అధిక వడ్డీ ఆశచూపి..రూ.12 కోట్లతో పరారీ | Criminal arrest in mahaboobnagar town | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 8 2015 8:07 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

వడ్డీ ఎంతయినా పర్వాలేదు.. నెలనెలా నిక్కచ్చిగా ఇస్తానన్నాడు. కొంతకాలం అలాగే చేశాడు. ఇంకేముంది అధిక వడ్డీ వస్తుంది కదా అని అతడికి వడ్డీకిచ్చిన వ్యక్తులు తమ బంధువులు, స్నేహితుల నుంచి కూడా అప్పులు ఇప్పించారు. తీరా రూ.12 కోట్ల దాకా పోగేసుకున్న ఓ వ్యక్తి అదను చూసి పరారయ్యాడు. దీంతో బాధితులు బోరుమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్‌లో నివాసం ఉండే రమేష్ నాలుగేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌లో మేధ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement