-
తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వర్షాలు పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల మాత్రం ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే.. రాజధాని హైదరాబాద్ నగరంలో కుంభవృష్టి తప్పదని హెచ్చరిస్తూ యెల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో అధికార యంత్రాంగం వరుణ గండాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. పశ్చిమ విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఆవర్తనం ఏర్పడిందని వాతావరణకేంద్రం తన ప్రకటనలో స్పష్టం చేసింది.నాలుగు రోజులు ఇలా.. 🌧️గురువారం(నేడు) ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.🌧️శుక్రవారం రోజున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉంది. 🌧️19, 20న తేదీల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. 🌧️వాతావరణ శాఖ అంచనాల ప్రకారమే.. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైంది. -
ఉప్పల్ స్టేడియంలో ఫుల్ జోష్లో SRH, GT ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
దిగాలు పడుతున్న థియేటర్లు
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు రాజధానిగా అంతర్జాతీయ స్థాయి సినిమా నిర్మాణాలకు, రూపకర్తలకు పుట్టినిల్లుగా నగరం ఓ వైపు దూసుకుపోతుంటే.. ఒకనాడు సినిమా వైభవానికి మేము సైతం అన్నట్టు బోయీలైన సింగిల్ స్క్రీన్ థియేటర్లు నేడు నానాటికీ తీసికట్టు.. అన్నట్టు మారుతున్నాయి. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తాత్కాలికంగా థియేటర్లను మూసివేస్తున్నట్టు ప్రకటించడం వీటి యజమానుల్లో పేరుకుపోయిన నిరాశకు అద్దం పడుతోంది. ఓటీటీలూ, మల్టీప్లెక్సుల దెబ్బలు ఓర్చుకుంటుంటే.. పులి మీద పుట్రలా అన్నట్టు ఐపీఎల్ మ్యాచ్లూ, ఠారెత్తించిన ఎండలు, హోరెత్తించిన ఎన్నికలు పెరిగిపోయిన ప్రత్యామ్నాయ వినోదాలు.. అన్నీ కలిసి.. సింగిల్ స్క్రీన్ సందడికి తాత్కాలికంగానైనా తెరపడేలా చేసింది. ఒకప్పుడు అంటే.. 1980లలో నగరంలో 113 సినిమా హాళ్లు ఉండేవి. ఆ సమయంలో నగరవాసులకు కాలక్షేపానికి కొదవ కూడా ఉండడంతో అవి రద్దీతో వరి్ధల్లేవి. కాలక్రమంలో నగర వాసులకు ప్రత్యామ్నాయ వినోదాలు పెరిగిపోతూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లోనే పలు సింగిల్ స్క్రీన్స్ అంతర్థానమైతే మరికొన్ని మాల్స్గా, మల్టీప్లెక్స్లుగా కూడా రూపాంతరం చెందాయి. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్ల సంఖ్య దాదాపు 70కి పడిపోయింది. టికెట్ రేట్లు అమాంతం పెరగడం, మాల్స్, మల్టీప్లెక్సులు పుంజుకోవడం వంటి వరుస దెబ్బలతో ఒకటొకటిగా మూతపడుతూ వచ్చిన థియేటర్లను కరోనా, లాక్డౌన్ కోలుకోలేని దెబ్బ తీసింది. నగరంలోని అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లాక్ డౌన్ దెబ్బకి షటప్ అయిపోయాయి. సింగిల్ స్క్రీన్స్ టు.. గోడౌన్స్.. లాక్డౌన్ ధాటికి క్రాస్ రోడ్స్లోని శ్రీ మయూరి, నారాయణగూడలోని శాంతి, టోలిచౌకిలోని గెలాక్సీ, మెహిదీపట్నంలోని అంబా, బహదూర్పురాలోని శ్రీరామ. థియేటర్లలో కొన్ని గోడౌన్స్గా మరికొన్ని ఇతర వ్యాపార వ్యవహారాల కోసం వినియోగంలోకి వెళ్లాయి. సుదర్శన్ 35ఎంఎం, దేవి 70 ఎంఎం థియేటర్ల యజమాని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి బాలగోవింద్ రాజు మాటల్లో చెప్పాలంటే.. ‘అమెజాన్ వంటి కంపెనీలకు గోడౌన్లుగా ఉపయోగించడానికి నగరంలో విశాలమైన స్థలం అవసరం. అలాగే కొత్తగా వచ్చే సూపర్ మార్కెట్ బ్రాండ్లు కూడా థియేటర్లను సంప్రదిస్తున్నారు’ అని అభిప్రాయపడ్డారు. థియేటర్లకు అయ్యే ఖర్చుల గురించి మరో యజమాని మాట్లాడుతూ.. ‘విద్యుత్, సిబ్బంది, నిర్వహణ మొదలైన ఖర్చుల కోసం నెలకు రూ. 1.2 లక్షల నుంచి 1.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రేక్షకులు కరువైన సినిమాలను ప్రదర్శిస్తే నెలకు రూ.3 లక్షలకు ఆ నష్టం పెరుగుతుంది. దీనికన్నా కంపెనీలకు ఇవ్వడం బెటర్ కదా’ అన్నారు ఆదుకోని రీ రిలీజ్లూ...పార్కింగ్ ఫీజులూ... ప్రేక్షకుల నుంచి పార్కింగ్ ఫీజు వసూళ్లపై నిషేధం ఎత్తివేత వంటి ప్రభుత్వ చర్యలు కొంత ఊరటనిచి్చనా.. సింగిల్ స్క్రీన్స్కి అవి పూర్తిగా తెరిపినివ్వలేదు. భారీ వ్యయంతో సినిమాల రాకతో సింగిల్ స్క్రీన్స్కి పుట్టగతులు లేకుండా పోయిన పరిస్థితుల్లో.. రీ రిలీజ్ ల రూపంలో స్టార్స్ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఆ కొత్త ట్రెండ్ కొంత కాలం సింగిల్ స్క్రీన్స్కి పూర్వవైభవంపై ఆశలు చిగురించేలా చేసింది. ఇటీవల ఆ ట్రెండ్కు కూడా గండి పడింది. ఈ నేపథ్యంలో నగరంలో సింగిల్ స్క్రీన్స్ మనుగడ సాగించాలంటే.. దండిగా సినిమాలు రావడం మాత్రమే కాదు మరిన్ని అనుకూల మార్పులు కూడా రావాల్సిన అవసరం ఉందనేది సినీ థియేటర్ నిర్వహణలో అనుభవజు్ఞలు చెబుతున్న మాట. -
వడాపావ్ మంత్రం: పద్మాసని విజయరహస్యం
ఇంటి పనులతోనే సమయం సరిపోవడం లేదనే కంప్లైంట్ గృహిణుల నోట తరచూ వినిపిస్తుంటుంది. కొందరు మాత్రం కొద్దిపాటి ఖాళీ సమయాన్ని కూడాసద్వినియోగం చేసుకుంటూ తమని తాము తీర్చిదిద్దుకుంటారు. అలాంటి కొందరిలో పద్మాసని దరూరి ఒకరు. హైదరాబాద్ మాదాపూర్లో ఉంటున్న 53 ఏళ్ల పద్మాసని దరూరి గృహిణిగా ఉంటూ సంస్కృతంతో పాటు అనేక భాషల మీద పట్టు సాధించారు.భర్త ఉద్యోగరీత్యా పుణెలో ఉండటంతో అక్కడి స్థానిక వంటకాలను నేర్చుకున్నారు. పిల్లలు ఉద్యోగాలు చేసే సమయానికి వచ్చేసరికి నగరవాసులకు ‘పావ్ మంత్ర’ పేరుతో మహారాష్ట్రియన్ వంటకాలను పరిచయం చేస్తూ ఎంట్రప్రెన్యూర్గా ఎదిగారు. లోనూ ‘పంచసత్వ’ పేరుతో సౌత్ ఇండియన్ క్యుజిన్ను ్రపారంభిస్తున్నారు.గృహిణిగా ఉంటూనే వ్యాపారవేత్తగా ఎదిగిన పద్మాసని దరూరిని పలకరిస్తే ఇలా ఎన్నో కబుర్లు మన ముందుంచారు.‘‘మనలో అభిరుచి ఉండాలే గానీ ఎక్కడ ఉన్నా దానిని వృద్ధిలోకి తీసుకురావచ్చు. మా వారి ఉద్యోగ రీత్యా పుణేలో ఉండేవాళ్లం. గృహిణిగా ఇల్లు, పిల్లల పనులు ఎప్పుడూ ఉండేవే. పిల్లలు హై స్కూల్కి వచ్చాక నేను వేదాంత అకాడమీలో చేరి మూడు నెలల్లో సంస్కృతాన్ని నేర్చుకున్నాను. మన పురాణేతిహాసాలు చదువుతూ సబ్జెక్ట్పై పట్టు సాధించగలిగాను. కార్పొరేట్ కంపెనీలలో పని చేసేవారి ఆసక్తిని బట్టి, అక్కడకు వెళ్లి సంస్కృతం క్లాసులు తీసుకునేదాన్ని. రామాయణ, మహా భారతాల గురించి క్షుణ్ణంగా వివరించేదాన్ని. వేదాంత అకాడమీలో నేర్చుకున్న విషయాలను ఇంటికి వచ్చి పిల్లలకు చెబుతుండేదాన్ని. దీంతో వారు స్కూల్లో చదువుకున్న విషయాలే కాకుండా మన వేదాల గురించి, పురాణాల గురించీ కూడా తెలుసుకోగలిగారు.వివిధ రకాల భాషలుసంస్కృతంతో పాటు హిందీ, ఇంగ్లిష్, మరాఠీ.. ఇలా రకరకాల భాషలను ఆసక్తితో నేర్చుకున్నాను. వీటితోపాటు దేశంలోని అన్ని రకాల ్రపాచీన సంస్కృతుల గురించి తెలుసుకోవడం, వాటిని ఆచరించడం చేస్తుండేదాన్ని. ఈ క్రమంలో అన్ని రకాల వంటకాల తయారీని ఇష్టంగా చేసేదాన్ని. వాటిని మా ఇంట్లో వారికే కాదు మా చుట్టుపక్కల వారికీ రుచి చూపించేదాన్ని. అందరూ మెచ్చుకునేవారు. మా అబ్బాయిలిద్దరూ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తయ్యాక నాకు మరింత వెసులుబాటు దొరికింది. నా వంటకాల రుచితో బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చింది. రుచిగా.. పావ్ మంత్రతరచూ ఇంట్లో బిజినెస్ ఆలోచనల గురించి చర్చ జరుగుతున్నప్పుడు నేను, మా పెద్దబ్బాయి కలిసి ఒక ఫుడ్ స్టార్టప్ ్రపారంభించాలనుకున్నాం. మా స్టార్టప్కి వాత్సల్య అనే పేరు అనుకున్నాం. పుణెలో స్థానిక ఫుడ్ వడాపావ్. అక్కడ స్ట్రీట్ఫుడ్గా దీనికి పేరుంది. హైదరాబాద్ వాసులకు ఈ వడాపావ్ రుచిని కొత్తగా అందించాలనుకున్నాను. పుణెలో వడాపావ్ టేస్ట్, మన దగ్గర టేస్ట్కి భిన్నంగా ఉంటుంది. ఏ పనైనా ఒకసారి మొదలుపెడితే దాంట్లో నూటికి నూరు శాతం దృష్టి పెట్టాల్సిందే అనుకొని వ్యాపారంలోకి దిగాను. పావ్కి విభిన్నమైన రుచిని తెప్పించడం కోసం రకరకాల ప్రయోగాలు చేసి, విజయవంతమయ్యాం. మా పిల్లలు వామన్, కేశవ్ లు తమ పూర్తి సహకారాన్ని నాకు అందించారు. దాంతో ‘పావ్మంత్ర’ పేరుతో ఫుడ్ బిజినెస్ను కరోనా సెకండ్ వేవ్లో మాదాపూర్లో ్రపారంభించాం. మా స్టార్టప్కి మహారాష్ట్ర, ఫార్సీ ఆంబియన్స్ వచ్చేలా ΄్లాన్ చేశాం. కొద్ది రోజుల్లోనే నోటి మాట ద్వారానే అందరికీ తెలియడంతో మంచి పేరు వచ్చింది. నేను కన్న కల రెండున్నరేళ్లలోనే సాకారం అయ్యింది. ఈ నెలలో పుణెలో ‘పంచసత్వ’ పేరుతో సౌత్ ఇండియన్ క్యుజిన్ను అందించబోతున్నాను. గృహిణిగా ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ ఉన్న నేను 53 ఏళ్ల వయసులో ఇలా బిజినెస్ ఉమెన్గా ఎదుగుతానని అస్సలు ఊహించలేదు. నా అభిరుచికి మేరకు ఒక్కో ప్రయత్నం చేస్తూ ప్రయాణిస్తున్నాను. ఈ ప్రయాణంలో నా పిల్లలు తోడయ్యారు. తొంభై ఏళ్ల వయసున్న నా తల్లిదండ్రులూ నా ఆసక్తిని, అభిరుచిని గౌరవిస్తూ తమ ఆశీస్సులను అందిస్తున్నారు. అమ్మనాన్నలను చూసుకుంటూ, భర్త, పిల్లల బాగోగులను గమనిస్తూ, నన్ను నేనుగా మెరుగుపరుచుకోవడానికి చేసిన ప్రయత్నం ఎప్పుడూ నాకు మంచి ఫలితాలను ఇస్తూ వచ్చింది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరింతగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను’ అంటూ వివరించారు పద్మాసని. – నిర్మలారెడ్డి -
ఓటు వేసేందుకు వచ్చి మృత్యువాత
‘అర్ధరాత్రి.. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్క సారిగా దఢేల్ మని పే..ద్ద శబ్ధం.. కళ్లు తెరిచి చూసేలోగా మంటలు.. నిప్పు రవ్వలు మీద పడి అంటుకుంటున్న దుస్తులు.. కేకలు, అరుపులు.. కాపాడండని ఆర్తనాదాలు.. కిటికీ అద్దాలు పగులగొట్టి కొందరు.. డోర్ తెరుచుకుని మరికొందరు బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోగా.. ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు అక్కడికక్కడే క్షణాల్లో కాలి బూడిదయ్యారు.. అంతా కలలోలాగా జరిగింది. నిజంగా కల అయితే బాగుండు’ అని ఆ ప్రమాదం నుంచి బయట పడిన వారుఅంటున్నారు. వారింకా షాక్ నుంచి తేరుకోలేదు.చినగంజాం/చిలకలూరిపేట : ప్రైవేట్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఓటు వేసేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న చినగంజాం, చీరాల వాసులు నలుగురు, రెండు వాహనాల డ్రైవర్లు మృత్యువాత పడ్డారు. మరో మహిళ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇంకో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓటేసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో ఉంటున్న చాలా మందికి పర్చూరు నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయి. దీంతో పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి, ఆదివారం రాత్రి వారిని పర్చూరుకు తరలించారు. ఇందులో భాగంగా చినగంజాంకు చెందిన ఓటర్లు సైతం హైదరాబాద్ నుంచి వచ్చారు. వీరంతా సోమవారం ఓట్లు వేసి, మంగళవారం రాత్రి ఏలూరు సాంబశివరావు ఏర్పాటు చేసిన బస్సుల్లో హైదరాబాద్కు తిరిగి పయనమయ్యారు. చినగంజాంకు చెందిన 42 మంది చీరాలకు చెందిన ట్రావెల్స్ బస్సు (ఏపీ 27 టీటీ 6577)లో రాత్రి 11 గంటలకు బయలు దేరారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ బస్సు.. పల్నాడు జిల్లా ఈవూరుపాలెం వద్ద ఎదురుగా కంకర మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ (ఆర్జే 23 జీసీ 2452)ను ఆయిల్ ట్యాంక్ వద్ద బలంగా ఢీకొట్టింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అటు టిప్పర్, ఇటు బస్సుకు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా బస్సులో బ్యాటరీ ఫెయిల్ అవడంతో చీకటి అలముకొంది. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు తప్పించుకొని వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో బస్సు డోర్ వద్ద ఉన్న చినగంజాంకు చెందిన యువకుడు సింగోతు సాయి కేకలు వేస్తూ ప్రయాణికులను నిద్ర లేపాడు. చాలా మంది ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ డోర్ ద్వారా బయటకు రాగా, మరికొంత మంది కిటికీ అద్దాలను పగులగొట్టి, అత్యవసర ద్వారాన్ని తెరచుకొని బయటకు దూకేశారు. అప్పటికే మంటలు అంటుకొని కొందరు ప్రయాణికులు హృదయ విదారకంగా కేకలు పెట్టారు. ఈ లోగా మంటలు భారీగా చెలరేగి బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రయాణికులు నలుగురు బస్సులోనే కాలి బూడిదయ్యారు. ఒకే కుటుంబంలో ముగ్గురు..ఉప్పుగుండూరి కాశీ బ్రహ్మేశ్వరరావు, అతని భార్య లక్ష్మీ బస్సు వెనుక భాగంలో కూర్చొన్నారు. వీరు వృద్ధులు కావడంతో త్వరగా బయట పడలేకపోయారు. పైగా మనవరాలు ఖ్యాతి సాయి నిద్రలో ఉండటంతో ఆ పాపను లేపి.. బయటకు రాలేకపోయారు. అంతలోనే మంటలు చుట్టు ముట్టడంతో తప్పించుకోలేని స్థితిలో ఆహుతై ప్రాణాలు విడిచారు. వృద్ధ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి భావన హైదరాబాద్లో, చిన్నమ్మాయి పూజ ఒంగోలులో ఉంటున్నారు. ఓటు వేసేందుకని పెద్ద కుమార్తెతో కలిసి నీలాయపాలెం వచ్చారు. అనంతరం ఒంగోలుకు వెళ్లి చిన్న కుమార్తె కూతురు ఖ్యాతి సాయిని వెంట తీసుకుని చినగంజాం నుంచి టీడీపీ వారు ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్ బయలు దేరారు. పిల్లల చదువుల నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్న దావులూరి శ్రీను కూడా ఓటు వేసేందుకే వచ్చారు. 20 మంది క్షతగాత్రులు చినగంజాం వాసులేదుర్ఘటనలో గాయపడిన 30 మందిని చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాలకు చెందిన 108 వాహనాల ద్వారా చిలకలూరిపేట ఏరియా ఆçస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం ఎన్.కీర్తి, కె.వెంకటరావు, సీహెచ్.శంకర్రావు, ఎన్.రాజ్యలక్ష్మి, ఎస్.కళావతి, డి.భువన, సీహెచ్.ఆదిలక్ష్మి, పి.లక్ష్మి, కె.లిప్సికను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. మరో 20 మందికి ప్రా«థమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. క్షతగాత్రుల్లో 20 మందికి పైగా చినగంజాం మండల వాసులే. మృతి చెందిన పాప పెద్దమ్మ భావన తన వారిని రక్షించుకునే క్రమంలో తీవ్ర గాయాలపాలైంది. శరీరం బాగా కాలిపోవడంతో గుంటూరులో చికిత్స పొందుతోంది. కడవకుదురుకు చెందిన తాటి రాజీ (సాఫ్ట్వేర్), గొల్లపూడి ఉదయభాను(సాఫ్ట్వేర్), చినగంజాంకు చెందిన తాటి సాయిలక్ష్మి (సాఫ్ట్వేర్), మమత (కోచింగ్), అడివీధిపాలెంకు చెందిన రాయని బాలాజీ (ఫొటోగ్రాఫర్), పెదసింగు నాగరాజు, పెదసింగు తిరుపతమ్మ, పెదసింగు నాగరాజు కుమారుడు ఈశ్వరసాయి, కుమార్తె జస్వంతి, బొమ్మిడి మాలతి, గొనసపూడికి చెందిన కందిమళ్ల తేజీ, యలమల ఆకాష్, నీలాయపాలెంకు చెందిన దంపతులు అంజిబాబు, సామినేని సింధూజ, చినగంజాం అంబేడ్కర్ నగర్కు చెందిన బొలిమెర సుధాకర్, మేడికొండ చినఅంకయ్య, అతని భార్య సౌజన్య, కుమార్తె అక్షయ, బడుగు సంజన తదితరులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మృతుల వివరాలివీ..ఈ దుర్ఘటనలో చీరాలలోని పేరాలకు చెందిన బస్సు డ్రైవర్ షేక్ మస్తాన్ షరీఫ్ (47), టిప్పర్ డ్రైవర్ మధ్యప్రదేశ్కు చెందిన హరిసింగ్ (39), బస్సులో ప్రయాణిస్తున్న చినగంజాం మండలం నీలాయపాలెం గ్రామానికి చెందిన దంపతులు ఉప్పుగుండూరు కాశీబ్రహ్మేశ్వరరావు (65), ఉప్పుగుండూరు లక్ష్మీ(55), వీరి మనవరాలు ఒంగోలు పట్టణానికి చెందిన బొప్పిరాజు ఖ్యాతి సాయి (9), చినగంజాం మండలం గోనెపూడి గ్రామానికి చెందిన దావులూరి శ్రీనివాసరావు (54) సజీవ దహనమయ్యారు. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయి. ప్రమాదం జరిగిందిలా..చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం డొంక సమీపానికి బస్సు రాగానే, అదే సమయంలో పసుమర్రు వైపు నుంచి గ్రావెల్తో కూడిన టిప్పర్ ( చీరాల వైపు వెళుతూ) ఎదురుగా వస్తోంది. ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో రోడ్డు మార్జిన్ కనిపించక వేగంగా వస్తున్న బస్సు అదుపు తప్పి టిప్పర్ను ఢీకొంది. టిప్పర్ డ్రైవర్ రోడ్డు మార్జిన్ దిగినప్పటికీ, బస్సు వేగంగా వెళ్లి టిప్పర్ లారీకి ఉన్న డీజిల్ ట్యాంకును ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో రూరల్ సీఐ పి.శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ జి.రవికృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా∙స్థలం వద్దే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి : పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు సీఎం జగన్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి రజినిరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, పోలీస్ ఏడీజీ శంఖబ్రత బాగ్చి, గుంటూరు ఎస్పీ తుషార్ డూడి, నరసరావుపేట డీఎస్పీ వర్మ, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబీకులను పరామర్శించి ప్రభుత్వం నుంచి తగు సహాయం అందేలా చూస్తామని మంత్రి రజిని హామీ ఇచ్చారు. ప్రమాద ఘటనపై నరసరావుపేట డీఎస్పీ వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ.. బస్సు అతివేగమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా భావిస్తున్నట్లు తెలిపారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్ ద్వారా శాంపిల్స్ సేకరిస్తున్నామని, డ్రైవర్లు మద్యం సేవించారా లేదా అనే విషయం ల్యాబ్ రిపోర్టుల తర్వాత తెలుస్తుందని చెప్పారు. చిట్టితల్లికి అప్పుడే నూరేళ్లు నిండాయిఒంగోలు టౌన్: ఒంగోలులోని సత్యనారాయణపురంలో ఉంటున్న సుబ్బారావు, పూజ దంపతుల గారాల పట్టి, ఏకైక పుత్రిక ఖ్యాతి సాయి. పెద్దయ్యాక పెద్ద డాక్టరై మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఆ పాపకు ఖ్యాతి అని పేరు పెట్టుకున్నారు. ప్రాణంగా పెంచుకున్నారు. చిట్టి తల్లిని చూసి మురిసిపోయారు. స్కూలులో మీ పాపే ఫస్ట్ అని టీచర్లు చెప్పిన మాటలు విని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. పాపకు మంచి చదువులు చదివించుకోవచ్చని దర్శి మండలం వీరాయపాలెం నుంచి ఒంగోలుకు వచ్చి ఉంటున్నారు. నగరంలోని లంబాడిడొంకలో ఒక స్కానింగ్ సెంటర్లో సుబ్బారావు పీఆర్ఓగా, పూజ రిసెప్షనిస్టుగా పని చేస్తున్నారు. ఇద్దరి సంపాదనతో ఖ్యాతిని బాగా చదివించుకోవాలని కలలు కన్నారు. అయితే విధి వక్రీకరించింది. కన్నకూతురు కాలి బూడిదైందన్న వార్త విన్న ఆ దంపతుల గుండె పగిలిపోయింది. గుండెలవిసేలా రోధించారు. స్కూలుకు సెలవులు కావడంతో అవ్వా తాతల వెంట హైదరాబాద్కు పంపారు. ఖ్యాతి ఇక లేదన్న వార్త విని చుట్టుపక్కల వారంతా కంట నీరు పెట్టుకున్నారు. పాప తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. -
మే 17 నుంచి సినిమా థియేటర్లు మూసివేత
కరోనా తర్వాత మళ్లీ సినిమా థియేటర్లు మూత పడనున్నాయి. దీంతో సినిమా అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే, ఈసారి కరోనా వల్ల థియేటర్లు మూత పడటం లేదు. కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో ఇలాంటి సమస్య వచ్చింది. థియేటర్ యజమానులకు సమ్మర్లో ఇలాంటి ఇబ్బందులు రావడంతో కాస్త నిరుత్సాహానికి గురౌతున్నారు.వేసవి శెలవులలో లెక్కలేనన్ని సినిమాలు విడుదల అవుతాయి. ప్రేక్షకులతో థియేటర్స్ అన్నీ నిండిపోతాయి.. కానీ ఈ ఏడాదిలో అలాంటి సందడి లేకపోవడంతో హైదరాబాద్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ మే 17 నుంచి పదిరోజులపాటు మూసివేయనున్నారు. సినిమాలు విడుదల లేకపోవడంతో థియేటర్లు నడపడం భారం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. కనీసం విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది.థియేటర్స్ బంద్పై ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రియాక్షన్తెలంగాణలో థియేటర్స్ బంద్పై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి స్పందించారు. థియేటర్స్ బంద్ కావడానికి కారణం చిన్న సినిమాలకు కలెక్షన్స్ లేకపోచడం పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడమని ఆయన అన్నారు. ప్రతి రోజు థియటర్స్ ఖర్చులు భరించలేకే తాత్కాలికంగా సింగిల్ థియేటర్స్ మూసివేయాల్సి వచ్చిందన్నారు. కేవలం ఖర్చులు భరించలేకే బంద్ చేయాల్సి వచ్చింది. కానీ, మరే ఇతర కారణాలు ఏమి లేవన్నారు. నిర్మాతలు ముందుకు వచ్చి మెయింటెనెన్స్ భరిస్తామని చెబితే థియేటర్స్ ఓపెన్ చేస్తామని విజయేందర్ రెడ్డి అన్నారు. -
Hyderabad: కాస్త పెరిగినా చివరి స్థానమే..
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ విషయంలో గ్రేటర్ జిల్లాల్లో మార్పు రావడం లేదు. గతంలో మాదిరిగానే హైదరాబాద్ జిల్లాకు అత్యల్ప పోలింగ్ నమోదై చివరి స్థానం దక్కింది. గత లోక్సభ ఎన్నికల పోలింగ్తో పోలిస్తే దాదాపు మూడు శాతం పెరిగినా..రాష్ట్రంలోనే అత్యల్ప పోలింగ్ మాత్రం ఇక్కడే నమోదైంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 48.48 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంమీద 22,17,094 ఓట్లకు గాను 10,74,827 ఓట్లు పోలయ్యాయి. గోషామహల్ సెగ్మెంట్లో 54.72 శాతం, కార్వాన్లో 51.23, బహదూర్పురాలో 50.07, చాంద్రాయణగుట్టలో 49.15, చారి్మనార్ 48.53, యాకుత్పురాలో 43.34, మలక్పేటలో 42.76 శాతం పోలయ్యాయి. సికింద్రాబాద్లో 49.04%సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో 49.04 శాతం పోలింగ్ నమోదైంది. గత లోకసభ ఎన్నికలతో పోలిస్తే ఒక శాతం పోలింగ్ పెరిగినా, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల కంటే ఒక శాతం తగ్గినట్లయింది. సెగ్మెంట్ల వారిగా పరిశీలిస్తే ముషీరాబాద్లో 49.09 శాతం, అంబర్పేటలో 51.65, ఖైరతాబాద్లో 50.28, జూబ్లీహిల్స్లో 45.59, సనత్నగర్లో 49.45, నాంపల్లిలో 46.59, సికింద్రాబాద్లో 52.28 శాతం పోలింగ్ నమోదైంది. చేవెళ్లలో 56.50% చేవెళ్ల లోక్ సభ పరిధిలో 56.50 శాతం పోలింగ్ నమోదైంది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చితే 0.31 పెరిగినా..ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే పది శాతం తగ్గింది. మొత్తం మీద 29,38,870 ఓటర్లకు గాను 16,57,107 మంది ఓటేశారు. సెగ్మెంట్ల వారిగా చేవెళ్లలో 71.83 శాతం, వికారాబాద్లో 70.44 శాతం, తాండూర్లో 67.33 శాతం. పరిగిలో 67.01 శాతం, రాజేంద్రనగర్లో 54.12 శాతం, మహేశ్వరంలో 52.71 శాతం, శేరిలింగంపల్లిలో 54.12 శాతం పోలింగ్ నమోదైంది. మల్కాజిగిరిలో 50.78% మల్కాజిగిరి పరిధిలో పోలింగ్ 50.78 శాతం నమోదైంది. అసెంబ్లీ వారిగా పోలింగ్ శాతం పరిశీలిస్తే మేడ్చల్లో 57.83 శాతం, మల్కాజిగిరిలో 51.97, కుత్బుల్లాపూర్లో 50.19, కూకట్పల్లిలో 48.48, ఉప్పల్లో 48.45, ఎల్బీనగర్లో 46.27, కంటోన్మెంట్–సికింద్రాబాద్లో 51.61 శాతం పోలింగ్ నమోదైంది. -
Bengal Tiger: అభిమన్యు వెళ్లిపోయాడు
బహదూర్పురా: నెహ్రూ జూ పార్క్లో అభిమన్యు అనే 8 ఏళ్ల తెల్లపులి కిడ్నీ సంబంధిత వ్యాధితో మంగళవారం మృతి చెందింది. నెహ్రూ జులాజికల్ పార్క్లో 2016 సంవత్సరం మే నెలలో బద్రి, సమీరాలకు రెండు తెల్లపులి కూనలు జని్మంచాయి. అందులో ఒకటైన అభిమన్యు జూలోనే పెరిగింది. ఇది మృతి చెందడంతో అధికారులు వీబీఆర్ఐ, లాంకోన్స్తో పాటు ఇతర విభాగాల శాస్త్రవేత్తలు, డాక్టర్లు జూలోనే పోస్టుమార్టం నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా నెహ్రూ జులాజికల్ పార్కులో కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో పులులు, సింహాలు, చిరుత పులులు మృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. -
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
హైదరాబాద్, మే 14, 2024: యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు సుమారు నెల రోజుల క్రితం ఓ పెళ్లిలో మటన్ తింటూ, పళ్లు లేకపోవడంతో పొరపాటున ఓ ఎముక మింగేశారు. ఆహారనాళంలో ఇరుక్కుపోయిన ఆ ఎముక.. లోపల రంధ్రం చేసి, తీవ్ర ఇన్ఫెక్షన్కు కారణమైంది. ఎదభాగం మధ్యలో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆ వృద్ధుడు.. ఎట్టకేలకు ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి వచ్చారు.తొలుత నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎండోస్కొపీ చేసి ఎముక ఉందన్న విషయాన్ని గుర్తించి, ఎల్బీనగర్ ఆస్పత్రికి పంపారు. ఇక్కడ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రాధిక నిట్టల నేతృత్వంలోని వైద్యబృందం ఆయనను క్షుణ్నంగా పరిశీలించి, తగిన పరీక్షలు కూడా చేసి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎండోస్కొపిక్ ప్రొసీజర్తోనే ఎముకను అత్యంత జాగ్రత్తగా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డాక్టర్ రాధిక తెలిపారు.యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేన్ గ్రామానికి చెందిన 66 ఏళ్ల శ్రీరాములుకు దవడ పళ్లు లేవు. దానివల్ల నమలలేరు. కానీ ఒక పెళ్లికి వెళ్లి, అక్కడ మటన్ ఉండటంతో తినాలనుకున్నారు. పళ్లు లేకపోవడం వల్ల నమలకుండా నేరుగా మింగేశారు. అలా మింగినప్పుడు దాదాపు 3.5 సెంటీమీటర్ల పొడవున్న ఒక ఎముక ముక్క కూడా లోపలకు వెళ్లిపోయింది. వెళ్లిన విషయం కూడా తొలుత ఆయనకు తెలియలేదు. రెండు మూడు రోజుల తర్వాత ఛాతీలో నొప్పి అనిపించింది. స్థానికంగా వైద్యులకు చూపిస్తే అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుని మందులు ఇచ్చారు. కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. దాంతో తర్వాత నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఎండోస్కొపీ చేసి చూసి, లోపల ఎముక ఇరుక్కుందన్న విషయం చెప్పారు. అక్కడినుంచి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి పంపారు.సాధారణంగా ఇలా ఇరుక్కున్న ఎముకలను ఎవరైనా తీసేస్తారు. కానీ, నెల రోజులుగా అది ఇరుక్కుపోవడం వల్ల ఆహారనాళానికి రంధ్రం చేసిసింది. ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ఏర్పడి, పుండ్లు కూడా పడ్డాయి. కొంత చీము చేరింది. దానికితోడు ఇదంతా గుండెకు బాగా దగ్గరగా ఉంది. అలాంటప్పుడు తీసే సమయంలో ఏమాత్రం కొంత అటూ ఇటూ అయినా ఆహారనాళానికి పూర్తిగా రంధ్రం పడిపోయి, అది గుండెకు కూడా ప్రమాదకరంగా మారుతుంది. దీన్ని అత్యంత జాగ్రత్తగా ఎండోస్కొపీ ప్రొసీజర్లోనే తొలగించాం. లేనిపక్షంలో అక్కడ పెర్ఫొరేషన్ లాంటి మరిన్ని సమస్యలు వచ్చేవి.ఈ ప్రక్రియ చేసిన తర్వాత కూడా ఆయనకు చాలా జాగ్రత్తలు చెప్పాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో అన్నం తింటే ఆ మెతుకులు మళ్లీ ఇన్ఫెక్షన్ అయిన పుండ్ల వద్దకు చేరి, అక్కడ ఆగిపోయి మళ్లీ ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. అందుకే ఆయనకు కొంతకాలం పూర్తిగా ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పాం. కొబ్బరినీళ్లు, మంచినీళ్ల లాంటివి తీసుకోవాలన్నాం. ఇప్పుడు ఎముక వల్ల వచ్చిన నొప్పి ఆయనకు పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడే కొద్దిగా జొన్న అన్నం, పెరుగు అన్నం తినగలుగుతున్నారు.ఏ వయసువారైనా తినేటప్పుడు బాగా నమిలి తినాలి. ఇక కాస్త పెద్దవయసు వచ్చి, పళ్లు ఊడిపోయిన తర్వాత అయితే ఏదైనా బాగా ఉడకబెట్టుకుని, మెత్తగా అయిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఎముకలను ఎవరైనా యథాతథంగా తినకూడదు. కానీ ఈ కేసులో ఆయనకు పళ్లు లేకపోవడంతో తెలియక, పొరపాటున మింగేశారు. అది సమయానికి తియ్యకపోతే ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. ఆహారనాళానికి రంధ్రం కూడా పెద్దది అయిపోతుంది. అప్పుడు తప్పనిసరిగా మేజర్ సర్జరీ చేయాలి. చీము పడుతుంది. ఇలా ఒక నెల రోజుల పాటు ఎముక లోపల ఉండిపోవడం ఎప్పుడూ చూడలేదు” అని డాక్టర్ రాధిక నిట్టల వివరించారు. -
ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంత ఊళ్లకు వెళ్లిన నగర వాసులు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతున్నది.చాలాచోట్ల కిలోమీటర్ల కొద్దీ వాహనాల బారులు కనిపించాయి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బీజేఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లలో రద్దీ నెలకొంది. హైదరాబాద్ శివారుకు చేరుకున్న ప్రజలు అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తుండడంతో మెట్రో రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి.మెట్రో ప్రాంగణాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ముఖ్యంగా విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఎల్బీనగర్ వద్ద దిగి మెట్రో ఎక్కేస్తుండడంతో ఎల్బీనగర్-మియాపూర్ రూట్ ఒక్కసారిగా రద్దీగా మారింది. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ లో టికెట్ల కోసం పెద్ద క్యూ ఉందిప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఉదయం అరగంట ముందే అంటే 5.30 గంటలకే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నేడు అదనపు ట్రిప్పులు నడిపాలని మెట్రో నిర్ణయించినట్టు తెలిసింది. -
మోకాలి గాయం వేధిస్తున్న.. ఓటేసిన కేకే
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు మోకాలి గాయం వేధిస్తున్న ఓటు హక్కు వినియోగించుకొని రాజ్యాంగ స్ఫూర్తిని చాటుకున్నారు రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు. కొద్దిరోజుల క్రితమే ఆయనకు మోకాలి ఆపరేషన్ జరిగింది. ఎన్నికల నాటికి ఆయన బయటికి వచ్చి ఓటు వేస్తారో వేయరు తెలియని పరిస్థితి నెలకొంది. కానీ ఆయన వీల్ చైర్ లో బంజారాహిల్స్ లోని పోలింగ్ కేంద్రానికి ఆయన కూతురు మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటింగ్ రోజున ఇచ్చే సెలవుని ఓటు హక్కు కోసం మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. -
నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
ఎన్టీఆర్, సాక్షి: సొంత ఊళ్లకు వెళ్లి ఓట్లేసిన ఏపీ ఓటర్లు.. తిరిగి తెలంగాణ బాట పట్టారు. దీంతో హైదరాబాద్ వచ్చే రహదారుల్లో వాహనాల రద్దీ నెలకొంది. సోమవారం సాయంత్రం ఉదయం నుంచే ఇది మొదలుకాగా.. మంగళవారం ఉదయానికి అది మరింతగా పెరిగింది.ఆంధ్రా నుంచి పెద్ద ఎత్తున్న ఓటర్లు తిరిగి తెలంగాణకు వస్తున్నారు. కార్లు, బస్సులు.. ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్కు బయల్దేరారు. పతంగి టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చినట్లు ఒక అంచనా. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్గేట్ వద్ద సాధారణంగా 24 గంటల వ్యవధిలో 20 వేలకు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తుంటాయి. అయితే.. సోమవారం మాత్రం సాయంత్రం 6.30 గంటలకు వీటి సంఖ్య 35 వేలకు పైగా చేరింది. ఈ ఉదయం ఆ రద్దీ అంతకంతకు పెరుగుతోంది.ఇక.. ఏపీలో పోలింగ్ కోసం ఓటర్లు పోటెత్తారు. సోమవారం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఓటేశారు. సాయంత్రం సైతం క్యూ లైన్లలో చాలామంది వేచి ఉండడం గమనార్హం. ఏపీలో భారీగా పోలింగ్ జరిగిందని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించగా, కడపటి వార్తలు అందేసరికి అది 78.36 శాతంగా నమోదు అయినట్లు తెలుస్తోంది. పోలింగ్ శాతం ఇంకా ఎక్కువే నమోదు కావొచ్చని సీఈవో ఎంకే మీనా ఆశాభావం వ్యక్తం చేశారు. -
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: పోలింగ్ ముగిసే సమయంలో పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్ ఒవైసీ, మాధవీలతలు పోలింగ్ కేంద్రాల పరిశీలనకు ఒకే రూట్లో రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అదే సమయంలో మాధవీలతను పాతబస్తీ వాసులు కొందరు అడ్డుకున్నారు. మాధవీలతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుల్ని అక్కడి నుంచి పంపించేశారు. -
బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదైంది. పోలింగ్ బూత్లో ముస్లిం మహిళల హిజాబ్ తొలగించి.. అనుచితంగా వ్యవహరించారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి.#WATCH | Telangana: BJP candidate from Hyderabad Lok Sabha constituency, Madhavi Latha visits a polling booth in the constituency. Voting for the fourth phase of #LokSabhaElections2024 is underway. pic.twitter.com/BlsQXRn80C— ANI (@ANI) May 13, 2024 దీంతో జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాల మేరకు మలక్పేట్ పోలీసులు ఆమెపై నమోదు చేసినట్లు తెలిపారు. 171c, 186, 505(1)(c)ఐపిసి, అండ్ సెక్షన్ 132 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైంది. -
ఓటు హక్కు వినియోగించుకున్న అసదుద్దీన్ ఒవైసీ
-
తెలంగాణలో పోలింగ్ టైం.. ఓటు వేసిన సినీ ప్రముఖలు
-
శిల్పా రవికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుంది: అల్లు అర్జున్
-
Hyderabad: వీరు తమ ఓటు తాము వేసుకోలేరు
హైదరాబాద్: గ్రేటర్పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పారీ్టల అభ్యర్థుల్లో కొందరు తమ ఓటును తమకు వేసుకోలేని పరిస్థితి ఉంది. హైదరాబాద్ ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీ¯న్ ఒవైసీ రాజేంద్రనగర్ పరిధిలోని శా్రస్తిపురంలో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కిందకు వస్తుంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత నివాసం ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్రహిల్స్లో ఉంది. ఈ ప్రాంతం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ నివాసం జూబ్లీహిల్స్లో ఉంది. అది సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తోంది. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్లో నివాసం ఉంటున్నారు. అది మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్రెడ్డికి తాండూరులో ఓటుంది. ఆ ప్రాంతం చేవేళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. వీరందరూ తమ ఓటును తాము వేసుకోకుండా ఇతరులకు వేయాల్సిన పరిస్థితి ఉంది. -
జస్ట్ రిలాక్స్.. ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్
సాక్షి, హైదారాబాద్: తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారం నిన్నటి(శనివారం)తో ముగిసింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీబీజీగా గడిపిన నేతలు రిలాక్స్ అవుతున్నారు. రేపు పోలింగ్ జరనుండటంతో ప్రచారం మూడ్ నుంచి నేతలు నెమ్మదిగా బయటకు వచ్చి సేదతీరుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ఉదయం సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి రిలాక్స్ అయ్యారు. అక్కడి విద్యార్థులుతో కాసేపు.. ఫుట్బాల్ ఆడుతూ సరదగా సేదతీరారు. ఇక రేపు (సోమవారం) లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక.. ఇటీవల రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేయాలని అతని తల్లి సీఎం రేవంత్ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమెకు సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. మరోవైపు.. ఈ రోహిత్ వేముల కేసును మళ్లీ ఓపెన్ చేస్తామని హైదరాబాద్ సీసీ కొత్త శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.#Telangana Chief Minister @revanth_anumula visits @HydUniv on Sunday morning engaging in a game of football with the students.This comes after his government followed recent developments in the 2016 Dalit scholar #RohithVemula's suicide case. The police had filed a Closure… pic.twitter.com/Q48PfDbXE6— South First (@TheSouthfirst) May 12, 2024వీడియో క్రెడిట్స్: South First@TheSouthfirst -
హైదరాబాద్: వైన్ షాపులు ‘బంద్’.. బారులు తీరిన మద్యం ప్రియులు (ఫొటోలు)
-
Mothers Day 2024: ఐవీఎఫ్ అద్భుతాలెన్నో...70 ఏళ్ల వయసులోనూ గర్భధారణ
గత ఫిబ్రవరి నెలలో హైదరాబాద్కి చెందిన ఎర్రమట్టి మంగమ్మ అనే 73 ఏళ్ల వృద్ధురాలు ఐవీఎఫ్ ద్వారా గర్భాన్ని ధరించడం రికార్డ్గా నిలిచింది. చట్టపరమైన నిబంధనలకు విరుద్ధం అంటూ దీనిపై వాదోపవాదాలు ఎలా ఉన్నప్పటికీ ఆకాశమే హద్దుగా నిలుస్తున్న ఐవీఎఫ్ చికిత్స సామర్ద్యానికి ఇది అద్దం పడుతుందనేది వాస్తవం. సంతానలేమి సమస్యతో పోరాడుతున్న ఆధునిక మహిళకు ఇన్–విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్)అమ్మ కావాలనే కలను సాకారం చేయడంతో పాటు వయసుకు సంబంధించిన అడ్డంకులు కూడా తొలగిస్తోంది. ప్రీ ఇంప్లాంటేషన్ ద్వారా జన్యు పరీక్షలు వంశపారంపర్య వ్యాధులకు అడ్డుకట్ట వేయడం వంటి మరికొన్ని అదనపు ప్రయోజనాలను జత చేసుకుంటూ ఐవీఎఫ్ అంతకంతకూ మహిళలకు చేరువవుతోందని అంటున్నారు ఫెర్టీ9ఫెర్టిలిటీ సెంటర్ కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.వయస్సు నుంచి ఒత్తిడి దాకా...కెరీర్ వేటలో లేటు పెళ్లిళ్లు, గర్భధారణ వాయిదాలు...నగర మహిళకు తప్పనిసరిగా కాగా మధ్య వయసులో గర్భదారణ యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. అత్యధిక శాతం ఆధునిక మహిళలు 30ఏళ్ల వయసు తర్వాత మాత్రమే పిల్లల గురించి ఆలోచిస్తున్నారని, ఆలస్యంగా తల్లి కావడం ఒక నిబంధనలా మారిందని వెల్లడించింది. అదే విధంగా నగర జీవనంలో కాటేసే కాలుష్యం, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి వంటివన్నీ తల్లి కావాలనే ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ఈ నేపధ్యంలో వీటన్నింటికీ పరిష్కారంగా మారింది ఐవీఎఫ్..పెద్ద వయసులోనూ పిల్లలకు అవకాశం..డబ్లు్యహెచ్ నివేదిక ప్రకారం 17.5% మంది వయోజనులను ప్రభావితం చేసే వంధ్యత్వాన్ని గుర్తించడం ద్వారా, ఐవీఎఫ్ మహిళల సంతానోత్పత్తి అవకాశాలపై మరింత అవగాహనను అందిస్తుంది.ఒంటరులకు...లివ్ ఇన్ కాపురాలకూ..మాతృత్వం పొందే విషయంలో సాంఘిక నిబంధనలతో పాటు అనేక రకాల పరిమితులు అడ్డంకులుగా మారుతున్నాయి. కారణాలేమైనప్పటికీ నగరంలో నివసించే ఒంటరి జీవుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాగే పెళ్లి కాకుండా కలిసి జీవిస్తున్న జంటలూ, స్వలింగ దాంపత్యాలు సైతం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ సంతానకాంక్షను తీరుస్తోంది ఐవీఎఫ్. ఐవీఎఫ్ ద్వారా ప్రీ ఇంప్లాంటేషన్, జన్యు పరీక్ష వంటివి కూడా సాధ్యపడుతుండడంతో మహిళలు వారి పునరుత్పత్తి భవిష్యత్తు గురించి సమాచారం పొందగలుగుతున్నారు. దీని ద్వారా ఎవరైనా సరే ఇంప్లాంటేషన్కు ముందు జన్యుపరమైన అపసవ్యతలకు సంబంధించి పిండాలను పరీక్షించవచ్చు, భవిష్యత్ తరాలకు వంశపారంపర్య వ్యాధులను చేర వేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. జన్యువులపై ఈ స్థాయి నియంత్రణ ద్వారా మహిళలు వారి కుటుంబాల కోసం వారి విలువలు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఐవీఎఫ్ సహకరిస్తుంది.ఐవీఎఫ్...అడ్డంకులకు పరిష్కారం..సంతానలేమి సమస్యకు పరిష్కారంగా అందుబాటులోకి వచ్చిన ఐవీఎఫ్ ఇప్పుడు సంతానలేమికి కారణమయ్యే అడ్డంకులను అధిగమించడానికి కూడా సహకరిస్తోంది. జన్యుపరీక్షలతో వంశపారంపర్య వ్యాధులకు చెక్ పెట్టే అవకాశం.. వైవిధ్యభరిత మాతృత్వాలు వంటివి ఐవీఎఫ్ ద్వారా సాధ్యమవుతున్నాయి.– డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.సీనియర్ కన్సల్టెంట్, ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ -
తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ.. సొంతూళ్లకు ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ మొదలైంది. ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. హైదరాబాద్ నుంచి ఆంధ్రా ఓటర్లు భారీగా తరలివెళ్తున్నారు. చౌటుప్పల్ పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. ఎల్లుండి పోలింగ్ సందర్భంగా సొంతూళ్లకు ఓటర్లు పయనమవడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది.పోలింగ్కు కేవలం రెండు రోజులే మిగిలి ఉండటంతో శనివారం వేకువజాము నుంచే హైవేపై భారీ రద్దీ నెలకొంది. ఆయా వాహనాలు విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డుపైకి చేరుకోవడంతో పలుచోట్ల నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీకి 508 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. బెంగుళూరు నుంచి ఏపీకి 592 స్పెషల్ సర్వీసులు నడుపుతోంది. సాధారణ ఛార్జీలతోనే స్పెషల్ బస్సులు నడపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ వెల్లడించారు. -
HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగకు సమయం సమీపించింది. మే 13న జరిగే ఏపీ అసెంబ్లీ, లోక్సభ, తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్ నగర వాసులు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్లో స్థిరపడిన వారంతా స్వస్థలాలకు తరలి వెళ్లడంతో శనివారం ఉదయం నుంచే రోడ్లన్నీ రద్దీగా మారాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో(శనివారం, ఆదివారం సోమవారం పోలింగ్) ఊర్లకు వెళ్లేవారితో పలు టోల్గేట్ల వద్ద ట్రాఫిక్జామ్ ఏర్పడుతోంది.హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్న వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి చేరుకోవడంతో హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ శివారు హయత్నగర్ నుంచి అబ్దుల్లాపూర్మెట్ వరకు ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. చౌటుప్పల్, పంతంగి టోల్ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. మరోవైపు నల్లగొండ జిల్లా కొర్లపాడు టోల్ గేట్ వద్ద వాహనాలు బారులుతీరాయి. ఎన్టీఆర్ జిల్లాజగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద పెరిగిన వాహనాల రద్దీ.ఏపీలో ఎన్నికల సందర్భంగా తెలంగాణ నుండి ఆంధ్రకు భారీగా తరలిస్తున్న ఓటర్లు.వాహనాల రద్దీతో పెంచిన కౌంటర్లు.పంతంగి టోల్గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.హైదరాబాద్ నుంచి భారీగా తరలి వెళ్తున్న ఆంధ్ర ఓటర్లు.పంతంగి నుంచి చౌటుప్పల్ హయత్ నగర్ వరకు భారీగా వాహనాలు.ఉదయం నుంచి గంటలకు నిలిచిపోయిన వాహనాలు.నిన్న రాత్రి నుంచి కొనసాగుతున్న వాహనాల రద్దీ.హైదరాబాద్లో స్థిర పడ్డ ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి..పోలింగ్కు ముందే తమ గ్రామాలకు చేరుకునేలా హైదరాబాద్ నుంిచి పయనం. ప్రయాణీకుల రద్దీతో బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట లాడుతున్నాయి.రైలు టిక్కెట్లు కొన్నప్పటికీ రైలు ఫుల్ కావడంతో బస్సులలో వెళ్లడానికి ఆరంఘర్ చౌరస్తాకు చేరుకుంటున్న ప్రయాణీకులు.సంక్రాంతి, దసరాకు కనిపించినంత రద్దీ కనబడుతుంది.గత నెల రోజుల క్రితమే రైళ్లు, బస్సుల రిజిస్ట్రేషన్ చేసుకున్న ఓటర్లు. -
Akshaya Tritiya: అక్షయ తృతీయ.. గోల్డ్ షాపుల్లో రద్దీ (ఫొటోలు)
-
గుడ్ బ్యాడ్ సెట్లో...
అజిత్ కుమార్ హీరోగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా షురూ అయింది. ఈ చిత్రానికి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ తెలుగు–తమిళ భాషల్లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అజిత్ కుమార్తో తమ కొత్తప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ ఇటివల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం హైదరాబాద్లోని ఓ స్టూడియోలోప్రారంభమైంది.ఈ కీలక షెడ్యూల్ కోసం ఓ సెట్ని తీర్చిదిద్దారు. అజిత్తో పాటు కీలక పాత్రధారులు ఈ షూట్లో పాల్గొంటున్నారు. ‘‘ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ప్రాజెక్ట్లలో ఒకటిగా రూపొందుతున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అభినందన్ రామానుజం.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్న్యూస్..
ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల విధ్వంసం
తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
ఉప్పల్ స్టేడియంలో ఫుల్ జోష్లో SRH, GT ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
టీడీపీ గూండాగిరికి పోలీసుల వత్తాసు
ఏపీలో ఎందుకిలా ?..రాష్ట్రం రావణకాష్టంగా మారటానికి అసలు కారణం
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రేసులో టాలీవుడ్ హీరో
AP: కాసేపట్లో ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభం
‘హలో అప్పారావ్.. ఏంటి పరిస్థితి!’
తిరుపతి గంగమ్మ జాతర తొలి రోజు బైరాగి వేషంతో భక్తుల సందడి (ఫొటోలు)
తప్పక చదవండి
- తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
- టీవీ సీరియల్ మేకప్మెన్ దారుణ హత్య
- కాకిస్నూరు.. ఓటింగ్లో సూపర్..
- వెల్లివిరిసిన మహిళా చైతన్యం
- ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
- విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
- వైఎస్సార్సీపీ ఏజెంట్పై టీడీపీ మూకల హత్యాయత్నం
- తిరుపతిలో 144 సెక్షన్ కొనసాగింపు
- USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
- సెన్స్క్స్ డౌట్!
Advertisement