Hyderabad
-
పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారుల అవస్థలు
-
వారిని కొందరు ఆడపిల్లలు గుడ్డిగా నమ్ముతూ..: సజ్జనార్
హైదరాబాద్: అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ఫోన్ ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయని చెప్పారు.ఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు తన దృష్టికి ఎక్కువగా వస్తున్నాయని, ఆ కథనాలు చూశాక ఎంతో బాధనిపిస్తోందని సజ్జనార్ అన్నారు. సైబర్ నేరగాళ్లు అందమైన యువకులు లేదా సినీ నటుల ఫొటోలను డీపీలుగా పెట్టుకుని నకిలీ ఖాతాలతో అమ్మాయిలకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారని చెప్పారు. ఆ మాయమాటలకు ఆకర్షితులై కొందరు ఆడపిల్లలు వారిని గుడ్డిగా నమ్మి తమ వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను పంచుకుంటున్నారని తెలిపారు.అలా పంపగానే ఆ అపరిచితులు రాక్షసులుగా మారిపోయి వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని సజ్జనార్ వివరించారు. వాటిని మార్ఫింగ్ చేసి డబ్బులు కావాలని, భౌతికంగా కలవాలని వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. పరువు పోతుందన్న భయంతో, ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక కొందరు అమ్మాయిలు అడిగినంత డబ్బులు ముట్టజెబుతూ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారని అన్నారు. ఈ వేధింపులు తాళలేక కొందరు తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారని చెప్పారు.‘ఆడపిల్లలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. మీకు ఆన్లైన్లో ఇలాంటి సమస్య లేదా అన్యాయం ఎదురైతే అస్సలు భయపడకండి. ఆ సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిలింగ్కు లొంగవద్దు, మీ ప్రాణాలు తీసుకోవద్దు. వెంటనే ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు చెప్పండి. ఏ మాత్రం సంకోచించకుండా డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారు.తల్లిదండ్రులు సైతం పిల్లలతో కాస్త సమయం గడుపుతూ.. వారు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనేదానిపై ఓ కన్నేసి ఉంచండి. ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ నెంబర్లు, వీపీఎన్లు వాడితే పోలీసులకు చిక్కబోమని సైబర్ నేరగాళ్లు భ్రమపడొద్దు. మీరు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉంటూ, అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని కోరుతున్నాను’ అని ఎక్స్లో సజ్జనార్ చెప్పారు. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ఫోన్.. ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోంది. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు నా దృష్టికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ కథనాలు… pic.twitter.com/sWbS2L4bhP— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 21, 2026 -
అద్దె ఇల్లు కష్టాలు @హైదరాబాద్
-
హైదరాబాద్ లో పెట్రోల్ కష్టాలు మూతబడిన బంకులు
-
షాకింగ్ సీన్.. కల్తీ సమోసాలు.. కుళ్లిన గుడ్లతో పఫ్స్..
సాక్షి, హైదరాబాద్: జియాగూడలో కల్తీ సమోసా తయారీ కేంద్రంపై హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ H-FAST (హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్), కుల్సుంపురా పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ, ట్రేడ్ లేకుండానే సమోసాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు తయారీ చేస్తున్నట్లు నిర్థారించారు. రూ.5 లక్షల విలువైన ఆహార పదార్థాలు, యంత్రాలు సీజ్ చేశారు.నిందితుడు అబ్దుల్ రషీద్.. అపరిశుభ్రమైన వాతావరణంలో, కుళ్ళిపోయిన గుడ్లు, పదేపదే మరిగించిన నూనెను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా సమోసాలను తయారు చేస్తున్నట్లు తేలింది. ఎగ్ సమోసాలు (350), స్వీట్ కార్న్ సమోసాలు (600), ఉల్లిపాయ సమోసాలు (1000), ముడి పదార్థాలు మైదా (50 కిలోలు), ఉప్పు (4 బస్తాలు), సమోసా పట్టీలు (2000), అపరిశుభ్రమైన స్వీట్ కార్న్ (10 కిలోలు)లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజలు తమ ప్రాంతాల్లో కల్తీ ఆహారాన్ని గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డిప్యూటీ కమిషనర్ కోరారు. -
పెంపుడు పిల్లి కోసం MBBS విద్యార్థిని ఆత్మహత్య
-
త్వరలో తెలంగాణకు ప్రధాని మోదీ!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే తెలంగాణలో పర్యటించనున్నట్టు సమాచారం. రానున్న పది, పదిహేను రోజుల్లో మోదీ పర్యటన ఉండే అవకాశం ఉంది. మోదీ పర్యటన, జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.వివరాల మేరకు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ.. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో మోదీ తెలంగాణలో కూడా పర్యటించేలా స్థానిక నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అలాగే, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల కోసం పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇక, ఇప్పటికే స్థానిక నేతలకు మోదీ టూర్పై రాష్ట్ర నాయకత్వం సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగానే నేడు సికింద్రాబాద్ నేతలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటర్నల్ సమావేశం ఏర్పాటుచేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, మోదీ టూర్ ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు సమాచారం. కాగా, మోదీ పర్యటనతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగే అవకాశం ఉంది. -
మెయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్ను సిట్ అదుపులోకి తీసుకుంది. రోహిత్ పార్టీకి అభిషేక్ సింగ్ డ్రగ్స్ సరఫరా చేయగా.. అభిషేక్ నుంచి రోహిత్రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొన్నారు. రోహిత్కు 24 సార్లు అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేశారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద రోహిత్ డ్రైవర్ శరత్ కొనుగోలు చేశారు. అభిషేక్ సింగ్సెల్ఫోన్ డేటాను సిట్ బృందం విశ్లేషిస్తోంది. అభిషేక్ సింగ్ నుండి ఎవరెవరూ డ్రగ్స్ తీసుకున్నారు? అనే విషయంపై సిట్ కూపీ లాగుతోంది.కాగా, డ్రగ్స్ కేసు నిగ్గు తేల్చడానికి ఏర్పాటైన సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. పలు కీలక విషయాలను సేకరిస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్నగర్లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో నిందితులు మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. -
సిలిండర్ దొరికినోళ్లే ధురంధర్
హైదరాబాద్: నగరంలో గ్యాస్ కష్టాలు సాధారణంగా మారాయి. హోటళ్లు, పీజీలు ఇప్పటికే మూతపడుతుండగా.. మరోవైపు సాధారణ ప్రజలకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఆన్లైన్ బుకింగ్లు కాకపోవడంతో చాలామంది గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి. గృహిణులు అయితే చంటి పిల్లలతోనూ ఏజెన్సీల వద్దకు వస్తున్నారు. కాగా, హోటల్ నిర్వాహకులు కొందరు ఓపెన్ కిచెన్ లో వంట చేస్తున్నారు. సీఎన్జీతో నడిచే ఆటోలకూ కటకట ఏర్పడింది. దీంతో గ్యాస్ బంకుల వద్ద వాహనాలతో డ్రైవర్లు బారులు తీరుతున్నారు. -
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్న సౌమ్యామిశ్రా
హైదరాబాద్ : జైల్భవన్లో ఈ రోజు (శుక్రవారం) వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కార్యక్రమం ఘనంగా జరిగింది. జైళ్లశాఖ డైరెక్టర్ డాక్టర్ సౌమ్య మిశ్రాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్తో సత్కరించారు. ఈ అవార్డును డైరెక్టర్ జనరల్ విక్రమ్ త్రివేదీ, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సౌమ్యా మిశ్రాకు అందజేశారు.జైళ్ల శాఖలో సౌమ్యామిశ్రా చేసిన సంస్కరణలకు గానూ ఆమెకు ఈ అవార్డు అందజేసినట్లు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు తెలిపారు. జైళ్ల ఆధునీకరణ, సంక్షమే కార్యక్రమాలు, సంస్కరణాత్మక విధానాల ప్రోత్సాహం తదితర రంగాలలో ఆమె విశిష్ట సేవలు అందించినట్లు పేర్కొన్నారు.డిప్యూటీ సూపరిండెంట్ పోలీస్ వంశీ మోహన్ రెడ్డి ప్రజా పరిపాలన, సామాజిక సేవా రంగాల్లో అందించిన సేవలకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ ప్రతినిధులు డా. ఉలాజీ ఎలియాజర్ (కోఆర్డినేటర్), ఆకాంక్ష షా (ప్రతినిధి)తో పాటు ఇతరులు హాజరయ్యారు. -
ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: విద్యా విధానంలో కీలక మార్పులు తెస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానం ఉంటుందని.. ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవంటూ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విద్యా విధానం అమలులోకి వస్తోందన్నారు. చిట్చాట్లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.ఏ గ్యారెంటీ ఎప్పుడు అమలు చేయాలో మా దగ్గర ప్రణాళిక ఉంది. గత ప్రభుత్వం అప్పులు తప్పులు కప్పిపుచ్చి పాలన చేసింది. ఆ తప్పులు మేం చేయలేం’’ అని రేవంత్ పేర్కొన్నారు. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 3.47లక్షల కోట్ల అప్పులు చేశాం. కేసీఆర్ చేసిన అప్పు కట్టడానికే మేము అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ 26 నెలల్లో 3.3 లక్షల కోట్ల కేసిఆర్ చేసిన అప్పులే మేం కట్టాం. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకపోయినా 44 వేల కోట్ల కాళేశ్వరం అప్పు తీర్చాం. ఫోన్ ట్యాపింగ్ అరెస్టులు కొనసాగుతాయి. చట్టప్రకారమే ఫోన్ ట్యాపింగ్పై దర్యాప్తు జరుగుతోంది’’ అని రేవంత్ పేర్కొన్నారు.‘‘డ్రగ్స్ కేసుపై బీజేపీ మౌనం ఎందుకు?. కేబినెట్ విస్తరణపై వార్తలు వచ్చిన ప్రతీ సారి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలో నాకు తెలుసు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అవసరం ఉన్నప్పుడు చేస్తా. మూసీ పై ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. నదికి రెండు వైపులా 50 మీటర్ల చొప్పున మాత్రమే భూ సేకరణ చేస్తాం’’ అని రేవంత్ చెప్పారు. -
మెట్రోలో సాంకేతిక సమస్య.. ఈ రూట్ లో రాకపోకలకు అంతరాయం!
-
చివరి అంకానికి ‘మెట్రో’ టేకోవర్.. సర్కార్ స్వాధీనం!
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో మొదటి దశ స్వా«దీన ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో చర్చలు, సమీక్షలు, కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసిన హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఈ ప్రక్రియను ఎలాంటి జాప్యానికి తావు లేకుండా మరో 10 రోజుల్లో పూర్తిచేసే విధంగా ముందుకు సాగుతోంది. మరోవైపు మెట్రో టోకోవర్తో పాటు రెండోదశ నిర్మాణం కోసం భూసేకరణ, మౌలికసదుపాయాలు, తదితర అవసరాల కోసం ఈ బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది.రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మెట్రో టేకోవర్ పురోగతిని సమీక్షించారు. బకాయీల చెల్లింపుతో పాటు, వివిధ అంశాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా టేకోవర్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన దిశానిర్దేశాన్ని సూచించారు.మరోసారి మంత్రి మండలిలోనూ టేకోవర్ పైన విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో స్వాధీనం దృష్ట్యా చెల్లించవలసిన రూ.13000 కోట్ల రుణాల కోసం 3 శాతం వడ్డీపైన నిధులను అందజేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)ఇప్పటికే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ మేరకు హెచ్ఎంఆర్ఎల్తో ఒప్పందం కూడా ఖరారైంది.ఎల్అండ్టీకి ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల బకాయీలను మాత్రం ప్రభుత్వమే చెల్లించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్లో మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయించనున్న నిధులతో ఇది స్పష్టం కానుంది. ఈ రెండు ఆరి్ధక అంశాలు ఒక కొలిక్కి వస్తే ఎల్అండ్టీ వైదొలగడంతో పాటు మూడు కారిడార్లలోని 69.2 కి.మీ.మెట్రో మొదటి దశ ప్రాజెక్టు సర్కార్ స్వాధీనంలోకి రానుంది.అలాగే మెట్రో రైళ్ల నిర్వహణపై ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ సంస్థతో ఏర్పాటు చేసుకొన్న ఒప్పందం ఈ ఏడాది నవంబర్తో ముగియనున్న దృష్ట్యా మరో ఏడాది పాటు ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్నప్పటికీ రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, సమయపాలన, తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.దశలవారీగా టేకోవర్...మెట్రో రెండో దశ డీపీఆర్లపై కేంద్రం పలు సందేహాలు లేవనెత్తడంతో మొదటి దశ చర్చనీయాంశమైంది. మొదటి దశ కారిడార్లలోంచి రెండోదశ కారిడార్లకు ప్రయాణికుల రాకపోకలు కొనసాగనున్న దృష్ట్యా టిక్కెట్లపైన ఆదాయం పంపకాలు, విద్యుత్ ఖర్చులు, తదితర అంశాలపై ఎల్అండ్టీ నుంచి స్పష్టత రావలసి ఉందని కేంద్రం సూచించింది.ఈ క్రమంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించి, నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, సుమారు రూ.6000 కోట్ల నష్టాలతో ప్రాజెక్టును నడిపించవలసి వస్తుందని ఎల్అండ్టీ కేంద్రానికి తెలిపింది.అదే సమయంలో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగనున్నట్లు వెల్లడించింది.గతేడాది సెప్టెంబర్లో ఎల్అండ్టీ తన వైఖరిని వెల్లడించడంతో ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరిపింది. ప్రాజెక్టు నుంచి తప్పించుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎల్అండ్టీ మరోసారి స్పష్టం చేసింది.దీంతో మెట్రో మొదటిదశను స్వా«దీనం చేసుకొనేందుకు ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా కార్యాచరణ చేపట్టింది. ఎల్అండ్టీతో వివిధ స్థాయిల్లో చర్చలు జరిపిన అనంతరం మొత్తం రూ.15000 కోట్ల రుణాలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కన్సల్టెన్సీల ఏర్పాటు... అనంతరం ఆర్ధిక అంశాలపైన ఐడీబీఐ క్యాపిటల్, సాంకేతిక అంశాలపైన ఢిల్లీ మెట్రోరైల్ మూడు నెలల పాటు అధ్యయనం చేసి నివేదికలను అందజేశాయి.ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం వల్ల రెండో దశకు ఉన్న ఆటంకాలు తొలగడంతో పాటు ఎల్అండ్టీ సంస్థకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిన 269 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వం చేతికి రానుంది.అలాగే 5 మెట్రో స్టేషన్ల వద్ద ఉన్న మాల్స్ను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ మెట్రోరైల్ కార్పొరేషన్ (హెచ్ఎంఆర్ఎల్) నిర్వహణలో కొనసాగనుంది. -
తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ కానిస్టేబుల్.. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర పామును పట్టుకున్నారు. పామును ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. పామును చాకచక్యంగా పట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ను పలువురు అభినందించారు. -
Hyderabad: ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: మరోసారి హైదరాబాద్ మెట్రో ట్రైన్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. అమీర్పేట్-రాయదుర్గం మార్గంలో అంతరాయం ఏర్పడింది. జూబ్లీచెక్ పోస్టు దగ్గర మెట్రో ట్రైన్ నిలిచిపోయింది. దీంతో రెండు వైపులా కూడా మెట్రో రైళ్లు నిలిచిపోయాయి.కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఈ అంతరాయం కలగడంతో ఐటీ ఉద్యోగులతో పాటు విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన టెక్నికల్ బృందం సమస్యను పరిష్కరించే పనిలో ఉందని.. కొద్దిసేపట్లో సేవల పునరుద్ధరణ జరుగుతుందని మెట్రో అధికారులు తెలిపారు. -
హైదరాబాద్ : రెయిన్ బో విస్టాస్ రాక్ గార్డెన్ ఫేజ్–2లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో ‘ఉగాది’ వేడుకలు (ఫొటోలు)
-
అలరించిన భక్త ప్రహ్లాద పద్యనాటకం
హైదరాబాద్ : ఉగాది సందర్భంగా ఫిలింనగర్లోని ఫిలించాంబర్లో ఆవరణలో ఉన్న రామానాయుడు కళామండపంలో ఉగాది పౌరాణిక పద్యనాటకోత్సవాలు నిర్వాహకులు పొత్తూరి వెంకట సుబ్బారావు గురువారం ప్రారంభించారు.పద్య నాటకోత్సవాల్లో భాగంగా తొలి రోజు రంగ స్థల కళాకారులు భక్త ప్రహ్లాద భక్తి రస ప్రధాన పద్యనాటకాన్ని రక్తి కట్టించారు.జగాది విజయసాయి దర్శకత్వం వహిచంగా మీగడ రామలింగ స్వామి ఈ నాటికను రచించారు. ప్రహ్లాదుడుగా చిరంజీవి జాహ్నవి లక్ష్మి, హిరణ్యకశ్యపగా బగాది విజయ సారధి, దేవేంద్రుడిగా బిర్లంగి ప్రసాద్, నారదుడుగా బగాది విజయసాయి, తామ్రక్షుడిగా డేవిడ్రాజు, దూమ్రాక్షుడిగా తమ్మినేని దాలినాయుడు, చండగా మైలిపల్లి చంద్రరావు, అమార్కుగా ఓలేటి శంకర్, సింగిగా కుమారి, లీలావతిగా సంధ్యా ప్రియదర్శిని, శ్రీ మహావిష్ణువుగా సురేంద్ర నాయుడు, వీరాక్షుడుగా బీఎస్.రెడ్డి, ఘోరాక్షుడిగా పైడిరాజు, ఋషులుగా పులి శివ ప్రకాశ్, ఎల్. జోగారావు నటించారున. నేటి తరానికి రంగ స్థల కళలను పరిచయం చేసేందుకు ఈ నాటికలను ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు పొత్తూరి వేంకట సుబ్బారావు తెలిపారు. -
వైభవంగా హైదరాబాద్ హైటెక్స్ లో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్..
-
షడ్రుచుల సంగమం.. ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
లలితా విష్ణు సహస్ర నామ పారాయణంతో పాటు భక్తి గీతాలాపనతో ఉగాది వేడుక ప్రారభమైంది. సుమారు 450 మంది లలితా విష్ణు సహస్ర నామ పారాయణం చేయడంతో పాటు, శ్లోకాలను ఆలపించి ఆధ్యాత్మిక పరిమళాలు అందించారు. గ్రూపు కో–ఆర్డినేటర్ వాణి ఆధ్వర్యంలో సహస్ర నామ పారాయణం జరిగింది. తెలుగులో ఆడిపాడిన చిన్నారులు.. ఆధునిక, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకునే చిన్నారులకు తెలుగు రుచిని చూపిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా స్వచ్ఛమైన తెలుగులో ‘లేవండిరా ముందుగా ఈ రోజే ఉగాది పండుగ’ అంటూ ఆలపించిన పాట అహూతులను అలరించింది. రామలక్ష్మి ఆమె విద్యార్థుల బృందం ఆలపించిన పాట అతిథులను ఆకట్టుకుంది. పాటలోనే ఉగాది విశిష్టత తెలిపే విధంగా చక్కగా ఉందని అతిథులు ప్రశంసించారు.పరాభవం నుంచి ప్రాభవంలోకి.. ముఖ్య అతిథి, శృంగేరి శారదా పీఠం ఆస్థాన పౌరాణికులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ధర్మమార్గంలో నడిచే వారికి ప్రాభవం అని, అధర్మంలో నడిచే వారికి పరాభవమని, పరాభవం నుంచి ప్రాభవంలోకి రావటమే పరాభవ నామ సంవత్సరమని వివరించారు. మనల్ని అనుగ్రహించి ఆధ్యాత్మితకు, సత్య మార్గాన్ని చూపించే సంవత్సరమే పరాభవ నామ సంవత్సరమన్నారు.కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రీల్స్ వదిలిపెట్టి రియాలిటీలోకి రావాలని తెలిపేదే పరాభవం అని అన్నారు. ఈ సంవత్సరం శుభాలు ఎక్కువగా జరుగుతాయని, మిగిలిన ప్రపంచంలో యుద్ధ భయం ఉంటుంది కానీ, భారత దేశానికి ఉండదన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, పశు, వృక్ష సంపద పెరుగుతుందని వివరించారు. పాలకుల్లో చికాకులు పెరుగుతాయి, వ్యాపారస్తులకు బాగుంటుంది. కొత్త పెట్టుబడి పెట్టవద్దని సూచించారు. అప్పులు చేసి భూములు కొనుగోలు చేయవద్దని, బంగారం, వెండి, రత్నాలు కొనుగోలు చేసే బదులు, కరెన్సీ నోట్లు ఇంట్లో ఉంటేనే మంచిదన్నారు. ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారికి పరాభవం ఉండబోదన్నారు. ఈ సీజన్లో 50 డిగ్రీలకుపైగా వేడి పెరుగుతుందని, అగ్ని ప్రమాదాలు, రోగాలు, కల్తీ ఎక్కువగా జరుగుతాయన్నారు. ఈ సంవత్సరంలో అధిక జ్యేష్ట మాసంతో కలిపి మొత్తం 13 నెలలు ఉంటాయన్నారు. పంచాంగం అంటే విజ్ఞాన భాండాగారం, కొందరు చేసిన తప్పులకు జ్యోతిష్కులను నిందించవచ్చు కానీ, శాస్త్రాన్ని అపహాస్యం చేయవద్దని సూచించారు. ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం సాహితీవేత్త ప్రముఖ తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ పాతూరి నాగరాజు సంవత్సర పురుషోపాసన అనే అంశంపై ప్రసంగించారు. ప్రకృతిలో వచ్చే మార్పు, ప్రకృతితో కలిసి జరుపుకునేదే ఉగాది అని పేర్కొన్నారు. కాలచక్రాన్ని అనుసరించాలని సూచించారు. ఉగాది పండుగ, సంవత్సర పురుషోపాసన గురించి క్లుప్తంగా వివరించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో రెయిన్ బో విస్టాస్ రాక్గార్డెన్ అధ్యక్షులు టీఎస్ రెడ్డి, ఉపాధ్యక్షులు కృపాకర్రెడ్డి, తదితర మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.అమోఘం.. రుచుల మిశ్రమం..ఈ వేడుకల్లో షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని కుండలలో తయారు చేశారు. అపార్ట్ మెంట్ వాసులు వాణి, జ్యోతి, నిర్మల, అపర్ణ, మాళవిక ఉగాది పచ్చడిని తయారు చేసి అందరికీ పంపిణీ చేశారు. దీంతో పాటు బొబ్బట్లు, పులిహోర ప్రసాదంగా అందజేశారు. తీపి, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు ఉన్నట్లుగానే కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నీ కలిస్తేనే పరిపూర్ణ జీవితం అవుతుందని ఉగాది పచ్చడి పరమార్థాన్ని మననం చేసుకున్నారు. పిజ్జాలు, బర్గర్ల మధ్య నివసించే నగరవాసులకు షడ్రుచుల పచ్చడి, బొబ్బట్లు సిసలైన రుచులను పంచాయి.తెలుగు సంవత్సరాది వెలుగులు విరజిమ్మింది. ఆహ్లాదభరిత వేదికపై ఆత్మీయ ఆహ్వానం అందుకుంది. మూసాపేట రెయిన్ బో విస్టాస్ రాక్ గార్డెన్ ఫేజ్–2లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ‘ఉగాది’ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. అధునాతన నగరంలో అచ్చమైన పల్లె వాతావరణాన్ని తలపించేలా సంప్రదాయ దుస్తులతో రెయిన్బో వాసులు పాల్గొనడం, షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని ఆస్వాదించడం కనువిందు చేసింది. లలితా, విష్ణు సహస్ర నామ పారాయణలతో మొదలైన ఈ వేడుకలు జ్యోతి ప్రజ్వలన, పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉగాది పచ్చడి ప్రసాదం, బొబ్బట్లు, పులిహోరాల పంపిణీతో పూర్తయ్యాయి. – కూకట్పల్లి/మూసాపేటఅలరించిన భక్తి ‘గీతాంజలి‘ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన కార్యక్రమం ‘భక్తి జామింగ్‘. అపార్ట్ మెంట్ కి చెందిన గీతాంజలి ప్రత్యేకంగా తన బృందంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆ బృందం ఆలపించిన హిందీ, తెలుగు భక్తి గీతాలు గంట పాటు శ్రోతలను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. ప్రదర్శన అనంతరం ఆహూతులు అందరూ నిల్చుని చేసిన కరతాళ ధ్వనులతో ప్రాంగణం మారుమోగింది. -
ఎంపీ ఎమ్మెల్యే కాలనీ కల్చర్ సెంటర్ లో ఘనంగా ఉగాది వేడుకలు
హైదరాబాద్ : ఎంపీ ఎమ్మెల్యే కాలనీ కల్చరల్ సెంటర్, విజయ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సంయుక్తంగా ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు పెద్ది రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాగిడి లక్ష్మా రెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్ కొలను హనుమంత రెడ్డి, సెక్రటరీ సందీప్ రెడ్డి వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఉగాది పంచాంగ శ్రవణం అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పరంపర కళాకారులు ప్రదర్శించిన మహాకాళి నృత్యం ఆద్యంతం కట్టి పడేసింది. దీంతో పాటు నిర్వహించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమం వీనుల విందుగా సాగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ భూపాల్ రెడ్డి, ప్రముఖ సామాజికవేత్త శిల్పా రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా సంప్రదాయ పిండి వంటల తో విందును ముగించారు. -
పరాభవ నామ సంవత్సరం పసందుగా అవార్డుల ప్రదానోత్సవం
తెలుగువారి సంవత్సరాది ఉగాది సినీ ప్రేమికులకు కొత్త హుషారునిచ్చింది... అవార్డులు అందుకున్న వేళ తారల మనసులు మురిసిన వేళ... అభిమానులకు ఆనంద హేల... గురువారం ఉగాది పర్వదినాన హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు’ల వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో నాటి తారలు సావిత్రి, శ్రీదేవి, సౌందర్యలకు నివాళిగా నేటి తార నిధీ అగర్వాల్ చేసిన డ్యాన్స్ ఓ హైలైట్... వేదికపై దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్... లవ్ సాంగ్స్ నుంచి మాస్ సాంగ్స్ వరకూ శ్రేయా ఘోషల్ పాడిన పాటలు... సింగర్ మంగ్లీ పాడిన పాటలు... ఇలా వీనుల విందుగా, తారల తళుకులతో కనువిందుగా జరిగింది ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు’ల వేడుక. ఆ విశేషాలు...అవార్డుల విషయంలో పక్క రాష్ట్రం వెనుకంజలో ఉందితెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్’కి మూలం అయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కగారికి, మంత్రి జూపల్లిగారికి, అలాగే కమల్హాసన్ గారికి, నాగార్జునగారికి, జయసుధగారికి, నాగచైతన్య, రష్మికా మందన్నాతో పాటు ఇతర అవార్డుగ్రహీతలందరికీ స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు చెబుతున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవింపబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. ఈ మాటల ఆదర్శంతో ఆగిపోయిన ఈ అవార్డుల పంపిణీకి పునరుజ్జీవం పోసిన రేవంత్ రెడ్డిగారికి ధన్యవాదాలు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్కి తెలంగాణ ప్రభుత్వం సినిమా వారిని ఆహ్వానించి, సినిమా అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించడం, సినిమాకి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యతకి థ్యాంక్స్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వేవ్స్’ కార్యక్రమంలో నన్ను, కమల్హాసన్ వంటి వాళ్లని భాగస్వామ్యం చేయడం సంతోషం. సినిమానే కదా అనే చిన్నచూపు చూడకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవచ్చు. హాలీవుడ్ సినిమా అంటే అమెరికా గుర్తొస్తుంది. ఈరోజు ఇండియన్ సినిమా అంటే హైదరాబాద్–తెలంగాణ గుర్తుకు రావాలనే ముఖ్యోద్దేశంతో రేవంత్ రెడ్డిగారు చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి మనందరం చేదోడు వాదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీవైపు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, సినిమాల పట్ల, వాళ్లని ఉత్సాహపరిచే విధానంలో కొంచెం వెనుకంజలో ఉందనుకుంటున్నాను కాబట్టి సినిమా వాళ్లకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు తెలంగాణ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని, మరింత ప్రోత్సహిస్తే కనుక ఎంతో మంది యంగ్స్టర్స్ మరిన్ని సినిమాలు చేస్తారు. రాష్ట్రానికి సినిమా రెవెన్యూ కూడా సమకూరుతుంది. సీనియర్స్కి గౌరవం ఇచ్చే విధంగా, యంగ్స్టర్స్కి స్ఫూర్తినిచ్చేలా ఈ అవార్డుల ఎంపిక జరిగింది. ఇందుకు జ్యూరీకి అభినందనలు.– చిరంజీవి (ఎన్టీఆర్ జాతీయ అవార్డుగ్రహీత)హద్దులు చెరిపేసినందుకు ధన్యవాదాలుమై ఫ్రెండ్ చిరంజీవిగారు... బ్రదర్ నాగార్జునగారు. నా ఫ్యామిలీ... చెన్నైలో ఎవరైతే ఉంటారో... వారందరూ ఇక్కడ ఉన్నారు. 16 సంవత్సరాల వయసులో తొలిసారి నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా హైదరాబాద్కు వచ్చాను ఏయన్నార్గారి ‘శ్రీమంతుడు’ సినిమా కోసం. అందుకే నా ‘దశావతారం’ సినిమాలో ‘ఎంతో చిన్నది జీవితం’ అనే పాట వినిపిస్తుంది. అలా అప్పట్నుంచి నేను హైదరాబాద్లో పని చేస్తున్నాను. కొంత సమయం కిందట నేను సింగీతంగారి అవార్డు అందుకున్నాను. అప్పుడు ఆయనతో నేను చేసిన తొలి సినిమా ‘సొమ్ము ఒకడిది... సోకు ఒకడిది’ గుర్తొచ్చింది. పని మొత్తం ఆయన చేశారు. అవార్డు నేను అందుకున్నాను. సింగీతంగారితో నేను 50 సంవత్సరాలుగా కలిసి పని చేస్తున్నాను. మా నాన్నగారి పేరు శ్రీనివాసన్ కనుక... సింగీతం శ్రీనివాసరావుగారంటే నాకు ఇష్టం అని కాదు. నా సినిమా కెరీర్లో నేను కలిసిన యంగస్ట్ సీనియర్ ఆయన. సింగీతంగారికి అవార్డును అందించినందుకు ధన్యవాదాలు సార్ (ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ...). నా బ్రదర్... చిరంజీవిగారు. సినిమాల్లో నా జూనియర్. పాలిటిక్స్లో సీనియర్. 1970లో మేం లీడ్ రోల్స్ చేశాం. ఇప్పుడు 70స్లోనే ఉన్నాం. నీ మనసు గురించి కాదు... నీ వయసు గురించి (నవ్వుతూ). గద్దర్గారి లక్షల అభిమానుల్లో నేను ఒకడిని. రచయిత, విప్లవకారులు అయిన గద్దర్గారి పేరిట అవార్డు ఇస్తున్నందుకు ధన్యవాదాలు సార్. ఆయన అభిమానులుగా మేం థ్యాంక్స్ చెబుతున్నాం. ఇక నో మోర్ కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్.. ఒకే ఒక సినిమా... ఇండియన్ సినిమా. ఆ హద్దులను మీరు చెరిపేశారు (టీజీఎఫ్ అవార్డుల్లో తెలంగాణ ప్రభుత్వం కోలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ని అవార్డుగ్రహీతలుగా, ప్రదానం చేసేవారుగా భాగం చేయడం). భవిష్యత్ తరాల కోసం మేం కూడా సపోర్ట్గా ఉంటాం. ఈ అవార్డు అందుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. – కమల్హాసన్ (పైడి జయరాజ్ అవార్డుగ్రహీత)ఏపీలో తెలుగు చిత్రపరిశ్రమ ఉనికిని గుర్తించాలినంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారు అని గత 13 ఏళ్లుగా ఇండస్ట్రీ ఎదురు చూస్తున్నా ఇవ్వలేదు. అలాంటిది హీరో కృష్ణగారి అభిమాని రేవంత్ రెడ్డిగారు గద్దర్ అవార్డులు మేము ఇస్తాం అని చెప్పి, 2025లో ప్రారంభించి అమోఘంగా ప్రదానం చేశారు. ఇప్పుడు కూడా ఆ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. తెలుగు సినిమా ఉనికిని గుర్తించి, గౌరవించి ఇంతమంది కళాకారులను సగర్వంగా గౌరవిస్తున్నందుకు ఆయనకు సెల్యూట్. గొప్ప ప్రజా వాగ్గేయకారుడు అయిన గద్దర్గారి పేరు మీద అవార్డు ఇస్తున్న రేవంత్గారికి సెల్యూట్, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నాకు కాంతారావుగారి అవార్డు ఇచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్ ఆర్గార్ల తర్వాత మూడో హీరో కాంతారావుగారు. తెలంగాణ గడ్డ బిడ్డ ఆయన. జానపద హీరో. తెలుగు ఎంజీఆర్ ఆయన. ఎలాంటి పాత్ర వేసినా రామారావుగారి తర్వాత మెప్పించిన గొప్ప నటుడాయన. అలాంటి కాంతారావుగారి అవార్డుని నాకు ఇచ్చి, నా జన్మధన్యం చేసిన రేవంత్ రెడ్డిగారికి థ్యాంక్స్. చంద్రబాబునాయుడుగారు... మీకు దండం పెడుతున్నా. మీరు చాలా పెద్దవారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిగారు దూసుకెళ్లిపోతున్నారు చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేసుకుంటూ, గద్దర్ పేరిట అవార్డులు ఇచ్చుకుంటూ... ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి, గౌరవించి మీరు కూడా దయ ఉంచి నంది అవార్డులు ఇవ్వండి సార్.. ఇండస్ట్రీని ప్రోత్సహించండి.– ఆర్. నారాయణమూర్తి (కాంతారావు అవార్డుగ్రహీత)ఏయన్నార్ అవార్డు అందుకోవడం ఆనందంముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కగార్లకు ధన్యవాదాలు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ‘దిల్’ రాజు, ప్రియాంక, చిరంజీవి, కమల్హాసన్ గార్లతో పాటు... ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా నమస్కారాలు. ఏయన్నార్గారి అవార్డును అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రిగారికి థ్యాంక్స్. ఏయన్నార్గారి గురించి చె΄్పాలంటే... ఎంతో చె΄్పాలి. మా తరంలో ఆయనతో ఎక్కువ చిత్రాల్లో నటించాను. 1976 అన్నపూర్ణ స్టూడియోస్ ఫస్ట్ ఫ్లోర్లో రామానాయుడుగారు నిర్మించిన ‘సెక్రటరీ’ సినిమాతో మా జర్నీ మొదలైంది. అక్కడ్నుంచి ఎన్నో గొప్ప చిత్రాలు... ఎన్నో గొప్ప బ్లాక్బస్టర్స్. ఆయన ఎంత గొప్ప నటులో నేను చె΄్పాల్సిన అవసరం లేదు. ఆయన హీరోగా సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చినప్పుడు...ఆయన అన్నారు.. ‘ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా... నా స్టైల్ను నేను ఏమైనా మార్చుకోవాలా?, యాక్టింగ్లో ఏమైనా మార్పు తెచ్చుకోవాలా? నా బాడీ లాంగ్వేజ్లో మార్పు రావాలా?’ అని అందర్నీ అడిగేవారు. నన్ను కూడా అడిగారు. అంత గొప్ప నటులు ఆయన. అంత సింపుల్గా ఉంటారు. ఆయన్నుంచి మనందరం నేర్చుకోవాలి. నన్ను ఎప్పుడూ లిటిల్ ఫ్రెండ్ అంటుంటారు. నేను ఆయన లిటిల్ ఫ్రెండ్నే. ఆయన లెగసీ కంటిన్యూ అవుతోంది. నాగార్జునగారు, సుమంత్, సుశాంత్, అఖిల్... ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నాగచైతన్య. ఏయన్నార్ లివ్స్ ఆన్ . రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్. సీయంగారు గత ఏడాది నాకు చైర్పర్సన్ గా అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఏయన్నార్ అవార్డు వరించింది. నేను శాసన సభ్యురాలిగా ఫస్ట్ రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ డైనమిక్ స్పీకర్. తెలంగాణ మూమెంట్ సమయంలో హౌస్ అడర్జ్న్డ్ అయినప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి, మాట్లాడేవారు. అసెంబ్లీ విధి విధానాల గురించి చెప్పేవారు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయినందుకు గర్వంగా ఉంది. ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా ఎమర్జ్ అయ్యారు.– ఏయన్నార్ అవార్డుగ్రహీత జయసుధఈ అవార్డు నాకో మోటివేషన్అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పదహారు సంవత్సరాల సినిమా ప్రయాణంలో ముఖ్యమైన గౌరవం... గుర్తింపు ఇది. ఎన్నో థ్యాంక్స్ చె΄్పాలి. గద్దర్గారు గొప్ప వ్యక్తి. నిజమైన విప్లవకారులు. కుల వివక్షపై వ్యతిరేకంగా, గౌరవం కోసం పోరాడారు. అలాంటి వ్యక్తి పేరిట ఇలాంటి గొప్ప ఇన్షియేట్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ‘దిల్’ రాజుగార్లకు ధన్యవాదాలు. ప్రతి సినిమాకు నేను వంద శాతం ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాను. కొన్ని వర్కౌట్ అయ్యాయి... మరికొన్ని కాలేదు. ‘తండేల్’ సినిమాలో నేను పోషించిన తండేల్ రాజు పాత్రను నా మనసులో పెట్టుకునేలా చేసింది. చాలా సంతోషంగా ఉంది. అలాంటి ఎఫర్ట్స్కు ఇలాంటి ఓ అవార్డు రావడం నిజమైన గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డు చూస్తుంటే ఇంకా నేర్చుకోవాలని, ఇంకా ఎదగాలని... నటుడిగా ఇంకా కథలు చె΄్పాలని మోటివేషన్ లా ఉంది. అల్లు అరవింద్గారికి, వాసు, చందు మొండేటి, దేవిగారు, సాయి పల్లవి, నవీన్ నూలి, కార్తీక్ ఘట్టమనేని, శేఖర్ మాస్టర్, సుప్రీమ్ మాస్టర్, కార్తీక్ తీడ... ఇలా ‘తండేల్’ సినిమాలోని అందరికీ థ్యాంక్స్. మీ అందరి ఎఫర్ట్స్ లేకుంటే ఇక్కడ అవార్డు తీసుకుని ఉండేవాడిని కాదు. నా పిల్లర్స్, నా స్ట్రెంత్... మా అమ్మా నాన్న. అలాగే శోభిత... అభిమానులందరికీ ‘ఈపాలి యేట గురి తప్పేదేలేదేస్... ఇక రాజులమ్మ జాతరే’.– నాగచైతన్య (ఉత్తమ నటుడు – ‘తండేల్’)ఈ అవార్డు మరింత నమ్మకాన్నిచ్చిందిఅందరికీ హాయ్.. హ్యాపీ ఉగాది. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రేవంత్ సార్... ఈ అవార్డును మీ చేతుల మీదుగా అందుకోవడం వెరీ వెరీ స్పెషల్. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, దిల్ రాజు సార్లకు, హోల్ జ్యూరీ కమిటీకి థ్యాంక్స్. ఒకప్పుడు నా నటనపైన నేను ట్రోల్స్ ఎదుర్కొన్నాను. కానీ, ఈరోజు నా నటన నచ్చి రాష్ట్ర స్థాయి అవార్డు ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే నేను చాలా కాలం ఇండస్ట్రీలో ఉంటాననుకుంటున్నాను. ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాకి అవార్డు రావడం చాలా ప్రత్యేకం. పైగా ఇలాంటి సినిమాలు మరిన్ని నిర్మించే నమ్మకాన్ని ఇచ్చింది. నన్ను భూమా పాత్రలో అద్భుతంగా చూపించిన రాహుల్ రవీంద్రన్ కి థ్యాంక్స్. దీక్షిత్, ధీరజ్ సార్, విద్య మేడం, గీతా ఆర్ట్స్కి థ్యాంక్స్. చాలా సంవత్సరాల క్రితం నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక కూతురుగా భావించి ప్రేమ ఇచ్చారు. ఈ రోజు కోడలిగా మీ ముందు నిల్చున్నాను... ఇది చాలా గర్వంగా ఉంది. మీ ప్రేమకు ధన్యవాదాలు.. – రష్మికా మందన్నా, (ఉత్తమ నటి, ‘ది గర్ల్ ఫ్రెండ్’)అవార్డు విజేతలుఉత్తమ నటుడు – నాగ చెతన్య (తండేల్)ఉత్తమ నటి – రష్మికా మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయిఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరాఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్ షో నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వాఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ – లిటిల్ హార్డ్స్ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాంఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం – కోర్టు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్ఉత్తమ బాలల చిత్రం – అనగనగనాఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా)ఉత్తమ సహాయ నటి– భూమిక (యుఫోరియా)ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె. రాబిన్ (దండోరా)ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప)ఉత్తమ హాస్యనటుడు – కృష్ణ తేజ (జిగ్రీస్)ఉత్తమ బాలనటుడు – రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా)ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ – అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్ (కుబేర)ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తీక్ ఘట్టమనేని (మిరాయ్)ఉత్తమ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్) ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కిందపురి)ఉత్తమ కొరియోగ్రాఫర్ – గిర గిర గిర (ఛాంపియన్)ఉత్తమ ఆర్ట్ డైరక్టర్ – తోట తరణి (ఛాంపియన్ )ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – గోవింద్ (అఖండ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్ (చంద్రకాంత్)ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్ – 23ఉత్తమ మేల్ యాక్టర్ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)ఉత్తమ నటి – అనంతిక (8 వసంతాలు)స్పెషల్ జ్యూరీ హీరో – రోషన్ (చాంపియన్ ) -
ఎల్లుండి రంజాన్ పండుగ
సాక్షి, హైదరాబాద్: ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ తేదీ ఖరారైంది. ఇవాళ నెలవంక కనిపించలేదు. దీంతో ముస్లింలు రేపు ఉపవాస ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఎల్లుండి(మార్చి 21, శనివారం) రంజాన్ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నట్లు రుహిత్-ఎ-హిలాల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఇవాళ నెలవంక కనిపించలేదు. దీంతో రంజాన్ మాసం (30 రోజులు) శుక్రవారంతో పూర్తి కానుంది. శనివారం ఉదయం 10 గంటలకు మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థనలు నిర్వహించనున్నారు. -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రముఖ సర్జన్ డా. ప్రదీప్ కుమార్ సేథి భేటీ
హైదరాబాద్: దేశంలోనే ప్రముఖ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డా. ప్రదీప్ కుమార్ సేథి ముంబైపర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, ఒడిశా రాష్ట్రంలోని కేంజర్ జిల్లాపరిధిలో ఉన్న “ఉత్కల్ గౌరవ్ ఇంటర్నేషనల్ స్కూల్ను సందర్శించాలని రాష్ట్రపతిని ఆయన ఆహ్వానించారు.డా. సేథి రాష్ట్రపతికి తెలిపిన ప్రకారం ఈ పాఠశాల ఒడిశా రాష్ట్రంలోని కేంజర్ జిల్లాలో ఉండి, గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాల విద్యను అందిస్తోంది. అలాగే క్రీడలు, వ్యక్తిత్వ వికాసానికి మెరుగైన సదుపాయాలు కల్పిస్తోంది. ప్రస్తుతం సుమారు 350 మంది నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యతో పాటు, వివిధ క్రీడా కార్యక్రమాలు వ్యక్తిత్వ వికాస శిక్షణ కూడా అందిస్తున్నారు. “ఉత్కల్ గౌరవ్ ఇంటర్నేషనల్ స్కూల్ను డా. ప్రదీప్ కుమార్ సేథి తన సంస్థ ద్వారా నిర్వహిస్తూ, గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన వాతావరణాన్నిఅందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమాన్నిప్రశంసిస్తూ, సమయం లభించినప్పుడు పాఠశాలను తప్పక సందర్శించి పిల్లలను కలసి ప్రోత్సహిస్తానని తెలిపారు. డా. ప్రదీప్ సేథి ప్రపంచంలోని ప్రముఖ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ నిపుణుల్లోఒకరిగా గుర్తింపు పొందారు. ఆయన స్థాపించిన Eugenix Hair Sciences ద్వారా దేశ, విదేశాల్లోవేలాది మంది రోగులకు విజయవంతమైన హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ శస్త్రచికిత్సలు నిర్వహించారు. సినీ నటులు, అంతర్జాతీయ క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, వైద్యులు, అనేక ప్రముఖులకు సేవలు అందిస్తున్నారు. వైద్య రంగంలో ఆయన చేసిన పరిశోధనలకు కూడా విశేష గుర్తింపు లభించింది. డా. సేథి రాసిన అనేక పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. Step to Step Hair Transplant అనే పుస్తకాన్నిరచించి, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ శస్త్రచికిత్సను నేర్చుకునే వైద్యులకు మార్గదర్శకంగా నిలిచారు. ఈ పుస్తకం ద్వారా దేశ, విదేశాల్లోని అనేక మంది వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. డా. సేథి తన వైద్య ప్రయాణాన్నిఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దేవభూమి ప్రాంతంలో ప్రారంభించారు. న్యూఢిల్లీలోని AIIMS నుంచి డెర్మటాలజీలో MD పూర్తిచేసిన అనంతరం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ లో తన తొలి కేంద్రాన్నిస్థాపించారు. ప్రస్తుతం Eugenix Hair Sciences విదేశాలతో పాటు, ముంబై, గురుగ్రామ్, భువనేశ్వర్, హైదరాబాద్ వంటి పలు నగరాల్లోకేంద్రాలను కలిగి ఉంది.గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిఅంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డా. ప్రదీప్ సేథి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వైద్య రంగంలో విశేష విజయాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. Eugenix Hair Sciences గురించి:Eugenix Hair Sciences భారతదేశంలో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిన హెయిర్ రీస్టోరేషన్ బ్రాండ్ గా ప్రసిద్ధిచెందింది. శాస్త్రీయ విధానాలతో ఆధునిక పరిష్కారాలను అందిస్తూ, విశ్వసనీయతను సంపాదించింది. ప్రముఖ సర్జన్లుడా. ప్రదీప్ సేథి మరియు డా. అరికా బన్సాల్ స్థాపించిన ఈ సంస్థ, 30 సంవత్సరాలకుపైగా కలిపిన అనుభవంతో క్లినికల్ నైపుణ్యం, నైతిక వైద్య విధానం, అంతర్జాతీయ ప్రమాణాలను సమన్వయం చేస్తోంది. Eugenix లో హెయిర్ రీస్టోరేషన్ సాధారణ ట్రాన్స్ ప్లాంట్ ను మించి, అత్యంత క్లిష్టమైన బాల్డ్నెస్ కేసులను కూడా ఖచ్చితత్వంతో చికిత్స చేస్తారు. ఇక్కడ అభివృద్ధిచేసిన Direct Hair Transplant (DHT) టెక్నాలజీ సంప్రదాయ ఊ్ఖఉ పద్ధతితో పోలిస్తేమెరుగైన గ్రాఫ్ట్సర్వైవల్ ను అందిస్తుంది. శాస్త్రం మరియు కళను సమన్వయం చేసిన ఈ విధానం హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ నాణ్యతను గణనీయంగా పెంచింది. 18,000కుపైగా విజయవంతమైన ప్రొసీజర్లు, 50 మిలియన్ గ్రాఫ్ట్ల ఇంప్లాంటేషన్ తో Eugenix విశ్వాసం, పారదర్శకత, ఫలితాలపైఆధారపడి మంచి పేరు సంపాదించింది. కఠినమైన మెడికల్ ప్రోటోకాల్స్, పేషెంట్ఫస్ట్విధానం, వ్యక్తిగత చికిత్స ప్రణాళికలు మరియు నిరంతర ఆవిష్కరణ సంస్థ విజయానికి మూలం. Eugenix పురుషులు మరియు మహిళలకు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్, హెయిర్ లైన్ రీ కన్సస్ట్రాక్షన్, గడ్డం, కనుబొమ్మల పునరుద్ధరణ, కరెక్టివ్ ప్రొసీజర్లు, ఆఫ్రో, బాడీ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వంటి విస్తృత సేవలను అందిస్తుంది. ఆధునిక సదుపాయాలు, నైపుణ్యంతో కూడిన వైద్య బృందం ద్వారా అత్యున్నత నాణ్యత మరియు భద్రతను నిర్ధారిస్తుంది. భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన Eugenix అంతర్జాతీయ స్థాయిలో వేగంగా విస్తరిస్తూ, ఆధునిక సాంకేతికతను అభివృద్ధిచేస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, అంతర్జాతీయ క్రికెటర్లు, సంగీత విద్వాంసులు సహా అనేక మంది రోగులకు విజయవంతమైన సేవలను అందించింది. Eugenix హెయిర్ రీస్టోరేషన్ రంగంలో నైతిక వైద్య విధానాలకు ప్రాధాన్యతనిస్తూ, పారదర్శక కన్సల్టేషన్, నిజాయితీ గల గ్రాఫ్ట్అంచనా, వాస్తవిక ఫలితాల నిర్ధారణ ద్వారా రోగులలో దీర్ఘకాల విశ్వాసాన్నిఏర్పరచుకుంది. ప్రతి చికిత్సను అనుభవజ్ఞులైన వైద్యులు పర్యవేక్షిస్తూ, ప్రతి దశలో వైద్య బాధ్యతను నిర్ధారిస్తున్నారు. -
చిన్నారి రూపంలో అమ్మవారి లీల!
ఆడపిల్లలంటేనే గాజులు.. చెవి రింగులు, ముక్కెర, కాళ్ల పట్టీలు.. ఇలా వివిధ అలంకరణ వస్తువులను ఇష్టంగా ధరిస్తారు. ఈ ఆసక్తి సామాన్యులకే కాదు.. లోకాలనేలే అమ్మలగన్న అమ్మకు కూడా ఉంటుందని మీకు తెలుసా? అంతేకాదు.. స్వయంగా ఆండాల్ అమ్మవారు ఓ చిన్నపాప రూపంలో గాజుల విక్రేత వద్ద ఎంతో ఇష్టంగా గాజులు వేయించుకున్నారు. అంతేకాదు.. అక్కడే కొలువుదీరిన అమ్మవారికి పెళ్లిళ్లు జరగాలని, పిల్లలు పుట్టాలని ముడుపుకడితే.. ఇట్టే ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న గోదా సమేత మన్నారు రంగనాథ స్వామి ఆలయం విశేషాలు తెలుసుకోవాలంటే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి.. రంగనాథస్వామి ఆలయాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ... గోదాదేవి సమేతంగా ఉన్న ఆలయాలు చాలా అరుదు. అలాంటిదే తెలంగాణలోని ఘట్కేసర్ సమీపంలో ఏదులాబాద్లో ఉన్న గోదాదేవి సహిత రంగనాథస్వామి ఆలయం. దాదాపు ఆరువందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని అప్పల దేశీకుడు అనే భక్తుడు కట్టించాడనీ, అప్పటినుంచీ ఆ వంశస్థులే ఈ గుడి బాధ్యతను తీసుకున్నారనీ అంటారు. ఇక్కడ కోరిన కోర్కెలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడి స్వామివార్లను దర్శించుకునేందుకు నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. దీంతో శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయం నిత్యకళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతోంది.హైదరాబాద్-వరంగల్ హైవేలో ఘట్కేసర్కు 5 కిలోమీటర్ల దూరంలోని ఎదులాబాద్లో శ్రీ గోదా రంగనాయక స్వామి కొలువై ఉన్నారు. ఈ దేవస్థానం ప్రాచీనమైనది. ఈ ఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని పూర్వం రాయపురం అని పిలిచేవారు. ఆలయ స్థల పురాణం ప్రకారం.. శ్రీ వత్సస గోత్రీకులైన తిరువనంతపురం వాసి శ్రీనివాస దేశీకుడు.. ఈయన భార్య పేరు అలివేలమ్మ. ఈమె గర్భం దాల్చిన కొద్ది రోజులకే శ్రీనివాస దేశీకుడు మరణించారు. దీంతో అలివేలమ్మ శ్రీ వల్లిపుత్తూరుకు చెందిన తన తండ్రి గారి ఇంటికి చేరుకుంది. అక్కడే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలుడి పేరు అప్పల దేశీకుడు. పిల్లాడు ఎదుగుతున్న సమయంలో సోదరుల సహకారం లేకపోవడంతో.. అలివేలమ్మ తన కొడుకును తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. అలా అప్పటి నిజాం రాజ్యమైన ప్రస్తుత తెలంగాణాలోని రాయపురం గ్రామానికి చేరుకుంది. అక్కడ రాయుడు పంతులు అనే రాజు ఆమెను ఆదరించి కావలసిన వసతులు కల్పించారు. అలా అలివేలమ్మ గ్రామంలోని ఏకాంగుల ఇంటిలో ఆశ్రయం పొందుతుంది.అలివేలమ్మ కుమారుడైన అప్పల దేశీకుడు మంచి దైవ భక్తి కలవాడు. గ్రామంలోని వేణుగోపాల స్వామి సన్నిధికి ఎదురుగా ఓ చిన్న గుడిని నిర్మించుకుని అందులో ఆండాలు అమ్మవారిని ప్రతిష్ఠించి ధూప, దీప నైవేద్యాలతో, తిరు నక్షత్రాలను జరిపించేవాడు. కొన్ని రోజులకు తమ స్వగ్రామం వెళ్ళి అక్కడి నుంచి శ్రీ రంగమన్నార్, గోదా ఆండాళ్ విగ్రహాలను తెచ్చి ప్రతిష్టించాడు. ఐతే.. వేణుగోపాలస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ గుడి చిన్నదిగా ఉందని.. స్వామివారు కాళ్లు చాచుకోడానికి కూడా సరిపోవడం లేదని భావించి.. ఆ పక్కనే మరో ఆలయాన్ని నిర్మించి, విగ్రహాలను ప్రతిష్టించారని చెబుతారు. ఐతే అమ్మవారే స్వయంగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారనే కథ కూడా ప్రచారంలో ఉంది.అమ్మవారు తిరిగిన అన్ని ప్రాంతాల్లో ప్రసాదం నిండుకునేది. కానీ ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రాంతంలో మాత్రం ప్రసాదం మిగులుతూ ఉండేది. దీంతో దీన్ని శుభ పరిణామంగా భావించి, తన నివాసానికి ఇదే అనువైన ప్రదేశంగా అమ్మవారు అప్పల దేశీకుడితో చెప్పినట్లు భక్తులు విశ్వసిస్తారు. పశ్చిమ దిక్కున ఉన్న గరుడాద్రి అనే స్థలంలో వెలసి ఉండాలని అనుకుంటున్నట్లు చెబుతారు. ఐతే ఆ ప్రాంతమంతా అడవి జంతువులు, విషసర్పాలతో నిండిపోయి ఉండడాన్ని చూసి అప్పల దేశీయుడు సంశయిస్తాడు. కానీ.. అమ్మవారు మాత్రం.. ముందు నువ్వెళ్లి పుష్కరిణిలో స్నానమాచరించి, సంధ్యావందనం చేసి రా..! అప్పటికి ఈ ప్రాంతమంతా మారిపోతుంది అని చెప్పారు. అలా అమ్మవారు చెప్పినట్లు సంధ్యావందనం చేసుకుని, తిరిగి వచ్చిన దేశీకుడు పూర్తిగా మారిపోయిన గరుడాద్రి ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి సన్నిధిని నిర్మించాడు.ఇక్కడ కొలువుదీరిన ఆండాల్ అమ్మవారికి గాజులంటే ఎంతో ఇష్టం. దీని వెనక ఓ కథ ఉంది. ఓ రోజు సాయంత్రం అమ్మవారు స్థానికంగా ఉన్న గాజుల వ్యాపారి వద్దకు ఓ చిన్నపిల్ల రూపంలో వెళ్లింది. తాను అప్పల దేశీకుడి కుమార్తెనని చెప్పుకొని, గాజులు వేయించుకుంది. తన తండ్రి వద్ద డబ్బులు తీసుకోవాలని చెప్పి.. అక్కడి నుంచి వచ్చేసింది. దాంతో మర్నాడు ఆ వ్యాపారి డబ్బుల కోసం అప్పల దేశీకుడి వద్దకు వెళ్లి, విషయం చెప్పారు. దానికి ఆశ్చర్యపోయిన అప్పల దేశీకుడు.. తనకు ఇంకా సంతాన భాగ్యం కలగలేదని చెప్పాడు. దాంతో ఆ వ్యాపారి ఆ చిన్నారి ఆనవాళ్లు చెప్పడంతో.. ఆలయంలోకి వెళ్లి.. అమ్మవారి వద్ద ఉన్న గాజులతో బయటకు వచ్చాడు. అవే గాజులా? అని అడగ్గా.. సదరు వ్యాపారి ఔనని సమాధానం చెప్పాడు. స్వయంగా అమ్మవారు చిన్నారి రూపంలో వచ్చి, గాజులు వేయించుకోవడంతో ఆ గాజుల వ్యాపారి జన్మ ధన్యమైందని దేశీకుడు ఉబ్బితబ్బిబైపోయాడు. అప్పటి నుంచి ఆండాల్ అమ్మవారికి గాజులమ్మ అని పేరు వచ్చింది. ఈ ఆలయంలో ఏటా నాగుల పంచమి రోజున అమ్మవారికి మట్టి గాజులను సమర్పించడం ఇక్కడ ఓ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఆలయంలో రోజువారీ జరిగే పూజలు ఒకెత్తయితే.. నెలలో మొదటి ఆదివారం నిర్వహించే సుదర్శన హోమం మరో ఎత్తు. ఏటా ఇక్కడ శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి సప్తమి వరకు రంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను జరుపుతారు. ఈ ఉత్సవాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటూ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన భక్తులు తరలివస్తారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి రోజు అధ్యయనోత్సవాలూ, నమ్మాల్వార్ పరమపద ఉత్సవాలు నిర్వహిస్తారు. మకర సంక్రాంతి రోజు గోదాదేవి కల్యాణం, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలూ నిర్వహిస్తారు. నేటికీ అప్పలా చార్యులవారి ఏడో తరం వారు ఈ ఆలయంలో అర్చకులుగా ఉన్నారు.ఈ ఆలయంలో ఉత్సవాలకు ఎప్పుడూ ఏ లోటూ రాదట. ఉత్సవాలకి కావలసిన ధనం ఏదో ఒక రూపంలో సర్దుబాటవ్వడం వల్ల నిర్వఘ్నంగా సాగుతాయని భక్తులు చెబుతుంటారు. ఇదంతా అమ్మవారి సంకల్పంగా భావిస్తుంటారు. ధనుర్మాసంలో తప్పక సందర్శించవలసిన గొప్ప మహిమ గల ఆలయం ఇది. ఇక్కడ భక్తులు తాము కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని భావిస్తారు. ముఖ్యంగా సంతానం కావాల్సిన వారు.. గ్రహదోషాలతో వివాహాలు జరగని వారు ఇక్కడ ముడుపు చెల్లిస్తే.. ఏడాది తిరిగేలోగా శుభవార్త వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మొక్కులు తీరినవారు విధిగా ఇక్కడకు వచ్చి, తమ ముడుపులను విప్పి.. అమ్మవారికి వడిబియ్యం పెడతారు.ఇంకెందుకు ఆలస్యం.. ఉప్పల్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలనుకుంటున్నారా? ఉప్పల్ నుంచి ఇక్కడకు బస్సులు, ఆటోరిక్షాలు అందుబాటులో ఉన్నాయి. క్యాబ్లలో వెళ్లేవారు ఘట్కేసర్ వైపు నుంచి వెళ్లవచ్చు. ఒకవేళ.. హయాత్నగర్ పరిసరాల్లో ఉండేవారు.. దేశ్ముఖీ మీదుగా ఏదులాబాద్ చేరుకోవచ్చ. -
తెలంగాణ పోలీస్ బాస్ ఎవరంటే?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో పోలీసు వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి వచ్చే నెలలో పదవీ విరమణ చేయనుండటంతో, కొత్త డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) రాష్ట్ర ప్రభుత్వానికి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను పంపింది. ఆ జాబితాలో సీవీ ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా ఉన్నట్లు సమాచారం. డీజీపీ ఎంపికలో సాధారణంగా అధికారుల అనుభవం, సేవా రికార్డు, రాష్ట్రానికి చేసిన కృషి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సీవీ ఆనంద్కి నగర పోలీస్ కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రభాకర్ ఆప్టే వివిధ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సౌమ్య మిశ్రా కూడా తన సేవా కాలంలో అనేక ముఖ్యమైన పదవులను చేపట్టారు. ఈ ముగ్గురిలో ఎవరు కొత్తగా తెలంగాణ పోలీస్ వ్యవస్థకు నాయకత్వం వహిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.శివధర్ రెడ్డి పదవీ విరమణతో, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలో కొత్త నాయకత్వం అవసరం ఏర్పడింది. కొత్త డీజీపీ నియామకం రాష్ట్రంలో చట్టం, శాంతి పరిరక్షణలో కీలక పాత్ర పోషించనుంది. ఇక ఈ ముగ్గురు అధికారులలో ఎవరు డీజీపీ? అనేది త్వరలో స్పష్టత రానుంది. -
ముంబై నిద్రపోదు.. ఢిల్లీ త్వరగా లేవదు.. మన భాగ్యనగరం?
ఉరుకుల పరుగుల నగర జీవితంలో భారతీయులు ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ఒక కీలక విషయాన్ని విస్మరిస్తున్నారు.. అదే ‘కంటినిండా నిద్ర’. తాజాగా వెలువడిన ఒక జాతీయ సర్వే నివేదిక ప్రకారం.. భారతీయ నగరాల్లో నిద్ర నాణ్యత ఆందోళనకరంగా పడిపోతోంది. ముఖ్యంగా ముంబై నగరం దేశంలోనే అత్యధికంగా నిద్రలేమితో సతమతమవుతుండగా, ఢిల్లీ వాసులు ఆలస్యంగా నిద్రలేవడంలో రికార్డు సృష్టించారు. మరి మన హెదరాబాద్ పరిస్థితి ఏమిటి?ఆరోగ్యానికి నిద్రే ప్రాణాధారంశారీరక ఆరోగ్యానికే కాకుండా, మెదడు పనితీరుకు, మానసిక స్థిరత్వానికి తగినంత నిద్ర అత్యవసరం. నిద్ర తక్కువైతే ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా, దీర్ఘకాలంలో గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, ఆందోళన (Anxiety) వంటి సమస్యలకు దారితీస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా భారతీయులు నిద్రకు దూరమవుతున్నారు.నగరాల వారీగా నిద్ర తీరు తెన్నులుWakefit.co నిర్వహించిన తాజా సర్వే (జనవరి 2025 - మార్చి 2026 మధ్య) భారతీయ మెట్రో నగరాల్లో నిద్ర అలవాట్లపై ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.ముంబై (అత్యంత నిద్రలేమి నగరం): ముంబై వాసుల్లో 76.5 శాతం మంది అర్ధరాత్రి దాటాక నిద్రపోతున్నారు. దాదాపు 60 శాతం మంది పనివేళల్లో కూడా నిద్రతో తూగుతున్నట్లు సర్వే పేర్కొంది.హైదరాబాద్ (సమతుల్య నగరం): మన భాగ్యనగరం ఇతర మెట్రోలతో పోలిస్తే కొంత మెరుగ్గా ఉంది. ఇక్కడ 42 శాతం మంది ఆలస్యంగా నిద్రపోతుండగా, 31 శాతం మంది మాత్రమే నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీన్ని సర్వే 'బ్యాలెన్స్డ్ స్లీపర్ సిటీ'గా అభివర్ణించింది. ఢిల్లీ (ఆలస్యంగా మేల్కొనే నగరం): దేశ రాజధానిలో 45 శాతం మంది ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం.చెన్నై (క్రమశిక్షణ కలిగిన నగరం): నిద్ర వేళల విషయంలో చెన్నై వాసులు కొంత క్రమశిక్షణ పాటిస్తున్నారు. కేవలం 23.8 శాతం మంది మాత్రమే ఆలస్యంగా నిద్రలేస్తున్నారు.కోల్కతా (లేట్ నైట్ సిటీ): ఇక్కడ 75.5 శాతం మందికి రాత్రిపూట చాలా ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంది.బెంగళూరు (నిద్ర వైరుధ్యం): ఐటీ హబ్లో 36.3 శాతం మంది అర్ధరాత్రి దాటాక పడుకుంటున్నారు. అయితే నిద్రలేచిన తర్వాత కూడా 54 శాతం మంది తాము విశ్రాంతి పొందినట్లు భావించడం లేదని వెల్లడయ్యింది.విలన్లుగా మారిన స్మార్ట్ఫోన్లుభారతీయులు నిద్రకు దూరం కావడానికి ప్రధాన కారణం డిజిటల్ వ్యసనమేనని సర్వే స్పష్టం చేసింది. దాదాపు 87.6 శాతం మంది పడుకునే ముందు మొబైల్ ఫోన్లు చూస్తున్నట్లు అంగీకరించారు. సోషల్ మీడియా స్క్రోలింగ్, ఓటీటీలో బింజ్ వాచింగ్ వంటి అలవాట్లు నిద్ర నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. దీని ప్రభావం ఉత్పాదకతపై పడుతోంది. సుమారు 57.8 శాతం మంది ఆఫీసు పనివేళల్లో నిద్ర వస్తోందని వాపోతున్నారు.ఆందోళనకర గణాంకాలుమరో జాతీయ స్థాయి సర్వే (89,000 మంది స్పందనలు) ప్రకారం 46 శాతం మంది భారతీయులు రోజుకు 6 గంటల కంటే తక్కువ సమయమే నిద్రపోతున్నారు. రాత్రి 10 గంటల కంటే ముందే నిద్రపోయే వారు కేవలం 12 శాతం మంది మాత్రమే ఉండటం గమనార్హం.నిపుణుల సూచనలుమంచి నిద్ర కోసం రాత్రిపూట స్క్రీన్ టైమ్ తగ్గించాలని, సరైన సమయానికి భోజనం చేసి, బెడ్రూమ్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రను సమతుల ఆరోగ్యానికి ప్రాథమిక అవసరంగా గుర్తించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: గల్ప్కు మరిన్ని భారత యుద్ధ నౌకలు -
పన్నీరు, పచ్చళ్లు తెగ లాగించేస్తున్నారా?.. అయితే బిగ్ అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిన్న(మంగళవారం) కుళ్లిన చికెన్, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వ్యవహారం వెలుగులోకి రాగా.. తాజాగా కల్తీ పన్నీర్, పచ్చళ్లు కూడా బయటపడ్డాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ.. కల్తీ పన్నీర్, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్) బృందం రట్టు చేసింది. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బి. సాహితితో కలిసి సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజ్ బజార్ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ దాడుల్లో ఆరు హోల్సేల్, రిటైల్ దుకాణాలపై దాడులు చేసి, నిబంధనలకు విరుద్ధంగా కల్తీ ఉత్పత్తులను విక్రయిస్తున్న జైపాల్ సింగ్ రాజ్పురోహిత్, కొలారియా వైభవ్, నరేష్ కొలారియా, ప్రేమ్ అనిల్ వ్యాస్, రామ్ కిషోర్ కొలారియా, లక్ష్మీనారాయణ కొలారియాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితులు గుర్తు తెలియని ప్రాంతాల నుండి కల్తీ, అపరిశుభ్రమైన పనీర్, ఇతర పాల ఉత్పత్తులను భారీ మొత్తంలో సేకరించి, వాటిని నాణ్యమైన ఉత్పత్తులుగా నమ్మిస్తూ కిలో రూ. 280 చొప్పున హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులు, సామాన్య ప్రజలకు విక్రయిస్తున్నారు. తనిఖీ సమయంలో ఈ ఉత్పత్తులను ప్లాస్టిక్ కవర్లలో ఉంచి, దుమ్ము, ఈగలు వాలే అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఉత్పత్తులపై ఎటువంటి బ్రాండ్ పేరు, తయారీ తేదీ, గడువు తేదీ (Expiry Date) లేకపోవడమే కాకుండా, కనీస పేస్ట్ కంట్రోల్ రికార్డులు కూడా లేవని తేలింది.ఈ దాడుల్లో పోలీసులు మొత్తం 3,892 కేజీల కల్తీ పాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు, వీటి విలువ సుమారు రూ.11,11,600 ఉంటుంది. స్వాధీనం చేసుకున్న సొత్తులో 2,572 కేజీల పనీర్, 927 కేజీల కోవా, 249 కేజీల వైట్ క్రీమ్, 132 కేజీల అజ్మీరా కలకండ్ మరియు 12 కేజీల నెయ్యి ఉన్నాయి. ఈ అక్రమ వ్యాపారంలో ప్రధానంగా శంకర్లాల్ మిల్క్ ప్రొడక్ట్స్, విజయ మిల్క్ షాప్, వైభవ్ మిల్క్ డెయిరీ, శ్రీ బాలాజీ డెయిరీ ప్రొడక్ట్స్, జగదాంబ మిల్క్ మర్చెంట్ మరియు తులసి గిరిరాజ్ డెయిరీ ప్రొడక్ట్స్ అనే సంస్థలు పాల్గొన్నట్లు గుర్తించారు.కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై దాడికుల్సుంపురాలో కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కుల్సుంపురా సబ్-ఇన్స్పెక్టర్ ఎం. నరసింహ తన సిబ్బందితో కలిసి జియాగూడ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా, వెంకటేశ్వర నగర్లోని ఒక గోదాములో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించారు. అక్కడ సోదాలు నిర్వహించగా, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు (License) లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో పచ్చళ్లను తయారు చేస్తున్నట్లు తేలింది. నిందితులు కుళ్ళిపోయిన కూరగాయలు, నాణ్యత లేని ముడి పదార్థాలను ఉపయోగిస్తూ పచ్చళ్లను తయారు చేసి, స్థానిక దుకాణాలకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.72 డ్రమ్ముల వివిధ రకాల పచ్చళ్లు (నిమ్మకాయ, పండు మిర్చి, చింతకాయ, ఉసిరి, మరియు గోంగూర), 6 డ్రమ్ములు టమోటా, చింతపండు పేస్ట్. 1 చిన్న డ్రమ్ము అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 ఎలక్ట్రానిక్ బరువు తూచే యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎన్. నరసింహ, ఎన్. నరేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
సాక్షి, హైదరాబాద్: మూసాపేటలోని రెయిన్బో విస్టాస్ రాక్ గార్డెన్లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరగనున్నాయి. గురువారం సాయంత్రం నుంచి ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 5.55 గంటలకు జ్వోతి ప్రజ్వలనతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.6 గంటలకు శృంగేరీ శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తారు. అనంతరం ‘సంవత్సర పురుషోపాసన’ అనే అంశంపై ప్రముఖ తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ పాతూరి నాగరాజు ప్రసంగిస్తారు. ఇంకా భజన తదితర ఇతర కార్యక్రమాలూ నిర్వహించనున్నారు. -
ఎల్పీజీ సిలిండర్ల సరఫరా.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్లకు కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో నిన్న(మార్చి 17, మంగళవారం) 2 లక్షల 35 వేల 678 LPG సిలిండర్లను డెలివరీ చేసినట్లు తెలిపింది.ఎల్పీజీ సిలిండర్లు రీ ఫిల్లింగ్ కోసం ఆందోళన చెందవద్దని వినియోగదార్లకు ప్రభుత్వం సూచించింది. సిలిండర్ల డెలివరీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మానిటరింగ్ చేయడానికి పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసింది. సగటున రోజుకు 2,15,151 ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ జరిగేవని.. నిన్న అంతకు మించి డెలివరీ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న IOCL నుండి 93,887(+1%) సిలిండర్లు, HPCL నుండి 84,156 (+11,98%)సిలిండర్లు, BPCL నుండి 57,635 (+22.63%)సిలిండర్లు మొత్తం 2,35,678 సిలిండర్లు పంపిణీ జరిగినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. -
జగన్ ను కలిసిన HYD జర్నలిస్ట్, కె వెంకట్రామి రెడ్డి
-
తెలంగాణా వ్యాపారుల కోసం “జీరో ఎక్సెస్ బిల్” ఉద్యమం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో వ్యాపారాలు అధిక విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితులు రాకుండా అవగాహన కల్పించేందుకు హైదరాబాద్కు చెందిన టెక్నాలజీ సంస్థ భారత్ స్మార్ట్ సర్వీసెస్ “ఉగాది 2026 జీరో ఎక్సెస్ బిల్ తెలంగాణ ఉద్యమం”ను చెర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ప్రారంభించింది.ముఖ్యంగా పవర్ ఫ్యాక్టర్ (PF), డిమాండ్ ప్రవర్తన, లీడ్–లాగ్ పరిస్థితులు వంటి అంశాలు అధిక విద్యుత్ బిల్లులకు ఎలా కారణమవుతాయో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కోరల్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (భారత్ స్మార్ట్ సర్వీసెస్) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సికిందర్ రెడ్డి తండ్రా మాట్లాడుతూ, రోజుకు కేవలం ఒక నిమిషం సమయం కేటాయించి విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తే అధిక బిల్లులను నివారించ వచ్చన్నారు. LT వినియోగదారుల కోసం lead unblocking గడువు మార్చి 31, 2026 వరకు పొడిగించామని, కాబట్టి kVAh ఆధారంగా బిల్లు చెల్లించే వినియోగదారులు వెంటనే తమ బిల్లులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంస్థ సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సంస్థ తెలిపింది. -
మంత్రి పదవిపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: మరోసారి మంత్రిపదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతున్న సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘అధికారం శాశ్వతం కాదు. మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. నేను కూడా చాలా ఓపికతో ఉన్నాను. వివిధ కారణాలతో అధిష్టానం మంత్రి పదవి ఇవ్వలేకపోయింది. సమయం వచ్చినప్పుడు న్యాయం జరుగుతుంది’ అని ఆయన అన్నారు." -
Hyderabad: 2 వేల హోటళ్లు మూత!
సాక్షి,హైదరాబాద్: నగర హోటళ్లకు గడ్డుకాలం దాపురించింది. టిఫిన్ సెంటర్లు, తోపుడుబండ్ల పరిస్థితి మరీ దారుణం. వాణిజ్య సిలిండర్ సరఫరాలో కోత విధించడమే దీనికి కారణం. హోటల్ పరిశ్రమకు అందాల్సిన గ్యాస్లో మెజారిటీ వాటాను ఆసుపత్రులు, పాఠశాలలు వంటి అత్యవసర విభాగాలకు అధికారులు మళ్లిస్తున్నారు. దీంతో వాణిజ్య సిలిండర్ల డిమాండ్కు, సరఫరాకు మధ్య భారీ అగాధం ఏర్పడింది. నగరంలో 70 వేల నుంచి 80 వేల వరకు రెస్టారెంట్లు, టిఫిన్స్ సెంటర్లు ఉండగా, వారం రోజుల్లో 1,500 నుంచి 2 వేల వరకు మధ్య, చిన్న తరహా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు మూతపడ్డాయి. చాలా హోటళ్లలో మెనూ కుదించారు. ఎక్కువ సమయం ఉడికించాల్సిన వంటకాలను మెనూ నుంచి తొలగిస్తున్నారు. చాలా హోటళ్లు ఇండక్షన్ స్టౌలు, కట్టెల పొయ్యిల వైపు మళ్లుతున్నాయి. భారీ వంటకాలకు విద్యుత్ స్టౌలు సరిపోక సమస్య తలెత్తుతోంది. గృహ, రవాణాకు పూర్తిగా..కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యతలు మారాయి. వాణిజ్య అవసరాలకు (హోటళ్లు, రెస్టారెంట్లు) గ్యాస్ సరఫరాను కనిష్ట స్థాయికి తగ్గించారు. ప్రథమ ప్రాధాన్యం కింద సరఫరా గృహ అవసరాలకు, రవాణా రంగానికి పూర్తిస్థాయిలో గ్యాస్ కేటాయిస్తున్నారు. రెండో ప్రాధాన్యత కింద ఆసుపత్రులు, పాఠశాలలు (మిడ్ డే మీల్స్), అనాథ శరణాలయాలు, విద్యాసంస్థల హాస్టళ్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. పెట్రో కెమికల్ పరిశ్రమలకు సరఫరాను పూర్తిగా నిలిపివేసి, గృహ అవసరాలకు మళ్లిస్తున్నారు. దీని ప్రభావం హోటల్ రంగంపై పడింది. హోటల్ రంగానికి రోజుకు సుమారు 18 వేల నుంచి 23 వేల వాణిజ్య సిలిండర్ల అవసరం ఉండగా, 6,200 సిలిండర్లకు మించి సరఫరా కావడంలేదు. వచ్చే 15 రోజులు అత్యంత కీలకం మారాయి. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే హైదరాబాద్ హోటల్ రంగం భారీగానే నష్టపోయే ప్రమాదముందని హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. సామాన్యుడికి బయట భోజనం భారం కావడమే కాకుండా, హోటల్ రంగంపై ఆధారపడిన సుమారు 5 లక్షల మంది కారి్మకుల ఉపాధి ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యకం చేస్తున్నారు. -
కేర్.. డోంట్ కేర్!
హైదరాబాద్: ఈ రెండు ఫొటోలను చూశారుగా! ఒకటి కేరింగ్కు నిదర్శనంగా నిలిస్తే,మరోటి డోంట్ కేర్.. అన్నట్టుగా ఉంది కదూ! ఒడిలో ఒద్దికగా కూర్చున్న చిన్నారికి కూడా హెల్మెట్ పెట్టి బండి మీద భద్రంగా బడికి తీసుకెళ్తున్నాడు ఓ వ్యక్తి, భద్రతకు, బాధ్యతకు ప్రతీకగా! ఒకరుకాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలుగురు పిల్లల్ని బైక్పై కూర్చోబెట్టుకొని ప్రమాదకరంగా తీసుకెళ్తున్నాడు మరో వ్యక్తి, బాధ్యతారాహిత్యంగా! మాదాపూర్, హిమాయత్నగర్లో కనిపించిన ఈ దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. -
టిఫిన్ చేయడానికి వెళితే హోటల్స్ లో గ్యాస్ ఛార్జ్
-
చీటీ తీసుకువచ్చావా.. రూ.1090 ఇచ్చి సిలిండర్ తీసుకో..
హైదరాబాద్: చీటీ తీసుకువచ్చావా.. రూ.1090 ఇచ్చి సిలిండర్ తీసుకో.. గ్యాస్ గోడౌన్లో తనిఖీలకు వెళ్లిన హైదరాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి ఎదురైన ప్రశ్న ఇది. శ్రీనగర్కాలనీలోని బంజారా గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ను, కార్యాలయాన్ని మంగళవారం డీఎస్వో శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. లోపలికి వెళ్లిన ఆయనకు అక్కడ సిబ్బంది ఒక్కో సిలిండర్కు రూ.1090 ఇవ్వాలని, చీటీ రాయించుకుని రావాలని చెప్పారు. దీంతో ఆయన అవాక్కయ్యారు. సిలిండర్ ధర రూ.965 కదా.. అధిక మొత్తం ఎందుకు వసూలు చేస్తున్నారని సిబ్బందిని ప్రశి్నస్తే మాకు తెలవదు.. రెండు వారాల నుంచి ఇలాగే వసూలు చేస్తున్నామని చెప్పారు. అక్కడి నుంచి బంజారా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి ఖైరతాబాద్ సర్కిల్–7 జ్యోతితో కలిసి వెళ్లి తనిఖీలు చేశారు. గత వారం రోజుల నుంచి రికార్డులు నిర్వహించడం లేదని, గ్యాస్ సరఫరా అప్డేట్ కూడా లేదని గుర్తించారు. మేనేజర్ కూడా లేకపోగా, లెక్కాపత్రాలు అసలే నిర్వహించడం లేదని తేలింది. సరైన సమాచారం కూడా ఇవ్వడం లేదని గుర్తించారు. సిలిండర్లు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని సరఫరా అవుతున్నాయి తదితర అంశాలపై సరైన లెక్కలు లేవని కూడా తేల్చారు. దీంతో ఈ గ్యాస్ ఏజెన్సీపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇండేన్ అయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ గ్యాస్ ఏజెన్సీపై కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. -
HYD: మీరు తినేది అల్లం పేస్ట్ కాదు.. ఏం కలుపుతున్నారంటే?
సాక్షి, హైదరాబాద్: నగరంలో రెండు కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇరువురిని అరెస్టు చేయగా.. సుమారు రూ.7 లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. బోరబండలోని మధురా నగర్, టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలైమెట్ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా.. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో భారీగా కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.బోరబండలోని మధురా నగర్లో 'A1 సహారా గోల్డ్ అల్లం వెల్లుల్లి పేస్ట్' పేరుతో ఈ అక్రమ తయారీ సాగుతోంది. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి. రాఘవేందర్ నేతృత్వంలోని బృందం, GHMC ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జంగారెడ్డితో కలిసి ఈ దాడి నిర్వహించారు. నిందితుడు మొహమ్మద్ అబ్దుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, దుమ్ము, ఈగలు ముసిరే ప్లాస్టిక్ టబ్బులలో పేస్ట్ను నిల్వ చేస్తున్నారు. నాణ్యత లేని ముడిసరుకుతో పాటు అసిటిక్ యాసిడ్, అధిక మొత్తంలో ఉప్పు, వెల్లుల్లి పొట్టును కలిపి కల్తీ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో తయారైన ఈ ప్రమాదకరమైన పేస్ట్ను హోల్సేల్ కిరాణా షాపులకు, ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ నిందితుడు భారీగా లాభాలు గడిస్తున్నట్లు గుర్తించారు.సుమారు రూ. 4,50,000 విలువైన నిల్వలను, యంత్రాలను సీజ్ చేశారు. 4275 కిలోల వెల్లుల్లి ముడిసరుకు (95 బస్తాలు), 150 కిలోల వెల్లుల్లి పొట్టు, 55 కిలోల విడి అల్లం వెల్లుల్లి పేస్ట్, 800 కిలోల ఉప్పు, పసుపు, ప్యాక్ చేసిన వివిధ పరిమాణాల పౌచ్లు, మిక్సర్, గ్రైండర్, పీలింగ్ మెషీన్, ప్యాకింగ్, వెయిట్ మెషీన్లు స్వాధీనం చేసుకున్నారు.టప్పాచబుత్రాలో..టప్పాచబుత్రాలో మరో కేంద్రంపై హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్) బృందం దాడి చేసింది. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలైమెట్ ప్రాంతంలో సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. నిందితుడు మొహమ్మద్ జాఫర్ ఆలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్లో సిట్రిక్ యాసిడ్, అధిక మొత్తంలో ఉప్పు వంటి రసాయనాలను కలిపి కల్తీ చేస్తున్నారు.ఈ పేస్ట్ను దుమ్ము, ఈగలు ముసిరే ప్లాస్టిక్ టబ్బులలో, బహిరంగంగా నిల్వ చేస్తున్నారు. సుమారు రూ. 2,50,000 విలువైన నిల్వలను, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ పేస్ట్ను నగరంలోని వివిధ హోల్సేల్ కిరాణా దుకాణాలు, ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ నిందితుడు అక్రమంగా లాభాలు గడిస్తున్నాడు. FSSAI లైసెన్స్లో పేర్కొన్న చిరునామాకు, ప్రస్తుతం తయారీ సాగుతున్న చిరునామాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు. -
రూ. 216 కోట్లతో ఎగ్జికామ్ ప్లాంటు
ఈవీ చార్జర్లు తదితర ఉత్పత్తుల సంస్థ ఎగ్జికామ్ టెలీసిస్టమ్స్ హైదరాబాద్లో తమ కొత్త సమగ్ర తయారీ ప్లాంటును ప్రారంభించింది. దీనిపై రూ. 216 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ సీఈవో అనంత్ నహతా తెలిపారు. 18.4 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ ప్లాంటు తొలి దశతో ఉత్పత్తి సామర్థ్యం రెండున్నర రెట్లు పెరుగుతుందని, ప్రాంతీయంగా 750 పైగా ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని ఆయన వివరించారు.దేశీయంగా ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలు, లిథియం అయాన్ బ్యాటరీ సిస్టమ్స్, క్రిటికల్ పవర్ సొల్యూషన్స్కి పెరుగుతున్న డిమాండ్ని తీర్చేందుకు ఇది ఉపయోగపడగలదని నహదా చెప్పారు. ఇందులో ట్రై–ఫ్లక్స్ లిక్విడ్ కూల్డ్ పవర్ మాడ్యూల్స్ని కూడా తయారు చేయనున్నట్లు, అలాగే దేశీయంగా తొలి ఈవీ చార్జర్ ఇంటరాపరబిలిటీ టెస్టింగ్ సెంటర్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
హైదరాబాద్లో ఇలాంటి చికెన్ తింటున్నామా..?
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న ఓ చికెన్ సెంటర్పై వారసిగూడ పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్ బాపూజీ నగర్లోని 'ఏ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్' (A-1 Fresh Chicken Mart) యజమాని షేక్ షకీల్ కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నాడు. అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన ఫ్రోజన్ చికెన్ను స్థానిక ప్రజలకు, చిన్న వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో ఇవాళ మధ్యాహ్నం సమయంలో వారసిగూడ సబ్ ఇన్స్పెక్టర్ కే.రామచంద్రారెడ్డి తన సిబ్బందితో చికెన్ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. సుమారు 610 కిలోల చికెన్ అత్యంత అపరిశుభ్రమైన స్థితిలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. నిల్వ ఉంచిన మాంసం పూర్తిగా కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లుతోంది. ఆ ప్రదేశంలో ఎలుకలు, పిల్లుల సంచారం ఉండటంతో మాంసం పూర్తిగా కలుషితమైంది. కాగా, సదరు చికెన్ షాపు ట్రేడింగ్ లైసెన్స్ ఏడాది క్రితమే ముగిసినప్పటికీ, నిందితుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. -
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వాన
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ఇన్సాపూర్లో వర్షం పడింది. సంగారెడ్డి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలకు మామిడి, వరి పంట నేల రాలుతోందని రైతులు అంటున్నారు.కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, సోమవారం రాత్రి కూడా హైదరాబాద్. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది.తెలంగాణలోని 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. -
ప్లాట్ కొనేముందు ఇలా చేయండి: హైడ్రా హెచ్చరిక
రాజధానిలో ప్లాట్, ఇంటి స్థలం కొనేముందు పూర్తిగా విచారించి, అన్నీ సరిగా ఉంటేనే ముందుకెళ్లాలని హైడ్రా సూచించింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఏమైనా ఉందా? అనుమతి పొందిన లే అవుట్ అయినా.. ఇంటి నంబరు, బై నంబర్లతో అమ్ముతున్నప్పుడు మరింత అప్రమత్తంగా పరిశీలించి కొనుగోలు చేయాలని పేర్కొంది.ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా ఈ హెచ్చరికలు చేసింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ హైడ్రా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 48 ఫిర్యాదులు వచ్చాయి.అమీన్పూర్ చెరువులో తమ లేఔట్ మునిగిపోయిందని సెక్రటేరియట్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు.కాప్రా జీఆర్ రెడ్డి నగర్ హెచ్ఎండీఏ లే ఔట్లో మొత్తం నాలుగు పార్కులు ఉన్నాయి. ఒక పార్కులో ఒకదాని తర్వాత ఒకటిగా ప్రార్థన స్థలాలు వస్తున్నాయని నివాసితులు ఫిర్యాదు చేశారు. బాలానగర్ శోభనా కాలనీలోని అక్షయ ఎన్క్లేవ్ పేరిట 7.12 ఎకరాల్లో 69 ప్లాట్లతో 1983లో లేఔట్ వేశారు. ఇందులో రెండు స్థలాలను పార్కుల కోసం కేటాయించారు. 1700 గజాల పార్కును కబ్జా చేసేందుకు స్థానికులు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 200 గజాలు ఆక్రమించి షెడ్డు వేసి వ్యాపారాలు చేస్తున్నారు. వెంటనే హైడ్రా స్పందించి చర్యలు తీసుకోవాలని, పార్కును కాపాడాలని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. -
లేడీ కాదు.. మహా కిలాడీ.. వైద్యురాలిగా నటిస్తూ!
సాక్షి, హైదరాబాద్: వైద్యురాలిగా నటిస్తూ రోగులను మత్తులో ముంచి దోచుకుంటున్న కిలేడీ, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలానికి చెందిన గౌండ్ల శిరీష.. వివిధ ఆసుపత్రులలో వైద్యరాలిగా నటిస్తూ రోగులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుంటోంది. ఆమెకు సహకరిస్తున్న భర్త ఎడులపల్లి సాయి కుమార్ను కూడా సికిందరాబాద్ జోన్ టాస్క్ఫోర్, మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితురాలు శిరీష ప్రస్తుతం డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (Pharm.D) చదువుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల సులభంగా డబ్బు సంపాదించేందుకు తన భర్తతో కలిసి ఆసుపత్రులలో దొంగతనాలకు ప్లాన్ చేసింది. తన వైద్య పరిజ్ఞానంతో వృద్ధ మహిళా రోగులను లక్ష్యంగా చేసుకునేది. డాక్టర్ ఆప్రాన్ (Apron) ధరించి ఆసుపత్రిలోకి ప్రవేశించి, తన వెంట తెచ్చుకున్న 'డయాజెపామ్' (Diazepam) అనే మత్తు ఇంజక్షన్ను బాధితులకు ఇచ్చేది. వారు స్పృహ కోల్పోయిన తర్వాత వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పరారయ్యేది.గత మార్చి 11న సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో, అలాగే చందానగర్లోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వీరు ఇదే తరహాలో చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన సొమ్మును విలాసాలకు, షాపింగ్కు ఖర్చు చేసేవారు. వీరి నుంచి సుమారు 11 తులాల బంగారం, మారుతీ సుజుకీ బాలెనో కారు, రెండు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో సిట్ ఏర్పాటు
హైదరాబాద్: నగర శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ ఉంటారు. సిట్ సభ్యులుగా గ్రేహౌండ్స్ కమాండర్ ఎం.రవీందర్, షాద్నగర్ డీసీపీ శిరీష, ఈగల్ ఫోర్స్ ఆఫీసర్లు సి.హరీష్ చంద్రారెడ్డి, ఎన్.బుచ్చయ్య, మొయినాబాద్ ఎస్హెచ్వో మల్లికార్జున రెడ్డి, ఎస్సైలు కోటేశ్వరరావు, సదాత్ అలీని ప్రభుత్వం నియమించింది. మరోవైపు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోదారుడు రితేష్ రెడ్డి గన్లైసెన్స్ను రద్దు చేయాలని సీపీకి సిట్ అధికారులు లేఖ రాశారు. రితేష్రెడ్డికి 2017లో గన్ లైసెన్స్ జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. రివాల్వర్ మిస్ యూజ్పై చర్యలు తీసుకోవాలని సీపీని సిట్ అధికారులు కోరారు. అలాగే, అసాంఘిక కార్యక్రమాలకు పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ అడ్డాగా మారిందని, దాన్ని సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. కాగా, మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు రాజకీయంగానూ కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. పలువురికి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కూడా ఈ కేసులో దొరికిపోయిన విషయం తెలిసిందే. -
మాట్లాడుకుందామని పిలిచి అంతమొందించాడు
ఉప్పల్: ఏఆర్ కానిస్టేబుల్ హత్య కేసులో పోలీసులు నిందితులను ఆరుగంటల్లోపే ఛేదించారు. ఉప్పల్ డీసీపీ కె.సురేష్ కుమార్ తెలిపిన మేరకు.. బానోతు సంతోష్ తరుణ్, సుధీర్ కుమార్ ముగ్గురూ స్నేహతులు. మూడు రోజుల క్రితం సుదీర్ తన బావ ఇంటి గృహప్రవేశానికి వీరిని పిలిచాడు. అయితే ఫంక్షన్ రోజున సంతోష్ చేసిన ఫోన్ కాల్స్ను సుధీర్ రిసీవ్ చేసుకోలేదు. ‘నన్ను పిలిచి.. నా ఫోన్ ఎత్తవా అంటూ ఆగ్రహానికి గురయ్యాడు. వాట్సాప్లో తీవ్ర పదజాలంతో ఇద్దరి మధ్యా చాటింగ్ జరిగింది. ఆదివారం రాత్రి 7:30 గంటలకు ‘మాట్లాడుకుందాం రా’ అని సుదీర్ను చిలుకానగర్ ఖాళీ స్థలానికి పిలిచారు. అక్కడ సంతోష్.. సుదీర్ను విచక్షణా రహితంగా పొడిచాడు. సు«దీర్ రోడ్డుపైకి పరుగులు తీసినా వదలకుండా వెంటాడి అందరూ చూస్తుండగానే పొడిచి చంపేశాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. సంతోష్ తోపాటు తరుణ్ నాగారంలోని సంతోష్ అక్క ఇంటికి చేరుకున్నారు. తెల్లవారే ముందే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే నిందితుల ఫోన్ సిగ్నల్స్, సీసీ ఫుటేజీలను ఆధారంగా నిందితులను తెల్లవారుజామున 4 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని, తన ఇన్స్ర్ట్రాగామ్లో కూడా స్ట్రీట్ ఫైటర్ నంటూ పోస్టులు పెట్టుకున్నాడని తెలిపారు.సోమవారం రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
Kukatpally : కోటి రూపాయల హవాలా మనీ ఎవరిది?
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లిలో కోటి రూపాయల హవాలా మనీ చోరీకి గురైంది. హవాలా డబ్బును బైక్పై తీసుకుని వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల కళ్లల్లో కారం కొట్టి కోటి హవాలా మనీ కొట్టేశారు. బహుదూర్ పూరా నుంచి జీడిమెట్లకు తరలిస్తుండగా దోపిడీ జరిగింది. బాధితుల ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుల నుంచి హవాలా డబ్బు ఎక్కడికి వెళ్తుందని దిశగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తిలక్ వర్మ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని టీ ఇండియా ప్లేయర్ తిలక్ వర్మ ఈ రోజు( సోమవారం) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించారు. 2026 T20 ప్రపంచ కప్ గెలిచి దేశం గర్వపడేలా చేసినందుకు గాను ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.అంతకు ముందు తిలక్ వర్మకు శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వస్తున్న విషయం తెలుసుకొని ఎయిర్పోర్టు వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయ ప్రాంగణం సందడిగా మారింది. కాగా ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్లో భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టులో తిలక్ వర్మ సభ్యునిగా ఉన్నారు. -
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న వారు ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, కూకట్పల్లి, చార్మినార్, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం పడుతున్న సమయంలో మెట్రో పిల్లర్ల కింద వాహనాలు ఆపి వర్షం వెలిసేదాక ఎదురుచూశారు.మరోవైపు మెదక్ జిల్లాలోనూ వర్షం దంచికొట్టింది. తూప్రాన్ మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగలులతో కూడిన భారీ వర్షం పడింది. పోచమ్మరాల్ గ్రామంలో పెద్ద ఎత్తున వడగళ్ల వాన కురిసింది. అర్ధ గంటపాటు కురిసిన వడగళ్ల వానతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ అకాల వర్షాలతో వరి పంటతో పాటు మామిడికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతన్నలు ఆవేనద వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టి సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. నారాయణ ఖేడ్, ఆందోలులోనూ జోరుగా వర్షం కురిసింది. -
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య
-
అంగన్వాడీల దీక్ష భగ్నం.. మహిళలను ఈడ్చి పడేసిన పోలీసులు
-
చేపల వేటకు వెళ్లి.. మూసీలో మునిగిన ముగ్గురు యువకులు
-
గ్లోబల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్గా హైదరాబాద్
హైదరాబాద్ నగరం ఇప్పుడు కేవలం ఐటీ, ఫార్మా హబ్ మాత్రమే కాదు.. గ్లోబల్ సినిమా టెక్నాలజీ సెంటర్గానూ తన స్థానాన్ని బలపరుచుకుంటోంది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రారంభమైన అత్యాధునిక ఏ అండ్ ఎమ్ మోషన్ క్యాప్చర్ ల్యాబ్తో పాటు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన నెట్ ఫ్లిక్స్ ఐ లైన్ హబ్.. ఆధునిక పోస్ట్–ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ హబ్.. ఇవన్నీ కలిపి ఇండియన్ సినిమా స్వరూపాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఇప్పటి వరకూ కథ, నటన, సంగీతం వరకే పరిమితమైన భారతీయ సినిమా ప్రయాణం ప్రస్తుతం టెక్నాలజీ ఆధారిత విజువల్ స్టోరీ టెల్లింగ్ వైపు వేగంగా దూసుకెళ్తోంది. ఈ మార్పుకు కేంద్రబిందువుగా హైదరాబాద్ మారుతోంది. ఇది ఒక ట్రెండ్ కాదు.. ఇది సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. హైదరాబాద్ పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయికి దూసుకుపోతోందనడానికి నిదర్శనం. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అంటే నటుడి ప్రతి కదలిక, భావం, శరీర కదలికల ద్వారా వ్యక్తమయ్యే భాషను సెన్సార్ల ద్వారా రికార్డ్ చేసి, డిజిటల్ క్యారెక్టర్గా మార్చడం. హాలీవుడ్లో అవతార్ లాంటి సినిమాలను ఈ టెక్నాలజీతోనే నిర్మించారు. ఇప్పటివరకు ఈ సౌకర్యం కోసం భారతీయ దర్శకులు విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో, నెట్ ఫ్లిక్స్ వంటి వేదికల్లోని ఆధునిక మోషన్ క్యాప్చర్ ల్యాబ్తో.., భారీ బడ్జెట్ ఫ్యాంటసీ, మైథలాజికల్, సై–ఫై, యానిమేషన్ హైబ్రిడ్ సినిమాలు హైదరాబాద్ నుంచే రూపొందే అవకాశం ఏర్పడింది. ఇది తెలుగు సినిమాకు మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ సినిమాకు కీలకంగా మారనుంది. గ్లోబల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్.. ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ హబ్ మరో కీలక మైలురాయి. ఇది కేవలం ఓ స్టూడియో కాదు.. ప్రపంచవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్ కోసం వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్లకు విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ ప్రొడక్షన్, కలర్ గ్రేడింగ్, డిజిటల్ ఇంటరీ్మడియట్ అన్నీ ఇక్కడే జరగనున్నాయి. దీని ద్వారా హైదరాబాద్కు అంతర్జాతీయ సినిమా అవకాశాలు రావడం, వందల సంఖ్యలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్కు సంబంధించిన ఉద్యోగాలు లభించనున్నాయి. లోకల్ టాలెంట్ అంతర్జాతీయ ప్రాజెక్టులపై పనిచేయడం వంటి మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.గతం నుంచి వర్తమానానికి..! హైదరాబాద్కు సినిమా రంగంలో బలమైన చరిత్ర ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్టూడియోలు, ల్యాబ్స్ వంటివి పోస్ట్–ప్రొడక్షన్ రంగంలో దేశానికే తలమానికంగా నిలిచాయి. ఇప్పుడు అదే వారసత్వం ఏఐ ఆధారిత ఎడిటింగ్, వర్చువల్ సెట్స్, రియల్ టైమ్ వీఎఫ్ఎక్స్, వర్చువల్ కెమెరా టెక్నాలజీ వంటి ఆధునిక హంగులతో కొత్త రూపాన్ని సంతరించుకోనుంది.పాన్ వరల్డ్ స్థాయికి.. ఈ మార్పుల వల్ల భారతీయ చిత్ర నిర్మాణ రంగం కేవలం లోకల్ మార్కెట్కే కాదు.. నేరుగా గ్లోబల్ ఆడియన్స్ను లక్ష్యంగా చేసుకోనుంది. ఇటీవలి పాన్–ఇండియా, పాన్–వరల్డ్ సినిమాల విజయాలకు టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఊహా ప్రపంచాలు, వర్చువల్ యుద్ధాలు.. ఇవన్నీ ఇప్పుడు బడ్జెట్ పరిమితుల్లో భాగంగా ఉన్నాయి. అయితే తక్కువ ఖర్చుతో వీటిని నిర్మించాలంటే కేవలం మన దేశంలోనే సాధ్యమవుతుంది. దీంతో కథల స్థాయి మాత్రమే కాదు, ప్రెజెంటేషన్ స్థాయి కూడా అంతర్జాతీయంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
నార్సింగిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే ఆరేళ్ల బాలిక ఆదివారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. చిన్నారి అదృశ్యంపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు బాధితురాలి ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి, తన వెంట తీసుకువెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఆధారాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, కొద్దిసేపటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఎక్కడ దొరికిపోతానో అన్న భయంతో ఆమెను దారుణంగా హత్య చేసినట్లు తెలిపాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిందితుడు చూపిన ప్రాంతంలో పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించే ప్రక్రియలో ఉన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా వేగంగా విచారణ చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. -
ఎండల ఎఫెక్ట్… రైళ్లలో ఏసీ బోగీలకు భారీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఎండలు మండుతుండటంతో రైళ్లలో ఏసీ బోగీలకు డిమాండ్ పెరిగింది. సాధారణంగా స్లీపర్ బోగీల్లో ప్రయాణం చేసేవారు సైతం ఏసీ ఉంటేనే జర్నీ అనే పరిస్థితి నెలకొంది. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్ల కంటే థర్డ్క్లాస్ ఏసీ బోగీలకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. పూర్తిస్థాయి ఏసీ సదుపాయం కలిగిన వందేభారత్ రైళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. వందశాతానికి పైగా ఆక్యుపెన్సీతో ఈ రైళ్లు నడుస్తున్నాయి. వెయిటింగ్లిస్ట్ కూడా పెరుగుతోంది. రాజధాని, సూపర్ఫాస్ట్ వంటి రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ బోగీల్లో కూడా పెద్ద సంఖ్యలో వెయిటింగ్ దర్శనమిస్తోంది. వేసవి ప్రారంభంలోనే ప్రయాణికుల డిమాండ్ ఇలా ఉంటే పిల్లలకు వేసవి సెలవులు, పెళ్లిళ్లు, పండుగలు తదితర వేడుకల కారణంగా ఏప్రిల్, మే నెలల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. థర్డ్ ఏసీదే టాప్.. సాధారణ స్లీపర్తో పోల్చుకుంటే ఏసీ చార్జీలు రెట్టింపే. హైదరాబాద్ నుంచి విశాఖకు స్లీపర్ సుమారు రూ.450 వరకు ఉంటుంది. థర్డ్ ఏసీలో ఇది రూ.1,190 అయినా సరే కనీసం 12 గంటల ప్రయాణం కావడంతో టికెట్ ధర ఎక్కువే అయినా ఏసీనే కోరుకుంటున్నారు. ఏసీ బోగీల్లో దుప్పట్లు, బెడ్షిట్లు అందజేయడం, రెండు వైపులా డోర్లు లాక్ చేసే సదుపాయం వల్ల ప్రయాణంలో భద్రత లభించడం కూడా ప్రధాన కారణాలే. రాత్రంతా ప్రశాంతంగా నిద్రించి ఉదయాన్నే గమ్యస్థానానికి చేరుకొనే సదుపాయం ఉండడంతో ఈ బోగీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. స్లీపర్ తగ్గుముఖం.. ఏటా ఏసీ బోగీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని కొంతకాలంగా అన్ని ప్రధాన రైళ్లలో స్లీపర్ కోచ్లను తగ్గించి థర్డ్ ఏసీ బోగీలను పెంచారు. గతంలో అన్ని రైళ్లలో 1.5 లక్షల వరకు స్లీపర్ బెర్తులు అందుబాటులో ఉండేవి. థర్డ్ ఏసీ బెర్తులు పెంచడంతో స్లీపర్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అంచనా. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చాలామంది ఏసీ వైపు మొగ్గుచూపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి, నర్సాపూర్, చెన్నై, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారు ఏసీ ప్రయాణాలకే మొగ్గు చూపుతుండగా, ఉత్తరాదికి వెళ్లే కొన్ని రైళ్లలో మాత్రం స్లీపర్ బోగీలకు ఆదరణ ఉందని పేర్కొన్నారు. -
చెల్లిని చూడాలని వెళ్తూ.. అనంతలోకాలకు
మేడ్చల్ జిల్లా: మల్కాజిగిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెల్లిని చూడా లని బైక్పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గోదావరిఖనికి చెందిన మర్రి ప్రశాంత్ (35) మెడికల్ రిప్రజెంటేటివ్. భార్య శ్రావణి (33), కుమారుడు సహస్రన్ (10)తో కలిసి రాంనగర్లో నివసిస్తున్నారు. ఆదివారం మేడిపల్లిలో నివాసం ఉంటున్న తన చెల్లి ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా స్పార్క్ ఆస్పత్రి సమీపం వరంగల్ హైవేలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కియా కారు అదుపుతప్పి బైక్ను బలంగా ఢీకొట్టి కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య శ్రావణికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కుమారుడు సహస్రన్కు స్వల్పగాయాలు కాగా అత న్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నా రు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపా రు. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్, యజమాని ఉన్నారు. వీరిని మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని కార్ను సీజ్చేసి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. -
తండ్రులకు మచ్చ తెస్తున్న తనయులు...
సాక్షి ప్రతినిధి, కడప: ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ ఇద్దరు భాగస్వామ్య ఎమ్మెల్యేలు. ఆయా నియోజకవర్గాల్లో వారు శాసిస్తున్నా, తనయులు చట్టాలకు లోబడి మసలుకోవడంలో కట్టడి చేయలేకపోయారు. నిషేధిత మత్తు పదార్థాలు సేవిస్తూ పోలీసులకు పట్టుబడడంతో అభాసుపాలవుతున్నారు. ఫలితంగా ఆయా ఎమ్మెల్యేలకు ‘సన్’స్ట్రోక్ తప్పడం లేదు. వారే మైదుకూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు సుధాకర్యాదవ్, ఆదినారాయణరెడ్డి. సరిగ్గా రెండున్నర్ర నెలల వ్యవధిలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తనయులు ఇద్దరూ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టబడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పైగా పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ యాదవ్ ఎంపీ కావడం గమనార్హం. ⇒ జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనయుడు సు«దీర్రెడ్డి ఈ ఏడాది జనవరి 3న డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్శింగ్ పోలీసులకు చిక్కారు. పరీక్షలు నిర్వహించిన పోలీసులు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆపై డ్రగ్ ఆడిక్షన్ సెంటర్కు అప్పగించారు. అప్పట్లో ఈవార్త తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్ తనయుడు ఏలూరు పార్లమెంటు సభ్యుడు మహేష్యాదవ్ ఈగల్ టీమ్ పోలీసులకు పట్టుబడ్డారు. తెలంగాణ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఫామ్ హౌస్లో అనూహ్యంగా శనివారం రాత్రి పోలీసులకు చిక్కారు. ⇒ మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్యాదవ్ తనయుడు మహేశ్యాదవ్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు అల్లుడు కావడంతో ఏలూరు లోక్సభ టీడీపీ అభ్యరి్థత్వం దక్కింది. ఆపై ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఏలూరు ఎంపీగా ప్రాతినిథ్యం వహిçస్తున్నారు. తాజాగా డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది.స్థాయి పెరిగినా వ్యక్తిత్వ లోపం... ఎమ్మెల్యే కొడుకు.. ఆపై ఎంపీ హోదా.. ఉన్నతంగా వ్యవహరించాల్సింది పోయి ఇలా డ్రగ్స్ కేసులో దొరకడంపై ప్రజలు తూర్పారబడుతున్నారు. స్థాయి..హోదా పెరిగినా తన బుద్దిని బహిర్గతం చేసుకున్నారని విశ్లేషకులు దెప్పిపొడుస్తున్నారు. కాంట్రాక్టర్గా హైదరాబాద్లో స్థిరపడినప్పటికీ ప్రజాజీవితంతో ముడిపడి ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఇవేవి లెక్క చేయకుండా ఏకంగా డ్రగ్స్ వ్యవహారంలో దొరికిపోవడంతో జిల్లాలో నవ్వులపాలయ్యారు. 2014 ఎన్నికల ముందు కూడా మహేష్యాదవ్ బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన వారి సామాజిక వర్గానికే చెందిన ఓ నేతను ఇష్టానుసారంగా దూషించారు. కులంపేరుతో రెచ్చగొట్టే చర్యలకు దిగారు. ఇదంతా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దాంతో అంతో ఇంతో మద్దతుగా నిలిచిన నేతలు సైతం రాత్రికి రాత్రే దూరమయ్యేలా మహేష్ యాదవ్ వ్యవహారశైలి కని్పంచింది. ఆ ఎన్నికలల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఓటమికి అది కూడా ఓ ప్రధాన కారణంగా నిలిచిందని పలువురు వెల్లడిస్తున్నారు. అప్పట్లో ప్రత్యక్ష రాజకీయాల్లో క్రీయాశీలకంగా లేరని సర్దిచెప్పుకున్నా, తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడడంతో తన బుద్ధి పోనిచ్చుకోలేదని పలువురు నిలదీస్తున్నారు. తండ్రులకు మచ్చ తెస్తున్న తనయులు... జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనయుడు సు«దీర్రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్యాదవ్ తనయుడు మహేష్యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడి వారి తండ్రులకు మచ్చ తీసుకొచ్చారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈవ్యవహారంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మహేష్యాదవ్ మరింతగా చెడ్డపేరు మూటగట్టుకున్నారు. రక్త నమూనాలో డ్రగ్స్ శాంపిల్స్ పాజిటివ్ లభించినా పార్లమెంటు సభ్యుడు కావడంతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపినట్లు సమాచారం. గడిచిన ఐదు నెలల క్రితం సైబర్ నేరస్తుల వలలో చిక్కుకున్న ఎమ్మెల్యే సుధాకర్యాదవ్కు తాజాగా ‘సన్’స్ట్రోక్ భారీగా తగిలింది. -
డీప్గా మౌనం..!
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఓ ప్రముఖ నటికి సంబంధించిన మా ర్పింగ్ వీడియో 2023లో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆమె ముఖాన్ని వేరొక మహిళ శరీరానికి అంటించిన ఆ క్లిప్ భారతీయులకు ఒక చేదు నిజాన్ని చెప్పకనే చెప్పింది. అదేమిటంటే మహిళలకు వ్యతిరేకంగా అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతరించడమే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చర్యలు తీసుకునేలోపే ఆ వీడియో 80 లక్షలకుపైగా వ్యూస్ను పొందింది. ఈ రెండేళ్లలో ఇటువంటి డీప్ఫేక్ కంటెంట్ విస్తృతమైంది.ప్రపంచవ్యాప్తంగా డీప్ఫేక్ బాధితుల్లో అత్యధికులు మహిళలే ఉన్నారు. ఏఐ సేఫ్టీ సంస్థ ‘పై ల్యాబ్స్’నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా డీప్ఫేక్ బాధితుల్లో 93% మంది మహిళలే. ఇటీవలి కాలంలో మహిళలను లక్ష్యంగా చేసుకుని సృష్టించిన అనధికారిక కృత్రిమ కంటెంట్ ఏకంగా 900% పెరిగింది. భారత్లో మహిళలు బాధితులుగా నమోదైన సైబర్ నేరాల ఫిర్యాదులు 2024లో సుమారు 50వేలు ఉండగా.. 2025 నాటికి 80 వేలకు చేరుకున్నాయి.ఫొటోల మార్ఫింగ్, అసభ్యకరమైన డీప్ఫేక్ వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటర్నెట్లో కనిపిస్తున్న కంటెంట్లో డీప్ఫేక్ పోర్నోగ్రఫీ అత్యధికంగా ఉంటోంది. వాస్తవ వ్యక్తుల పోలికలు లేకుండా పూర్తిగా కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన మహిళా రూపాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. మౌనంగా బాధితులు.. మహిళలకు సంబంధించిన 62% డీప్ఫేక్ వేధింపుల ఘటనలు అసలు బయటకే రావడం లేదు. సామాజిక వివక్ష, అవమానం జరుగుతుందనే భయంతో బాధితులు మౌనంగా ఉంటున్నారు. ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్న భారతీయ మహిళల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. చాలామంది ఎదురుదాడి చేయడానికి బదులుగా నిశ్శబ్దంగా తమ డిజిటల్ ఉనికిని (సామాజిక మాధ్యమాల వినియోగాన్ని) తగ్గించుకుంటున్నారు. 33% మందికి తమను రక్షించడానికి ఉన్న చట్టాల గురించి కనీస అవగాహన కూడా లేదు.పరిశ్రమలా విస్తరించాయి..డీప్ఫేక్ వీడియోలతో వేధింపులు కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాలేదు. విస్తృతంగా ప్రచారంలోకి వచి్చన ఒక కేసులో.. మాజీ భాగస్వామి ఒకరు ఏఐ టూల్స్ను ఉపయోగించి ఒక మహిళ చిత్రంతో అసభ్యకరమైన ఇన్స్ట్రాగామ్ ప్రొఫైల్ను సృష్టించాడు. ఈ విషయాన్ని గుర్తించేలోపే 1.4 మిలియన్ల ఫాలోవర్లను ఆ ప్రొఫైల్ సంపాదించింది.ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఐదువేల కంటే ఎక్కువ ఫేస్–స్వాప్ టూల్స్, 1,000 వాయిస్–క్లోనింగ్ అప్లికేషన్స్ ద్వారా ఈ వేధింపులు ఒక పరిశ్రమలా విస్తరించాయి. సాధారణ మహిళలు కూడా సెలబ్రిటీలకు సమానంగా ప్రమాదంలో ఉన్నారు. డీప్ఫేక్లను అరికట్టడం అనేది ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. జెనరేటివ్ ఏఐ టూల్స్ అందరికీ అందుబాటులో ఉండటం, దురి్వనియోగం చేసే వారి సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. వీటిని గుర్తించే సాంకేతికతలు అందరికీ సమానంగా అందుబాటులో లేవు. -
కొడుకే ప్రేరణ..తల్లిగా లాలన..
ఒక కంటితో చూపు.. ఏం మాట్లాడినా వినపడదు.. ఏది చెప్పాలన్నా మాటలేదు.. ఆలోచనా శక్తి లేదు.. మానసికంగా ఎలాంటి ఎదుగుదల లేని కుమారుడినే ఓ తల్లి ‘ప్రేరణ’గా మార్చుకుంది. తన కుమారుడి వంటి ఎంతో మంది పిల్లలను అమ్మగా లాలిస్తోంది. వారి ఆలనా పాలనా చూస్తోంది. వారి సంక్షేమమే తప్ప ఎలాంటి లాభాపేక్ష లేకుండా దాదాపు 22 ఏళ్లుగా స్పెషల్ స్కూల్ నడుపుతోంది. ఇలాంటి పిల్లలంతా ఆత్మవిశ్వాసంతో జీవించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన ఈ అమ్మ..మలక్పేటకు చెందిన తొగరుచేడు విజయలక్ష్మి 2004లో అక్బర్బాగ్ పల్టాన్లో నలుగురితో ‘ప్రేరణ స్పెషల్ స్కూల్’ ప్రారంభించింది. వయసు భేదం లేకుండా 22 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. స్పెషల్ ఎడ్యుకేషన్లో శిక్షణ పొంది, టీచర్గా పనిచేసిన ఆమె ప్రస్తుతం మలక్పేట ప్రభుత్వ క్వార్టర్స్లో దాతల సహకారంతో 12 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో ఓ స్కూల్ నడిపిస్తోంది. పిల్లలకు స్వశక్తిలో శిక్షణ.. ఇక్కడ ఎక్కువ మంది సెరిబ్రల్ పాల్సీ, స్పాస్టిక్ చి్రల్డన్స్ ఉన్నారు. మెంటల్లీ చాలెంజ్ పిల్లలకు స్వీయరక్షణ, మాట్లాడటం, ఫిజియోథెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ రకరకాల వాటితో పాటు కంప్యూటర్లో శిక్షణ ఇస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పేరంటల్ గైడెన్స్ తరగతుల్ని నిర్వహిస్తున్నారు. మైనంతో దీపాలు, గ్రీటింగ్ కార్డులు, స్క్రీన్ ప్రింటింగ్, ఆఫీస్ ఫైల్స్ చేయించడంలో తరీ్ఫదు ఇస్తున్నారు. పప్పుల ప్యాకింగ్, బుక్ బైడింగ్, ఆడపిల్లలకు వంటింటి పనులు నేర్పిస్తున్నారు. నిత్యజీవిత అవసరాలు తీర్చుకునేలా బ్యాంకు పనులు, సరుకులు కొనుక్కోవడం, బస్సులో వెళ్లి తిరిగి రావడం, రైలు, బస్సు రిజర్వేషన్లు చేయించడం, అక్షరాలు చదవగలగడం వంటి తదితర వాటిని నేర్పిస్తారు.ఆత్మవిశ్వాసంతో.. మెంటల్లీ చాలెంజ్డ్ పిల్లలను ప్రారంభంలోనే గుర్తించి.. వారికి సరైన వైద్యం, సంబంధిత ఇన్స్టిట్యూట్లో వారికి శిక్షణ అందిస్తే ఫలితాలు ఉంటాయి. పిల్లల తల్లులు ఆ పనిని సవాల్గా తీసుకుంటే ఎవరిపై ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు. ఒక కన్నుతోనే చూసి.. వినపడని, మాట్లాడలేని, మానసికంగా ఎదగని నా కొడుకు వంశీ నాకు ‘ప్రేరణ’. పిల్లల సంక్షేమమే ధ్యేయంగా, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ మాది.తొగరుచేడు విజయలక్ష్మి, ప్రేరణ స్పెషల్ స్కూల్ నిర్వాహకురాలు (చదవండి: డెలివరీ బాయ్గా 78 ఏళ్ల వ్యక్తి..!) -
పుట్టా మహేష్, ప్రియాంకరెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇందులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఈగిల్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. పుట్టా మహేష్, ప్రియాంకరెడ్డికి నోటీసులు ఇచ్చి పోలీసులు వదిలేశారు. పెద్దల ఒత్తిళ్లతోనే వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు, శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్రెడ్డి, నితిన్ శర్మను పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా, ఫాంహౌస్లో దొరికిన 11 మందిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. రైడ్స్ సమయంలో కాల్పులు జరిపిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. -
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,నల్లగొండ: చింతపల్లి మండలం చెన్నారం గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్నఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని తొలుత దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఏడుగురిని హైదరాబాద్కు తరలించారు.మరణించిన వారిలో ఇద్దరు బీహార్కు చెందినవారిగా, మరో ఇద్దరు బొత్య తండాకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. స్థానికులు రోడ్లపై లారీలు నిర్లక్ష్యంగా నడపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
‘పుట్టా మహేష్ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు’
హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగిల్) ఫోర్స్ పోలీసుల ప్రకటించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి స్పందిస్తూ పుట్టా మహేష్ తీరుపై మండిపడ్డారు.‘చంద్రబాబు బ్రాండ్.. డ్రగ్స్ బ్రాండ్. డ్రగ్స్ మాఫియాను చంద్రబాబు పెంచి పోషిస్తున్నారు. సామాన్యుడికి ఒక రూల్.. ఎంపీకి మరో రూల్ ఉండకూడదు. పుట్టా మహేష్ను రక్షించడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. పుట్టా మహేష్కు ఎంపీగా కొనసాగే అర్హత లేదు’ అని కాకాణి అన్నారు. కాగా, వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఫాంహౌస్లో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. -
ఆ రెండు ఐఫోన్లను ఎందుకు ధ్వంసం చేసినట్లు..?
సాక్షి,హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈగల్ టీం పోలీసులు దాడులు జరిపే సమయంలో ఫాంహౌస్లో ధ్వంసమైన రెండు ఐఫోన్ల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ రెండు ఫోన్లు పైలెట్ రోహిత్రెడ్డి అతని పీఏ శ్రవణ్దేనని తెలుస్తోంది.అయితే, ఆ ఫోన్లను ధ్వంసం చేసింది పైలెట్ రోహిత్రెడ్డేనని పోలీసుల విచారణలో తేలింది. ఇదే అంశంపై పైలెట్ పీఏ శ్రవణ్ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణతో డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తన ఫాంహౌస్ జరిగిన వీకెండ్ పార్టీలో పైలెట్ రోహిత్రెడ్డి,అతడి సోదరుడు రితేష్ రెడ్డి ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని పోలీసులకు దొరికాడు. వీరితో పాటు పలువురు సైతం డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈగల్ టీం పోలీసులు ఫాం హౌస్పై దాడులు జరిపి మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. -
ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్
సాక్షి,హైదరాబాద్: నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఈ వీకెండ్ పార్టీలో ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగిల్) ఫోర్స్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అతని సోదరుడు పలువురు డ్రగ్స్ తీసుకున్నట్ల నిర్ధారించారు. వారందరికి ప్రస్తుతం డ్రగ్స్ టెస్టులు జరుగుతున్నాయన్న పోలీసులు.. వాళ్లు తీసుకున్నది ఎలాంటి డ్రగ్స్ అనేది పూర్తిస్థాయిలో టెస్టులు ఫలితాల తరువాతే తెలుస్తాయని చెప్పారు. డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలుఅయితే మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూరిన్ టెస్ట్ విషయంలో ఎంపీ పుట్టా మహేష్ నాటకం ఆడినట్లు తేలింది. యూరిన్ శాంపిల్ బదులు వాటర్ ఇచ్చారు. అనుమానం రావడంతో శాంపిల్ బాటిళ్లను టెస్టు చేయగా..శాంపిల్ బాటిల్లో ఉంది యూరిన్ కాదని నీళ్లని గుర్తించారు. దీంతో ఎంపీ పుట్టాపై పోలీసులు సీరియస్ అయ్యారు. టెస్టులు కోసం యూరిన్ శాంపిల్ ఇవ్వాలని.. నీళ్లు కాదని టీడీపీ ఎంపీ పుట్టా మహేష్పై పోలీసులు సీరియస్ అయ్యారు. అనంతరం పుట్టా మహేష్ నుంచి యూరిన్ సేకరించి టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో ఎంపీ పుట్టా మహేష్ బ్లడ్ టెస్టులో పాజిటీవ్గా నిర్ధారణైంది.డగ్స్ పార్టీపై ఈగల్ ఎస్పీ గిరిధర్..డగ్స్ పార్టీపై ఈగల్ ఎస్పీ గిరిధర్ మీడియాతో మాట్లాడారు. శనివారం అర్ధరాత్రి 3గంటల నుంచి ఫాం హౌస్లో పార్టీ జరుగుతోంది. రాత్రి 7.30 సమయంలో ఎంపీ పుట్టా మహేష్ ఫాం హౌస్కు వచ్చారు. సోదాల సమయంలో కాల్పులు జరిపారు. గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం.డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 11మందిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వారిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించాం’అని పేర్కొన్నారు. -
50వ పెళ్లి రోజు వేడుకలో భార్యతో డాన్స్ చేసిన మల్లారెడ్డి
-
జూబ్లీహిల్స్లో భారీ చోరీ
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో భారీ చోరీ జరిగింది. అన్నం పెట్టిన ఇంటికే ఓ నేపాలీ దంపతులు కన్నం వేశారు. పనిమనుషులుగా చేరిన నెలన్నరకే చేతివాటం ప్రదర్శించారు. యజమాని లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి 8 డైమండ్ నెక్లెస్లు, బంగారు ఆభరణాలు, 10 రోలెక్స్ వాచీలను దోచుకుని పరారయ్యారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలు... జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–25లోని ప్లాట్ నెంబర్ 305లో పింగళి అనురు««ద్రెడ్డి అనే వ్యాపారి, భార్య దీపికారెడ్డితో కలిసి ఉంటున్నాడు. నగరంలోని పేరు మోసిన హోటల్ యజమాని కుమార్తె అయిన దీపికారెడ్డి దంపతులు శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళాలు వేసి విమానంలో ఊటీకి వెళ్లారు. 45 రోజుల క్రితమే ఈ ఇంట్లో నేపాల్కు చెందిన మహేష్ షాయి(30), అప్సర(25) దంపతులు పనిమనుషులుగా చేరారు. యజమాని వద్ద నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించారు. పక్కా పథకంతో ఇంట్లో చేరిన నేపాలీ దంపతులు అవకాశం కోసం ఎదురుచూశారు. నాలుగైదు రోజుల నుంచి ఇంట్లోకి ఎలా వెళ్లాలి.. నగలు, నగదు ఎక్కడ భద్రపరిచారు.. వంటి వాటిపై రెక్కీ నిర్వహించారు. రాత్రంతా అల్మారా, లాకర్లను పగులకొడుతూ.. యజమానులు అనిరు«ధ్రెడ్డి, దీపికారెడ్డి ఊటికి వెళ్లడంతో శుక్రవారం రాత్రి 12.30 గంటల సమయంలో కత్తులు, కటార్లు, రాడ్ల సహాయంతో నేపాలీ దంపతులు ప్రధాన ద్వారం తాళం పగులగొట్టారు. బెడ్రూమ్లోకి వెళ్లి అల్మారాను, లాకర్లను శనివారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు పగులగొట్టారు. 8 డైమండ్ నెక్లెస్లు, 10 రోలెక్స్ వాచీలు, బంగారు నగను బ్యాగ్లో సర్దుకుని ఉడాయించారు. ఉదయం ఇంటికి వచ్చిన డ్రైవర్ గమనించి యజమానికి సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వేలిముద్రలు తీసుకున్నారు. ఈ దంపతులను పనిలో కుదిర్చిన పాత పనిమనుషులు హరత్సింగ్, రీమాసింగ్ల కోసం గాలిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాధితులు పేరు మోసిన కుటుంబానికి చెందినది కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శనివారం సాయంత్రం నేపాల్ సరిహద్దులకు ముంబై, బిహార్లకు పోలీసు బృందాలు చేరుకుని నిఘా పెట్టాయి. కాగా, హరత్సింగ్ గదిలో కూడా మహేశ్సాయి దంపతులు కొంత సామాను తస్కరించడం గమనార్హం. -
Hyderabad: మూతపడనున్న బావర్చి రెస్టారెంట్..!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత, ఖర్చులు పెరగడంతో చిన్న హోటళ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు ధరల పట్టికలను సవరిస్తున్నాయి. టిఫిన్¯ సెంటర్లు రూ.10 నుంచి 20, హోటళ్లు బిర్యానీ, మీల్స్పై రూ.50 వరకు పెంచేశాయి. సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలుతుండడంతో పాటు కొందరు డీలర్లు కృత్రిమ కొరత సష్టిస్తున్నారు. దీంతో హోటల్ నిర్వహకులు ఒక్కో సిలిండర్పై అదనంగా రూ.300–500 చెల్లించాల్సి వస్తోంది. కాగా, గ్యాస్ మాత్రమే కాక రవాణా చార్జీలు కూడా పెరగడంతో కిరాణం సరుకులు, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఇది హోటల్ యజమానులకు భారంగా మారింది. మేడ్చల్ జిల్లాలోని హాస్టళ్లలో టిఫిన్లు బంద్ చేశారు. మూడు పూటలా భోజనమే వడ్డిస్తున్నారు. బావర్చి... పార్సిళ్లకే పరిమితం హైదరాబాద్ బిర్యానీ అంటే.. బావర్చి అనేంతగా ప్రసిద్ధి చెందిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బావర్చి హోటల్పైనా సిలిండర్ కొరత ప్రభావం పడింది. నిర్వాహకులు బిర్యానీని పార్సిళ్లకు మాత్రమే పరిమితం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటల్ నడపడం చాలా కష్టమేనని బావర్చి హోటల్ నిర్వాహకుడు సల్మాన్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో పార్సిల్ సెంటర్ కూడా మూతపడేలా ఉంది. క్రాస్ రోడ్స్లోని మరో ప్రముఖ రెస్టారెంట్ కూడా మూతపడింది. రైల్వేస్టేషన్లో పెరుగుతున్న రద్దీ సికింద్రాబాద్: ఎండలు ముదరడం.. గ్యాస్ కొరత వల్ల వీధి వ్యాపారాలు మూతపడటం.. కాలేజీ విద్యార్థుల పరీక్షలు ముగియడం, శుభముహూర్తాలకు అనువైన వాతావరణం ఉండటంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు రెండు రోజులుగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్యాస్ కొరతతో ఫుట్పాత్ వ్యాపారాలు ఇప్పటికే మూతపడ్డాయి. హాస్టళ్లు, హోటళ్లు కూడా మెను ఐటమ్స్ను తగ్గించి నేడోరేపో మూసివేసే స్థితికి చేరే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కారి్మకులు సైతం సొంత ఊర్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్కు వస్తున్నారు. జనరల్ ప్రయాణికులను అదుపు చేసేందుకు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. -
చరిత్ర సృష్టించిన తెలంగాణ విద్యుత్ శాఖ
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలు చరిత్రలో ఒకే రోజున అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్లు (MU) విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టించింది. మార్చి 13, 2026 న ఉదయం 11:17 గంటలకు 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ను తట్టుకుని విజయవంతంగా సరఫరా చేసింది.మార్చి 13, 2026న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. ఆ రోజున రాష్ట్రం 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి, గత రికార్డు అయిన 335.19 మిలియన్ యూనిట్లు (18.03.2025) ను అధిగమించింది. అదే విధంగా, 18,228 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ను కూడా విజయవంతంగా తీర్చింది. ఇది గతంలో నమోదైన 17,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ (20.03.2025) కంటే ఎక్కువ. ఉష్ణోగ్రతలు పెరగడం మరియు వ్యవసాయ అవసరాలు అధికమవడం వల్ల విద్యుత్ అవసరం మరియు గరిష్ట లోడ్ రెండూ పెరిగాయి. భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థరాబోయే రోజుల్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు తమ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తూ కొనసాగుతాయి. రోజుకు 350కు పైగా మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం మరియు సుమారు 19,000 మెగావాట్ల గరిష్ట లోడ్ ను నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. బలమైన విద్యుత్ గ్రిడ్ మరియు సమన్వయంతో కూడిన కార్యాచరణ ప్రణాళికతో ఈ అవసరాలను ఎదుర్కొనే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది.ఈ అధిక డిమాండ్ సమయంలో నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించినందుకు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల సిబ్బందిని గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి అభినందించారు.. -
Hyd: అడ్వాన్స్డ్ ఫిజియో అండ్ రీజెనరేటివ్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఓఘా హెల్త్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ రీజెనరేటివ్ సెంటర్ను ఐఏఎస్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఒలింపిక్ షూటర్ ఈషా సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శైలజ రామయ్యర్ మాట్లాడుతూ “ఆరోగ్యమే మహాభాగ్యం” అన్న నానుడిని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఇప్పటి తరం మహిళలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపాలని సూచించారు. రోగాలు రాకముందే జాగ్రత్తలు తీసుకుంటూ సరైన చికిత్స, సంరక్షణ పొందడం ఎంతో అవసరమని తెలిపారు.ఆరోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం వంటి లైఫ్ స్టైల్ మార్పులు ఆరోగ్యానికి కీలకం అని అన్నారు. అంతర్జాతీయ స్థాయి అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ చికిత్సలు అందించే ఈ కేంద్రం ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా మహిళలు తరచూ ఎదుర్కొనే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. తెలంగాణకు ఒలింపిక్ పతకాలు సాధించిన ఈషా సింగ్ వంటి యువ మహిళా క్రీడాకారులు ఈ తరం అమ్మాయిలకు ఆదర్శమని శైలజ రామయ్యర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో అఖిల్, బిగ్ బాస్ ఫేమ్ భరణితో పాటు పలువురు పేజ్-3 ప్రముఖులు పాల్గొన్నారు.ఓజిహెచ్ఏ హెల్త్ (OGHA Health) ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన అడ్వాన్స్డ్ ఫిజియో & రీజెనరేటివ్ సెంటర్ ను హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా అత్యాధునిక ఫిజియోథెరపీ, రీజెనరేటివ్ కేర్ మరియు రిహాబిలిటేషన్ సేవలను అందిస్తూ, శరీర చలనం మెరుగుపరచడం, నొప్పి తగ్గించడం మరియు మొత్తం శారీరక పనితీరును పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కేంద్రాన్ని ముఖ్య అతిథి శైలజా రామయ్యర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఒలింపిక్ స్పోర్ట్ షూటర్ ఈషా సింగ్, డెలాయిట్ సంస్థ చీఫ్ హ్యాపినెస్ ఆఫీసర్ సరస్వతి కస్తూరిరంగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓజిహెచ్ఏ హెల్త్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ డా. సంధ్య గోలి మాట్లాడుతూ, ఆధునిక వైద్యం కేవలం వ్యాధులను చికిత్స చేయడానికే పరిమితం కాకుండా, వ్యక్తులలో శక్తి, చలనం మరియు ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. -
‘అప్పులపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అరకొరగా పథకాలు అమలు చేసి అన్నీ ఇచ్చేశామని గొప్పలు చెప్పుకుంటోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం రూ.3.27 లక్షల కోట్ల అప్పులు చేసిందని తెలిపారు. రాష్ట్ర అప్పులపై కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని అన్నారు.హైదరాబాద్ ప్రెస్క్లబ్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆర్బీఐ నుంచి తెచ్చింది అప్పుకాదా? తాత్కాలికంగా చేసిన అప్పు తిరిగి కట్టాల్సిన పనిలేదా? రాజధాని అమరావతి కోసం రూ.47,837 కోట్ల అప్పు చేశారు. కార్పొరేషన్ల పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు చేసింది వాస్తవం కాదా? ఏ రంగాన్నీ వదిలిపెట్టకుండా చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా అప్పులు తెచ్చారు’ అని చెప్పారు. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024-25 సీఏసీ రిపోర్ట్ పై మాట్లాడారు. ఆయన మాట్లాడితే టీడీపీ నేతల్లో వణుకు ఎందుకు? సీఏసీ రిపోర్ట్ లోని అంశాలను ప్రస్తావించడమే తప్పు అన్నట్లుగా కూటమి నేతలు మాట్లాడుతున్నారు. కూటమి భాధ్యతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుచేశారు. టీడీపీ పుట్టిందే సినిమా బేస్ మీద. అందుకే ఎన్నికల హామీలు కూడా సినిమా టైటిల్స్ లా ఉన్నాయి.రాష్ట్రంలో గ్యాస్ కొరతతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం హామీ మేరకు 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి. 2024-25లో రూ.60 వేల కోట్లు అప్పు చేశామని ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. సీఏజీ రిపోర్ట్ ప్రకారం రూ.80 వేల కోట్లకు పైగా అప్పు చేశారు’ అని అన్నారు. -
80 మంది 10th విద్యార్థులకు వారి స్కూల్లోనే సెంటర్
-
యువతికి HIV పాజిటివ్ బ్లడ్ ఎక్కించిన యువకుడు
-
జనగణన అప్పటినుంచే.. వివరాలు ఇవ్వకుంటే జరిమానే..!
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో జనగణనపై ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది. మే 11 నుండి జూన్ 9 వరకూ తొలివిడత జనగణన చేపట్టనున్నట్లు తెలిపింది. రెండో దశ జనగణన 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకూ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ వివరాలు సెన్సెస్ డైరెక్టర్ భారతి హోలికేరీ వెల్లడించారు. సర్వేలో 33 రకాల ప్రశ్నలుంటాయని పేర్కొన్నారు.16 ఏళ్ల తర్వాత దేశంలో జనగణన చేపడుతున్నామని కనుక ప్రజలందరూ తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా సమాచారం ఇవ్వకపోతే వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తామని తెలిపారు. కాగా జనగణన ఆధారంగానే ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్ తదితరాలన్నింటికీ జనగణనే కీలకం.దేశంలో చివరగా 2011లో జనగణన జరిగింది. తర్వాత 2021లోనే జరగాల్సి ఉండగా కోవిడ్–19 ప్రభావంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా ప్రారంభమైన సెన్సెస్–2027 ప్రక్రియలో ఎన్యూమరేటర్ తన మొబైల్ ఫోన్లో వివరాలు సేకరిస్తారు. ప్రత్యేక యాప్/పోర్టల్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు స్వీకరిస్తారు. -
హైదరాబాద్లో ‘రాంబాయి’ సినిమా తరహాలో ఘటన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పోచారంలో ‘రాంబాయి’ సినిమా తరహాలో ఘటన జరిగింది. పెళ్లికి నిరాకరించిన యువతికి యువకుడు ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించాడు. యువకుడితో పాటు తల్లిదండ్రులకు గతంలోనే ఎయిడ్స్ సోకింది. యువకుడు మనోహర్తో యువతికి వివాహం నిశ్చయమైంది. ఎయిడ్స్ ఉందని తేలడంతో యువతి.. పెళ్లికి నిరాకరించింది.ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లి, తనను పెళ్లి చేసుకోవాలంటూ మనోహర్ ఒత్తిడి తెచ్చాడు. పెళ్లికి నిరాకరించడంతో మనోహర్ ఎయిడ్స్ ఇంజెక్షన్ చేశాడు. నిందితుడిని పోచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం.. ఆపై తల్లిమృతి
సాక్షి, హైదరాబాద్: బోరబండలోని పెద్దమ్మనగర్లో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలపై హత్యాయత్నం చేసి అనంతరం ఊరేసుకొని తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ఘటనలో కుమారుడు ప్రాణాలు కోల్పోగా కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే ఆ మహిళ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే కారణమా అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
మాఫియా డాన్ ఇంట్లోనే చోరీ చేసిన ‘బాంబే సలీం’ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అతడి పేరు సలీం హబీబ్ ఖురేషీ.. బాంబే సలీం, మున్నా అనే మారు పేర్లూ ఉన్నాయి. 53 ఏళ్ల వయసున్న ఈ ఘరానా దొంగపై దేశ వ్యాప్తంగా 200 కేసులు ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన మహ్మద్ గౌస్ పాషా, ముంబైకి చెందిన సాబేర్లను అనుచరులుగా మార్చుకుని పంజా విసురుతున్నాడు. సాబేర్ మినహా మిగిలిన ఇద్దరినీ గోల్కొండ జోన్ టాస్్కఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. అతని నుంచి 220 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.1 కేజీల వెండి సహా రూ.33.71 లక్షల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు. ముంబైలోని గోవంది ప్రాంతంలోని టాటానగర్ స్లమ్లో ఉన్న డియోనార్ బుచ్చర్ హౌస్కు చెందిన సలీం ఆరో తరగతి వరకు చదివాడు. తొలినాళ్లలో ముంబైలో చిన్న చిన్న చోరీలు చేసినా 2000 నుంచి ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్నాడు. 2001లో ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో రెక్కీ చేసిన బాంబే సలీం గ్యాంగ్ ఓ ఇంటిని టార్గెట్గా చేసుకుంది. అదేరోజు రాత్రి ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసింది. మర్నాడు పత్రికలు చూసిన సలీంకు.. తాము చోరీ చేసింది మాఫియా డాన్ ఛోటా రాజన్ ఇంట్లో అని, దొంగిలించిన సొత్తు విలువ దాదాపు రూ.9 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. కొన్నాళ్ల తరవాత బాంబే సలీంను అరెస్టు చేసిన ముంబై పోలీసులు సొత్తు రికవరీ చేశారు. అయితే రాజన్ అనుచరుల నుంచి బెదిరింపులు రావడంతో.. బెయిల్పై వచి్చన వెంటనే వారిని సలీం కలిశాడు. జరిగింది చెప్పి ముంబై వదిలేస్తానని హామీ ఇచ్చి బయటపడ్డాడు. ముంబై నుంచి సలీం తన కుటుంబాన్ని బెంగళూరులోని పీన్యా సెకండ్ స్టేజ్లోని అత్తగారింటికి మార్చేశాడు. తాను కూడా అక్కడే ఉంటూ.. గ్యాంగ్ను వదిలి ఒంటరిగా పుణేలో పంజా విసరడం ప్రారంభించాడు. చోరీ సొత్తును బెంగళూరు తీసుకువచ్చి విక్రయించేవాడు. ఇతని కోసం తీవ్రంగా గాలించిన పుణే పోలీసులు బెంగళూరు అధికారుల సాయంతో 2011 ఫిబ్రవరిలో పట్టుకున్నారు. ఆపై తన ఇద్దరు భార్యలతో కలిసి హైదరాబాద్ వచ్చి వేర్వేరు ఇళ్లు తీసుకుని కాపురాలు పెట్టాడు. టోలిచౌకి ప్రాంతంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ పెట్టి కొన్నాళ్లు నడిపాడు. నష్టాలు రావడంతో మళ్లీ ముఠా కట్టి చోరీల బాటపడ్డాడు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 200కు పైగా నేరాలు చేశా>డు. బెంగళూరుకు చెందిన మహిళను మూడో పెళ్లి చేసుకుని అక్కడికి మకాం మార్చాడు. సలీం 2012 తర్వాత తన స్టైల్ పూర్తిగా మార్చేశాడు. టార్గెట్ చేసిన నగరానికి విమానంలో ప్రయాణించడం, అక్కడి సంపన్నుల ఇళ్లలో అనుచరులతో కలిసి చోరీలు చేయడం మొదలెట్టాడు. గోల్కొండ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేష ఎస్ఐ జి.విజయానంద్లతో కూడిన బృందం గురువారం రాత్రి మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద సలీం, గౌస్లను పట్టుకుని సొత్తు స్వా«దీనం చేసుకుంది. నిందితుడిని హబీబ్నగర్ పోలీసులకు అప్పగించిన టాస్్కఫోర్స్.. పరారీలో ఉన్న సాబీర్ కోసం గాలిస్తోంది. -
హైదరాబాద్లో ఒక్కొక్కటిగా మూతపడుతున్న హోటళ్లు..!
సాక్షి,రంగారెడ్డి జిల్లా: బంజారాహిల్స్ పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం నగరంలోని సామాన్యుడిని ఆకలి సెగల్లోకి నెడుతోంది. కమర్షియల్ గ్యాస్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సిలిండర్ల సరఫరా స్తంభించడాన్ని ఆసరాగా చేసుకుని ఉన్న కొద్దిపాటి నిల్వలను దళారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో హోటళ్లు, హాస్టళ్లు, చిన్న టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు మూతపడుతున్నాయి. తద్వారా రోజువారీ కూలీలు, చిరుద్యోగుల ఆహార అవసరాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. విద్య, ఉద్యోగాలకు వచ్చి హాస్టళ్లు, మెస్లపై ఆధారపడుతున్న లక్షలమంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఐటీ కారిడార్ (గచ్చిబౌలి, మాదాపూర్), అమీర్పేట, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, యూసుఫ్గూడ, రహ్మత్నగర్, దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాల్లో 11 వేల హాస్టళ్లున్నాయి. వీటిలో 10 లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉంటున్నారని అంచనా. అయితే, నిర్వాహకులు గ్యాస్ వాడకం తగ్గించేందుకు మెనూలో కోత విధిస్తున్నారు. దోశ, పూరీ, చపాతీ వంటివి తొలగించి.. కేవలం ఉప్మా, పొంగల్ వంటి తేలికైన బ్రేక్ఫాస్ట్, అన్నం–పప్పుతో సరిపెడుతున్నారు. ⇒ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మధురానగర్, ఫిలింనగర్ ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. వందలాది టీ స్టాల్స్ బంద్ చేశారు. అమీర్పేట్, ఎస్ఆర్నగర్, ఫిలింనగర్లలో ‘సాక్షి’ పరిశీలించగా.. శనివారం నుంచి హోటళ్లు బంద్ చేస్తామని ఇంకొందరు వ్యాపారులు చెప్పారు. చాలా హాస్టళ్లలో రెండ్రోజుల కిందటే మెనూ కోత పెట్టగా, తాజాగా ఒకపూట భోజనం లేదని చెప్పేస్తున్నారు. డొమెస్టిక్ గ్యాస్ వినియోగంపై నిఘా కమర్షియల్ సిలిండర్లు దొరక్కపోవడంతో చాలామంది హోటల్ యజమానులు గృహావసరాల సిలిండర్లను వాడుతున్నారు. దీనిపై పౌర సరఫరాల శాఖ మెరుపుదాడులకు దిగింది. మూడు రోజులుగా వందల సిలిండర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేసింది. కాగా, చిరు వ్యాపారులకు బ్లాక్లో కమర్షియల్ సిలిండర్ల ధరలు షాక్ కొడుతున్నాయి. ‘‘మాకు ఎప్పుడూ రూ.1,800కు సిలిండర్ ఇచ్చేవారు. ఇప్పుడు రూ.3,100 తీసుకుంటున్నారు’’ అని ఫిలింనగర్కు చెందిన రంజిత్ చెప్పారు. రూ.4 వేలు, ఇంకొన్నిచోట్ల రూ.5 వేలకూ విక్రయిస్తున్నారన్నారు.ఈ–కుక్కర్లు, ఇండక్షన్ స్టౌలు దొరకట్లేగ్యాస్ సిలిండర్ల కొరత ఆందోళనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్లకు డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో ఇలా ఆర్డర్ చేస్తే అలా వచ్చేవి. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్కార్ట్ సైట్లలో కనిపించడం లేదు. ఉత్పత్తి కంపెనీలు సహా వెబ్సైట్లలో ఇండక్షన్ స్టవ్ల ఫొటోలు, ధరలు పేర్కొంటున్నా, ఆర్డర్పై క్లిక్ చేస్తే సారీ చెప్పేస్తున్నాయి. మార్కెట్లో వీటి ధరలను అమాంతం పెంచారు. ఎలక్ట్రికల్ కుక్కర్ల వినియోగంతో నగరంలో విద్యుత్ వినియోగం మరింత పెరుగుతోంది. నిన్నటివరకు గ్రేటర్లో 3300 మెగావాట్లకు మించని వాడకం.. తాజాగా 3500 మెగావాట్లు దాటడం గమనార్హం.కమర్షియల్గా వినియోగిస్తే చర్యలు గృహపయోగ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇప్పటికే గృహ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నందుకు 233 కేసులు నమోదు చేసి 381 గృహ ఎల్పీజీ సిలిండర్లు స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. తగిన నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు. సర్వర్ డౌన్.. నో స్టాక్..! బంజారాహిల్స్: గృహావసర వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో కావొచ్చు, స్టాక్లో కావొచ్చు సమస్యలు లేవని ఒకవైపు కేంద్రం ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం వందలాది విని యోగదారులు బుకింగ్ కోసం యూసుఫ్గూడ గణ పతి కాంప్లెక్స్ దగ్గర ఉన్న బంజారా గ్యాస్ ఏజెన్సీకి వచ్చారు. ఆన్లైన్ చేద్దామంటే రావడం లేదని, వాట్సాప్లో కూడా బుక్ కావడం లేదని, పేటీఎం, ఫోన్ పే ద్వారా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వినియోగదారులు వాపోయారు. ఏజెన్సీ వద్దకు రాగా.. సర్వర్ బిజీ అంటూ పోస్టర్లు కనిపించాయని చెప్పారు. ఏజెన్సీ ఆఫీస్ మూసి ఉండటంతో ఉసూరుమంటూ వెళ్లిపోయారు. -
‘ఇదేం న్యాయం ?
హైదరాబాద్: ’ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఫుట్పాత్లపై ఉన్న దుకాణాలను, డబ్బాలను శుక్రవారం టౌన్ ప్లానింగ్ అధికారులను కూల్చివేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వచ్చి తొలగిస్తుండటంతో వ్యాపారులు వాగ్వివాదానికి దిగారు. కాస్త సమయమివ్వాలని కోరినా వినకుండా నేలమట్టం చేశారు. -
అల్లు సినిమాస్ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)
-
అద్దె గృహాలకు ఫుల్ డిమాండ్.. ఎక్కడంటే?
కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. విక్రయించే సమయంలో ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాల్లో అద్దె గృహాల మార్కెట్ క్రమంగా పెరుగుతోంది.ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉంది. ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండటంతో సప్లై తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్ పెరిగింది.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్ 50, సప్లై వాటా 39 శాతంగా ఉంది. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువ ఉంది.కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేల నుంచి రూ.35 వేల నెలవారీ అద్దెలకు కోసం అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ ఎక్కువ ఉంది. -
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షలు శనివారం నుంచి మొదలుకానున్నాయి. ఇవి ఏప్రిల్ 16 వరకూ కొనసాగుతాయి. పరీక్షలకు మొత్తంగా 5,28,239 మంది హాజరవుతున్నారు.వీరిలో రెగ్యులర్గా రాసే విద్యార్థుల సంఖ్య 5,17,727. కాగా 5,329 ప్రభుత్వ స్కూల్స్ నుంచి 2,07,573 మంది, 1057 గురుకులాల నుంచి 60,139 మంది, 5,288 ప్రైవేటు, ఎయిడెడ్ స్కూల్స్ నుంచి 2,50,015 మంది పరీక్షలకు హాజరవుతున్నారు.ఉదయం 9.30 నుంచి మొదలయ్యే పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను తేలికగా తెలుసుకునేందుకు హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ను ముద్రించారు. ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ కోరారు. పరీక్షల నేపథ్యంలో ఆయన శుక్రవారం జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలను తెరవాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు ముందే చేరుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతీ కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ నిఘా సిబ్బంది, పరీక్షల సిబ్బంది విద్యార్థులను ఆందోళనకు గురిచేసేలా వ్యవహరించవద్దన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, పోలీసుల సహకారం తీసుకోవాలని సిబ్బందిని కోరారు. మరో వారం రోజుల్లో ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మూల్యాంకన కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. -
టోలిచౌకిలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,హైదరాబాద్ : టోలిచౌకిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చారిత్రక కుతుబ్షాహీ సమాదులైన సెవెన్టూంబ్స్ సబ్స్టేషన్ పక్కనే పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో వాణిజ్య సముదాయాల్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పాయి. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం పక్కనే మసీదు ఉంది రంజాన్ మాసం కావడంతో వందల సంఖ్యలో ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. -
ఇల్లు కొంటే ఖరీదైన బైక్.. తులం బంగారం
షాపుల్లో మెగా సేల్స్.. బంపర్ ఆఫర్లు చూస్తుంటాం.. ఈ కామర్స్ సంస్థల ఇయర్ ఎండింగ్ డిస్కౌంట్లు చూస్తుంటాం.. మైక్ పట్టుకొని ‘రండి బాబూ రండి.. ఇలాంటి సువర్ణావకాశం మళ్లీ రాదు..’ అంటోంది స్థిరాస్తి రంగం. అందుబాటు ధరలు ఉండే హైదరాబాద్లో ఒకప్పుడు ప్రాపర్టీలు హాట్ కేక్లు. నిర్మాణం పూర్తి కాకముందే బ్రోచర్ల మీదే ఫ్లాట్ల అమ్మకాలు పూర్తయ్యేవి. ధరలు, నాణ్యత, బిల్డర్ల ట్రాక్ రికార్డ్లు, మార్కెట్ సెంటిమెంట్ అలా ఉండేది. 360 డిగ్రీల కోణంలో గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించేలా, ఆకర్షించేలా ఉండేది. కానీ, కొన్నేళ్లుగా మార్కెట్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. – సాక్షి, సిటీబ్యూరోమారిన పరిస్థితులతో పాటు కొన్ని ప్రతికూలతలతో స్థిరాస్తి రంగంలో సెంటిమెంట్ పూర్తిగా దెబ్బతింది. దీంతో విక్రయాలు లేక నిర్మాణ రంగం క్షీణించే దశకు చేరుకుంది. ఈ రంగంపైనే ఆధారపడిన నిర్మాణ సంస్థలు, బిల్డర్లు కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్ల వల వేయక తప్పడం లేదు. ఇళ్ల అమ్మకాలను పెంచుకునేందుకు విలువైన బైక్, ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఈవీ), తులం బంగారం, ఉచిత ఇంటీరియర్.. ఇలా రకరకాల ఆఫర్లతో ముందుకొస్తున్నారు.నిర్మాణ సంస్థలెన్నో.. స్థిరాస్తి రంగంలో ఆఫర్ల వల కొత్తేమీ కాదు. గతంలో ఉచిత ఇంటీరియర్, క్లబ్హౌస్ సభ్యత్వం, మాడ్యులర్ కిచెన్ వంటి పరిమిత స్థాయిలో ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్లో గృహ విక్రయాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో నగరంలోని చిన్నా, పెద్దా డెవలపర్లు, నిర్మాణ సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రీమియం మోటార్ సైకిళ్లు, 24 క్యారెట్ల బంగారం నాణేలు, ఈవీ వాహనాలు, ఉచిత ఇంటీరియర్ వంటి ఖరీదైన బహుమతులను అందజేస్తున్నాయి. ఉదాహరణకు నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కోకాపేట, కూకట్పల్లి, ఉప్పల్, పటాన్చెరు, రాజేంద్రనగర్లలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లలో అపార్ట్మెంట్ బుకింగ్తో ప్రతి కొనుగోలుదారుడికి రూ.3 లక్షల విలువైన హార్లీ డేవిడ్సన్ బైక్ను ఉచితంగా అందజేస్తామని ప్రచారం చేస్తోంది. మరో డెవలపర్ ఉప్పల్, రామాంతాపూర్లలో రాబోయే ప్రాజెక్ట్లో ప్రతి కస్టమర్కు రూ.8 లక్షల విలువైన ఈ–వాహనాన్ని అందిస్తామని ప్రచారం చేస్తున్నారు.ఆఫర్లతో విక్రయాలు స్పల్పకాలమే.. వేగంగా విక్రయాలు జరుపుకునేందుకు ఇలాంటి ఆఫర్లతో ప్రయత్నాలు చేస్తుంటారని డెవలపర్ల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రతికూల మార్కెట్లో అమ్ముడుపోని ఇన్వెంటరీని విక్రయించేందుకు ఇలాంటి ప్రత్యేక డీల్స్ను ప్రవేశపెడుతుంటారు. అయితే ఈ ఉచితాల ధర ప్రాజెక్ట్ ధరలో భాగం అవుతుందని, ఈ తరహా మార్కెట్ స్వల్పకాలంలో అమ్మకాలను పెంచినా.. స్థిరమైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే ఉచితాలు కాకుండా ధర, నిర్మాణ నాణ్యత, ప్రాంతాన్ని చూసి ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.బంగారంతో ఆకర్షణ.. పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆఫర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఫ్లాట్ బుకింగ్ చేసుకునే కస్టమర్లకు రిటర్న్ గిఫ్ట్ అందజేసే సంప్రదాయంగా పెరుగుతోంది. మియాపూర్కు చెందిన ఓ డెవలపర్ రూ.75–85 లక్షల మధ్య ధర కలిగిన రెండు, మూడు పడక గదుల ఇంటి కొనుగోలుపై కస్టమర్కు రూ.3 లక్షల విలువైన బంగారం ఇస్తామని ప్రకటించారు. అంటే దగ్గరిదగ్గర 10–14 గ్రాముల బంగారం ఇస్తున్నారు. అలాగే పిల్లల బెడ్ రూమ్కు ఇంటీరియర్, మాడ్యులర్ కిచెన్తో పాటు అందజేస్తామని ప్రచారం చేస్తున్నారు.రెరా పరిధిలోకి రావు.. ఆఫర్లు, ప్రోత్సాహకాలు కస్టమర్లను ఆకర్షించేందుకు డెవలపర్లు పన్నే వాణిజ్య వ్యూహాలు. అయితే ఈ ఉచిత ఆఫర్ల ప్రకటనలు తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(టీజీ రెరా) నియంత్రణ పరిధిలోకి రావు. ఇవి గృహ కొనుగోలుదారులకు రక్షణ కల్పించలేవు. అయితే సేల్డీడ్లో పేర్కొన్న విధంగా హామీలను అమలు చేయడంలో డెవలపర్ విఫలమైతే ఈ ఉచితాలు, బహుమతులతో సహా కొనుగోలుదారులు టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. ఆయా డెవలపర్లపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటారు. -
కల్తీ అల్లం- వెల్లుల్లి పేస్టు తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు
సాక్షి, హైదరాబాద్: శాస్త్రిపురంలోని బాబా కాంటా, ఉడంగడ్డ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా.. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న కేంద్రాలపై రాజేంద్రనగర్ జోన్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. నిందితులు.. ఎవరికీ అనుమానం రాకుండా నాసిరకం అల్లం, వెల్లుల్లిని సేకరించి, వాటికి ఉప్పు, టైటానియం డై ఆక్సైడ్ వంటి రసాయనాలు, గమ్ పౌడర్ను కలిపి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పేస్టు చిక్కగా ఉండటానికి, రంగు కోసం ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.నిందితులు అబ్దుల్ అలీమ్, జసాని దిల్దార్ అలీలపై కేసు నమోదు చేసిన పోలీసలు దర్యాప్తు చేపట్టారు. 1800 కిలోల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 కిలోల గమ్ పౌడర్ (Xanthan Gum), 2 కిలోల టైటానియం డై ఆక్సైడ్, సింథటిక్ ఫుడ్ కలర్ (లెమన్ ఎల్లో), 7 ప్యాకింగ్ మెషీన్లు, 3 గ్రైండింగ్ మెషీన్లు, 2 వెయింగ్ మెషీన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్లో పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ విక్రయాలు
సాక్షి, హైదరాబాద్: అపరిశుభ్రమైన ఆహార పదార్థాల విక్రయాలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. హైదరాబాద్ సిటీ సి.సి.ఎస్ (CCS), స్పెషల్ క్రైమ్ టీమ్, ఫుడ్ అడల్టరేషన్ టీమ్, బహదూర్పురా పోలీసులు సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ను నాణ్యమైనవిగా నమ్మించి ప్రజలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 30 కార్టన్ బాక్సుల్లో ఉన్న అపరిశుభ్రమైన, పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైదరాబాద్లోని చార్మినార్, చేలాపురా ప్రాంతంలో GEM Foods (ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్) పేరుతో ఒక గోడౌన్ను నిర్వహిస్తూ..పాడైపోయిన, బూజు పట్టిన డ్రై ఫ్రూట్స్ను సేకరించి, వాటిని తినడానికి యోగ్యమైన నాణ్యమైన డ్రై ఫ్రూట్స్గా అమ్మకాలు సాగిస్తున్నాడు. ఆహార పదార్థాలను, ముఖ్యంగా ప్యాక్ చేసిన లేదా డ్రై ఫ్రూట్స్ వంటి వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.వస్తువులను కొనేముందు వాటి నాణ్యత, వాసన, రూపాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని.. ఎవరైనా పాడైపోయినా.. కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు గమనిస్తే, వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్, ఆహార భద్రతా అధికారులకు సమాచారం అందించాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు. -
ఆకట్టుకున్న ‘మెగా రైతు మేళా-2026’
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ అగ్రి-సొల్యూషన్స్ సంస్థ అయిన కోరోమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU), తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖతో భాగస్వామ్యంగా హైదరాబాద్లోని రాజేంద్రనగర్ PJTAU క్యాంపస్లో మెగా రైతు మేళా 2026ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 5000 మందికి పైగా రైతులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచే వినూత్న సాంకేతిక మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క, వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శంకర సుబ్రమణియన్ ఎస్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) డైరెక్టర్ జనరల్ డా. మంగి లాల్ జాట్, మరియు PJTAU వైస్-చాన్సలర్ మరియు చైర్మన్ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య హాజరయ్యారు.ఈ రైతు మేళా, రైతులు వ్యవసాయ నిపుణులతో నేరుగా చర్చించేందుకు పంట పోషణ, పంట సంరక్షణ, విత్తనాలు, ప్రెసిషన్ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణలో తాజా అభివృద్ధులను తెలుసుకునేందుకు ఒక చురుకైన వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సాంకేతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
టెన్త్ విద్యార్థులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా, తమ జ్ఞానం, ప్రతిభను చూపించే మంచి అవకాశంగా భావించాలని.. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని గవర్నర్ పిలుపునిచ్చారు.పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండి, సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలన్న శివ ప్రతాప్ శుక్లా.. ఆత్మ విశ్వాసం విజయానికి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. -
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు కేంద్రప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి ప్రయాణించే మూడు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటు వచ్చినట్టయింది.కాచిగూడ-మధురై-కాచిగూడరైలు నం. 07191/07192 కాచిగూడ-మధురై-కాచిగూడ రైలును రైలు నం. 17165/17616 కాచిగూడ-ట్యుటికోరిన్-కాచిగూడ ఎక్స్ప్రెస్గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో మొదలై మరుసటి రోజు మంగళవారం రాత్రి 10:45 గం.లకు కేరళ రాష్ట్రంలోని ట్యూటికోరిన్ కు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో ట్యూటికోరిన్ నుంచి బుధవారం ఉదయం 7:45 గంటలకు మొదలై మరుసటిరోజు మధ్యాహ్నం 1:25 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ రైలు నం. 07230/07229 హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ రైలును రైలు నం. 17069/17070 హైదరాబాద్-కన్యాకుమారి-హైదరాబాద్ ఎక్స్ప్రెస్ గా మార్చారు. ఈ రైలు గతంలోలాగే ప్రతి బుధవారం సాయంత్రం 5:20 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కూడా గతంలో లాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 5:15 గంటలకు కన్యాకుమారిలో బయలుదేరి శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్, తిరుపతి, పాకాల జంక్షన్, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లిరైలు నం. 07225/07226 చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి రైలును రైలు నం. 17065/17066 చర్లపల్లి-షాలిమార్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ గా మార్చారు. ఇకపై ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు బుధవారం ఉదయం 11:20 గంటలకు పశ్చిమబెంగాల్ షాలిమార్కు చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో బుధవారం మధ్యాహ్నం 12:50 గం. లకు షాలిమార్ లో బయలుదేరి మరుసటి రోజు గురువారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది. 3 స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ రైల్వే తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
భార్య వేధింపులకు మరో భర్త బలి
-
హైదరాబాద్ లో గ్యాస్ టెన్షన్.. భారీగా పెరిగిన బుకింగ్స్
-
‘ఆ రోజే చనిపోతాననుకున్నా’
హైదరాబాద్: ఉద్యోగంలో చేరిన రోజే చనిపోతానేమోనని భయమేసిందని టెలీకాలర్ కీర్తన ఆందోళన వ్యక్తం చేసింది. మధురానగర్లోని వారాహి కన్సెల్టెన్సీలో మంగళవారం జరిగిన శశికిరణ్రెడ్డి హత్యకు సంబంధించిన వివరాలను ఆమె పోలీసులకు తెలిపింది. వివరాలివీ... వారాహి కన్సెల్టెన్సీ నిర్వాహకులు శశికిరణ్రెడ్డిని కత్తితో పొడిచి... కత్తితో స్టాఫ్ను బెదిరిస్తూ బయటికొచి్చన ప్రభుకుమార్ ఎదురుగా ఉన్న రిసెప్షనిస్టు లయ (అక్షయ)ను కత్తితో పొడిచినట్టు పేర్కొంది. మక్తల్ మండలం సంగంబండ గ్రామానికి చెందిన కీర్తన అదే రోజు (మంగళవారం) ఉద్యోగంలో చేరింది. ఉదయం 9 గంటలకు ఉద్యోగంలో చేరిన ఆమె మధ్యాహ్నం లంచ్ పూర్తి చేసిన కొద్ది నిమిషాలకే ఈ సంఘటన జరగడం భయమేసిందని తెలిపింది. శశికిరణ్రెడ్డి గదిలోంచి పెద్దగా కేకలు వినిపించాయి. రిసెప్షనిస్టు లయ తలుపులు కొడుతూ ఉందని, కొంత సేపటికి తర్వాత యువకుడు కత్తితో బయటకు వచ్చాడని తెలిపింది. లయను కూడా పొడిచాడంది. నిందితుడు కిందకు పరిగెత్తగానే కీర్తన శశికిరణ్రెడ్డి ఆఫీస్లోకి పరిగెత్తి చూడగా ఆయన ఒళ్లంతా రక్తంతో నిండిపోయిందని, ఆయన ఏదో చెబుతున్నాడని అర్థం కాలేదని పేర్కొంది. ధైర్యం చేసి 100కు ఫోన్ చేసినట్టు తెలియజేసింది. వివరాలను మధురానగర్ పీఎస్ ఎస్హెచ్ఓ ప్రభాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సిలిండర్ డెలివరీపై కఠిన నియమం
హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ల డెలివరీకి ‘ఓటీపీ’ సమస్యగా మారింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నది. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే గ్యాస్ సిలిండర్ల డెలివరీలో తప్పనిసరిగా ఓటీపీ నమోదు చేసుకోవాలని, ఓటీపీ నెంబర్ చెబితేనే సిలిండర్ జారీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే గత పది రోజుల నుంచి డెలివరీ బాయ్స్ గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్న సమయంలో ఓటీపీ నెంబర్ తప్పనిసరిగా నమోదు చేసుకుంటున్నారు. ఓటీపీ నమోదులో చాలా సమయం తీసుకుంటున్నదని డెలివరీ బాయ్స్తో పాటు గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఖైరతాబాద్ రేషనింగ్ సర్కిల్–7 పరిధి కిందికి వచ్చే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల పరిధిలో 81 రేషన్ దుకాణాలు ఉండగా, 9 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,57,221 గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఒక్కో ఏజెన్సీ రోజూ 500–600 వరకు మాత్రమే సిలిండర్లు పంపిణీ చేస్తుంది. రెండు వారాల క్రితం ఒక్కో గ్యాస్ ఏజెన్సీ 700–800 వరకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసేది. రెండు వారాల క్రితం వరకు ఓటీపీ అడగగకుండానే బుకింగ్ చేసుకున్న వినియోగదారుడికి సిలిండర్ పంపిణీ చేసేవారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సిలిండర్లు పక్కదారి పట్టకుండా డెలివరీ సమయంలో పకడ్బందీగా సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఓటీపీకి చాలా సమయం.. గ్యాస్ బుకింగ్ చేసుకున్న సమయంలో ఆ గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుపై ఉంటే వారి మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. రెండు మూడు వారాల తర్వాత సిలిండర్ డెలివరీ సమయంలో డెలివరీబాయ్ బుకింగ్ సమయంలో వచ్చిన ఓటీపీని అడుగుతాడు. ఆ ఇంటి యజమానురాలు కనెక్షన్ ఎవరి పేరుపై ఉందో వారికి ఫోన్లు చేసి ఓటీపీ నెంబర్ తీసుకుని మళ్లీ డెలివరీ బాయ్కు చెప్పగానే తాజా బిల్లుతో పాటు వచ్చే ఓటీపీ, బుకింగ్ సమయంలో వచి్చన ఓటీపీ సరిపోవాల్సి ఉంటుంది. తేడా వస్తే సమయం అంతా వృథా అవుతుందని డెలివరీ బాయ్స్ వాపోతున్నారు. ఒక్కో సిలిండర్ పంపిణీకి గతంలో ఐదు నిమిషాలు పడితే, ఇప్పుడు పావుగంట సమయం తీసుకుంటున్నది. దీని వల్లనే సిలిండర్ల పంపిణీలో జాప్యం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. ఆందోళన వద్దు.. కొరత లేదు కావలసినన్ని సిలిండర్లు ఉన్నాయి. వచ్చిన చిక్కల్లా ఓటీపీతోనే. ప్రతి సిలిండర్ డెలివరీలోనూ ఓటీపీ నమోదు చేసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే చాలా సమయం తీసుకుంటుంది. మా ఏజెన్సీ పరిధిలో రెండు వారాల క్రితం వరకు రోజుకు 800 సిలిండర్లు పంపిణీ చేసేవాళ్లం. ఇప్పుడు 600 మాత్రమే చేయగలుగుతున్నాం. డెలివరీ బాయ్స్ సైతం సిలిండర్లను అనుకున్న స్థాయిలో ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం మా ఏజెన్సీ పరిధిలో బుకింగ్ చేసుకున్న రెండు రోజుల్లోనే గ్యాస్ సరఫరా అవుతోంది. గృహావసరాల డొమెస్టిక్ సిలిండర్ల గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కమర్షియల్ సిలిండర్ల కొరత మాత్రం ఉంది. బుకింగ్ సమయంలో వచ్చే ఓటీపీని కనెక్షన్ ఉన్న వినియోగదారుడు తప్పనిసరిగా భద్రపరచుకోవాలి. బుకింగ్ సమయంలో వచ్చే ఓటీపీకి, డెలివరీ సమయంలో వచ్చే ఓటీపీకి ట్యాలీ కావలసి ఉంటుంది. త్వరత్వరగా ఓటీపీ నెంబర్ చెబితే అంతే త్వరగా సిలిండర్ల పంపిణీ కూడా జరుగుతుంది. చాలామంది సిలిండర్లు దొరకవేమోనని ఆందోళన చెందుతున్నారు. అది సరికాదు. గ్యాస్ గోడౌన్లలో కావలసినన్నీ సిలిండర్లు స్టాక్లో ఉన్నాయి.అక్రమార్కులపై కొనసాగుతున్న దాడులు బంజారాహిల్స్: గ్యాస్ సిలిండర్ల రీఫిల్లింగ్ సెంటర్లతో పాటు వాణిజ్య సిలిండర్ల స్థానంలో డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్న ప్రాంతాలపై పౌర సరఫరాల శాఖ అధికారులు, టాస్్కఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు కొనసాగిస్తున్నారు. గురువారం జూబ్లీహిల్స్ జోన్ టాస్్కఫోర్స్ ఎస్ఐ రవిరాజ్, రేషనింగ్ ఖైరతాబాద్ సర్కిల్–7 జూనియర్ ఎంక్వైరీ ఇన్స్పెక్టర్లు టి.సాయికిరణ్, రాచకొండ సాహిత్సాగర్ తదితరులు వెంకటగిరిలో దాడులు చేశారు. అచిన్తల్వార్ బాలాజీ అనే వ్యక్తి డొమెస్టిక్ సిలిండర్ల నుంచి మినీ సిలిండర్లకు గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నట్లుగా సమాచారం రావడంతో దాడులు చేశారు. ఇందులో భాగంగా రెండు డొమెస్టిక్ సిలిండర్లతో పాటు 35 మినీ సిలిండర్లను స్వా«దీనం చేసుకున్నారు. బాలాజీపై కేసు నమోదు చేశారు. అలాగే అమీర్పేట, ఎస్సార్నగర్ ప్రాంతాల్లో రేషనింగ్ అధికారులు దాడులు చేసి అక్రమంగా వినియోగిస్తున్న 11 సిలిండర్లను స్వా«దీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. నిరంతరం ఈ దాడులు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. -
ఫిట్నెస్లో సరికొత్త ట్రెండ్
నగరవాసులు శాకాహారులుగా మారుతున్నారు.. ఆహారంపై క్రమంగా పెరుగుతున్న అవగాహనతో అటువైపు అడుగులు వేస్తున్నారు. వేగవంతమైన లైఫ్స్టైల్కు కేంద్రమైన హైదరాబాద్లో.. ఓ వైపు మెట్రో పరుగులు, ఆఫీస్ డెడ్లైన్లు, పార్టీ కల్చర్, మరోవైపు వీకెండ్ హ్యాంగౌట్స్.. ఇవన్నీ కలిసి మన ఆహార అలవాట్లను పూర్తిగా మార్చేశాయి. ఎప్పుడు, ఏమి, ఎంత తింటున్నాం అన్న ఆలోచన లేకుండానే రోజులు గడిచిపోతున్నాయి. ఫలితం.. డైట్ బ్యాలెన్స్ తప్పుతోంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయి. దీనికితోడు అడుగడుగునా రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్.. అంతేనా! మొబైల్ ఫోన్లో ఒక్క క్లిక్తో.. నిమిషాల్లో ఇంటికి వచ్చే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వంటివి మన అలవాట్లను దెబ్బతీస్తున్నాయి. దీన్ని మార్చేందుకు కొందరు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు.. సిటీ ట్రెండ్స్ కారణంగా మన ఆహార అలవాట్లలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పని ఒత్తిడి కారణంగానో.. అలసట కారణంగానో.. ‘ఈ రోజు వండుకోకపోతే ఏమైంది?’ అనే భావన సాధారణం అయ్యింది. ఉదయం అల్పాహారాన్ని తప్పించి కాఫీతో సరిపెట్టడం, లంచ్కు బిర్యానీ/ బర్గర్తో ముగించడం, రాత్రి ఆలస్యంగా హెవీ డిన్నర్.. ఇవన్నీ నగర యువతలో సాధారణ అంశాలు. వీటన్నింటినీ సమత్యుల్యం చేయడంపై దృష్టి సారిస్తున్నారు కొందరు నగరవాసులు. ఇందులో భాగంగా వెజ్ వీక్, లంచ్ బాక్స్ మంథ్ అంటూ కొత్త ట్రెండ్కు నాంది పలుకుతున్నారు. నాన్ వెజ్ డామినేషన్? ఒకప్పుడు మాంసాహారం వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే ఉండేది. ప్రస్తుతం చికెన్, మటన్, ఫిష్ పేర్లతో రోజుకో వెరైటీ మన ప్లేట్లో వచ్చి చేరుతోంది. ప్రొటీన్ పేరుతో మాంసాహారాన్ని అధికంగా తీసుకుంటున్నారు. ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, కూరగాయల నిర్లక్ష్యం.. వంటి కారణాలతో ఊబకాయం, కొలె్రస్టాల్, షుగర్ వంటి రోగాల భారిన పడుతున్నారు. ముఖ్యంగా 25–40 ఏళ్ల వయసులోనే లైఫ్స్టైల్ రోగాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని అధిగమించేందుకు నిపుణుల సూచనల మేరకు కొందరు క్రమంగా శాకాహారంపై ఆసక్తి కనబరుస్తున్నారు.నో ఔట్సైడ్ ఫుడ్ చాలెంజ్.. ఇలాంటి పరిస్థితుల్లో నగరవాసుల్లో కొత్త అవేర్నెస్ కనిపిస్తోంది. పూర్తిగా డైట్ మార్చలేకపోయినా, కనీసం కొన్ని రోజులు నియంత్రణలో ఉండాలనే ప్రయత్నం పెరిగింది. ‘వెజ్ వీక్’, ‘వెజ్ మంథ్’ అంటూ కొన్ని రోజులు నాన్వెజ్కు బ్రేక్ పెట్టడం.. ఏడు రోజులు ‘నో ఔట్సైడ్ ఫుడ్’ చాలెంజ్, ఓన్లీ హోమ్ ఫుడ్’, రెగ్యులర్ లంచ్ బాక్స్.. వంటివి ట్రెండ్గా మారాయి. ఆఫీసులో సహోద్యోగులతో కలిసి ‘హోమ్ ఫుడ్ డేస్’ ప్లాన్ చేయడం.. ఒకప్పటి స్కూల్ డేస్ను గుర్తు చేస్తున్నాయి. స్వయంగా వంట చేసుకునే యువత కూడా పెరుగుతోంది. రైస్, కూర, పప్పు, పెరుగు వంటి సింపుల్ మీల్స్ ఎంత ఆరోగ్యకరమో మళ్లీ అర్థమవుతోంది. దీనికి తోడు మీల్ ప్రిప్ కల్చర్, వారం రోజులు వంట సిద్ధం చేసుకోవడం వంటి కాన్సెప్్ట్స హైదరాబాద్లో పాపులర్ అవుతున్నాయి.చిన్న ప్రయత్నం.. పెద్ద మార్పు.. అందరూ ఒక్కసారిగా ఫిట్ ఫుడ్కే మారాలి అనుకోవడం ఆచరణసాధ్యం కాకపోవచ్చు. కానీ వారానికి కొన్ని రోజులు కంట్రోల్డ్ డైట్, ఇంటి ఆహారానికి ప్రాధాన్యం, నాన్ వెజ్ను పరిమితంగా తీసుకోవడం, బయట ఆహారం తగ్గించడం.. ఇవే పెద్ద మార్పుకు పునాది. నగర జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్ తప్పదనిపించినా, ఆరోగ్యం కోసం తీసుకునే చిన్న నిర్ణయాలే భవిష్యత్తును కాపాడతాయనేది డైట్ నిపుణుల అభిప్రాయం. -
Hyderabad: పెరుగూ కల్తీ
హైదరాబాద్: కాదేదీ కల్తీకి అనర్హం అన్నచందంగా మారింది హైదరాబాద్ నగరంలో నిత్యావసరాల వస్తువుల పరిస్థితి. గురువారం జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ అధికారులు పోలీసులతో కలిసి అంబర్పేటలోని ఓ దుకాణంలో 2,500 కిలోల కల్తీ పెరుగును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అంబర్పేట రహత్నగర్కు చెందిన నరేష్ రాఘవేంద్ర ఆరు నెలలుగా స్థానికంగా ఎన్నార్ ఎంటర్ప్రైజెస్ పేరిట పాల వ్యాపారం చేస్తున్నారు. వీరు కల్తీ పెరుగు తయారు చేసి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో.. జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ విభాగం అధికారులు స్థానిక పోలీసులతో కలిసి ఎన్నార్ ఎంటర్ప్రైజ్పై దాడి చేశారు. అక్కడ లభించిన 2,500 కిలోల అనుమానిత కల్తీ పెరుగును సీజ్ చేశారు. పెరుగు నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఫిర్యాదు మేరకు అంబర్పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఓ షాపింగ్ మాల్లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)
-
చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
-
హైదరాబాద్లో ఐహెచ్సీఎల్ గేట్వే హోటల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆతిథ్య రంగ దిగ్గజం ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్సీఎల్) హైదరాబాద్లోని సోమాజిగూడలో గేట్వే బ్రాండ్ కింద హోటల్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం ఎంట్రప్రెన్యూర్లయిన డి శివరామరాజు, డీవీఎస్ సోమరాజుతో జట్టు కట్టింది. దీని ప్రకారం ప్రస్తుతమున్న ప్రాపరీ్టని గేట్వే హోటల్గా మార్చనున్నారు.ఇందులో 225 గదులు, ఆల్–డే డైనింగ్ రెస్టారెంట్, స్పెషాలిటీ రెస్టారెంట్ మొదలైన ప్రత్యేకతలు ఉంటాయి. దీనితో కలిపి ఐహెచ్సీఎల్కి తెలంగాణలో మొత్తం 8 హోటళ్లు ఉంటాయి. వీటిలో మూడు అభివృద్ధి దశలో ఉన్నాయి. అలాగే, బ్రాండ్ కింద మొత్తం హోటళ్ల సంఖ్య 50కి చేరుతుందని గేట్వే హోటల్స్ అండ్ రిసార్ట్స్ వైస్ ప్రెసిడెంట్ లియా టాటా తెలిపారు. -
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చందానగర్ ప్రాంతంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న అను ఫర్నీచర్ దుకాణం గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, భారీగా ఎగిసిపడ్డాయి.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. -
హైదరాబాద్కు నెట్ఫ్లిక్స్.. ఐలైన్ స్టూడియో ప్రారంభం
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్ను గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.ఓ వైపు అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే... మరోవైపు స్కిల్లింగ్, రీ – స్కిల్లింగ్, అప్ – స్కిల్లింగ్ పై దృష్టి సారించిందన్నారు. గురువారం హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ కు నెట్ ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్ లో ‘తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్లైన్లో నగరం ఓ నిర్ణయాత్మక కేంద్రంగా మారుతుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ స్టాండర్డ్స్, అడ్వాన్స్డ్ టూల్స్, ఇన్నోవేషన్-లెడ్ వర్క్ ఫ్లో ఇక్కడి ఎకో సిస్టంలో భాగమవుతాయని, ఇక్కడి యువతకు ఫ్యూచర్ రెడీ స్కిల్స్ లభిస్తాయన్నారు.పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులను కోరారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో స్టూడియోను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. -
కిడ్నీ వ్యాధులను ముదరనివ్వొద్దు..
హైదరాబాద్: మన దేశంలో కిడ్నీ వ్యాధులపై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మంది జబ్బు ముదిరేంత వరకు గుర్తించడమే లేదు. చిన్న వయస్సు నుంచే కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం మార్చి రెండో గురువారం ప్రపంచ వ్యాప్తంగా ‘వరల్డ్ కిడ్నీ డే’ గా జరుపుకుంటున్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గురువారం ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో మూత్రపిండాల ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కిడ్నీ వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను సంబంధిత విభాగాల డాక్టర్లు వివరించారు. ఈ సందర్భంగా కామినేని ఆస్పత్రి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ ఎ.సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. కిడ్నీ వ్యాధుల నివారణ, ముందస్తు పరీక్షల ప్రాధాన్యాన్ని వివరించారు. ‘కిడ్నీ సంబంధిత వ్యాధుల లక్షణాలు కనిపిస్తే.. ముందుగా సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. గాబరా పడి బీపీ. షుగర్లు పెంచుకుని వ్యాధులను ముదరనివ్వొద్దు. ఇలా వ్యవహరిస్తే సగం వరకు వ్యాధులను నయం చేయవచ్చు. కిడ్నీ జబ్బులు, డయాలసిస్ అనగానే ఇక జీవితం అయిపోయినట్లుగా భావించొద్దు. అధునాతన చికిత్సల ద్వారా డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్తో విజయవంతంగా జీవితాన్ని గడపవచ్చు’ అని సూచించారు. కామినేని ఆస్పత్రి యూరాలజీ విభాగం డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ వి. సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. ‘కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మొదటి, సులభమైన మార్గం సరైన హైడ్రేషన్. అది సరిగా లేకపోతే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి. రోజుకు కనీసం 2, 3 లీటర్ల నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి కిడ్నీలపై భారం తగ్గుతుంది. కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం తగ్గుతుంది. మంచి అలవాట్లు కిడ్నీలను దీర్ఘకాలం కాపాడుతాయి’ అని పేర్కొన్నారు. -
నెట్ఫ్లిక్స్తో నా కల నిజం కాబోతుంది: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సౌత్ సినిమా పరిశ్రమకు కేంద్రబింధువుగా హైదరాబాద్లో కార్యకలాపాలు ఆ సంస్థ కొనసాగించనుంది. 30వేల చ.అ.విస్తీర్ణంలో ఏర్పాటు అయిన ఈ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను మీడియా ద్వారా పంచుకున్నారు.సినిమాలపై తనకు కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా అన్నారు. 'నా బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయి. బాహుబలి,కల్కి,ఆర్ఆర్ఆర్ ,అరుంధతి వంటి అత్యనున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయి. చెన్నైలో ఉన్న సినిమాను ఎన్టీఆర్ ,అక్కినేని నాగేశ్వర రావు హైదరాబాద్కు తీసుకు వచ్చారు. ఇప్పుడు కాలంతో పాటు సినిమా పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయి. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే . మా దృష్టి హాలివుడ్పైనే అని నేను గతంలోనే చెప్పాను. నెట్ఫ్లిక్స్తో నా కల నిజం కాబోతుంది. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు మా పూర్తి సహకారం ఉంటుంది ..ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నాం ..నెట్ఫ్లిక్స్ వ్యాపార విస్తరణకు పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నెట్ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణలో పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారానికి అనుకూలత ప్రదేశమని సీఎం అన్నారు. -
గ్యాస్ లేక కట్టెల పొయ్యిపై హాస్టళ్ల నిర్వాహకులు వంటలు
-
ఈ అగరబత్తుల మేజిక్ మాములుగా ఉండదు.. ఒక్కటి వెలిగిస్తే మీ ఇల్లంతా పరిమళమే..!
-
మద్యం తాగి.. కత్తి కొనుగోలు చేసి...
హైదరాబాద్: పక్కా పథకం ప్రకారమే మధురానగర్లో వారాహి కన్సల్టెన్సీ నిర్వాహకుడు శశికిరణ్రెడ్డిని పొలమరశెట్టి ప్రభుకుమార్(19) హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో నిందితుడిని పోలీసులు సెల్ఫోన్ నెంబర్ ఆధారంగా సాంకేతికతను వినియోగించి చేధించి పట్టుకున్నారు. వివరాలివీ... విశాఖపట్నం జిల్లా మునగపాక మండలం ఘనపర్తి గ్రామానికి చెందిన పొలమరశెట్టి ప్రభుకుమార్(19) టెన్త్ ఫెయిలయ్యాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చి మధురానగర్లో ఉన్న వారాహి కన్సల్టెన్సీ నిర్వాహకుడు శశికిరణ్రెడ్డిని సంప్రదించాడు. ఇందుకోసం ఫీజు కింద రూ. 2,500 చెల్లించాడు. హైదరాబాద్లోని ఉమర్గూడలో అద్దెకు ఉంటున్నాడు. లక్డీకాపూల్లోని హిల్టాప్ హోటల్లో ప్రభుకుమార్కు సెక్యూరిటీగార్డ్ ఉద్యోగాన్ని కన్సల్టెన్సీ ద్వారా ఇప్పించాడు. అక్కడ 10 రోజులు పనిచేసిన ప్రభు నిర్వాహకులతో గొడవ పడి ఉద్యోగం మానేయడంతో పనిచేసిన రోజులకు హోటల్ యాజమాన్యం జీతం చెల్లించింది. అయితే తనకు సరైన ఉద్యోగం ఇప్పించలేదని ప్రభుకుమార్ కొద్ది రోజులుగా శశికిరణ్రెడ్డి చుట్టూ తిరుగుతూ తాను చెల్లించిన రూ. 2,500 వాపసు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేయసాగాడు. దీంతో రూ. 1500 ప్రభుకు ఇచ్చి పంపించారు. ఇంకా రూ. 1000 బాకీ ఉన్నాడని, అవి కూడా ఇవ్వాలంటూ రోజూ కన్సల్టెన్సీ చుట్టూ తిరుగుతున్నా స్పందన లేకపోవడంతో శశికరణ్రెడ్డి అంతుచూడాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే మంగళవారం మధ్యాహ్నం శశికిరణ్ను హత్య చేసేందుకు మధురానగర్కు వచ్చాడు. ప్రాణభయంతో పరుగులు తీసిన ఉద్యోగులుమంగళవారం మధ్యాహ్నం మధురానగర్లోని ఓ మద్యం దుకాణంలో ఫూటుగా మద్యం తాగాడు. అక్కడే ఓ కూరగాయల కత్తిని కొనుగోలు చేసి జేబులో పెట్టుకుని నేరుగా శశికిరణ్ ఆఫీసులోకి ప్రవేశించి గడియ వేసి బెదిరించి తన స్నేహితుడికి రూ. 1500 ఫోన్పే చేయించాడు. ఆ తరువాత రూ. 1000 ఇవ్వాలంటూ కత్తితో పొడిచాడు. తలుపు తీసి బయటకు వచ్చే సమయంలో అక్కడే పనిచేస్తున్న ట్రైనర్ లయ కనిపించడంతో ఆమెపై కూడా కత్తితో దాడి చేయడంతో భయంతో ఆమె రెండో అంతస్తులోకి పరుగులు తీసి తలుపులు వేసుకుని ప్రాణాలు కాపాడుకుంది. మిగతా ఉద్యోగులు కూడా భయంతో గదుల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.అక్కడే రక్తం శుభ్రం చేసుకుని... నిందితుడు ప్రభు హత్య చేసిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో భవనం కింది భాగంలో ఉన్న రక్తపు మరకలను నీటితో శుభ్రం చేసుకుని కత్తిని అక్కడే వదిలేసి అమీర్పేట వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఒక ఆటోను బుక్ చేసుకుని ఎల్బీనగర్ వెళ్లాడు. శశికిరణ్ను కత్తితో పొడిచిన సమయంలో పెనుగులాటలో ప్రభుకుమార్కు కూడా చేతి వేళ్లకు గాయాలు కావడంతో ఎల్బీనగర్లోని రెయిన్బో పిల్లల ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లాడు. తాము ఇక్కడ చికిత్స చేయించలేమని నిరాకరించారు. బయటకు వచి్చన నిందితుడు ఓ కారును బుక్ చేసుకుని విజయవాడ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. చిట్యాల వద్దకు రాగానే నిందితుడి నుంచి రక్తపు వాసన వస్తుండటంతో గమనించిన కారు డ్రైవర్ అతన్ని అక్కడే వదిలేసి తిరుగుముఖం పట్టాడు. చిట్యాలలో బస్సు ఎక్కిన నిందితుడు తొలుత జగ్గయ్యపేటలోని తన స్నేహితుడి వద్దకు వెళ్లగా, అప్పటికే విషయం తెలుసుకున్న స్నేహితుడు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో విజయవాడకు వెళ్లి కనకదుర్గా టెంపుల్ సమీపంలో తన స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నాడు. ఫోన్ నెంబర్ సహాయంతో పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ట్రాక్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో నిందితుడు తలదాచుకున్న ప్రాంతాన్ని బుధవారం తెల్లవారుజామున గుర్తించారు. అక్కడి నుంచి నిందితుడిని మధురానగర్ ఠాణాకు తరలించారు. ఘటనా స్థలంలో కత్తిని స్వా«దీనం చేసుకున్నారు. రూ. 1000 కోసమే శశికిరణ్ను హత్య చేసినట్లుగా నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. మొత్తానికి ఈ కేసును పోలీసులు చేధించారు. గాయాలపాలైన లయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. రూ.1000 ఇవ్వలేదని చంపేశాడు -
హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)
-
హైదరాబాద్ : రాత్రిపూట చార్మినార్ వద్ద రంజాన్ సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్ పిల్లల సోషల్ మీడియా వినియోగం ఎంతంటే?
పొద్దున లేవగానే ఒకసారి.. స్కూల్కి వెళ్లే ముందు మరోసారి.. మళ్లీ తిరిగొచి్చనప్పటి నుంచి సరదాగా కాలక్షేపానికి.. నిద్రపోయే ముందు కొద్దిసేపు.. ఇదేదో మందులు వేసుకోడానికి ప్రి్రస్కిప్షన్పై రాసిన సమయం అనుకునేరు? అలా అనుకుంటే పొరపాటే.. ఇది ప్రస్తుతం నగరాల నుంచి పల్లెల వరకూ సామాజిక మాధ్యమాల వినియోగంలో పిల్లలు బంధీలైన తీరు. కొందరు టైం పాస్ కోసం.. మరికొందరు సెలబ్రిటీ స్టేటస్ కోసం.. పిల్లలు మొదలుకుని.. పండు ముసలి వరకూ ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి ఖాతాల వినియోగం పెరిగిపోయింది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అయితే చెప్పే ప్రసక్తే లేదు.. దైనందిన జీవితంలో కనీసం రెండు గంటల పాటు దీనికోసమే కేటాయిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం 16ఏళ్ల లోపువారికి సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తామని ప్రకటించడంతో దేశవ్యాప్త చర్చకు దారితీసింది. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లో సోషల్ మీడియా వాడకం సర్వసాధారణ విషయం. ఈ సోషల్ యాప్స్ వాడకం వయసుతో సంబంధం లేకుండా మారింది. బాల్యం అంటే అటలు.. పాటలు అనే కాలం నుంచి.. బాల్యం అంటే స్మార్ట్ఫోన్ అనే నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. అయితే.. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదా.? అమలు సాధ్యమా? ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం అధికంగా ఉండే హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో చిన్నారులు, టీనేజర్ల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డిజిటల్ ‘డీలా’.. ఓ వైపు చాట్ జీపీటీ, ఏఐ, జెమినీ, పర్ప్లెక్సిటీ వంటి టెక్నాలజీ వేదికలతో అంతా స్మార్ట్ మయం అవుతోంది. విద్యా కేంద్రాల్లో, పాఠశాలల్లో టెక్నాలజీ వినియోగం, స్మార్ట్ ఆలోచనలవైపు ప్రపంచం పరుగుపెడుతోంది.. అదే టెక్నాలజీ వినియోగంలో నైపుణ్యం సాధించేందుకు చిన్నారులకు స్మార్ట్ఫోన్, టాబ్లెట్ పరిచయం చేస్తూ.. ఆన్లైన్ క్లాసులు, హోమ్వర్క్ పేరుతో క్రమంగా స్క్రీన్ టైమ్ సోషల్ మీడియావైపు దారి మళ్లుతోంది.ఎంతలా అంటే.. టెక్నాలజీ పరిచయం లేని పాఠశాలల్లోని పిల్లలు సైతం సోషల్ మీడియా ఖాతాలు వినియోగించేలా. రీల్స్, షార్ట్స్, గేమింగ్, లైవ్ స్ట్రీమ్.. వంటి వ్యాపకాలతో అనేక సామాజిక రుగ్మతలకు లోనవుతున్నారు. 16 ఏళ్లలోపు పిల్లలపై ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఫలితంగా ప్రత్యక్షంగా మాట్లాడే నైపుణ్యాలు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం వంటివి తగ్గిపోయి.. వర్చువల్ ఫ్రెండ్షిప్, లైక్స్, ఫాలోవర్స్ ఆధారంగా రిలేషన్స్ని అంచనావేసే మానసిక ధోరణికి లోనవుతున్నారు. ఫలితంగా ఆందోళన, అసూయ, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు.. సోషల్ మీడియా అధిక వినియోగం వల్ల నైపుణ్యాలను కోల్పోవడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు లోనవుతున్నారు. మరీ ముఖ్యంగా స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల కంటి సమస్యలు, దృష్టిలోపం, తలనొప్పి, నిద్రలేమితనం, స్థూలకాయం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. దీంతోపాటు శారీరక చురుకుదనం తగ్గి జీవనశైలి వ్యాధులకు లోనవుతున్నారు. మరోవైపు ఫాలోవర్స్, లైక్స్ సంఖ్య ఆధారంగా స్వీయ విలువను అంచనావేసే మానసిక రుగ్మతకు, ట్రోలింగ్, సైబర్ బుల్లీయింగ్తో తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని, దీనిపై కట్టడి లేకపోతే భవిష్యత్తులో దుష్పరిణామాలను చూడాల్సిన పరిస్థితి తప్పదని మానసిక నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ అడిక్షన్కు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంటి సభ్యులే కారకులవుతున్నారు. పిల్లలకు అన్నం తినిపించడానికి, ఏడవకుండా ఉండడానికి మొదలై.. బిజీ జీవితంలో పిల్లలకు సమయం కేటాయించలేక వారిని అల్లరిని కట్టడిచేయడానికి స్మార్ట్ఫోన్ అలవాటు చేస్తున్నాం. దీంతోపాటు చౌకైన డేటా అనో, అందరూ వాడుతున్నారులే..అనే భావన, కంటెంట్ అల్గారిథమ్స్ పిల్లలను ఎక్కవగా ఆకట్టుకునేలా రూపొందించిన ప్రోగ్రామ్స్ కారణాలుగా కనిపిస్తున్నాయి. అయితే వీటిని కట్టడిచేయడంలో మొదటి పాత్ర తల్లిదండ్రులదే.. మితిమీరిన వినియోగం వల్ల పిల్లల గోప్యత, భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, బైక్ నెంబర్లను ఆధారంగా చేసుకుని ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన ఆ మధ్య చర్చనీయాంశమైంది. పిల్లల జీవితాలను కంటెంట్గా మార్చడం ఎంతవరకూ సమంజసం? అనేచర్చ ఉత్పన్నమవుతోంది.సర్వే చెబుతోందేంటి? హైదరాబాద్లో ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. 10–16 ఏళ్ల వయసు పిల్లల్లో సుమారు 68 శాతం మంది రోజుకు కనీసం 2–3 గంటలు సోషల్ మీడియా వినియోగిస్తున్నారు. వీరిలో 40 శాతం మంది నిద్ర సమస్య, 30 శాతం మంది చదువుపై దృష్టి తగ్గడం, వయసుకు మించిన సమాచారం తెలుసుకోవడం, సామాజిక, నైతిక పరమైన విషయాల్లో జెన్ జీ తరం కన్నా.. జెన్ ఆల్ఫా తరంలో తేడాలు కనిపిస్తున్నాయని సర్వే ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. అయితే సంపూర్ణ నిషేధం కంటే.. అవగాహన, నియంత్రణ, తల్లిదండ్రుల భాగస్వామ్యం ముఖ్యమని.. డిజిటల్ లిటరసీ, హెల్దీ స్క్రీన్ హ్యాబిట్స్ నేర్పడం, కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెంచడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కట్టడి సాధ్యమేనా? దేశంలో చిన్నారుల ఆన్లైన్ భద్రతకు ఐటీ నిబంధనలు, డేటా రక్షణ మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ వంటి నగరాల్లో అమలే పెద్ద సవాలుతో కూడినది. వయసు నిర్ధారణ వ్యవస్థలు బలహీనంగా ఉండటం, తల్లిదండ్రులే అకౌంట్లు తెరవడానికి అనుమతించడం వల్ల నిబంధనలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. మరోవైపు చిన్నారులకు ఎలాంటి కంటెంట్ చూపించాలి, వేటికి దూరంగా ఉంచాలి అనే విషయాల పై పెద్దలకు అవగాహన లేకపోవడం. సమయ పరిమితితో విద్యాపరమైన వెబ్సైట్లు, ఈ–లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, కథలు, సైన్స్ వీడియోలు, క్రియేటివ్ ఆర్ట్స్ వంటి కంటెంట్ వైపు పిల్లలను మళ్లించడం వారి అభిృద్ధికి దోహదపడుతుంది. -
'గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ వల'
సాక్షి హైదరాబాద్: గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారు.తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.ముఖ్యంగా ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా, అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే సందేశాలు వస్తే అవి కచ్చితంగా సైబర్ మోసాలేనని ప్రజలు గ్రహించాలన్నారు. ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని సిలిండర్ బుకింగ్ లేదా ఆన్లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లను లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలని తెలిపారు.వీరు ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి గుర్తుతెలియని వ్యక్తులకు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని నకిలీ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయడం ద్వారా మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నెంబర్ 1930 కి కాల్ చేయాలని లేదా http://cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. జాగ్రత్త!వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు…— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 11, 2026 -
300 కేజీల కుళ్లిపోయిన మాంసం స్వాధీనం
హైదరాబాద్: అపరిశుభ్రమైన మాంసాన్ని అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. హైదరాబాద్లోని మంగళ్హాట్ పోలీసులు, గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా మంగళ్హాట్ పరిధిలో ఆకస్మిక దాడులు చేయడంతో ఇటువంటి మరో ఘటన బయటపడింది. తాజా మాంసం అని నమ్మిస్తూ నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళ్హాట్ లోని చిస్తీ చమన్ దర్గా సమీపంలో ‘ఏ టూ జెడ్ షీప్ అండ్ గోట్ ఆఫ్ఫాల్’ పేరుతో మాంసం వ్యాపారం నిర్వహిస్తున్న మహమ్మద్ అఫ్రోజ్ (41) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు గతంలో కూడా ఇటువంటి నేరానికి పాల్పడగా, అప్పట్లో జీహెచ్ఎంసీ అధికారులు అతడికి జరిమానా విధించారు. మళ్లీ అలాంటి పనులే చేస్తున్నాడు. అతడి షాపులో నుంచి పోలీసులు సుమారు 300 కిలోల కుళ్లిపోయిన గొర్రె, మేక మాంసం స్వాధీనం చేసుకున్నారు. అఫ్రోజ్ అధిక లాభాల కోసం కర్ణాటక, ఢిల్లీ, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల నుంచి తక్కువ ధరకే మాంసాన్ని సేకరించేవాడు.అలా సేకరించిన మాంసాన్ని డీప్ ఫ్రీజర్లలో నిల్వ ఉన్న నీటితో నింపిన ప్లాస్టిక్ టబ్బులలో రోజుల తరబడి ఉంచేవాడు. మాంసం కుళ్లిపోకుండా, దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇలా నిల్వ చేస్తూ, వినియోగదారులకు అది తాజా మాంసమని నమ్మించి విక్రయించేవాడు. అతి షాపులో ఉన్న 300 కేజీల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులు పారేశారు.అపరిశుభ్రమైన ప్రాంతాల నుంచి మాంసం, ఆహార పదార్థాలను కొనుగోలు చేయవద్దని పౌరులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. అక్రమ నిల్వలు, కార్యకలాపాలు ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. -
హైదరాబాద్లో వేల్స్ మహిళల హాకీ జట్టు సందడి (ఫొటోలు)
-
దానం, కడియంకు ఊరట.. స్పీకర్ సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు వెల్లడించారు. రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు వెల్లడించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు పార్టీ మారారు అనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించారు. అనంతరం, ఇద్దరిపై వేసిన రెండు పిటిషన్లకు డిస్మిస్ చేశారు. దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంతటితో స్పీకర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుకు తెరపడింది. కాగా, పార్టీ ఫిరాయింపుల కేసులో ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రేపటి వరకు ఫిరాయింపు కేసులో ఏదో ఒకటి తేల్చాలని గతంలో సుప్రీంకోర్టు గడువు విధించింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్ నేపథ్యంలో నేడు స్పీకర్ తీర్పును వెల్లడించారు. మరోవైపు.. తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి.. స్పీకర్కు చెప్పుడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో స్పీకర్ తీర్పుపై పిటిషనర్లు మరోసారి కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక, స్పీకర్ తీరుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందిస్తూ..‘స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నాను. పార్టీ ఫిరాయిస్తే షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. కానీ, నాకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..‘స్పీకర్ పరిధిలో నేను ఏ తప్పూ చేయలేదు. కేసీఆర్ అంటే అపారమైన గౌరవం ఉంది. నన్ను కేసీఆర్ ప్రశ్నించాలి. కౌశిక్ రెడ్డికి ఏం సంబంధం?. అసెంబ్లీలో బీఆర్ఎస్ నాకు ఎలాంటి విప్ జారీ చేయలేదు. కేసీఆర్ నన్ను వివరణ అడగలేదు. నేను బీఆర్ఎస్ మెంబర్షిప్ వదులుకోలేదు.. ఎక్కడా తీసుకోలేదు అని వ్యాఖ్యలు చేశారు. -
హైదరాబాద్లో ఫోన్లు చోరీ.. మూడు కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ (ఫొటోలు)
-
రూ.1000 ఇవ్వలేదని చంపేశాడు
హైదరాబాద్: తనకు నచ్చిన ఉద్యోగం ఇప్పించలేదనే అక్కసుతో కన్సల్టెన్సీ యజమానిని ఓ యువకుడు హత్య చేసిన ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఏపీలోని విజయవాడ (ఏలూరు) ప్రాంతానికి చెందిన శశికిరణ్రెడ్డి (35) కొంత కాలంగా నగరంలోని మధురానగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శశికిరణ్ యూసుఫ్గూడలో బీజీఎస్ వారాహి సాయిరాం కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. గత నెలలో ప్రభు కుమార్ అనే 22 ఏళ్ల యువకుడు ఉద్యోగం కోసం వచ్చాడు. శశికిరణ్రెడ్డి కంపెనీ నిబంధనల ప్రకారం అతని వద్ద రూ.2,500 తీసుకుని బంజారాహిల్స్లోని ఓ హోటల్లో ఉద్యోగం ఇప్పించాడు. ఉద్యోగం నచ్చలేదని.. డబ్బులు తిరిగివ్వాలని.. కొన్ని రోజుల తర్వాత తనకు ఉద్యోగం నచ్చలేదని, డబ్బులను తిరిగి ఇవ్వాలని యువకుడు అడిగాడు. కంపెనీ నిబంధనల ప్రకారం ఒకసారి ఇచి్చన నగదు తిరిగి ఇవ్వలేమని శశికిరణ్ తేల్చి చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన యువకుడు గది తలుపులు వేసి శశికిరణ్ను బెదిరించాడు. చేసేదేమీలేక శశికిరణ్ రూ.1,500 ఇచ్చాడు. మిగతా వెయ్యి రూపాయలు ఇవ్వడం కుదరదని చెప్పాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. యువకుడు వెంట తెచ్చుకున్న కత్తితో శశికరణ్ మెడపై పొడిచాడు. గదిలో గొడవ జరుగుతోందని తెలుసుకున్న రిసెప్షనిస్ట్ లయ యజమాని గది తలుపు తెరిచింది. ఈ క్రమంలో యువకుడు పారిపోతూ లయపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆమె పట్టుకునే ప్రయత్నం చేయగా.. పక్క బిల్డింగ్లోకి దూకి పారిపోయాడు. క్షతగాత్రుడిని పోలీసులు భుజాలపై ఎత్తుకుని.. విషయాన్ని సిబ్బంది మధురానగర్ పీఎస్కు సమాచారం అందించగా.. ఇన్స్పెక్టర్, మరో కానిస్టేబుల్తో కలిసి శశికిరణ్ను భుజాలపై ఎత్తుకుని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయనతో పాటు గాయపడిన లయను కూడా ఆసుపత్రిలో చేర్చారు. శశికిరణ్రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. లయ చికిత్స పొందుతోంది. కాగా శశికిరణ్రెడ్డి భార్య నాగ భారతికి 20 రోజుల క్రితమే సీమంతం చేశారు. ఆ ఆనందంలో ఉండగానే.. భర్త హత్యకు గురి కావడంతో భోరున విలపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
యువత స్పందించేలా.. సివిల్ డిఫెన్స్ వాలంటీర్ ట్రైనింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అత్యవసర సమయంలో యువతను తొలి స్పందనకారులుగా తీర్చిదిద్దేందుకు “సివిల్ డిఫెన్స్ వాలంటీర్ ట్రైనింగ్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు రక్షక బలగాలు సంఘటన స్థలానికి చేరుకునేలోగా ఎటువంటి నష్టం తలెత్తకుండా స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఇవనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమాన్ని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అరుణ బహుగుణ ప్రారంభించారు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ సెంటెనరీ డిగ్రీ కళాశాలలో ప్రారంభించారు. మార్చి 10 నేటి నుంచి మార్చి 16 వరకు మొత్తం 7 రోజుల పాటు శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. యువతకు రెస్క్యూ ఆపరేషన్స్ (రక్షణ చర్యలు), అగ్నిమాపక చర్యలు ,ఫస్ట్ ఎయిడ్ చికిత్స, గుంపుల నియంత్రణ, సహాయ సామగ్రి పంపిణీ తదితర రంగాలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా యుద్ధ పరిస్థితులు, ఎయిర్ రైడ్స్, రసాయన దాడులు, అణు దాడులు వంటి విపత్తుల సమయంలో ఈ వాలంటీర్లు వివిధ ప్రభుత్వ శాఖలకు సహాయపడతారని తెలిపారు. ఈ వాలంటీర్లు పోలీసులు, ఫైర్ సర్వీసులు, NDRFమరియు ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేస్తారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వాలంటీర్ల సహాయం ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఆర్ఎఫ్ఓ బి. సుధాకర్ రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియప్పన్ అకాడమిక్స్ డీన్ డా. కళ్యాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ మహ్మద్ అబ్దుల్ రహీమ్ డీఎఫ్ఓ దాస్ తో పాటు ఫైర్ శాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు -
లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయి..
హైదరాబాద్: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ వలలో మరో చేప చిక్కింది. మూసాపేట సర్కిల్-53, కూకట్పల్లి జోన్లో కమ్యూనిటీ ఆర్గనైజర్గా పని చేస్తున్న ఏవో కె.మురళిని ఆర్ఆర్ఆర్ రేంజ్ యూనిట్ అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. మహిళా పొదుపు సంఘానికి చెందిన మహిళల బృందానికి 20 లక్షల రూపాయల రుణం మంజూరు ప్రక్రియను పూర్తిచేసినందుకు 18,000 రూపాయల లంచాన్ని డిమాండ్ చేశాడు కె.మురళి. ఫిర్యాదుదారుల నుంచి ఆ డబ్బును తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మురళిని అరెస్ట్ చేసిన అధికారులు, కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.ఏ ప్రభుత్వ ఉద్యోగైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు 1064 టోల్ ఫ్రీ నంబర్కు సంప్రదించాలని అవినీతి నిరోధక శాఖ సూచించింది. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. అవినీతి నిరోధక శాఖ తెలంగాణ వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (తెలంగాణ ఏసీబీ), ఎక్స్ (@తెలంగాణ ఏసీబీ) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదుదారు పేరు, వివరాలను గోప్యంగా ఉంచుతారు. -
ఘనంగా గోదావరి పుష్కరాలు.. తేదీలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలనూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ‘గోదావరి పుష్కరాలు 2027’ క్యాబినేట్ సబ్ కమిటీ తెలిపింది.మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన నిర్వహించిన కమిటీ తొలి సమావేశం నిర్వహించింది.సభ్యులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.‘తెలంగాణ బ్రాండ్’ మార్మోగేలా... మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కమిటీ ఆదేశించింది. పుష్కర నిర్వహణ తేదీలు, సంబంధిత శాఖల సన్నద్ధత, భవిష్యత్తు కార్యాచరణను సమీక్షించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.... సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సరస్వతీ పుష్కరాలు, సమ్మక్క సారక్క జాతరను అత్యంత వైభవోపేతంగా నిర్వహించిందన్నారు. అదే స్ఫూర్తితో... మరింత రెట్టించిన ఉత్సాహంతో రాబోయే గోదావరి పుష్కరాలనూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలను నిర్వహించాలని వేద పండితులు నిర్ణయించారన్నారు. సుమారు 8 కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాలకు తరలి వచ్చే అవకాశముందని, అందుకు అనుగుణంగానే గోదావరి ప్రవహించే జిల్లాల్లో... ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ... 96 ప్రాంతాలను పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశామన్నారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆయా చోట్ల క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఘాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర, జిల్లా ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామన్నారు.తొలి దశలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రద్దీ అధికంగా ఉండే తొమ్మిది ప్రాంతాలను ‘టైర్ – 1’ కింద ఎంపిక చేశామన్నారు. సమన్వయలోపం తలెత్తకుండా గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్ అధికారులను నియమిస్తామన్నారు. ప్రతి ఘాట్ దగ్గర ట్రాఫిక్ క్రమబద్దీకరణ, ఎమర్జెన్సీ రూట్, అత్యాధునిక వైద్య సౌకర్యాలు, పార్కింగ్ తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అత్యంత పకడ్బందీగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. -
చక్కని గాజులు.. చెక్కిన చేతులు..
సాక్షి, హైదరాబాద్: అమ్మాయిల అలంకరణల్లో ఎన్ని రకాల నగలున్నా.. గాజుల స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే, ఒకప్పటిలా నిండుగా కాకుండా.. ఆఫీసుకైనా, కాలేజీకైనా సింపుల్గా ఓ గాజు వేసుకుంటే చాలనుకుంటున్నారు. దీంతో పాటు కస్టమైజేషన్ గాజులంటే మరింతగా ఇష్టపడుతున్నారు. దీంతో చార్మినార్ ప్రాంతంలోని లాడ్ బజార్లో ‘లైవ్ బ్యాంగిల్ మేకింగ్’ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. అక్కడ కస్టమర్ల అభిరుచి మేరకు వారి కళ్ల ఎదుటే, నచి్చన డిజైన్లలో గాజులు తయారు చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియను పర్యాటకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా సోమవారం ఓ యువతి కళాకారుడి సూచనల మేరకు స్వయంగా గాజులు తయారుచేయించుకుంది. -
ఢీ కొట్టి.. 200 మీటర్లు ఈడ్చుకెళ్లి
హైదరాబాద్: మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై రవీందర్రెడ్డి కథనం ప్రకారం... షాద్నగర్కు చెందిన సర్ఫరాజ్, హుస్సేన్, షమీర్, మాజీద్లు రెండు బైక్లపై పల్లెచెరువు మీదుగా చార్మినార్కు షాపింగ్ నిమిత్తం వెళ్తున్నారు. అదే సమయంలో నగరానికి చెందిన కిషోన్, టోటన్లు పల్లెచెరువు మీదుగా కారులో ఇంటికి వెళ్తున్నారు. అతివేగంగా వచ్చిన ఆ కారు వారి బైక్లను బలంగా ఢీ కొట్టింది. నలుగురు యువకులు పక్కకు పడిపోయి, స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే కారు డ్రైవర్ కిషోర్ భయంతో కారును మరింత వేగంగా పోనివ్వడంతో దాని కింద భాగంలో బైక్ చిక్కుకుపోయింది. 200 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. కేసు దర్యాప్తులో ఉంది. -
బై బై జార్జియా
జార్జియాకి బై బై చెప్పారు మహేశ్బాబు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర పాత్రలో మహేశ్బాబు, మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ , మరో కీలక పాత్రలో ప్రకాష్రాజ్ నటిస్తున్నారు. ఇటీవల జార్జియాలో మొదలైన ‘వారణాసి’ కొత్త షూటింగ్ షెడ్యూల్ ముగిసింది. జార్జియా షూట్ షెడ్యూల్ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు మహేశ్బాబు.ఈ షెడ్యూల్లో మహేశ్, పృథ్వీరాజ్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలిసింది. కాగా ఈ మూవీ నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్ అంటార్కిటికాలో జరగనుందని తెలిసింది. ఈ షూట్ షెడ్యూల్లో మహేశ్బాబు, ప్రియాంకా చోప్రా పాల్గొంటారు. అలాగే లాటిన్ స్టైల్లో ఓ డ్యాన్స్ నంబరును కూడా ప్లాన్ చేశారట మేకర్స్. ప్రచారంలో ఉన్నట్లు ‘వారణాసి’ టీమ్ అంటార్కిటికాలో చిత్రీకరణ జరిపితే.. ఈ లొకేషన్స్ లో షూట్ జరుపుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ నిలుస్తుందనే వార్తలు ఉన్నాయి. -
8 రోజులు.. 800 కిలోమీటర్లు..!
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది రోజుల పాటు హైదరాబాద్ నుంచి ముంబై వరకూ 800 కిలోమీటర్ల సైకిల్ యాత్రకు సంకలి్పంచాడు.. ఇందులో భాగంగా 30 చోట్ల ఫిట్నెస్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు నిర్ణయించుకున్నాడు.. మార్చి 7 ప్రారంభమైన ఈ సైకిల్యాత్ర 14 వరకూ కొనసాగనుంది. ప్రజలకు ఫిట్నెస్, సైక్లింగ్ ప్రాముఖ్యతను వివరించడమే లక్ష్యంగా వెల్నెస్ అడ్వొకేట్ కాంతి దత్ ముందుకు కదులుతున్నాడు. ఫియర్ ప్రాజెక్ట్ పేరిట స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని నోవోటెల్ హోటల్లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పలువురు అతిథులు, ఫిట్నెస్ ప్రేమికులు పాల్గొని కాంతి దత్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచే సైక్లింగ్ యాత్రను ప్రారంభించారు. ఎనిమిది రోజుల పాటు.. మొత్తం ఎనిమిది రోజుల పాటు సాగనున్న ఈ ప్రయాణంలో దాదాపు 800 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ సుమారు 30 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యాత్రలో భాగంగా పలు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులతో సమావేశమై ఫిట్నెస్ ప్రాముఖ్యత, సైక్లింగ్ ప్రయోజనాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించనున్నారు. ‘పర్యావరణానికి అనుకూలమైన రవాణా వ్యవస్థ అయిన సైక్లింగ్ను ప్రోత్సహించడం, రోజువారీ జీవితంలో సైక్లింగ్ను భాగం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై అవగాహన కల్పించడం’ ప్రాధాన లక్ష్యమని కాంతి దత్ తెలిపారు. (చదవండి: తండ్రైన క్షణం..! ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడైనా..) -
మా వెంట్రుకలు మాకు కావాలి.. విద్యార్థికి గుండు కొట్టించిన ప్రిన్సిపాల్
-
గచ్చిబౌలిలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 (ఫొటోలు)
-
పోలీస్ వెబ్సైట్.. అప్డేట్ మిస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు...ఈ పేరు చెప్పగానే టెక్నాలజీ గుర్తుకువస్తుంది. దీని వినియోగానికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న రాష్ట్రం అనేక ప్రాంతాలకు మార్గదర్శకమైంది. కేసు నమోదు నుంచి దర్యాప్తు, అభియోగపత్రాల దాఖలు వరకు ఆన్లైన్ విధానం కొనసాగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా... ప్రాథమిక అంశమైన అధికారిక వెబ్సైట్ నిర్వహణలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పునర్వ్యవస్థీకరణను పట్టించుకోకుండా, అధికారుల బదిలీలపై దృష్టి పెట్టకుండా, అదనపు బాధ్యతలు తప్పినా ఇన్చార్జ్లను కొనసాగిస్తూ దీని నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాజధానిలోని కమిషనరేట్లలో జరిగిన మార్పుచేర్పులను పట్టించుకోవట్లేదు. కొన్ని బదిలీ, బాధ్యతల స్వీకరణ జరిగి ఇప్పటికి నెలన్నర అవుతున్నా అధికారిక వెబ్సైట్ (tspolice.gov.in)లో మాత్రం మార్పుచేర్పులు లేవు. ఇలాంటి చిత్రాలు మరెన్నో రాష్ట్ర పోలీసు అధికారిక వెబ్సైట్లో ఉన్నాయి.వాటిలో కొన్ని ఇవి... జనవరి 17న జరిగిన ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ఐపీఎస్ అధికారి ఎస్.చైతన్యకుమార్ నగర డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీగా వచ్చారు. అంత వరకు ఈ పోస్టుకు అదనపు సీపీ ఎం.శ్రీనివాసులు ఇన్చార్జ్గా ఉన్నారు. అంతర్థానమైపోయిన సౌత్ ఈస్ట్ జోన్ను కొనసాగిస్తున్న పోలీసు వెబ్సైట్ దీనికి చైతన్యకుమార్ డీసీపీగా ఉన్నట్లు చూపిస్తోంది. నగర పోలీసు విభాగంలో పరిపాలన డీసీపీగా కె.వెంకట లక్ష్మి నియమితులయ్యారు. అయినా ఇప్పటికీ తఫ్ఫీర్ ఇక్బాల్ను వెబ్సైట్ ఇన్చార్జ్గా కొనసాగిస్తోంది. ఈయన నగరంలో సౌత్ రేంజ్ అదనపు సీపీగా నియమితులైనా... ఇంకా సంయుక్త సీపీ శాంతిభద్రతలుగానే చూపిస్తోంది. గతంలో నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్కు డీసీపీగా పని చేసిన అపూర్వ రావు కొన్నాళ్ల ఇంటెలిజెన్స్కు బదిలీ అయ్యారు. అధికారిక వెబ్సైట్ మాత్రం ఈ విషయం పట్టించుకోలేదు. రాజధానిలోని పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లు హైదరాబాద్లో కలిశాయి. అలాగే నగరంలో ఉన్న జోన్ల పేర్లు ఈస్ట్, వెస్ట్, సెంట్రల్... నుంచి సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్... ఇలా మారాయి. ఈ అంశమూ వెబ్సైట్ నిర్వాహకులకు పూర్తిగా పట్టలేదు. రక్షితా మూర్తిని సికింద్రాబాద్ డీసీపీ అంటూ అప్డేట్ వెర్షన్ నమోదు చేసినా.. కె.శిల్పవల్లిని మాత్రం ఇప్పటికీ సెంట్రల్ జోన్ డీసీపీగానే వెబ్సైట్ సంబోధిస్తోంది. రాజేంద్రనగర్ను సైబరాబాద్తో చూపిస్తున్న సైట్... అక్కడ ఉన్న డీసీపీ శ్రీనివాస్కు బదులు యోగేష్ గౌతం అంటూ కొనసాగిస్తోంది. రాచకొండ కమిషనరేట్ పేరు మల్కాజ్గిరిగా మారింది. అవినాష్ మహంతిని దీనికి కమిషనర్గా చూపిస్తున్న వెబ్సైట్... మహేశ్వరం జోన్ను మాత్రం రాచకొండగానే కొనసాగిస్తోంది. మరికొందరు డీసీపీ పోస్టులూ రాచకొండలో ఉన్నట్లే పేర్కొంటోంది. నగర సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీగా కె.శ్యామ్ సుందర్ వచి్చనా... ఇప్పటికీ అపూర్వ రావే ఇన్చార్జ్ అని వెబ్సైట్ చెప్తోంది. హైదరాబాద్ వెస్ట్జోన్ డీసీపీగా పని చేసిన చింతమనేని శ్రీనివాస్ చాలా రోజుల క్రితమే సైబరాబాద్లో కొత్తగా ఏర్పడిన శేరిలింగంపల్లి డీసీపీగా వెళ్లారు. విభజన తర్వాత జూబ్లీహిల్స్గా మారిన ఈ జోన్కు రమణారెడ్డి డీసీపీగా వచ్చారు. ఈ అంశాలు వెబ్సైట్లో అప్డేట్ కాలేదు. పాతబస్తీలోని సౌత్ జోన్ చారి్మనార్ జోన్గా మారిపోయింది. అయితే పోలీసు వెబ్సైట్లో మాత్రం ఇంకా పాత పేరే కొనసాగుతోంది. -
Hyderabad: కూకట్పల్లి షాపింగ్ మాల్లో ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి వైజంక్షన్లోని లేక్ షేర్ మాల్లో ప్రమాదం జరిగింది. సందర్శకులపై హోర్డింగ్లు, యాడ్ బోర్డులు పడ్డాయి. పలువురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సెలవు దినం కావడంతో మాల్లో జనసంచారం తక్కువగా ఉంది. ఈ సమయంలో ఘటన జరగడంతో పెను ప్రమాదమే తప్పింది.హోర్డింగ్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒక్కసారిగా వినియోగదారులంతా భయంతో పరుగులు తీశారు. మాల్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్.. భారీగా అవకాశాలు
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో అతిపెద్ద కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. సౌత్ సినిమా పరిశ్రమకు కేంద్రబింధువు కానుంది. ఇక్కడ ప్రపంచస్థాయి వీఎఫ్ఎక్స్ అండ్ వర్చువల్ ప్రొడక్షన్ హౌజ్ను ఏర్పాటు చేయడంతో పాటు ఉపాధి కూడా కల్పించనుంది. ‘నెట్ఫ్లిక్స్ స్టూడియోస్’ హైదరాబాద్కు రావడంతో టాలీవుడ్ పరిశ్రమలో కొత్త శకం మొదలు అవుతుందని అభిప్రాయపడుతున్నారు. 30వేల చ.అ.విస్తీర్ణంలో ఏర్పాటు అయిన ఈ కార్యాలయాన్ని మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. నెట్ఫ్లిక్స్ భారత్లో అడుగు పెట్టి పదేళ్లు పూర్తి అయింది.ఈ నేపథ్యంలోనే కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనుంది. అయితే, ఇప్పటికే ముంబై నుంచి నెట్ఫ్లిక్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హైదరాబాద్లో రెండో కార్యాలయం అవుతుంది. ఇక నుంచి హైదరాబాద్లోనే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ (ఏవీజీసీ) రంగం మరింత మరింత బలోపేతం కానుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రతిభ ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ సేవలను కూడా ఇక నుంచి హైదరాబాద్ నుంచే కొనసాగనున్నాయి. -
పండ్ల రవాణాపై గల్ఫ్ గుబులు
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భాగ్యనగరం పండ్ల మార్కెట్పై పడింది. అరబ్బు దేశాల్లో కార్గో రవాణాపై ఆంక్షల నేపథ్యంలో పండ్లు, ఇంటీరియర్, ఫర్నిచర్ వంటి వస్తువులపై ప్రభావం పడింది. దీంతో ఇరాన్, దుబాయ్, టర్కీ, తుర్కియో వంటి దేశాల నుంచి నుంచి హైదరాబాద్కు దిగుమతి అయ్యే యాపిల్స్, కివీ, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ విదేశీ పండ్ల దిగుమతి తగ్గింది. వీటితో పాటు ఇంటీరియర్ ఫర్నిచర్లపై ప్రభావం ఉంది. రెండింతలైన ధరలు.. రంజాన్ మాసం కావడంతో సాధారణంగానే ఖర్జూరం, బాదం వంటి డ్రై ఫ్రూట్స్కు డిమాండ్ ఎక్కువ. పశి్చమాసియాలో యుద్ధంతో ధరలు దాదాపు రెండింతలు పెరిగాయి. సాధారణంగా అక్కడి మార్కెట్లో యాపిల్స్ ధర (బాక్స్) రూ.1,200 ఉంటుంది. అదే బాక్స్ నగర మార్కెట్లో దిగుమతి అయ్యాక రూ.1,800కు విక్రయిస్తుంటారు. కానీ, యుద్ధం నేపథ్యంలో అదే బాక్స్ ధర అక్కడి మార్కెట్లో రూ.1,800 ఉండగా.. ఇక్కడికొచ్చేసరికి రూ.2,500కు పెరిగింది. నిర్మాణ సామగ్రిపైనా.. ఇంధన, చమురు దిగుమతులతో పాటు స్థిరాస్తి మార్కెట్ కూడా ప్రభావం చూపిస్తుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ నుంచి ఇనుము, స్టీల్, కాపర్ వైర్లు దిగుమతి అవుతుంటాయి. గల్ఫ్ దేశాల నుంచి పెట్కోక్ (సిమెంట్లో ఉపయోగించేవి), పాలిమర్లు, సల్ఫర్,, సున్పపురాయి దిగుమతి అవుతాయి. ఈ ముడి పదార్థాలతో ఇంటీరియర్, నిర్మాణ సామగ్రి తయారవుతుంటాయి. మార్బుల్స్, టైల్స్, గ్లాస్ వంటివి దిగుమతులపై ప్రభావం ఉంటుంది. ఈ మేరకు తుది దశ నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో పాటు ధరలలో 1–2 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
స్మార్ట్ఫోన్ ఉంటే.. అయిపోతుంది ఇల్లు స్మార్ట్గా!
మనం ఇంట్లో లేని సమయంలో అతిథులు ఇంటికి వస్తున్నారు.. గుమ్మలోకి రాగానే ఇంటి తలుపులు తెరుచుకుంటాయి.. హాల్లోకి అడుగు పెట్టగానే లైట్లు వెలుగుతాయి.. సోఫాలో కూర్చోగానే ఏసీ ఆన్ అవుతుంది. బాల్కనీ వైపు ఉన్న కర్టెన్లు తెరుచుకుంటాయి. ఇవన్నీ చేసేందుకు మెయిడ్(పనిమనిషి) అవసరం లేకుండా స్మార్ట్ఫోన్ నుంచే ఇవన్నీ సాధ్యం.. ప్రస్తుతం ఇంట్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారిత భద్రతా ఉపకరణాల వినియోగం పెరిగింది.రియల్ టైమ్లో ట్రాక్ చేసే స్మార్ట్ కెమెరాలు, డిజిటల్ లాక్స్, స్మార్ట్ వీడియో డోర్ బెల్స్, లైట్లు, కర్టెన్లు ప్రతిదీ స్మార్ట్గా మారిపోయాయి. వేలిముద్ర, ఐరిష్ చూపిస్తే చాలు ఆటోమెటిక్గా ఇంటి తలుపులు తెరుచుకుంటాయి. చాలా మంది బిల్డర్లు ఇంటి నిర్మాణ సమయంలోనే ఈ స్మార్ట్ ఉపకరణాలను జోడిస్తున్నారు.కోకాపేట, మాదాపూర్, గచ్చిబౌలి వంటి పశ్చిమ హైదరాబాద్లోని హైఎండ్ ప్రాజెక్ట్లలో ఈ తరహా ఐఓటీ ఉపకరణాల ప్రాజెక్ట్లు ఎక్కువగా నిర్మాణంలో ఉన్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలు ఉండే వారు వ్యక్తిగత గృహాలలో సైతం వీటిని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరిగా మారింది. -
ఇలా చేస్తే తప్ప.. హైదరాబాద్లో ఇల్లు కొనలేమా?
నగరంలో రూ.45 లక్షలలోపు ధర ఉన్న ‘అఫర్డబుల్ హౌసింగ్’కు ఏటా గిరాకీ పెరుగుతూనే ఉంది. సులువైన గృహ రుణాలు, వడ్డీ రాయితీ కారణంగా కస్టమర్ల నుంచి అందుబాటు గృహాలపై ఆసక్తి పెరుగుతోంది. కానీ, భూముల ధరలు, నిర్మాణ వ్యయ భారం, కార్మికుల కొరత తదితర కారణాలతో వీటి నిర్మాణానికి డెవలపర్లు ఆసక్తి చూపించడం లేదు. దాంతో వాటి కొరత ఏర్పడింది. – సాక్షి, సిటీబ్యూరోగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకూ విస్తరించింది. ఇలాంటి తరుణంలో గ్రేటర్లో అందుబాటు గృహాల నిర్మాణం డెవలపర్లకు లాభసాటిగా లేకపోవడంతో క్రమంగా అఫర్డబుల్ హౌసింగ్ తగ్గుముఖం పట్టింది. మరోవైపు పెరిగిన ధరల నేపథ్యంలో 90 శాతం మంది ఉద్యోగ వర్గాలు ఇల్లు కొనలేని పరిస్థితి.కనీసం రూ.కోటి లేనిదే ఇల్లు రావడం లేదు. దీంతో అద్దె గృహాలకు డిమాండ్ పెరగడంతో ఓనర్లు అద్దెలను విపరీతంగా పెంచేస్తున్నారు. ఉద్యోగులు తమ సంపాదనలో దాదాపు 40 శాతం అద్దెకే వెచ్చిస్తున్నారు. రీ–డెవలప్మెంట్ అవసరం.. ముంబై తరహాలో హైదరాబాద్లోనూ పాత స్థలాలు, ప్రాంతాలను రీ–డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పాత పౌర మౌలిక సదుపాయాలు నగరాభివృద్ధికి అత్యంత కీలకం. అందుకే ఆయా ప్రాంతాలను క్లస్టర్లుగా అభివృద్ధి చేయాలి. రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లకు నిర్మాణ రుసుములు, పన్ను రాయితీలు, జీఎస్టీ మినహాయింపుతో ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గిస్తే కొనుగోలుదారులు ఉత్సాహంగా ముందుకొస్తారు. -
లొంగిపోయేందుకు బయల్దేరిన మావోయిస్టులు
-
ఇల్లు కొంటే.. గేటెడ్ కమ్యూనిటీలోనే కొనాలి!
పని ఒత్తిడితో అలసిసొలసి ఇంటికి వచ్చిన ఉద్యోగికి ప్రశాంతమైన వాతావరణం.. నడిచి వెళ్లి వచ్చేంత దూరంలోనే అందుబాటులో ఉండే నిత్యావసరాలు.. పిల్లలు హాయిగా ఆకుడునేలా భద్రత.. వృద్ధుల కాలక్షేపం కోసం లైబ్రరీ.. కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా గడిపేలా పచ్చటి పార్కులు.. ఎలాంటి పొల్యూషన్ లేని ప్రాంతం.. ప్రస్తుతం నగరవాసులు కోరుకుంటున్నవి ఇవే.. ముఖ్యంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆలోచనలు, అభిరుచులను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లే విధంగా వాతావరణం ఉంటుంది. అలాంటి అవసరాలు తీరుస్తున్నాయి కాబట్టే ‘గేటెడ్ కమ్యూనిటీ’లకు ఆదరణ పెరుగుతూనే ఉంది. కట్టుదిట్టమైన భద్రత, ఆధునిక వసతులు మాత్రమేæకాదు.. మెరుగైన జీవనశైలి, ఆరోగ్యకర వాతావరణం, మనశ్శాంతిని అందించే కేంద్రాలే గేటెడ్ కమ్యూనిటీలు.. – సాక్షి, సిటీబ్యూరోభార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడం, ఇద్దరికీ మంచి ప్యాకేజీ ఉండటం, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్టాండలోన్ అపార్ట్మెంట్ల నుంచి గేటెడ్ కమ్యూనిటీలకు షిఫ్ట్ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటి ధర అధికంగా ఉన్నా ఏమాత్రం ఆలోచించడం లేదు. 24/7 భద్రత, నిఘా, ఆధునిక వసతులు, మెరుగైన మౌలిక వసతులు ఉండటంతో ఈ తరహా ప్రాజెక్ట్ల లో అపార్ట్మెంట్లను కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు.తొలి ప్రాధాన్యత భద్రతకే.. ఎవరైనా సరే ఇంటిని ఎంపిక చేసే ముందు ప్రాధాన్యత ఇచ్చేది భద్రతకే. కమ్యూనిటీ లోపలికి ఎవరొస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? అనే కచి్చతమైన సమాచారం ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ గేట్ల వద్ద 24/7 భద్రతా సిబ్బంది, సీసీటీవీ కెమెరాలతో గట్టి నిఘా ఉంటుంది. నివాసితులు అనుమతిస్తే తప్ప బయటివారు లోపలికి వచ్చేందుకు వీలుండదు. దీంతో భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనా పిల్లలు, పెద్దలను ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్లేందుకు ఎలాంటి భయం అక్కర్లేదు. అలాగే గేటెడ్లో జిమ్, స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ హాల్, ఇండోర్ గేమ్స్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, ఫిట్నెస్ సెంటర్, పార్క్, యాంఫీ థియేటర్, ల్యాండ్స్కేప్ గార్డెనింగ్, స్పోర్ట్స్ కోర్ట్ క్లబ్హౌస్ వంటి సౌకర్యాలు ఉంటాయి. రిటైల్ దుకాణం, ఫార్మసీ, వెల్నెస్ సెంటర్ కూడా ఉంటాయి.సామాజిక బంధాలు.. సాధారణంగా నగరాలలో పక్కింటి వాళ్లెవరో కూడా తెలియదు అనే భావన ఉంటుంది. కానీ, గేటెడ్ కమ్యూనిటీలలో అలా కాదు. నివాసితులందర్నీ ఒక చోట చేరుస్తుంది. వాకింగ్, వ్యాయామం వంటి వేళల్లో ఒకర్ని ఒకరు కలుసుకుంటారు. పిల్లలు వారి వయస్సు స్నేహితులతో ఆడుకుంటారు. పండుగల సందర్భాలలో కమ్యూనిటీ మొత్తం సందడి వాతావరణం నెలకొంటుంది. కమ్యూనిటీ లోపల ధ్వని, వాయు కాలుష్యం ఉండదు. దీంతో నివాసితులు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో నివాసం ఉండే వీలు కలుగుతుంది.మౌలిక సదుపాయాలు.. గేటెడ్ కమ్యూనిటీలలో ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాలు ఉండటం వీటి అదనపు ఆకర్షణ. వెడల్పాటి రోడ్లు, రహదారికి ఇరువైపులా చెట్లు, వృద్ధులు, పిల్లలు సేదతీరేందుకు అక్కడక్కడ బెంచ్లు, కుర్చీలు ఉంటాయి. పరిశుభ్రమైన నీటి వ్యవస్థ, భూగర్భ విద్యుత్ లైన్లు, మురుగు నీటి వ్యవస్థ ఉంటాయి. ప్రజారవాణా, మెరుగైన మౌలిక వసతులకు చేరువలో ఉంటాయి. నేటి అవసరాలకు తగినట్లు సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి.అవసరాలు తీరేలా.. గేటెడ్ కమ్యూనిటీ లే–అవుట్లు కూడా ప్రతి ఇంటికీ మెరుగైన సూర్యరశి్మ, స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేస్తారు. అందుకే గేటెడ్లో ఎక్కువ స్థలం గ్రీనరీకి కేటాయిస్తారు. కమ్యూనిటీలోని వసతుల నిర్వహణకు క్రమశిక్షణ కలిగిన సిబ్బంది ఉంటారు. నేటి అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీల్లోనే కో–వర్కింగ్ స్పేస్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు, సౌర విద్యుత్ వంటివి ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి యువతరం అభిరుచులు, అవసరాలకు తగ్గట్లు గేటెడ్ కమ్యూనిటీలను పలువురు బిల్డర్లు ఐటీ పార్క్లు, అంతర్జాతీయ స్కూళ్లు, ఆస్పత్రులకు సమీప దూరంలో గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నారు. సాధారణంగా గేటెడ్ కమ్యూనిటీలలో అపార్ట్మెంట్ల విస్తీర్ణం 1,300 చ.అ. నుంచి ప్రారంభమవుతాయి. ఆ పరిమాణంలో ఉంటే కనీస వసతులు, జీవనశైలి కల్పించే వీలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.నగరం నలువైపులా.. కూకట్పల్లి, మదీనాగూడ, తెల్లాపూర్, నల్లగండ్ల, మియాపూర్, బాచుపల్లి, గుండ్లపోచంపల్లి, ఉప్పల్, వనస్థలిపురం, కొంపల్లి, శామీర్పేటతో పాటు ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానమై ఉన్న ప్రాంతాలలో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లు నిర్మాణంలో ఉన్నాయి. విశాలమైన స్థలం, వసతులు, నిర్వహణ చార్జీల నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ల ధర 20–25 శాతం ఎక్కువగా ఉంటుంది. స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్లతో పోలిస్తే గేటెడ్ కమ్యూనిటీలలో ప్రాపర్టీల విలువ 30–35 శాతం అధికంగా ఉంటుంది. డిమాండ్ కారణంగా వీటిల్లో అద్దెలు బాగానే గిట్టుబాటవుతాయి. -
టిఫిన్ సెంటర్, క్యాంటీన్లపై గ్యాస్ ధరల ఎఫెక్ట్
-
త్వరలో చర్లపల్లి-నాగర్కోయల్ అమృత్ భారత్.. ప్రత్యేకత ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ మీదుగా మరో అమృత్భారత్ రైలు పరుగు పెట్టబోతోంది. హైదరాబాద్ను కన్యాకుమారితో అనుసంధానిస్తూ ఈ రైలు ప్రారంభం కాబోతోంది. చర్లపల్లి నుంచి కన్యాకుమారి చేరువలో ఉన్న నాగర్కోయల్ మధ్య నడిచే ఈ రైలు.. ఈనెల 11న ప్రారంభం కానున్నట్టు తెలిసింది.జనవరిలో చర్లపల్లి–కేరళ రాజధాని తిరువనంతపురం మధ్య ఓ అమృత్భారత్ రైలు ప్రారంభం కావడం తెలిసిందే. దాంతోపాటే నాగర్కోయల్ అమృత్భారత్ కూడా మంజూరైంది. అయితే, అప్పట్లో దానికి రేక్ అందుబా టులో లేకపోవటంతో పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఆ ఇబ్బందిని దాటుకుని ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్ మీదుగా రెండు అమృత్భారత్ రైళ్లు, వరంగల్ మీదుగా ఒకటి నడుస్తున్నాయి. కొత్త రైలుతో తెలంగాణకు నాలుగో అమృత్భారత్, హైదరాబాద్కు మూడోదిగా ఉండనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చర్లపల్లి–ముజఫర్పూర్ జంక్షన్(బిహార్) మధ్య ఒకటి, చర్లపల్లి–తిరువనంతపురం మధ్య మరొకటి నడుస్తున్నాయి.కాగా, హైదరాబాద్–నాగర్కోయిల్ అమృత్ భారత్ రైలు ప్రయాణంలో అనేక పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు దర్శించవచ్చు. ఈ మార్గం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలను కలుపుతుంది. మదురై, రామేశ్వరం, కన్యాకుమారీ, కుర్తాలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ఈ మార్గం సహాయపడుతుంది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం (యాదగిరిగుట్ట), భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవాలయం, తిరుమలను దర్శించుకోవచ్చు. -
సోషల్ మీడియా వల్లే నేరాలు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : గతంలో మహిళలపై వేదింపులు పట్టణాలకే పరిమితమయ్యేవని కానీ ప్రస్తుత రోజుల్లో వాటి పరిధి పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన "స్టాండ్ విత్ హర్" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోషల్ మీడియా కారణంగానే మహిళలపై వేదింపులు పెరిగాయని సీఎం అన్నారు. నారీమణుల భద్రత కోసం కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాదని వాటిని అమలు చేసి తీరాలని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని పథకాలు మహిళల పేరు మీదే అమలు చేస్తున్నామన్నారు. మహిళ సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులు నడుపుతున్నామని రాష్ట్రం అభివృద్ధిలో దూసుకపోతుందని తెలిపారు. మహిళల భద్రత కోసం పురుషులు ముందుకు రావాలనే సందేశంతో తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. "స్టాండ్ విత్ హర్" ప్రోగ్రామ్కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిటైల్ ఫేమ్.. రియల్ ఎస్టేట్ బూమ్!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కేప్ దాని సాంప్రదాయ కేంద్రాలకు మించి విస్తరిస్తోంది. కార్యాలయ స్థలాలు, నివాస, డేటా సెంటర్లు, పారిశ్రామిక లైఫ్ సైన్సెస్తో సహా వివిధ రంగాలు వృద్ధి కేంద్రాలుగా ఉద్భవిస్తున్నాయి. ఓ వైపు పశ్చిమ, మధ్య హైదరాబాద్లో బిజినెస్ హాట్స్పాట్లు నానాటికీ పెరుగుతున్నాయి. మరోవైపు రాబోయే 3–5 సంవత్సరాలలో తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందనున్నాయని, ఇవి గ్రేడ్–ఏ ఆఫీస్ స్టాక్లో 12–15 శాతం, వార్షిక ఆఫీస్ స్పేస్ డిమాండ్లో 5–10 శాతం వాటా అందుకుంటాయని కొలియర్స్ నివేదిక పేర్కొంది. స్టార్టప్స్లోనూ టాప్.. హైదరాబాద్ వర్ధమాన వ్యవస్థాపకులకు కూడా కీలకమైన నగరంగా మారింది. 2014లో కేవలం 200 స్టార్టప్లు మాత్రమే నగరంలో ఉండగా, ఆ సంఖ్య 7,500కు పెరిగింది. ఈ పెరుగుదల నగరంలో వ్యాపార స్థలాలకు డిమాండ్ను అనూహ్యంగా పెంచేస్తోంది. అమెరికాకు చెందిన స్టార్టప్ పరిశోధన సంస్థ స్టార్టప్ జీనోమ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఆసియాలోనే స్టార్టప్లకు ఉత్తమ నగరాల్లో హైదరాబాద్ 19వ స్థానంలో నిలవడం గమనార్హం. లీజింగ్.. కింగ్.. రిటైల్, ఫ్యాషన్ వృద్ధికి దేశంలోని అగ్ర నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా మారుతోంది. కుష్మాన్– వేక్ఫీల్డ్ తాజా రిటైల్ మార్కెట్ బీట్ రిపోర్ట్ ప్రకారం, 2025 మొదటి త్రైమాసికంలో 0.8 మిలియన్ చదరపు అడుగుల స్థలం రిటైల్ లీజింగ్ను సిటీ నమోదు చేసింది. 2024తో పోలిస్తే ఇది 106 శాతం పెరుగుదల కావడం విశేషం. మొత్తం జాతీయ రిటైల్ లీజింగ్లో 34 శాతంతో నగరాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది. దీనిలో ఎక్కువ భాగం జీవనశైలి ఉత్పత్తుల షాపింగ్కు సంబంధించినవి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, కొత్తపేట, కొంపల్లి వంటి కీలకమైన ప్రాంతాలలో కొలువుదీరుతున్నాయి. -
రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)
-
చేనేత.. అమల పలకరింత
హైటెక్ సిటీ సమీపంలోని ఇందిరా మహిళా శక్తి బజార్లో ఇండియా హ్యాండ్ మేడ్ కలెక్టివ్ (ఐహెచ్ఎంసీ), గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) సంయుక్తాధ్వర్యంలో శుక్రవారం హస్తకళల ప్రత్యేక ప్రదర్శనను సినీనటి, జంతు హక్కుల కార్యకర్త అమల అక్కినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా చరఖాపై నూలు వడుకుతున్న ఓ మహిళతో ఆమె సరదాగా మాట్లాడారు. అర్పిత.. స్ఫూర్తి మంత్రచిన్న వయసులో జరిగిన ప్రమాదం ఆమె జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ఆ దుర్ఘటనలో రెండు కాళ్లనూ కోల్పోయినా భయపడలేదు.. ఇంతలో దెబ్బ మీద దెబ్బ అన్నట్లు తల్లిదండ్రులు కాలం చేశారు.. కానీ, బెదరలేదు.. విధిని ఎదిరించి స్ఫూర్తిగా నిలుస్తోంది కోల్కతాకు చెందిన అర్పితా రాయ్.. ఉద్యోగిగా.. యోగా శిక్షకురాలిగా రాణిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎఫ్టీసీసీఐ నిర్వహించిన కార్యక్రమంలో ప్రేరణాత్మక ప్రసంగం చేశారు అర్పితా రాయ్..కమలం.. వికసిత కాంత మహిళా శక్తి తోడ్పాటు లేనిదే వికసిత భారత్ సంకల్పం అసాధ్యం. వనితల తోడిదే అవని అని వక్తలు కొనియాడారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను నిర్వహించారు. -
యువతితో అసభ్య వీడియోలు తీసిన దర్శకుడు
హైదరాబాద్: వెండితెరపై వెలిగిపోవాలని నగరానికి వచ్చిన ఆ యువతిని ఓ దర్శకుడు ట్రాప్ చేసి సినిమా షూటింగ్ పేరుతో ఆమెను కారులో కూర్చుండబెట్టుకొని అసభ్యకరమైన సీన్లు తీసి సోషల్ మీడియాలో పోస్టే చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... శ్రీకృష్ణానగర్లో నివసిస్తున్న శంకర్(25) రీల్స్తో పాటు వెబ్సిరీస్లకు దర్శకత్వం వహిస్తుంటాడు. కాకినాడకు చెందిన యువతి(23) సినిమాల్లో వేషాల కోసం హైదరాబాద్కు వచ్చి యూసుఫ్గూడలోని తన స్నేహితురాలి వద్ద ఉంటున్నది. ఇటీవల ఓ వెబ్ సిరీస్లో వేషం ఉందంటూ శంకర్ ఆ యువతిని పిలిపించుకున్నాడు. కారులో కూర్చుండబెట్టుకొని కెమెరాతో షూట్ చేయసాగాడు. అసభ్యకరమైన డైలాగ్తో పాటు ఆమె చేత అసభ్య చేష్టలతో షూటింగ్ నిర్వహించి దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో యువతి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. ఇలాంటి వేషాలు వేస్తున్నావేంటంటూ ఆమెను ప్రశ్నించారు. ఆ వీడియో తొలగించాలని శంకర్కు చెప్పగా నిర్లక్ష్యం చేశాడు. మిగతా సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఆమె చేత పలికించిన డైలాగ్లు సన్నివేశాలను పోస్ట్ చేయడమే కాకుండా బ్లాక్ మెయిల్ చేయసాగాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు యువ దర్శకుడు శంకర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెరిగిన గ్యాస్ ధరలు.. డొమెస్టిక్ సిలిండర్ ఎంతంటే?
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భారత్పై పడింది. దీంతో వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్పై రూ.60 పెంపు జరగగా వాణిజ్య సిలిండర్పై రూ. 115 పెరిగింది. ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వ పథకం ఉజ్వల ద్వారా అందించే సిలిండర్ ధరలు మాత్రం యథాతథంగా ఉండనున్నట్లు తెలిపింది.ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో చమురు రవాణా చేసే నౌకలు నిలిచిపోయాయి. ఈ ప్రభావంతో చమురు ధరలు పెరిగాయి. ఈ ధరలతో హైదరాబాద్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 965కు చేరుకుంది. ఢిల్లీలో డొమెస్టిక్ ధర ప్రస్తుతం రూ. 913 ఉండగా, ముంబైలో రూ. 852 చెన్నైలో రూ.928 కి చేరుకుంది. అయితే యుద్ధప్రభావంతో భవిష్యత్తులో కొరత ఏర్పడకుండా ఉండేందుకు చమురు ఉత్పత్తులను భారీగా పెంచాలని కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే భారత్ వద్ద తాత్కాలికంగా చమురు నిల్వలు ఉన్నాయని పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది వరకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అందుకే మాదిగల వైపు నిలబడ్డా: సీఎం రేవంత్
హైదరాబాద్: చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతోందని, ఈ అంశాన్ని 20 ఏళ్ల నుంచి గమనిస్తున్నాని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిర్వహిస్తున్న ధన్యవాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ మేం మాటలతో గెలవలేదు.. కమిట్మెంట్తో గెలిచాం. వర్గీకరణ అంశంలో మాదిగవైపు న్యాయం ఉంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మాదిగల వైపే నిలబడ్డాను. తెలంగాణ పునర్నిర్మాణంలో మాదిగల భాగస్వాములు కావాలి. ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్న బలమైన ఆకాంక్షతో 2023 ఎన్నికల్లో కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023 లో మా దగ్గర అధికార యంత్రాంగం, అక్రమ సంపాదన లేదు..చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతోంది. పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి. ఎలా అయితే సాధించుకోవాలన్న తపనతో కొందరు ప్రాణ త్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు,తర్జనభర్జనలు జరిగాయి. 20 ఏళ్ల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా నేను చూస్తూ వస్తున్నాను. మీరు కోట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైనా సాయం చేస్తూ వచ్చాను. క్రిష్ణ మాదిగ, సతీష్ మాదిగ నా దగ్గరకు వచ్చినప్పుడు చేతనైన సాయం చేసి అండగా నిలిచాను. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పాలకులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్ తో పాటు నన్ను బయటకు గెంటివేశారు. నాకు మహాభారతంలో కర్ణుడు, బార్బరీకుడు అనే పాత్రలు ఇష్టం. కర్ణుడికి అవమానం జరిగినప్పుడు పోరాటం చేశారు.. మిత్రధర్మాన్ని నేరవేర్చాడు. నేను కూడా మిత్రధర్మాన్ని నిర్వర్తించాను.. మాదిగలకు నేను అండగా నిలబడ్డాను. నా శక్తి ఉన్నంతవరకూ మీకు సాయం చేస్తాను’ అని సీఎం రేవంత్ తెలిపారు. -
మేడ్చల్లో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్.. కాసాగ్రాండ్ క్రెస్ట్వుడ్ లాంచ్!
భారతదేశంలోని ప్రముఖ రియల్ఎ స్టేట్ డెవలపర్లలో ఒకటైన కాసాగ్రాండ్, హైదరాబాద్లోని మెడ్చల్ ప్రాంతంలో 'కాసాగ్రాండ్ క్రెస్ట్వుడ్' పేరుతో ఒక అతి ప్రీమియం గేటెడ్ విల్లా కమ్యూనిటీని అధికారికంగా ప్రారంభించింది. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రత్యేక ప్రాజెక్ట్లో మొత్తం 130 అత్యున్నత స్థాయి 5 బీహెచ్కే విల్లాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విల్లాల ప్రారంభ ధర రూ. 2.99 కోట్ల నుండి ప్రారంభమవుతుంది.అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఈ విల్లాలు విశాలమైన నివాస విస్తీర్ణంతో పాటు ప్రైవేట్ హోమ్ థియేటర్ ఏర్పాటు చేసే సదుపాయం, ప్రత్యేక లిఫ్ట్ ప్రొవిజన్, విస్తృత ల్యాండ్స్కేప్ గార్డెన్, 1,200 చదరపు అడుగుల వరకు వ్యక్తిగత తోట స్థలం & సుమారు 375 చదరపు అడుగుల బ్యాక్యార్డ్ ప్రదేశాన్ని కలిగి ఉంటాయి. ప్రతి విల్లా కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికతో రూపొందించారు.ఈ ప్రాజెక్ట్లో 55కి పైగా ఇండోర్ & అవుట్డోర్ లైఫ్స్టైల్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సుమారు 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న G+3 క్లబ్హౌస్, రూఫ్టాప్ స్విమ్మింగ్ పూల్, ఆధునిక జిమ్, యోగా స్టూడియో, పిల్లల ఆట స్థలాలు, మల్టీ పర్పస్ కోర్టులు, వాకింగ్ ట్రాక్లు, సీనియర్ సిటిజన్ జోన్, రిఫ్లెక్సాలజీ వాక్వే వంటి అనేక సౌకర్యాలు నివాసితులకు ఆరోగ్యకరమైన & సమతుల్య జీవన శైలిని అందించడానికి రూపుదిద్దుకున్నాయి.మొత్తం ప్రాజెక్ట్ విస్తీర్ణంలో సుమారు 67% భాగాన్ని ఓపెన్ స్పేస్ & ల్యాండ్ స్కేపింగ్ కోసం కేటాయించడం ద్వారా ప్రకృతి మధ్య ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించారు. ఫెంగ్ షుయ్ ప్రేరణతో రూపొందించిన ఉద్యానవనాలు, ప్రత్యేక థీమ్ గార్డెన్లు & విస్తృత హరిత ప్రదేశాలు నివాసితులకు ప్రశాంతత, గోప్యతను కల్పిస్తాయి.ఇంటీరియర్ రూపకల్పనలో 9’10” ఎత్తైన సీలింగ్స్, విస్తృత గాజు స్లైడింగ్ డోర్స్, సమృద్ధిగా సహజ కాంతి & గాలి ప్రసరణకు అనుకూలమైన ప్రణాళిక, వాక్-ఇన్ వార్డ్రోబ్లతో కూడిన సూట్-సైజ్ బెడ్రూమ్స్ మరియు విశాలమైన మాడ్యులర్ వంటగదులు అందుబాటులో ఉన్నాయి. ప్రతివిల్లాకు 100% పవర్బ్యాకప్ సదుపాయం కల్పించారు.మెడ్చల్లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్రోడ్ సమీపంలో ఉండటం వలన హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఐటీకారిడార్లు, పరిశ్రమల కేంద్రాలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సేవా సంస్థలు & వినోద ప్రదేశాలకు సులభంగా చేరుకునే అవకాశం కల్పిస్తుంది. మేడ్చల్ ఇండస్ట్రియల్ కారిడార్, జీనోమ్ వ్యాలీ, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న వాణిజ్య కేంద్రాలకు సమీపంలో ఉండటం దీని విలువను మరింత పెంచుతుంది.అదనంగా, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు & రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సౌకర్యవంతమైన కనెక్టివిటీ ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను మరింత బలపరుస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడి దృష్ట్యా కూడా ఇది అత్యుత్తమ అవకాశంగా భావిస్తున్నారు. -
హైదరాబాద్ ఐఎండీ ఆఫీస్కు బాంబు బెదిరింపు మెయిల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వాతావరణ శాఖ (ఐఎండీ) కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. ఒక్కసారిగా ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. బేగంపేట ఆఫీస్లో 14 ఆర్డీఎక్స్ బాంబులను అమర్చినట్లు మెయిల్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని పోలీసుల తేల్చారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టుతో పాటు పలు జిల్లా కోర్టులకు బాంబ్ బెదిరింపులు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.గత నెలలో రాజమండ్రి జిల్లా కోర్టులో బాంబు ఉందంటూ బెదిరింపు రావడంతో కోర్టు భవనాన్ని ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. మరోవైపు నాంపల్లి సీబీఐ కోర్డుకు, కరీంనగర్ కోర్టుకు బాంబు బెదింరింపులు రావడంతో పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. న్యాయవాదులను కోర్టు సిబ్బందిని బయిటకి పంపారు. అనంతరం డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. అయితే ఇటీవల తరచుగా కోర్టులకు, పాఠశాలలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని ఓ కోర్టు భవనంలో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. అంతే కాకుండా తరచుగా విద్యాలయాలకు బెదిరింపులు వస్తున్నాయి. -
హోలీ పండుగ : సిక్కులు హోల్లా మొహల్లా నగర్ కీర్తన ఊరేగింపు (ఫొటోలు)
-
హైదరాబాద్లో సెరా స్టైల్ స్టూడియో ప్రారంభం (ఫొటోలు)
-
జీహెచ్ఎంసీ అప్పులు మీరే కట్టండి
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు వివిధ ప్రాజెక్టుల కోసం ఆర్థిక సంస్థలు, బ్యాంకుల ద్వారా తీసుకున్న భారీ రుణాలు. మరోవైపు బల్దియాకు అధిక ఆదాయ వనరులైన ఆస్తిపన్ను, టౌన్ప్లానింగ్ ఫీజులు భారీగా తగ్గే పరిస్థితులు. ఇంకోవైపు తీసుకున్న అప్పులన్నీ జీహెచ్ఎంసీ పేరిటే ఉండటంతో అప్పులు కట్టాల్సిన బాధ్యతతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాలు ఏళ్లకేళ్లుగా ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో కొండలా పేరుకు పోయిన బకాయిలు.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ విస్తరించి మూడు కార్పొరేషన్లుగా మారింది. దీంతో కొత్త కార్పొరేషన్లు బకాయిలు కట్టే పరిస్థితిలో లేవు. జీహెచ్ఎంసీ పరిధి ఎక్కువగా ఉన్నా ఆదాయం వచ్చే అవకాశం అంతంతమాత్రమే. దీంతో మూడు కార్పొరేషన్లు మనుగడ సాగించాలంటే, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి చెందాలంటే వివిధ ప్రాజెక్టుల (ఎస్సార్డీపీ, ఎస్ఎన్డీపీ,సీఆర్ఎంపీ) కోసం తీసుకున్న అప్పుల్ని ప్రభుత్వమే చెల్లించాల్సిందిగా జీహెచ్ఎంసీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను కానీ, స్టాంపుడ్యూటీ ద్వారా కానీ, వృత్తిపన్ను ద్వారా కానీ, ఇతరత్రా రూపాల్లో జీహెచ్ఎంసీకి రావాల్సిన బకాయిలేవి చెల్లించకుండా, వాటి బదులు తమ అప్పులు తీర్చాల్సిందిగా కోరింది. ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తోంది. మూడు కార్పొరేషన్ల ఏర్పాటులో ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించి ప్రభుత్వం స్పెషల్ టాస్క్ఫోర్స్ కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలో ఏ కార్పొరేషన్పైనా భారం లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ ఈమేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రుణ భారం గత ప్రభుత్వ హయాంలో నగరంలో భారీయెత్తున మౌలిక సదుపాయాలు కలి్పంచారు. అభివృద్ధి పనులు చేశారు. అందుకుగాను మున్సిపల్ బాండ్ల జారీ, వాణిజ్య రుణాలు, ఇతరత్రా వెరసి రూ.6,530 కోట్ల అప్పులు చేశారు. వడ్డీ సహా చెల్లింపులు పోను గత అక్టోబర్ వరకు మిగిలిన అప్పుల భారం రూ.4,877 కోట్లు. రాని బకాయిలు వివిధ రూపాల్లో ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి నిధులు రావడం లేదు. వాటిలో స్టాంపు డ్యూటీవే దాదాపు రూ.2,500 కోట్లు బకాయిలున్నాయి. మ్యుటేషన్ ఫీజులు రూ. 100 కోట్లు రావాల్సి ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల భవనాలకు సంబంధించిన ఆస్తిపన్ను తదితరాలు వెరసి వేల కోట్లు రావాలి. ఇవేవీ రాకపోవడంతో జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. అయినప్పటికీ నెలనెలా సిబ్బంది జీతాలకు దాదాపు రూ.120 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి.వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని జీహెచ్ఎంసీ ఈ విజ్ఞప్తి చేసింది. మూడు కార్పొరేషన్లలో జనాభా, మౌలిక వసతులు, ఆదాయ మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలని ఒక ఆలోచన చేశారు. కానీ, అప్పుల భారం ఉంటే ప్రగతి ముందుకు సాగదని, అభివృద్ధి ఆగిపోగలదని భావించి ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అప్పులన్నీ జీహెచ్ఎంసీ పేరిటే ఉన్నాయి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాగలదని ఆశిస్తున్నారు.‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’ నేటినుంచేనగర కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం అమలులో నగరంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తద్వారా రాబోయే కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలుపు కోసం బాట వేయవచ్చనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటి వారం నగరంలోని మూడు కార్పొరేషన్ల పరిధిలో పర్యటించనున్నట్లు తెలిసింది. గ్రేటర్ నగరం మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైన నేపథ్యంలో వీటి పరిధిలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు అగ్రసేన్ మహరాజ్ జంక్షన్, చాచానెహ్రూ పార్కు, పబ్లిక్హెల్త్ ఇంజినీరింగ్ కార్యాలయం, కొత్వాల్గూడ, ఉప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల్లో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. మూడు కార్పొరేషన్ల అధికారులు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఎక్కువగా చెత్త తరలింపు వంటి పనులకు ప్రాధాన్యమిచ్చారు. నగరానికి ప్రాధాన్యం ఎందుకు ? రాజధాని హైదరాబాద్ మూడు కార్పొరేషన్లుగా మారడంతో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కలి్పంచవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. మూడు కార్పొరేషన్లు ప్రస్తుతం స్పెషలాఫీసర్ పాలనలో ఉన్నాయి. జరగబోయే ఎన్నికల్లో మూడింట రెండు కార్పొరేషన్లను గెలుచుకోవాలనేది అధికార పార్టీ ఆలోచన కాగా, ఒక కార్పొరేషన్ను మిత్రధర్మంగా ఎంఐఎంకు వదిలేశారనే ప్రచారం ఇప్పటికే మొదలైంది. మూడుకార్పొరేషన్ల ఎన్నికలూ ఒకేసారి జరుగుతాయా, లేక వేర్వేరుగానా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
తల్లిదండ్రులకు ఆరచేతిలో వైకుంఠం
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహానగరంలో పదవ తరగతి వార్షిక పరీక్షల వేడి మొదలవ్వక ముందే కార్పొరేట్ విద్యా సంస్థలు తమ అడ్మిషన్ల వేటను ముమ్మరం చేశాయి. విద్యార్థులు ఇంకా ఎస్సెస్సీ పాఠ్యపుస్తకాలతో కుస్తీ పడుతుండగానే ‘ఇంటర్’ సీటు రిజర్వు చేసుకోవాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి పెరుగుతోంది. ‘ముందస్తు రిజర్వేషన్.. భారీ ఫీజు డిస్కౌంట్’ అనే నినాదంతో తల్లిదండ్రులను ఆకర్షించే పనిలో పడ్డాయి. వీకెండ్ వస్తే చాలు ప్రధాన కార్పొరేట్ కళాశాలల ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేయడం, నేరుగా ఇళ్లను సందర్శించడం సర్వసాధారణమైంది. తమ క్యాంపస్లలో ఉన్న వసతులను చూపిస్తూ ఏసీ క్లాస్రూమ్లు, అత్యాధునిక ల్యాబ్ల పేరుతో భ్రమలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించాలంటే ఇప్పుడే చేరాలని, లేదంటే సీట్లు దొరకవని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. వాస్తవానికి విద్యాశాఖ నిబంధనల ప్రకారం పదవ తరగతి ఫలితాలు రాకముందే అడ్మిషన్లు నిర్వహించడం నిషిద్ధం. అయినప్పటికీ నిబంధనలు బేఖాతర్ చేస్తూ అడ్మిషన్ల కోసం అడ్డదారులకు తెరలేపడం విస్మయానికి గురిచేస్తోంది.ప్రత్యేక బ్యాచ్ల ఆకర్షణ సాధారణ తరగతులకు భిన్నంగా.. అత్యంత ప్రతిభావంతుల కోసం అంటూ ప్రత్యేక విభాగాలను ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను బురిడీకొట్టించడం సాధారణంగా తయారైంది. ముందస్తుగా సీటు బుక్ చేసుకుంటే ఫీజులో 20 నుండి 40 శాతం వరకు తగ్గింపు ఇస్తామని ఆశ కలిగిస్తున్నారు. పరిమిత సీట్లంటూ జేఈఈ, మెడిసిన్ ర్యాంకుల హామీలు, క్యాంపస్లో చేరితే ఐఐటీల్లో సీటు గ్యారెంటీ అంటూ ఆరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. విద్యార్థుల కంటే ఎక్కువగా తల్లిదండ్రుల బలహీనతలను, వారి భవిష్యత్తు ఆందోళనలను ఈ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.ప్రీ–రిజిస్ట్రేషన్ మాయాజాలం పదవ తరగతి పరీక్షలు కూడా పూర్తికాకముందే సీటు గ్యారెంటీ అంటూ తల్లిదండ్రుల నుండి ప్రీ–రిజిస్ట్రేషన్ అడ్మిషన్న్టోకెన్ పేరిట కొంత వసూలు చేస్తున్నారు. ఆ తరువాత వస్తే ‘సీటు దొరకదు‘ అని చెప్పి తల్లిదండ్రులను మానసికంగా సిద్ధం చేస్తారు. ఒకసారి ఈ సొమ్ము చెల్లిస్తే, ఒకవేళ విద్యార్థికి వేరే కాలేజీలో సీటు వచ్చినా, ఆలోచన మార్చుకున్నా ఈ డబ్బు తిరిగి రాదు. ఇది కార్పొరేట్ విద్యా సంస్ధల మార్కెటింగ్ గిమ్మిక్కుల్లో ప్రధానమైనది.చదవండి: 'మమ్మల్ని పంపించండి మహాప్రభో'ఫీజుల మోత మహా నగరంలోని హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కార్పొరేట్ విద్యా సంస్థలు క్యాంపస్లు బట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి. మాదాపూర్, కూకట్పల్లి, పటాన్చెరు, శివారులోని డిమాండ్ ఉన్న ఏరియాల్లో కోర్సు ఆధారంగా ఫీజులు మారుతుంటాయి. కార్పొరేట్ సంస్థలు అందించే సౌకర్యాలను బట్టి ఫీజులను మూడు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు: -
మహిళల కోసం ప్రత్యేక యూరాలజీ కేంద్రం ప్రారంభం
హైదరాబాద్: మహిళల యూరాలజీ ఆరోగ్య సమస్యలకు సమగ్ర, ప్రత్యేక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బంజారాహిల్స్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘‘సెంటర్ ఫర్ ఫంక్షనల్ అండ్ ఫీమేల్ యూరాలజీ’ని ప్రారంభించింది. ఈ సందర్భంగా పూర్తిగా మహిళా వైద్య సిబ్బందితో నిర్వహించే ‘ఆల్-వుమెన్ ఆపరేషన్ థియేటర్ (ఓటీ)’*ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ పాల్గొన్నారు.మహిళల్లో మూత్ర అసంయమనం, పెల్విక్ ఆర్గన్ ప్రోలాప్స్, పునరావృత మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లు, మూత్రాశయ నొప్పి వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నప్పటికీ, సామాజిక సంకోచం, అవగాహన లోపం కారణంగా చాలామంది చికిత్సకు ముందుకు రావడం లేదని వైద్యులు తెలిపారు. ఈ సమస్యలకు సమగ్ర నిర్ధారణ, ఆధునిక చికిత్సలు ఒకే చోట అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ కేంద్రంలో మూడు ముఖ్య విభాగాలు ఏర్పాటు చేశారు. పూర్తిగా మహిళా వైద్యులు, అనస్థీషియా నిపుణులు, నర్సులు, సాంకేతిక నిపుణులతో పనిచేసే ప్రత్యేక ఆపరేషన్ థియేటర్, శస్త్రచికిత్స అవసరం లేకుండా పెల్విక్ కండరాల బలపరిచే పునరావాస కార్యక్రమం, అలాగే మూత్రాశయ పనితీరును అంచనా వేసే యూరోడైనమిక్ పరీక్షల సదుపాయం అందుబాటులో ఉంచారు.గత ఐదేళ్లలో ఏఐఎన్యూ మహిళా యూరాలజీ బృందం 307 ప్రధాన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. మూత్ర లీకేజ్, యూరినరీ ఫిస్టులాలు, సిస్టోసీల్స్, ఫీమేల్ యూరేథ్రోప్లాస్టీ వంటి క్లిష్ట సమస్యలకు చికిత్స అందించిన అనుభవంతోనే ఈ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సారికా పాండ్య మాట్లాడుతూ, మహిళలు తమ ఆరోగ్య సమస్యలను దాచిపెట్టకుండా ముందుకు రావాల్సిన అవసరం ఉందని, ఆధునిక సాంకేతికతతో సమగ్ర చికిత్సలు అందించేందుకు ఈ కేంద్రం తోడ్పడుతుందని తెలిపారు. కన్సల్టెంట్ డాక్టర్ దీప్తి సురేకా మాట్లాడుతూ, మహిళలు సంకోచం లేకుండా వైద్య సేవలు పొందేలా పూర్తి మహిళా సిబ్బందితో ఈ ఓటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువతుల నుంచి వృద్ధుల వరకు మహిళల యూరాలజీ సమస్యలకు రోగి-కేంద్రీకృత, సమగ్ర వైద్య సేవలు అందించడం ఈ కేంద్ర లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు. -
హైదరాబాద్ టోలీచౌక్ లో ఘోర ప్రమాదం..ముగ్గురు మృతి
-
Hyd: ఐదంతస్తుల భవనం నుంచి పడి ముగ్గురి దుర్మరణం
హైదరాబాద్: నగరంలోని టోలిచౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంస్తుతల భవనం నుంచి పడి పలువురు కార్మికులు మృత్యువాత పడ్దారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు పైనుంచి కిందకు పడిపోయారు. దాంతో ముగ్గురు అడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది..టోలిచౌకిలో జరిగిన ప్రమాదానికి సంబంధించి బిల్డింగ్కి G+2 మాత్రమే పర్మిషన్ ఉన్నట్టుగా గుర్తించారు. ఈ విషయంపై షేక్ పేట్ ఎమ్మార్వో స్పందించారు. ‘మిగతా ఫ్లోర్లకు పర్మిషన్ లేనందున బిల్డింగ్ని సీజ్ చేయబోతున్నాం. ఇద్దరు ఇక్కడికి ఇక్కడే మృతి చెందారు. ఇంకొకరు చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. మొత్తం ముగ్గురు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ఓలివ్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. మృతి చెందిన మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.’ అని తెలిపారు. -
‘మూసీ నది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్’
సాక్షి,హైదరాబాద్: మూసీ నది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్’అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గురువారం కేటీఆర్ నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్ బుల్డోజర్లకు అడ్డంగా నిలబడుతాం. పేదల ఇళ్ళు కాపాడుతాం. మూసీ పేరుతో రేవంత్ రెడ్డి చేస్తోన్న లూటీని అడ్డుకుంటాం. పేము కట్టిన ఇళ్ళకు పెయింటర్ బాబు రంగులు మార్చుతున్నాడు. రేవంత్ హాయంలో ఒక్క ఇల్లు కట్టినట్లు చూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. రేవంత్ .. చేతకాకుంటే మాకు అప్పజెప్పు ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తాం.మూసీ సుందరీకరణకు పునాది వేసిందే కేసీఆర్. మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పేదలు కన్నీరు కార్చిన ప్రభుత్వాలు మనుగడలేదు. 16వేల కోట్లతో పోయేదాన్ని లక్షా 50వేల కోట్లకు రేవంత్ పెంచారు. రెండేళ్ళు అయినా మూసీ సుందరీకరణపై డీపీఆర్ లేదు.కూల్చకుండా కూడా అభివృద్ధి చేయొచ్చని కేసీఆర్ నిరూపించారు. కోస్గిలో రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది. రేవంత్ రెడ్డి సోదరుడు ఇల్లు దుర్గం చెరువులో ఉంది. పొంగులేటి, వివేక్, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు బఫర్లో ఉన్నాయి. ఒక్క ఇల్లు కూల్చకుండా ఆరు కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేశాం. 30కోట్లతో ఉప్పల్ లో శిల్పారామాన్ని కూడా నిర్మించా’మని స్పష్టం చేశారు. -
వావివరసలు మరిచి.. చెల్లెపై కన్నేసి
జగిత్యాల జిల్లా: జులాయిగా తిరిగే ఓ యువకుడు వావివరుసలు మరిచి.. వరసకు చెల్లె అయిన బాలికపై కన్నేశాడు. ప్రేమ పేరిట వేధించి.. వెంటపడి.. ప్రేమ ఊబిలోకి దింపి శారీరకంగా లొంగదీసుకున్నాడు. విషయం ఎవరికైనా చెబితే బాలికతోపాటు ఆమె సోదరుడిని చంపేస్తానని బెదిరించాడు. మనస్తాపానికి గురైన ఆ బాలిక గత డిసెంబర్ 8న క్రిమిసంహారక మందు తాగింది. అప్పటినుంచి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నర్సయ్యపల్లిలో విషాదం నింపింది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. నర్సయ్యపల్లెకి చెందిన దంపతులకు కూతురు, కు మారుడు సంతానం. తండ్రి బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లాడు. పిల్లలను చదివిస్తూ తల్లి ఇంటివద్దనే ఉంటోంది. కూతురు జగిత్యాలలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఇంటర్ చదువుతోంది. బాలికకు వరసకు సోదరుడైన కోల మహేశ్ జులాయిగా తిరుగుతూ.. ఆమెపై కన్నేశాడు. ప్రేమపేరుతో వేధించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే బాలికతోపాటు ఆమె సోదరుడిని చంపుతానని బెదిరించాడు. పెళ్లి చేసుకుందామని బాలిక కోరగా.. నిరాకరించిన మహేశ్ ‘చస్తే చావు..’ అని చెప్పడంతో మనస్తాపానికి గురైన బాలిక∙డిసెంబర్ 8న పురుగులమందు తాగింది. బంధువులు ఆమెను ముందుగా జగిత్యాలకు.. అక్కడినుంచి హైదరాబాద్ తరలించారు. తండ్రి నెల క్రితం దుబాయి నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. చికిత్స పొందుతున్న బాలిక మంగళవారం రాత్రి మృతి చెందింది.నిందితుడిపై పోక్సో, రేప్ కేసుబాలిక మరణానికి కారణమైన మహేశ్పై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో, రేప్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
హైదరాబాద్ లో ఘనంగా విజయ్ దేవరకొండ-రష్మికల రిసెప్షన్


