఠాణాకు ఈ సారి సమర్థుడైన ఇన్స్పెక్టర్ను నియమించాలని తలపెట్టడంతో బాధ్యత గల అధికారుల కోసం చూస్తున్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరినైనా ఒకరిని నియమిచే బాధ్యత ఈసారి సీఎంవో కార్యాలయంపై పడిందని తెలుస్తోంది. ‘సిట్’ బృందాలతో.. ఈ పోలీస్స్టేషన్ పరిధిలోనే ఫోన్ ట్యాపింగ్పై సిట్ ఏర్పాటుచేశారు. ఇందుకోసం ఇక్కడ ఏసీపీ కొంతకాలంగా సిట్ దర్యాప్తు అధికారిగా ఉన్నారు. దీంతో ఇన్చార్జి ఏసీపీగా సామల వెంకట్రెడ్డి వ్యవహరిస్తున్నారు. మరోవైపు జూబ్లీ రిచ్కిడ్ ట్రాప్ కేసులోనూ సిట్ ఏర్పాటుచేశారు. దీనికి కూడా ఒక ఎస్సైతో పాటు సిబ్బంది పనిచేస్తున్నారు. ఇలా సిట్ రూపంలో ఇప్పటికే ఠాణాపై బరువు పెరిగిపోయింది. బాధ్యత గల అధికారులంతా ఈ దర్యాప్తులోనే ఉన్నారు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ కూడా లేకపోవడంతో దీని ప్రభావం కేసులపై పడుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. చదవండి: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్సాయిపై కేసు -
షార్ట్ ఫిలిం నటి అమూల్య కేసులో బిగ్ ట్విస్ట్..
హైదరాబాద్: బాలిక ఆత్మహత్య కేసు నిందితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సింగరేణి కాలనీలో నివసించే బాలిక ప్రైవేట్ వీడియోలతో కొందరు బ్లాక్మెయిల్ చేయగా కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చింతల్బస్తీకి చెందిన ఎం.మహేష్(20)ను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల బెయిల్పై విడుదలైన మహేష్ మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఏయే పథకాలకు డిమాండ్ ఉందంటే.. -
‘రేవంత్ డబ్బుల మూట’.. హైదరాబాద్లో పోస్టర్ల కలకలం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరవ్యాప్తంగా వెలిసిన వ్యంగ్య పోస్టర్లు రాజకీయ కలకలం రేపుతున్నాయి. “1000 DAYS OF CONGRESS GOVERNMENT” పేరుతో ఏర్పాటు చేసిన పోస్టర్లలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో, ఈ పోస్టర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.ఈ పోస్టర్లలో సీఎం రేవంత్రెడ్డిని టార్గెట్ చేస్తూ డబ్బుల మూటలు, పేదల ఆర్తనాదాలు వంటి వ్యంగ్య చిత్రాలను ప్రదర్శించారు. సచివాలయం, గాంధీ భవన్, జూబ్లీహిల్స్తో పాటు నగరంలోని పలు ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. బుధవారం ఉదయం నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీగా పోస్టర్లు కనిపించడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: సురేఖను తప్పించాల్సిందే! -
హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
Hyd: ఈసారి లక్షా 40 వేల గణేష్ మండపాలు
హైదరాబాద్: ఈసారి భాగ్య నగర పరిధిలో లక్షా నలభై వేల గణేష్ మండపాల సిద్ధమవుతున్నాయని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు వాటి నిమజ్జనాలకు అవసరమయ్యే ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపింది. బడ్జెట్ కేటాయిపులో ప్రభుత్వం స్పీడ్ పెంచాలని మంత్రి దృష్టికి తీసుకెళ్ళామని, ఎప్పటిలాగే అన్నీ చెరువులు, వినాయక సాగర్లో నిమజ్జనం కొనసాగుతుందని బాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావి నూతుల శశిధర్ సాక్షి టీవీకి తెలిపారు. ‘అధికారుల తప్పుడు నివేదిక కారణంగా హైకోర్టు వినాయక సాగర్పై స్టే ఇచ్చింది. ఎక్కడ వినాయక నిమజ్జనం వల్ల పొల్యూషన్ జరిగినట్లు సరైన ఆధారాలు లేవు. కావాలనే కొందరు అధికారులు హిందూ పండుగలను ఆంక్షలు పెట్టాలని చూస్తున్నారు. కాప్రా చెరువుతో పాటు హైడ్రా డెవలప్ చేసిన అన్నీ చెరువుల్లో నిమజ్జనం చేస్తాం. అడ్డుకోవడానికి హైడ్రాకు ఎలాంటి అధికారం లేదు. చెరువులకు ఓనర్లు ప్రజలు.. అధికారులు, నాయకులు కాదు. చెరువుల్లో నిమజ్జనం చేయడం మా సంప్రదాయం. అందుకే అన్నీ చెరువుల్లో నిమజ్జనం కొనసాగిస్తాం. అడ్డుకోవాలని చూస్తే.. పరిణామాలు మరోలా ఉంటాయి’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి:భారీ పెరిగిన గణేష్ విగ్రహాల ధరలు -
రోహిణి.. అందాల రాణి
హైదరాబాద్: రోహిణి.. అందాల రాణి.. ఎంబీబీఎస్ చదువుతూ అందాల పోటీల్లో పాల్గొంటోంది. తాజాగా మిస్ ఆరా ఇంటర్నేషనల్ ఇండియా–2026 కిరీటాన్ని గెలుచుకుంది. బోడుప్పల్ శ్రీనివాస్నగర్లో నివాసం ఉండే కనక రోహిణికి అందాల పోటీల్లో పాల్గొనడమంటే చాలా ఇష్టం. ఆగస్టు 23న అహ్మదాబాద్లో ఏక స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఫినాలే పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. View this post on Instagram A post shared by Miss P&I India ™️ (@miss_pandi_india)👉 మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో రోహిణి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. బ్యూటీ బియాండ్ అకాడమీలో జశ్నవి మండలా నేతృత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీలకు సిద్ధమవుతోంది. మిస్ గ్రాండ్ తెలంగాణ 2026లో ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. 👉 కూచిపూడి శాస్త్రీయ నృత్యకారిణిగా కూడా శిక్షణ పొందింది. భారతీయ మూలాలు, సంస్కృతి సంప్రదాయాలతో గాఢమైన అనుబంధాన్ని కొనసాగిస్తోంది. మానసిక ఆరోగ్య అవగాహన కోసం పనిచేస్తూ, ప్రతి ఒక్కరూ తమ మాటను స్వేచ్ఛగా చెప్పగలిగే, గౌరవించే వాతావరణం కల్పించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. కాలనీవాసుల అభినందన... శ్రీనివాస్నగర్ కాలనీలో నివసించే జయప్రకాశ్ సవరప్ప, భారతి కుమార్తె రోహిణి. తల్లిదండ్రులు అందించిన నిరంతర ప్రేమ, అచంచలమై మద్దతుతో రాణిస్తూ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో రోహిణిని, వారి తల్లిదండ్రులను కాలనీ అధ్యక్షుడు తోటకూర చందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి వేమునూరి ముర«ళీధర్, సంఘం ప్రతినిధులు సత్కరించారు. -
ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి కుమారుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి కుమారుడు సందీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఘటన జరిగింది.నడుచుకుంటూ వెళ్తున్న నందులాల్ను ఇన్నోవా కార్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. నందులాల్ను కారుతో ఢీకొట్టిన సందీప్.. ఆగకుండా వెళ్లిపోయాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు.


