Krishna Reddy
-
వివేకా హత్య కేసులో కూటమి ప్రభుత్వ కుట్రలు
-
వివేకా కేసులో పోలీసుల స్టేట్మెంట్పై అనుమానముంది: కృష్ణారెడ్డి
సాక్షి, వైఎస్సార్: వివేకా హత్య కేసులో కూటమి ప్రభుత్వ కుట్రను ఆయన పీఏ కృష్ణారెడ్డి బయటపెట్టారు. కేసును తిరగతోడి ఇప్పుడు తన ఇంటికి వచ్చి పోలీసులు మళ్లీ విచారించినట్టు చెప్పారు. అయితే, ఈ కేసులో తాను గతంలో చెప్పిందే ఇప్పుడు కూడా చెప్పినట్టు ఆయన తెలిపారు. కానీ, వాళ్లు స్టేట్మెంట్ ఎలా రాసుకున్నారో అనే అనుమానం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా వివేకా పీఏ కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, ఏఎస్పీ రాంసింగ్ వారికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వమని గతంలో నన్ను ఇబ్బంది పెట్టారు. అప్పట్లో పోలీసు స్టేషన్లో, ఎస్పీ వద్ద వారి బెదిరింపులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో పులివెందుల కోర్టులో ప్రైవేటు కేసు వేశాను. కోర్టు ఆదేశాల మేరకు ఆనాడు కేసు కట్టారు.తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక కేసును తిరగతోడి నన్ను ఇంటికి వచ్చి విచారించారు. నేను గతంలో చెప్పినదే చెప్పా.. కానీ, వాళ్లు స్టేట్మెంట్ ఎలా రాసుకున్నారో అనే అనుమానం ఉంది. దీంతో ఇప్పటికి 10 సార్లు నా స్టేట్మెంట్ రికార్డ్ ఇవ్వమని డీఎస్పీని కోరినా స్పందన లేదు. నిన్న కోర్టులో నేను పెట్టింది తప్పుడు కేసు అని పిటిషన్ వేశారని తెలిసింది. దీంతో ఈరోజు కూడా నేను నా స్టేట్మెంట్ కాపీ కోసం డీఎస్పీ ఆఫీసుకు వచ్చాను. ఇప్పుడు కూడా డీఎస్పీ అందుబాటులో లేరు.నా స్టేట్మెంట్ నా చేతికి ఇస్తే వాళ్లు ఫాల్స్ కేసు అంటున్న అంశంపై స్పష్టత ఇస్తాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సునీత ఏం ప్రభావితం చేసిందో తెలియదు.. కేసును మళ్లీ విచారించారు. అప్పటికీ, ఇప్పటికీ నా స్టేట్మెంటులో ఎటువంటి మార్పు లేదు. కానీ, పోలీసులు దీన్ని ఫాల్స్ కేసు అని ఎలా చెప్పారో తేలాల్సి ఉంది. అందుకే నా స్టేట్మెంట్ ఎలా రికార్డ్ చేశారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. పోలీసులు మాత్రం ఇప్పటి వరకూ నా స్టేట్మెంట్ నాకు ఇవ్వడం లేదు’ అని చెప్పుకొచ్చారు. -
ఒక్కడిని చేసి వైఎస్సార్సీపీ నేతపై దాడి: Ramireddy Pratap Reddy
-
టెట్పై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి కోరారు. స్కూల్ అసిస్టెంట్ (2ఏ) ఇంగ్లిష్ సబ్జెక్టులో ఎలాంటి పొరపాట్లు జరగలేదని, ఈ పేపర్లో పార్ట్–2లో మాతృభాష ఎంపిక పైనా తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులో తలెత్తిన సమస్యను పరిష్కరించకపోవడంతో పరీక్ష సమయంలో మాతృభాష స్థానంలో ఇంగ్లిష్ మాత్రమే వచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.టెట్ ఎస్ఏ–2 ఇంగ్లిష్ పేపర్ రెండో సెక్షన్లో అభ్యర్థుల మాతృ భాషకు అనుగుణంగా తెలుగు, తమిళం, కన్నడ, ఒరియా తదితర భాషలు ఉంటాయని, అభ్యర్థి దరఖాస్తులో పేర్కొన్న భాషనే ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ ఇక్కడ మాతృభాషగా తెలుగు ఎంపిక చేసుకుంటే ఇంగ్లిష్ వచ్చిందన్న ప్రచారం జరుగుతోందని, వాస్తవానికి అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదులు కూడా అందలేదని తెలిపారు. టెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి అనుసరించిన విధానాలనే ఇప్పుడూ అనుసరించామని కృష్ణారెడ్డి వివరించారు. -
అడ్డంగా నరుకుతా.. రెచ్చిపోయిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
సాక్షి, నెల్లూరు జిల్లా: అడ్డంగా నరుకుతా అంటూ సొంత పార్టీ నేతలపైనే కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రెచ్చిపోయారు. వార్డు ఇంఛార్జ్ స్థాయికి కూడా పనికిరాని కొందరు తనపై లోకేష్కి ఫిర్యాదు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కావలి అడ్డాలో ఎక్కసెక్కాలు ఆడితే.. అడ్డంగా నరుకుతా అంటూ టీడీపీలోనే ప్రత్యర్థి వర్గానికి కావ్య వార్నింగ్ ఇచ్చేశారు. ఇటీవలే కావ్య కృష్ణారెడ్డిపై చంద్రబాబు, లోకేష్కు మాజీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయడు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: దురుద్దేశంతో మహాపచారంకాగా, ఇటీవల కావలి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే టపాసులు కాల్చిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దగదర్తి మండలంలో తన వర్గాన్ని కొందరు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని చంద్రబాబు,లోకేష్ వద్దే తేల్చుకుంటానని కార్యకర్తల సమావేశంలో మాలేపాటి వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టానంటూ మాలేపాటి వ్యాఖ్యానించారు. -
కావలి ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరిపై యుద్ధం చేస్తా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఏకపక్ష వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది. ఎమ్మెల్యే వైఖరిపై ఇకనుంచి ప్రత్యక్ష యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నాను. టీడీపీ నీది కాదని నన్ను అనే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. టీడీపీ కోసం పని చేస్తే నాపై 16 కేసులు పెట్టించారు. ఇప్పుడు కొత్తగా నాపై వంద కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా భయపడను. అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఎన్నికల సందర్భంగా చెప్పిన మాట తప్పి, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఘోరాలపై పార్టీ అధిష్టానం విచారణ కమిటీ నియమించి నిజాలను గుర్తించాలి’ అని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తన నివాసంలో కార్యకర్తలతో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అవలంబిస్తున్న వివాదాస్పదమైన, ఘర్షణ పూరిత విధానాలపై ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వీధుల్లో టాపాసులు కాల్చి సంబరాలు చేస్తున్న వ్యక్తులు ఈ రోజు టీడీపీలో పెత్తనం చేస్తున్నారని, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడినే అడుగుతున్నా.. అసలు టీడీపీ ఎటు పోతోంది? ఏమి జరుగుతుంది? కడుపు రగిలిపోతుంది. పార్టీ ఏమవుతోందో అర్థం కావడం లేదన్నారు. నీతి నిజాయతీతో రాజకీయాలు చేయాలే కాని, లాలూచీ రాజకీయాలు చేస్తే ఊరుకోను. కావలిలో టీడీపీకి ఏమీ లేదు అనే రోజుల్లో పార్టీ ఆఫీస్ను ఏర్పాటు చేశానన్నారు. టీడీపీ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టానన్నారు. పార్టీ కార్యక్రమాలు, ఆందోళనలు నుంచి చంద్రబాబు సభలు, లోకేశ్ యువగళం ఆరు రోజుల పాదయాత్రను విజయవంతంగా నిర్వహించడంలో తాను ఎంతో కష్టపడ్డానన్నారు. దుగ్గిరాల కరుణాకర్ అనే యువకుడు చనిపోతే రూ.20 లక్షలు టీడీపీ తరఫున అతని కుటుంబ సభ్యులకు తాను సహాయం అందజేశానన్నారు. నోరుందని నిందలు వేసి పిచ్చిపిచ్చిగా మాట్లాడడం కాదని, నిరూపించాలని సవాల్ విసిరారు. టీడీపీలోకి రకరకాల వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. కానీ తాను మాత్రం టీడీపీనే అన్నారు. ఇక నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉండేందుకు క్రియాశీలకంగా ఉంటానన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బుచ్చిరెడ్డిపాళెం– దగదర్తి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు మళ్లీ రెండోసారి శంకుస్థాపన అంటూ హడావుడిగా చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. -
కావ్య కనుసైగలతో మాలేపాటిపై కేసుల నమోదు?
కావలి టీడీపీలో ఆధిపత్యం.. అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరింది. ‘ఏరు దాటే వరకు మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ చందానా సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు సాగిన ఐక్యతారాగం.. ఇప్పుడు శృతి తప్పింది. ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా, సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి ఎదురొడ్డి నిలిచిన నేతలనే టార్గెట్ చేయడం ఇప్పుడు ఆ పార్టీలో అగ్గి రాజుకుంది. అధికారంలోకి వచ్చామనే అహంకారంతో చెలరేగిపోయిన మాలేపాటి కుటుంబంపైనే కేసులు నమోదు చేయించడంతో జీర్ణించుకోక మానసిక క్షోభతో తీవ్ర అస్వస్థతకు గురై ఐసీయూలో చికిత్స పొందుతున్న పరిస్థితి చూస్తే టీడీపీలో అంతర్యుద్ధానికి అద్దం పడుతోంది.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి టీడీపీ అంటే బీద రవిచంద్ర.. మాలేపాటి సుబ్బానాయుడు. ఇది మొన్నటి వరకు ఉన్న పరిస్థితి. ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వెలువడ్డాయి. ఇంకా పరిపాలన గాడిలో పడలేదు. కానీ అప్పుడే టీడీపీలో రాజకీయ ముసలం మొదలైంది. ఆ పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి పార్టీ కాడి మోసే నేత లేని పరిస్థితుల్లో దగదర్తికి చెందిన మాలేపాటి సుబ్బానాయుడు రూ.కోట్లు ఖర్చు పెట్టుకుని ఉనికిని కాపాడుకుంటూ వచ్చాడు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అండతో అధిష్టానం ఆశీస్సులతో నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగారు. తానే కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ విస్తృత ప్రచారం చేసుకున్నాడు. అయితే రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో కావ్య కృష్ణారెడ్డి తెరపైకి రావడం, సార్వత్రిక ఎన్నికల్లో అధికారం మార్పు జరగడం చకాచకా జరిగిపోయాయి. ఈ క్రమం పార్టీకి విదేయుడిగా పని చేసిన సుబ్బానాయుడు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కావ్య కృష్ణారెడ్డి విజయంలో తనదైన పాత్ర పోషించారు.అయితే ఇప్పుడేం జరిగిందంటే..ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యాక కావ్య కృష్ణారెడ్డి విజయం సాధించిన తర్వాత టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విజయోత్సవాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలుచోట్ల వైఎస్సా ర్సీపీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు అనేక చోట్ల భౌతిక దాడులు, ఆస్తుల ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో మాలేపాటి సుబ్బానాయుడు తన స్వగ్రామమైన దగదర్తిలో ఈ నెల 9న టీడీపీకి చెందిన మాలేపాటి రవీంద్రనాయుడు, మాలేపాటి భాను, వడ్డే వినయ్, తాండ్రా కార్తీక్, తాండ్రా వెంకటేశ్వర్లు తదితరులు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు మారెళ్ల వెంకటేశ్వర్లు ఇంటి ప్రహరీని జేసీబీతో ధ్వంసం చేశారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు దగదర్తి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాలేపాటి సుబ్బానాయుడు, భాను, గోపాల్, సూరయ్య, వినయ్ తదితరులు జేసీబీతో తమ ఇంటి ప్రహరీని కూల్చి వేశారని, అడ్డుకోబోయిన తన కోడలు, తనను దుర్భాషలాడుతూ దాడి చేయబోయారని దగదర్తికి చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారు అయిన కాండ్రా కామేశ్వరమ్మ టీడీపీ నేతలపై మరో ఫిర్యాదు చేశారు. ‘నీ కొడుకు శ్రీనివాసులు ఎక్కడున్నా వెతికి చంపేస్తామంటూ’ తమపై దాడి చేయబోగా వారి నుంచి తప్పించుకొని పోలీసు స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.మాలేపాటికి షాక్ ఇచ్చిన కావ్యమాలేపాటి అండ్ గ్యాంగ్ సాగించిన అరాచకంపై తన మండలంలోనే తమపై కేసులు నమోదు కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన మాలేపాటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. మాపై కేసులు పెడుతుంటే..చూస్తూ ఊరుకుంటావా? అంటూ ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో కావ్య కూడా గట్టిగానే తిరిగి ప్రశ్నలు సంధించడంతో ఇద్దరి మధ్య వాగ్యువాదం తారస్థాయికి చేరింది. ‘ఎవర్ని అడిగి గోడలు కూల్చారు.. ఎవరిని అడిగి విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేశారంటూ’ కావ్య నిలదీశారంట. ఎన్నికల ముందు నుంచి మాలేపాటి ఆర్థికంగా తనను వేధించిన విషయాలను మనస్సులో పెట్టుకున్న కావ్య ఒక్కొక్కటిగా కడిగిపారేయడంతో సుబ్బానాయుడు తీవ్ర ఫ్రస్ట్రేషన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడిని కుటుంబ సభ్యులు చైన్నెలోని ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్పై పెట్టి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలుస్తోంది. ప్రస్తుతంలో ఐసీయూలో కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.కావ్య వైఖరితోనే ఈ పరిస్థితి.. కావ్య కృష్ణారెడ్డి ఉద్దేశ పూర్వకంగానే మాలేపాటిపై కేసులు పెట్టించి.. ఆయన్ను తీవ్రంగా అవమానించడంతో పాటు వేధింపులకు గురిచేయడం కారణంగానే మాలేపాటి చావుబతుకుల్లో ఉన్నాడని ఆయన బంధువులు, అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. టీడీపీ ప్రారంభం నుంచి వీరవిధేయులుగా ఉన్న తమను కాదని, ధన బలంతో పార్టీ టికెట్ చేజిక్కించుకొని ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి తమను ఇంతగా కించపరచడాన్ని మాలేపాటి వర్గీయులు ఏ మాత్రం సహించబోమని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో అసలైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాలేపాటికి అండగా నిలవాలని అంతర్గతంగా జోరుగా చర్చ జరుగుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కావలి టీడీపీలో రెండు రాజకీయ కుంపట్లు ఏర్పడి మరింత సంక్షోభావానికి దారి తీయవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కావ్య కృష్ణారెడ్డి వైఖరిపై బీద రవిచంద్ర కూడా కక్కలేక.. మింగలేక రగిలిపోతున్నట్లు సమాచారం. మాలేపాటి విషయంలో కావ్య వ్యవహరిస్తున్నట్లు తీరు, పార్టీ పరిస్థితిపై లోకేశ్ వద్ద పంచాయితీ పెట్టన్నట్లు తెలుస్తోంది. -
నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..
-
నర్రెడ్డి సునీత, రాజశేఖర్రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
పులివెందుల: నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి చాలా నీచంగా మాట్లాడుతున్నారని వైఎస్ వివేకానందరెడ్డి వద్ద పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నర్రెడ్డి దంపతులు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినవనీ అబద్ధాలేనని తెలిపారు. కడుపుకు అన్నం తినేవాళ్లెవరూ ఇలా మాట్లాడరన్నారు. భార్యాభర్త రోజుకో అబద్ధపు స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నారు. నర్రెడ్డి బ్రదర్స్ నాటకాలాడుతున్నారని చెప్పారు. వైఎస్ వివేకా రక్తపు వాంతులతో చనిపోయాడని తాను నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో చెప్పలేదన్నారు. రూము మొత్తం రక్తపు మరకలున్నాయని, తలపైన గాయం ఉందని, బాడీ మొత్తం రక్తంలో ఉందని, సైడు వాకిలి, బెడ్ రూము వాకిలి తెరచి ఉన్నాయని, ఏసీ ఆన్లో ఉందని చెప్పానని తెలిపారు. రక్తపు వాంతులని ఎర్ర గంగిరెడ్డి అనగా, ఇంత రక్తం ఉంటే వాంతులంటావేమిటని తాను ఆయనతో వాదించానన్నారు. అలాంటిది రాజశేఖర్రెడ్డికి రక్తపు వాంతులని ఎలా చెబుతానని అన్నారు. అలాగే తాను వైఎస్ వివేకా లెటర్ను దాచిపెట్టడానికి ప్రయత్నం చేశానన్నారని, అదీ అబద్ధమేనని తెలిపారు. లెటర్ గురించి తాను రాజశేఖర్రెడ్డికి ఫోన్లో చెప్పగా ఆయనే దాచమన్నారని చెప్పారు. పోలీసులతో సమస్య కదా అని తాను అంటే ఆ విషయం ఆయనే చూసుకుంటానని చెప్పారన్నారు.అవినాశ్రెడ్డి తనను మేనేజ్ చేశారనడం నిజం కాదన్నారు. నర్రెడ్డి దంపతులే తనను మేనేజ్ చేయాలని చూసి విఫలమయ్యారని చెప్పారు. లెటర్ దాచిపెట్టమని చెప్పిన వారిని కేసులో పెడతారని, కానీ వీరు అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నాయకులతో కలిసి పోలీసులను మేనేజ్ చేసి తనను, మరో అమాయకుడైన ప్రకాష్ను కేసులో ఇరికించారన్నారు. తనది చిన్న ప్రాణం కాబట్టి ఇరికించారని, వారి కారణంగా తాను ఉద్యోగానికి 9 నెలలు సస్పెన్షన్కు గురయ్యానని, ప్రమోషన్, పాస్పోర్ట్ రెన్యువల్ ఆగిపోయాయన్నారు. తాను ఇప్పుడు 20 శాతం విషయాలే చెబుతున్నానని, మరలా మిగిలిన విషయాలు చెబుతానన్నారు.తాను వైఎస్ వివేకా దగ్గర 37 సంవత్సరాలు ఏ జీతం తీసుకోకుండా పని చేశానని తెలిపారు. వివేకాను తాను చూసుకున్నట్లు వారి ఇంట్లో వారు కూడా చూసుకోలేదన్నారు. వివేకా తన ముందరే ఎన్నోసార్లు వారిని ఛీ కొట్టారని తెలిపారు. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్రెడ్డి వారి బావ వివేకా ద్వారా కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని, అయినా వారిలో ఆశ చావలేదన్నారు. వివేకా రెండో వివాహం కారణంగా వారికి ఆయనతో తీవ్ర మనస్పర్థలు వచ్చాయన్నారు. వివేకా రెండో భార్య షమీమ్ కుమారుడికి ఆస్తులు పోకుండా రాజకీయంగా వివేకా ద్వారా ఎదగాలని విఫలమై ఈ రోజు వేరేవారిపై నిందలు వేస్తున్నారన్నారు. గతంలో డ్రైవర్గా దస్తగిరిని తొలగిస్తేనే పులివెందుల వస్తానని వివేకాకు రాజశేఖర్ గట్టిగా చెప్పడంతో ఆయన తొలగించారన్నారు. ఇప్పుడు అదే దస్తగిరిని ముందర పెట్టుకుని వీరు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. రామ్సింగ్ చెప్పినట్లు వినాలని సునీత బెదిరించారుఓసారి సునీత దంపతులు తనను హైదరాబాద్కు పిలిపించుకొని, రామ్సింగ్ చెప్పినట్లు వికపోతే కేసులో ఇరుక్కుంటావని బెదిరించారన్నారు. తాను అబద్ధం చెప్పనని కరాఖండిగా చెప్పానన్నారు. ఆ సమయంలో కృష్ణారెడ్డి మన మాట వినకపోతే నువ్వు కేసులో ఇరుక్కుంటావని రాజశేఖర్తో సునీత అన్నారని చెప్పారు. దీనికి అర్థమేమిటో మీడియా సోదరులే ఆలోచించుకోవాలని అన్నారు. ఎప్పటికైనా ఈ కేసులో రాజశేఖర్ జైలుకు వెళ్లక తప్పదన్నారు.వారి ముగ్గురు పేర్లు చెప్పాలని రామ్సింగ్ కొట్టాడుఢిల్లీలో సీబీఐ అధికారి రామ్సింగ్ నెలరోజుల పాటు తనను తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడన్నారు. హత్యలో వైఎస్ అవినాశ్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, శంకర్రెడ్డి హస్తం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని తీవ్రంగా కొట్టేవాడన్నారు. ఎంతకీ తాను ఒప్పుకోకపోవడంతో వదిలేశారన్నారు. ఆతర్వాత ఒకరోజు రామ్సింగ్ వాట్సప్ కాల్ చేసి తన కుమారుడిని తీసుకొని కడపకు రమ్మని చెప్పాడన్నారు.తామిద్దరం మరుసటిరోజు రామ్సింగ్ వద్దకు వెళ్లగా, వివేకా హత్యలో అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డి, శంకర్రెడ్డిల హస్తం ఉన్నట్లు చెప్పాలంటూ తన కుమారుడి ఎదుటే కట్టెతో కొట్టాడన్నారు. దస్తగిరి, రంగన్న చెప్పినట్లు విన్నారని, వారిని సేవ్ చేశామని, నువ్వు వినకపోతే కేసులో ఇరికిస్తామని చెప్పాడన్నారు. తన బెయిల్ రద్దు చేసి మళ్లీ జైలుకు పంపిస్తామని బెదిరించాడన్నారు. తాను అబద్ధం చెప్పనని గట్టిగా చెప్పడంతో పంపించేశాడన్నారు. కృష్ణారెడ్డి మాట వినలేదని సునీత దంపతులకు రామ్సింగ్ చెప్పగా.. తన కుమారుడితో వివాహం కుదుర్చుకున్న గుంటూరుకు చెందిన మా వియ్యంకుడికి సునీత ఫోన్ చేసి కృష్ణారెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేయిస్తామని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని, వివాహం రద్దు చేసుకోవాలని బెదిరించారని, దీంతో వారు భయపడి వివాహం రద్దు చేసుకున్నారని తెలిపారు.నాకేదైనా జరిగితే వారిదే బాధ్యతతనకు ఇప్పటికీ కొంతమంది నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వారి పేర్లు త్వరలో బయటపెడతానన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు ఏదైనా జరిగితే సునీత, రాజశేఖర్, శివప్రకాష్రెడ్డిలే బాధ్యులవుతారని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు స్పందించకపోవడంతో కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నానన్నారు. కేవలం రాజకీయ ఎదుగుదల కోసం సునీత దంపతులు అవినాశ్రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని కృష్ణారెడ్డి తెలిపారు. -
నల్లగొండ..నెగ్గేదెవరు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లా. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలుకొని సాగునీటి కోసం బ్యాలెట్ యుద్ధం, తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంత్చారి ఇలా.. ఎందులో చూసినా నల్లగొండ జిల్లాది ప్రత్యేకస్థానం. 1940లోనే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే, 1952 తర్వాత జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచి ఎన్నికైన రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్ భవనాన్నే ప్రారంభించారు.అలాంటి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో 1952 నుంచి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 7 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఆరుసార్లు కమ్యూనిస్టు పార్టీ, రెండుసార్లు టీడీపీ, ఒకసారి తెలంగాణ ప్రజాసమితి, పీడీఎఫ్ పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మబిక్షం నల్లగొండ నుంచే ప్రాతినిధ్యం వహించగా, భీంరెడ్డి నర్సింహారెడ్డి రద్దయిన మిర్యాలగూడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన సూదిని జైపాల్రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారు. కేంద్రమంత్రి కూడా అయ్యారు.సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న నల్లగొండపై క్రమంగా కాంగ్రెస్ పైచేయి సాధించింది. గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే నల్లగొండలో గెలుపొందింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో, తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2014, 2019లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుందూరు రఘువీర్రెడ్డిని గెలిపించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.నాలుగోసారి కూడా తామే నల్లగొండలో పాగా వేసే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఇన్చార్జ్గా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తుండగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పక్కన పడేసిందంటూ విమర్శిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.బోణీ కొట్టేందుకు బీఆర్ఎస్బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయినా 2014, 2019 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించినా, ఆ తర్వాత నాలుగు నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను అడ్డు కోలేకపోయింది. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్య ర్థులే విజయం సాధించారు. అదే తరహాలో ప్రస్తుత ఎన్నికల్లో నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారన్న ధీమాతో ముందుకు సాగుతోంది.కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని 13 పథ కాల్లో కొన్ని కూడా అమలు చేయడం లేదంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండలో భారీ సభ నిర్వహించడం, ఆ తర్వాత తుంగతుర్తి, సూర్యాపేట నియోజక వర్గాల్లోనూ ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. ఇటీవల మిర్యాలగూడ, సూర్యాపేటలో బస్సు యాత్ర నిర్వహించారు. జిల్లా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నీ తానై ఈ ఎన్నికల్లో వ్యవహరిస్తున్నారు.మోదీ చరిష్మా, పాలకుల వైఫల్యాలే గెలిపిస్తాయంటున్న బీజేపీనల్లగొండ పార్లమెంట్ స్థానం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి విజయం సాధించలేదు. అప్పట్లో ఓరుగంటి రాములు ఎంపీగా పోటీ చేసి గట్టిపోటీ ఇచ్చారు. ఆ తర్వాత ఇంద్రసేనారెడ్డి లాంటి పెద్ద నాయకులు పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. ప్రస్తుతం దేశంలో మోదీ చరిష్మా కొనసాగుతోంది. రామమందిర నిర్మాణం చేపట్టడం, అక్కడ తలంబ్రాల బియ్యం ఇంటింటికి పంపిణీ చేయడం హిందువుల్లో బీజేపీ వైపు మళ్లారన్న ధీమాతో బీజేపీ ఉంది.ప్రధానంగా యువత అంతా మోదీ ఆకర్షణలో ఉన్నారని, ఆ మోదీ చరి ష్మాతోనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజ యం సాధించాలన్న ఉద్దేశంతో బీజేపీ ముందుకు సాగుతోంది. ప్రధానంగా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వంద రోజుల పాలనలో వైఫల్యాలను ప్రచార అస్త్రాలుగా చేసుకొని, కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈనెల 6వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నల్లగొండలో ప్రచారం చేయబోతున్నారు.ముగ్గురూ కొత్త వారే..నల్లగొండ ఎంపీ సెగ్మెంట్లో ఈసారి ముగ్గురు కొత్త అభ్యర్థులే బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ఆయన తండ్రి, మాజీ మంత్రి జానారెడ్డి అండదండలతోనే రాజకీయాల్లోకి వచ్చారు. బీఆర్ఎస్ కూడా కొత్త అభ్యర్థినే పోటీలోకి దింపింది. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చింది. ఈయన కూడా ఎక్కడా పోటీ చేయలేదు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. ఆయన 2018లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున అదే సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.ప్రభావితం చేసే అంశాలు∗ రైతులు, సాగునీరు, ప్రాజెక్టులే అన్ని పార్టీలకు ప్రధాన ప్రచార అస్త్రాలు∗ ఎంపీ సెగ్మెంట్లో 7 లక్షల మంది రైతులు ఉన్నారు. వారి ఓట్లే కీలకం∗ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేఆర్ఎంబీకి అప్పగింతపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర విమర్శలు∗ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎస్ఎల్బీసీ సొరంగమార్గం పూర్తి చేయకపోవడం∗ నెల్లికల్లు లిఫ్ట్, బ్రాహ్మణవెల్లెంల, డిండి తదితర పెండింగ్ ప్రాజెక్టులు2019 ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు లభించిన ఓట్లునలమాద ఉత్తమ్కుమార్రెడ్డి (కాంగ్రెస్) 5,26,028 (44.73 శాతం)వేమిరెడ్డి నర్సింహారెడ్డి (టీఆర్ఎస్) 5,00,346 (42.55 శాతం)గార్లపాటి జితేంద్రకుమార్ (బీజేపీ) 52,709 (4.48 శాతం)అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల వివరాలు ఇలా..నియోజకవర్గం పురుషులు స్త్రీలుదేవరకొండ(ఎస్టీ) 1,31,659 1,30,392 నాగార్జునసాగర్ 1,15,710 1,20,464 మిర్యాలగూడ 1,15,543 1,20,299హుజూర్నగర్ 1,21,667 1,29,164 కోదాడ 1,19,068 1,25,878 సూర్యాపేట 1,18,770 1,24,893నల్లగొండ 1,21,079 1,27,766మొత్తం 8,43,496 8,78,856 -
ఆయన నమ్మరు.. ఆయన్ను నమ్మరు
కావ్య ఎంట్రీతో కావలిలో టీడీపీ గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. కావ్య కృష్ణారెడ్డి అభ్యర్థిత్వంతో టీడీపీ భవితవ్యం తేలిపోయింది. చంద్రబాబు కావలిలో నిర్వహించిన ప్రజాగళం సభతో అది ప్రస్ఫుటమైంది. కావ్యను టీడీపీ కేడర్ ఆది నుంచి వ్యతిరేకిస్తున్న తరుణంలో ఆయన తన క్వారీల్లో పని చేసే సిబ్బందితో సొంత దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తనను వ్యతిరేకిస్తున్నారనే కారణంతో టీడీపీ వీరాభిమానులను సైతం కావ్య పక్కన పెట్టేశారు. టీడీపీకి మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ నేతలను సైతం దూరంగా ఉంచారు. ఎన్నికల కార్యాచరణలో వీరిని దూరంగా పెట్టి.. తన గుమాస్తాల చేతికే పెత్తనమంతా కట్టబెట్టారు. ఖర్చులకు సైతం డబ్బులివ్వకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్ కావ్యను పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలే చంద్రబాబు సభకు జనసమీకరణకు కూటమి నేతలు ముఖం చాటేయడంతో ప్రజాగళం అట్టర్ ఫ్లాప్ అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కావలి: టీడీపీ కావలి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఏక్ నిరంజన్గా మిగిలిపోయాడు. ఆయన నేతలను నమ్మడం లేదు. నేతలు ఆయన్ను నమ్మడం లేదు. కావ్య అభ్యర్థత్వాన్ని టీడీపీ నేతలు ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. టికెట్ రేస్లో పోటీపడి చివరకు సీటు దక్కించుకున్నాడు. అయితే ఎన్నికల కార్యాచరణలో తన గెలుపు కంటే.. తన వద్ద ఉండే డబ్బు కోసమే పని చేస్తారనే ఆలోచనతో సొంత పార్టీ నేతలనే కాదు.. మిత్రపక్షాలను సైతం దూరం పెట్టేశాడు. తన వద్ద పని చేసే ఉద్యోగులు, దగ్గరి బంధువులతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పార్టీ నిర్ణయాన్ని కాదనలేక సర్దుకుపోదామని ప్రయత్నించినా మిత్ర పక్షాలకు, పార్టీ కేడర్కు కావ్య వర్గం నుంచి ప్రతి రోజూ అవమానాలు ఎదురవుతుండటంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. కావ్య శిబిరంలో కలవరం టీడీపీ అధినేత చంద్రబాబు కావలిలో నిర్వహించిన ప్రజాగళం సభ అట్టర్ఫ్లాప్ కావడంతో కావ్య శిబిరంలో కలవరం మొదలైంది. ముందుగానే ప్రజాగళం షెడ్యూల్ ప్రకటించినప్పటికీ జన సమీకరణ చేయడంలో చతికిల పడ్డారు. జన సమీకరణ పేరుతో డబ్బులు తినేస్తారనే భావనతో కావ్య ప్రజాగళం బహిరంగ సభకు సంబంధించిన బాధ్యతలను కార్యకర్తలు, నాయకులను కాదని తన క్వారీల్లో పని చేసే గుమాస్తాలకు, తన దగ్గరి బంధువులకు అప్పగించారు. తమపై నమ్మకం లేక గుమాస్తాలకు బాధ్యతలు అప్పగించిన వ్యక్తి కోసం తాము ఎందుకు పని చేయాలంటూ సొంత పార్టీ కేడర్తో పాటు మిత్రపక్షాలు బీజేపీ, జనసేన సైతం ముఖం చాటేశారు. కావ్య అహంకార వైఖరితో ఇప్పటికే నియోజకవర్గంలో బీద రవిచంద్ర వర్గీయులు, మాలేపాటి వర్గీయులు పారీ్టకి దూరదూరంగా ఉంటున్నారు. ఎవరూ సహకారం అందించకపోవడంతో తన దళాలను రంగంలోకి దింపి జన సమీకరణకు సిద్ధమయ్యారు. అసలే టీడీపీ సభలంటే జనం ముఖం చాటేస్తున్నారు. చంద్రబాబు హెలికాప్టర్ దిగినా.. జనం లేకపోవడంతో గంటా పది నిమిషాలు హెలిప్యాడ్లో ఉన్న బస్సులోనే పడిగాపులు పడ్డారు. ఎట్టకేలకు వెయ్యి.. రెండు వేల మందిని సభా స్థలికి చేర్చడంతో, రద్దీగా ఉండే ట్రంక్రోడ్లో జనం వచ్చే జనం, పోయే జనం పోగుకావడంతో సభ వద్దకు చంద్రబాబు వచ్చారు. ఆయన మాట్లాడుతుండగానే జనం పొలోమని వెళ్లిపోవడంతో అసహనంతో సభను అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. ప్రజాగళం ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ఆగ్రహంతో వెళ్లిన చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఆందోళన నెలకొంది. మిత్రపక్షాలకు దక్కని ప్రాధాన్యం టీడీపీ మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన నాయకులను కూడా కావ్య కృష్ణారెడ్డి చిన్నచూపు చూస్తున్నారని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తాజాగా ప్రజాగళం సభలో జనసేన ఊసే లేకపోవడంతో పవన్ అభిమానులకు మింగుడు పడటం లేదు. బీజేపీ నాయకులను కూడా పట్టించుకోలేదు. కావలి పట్టణ బీజేపీ అధ్యక్షుడి సహా సీనియర్ నాయకులంతా కూడా ప్రజాగళంలో జనాల మధ్య సాధారణ కార్యకర్తల్లా ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో బీజేపీ, జనసేన నాయకులు కూడా కావ్యకు మద్దతు తెలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. దొంగల్లా చూస్తున్నారని... 40 ఏళ్ల నుంచి పార్టీ కోసమే పని చేస్తున్నాం. పైసా ఆశించకుండా అభిమానంతో పార్టీ జెండా మోస్తున్నాం. కొత్తగా వచ్చిన కావ్య కృష్ణారెడ్డి మమ్మల్ని దొంగల్లా చూస్తున్నాడు. ప్రచార ఖర్చులకు అడిగినా కూడా అనుమానిస్తూ తన గుమాస్తాలకు లెక్కలు చెప్పమంటున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఇంత వరకూ చూడలేదు. ఇలాంటి అనుమానపు వ్యక్తి ఉన్న పారీ్టలో కొనసాగడం మా వల్ల కాదంటూ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నందమూరి అభిమానులు, సీనియర్ నాయకులు పారీ్టకి, కావ్యకు దండం పెట్టి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇదే బాటలో మరికొంత మంది సీనియర్ నాయకులు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. -
అనపర్తిలో ఆగ్రహ జ్వాల! స్పందించని బాబు తీరు..
తూర్పుగోదావరి: నోటి దగ్గర కూడు లాగేసుకుంటే ఎలా ఉంటుంది? చిన్న పిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసేసుకుంటే వారికి ఎంత కోపం వస్తుంది? సరిగ్గా అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో అనపర్తి నుంచి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం ఆరంభించారు. తదనంతర పరిణామాల్లో టీడీపీ, జనసేనకు బీజేపీతో పొత్తు కుదిరింది. చంద్రబాబు వెళ్లి బీజేపీ నేతలతో బేరసారాలు సాగించడమే కాకుండా.. వారడిగిన స్థాయిలో సీట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అనపర్తి సీటును బీజేపీకి సమర్పించుకున్నారు. దీంతో తాజాగా ఇక్కడి నుంచి విపక్ష కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన ములగపాటి శివరామకృష్ణంరాజు పేరు ప్రకటించారు. కనీసం రామకృష్ణారెడ్డికి మాటమాత్రంగా కూడా ఈ విషయం చెప్పలేదు. ఈ పరిణామాలు అనపర్తి టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. రామకృష్ణారెడ్డికి ఇచ్చినట్టే ఇచ్చి టికెట్టు లాగేసుకోవడంతో వారు భగ్గుమంటున్నారు. నాలుగు రోజులుగా రచ్చ వాస్తవానికి అనపర్తి టికెట్టుపై నియోజకవర్గ టీడీపీలో నాలుగు రోజులుగా రచ్చ జరుగుతోంది. ఈ సీటును బీజేపీకి కేటాయిస్తున్నారంటూ వార్తలు రావడంతో కొద్ది రోజులుగా టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. దీనిపై అధిష్టానం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకూ ఎన్నికల ప్రచారం చేయవద్దంటూ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను వారు అడ్డుకున్నారు. తొలిగా బిక్కవోలు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రామకృష్ణారెడ్డిని ప్రచారం చేయవద్దంటూ నిలిపివేశారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులకు రాజీనామాలు చేస్తూ సోమవారం రాజమహేంద్రవరంలో ఉన్న టీడీపీ జోన్–2 కో ఆర్డినేటర్ రావు వెంకట సుజయ కృష్ణ రంగారావుకు లేఖలు అందజేశారు. అలాగే మంగళవారం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ధర్నా చేశారు. బుధవారం పెదపూడిలో నిరసన చేపట్టారు. అదే రోజు సాయంత్రం బీజేపీ అభ్యర్థిగా శివరామ కృష్ణంరాజు పేరు ప్రకటించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అదే రోజు రాత్రి ఇద్దరు యువకులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిని రామకృష్ణారెడ్డి వారించారు. ఈ క్రమంలో రామవరంలోని ఆయన నివాసానికి టీడీపీ శ్రేణులు గురువారం పెద్ద ఎత్తున చేరుకున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఇప్పటికై నా టీడీపీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసి, రామకృష్ణారెడ్డికే టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నలభై సంవత్సరాలుగా నియోజకవర్గంలో టీడీపీని మోస్తున్న నల్లమిల్లి కుటుంబానికి చంద్రబాబు అన్యాయం చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కట్టప్ప రాజకీయాలు చేయద్దంటూ చంద్రబాబును తీవ్రంగా దూషించారు. టీడీపీ ఎన్నికల ప్రచార కరపత్రాలు, పార్టీ జెండాలను కుప్పగా పోసి తగులబెట్టారు. వారిని రామకృష్ణారెడ్డి వారించారు. నియోజకవర్గంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఇన్నాళ్లూ తాను పడిన కష్టం నిష్ప్రయోజనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తిరిగి ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు తగు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇంత తంతు జరుగుతున్నప్పటికీ చంద్రబాబు కానీ, ఇతర పెద్దలు కానీ స్పందించకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఇంటి ముందు నిరసన తెలపండి అనపర్తి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి దిగజారుడు రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం కేటాయించకపోతే ఆ పార్టీ శ్రేణులు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలే తప్ప, రామవరంలో చేస్తే ఉపయోగమేమిటని, ఇది హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విలేకర్లతో మాట్లాడుతున్న ఏఎంసీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి పొత్తుల్లో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే సీటు బీజేపీకి కేటాయించడం ఆయా పార్టీల అంతర్గత వ్యవహారమని, చంద్రబాబు నిర్ణయమని అన్నారు. తనకు టికెట్టు రాకుండా స్థానిక వైఎస్సార్ సీపీ కుట్రలు చేస్తోందని రామకృష్ణారెడ్డి ఆరోపించడం.. ఆడలేక మద్దెల ఓడు సామెతను గుర్తు చేస్తోందని విమర్శించారు. రాజకీయంగా తనకు తగిలే ఎదురు దెబ్బను వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ఆపాదించడం రామకృష్ణారెడ్డికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. తనకు టికెట్టు రాకుండా వైఎస్సార్ సీపీ నేతలు రూ.20 కోట్లకు బేరసారాలు నడిపారంటూ ఆయన పేర్కొనడం విడ్డూరంగా ఉందని, ఎవరైనా అధిక మొత్తంలో నగదు ముట్టజెపితే అమ్ముడుపోయే స్థితిలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారా అని కృష్ణారెడ్డి ప్రశ్నించారు. మూడేళ్ల కిందట బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో చేసిన అసత్య ప్రమాణం, ఇటీవల అనపర్తి గ్రామ దేవత శ్రీ వీరుళ్లమ్మ అమ్మవారికి సంబంధించి అవహేళనగా మాట్లాడిన ఫలితమే నేడు రామకృష్ణారెడ్డికి పట్టిన దుస్థితి అని చెప్పారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని కర్మఫలాలు అనుభవించక తప్పదని కృష్ణారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ వారా కుమారి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చిర్ల వీర రాఘవరెడ్డి కూడా పాల్గొన్నారు. ఇవి చదవండి: బాబు పొత్తు ధర్మం చిత్తు చిత్తు? -
వివేకా హత్య.. సునీత దంపతుల కుట్రే!
సాక్షి, అమరావతి: ‘వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డే హత్య చేయించి ఉండొచ్చు. ఈ హత్య వెనుకనున్న ఏదో విషయాన్ని దాచిపెట్టాలని వారు ప్రయత్నిస్తున్నారు. వివేకం సార్ రెండో పెళ్లితో ఆ ఇంట్లో తలెత్తిన ఆస్తి గొడవలకు ఆయన హత్యకు ఏదైనా సంబంధం ఉందా.. అనిపిస్తోంది. కూతురు, అల్లుడు, పెద్ద బావమరిదే ఈ దారుణానికి తెగించి ఉండొచ్చు’.. అని వైఎస్ వివేకానందరెడ్డి పీఏగా చేసిన ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు. ‘వివేకానందరెడ్డి రాసిన లెటర్ పోలీసులకు వెంటనే ఇచ్చేసి ఉంటే దర్యాప్తు సక్రమంగా సాగేది. కానీ, ఆ లెటర్ను దాచిపెట్టమని ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి ఎందుకు చెప్పారు? ఈ కేసుతో సంబంధంలేని ఎంపీ అవినాశ్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిల పేర్లు చెప్పాలని నన్ను ఎందుకు బెదిరించారు? నేను అబద్ధం చెప్పకపోతే తన భర్త రాజశేఖర్రెడ్డి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’ అని సునీత ఎందుకు అన్నారని కూడా ఆయన వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివేకానందరెడ్డిని పాశవికంగా హత్య చేశానన్న దస్తగిరిని అప్రూవర్గా మార్చడం ఏమిటీ? అతను చెప్పే కట్టుకథలను పట్టుకుని సీబీఐ దర్యాప్తు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి చివరివరకు కూడా వైఎస్ జగన్ను సీఎం చేయడానికి, వైఎస్ అవినాశ్రెడ్డిని ఎంపీగా గెలిపించడానికే కృషిచేశారని ఆయన స్పష్టంచేశారు. వివేకాకు పీఏగా దాదాపు 37ఏళ్ల పాటు పనిచేసిన కృష్ణారెడ్డి.. ఆయనకు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తునిగా గుర్తింపు పొందారు. ఆయన కుటుంబ వ్యవహారాలతో సహా అన్ని విషయాలు సమగ్రంగా తెలిసిన వ్యక్తి. 2019, మార్చి 15 ఉదయం వివేకానందరెడ్డి మృతిచెందిన విషయాన్ని కృష్ణారెడ్డే మొదటగా గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో పోలీసులు, తరువాత సీబీఐ అధికారుల చేతిలో చిత్రహింసలకు గురైన బాధితుడు కూడా కృష్ణారెడ్డే. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన అన్ని పరిణామాలను సమీపం నుంచి పరిశీలిస్తున్న కీలకవ్యక్తి అయిన కృష్ణారెడ్డి ‘సాక్షి’కి ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. సాక్షి: 2019, మార్చి 15న ఏ సమయంలో మీరు వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లారు? కృష్ణారెడ్డి: రోజూ వెళ్లినట్లే ఆ రోజు కూడా ఉ.5.30కే వివేకం సార్ ఇంటికి వెళ్లాను. ఇంట్లో లైట్వేసి లేదు. అంటే సారు ఇంకా నిద్ర నుంచి లేవలేదని అనుకున్నా. బయట లైట్ దగ్గర కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉన్నా. కాసేపటి తరువాత సౌభాగ్యమ్మకు ఫోన్చేసి సార్ ఇంకా నిద్ర లేవలేదు.. మీరు ఫోన్చేసి నిద్ర లేపుతారా అని అడిగాను. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చి ఉంటారు.. కాసేపు నిద్రపోనీ అని ఆమె చెప్పారు. కాసేపటికే వంట మనిషి లక్ష్మమ్మను ఆమె కొడుకు ప్రకాశ్ తన బైక్ మీద తీసుకొచ్చాడు. ఆలస్యమైంది కిటికీ వద్దకు వెళ్లి సారును నిద్రలేపు అని చెప్పాను. ఆ సమయంలో వాచ్మెన్ రంగన్న మెయిన్ డోర్ ముందర నిద్రపోతూ ఉన్నాడు. లక్ష్మమ్మ వచ్చేసరికి రంగన్న నిద్రలేచి ఉత్తరం వైపు ఉన్న పార్కు వైపు వెళ్లాడు. ఇంతలో ‘సార్ పడిపోయాడు’ అని అరుచుకుంటూ రంగన్న వచ్చాడు. మేము ఆ వైపు పరిగెత్తి వెళ్లాం. ఇంటికి ఉత్తరం వైపు ఉన్న తలుపు తెరచి ఉంది. లోపలికి వెళ్లి చూస్తే సార్ హాల్లోగానీ బెడ్రూమ్లోగానీ లేరు. అక్కడ రక్తపు మరకలు ఉన్నాయి. బాత్రూమ్లో చూస్తే వివేకం సార్ రక్తపుమడుగులో పడి ఉన్నారు. నేను సార్ చేయిపట్టుకుని నాడి చూశాను. నాడి కొట్టుకోవడంలేదు. ఆయన చనిపోయారని నిర్ధారించుకున్నా. సాక్షి: ఆ వెంటనే మీరు ఏం చేశారు? కృష్ణారెడ్డి: నేను వెంటనే సార్ అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డికి ఫోన్ చేసి చెప్పాను. బావ మనకు లేరు.. ఎవరో ఏదో చేశారు. రక్తపు మడుగులో ఉన్నారు. తల మీద గాయం ఉంది అని చెప్పాను. సరే అని ఆయన ఫోన్ పెట్టేశారు. నేను 6.15కు కాల్ చేశాను. నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి నాతో 47 సెకన్లు మాట్లాడి ఫోన్ పెట్టేశారు. ఆ తరువాత సార్ పెద్ద బావమరిది శివప్రకాశ్రెడ్డికి కాల్ చేశాను. కానీ, ఆయన ఫోన్ కలవలేదు. నాకు సౌభాగ్యమ్మ ఫోన్ నుంచి కాల్ వచి్చంది. నేను మేడంకు కూడా విషయం చెప్పాను. సాక్షి: ఆ తరువాత ఏం జరిగింది? కృష్ణారెడ్డి: నేను, ప్రకాశ్ అక్కడ ఉండగా వీల్ చెయిర్ దగ్గర లెటర్ దొరికింది. ఆ లెటర్ చదివాను. తన మాజీ డ్రైవర్ తనను చంపినట్లు వివేకం సార్ ఆ లెటర్లో రాసి ఉంది. ఇంతలో సౌభాగ్యమ్మ నాకు ఫోన్ చేశారు. అల్లుడు రాజశేఖర్రెడ్డికి ఫోన్ ఇమ్మన్నాను. ఆమె ఆయనకు ఫోన్ ఇస్తే ఆ లెటర్లో రాసింది చదివి వినిపించాను. ఆ లెటర్ను దాచిపెట్టు. ఎవరికి చెప్పొద్దు.. అని రాజశేఖర్రెడ్డి చెప్పారు. లెటర్ గురించి పోలీసులకు చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది కదా అని అన్నాను. ఏం ఇబ్బంది అవ్వదు.. మేం చూసుకుంటాం.. ఆ లెటర్ జాగ్రత్తగా దాచిపెట్టు అని ఆయన చెప్పారు. దాంతో ఆ లెటర్ విషయం పోలీసులకుగానీ ఎవరికీగానీ చెప్పలేదు. వంట మనిషి లక్ష్మమ్మ కొడుకు ప్రకాశ్కు ఆ లెటర్ ఇచ్చి మా ఇంట్లో ఇచ్చి రమ్మన్నాను. ఇంతలో రాజశేఖరరెడ్డి మళ్లీ నాకు ఫోన్ చేశారు. అప్పటికే సీఐ శంకరయ్య వచ్చారని చెప్పాను. ఆయన నా ఫోన్తో సీఐ శంకరయ్యతో మాట్లాడారు. తరువాత శంకరయ్య చెప్పినట్లుగా పోలీసు కంప్లైంట్ ఇవ్వమని రాజశేఖరరెడ్డి నాతో చెప్పారు. నేను అలానే చేశాను. సాక్షి: ఆ లెటర్ అప్పుడే పోలీసులకు ఇచ్చేసి ఉంటే ఈ కేసు దర్యాప్తు వేరే విధంగా ఉండేది కదా? కృష్ణారెడ్డి: ఆ లెటర్ అప్పుడే పోలీసులకు ఇచ్చి ఉంటే కేసు దర్యాప్తు సరైన విధంగా జరిగేది. కానీ, నాకు ఇష్టంలేకపోయినా రాజశేఖరరెడ్డి చెప్పడంతోనే ఆ లెటర్ను దాచి ఉంచాల్సి వచి్చంది. సాక్షి: మిమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు? కృష్ణారెడ్డి: నన్ను పోలీసులు ఎందుకు అరెస్టుచేశారో నాకే తెలీదు. లెటర్ దాచిపెట్టమని రాజశేఖరరెడ్డి చెప్పాడు. పోలీసులతో ఇబ్బంది వస్తుందని చెప్పినా తాను చూసుకుంటానని లెటర్ దాచి పెట్టమన్నాడు. టీడీపీ ప్రభుత్వం ఒత్తిడో.. వీళ్లు వాళ్లూ లాలూచీ అయి కృష్ణారెడ్డిని అరెస్టుచేయిస్తే సరిపోతుందని అనుకున్నారో తెలీదు. సాక్షి: మిమ్మల్ని అరెస్టు చేశాక ఏం జరిగింది? కృష్ణారెడ్డి: నన్ను అదేరోజు సాయంత్రం పోలీసులు అరెస్టుచేసి డీటీసీలో 13 రోజులపాటు ఉంచారు. బాగా కొట్టారు. రాజశేఖర్రెడ్డి చేశాడా.. శివశంకర్రెడ్డి చేసి ఉంటాడా చెప్పు అని తీవ్రంగా కొట్టారు. నాకు తెలీదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. సాక్షి: పోలీసులకు ముందు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి మీద అనుమానం కలిగిందా? కృష్ణారెడ్డి: పోలీసులు ముందు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డినే అనుమానించారు. వివేకం సార్ను ఆయనే హత్య చేయించి ఉంటాడా అని అడిగారు. నాకేమీ తెలీదని చెప్పాను. పోలీసులు కొట్టడంతో దాదాపు ఏడాదిపాటు నా చేతితో ఏమీ పట్టుకోలేకపోయాను. సాక్షి: లెటర్ను దాచి పెట్టమన్న రాజశేఖర్రెడ్డిని ఎందుకు ప్రశి్నంచరు అని మీరు పోలీసులను అడగలేదా? కృష్ణారెడ్డి: పోలీసులు నన్ను కొడుతూ ఉంటే నేనేం మాట్లాడను. నా మాట వాళ్లు వినిపించుకుంటే కదా. సాక్షి: రాజశేఖర్రెడ్డిని పోలీసులు ఎందుకు విచారించలేదు? కృష్ణారెడ్డి: ఎందుకు విచారించలేదో మరి. సీబీఐ వాళ్లకు కూడా అదే విషయం చెప్పాను. కానీ, వాళ్లు కూడా పట్టించుకోలేదు. వాళ్ల మధ్య ఏం ఒప్పందం ఉందో తెలీదు. సాక్షి: ఎంపీ అవినాశ్రెడ్డి సీఐ శంకరయ్యను బెదిరించారనే ఆరోపణ కూడా ఉంది కదా? కృష్ణారెడ్డి: సీఐ శంకరయ్య పక్కనే నేనున్నా. ఆయన్ని ఎవరూ బెదిరించనే లేదు. సాక్షి: సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టిన తరువాత ఎంపీ అవినాశ్రెడ్డి, శివశంకర్రెడ్డి పేర్లు చెప్పమని మీ మీద ఒత్తిడి వచి్చందా? కృష్ణారెడ్డి: ఎంపీ అవినాశ్, శివశంకర్రెడ్డి పేర్లు చెప్పాలని రాంసింగ్ నన్ను బాగా వేధించారు. వాళ్లిద్దరూ నన్ను బెదిరించారని చెప్పమన్నారు. అలాంటిదేమీ లేదని నేను చెప్పడంతో నన్ను బాగా కొట్టారు. ఉన్నది ఉన్నట్లు చెబుతాగానీ అబద్ధం చెప్పనని నేను అంటే మరింత గట్టిగా కొట్టేవారు. కొట్టినా చంపినా నాకు తెలిసింది ఇంతే అని చెప్పాను. సాక్షి: ఎంపీ అవినాశ్రెడ్డి, శివశంకర్రెడ్డి పేర్లను ఇరికించాలని సీబీఐ అధికారి రాంసింగ్ ఎందుకు భావించారు? కృష్ణారెడ్డి: సునీత, రాజశేఖరరెడ్డితో రాంసింగ్ ఏం కమిట్ అయ్యారో.. వాళ్లద్దరి పేర్లు చెప్పాలనే వేధించారు. సాక్షి: సీబీఐ అధికారి రాంసింగ్ మీతో ఎలా వ్యవహరించారు? కృష్ణారెడ్డి: ఒకరోజు రాంసింగ్ ఫోన్చేశారు. తాము చెప్పినట్లు విన్నారు కాబట్టే రంగన్న, దస్తగిరిలను రక్షించాం. నేను కూడా చెప్పినట్లు వింటే రక్షిస్తామన్నారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్హౌస్కు నా పిల్లలతో రమ్మని చెప్పారు. ఆ విషయాన్ని రాజశేఖర్రెడ్డికి చెబితే రాంసింగ్ చెప్పినట్లు చేయమన్నారు. మా ఇద్దరు కొడుకులతో సెంట్రల్ జైలు గెస్ట్హౌస్కు వెళ్లాం. వాళ్లు చెప్పినట్లు వినకపోతే జైలుకు పంపిస్తామని బెదిరించారు. తాము పెద్దపెద్ద వాళ్లనే జైలుకు పంపాం.. నువ్వెంత అని అన్నారు. నాకు తెలిసిందే చెబుతా తప్పా మీరు చెప్పమన్నట్లు అబద్ధం చెప్పలేనని నేను అన్నా. దాంతో కర్ర తీసుకుని నా కొడుకుల ముందే దాదాపు 20 సార్లు తీవ్రంగా కొట్టారు. సాక్షి: మీ అబ్బాయి పెళ్లిని చెడగొట్టారు అంటారు.. కృష్ణారెడ్డి: మేం సెంట్రల్ జైలు గెస్ట్హౌస్ నుంచి ఇంటికి వచి్చన మర్నాడే మా అబ్బాయికి సంబంధం కుదిరిన వారి నుంచి ఫోన్ వచి్చంది. పెళ్లి సంబంధం రద్దు చేసుకుంటున్నామని చెప్పారు. నా మీద కేసు ఉంది.. నేను జైలుకు వెళ్లాను.. మా ఆస్తులన్నీ తీసేసుకుంటామని సునీత, రాజశేఖర్రెడ్డి వారికి ఫోన్చేసి చెప్పారట. వాళ్లను హైదరాబాద్ పిలిపించుకుని మరీ బెదిరించి పెళ్లి సంబంధం రద్దుచేసుకునేలా చేశారు. వాళ్లు చెప్పినట్లు వినాలని నన్ను ఒప్పించేందుకు సునీత, రాజశేఖర్రెడ్డి అలా చేశారు. ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం కుదురుతుందని నేను వారికి లొంగలేదు. సాక్షి: మీరు రాంసింగ్ మీద ఫిర్యాదు చేశారు కదా? కృష్ణారెడ్డి: నేను ఎంతమందితో చిత్రవధలకు గురయ్యేది. టీడీపీ ప్రభుత్వంలో ముందు పోలీసులు కొట్టారు. సునీత, రాజశేఖర్రెడ్డి హైదరాబాద్ పిలిపించుకుని బెదిరించారు. మా అబ్బాయి పెళ్లి సంబంధం చెడగొట్టారు. సీబీఐ అధికారి రాంసింగ్ నన్ను కడపలో కొట్టారు. ఢిల్లీ పిలిపించుకుని గొడ్డును బాదినట్లు కొట్టారు. ఇక ఎంతమందితో దెబ్బలు తినాలి.. అందుకే ఎస్పీకి ఫిర్యాదు చేశాను. నాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించాలని కోరాను. పులివెందుల కోర్టులో కూడా పిటిషన్ వేశాను. సాక్షి: వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని ఎంపీ అవినాశ్రెడ్డి చెప్పారని ఒక ఆరోపణ వచి్చంది. ఆయన అలా చెప్పారా? కృష్ణారెడ్డి: ఆ మాటే వినలేదు. అసలు ఆ విషయం ఎలా బయటకు వచి్చందో కూడా నాకు తెలీదు. సాక్షి: దస్తగిరి ఎలాంటి వ్యక్తి? కృష్ణారెడ్డి: దస్తగిరి డ్రైవర్గా ఉండేవాడు. ప్రవర్తన సరిగా లేదని తీసేశారు. వివేకం సార్ను ముసలోడా అనేవాడు. డ్యాన్స్ చేసేవాడు.. వెక్కిరించేవాడు. దాంతో సౌభాగ్యమ్మ అతనిని పని నుంచి తీసేశారు. అతని ఇంట్లో వాళ్లు వచ్చి బాధపడితే సౌభాగ్యమ్మను ఒప్పించి మళ్లీ పనిలో పెట్టించాను. కానీ, ఆ తరువాత దస్తగిరి మరింత మారిపోయాడు. వివేకం సార్ షమీమ్ ఇంటికి వెళ్లాలంటే ఇతనే డ్రైవర్. దాంతో దస్తగిరికే ఆయన ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చేవారు. దస్తగిరి డబ్బు మనిషి. సాక్షి: హత్య ప్రదేశంలో సాక్ష్యాధారాలను చెరిపేయాలని ఎంపీ అవినాశ్రెడ్డి మీతో చెప్పారని కొందరు ఆరోపిస్తున్నారు? దీనిపై ఏమంటారు? కృష్ణారెడ్డి: అసలు వివేకం సార్ మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి తీసుకువచి్చనప్పుడు ఎంపీ అవినాశ్రెడ్డి అక్కడ లేనేలేరు. అక్కడ సాక్ష్యాలను చెరిపి వేయించింది ఎర్ర గంగిరెడ్డే. ఎంపీ అవినాశ్రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే ఆ ఆరోపణలు చేస్తున్నట్లుగా ఉంది. అక్కడ తుడిపించి వేసింది గంగిరెడ్డే. అక్కడున్న అందరూ అది చూశారు. సాక్షి: సీబీఐ అధికారులు పిలిస్తే మీరు ఢిల్లీ వెళ్లారు కదా.. అక్కడ ఏం జరిగింది? కృష్ణారెడ్డి: సీఐబీ అధికారులు నోటీసు ఇస్తే ఢిల్లీ వెళ్లాను. నర్రెడ్డి రాజశేఖర్రెడ్డికి చెప్పే వెళ్లాను. నన్ను ఢిల్లీలో నెలరోజులు ఉంచి తీవ్రంగా వేధించారు. ఎంపీ అవినాశ్రెడ్డి, శివశంకర్రెడ్డి పేర్లు చెప్పాలని అక్కడ కూడా రాంసింగే వేధించారు. నాకు తెలిసింది ఇప్పటికే చెప్పాను. లెటర్ దాచి పెట్టడమే నేను చేసిన తప్పు.. అది కూడా రాజశేఖర్రెడ్డి చెబితేనే చేశాను.. అంతకుమించి నాకేమీ తెలీదని చెప్పాను. దాంతో వాళ్లు నన్ను కొట్టేవారు. రోజూ రాత్రి సునీత, రాజశేఖర్రెడ్డి ఫోన్ చేసేవారు. నన్ను తీవ్రంగా కొడుతున్నారని వారికి నేను చెప్పేవాడిని.. నెల రోజులవుతోందని చెప్పినా వారు పట్టించుకోలేదు. సాక్షి: మామా అల్లుళ్ల మధ్య సంబంధాలు ఎలా ఉండేవి? కృష్ణారెడ్డి: నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి మీద వివేకం సార్కు మంచి అభిప్రాయంలేదు. అల్లుడు కాబట్టి తప్పదు కదా. ఆయన మీద సార్ తరచూ కోప్పడేవారు. ఆ కుటుంబంలో ఏం జరుగుతోందో నాకు తెలీదు. కానీ, అల్లుడి మీద సార్ గట్టిగా అరుస్తూ ఉండేవారు. వివేకం సార్ రెండో భార్య షమీమ్ విషయంలోనే వాళ్ల మధ్య గొడవలు జరిగేవి. సాక్షి: వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ కుటుంబంలో గొడవలు జరిగేవా? కృష్ణారెడ్డి: షమీమ్ అనే ఆవిడను వివేకం సార్ రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ కుటుంబంలో గొడవలు జరిగేవి. ఒకరోజు సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్రెడ్డి, శివప్రకాశ్రెడ్డి కలిసి వివేకం సార్తో గొడవ పడ్డారు. తాను షమీమ్ను పెళ్లి చేసుకోవడమే కాదు ఆమెతో తనకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడని సార్ చెప్పారు. ఆ ఇద్దరి బాధ్యతతోపాటు ఆమెకున్న ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేయడం కూడా తన బాధ్యతేనని అన్నారు. సాక్షి: సునీత ఎందుకు అంతగా కేకలు వేశారు? కృష్ణారెడ్డి: నా మీద సునీత కోపంతో అరుస్తూ ఉంటే రాజశేఖర్రెడ్డి ఆమెను సముదాయించేందుకు యత్నించారు. ‘ఈ కేసు విషయంలో కృష్ణారెడ్డి సహకరించకపోతే రాజశేఖర్రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుంది’ అని సునీత ఆయనతో అంది. నాకేమీ అర్థం కాలేదు. వివేకం సార్ హత్యలో వీళ్ల పాత్ర ఉందేమోనని మొదటిసారి అనిపించింది. అంటే నాతో అబద్ధం చెప్పించి వేరెవరినో నాశనం చేయాలని సునీత భావిస్తోందని అర్థమైంది. సాక్షి: వివేకానందరెడ్డిని ఎవరు చంపి ఉంటారు? మీతో ఎందుకు అబద్ధం చెప్పించాలని చూస్తున్నారు? కృష్ణారెడ్డి: ఎంపీ అవినాశ్రెడ్డి, భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డి పేర్లు చెప్పాలని సునీత, రాజశేఖర్రెడ్డి ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థంకావడంలేదు. నాతో ఒక అబద్ధం చెప్పించాలని ప్రయత్నిస్తున్నారంటే.. దాని వెనుక వాళ్లకేదో ఉద్దేశం ఉండే ఉంటుంది. ఎవర్నో కాపాడేందుకు.. ఏదో నిజాన్ని దాచేందుకే వాళ్లిద్దరూ ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. సీబీఐ అధికారి రాంసింగ్ కూడా నాతో అబద్ధాలు చెప్పాలని ఎందుకు పట్టుబట్టారో తెలీడంలేదు. కేసు దర్యాప్తు సక్రమంగా సాగితేనే వాస్తవాలు బయటకొస్తాయి. కానీ, సీబీఐ తీరు సక్రమంగాలేదు. అదే బాధేస్తోంది. సాక్షి: చివరగా.. వివేకా హత్య గురించి ఏమంటారు? కృష్ణారెడ్డి: జరుగుతున్నదంతా చూస్తే.. సునీత, రాజశేఖర్రెడ్డి, శివప్రకాశ్రెడ్డిల మీదే అనుమానం కలుగుతోంది. వీళ్లే వివేకం సార్ను ఏమైనా చేసి మరొకరి మీద నింద వేయాలని చూస్తున్నారా అనిపిస్తోంది. ఆస్తి గొడవలు, షమీమ్ విషయం.. ఆస్తి వేరొకరికి పోతుందనే చేశారా అనిపిస్తోంది. ఎందుకంటే అబద్ధం చెప్పమని నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఎవరైనా నిజం చెప్పాలని అంటారు. కానీ, అబద్ధం చెప్పమని వీళ్లు ఎందుకు అంటున్నారన్నది చూడాలి. అందుకే వివేకం సార్ను వీళ్లే ఏమైనా చేశారనిపిస్తోంది. నేను అబద్ధం చెప్పకపోతే తన భర్త రాజశేఖర్రెడ్డి జైలుకు పోతారని కూడా సునీత నా ముందే అంది. -
వివేకా, సునీతమ్మకు మాటల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో.. సునీతా దంపతులపై ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నర్రెడ్డి సునీత యెల్లో మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేయగా.. సాక్షితో కృష్ణారెడ్డి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కృష్ణారెడ్డి పలు నిజాల్ని పంచుకున్నారు. ‘‘వివేకానందరెడ్డితో నాది 35 ఏళ్ల అనుబంధం. ఆయన హత్య గురించి ముందు నాకే తెలిసింది. వెంటనే ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డికి ఫోన్ చేశాను. వివేకాను ఎవరో ఏదో చేశారని స్పష్టంగా చెప్పాను. అయితే.. లెటర్ విషయం ఎవరికీ చెప్పొద్దని నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి నాతో అన్నారు. అలాగే ఈ కేసులో అసలు గుండెపోటు కోణం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. .. వివేకా హత్య జరిగిన రోజే నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్, సునీతా దంపతులు నన్ను బెదిరించారు. తాము చెప్పిన పేర్లు సీబీఐ ముందు చెప్పాలని నన్ను ఒత్తిడి చేశారు. వివేకా కేసులో అవినాష్రెడ్డి, శివశంకర్రెడ్డి పేర్లు చెప్పాలన్నారు. నానా హింసలకు గురి చేశారు. లేదంటే జైలుకు పంపిస్తామన్నారు. .. వివేకానందరెడ్డి, సునీతమ్మ చాలాకాలంగా మాట్లాడుకోలేదు. వివేకా రెండో వివాహం విషయంలో గొడవలు జరిగాయి. రెండో భార్య షమీమ్ కొడుకును వారసుడిగా చేస్తారనే వివేకా చెక్ పవర్ తొలగించారు. వివేకానందరెడ్డికి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్రెడ్డిపై మంచి అభిప్రాయం లేదు. అల్లుడిపై ఆయన ఎప్పుడూ కోపంగానే ఉండేవారు అని తెలిపారాయన. -
Watch: తండ్రి హత్య కేసులో కూతురు చెప్పని నిజాలు!
-
Watch: తండ్రి హత్య కేసులో కూతురు చెప్పని నిజాలివే..
-
అక్రమ మైనింగ్ తో వేల కోట్లు నొక్కేసిన కావలి టిడిపి ఇన్ ఛార్జ్ కృష్ణారెడ్డి
-
అడ్డదారుల్లో కోట్లు ఆర్జించాడు.. డబ్బు సంచులతో సీటు కొనుగోలు!
టీడీపీ కావలి సీటు విషయంలో ఆ పార్టీ అధిష్టానం చివరకు క్యాష్ వైపే మొగ్గు చూపింది. కావ్య కృష్ణారెడ్డికే జై కొట్టి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించింది. పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచి డబ్బుసంచుల వైపు చూడడంతో దీనిని కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. దశాబ్దాల నుంచి కావలిలో టీడీపీని కాపు కాసిన బీద రవిచంద్ర మాట కూడా చెల్లుబాటు కాలేదు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడికి సైతం మొండిచేయి చూపడంతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి టీడీపీ ఇన్చార్జిగా కావ్య కృష్ణారెడ్డి (దగుమాటి వెంకట కృష్ణారెడ్డి)ని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. స్థానికుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా అభ్యర్థి ప్రకటన చేయడంపై క్యాడర్ మండిపడుతోంది. బీద రవిచంద్ర దశాబ్దాల కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఆ కుటుంబానికే పార్టీ ప్రాధాన్యత ఇవ్వడంతో వారే అన్నీ తామై నడిపించేవారు. కానీ ఈ దఫా బీద రవించంద్ర, ఆయన సతీమణిని ఎన్నికల బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగినా స్థానికంగా పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో తన ప్రధాన అనుచరుడిగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడిని ఇన్చార్జిగా నియామకం చేయించారు. కష్టకాలంలో మాలేపాటి పార్టీ కోసం నిలబడ్డారు. గత టీడీపీ హయాంలో అడ్డగోలుగా దోపిడీ చేసిన సొమ్ములో కాస్త కరిగించేలా చేశారు. చివరకు ఎన్నికల సమయంలో మాలేపాటికి టికెట్ ఇప్పించే ప్రయత్నంలో బీద మాట చెల్లుబాటు కాకపోవడంతో మిన్నకుండిపోవాల్సివచ్చింది. కావ్య వర్సెస్ బీద కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీలోకి ఎంట్రీ ఇవ్వకముందే బీద రవిచంద్రతో అమీతుమీకి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. డబ్బు సంచులతో పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని టికెట్ ఖరారు చేయించుకుని వచ్చిన కావ్య కావలిలో హడావుడి చేశారు. బీదకు వ్యతిరేక వర్గాన్ని కూడదీయడంతోపాటు ఇకపై బీద మాట వినాల్సిన అవసరం లేదని, అంతా తన కనుసన్నల్లోనే జరుగుతుందనే సంకేతాలను కూడా ఆ పార్టీ కార్యకర్తల్లోకి పంపారు. కావ్య కృష్ణారెడ్డి ముందుగానే పార్టీ ఫండ్ పేరుతో రూ.కోటి విరాళం ఇచ్చారు. అంతేకాక ఏకంగా రూ.20 కోట్లు పార్టీ ఫండ్ కింద జమ చేసి మరో రూ.50 కోట్లు ఇచ్చే దానికై నా సిద్ధంగా ఉన్నానని సంకేతం పంపి లోకేశ్ వద్ద మార్కులు కొట్టేసి టికెట్ ఖరారు చేయించుకున్నారని తెలుస్తోంది. అడ్డదారులు తొక్కుతూ.. సుమారు పాతికేళ్ల క్రితం కామర్స్ అధ్యాపకుడిగా ఉన్న కావ్య కృష్ణారెడ్డి తాను నివాసం ఉండే ఇంటికి అద్దె చెల్లించలేని స్థితి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రూ.వేల కోట్లకు అధిపతి అయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్లు పెట్టి అడ్డదారులు తొక్కుతూ అతి తక్కువ కాలంలోనే మైనింగ్ డాన్గా ఎదిగారు. అడ్డగోలుగా ఎదిగిన కావ్య కృష్ణారెడ్డి అందించిన డబ్బు సంచులకు సాగిలపడిన టీడీపీ ఆయనకు కావలి సీటు ఖరారు చేయడంపై ఆ పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పదవి పేరుతో ముంచేసి.. మండలస్థాయి నేతగా ఉన్న తనను కావలి నియోజకవర్గ ఇన్చార్జి పదవి పేరుతో ముంచేశారని మాలేపాటి సుబ్బానాయుడు తన అంతరంగీకుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. గత టీడీపీ హయాంలో అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన మాలేపాటిని కావలి సీటు పేరుతో బీద ఊరించి అతని చేత ఖర్చు పెట్టించారని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అతనిని నట్టేట ముంచారని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. -
హంతకులు ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
-
కృష్ణారెడ్డిని గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి చంపిన టీడీపీ నేతలు
-
మోదీ నాయకత్వాన్ని బలపర్చాలి: బండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నారైలు ఎన్నికలప్పుడు భారతదేశానికి వచ్చి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలప రచాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ(అఫ్ బీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్నియ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడటం తప్ప అభివృద్ధి చేసిందేమీలేదని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తామని కేంద్ర హోంమంత్రి ప్రకటించడంపై తెలంగాణ ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. కార్యక్రమంలో అఫ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అనుగుల కృష్ణారెడ్డి, తెలంగాణ అఫ్–బీజేపీ కన్వినర్ విలాస్రెడ్డి, సంతోష్ రెడ్డి, తుమ్మల శ్రీకాంత్రెడ్డి, యంజాల వంశీ, కట్టా ప్రదీప్రెడ్డి, మధుకర్, సముద్రాల గోపి, అమెరికన్ తెలుగు అసోసియేషన్, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్మెంట్.. డాక్టర్బాబు సందడి
ఈ మధ్య సెలబ్రిటీలు పెళ్లి, నిశ్చాతార్థం లాంటి వాటితో బిజీ అయిపోతున్నారు. ఈ మధ్య సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె రూట్ లోనే ప్రముఖ తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ వేడుకలో డాక్టర్బాబు.. అదేనండి నిరూపమ్ తోపాటు పలువురు సందడి చేశారు. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?) తెలుగు ప్రేక్షకులు సినిమాలని ఎంత ఆదరిస్తారో.. సీరియల్స్ని అంతకంటే ఎక్కువగా చూసేస్తుంటారు. అలా ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన ముద్దమందారం, ముత్యమంత ముద్దు లాంటి సీరియల్స్తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కృష్ణా రెడ్డి ప్రస్తుతం పలు సీరియల్స్లో నటిస్తున్నాడు. ఇప్పుడు అతడు స్వాతి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. బహుశా ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా ఉండొచ్చు. ఈ వేడుకలో పలువురు సీరియల్ స్టార్స్ సందడి చేసి, కొత్త జంటని ఆశీర్వాదించారు. (ఇదీ చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!) -
అసంతృప్తి ఆగేనా.. అభ్యర్థి గెలిచేనా?
హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి.. అది దక్కని ఆశావహులు అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టికెట్ నీకా? నాకా ? అన్నట్లు పోరాడిన వారు తమకు దక్కని టికెట్ ఇతరులకు దక్కితే వారితో కలిసి పనిచేయడం అసాధ్యమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిష్టానం మాట కాదనలేక కలిసి పని చేయగలమని తలాడించినప్పటికీ, నిజంగా క్షేత్రస్థాయిలో ఏమేరకు పని చేయగలరన్నది వేచి చూడాల్సిందే. ఉదాహరణకు ఉప్పల్ అభ్యర్థికి టికెట్ రాకుండా చివరి నిమిషం వరకు ప్రయత్నం చేసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రస్తుత ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఎన్నికల్లో బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసం పనిచేయగలరా? అని స్థానికులే ప్రశ్నిస్తున్నారు. అలాగే.. అంబర్పేటలో టికెట్ కోసం ప్రయత్నించిన ఎడ్ల సుధాకర్, కాలేరు వెంకటేశ్కు టికెట్ ఇవ్వొద్దని బ్యానర్లు కట్టి డిమాండ్ చేసిన తాజా, మాజీ కార్పొరేటర్లు, తదితరులు ఆయన విజయానికి పనిచేస్తారా? అనే సందేహాలున్నాయి. ముషీరాబాద్లో ఎమ్మెన్ శ్రీనివాసరావు, ఆయన అనుయాయులు ముఠాగోపాల్ కోసం పనిచేస్తారా? అనేది అంతుచిక్కడం లేదు. కంటోన్మెంట్లోనూ టికెట్ కోసం కడదాకా పోరాడిన గజ్జెల నగేష్, మన్నె క్రిశాంక్, శ్రీగణేశ్ లాస్యనందితకు సహకరించగలరా అన్నది సందేహాస్పదమే. వీరిలో శ్రీగణేశ్ ఇప్పటికే ఇండిపెండెంట్గానైనా సరే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మహేశ్వరం టికెట్ రాని పక్షంలో తీగల కృష్ణారెడ్డి పార్టీ మారతారని ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఎల్బీనగర్ నుంచి ముద్దగోని రామ్మోహన్గౌడ్, రాజేంద్రనగర్ టికెట్ కోసం ప్రయత్నించిన ఎంపీ రంజిత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్రెడ్డి, శేరిలింగంపల్లిలో టికెట్ తనకే వస్తుందని భావించిన బండి రమేశ్ తదితరులు ఎంపికై న అభ్యర్థుల కోసం ఏమేరకు కృషి చేస్తారో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో టికెట్ దక్కించుకున్న వారు అసంతృప్తులను తమ దారికి తెచ్చుకోగలరా.. వారి నడుమ సఖ్యత సాధ్యమేనా.. అన్నది కాలమే తేల్చనుంది. -
నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి చెబుతున్నది తప్పు: వివేకా పీఏ కృష్ణారెడ్డి
సాక్షి, కడప: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ కేసును ఏళ్ల తరబడి విచారించిన సీబీఐ ఏకంగా ముగ్గురు విచారణాధికారులను నియమించింది. తొలి చార్జిషీటు దాఖలు చేసేందుకు ఏకంగా 474 రోజులు తీసుకుంది. మరోవైపు ఈ కేసు విషయంలో వివేకా పీఏగా పనిచేసిన కృష్టారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్య కేసులో నాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదు. శివశంకర్ రెడ్డి మా ఇంట్లో ఉన్నట్టు చెబుతున్నది అవాస్తవమని ఖండించారు. ఇది కూడా చదవండి: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ‘ది వైర్’ సంచలన కథనం -
లోకేశ్ యాత్రలో బీద జ్యోతి ఎంట్రీతో అయోమయం
కావలి టీడీపీ ఆది నుంచి చుక్కాని లేని నావలా ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే కావలిలో గెలిచింది. జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఒకసారి, తర్వాత మరోసారి మాత్రమే అత్తెసరు ఓట్లతో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి ఆ పార్టీ రాజకీయ కల్లోలాన్ని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో పార్టీని నడిపించేందుకు బీద రవిచంద్ర రాజకీయ డ్రామాకు తెర తీశారు. నాలుగేళ్లుగా పార్టీని నడిపించేందుకు మాలేపాటిని వాడుకున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశ చూపి పార్టీకి ఫండ్ ఇప్పించి కావ్యను ఊరించారు. చివరికి రవిచంద్ర భార్య జ్యోతిని ఎంట్రీ చేయించి ట్విస్ట్ ఇచ్చాడు. తాజా పరిణామాలు ఆ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. నేటి లోకేశ్ బహిరంగ సభకు జన సమీకరణపై అయోమయం నెలకొంది. నెల్లూరు: ఉనికి కోల్పోయిన టీడీపీని బతికించాలని లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రతో కావలిలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి కనిపిస్తోంది. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో బీద సోదరులు రాజకీయంగా లైమ్లైట్లోకి వచ్చారు. టీడీపీలో బీద మస్తాన్రావు అండతో ఆయన సోదరుడు బీద రవిచంద్ర రాజకీయంగా ఎదిగాడు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీ విజయాలను తన విజయాలుగా భ్రమింపచేశారు. 2009లో బీద మస్తాన్రావు ఎమ్మెల్యే అయినప్పటికీ వ్యాపార వ్యవహారాల్లో తలమునకలై ఉండడంతో బీద రవిచంద్ర కావలిలో షాడో ఎమ్మెల్యేగా హడావుడి చేశాడు. ఆ సమయంలోనే రవిచంద్ర నియోజకవర్గంలో తన కోటరీని సృష్టించుకున్నాడు. కావలి టికెట్పై ఆశలు పెంచుకుని 2014 ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేశాడు. అయితే టికెట్ తన సోదరుడు బీద మస్తాన్రావుకే ఇవ్వడంతో పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని హామీ ఇవ్వడంతో మిన్నకుండిపోయాడు. ఆ ఎన్నికల్లో బీద మస్తాన్రావు ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా తన సతీమణిని బరిలోకి దింపాలని తెరవెనుక రాజకీయం నెరిపినా.. చివరికి మస్తాన్రావు తన పలుకుబడి ఉపయోగించి కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డిని బరిలోకి దింపడంతో రవిచంద్ర ఆశలు ఆవిరయ్యాయి. ఆ తర్వాత బీద మస్తాన్రావు, విష్ణువర్ధన్రెడ్డి పార్టీకి దూరం కావడంతో కావలి బాధ్యతలను రవిచంద్రకు అప్పగించారు. 2019లో ఓటమి తర్వాత.. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడం, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ఈ దశలో పార్టీని నడిపించేందుకు మాలేపాటిని కావలి నియోజవకర్గ ఇన్చార్జిగా నియమించి రాబోయే ఎన్నికల్లో టికెట్ నీదేనంటూ నాలుగేళ్లుగా వాడుకున్నాడు. అయినప్పటికీ పెత్తనమంతా బీద తన చెప్పు చేతుల్లోనే పెట్టుకున్నాడు. కావ్యకు టికెట్ ఆశలు తన జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కాకపోయినా.. కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిని అనిపించుకోవాలని తహతహలాడుతున్న దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ( కావ్య కృష్ణారెడ్డి) ఈ పార్టీ.. ఆ పార్టీ అని తేడా అన్ని పార్టీల్లో ప్రయత్నించారు. ఇతను అయితే పార్టీకి ఉపయోగపడుతాడు.. చివరి వరకు వాడుకోవచ్చునని పార్టీ పెద్దలతో మాట్లాడించి అతనికి టికెట్ ఆశలు రేపాడు. దీంతో కావ్య కృష్ణారెడ్డి చేత పార్టీకి మహానాడులో ఫండ్ ఇప్పించాడు. కావలి టికెట్ తనకే అంటూ ఇటు మాలేపాటి, అటు కావ్య ఇద్దరూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నా.. అధిష్టానం నుంచి ఎటువంటి స్పష్టత లేదు. యువగళంలో బీద సతీమణి ఎంట్రీ ట్విస్ట్ కావలిలో లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేయడానికి రవిచంద్ర పెట్టిన సమావేశంలో మాలేపాటి సుబ్బానాయుడు అంతా భారం తనపైనే వేయాలని, ఏ ఒక్కరిని భాగస్వామ్యం చేయొద్దని ఖరాఖండిగా చెప్పారు. లోకేశ్ పాదయాత్ర ఏర్పాట్లు, ఖర్చు అంతా కూడా మాలేపాటి చూసుకుంటారు, ఎవరూ ఎక్కడా జోక్యం చేసుకోవద్దని నాయకులకు చెప్పేశాడు. దీంతో వీరిద్దరూ సైలెంట్ అయిపోయారు. లోకేశ్ యాత్ర కావలి నియోజకవర్గంలోకి అడుగుపెట్టే సమయానికి కాలు బాధతో రెస్ట్లో ఉన్న బీద తన సతీమణి జ్యోతిని ఎంట్రీ చేయించారు. లోకేశ్ యాత్రలో ఆమె అంతా తానై వ్యవహరిస్తుండడంతో అంతా అయోమయం నెలకొంది. గతంలోనే తన సతీమణికి టికెట్ ఇప్పించుకోవాలని చూశారు. కావ్య, పసుపులేటి కేవలం టికెట్ ఇస్తేనే ఉంటారు.. లేదంటే బయటకు పోతారు. కానీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రవిచంద్రను కాదని మరెవరికి టికెట్వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తన సతీమణిని రంగంలోకి దింపడానికే యువగళంలో బీద జ్యోతిని ఎంట్రీ ఇప్పించాడని ప్రచారం. అయితే సోమవారం కావలిలో లోకేశ్ బహిరంగ సభకు జన సమీకరణకు ఉత్సాహంగా ఉన్న నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. నేటి లోకేశ్ సభ పరిస్థితిపై అయోమయం నెలకొంది. -
మైనింగ్ డాన్ కావ్య కృష్ణారెడ్డికి ముకుతాడు
పాతికేళ్ల క్రితం అతనో కామర్స్ అధ్యాపకుడు. తాను ఉండే ఇంటికి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి.. జలదంకి ఎంపీపీగా ఎన్నికై మైనింగ్ డాన్గా ఎదిగాడు. రియల్ ఎస్టేట్ నుంచి క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్లు పెట్టి అడ్డదారులు తొక్కుతూ అతి తక్కువ కాలంలోనే వేల కోట్లకు అధిపతి అయ్యాడు. ఆయనే గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ యజమాని డీవీ కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి. ఇన్నాళ్లు తెరచాటుగా సాగిస్తున్న అతని అవినీతి బాగోతం ఇటీవల సమాచారహక్కు చట్టంతో బయటపడింది. ‘స్పందన’ ఫిర్యాదుతో వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వం అతని అక్రమాలపై విచారణ జరిపి రూ.140 కోట్ల జరిమానా విధించి ఆ మైనింగ్ డాన్ దురాగతాలకు ముకుతాడు వేసింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జలదంకి మండలానికి చెందిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ యజమాని డీవీ కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి 2008లో రోడ్డు మెటల్ పేరుతో లీజుకు తీసుకున్న క్వారీలే అడ్డాగా సమీపంలోని అనధికార భూముల్లో మెటల్ తవ్వేసి వందల కోట్ల రూపాయల దోపిడీకి తెరతీశాడు. పదేళ్ల కాలపరిమితికి లీజుకు తీసుకుని గడువు ముగిసి ఐదేళ్లు దాటిపోయినా యథేచ్ఛగా మైనింగ్ చేస్తున్నాడు. క్వారీ మైనింగ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్లు, కూలీల నివాసాలు, పెట్రోల్ బంకుల వంటివి ఏర్పాటు చేశాడు. అక్రమాలను తరచి చూస్తే.. గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరు మీద డీవీ కృష్ణారెడ్డి, డి.కవిత పేరుతో జలదంకి మండలం గట్టుపల్లిలో సర్వేనంబర్ 1015లో 9.47 ఎకరాల భూమిని రోడ్డు మెటల్ తవ్వకానికి పదేళ్ల కాలపరిమితితో (26.02.2008 నుంచి 25.02.2018) మైనింగ్ లీజు హక్కులు పొందాడు. అదే మండలం అన్నవరంలో సర్వేనంబర్ 851/2పీలో 5.36 ఎకరాల భూమిని రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరుతో రోడ్డు మెటల్ తవ్వకానికి 10 ఏళ్ల కాలపరిమితితో (26.02.2008 నుంచి 25.02.2018) మైనింగ్ లీజు హక్కులు పొందాడు. అయితే గట్టుపల్లి క్వారీలో టన్ను మెటల్ కూడా తవ్వకుండా అక్కడే క్రషర్లు, పెట్రోల్ బంకు, కూలీల నివాస భవనాలు, కార్యాలయం వంటివి ఏర్పాటు చేశాడు. అయితే ఈ క్వారీ నుంచి 28 వేల క్యూబిక్ మీటర్ల మెటల్ రవాణాకు పర్మిట్లు జారీ చేయడం గమనార్హం. ఈ క్వారీకి సంబంధించి పదేళ్ల లీజు కాలపరిమితి 2018 ఫిబ్రవరి 25వ తేదీ నాటికే పూర్తయితే 15 ఏళ్ల లీజు కాలపరిమితి పెంచమని ప్రతిపాదిస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది మైనింగ్శాఖ వద్ద పరిశీలనలో ఉండడంతో ఆ లీజు కొనసాగుతూనే ఉంది. గట్టుపల్లి క్వారీ పక్కనే ఉన్న ఇతరుల భూములు, ప్రభుత్వ భూముల్లో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్ను అక్రమంగా తవ్వేసినట్లు ఇటీవల మైనింగ్శాఖ తనిఖీల్లో బట్టబయలైంది. అన్నవరం క్వారీకి లీజు గడువు పెంచమనే అభ్యర్థనను కూడా మైనింగ్ శాఖ తిరస్కరించింది. అన్నవరం క్వారీతోపాటు పక్కనే ఉన్న భూముల్లో కూడా అక్రమంగా మైనింగ్ చేపట్టి 5 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్ను తవ్వేసినట్లు వెలుగుచూసింది. ఈ క్వారీ లీజు గడువు ముగిసినప్పటికీ గత ఐదేళ్లుగా గట్టుపల్లి క్వారీ పరి్మట్తోనే విచ్చలవిడిగా మైనింగ్ చేపట్టాడు. మొత్తంగా 12 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్ను అక్రమంగా తవి్వనట్లు మైనింగ్ శాఖ లెక్కలు తేల్చింది. అక్రమంగా తవ్వేసిన మెటల్ విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.200 కోట్లు ఉంటుందని, మార్కెట్ ధర ప్రకారం రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. కావ్య కృష్ణారెడ్డి అక్రమాలపై స్థానికులు సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా సదరు వ్యక్తులు ‘స్పందన’లో ఫిర్యాదు చేయడంతో అక్రమాల బాగోతం బయటపడింది. కరెంట్ బిల్లు ఆధారంగా.. గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్, రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరుతో తీసుకున్న లీజు క్వారీల్లో అక్రమ మైనింగ్ జరగలేదని తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. క్రషర్లకు వినియోగించిన కరెంట్ బిల్లుల ఆధారంగా లెక్కలు తీయగా, 89 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగించినట్లు తేలింది. టన్ను మెటల్ ప్రాసెస్ చేయడానికి 2.5 యూనిట్లు ఖర్చవుతుందని, ఆ మేరకు 12 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్ను అక్రమంగా తవ్వేసినట్లు నిర్ధారించారు. చితికిన ప్రాణాలు అక్రమ మైనింగ్ వాహనాల కింద పడి పదేళ్ల కాలంలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. నిత్యం వందలాది వాహనాల్లో రోడ్మెటల్ నుంచి పెద్ద బండరాళ్లు, కంకర, మట్టి లాంటి సహజ వనరులను లూటీ చేశారు. ఈ అక్రమ రవాణా వాహనాల కిందపడి పలువురు ప్రాణాలు కోల్పోయినా ఎలాంటి కేసులు లేకుండా భయపెట్టి రాజీచేసి పంపించేవారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనధికార బ్లాస్టింగ్లు చేస్తూ ఊరినే వణికిస్తున్నా అధికారులు, పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులను ప్రలోభపెట్టి.. అక్రమ మైనింగ్కు స్థానిక రెవెన్యూ, పోలీస్, మైనింగ్శాఖల సహకారం ఉన్నట్లు ఆ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అనుమతి లేని అక్రమ మైనింగ్పై ఎన్నోమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించిన దాఖలాలు లేవని చెబుతున్నారు. ఈ అక్రమాల గురించి ప్రశ్నించిన వారిపై దాడులు చేయించడంతోపాటు ఇళ్లకు వెళ్లి బెదిరించేవారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా మధ్యస్తం చేసి పంపేవారని స్థానికులు పేర్కొంటున్నారు. గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లతో.. డీవీ కృష్ణారెడ్డి అక్రమాల దందా ఈనాటి కాదు. కొన్నేళ్ల క్రితమే నెల్లూరు పెన్నానది, నాయుడుపేటలోని స్వర్ణముఖి నదీతీరంలో గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లు ఏర్పాట్లు చేసి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఈ యూనిట్కు కంకర, సిమెంట్ కొనుగోలు చేసినా.. ఇసుకను మాత్రం నదీ తీరాల్లోనిదే వాడినట్లు సమాచారం. ఈ రెండు ప్లాంట్ల నుంచి నిత్యం వందల ట్యాంకర్ల కాంక్రీట్ మిక్సింగ్ వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. గతంలో ఇసుక ఉచితంగా ఉండడంతో రూపాయి ఖర్చు లేకుండా నదీతీరాలను తవ్వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీ అమలు చేసి ధర నిర్ణయించింది. అయితే గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లలో ఈ నాలుగేళ్లలో ఎంత ఇసుక వినియోగించారు.. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే వివరాలను పరిశీలిస్తే అందులోని అక్రమాలు కూడా బట్టబయలయ్యే అవకాశం ఉంది. ఈ రెండు క్రషర్ల వద్ద కరెంట్ వినియోగాన్ని లెక్కిస్తే మరికొన్ని నిజాలు కూడా వెలుగుచూసే అవకాశం ఉంది. అక్రమాలపై తొమ్మిదేళ్లుగా పోరాటం గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్ యజమాని డీవీ కృష్ణారెడ్డి ఎన్నో ఏళ్లుగా సహజ వనరులను దోచుకుంటున్నాడు. అక్రమ మైనింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించాడు. మా గట్టుపల్లి పంచాయతీలో సహజ వనరులు దోచుకుంటున్నా ఒక్క రూపాయి కూడా పంచాయతీకి సీనరేజ్ చెల్లించేవాడు కాదు. అతని అక్రమాలపై తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తున్నా. అక్రమాలను ప్రశ్నించినందుకు మా కుటుంబంపై దాడులు చేయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నా తొమ్మిదేళ్ల పోరాటానికి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం మద్దతుగా నిలిచింది. విచారణ జరిపి జరిమానా విధించడం ద్వారా అక్రమ మైనింగ్కు అడ్డుకట్టపడింది. – గుమ్మలపాటి సుబ్బారావు, ఉప సర్పంచ్, గట్టుపల్లి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ ద్వారా గట్టుపల్లి పంచాయతీలో దోపిడీ చేస్తున్నారు. అనుమతు లు లేకుండా సహజ వనరులను దోచుకుంటున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గ్రామస్తులు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మైనింగ్ అక్రమాలపై చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. – దివి నరేంద్రచౌదరి, గట్టుపల్లి, జలదంకి మండలం -
నర్రెడ్డి సోదరులు చెప్పినట్టే చేశా: కృష్ణ రెడ్డి
-
నర్రెడ్డి సోదరులు చెప్పినట్టే చేశా: వివేకా పీఏ కృష్ణారెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందాక ఆయన అల్లుడు.. బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, అతని సోదరుడు నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డిలు చెప్పినట్టే చేశానని వివేకా పీఏ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పెద్దోళ్లు కనుక వారు చెప్పినట్టే చేయాల్సి వచ్చిందన్నారు. ‘వారు చెప్పినట్లు చేయకపోతే నువ్వు కూడా జైలుకు వెళ్తావు’ అని వివేకా కుమార్తె సునీతమ్మ కూడా చెప్పడంతో వారి సూచనల మేరకు నడుచుకున్నానని పునరుద్ఘాటించారు. వివేకా మృతదేహాన్ని చూడగానే తనకొచ్చిన సందేహాలన్నింటినీ వారికి స్పష్టంగా వివరించానని, అయినా వారి మార్గనిర్దేశం మేరకే వ్యవహరించానని ఇటీవల ఆయన ఓ టీవీ చానల్(ఎన్టీవీ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి ఘటన అనంతర పరిస్థితిని పూసగచ్చినట్లు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. రోజూలాగే ఆ రోజూ వెళ్లాను నేను 30 ఏళ్లకు పైగా వివేకా సార్ వద్ద పని చేస్తున్నాను. ప్రతిరోజు 5.30 గంటలకు సార్ ఇంటికి వెళ్లే అలవాటు. ఆ రోజు కూడా అలాగే వెళ్లాను. ఆయన నిద్ర లేచి ఉంటే హాలులో లైట్ వేస్తారు. వాచ్మెన్ రంగన్న పడుకొని ఉన్నాడు. సార్ ఇంకా లేవలేదని బయటికి వచ్చి, వీధిదీపం కింద ఐదు నిమిషాలు ఆంధ్రజ్యోతి పేపర్ తిరగేశాను. వివేకా సతీమణి సౌభాగ్యమ్మకు ఫోన్ చేశాను. ‘సార్ లేట్గా వచ్చి ఉంటాడులే.. కొద్దిసేపు పడుకోని’ అని ఆమె సూచించారు. తిరిగి పేపర్ చదువుతుండగా.. వంట మనిషి లక్ష్మి, ఆమె కుమారుడు వచ్చారు. సార్ ఇంకా లేవలేదా? అని అడిగారు. ‘రాత్రి లేట్గా వచ్చి ఉంటారు.. లేప వద్దని మేడమ్ చెప్పింది’ అని చెప్పాను. కొద్ది సేపటి తర్వాత.. సార్ లేవకపోతే లేపాలి కదా.. మళ్లీ ఎందుకు లేపలేదు.. అని అరుస్తారని వంటమనిషి లక్ష్మిని బెడ్ రూమ్ సైడుకు వెళ్లి పిలవాలని చెప్పాను. లక్ష్మి బెడ్రూము వద్దకు వెళ్లి పిలిచి వచ్చే సమయంలో వాచ్మెన్ రంగన్న లేచి.. బెడ్షీట్ను సందులో పెట్టి ఉత్తరం వైపు ఉండే గార్డెన్ వైపు వెళ్లిపోయాడు. అంతలోనే వాచ్మెన్ రంగన్న పరుగెత్తుకుంటూ వచ్చి సార్ పడిపోయాడని చెప్పాడు. నేను వంటమనిషి కుమారుడు ప్రకాశ్ నార్త్ సైడ్ వాకిలి గుండా లోపలికి పరుగెత్తాము. లోపలికి వెళ్లి చూస్తే అంతా రక్తమే ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బెడ్ రూం అంతా రక్తం. భయం వేసింది. ఏసీ, లైట్ ఆన్లో ఉంది. సార్ మాత్రం బెడ్పై లేడు. బాత్రూములో పడిపోయి ఉన్నాడు. నాడి పట్టుకుని చూశా. తలపై గాయం కనిపిస్తోంది. నాతోపాటు ఉన్న ప్రకాశ్తో మన సార్ మనకు లేడని చెప్పా. బయటికి వచ్చి వివేకా సార్ అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేశాను. ‘బావ ఇక మనకు లేడు. ఎవరో ఏదో చేశారు. ఏదో జరిగింది. తలపై గాయం కనిపిస్తోంది. ఇల్లంతా రక్తం ఉంది’ అని చెప్పాను. తర్వాత ఆయన సోదరుడు శివప్రకాశ్రెడ్డికి కూడా అదే చెప్పాను. తర్వాత కొద్ది సేపటికి వైఎస్ వివేకా మొబైల్ సోఫాలో కనిపించింది. సైలెంట్లో ఉంది. ఏదో ఫోన్ రావడంతో రింగ్ అవుతున్నట్లు గుర్తించి, జేబులో పెట్టుకున్నాను. బెడ్ ముందు ఉన్న వీల్ చైర్ ముందు ఓ పేపరు పడి ఉంది. ప్రకాశ్, నేను దాన్ని ఓపెన్ చేసి చూశాము. అందులో సార్ రాసిన మ్యాటర్ ఉంది. ఆ లెటర్లో అక్షరాలు అంత క్లియర్గా లేవు. బాగా పరిశీలిస్తే ‘డ్రైవర్ ప్రసాద్ నిన్న డ్యూటీకి త్వరగా రమ్మన్నందుకు నన్ను కొట్టి చంపాడు. మీరు డ్రైవర్ ప్రసాద్ను వదిలి పెట్టవద్దు’ అని రెండుసార్లు రాసి ఉంది. కింద వైఎస్ వివేకా అని ఉంది. లెటర్ను ఎవరికీ చూపించొద్దన్నారు ఆ లెటర్ విషయం వెంటనే అల్లుడు రాజశేఖరరెడ్డికి తెలియజేశాను. ‘ఆ లెటర్ను జాగ్రత్తగా దాచి పెట్టు.. ఎవరికీ చూపించవద్దు’ అన్నాడు. నేను పోలీసులతో ప్రాబ్లమ్ అవుతుంది కదా అని అడగాను. ‘అదంతా నేను వచ్చిన తర్వాత మాట్లాడతా. నీకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. నేను వచ్చాక పోలీసులకు ఇస్తాను. అప్పటి దాకా దాచి పెట్టు’ అని చెప్పాడు. ఈ విషయంగా శివప్రకాశ్రెడ్డికి కూడా తెలియజేసి.. నాకు దిక్కుతోచడం లేదని చెప్పాను. తర్వాత కొద్ది సేపటికి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వచ్చాడు. నేనే ఆయన్ను లోపలికి పిలుచుకుని వెళ్లాను. అవినాశ్ రెడ్డితోపాటు శివశంకర్రెడ్డి, సురేంద్రనాథ్రెడ్డి మరి కొంత మంది ఉన్నారు. తర్వాత అవినాశ్రెడ్డి సార్ బయటికి వచ్చి లాన్లో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వైఎస్ అవినాష్రెడ్డి చిన్నాన్న, పెద్దనాన్న, కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వచ్చారు. నేను రంగన్న పిలిచి దబాయిస్తే, రాత్రి దోశలు తిని నిద్రయానని చెప్పాడు. పోలీసులకు చెప్పేద్దామంటే వినలేదు గుండెపోటు విషయం ఎవరు ఎలా చెప్పారో తెలియదు. లెటర్, రక్తాన్ని బట్టి వైఎస్ వివేకాను ఎవరో ఏదో చేశారని నేను భావించాను. కొద్ది సేపటికి సీఐ శంకరయ్య, ఎర్రగంగిరెడ్డి వచ్చారు. ఎర్ర గంగిరెడ్డి రావడంతోటే బ్లడ్ వాంటింగ్ చేసుకున్నాడని చెప్పాడు. బాత్రూములో గోడకు ఆరు, ఏడు అడుగులు రక్తం చిమ్మిందని చెప్పగా.. బేసిన్కు తల కొట్టుకుని రక్తం వచ్చి ఉంటుందిలే అన్నాడు. ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామా అంటే ఏం అవసరం లేదులే అన్నాడు. ఎర్రగంగిరెడ్డి ఇలా చెబుతున్నాడని నేను నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి చెప్పాను. పక్కన సీఐ ఉన్నాడని మాట్లాడాలని ఫోన్ సీఐకి ఇచ్చాను. వాళ్లిద్దరు మాట్లాడుకున్నారు. రాజశేఖరరెడ్డి స్టేషన్లో కంఫ్లైంట్ రాసివ్వాలని సూచించారు. కొద్దిసేపటికి ఎర్రగంగిరెడ్డి.. కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాకు ‘లక్షుమ్మను రమ్మను.. బక్కెట్తో నీళ్లు తీసుకుని ఇదంతా క్లీన్ చేయాలి’ అని చెప్పాడు. లక్షుమ్మ సగం క్లీన్ చేసి.. కళ్లు తిరుగుతున్నాయని చెప్పి వెళ్లిపోయింది. తర్వాత తన వద్ద పనిచేసే పిల్లలు రాజశేఖర్, ట్యాంకర్ బాషాతో ఇనాయితుల్లా క్లీన్ చేయించారు. సార్ డెడ్బాడీ బాత్రూము నుంచి తేవడానికి ఎర్రగంగిరెడ్డితో కలిసి నలుగురు వెళ్లారు. తర్వాత అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు బాగా కొట్టారు అవినాష్రెడ్డి ఉదయాన్నే వచ్చి వెళ్లాడు.. మళ్లీ రాలేదు. రక్తం శుభ్రం చేసే సమయంలో ఆయన లేరు. నేను సీఐ చెప్పినట్లు కంప్లైంట్ రాసిచ్చి ఆస్పత్రికి వెళ్లాను. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి.. నా భార్యను తీసుకొచ్చి పోస్టుమార్టం రూమ్ వద్ద సార్ను చూపించాను. తర్వాత సార్ డెడ్ బాడీని ఇంటి వద్దకు తెచ్చారు. అప్పుడు లెటర్ను నర్రెడ్డి రాజశేఖర్రెడ్డికి ఇచ్చాను. తర్వాత 15 నిమిషాలకు ఆ లెటర్ను ఎస్పీకి అందజేశానని, నీకు ఇబ్బంది లేదని రాజశేఖర్రెడ్డి చెప్పాడు. సాయంత్రం 4 – 4.30 గంటల ప్రాంతంలో నన్ను పోలీసులు తీసుకు వెళ్లి జేఎన్టీయూ గెస్ట్హౌస్లో పెట్టారు. అక్కడి నుంచి నాతోపాటు మరికొందరిని వేముల పోలీసుస్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం కడప డీటీసీకి తీసుకెళ్లి 13 రోజులు పెట్టుకుని అందరినీ కొట్టారు. తర్వాత నాతోపాటు ప్రకాశ్, ఎర్రగంగిరెడ్డిని ముద్దాయిలుగా చూపిస్తూ రిమాండ్కు తరలించారు. మూడు నెలలు జైలులోనే ఉన్నాం. మద్యమధ్యలో సునీతమ్మ, రాజశేఖర్రెడ్డి వచ్చి మాట్లాడిపోయే వారు. మేము బయటికి వచ్చిన కొద్దిరోజుల తర్వాత కేసు సీబీకి బదిలీ చేశారు. తర్వాత సునీత, రాజశేఖరరెడ్డి.. సీబీఐకి సహకరించాలని చెప్పేవారు. అప్పటి నుంచి సీబీఐ అధికారులు ఎప్పుడు పిలిచినా వెళ్లి వచ్చాం. సీబీఐ వాళ్లూ కొడతారనుకోలేదు సీబీఐ వాళ్లు ఢిల్లీకి రావాలని చెప్పారని నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి తెలియజేశాను. వెళ్లమని చెప్పి.. టికెట్ ఆయనే తీసిచ్చాడు. వారికి సహకరించాలని సూచించాడు. ఢిల్లీలో వాళ్లు నెల రోజులు పెట్టుకున్నారు. మధ్యలో రాంసింగ్ వచ్చి ‘నేను చెప్పినట్లు చెబుతావా? లేదా? వైఎస్ అవినాష్రెడ్డి, శంకర్రెడ్డిలు మిమ్మల్ని మ్యానేజ్ చేశారు. ఆ విషయం మీరు చెప్పడం లేదు. మేము చెప్పినట్లు చెప్పకపోతే జైలుకు పంపుతాం’ అని బెదిరిస్తూ కొట్టేవారు. సీబీఐ అధికారులు ఇలా కొడతారని ఊహించలేదు. నెల తర్వాత నన్ను పంపించేశారు. ఆ తర్వాత నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీతలు నన్ను హైదరాబాదుకు రమ్మని పిలిచారు. అక్కడికి వెళ్లాక ‘నువ్వు రాంసింగ్ సార్ ఎలా చెబితే అలా చేయాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడతావు, నువ్వు సహకరిస్తే నిన్ను సేవ్ చేస్తాం. ఇదొక్కటే మార్గం’ అని చెప్పారు. మధ్యమద్యలో నర్రెడ్డి రాజశేఖరరెడ్డి.. అవినాశ్ మ్యానేజ్ చేశాడని చెప్పమన్నారు. నిజం చెబితే కొడతారేంటి? ‘దస్తగిరి, రంగన్నలు మేము చెప్పినట్లు విన్నారు. నువ్వు కూడా చెప్పినట్లు వింటే సేవ్ చేస్తా’ అని రాంసింగ్ తెలిపారు. తెల్లవారగానే నీ ఇద్దరు కుమారులతో కలిసి కడపలోని కేంద్ర కారాగార గెస్ట్హౌస్కు రావాలని సూచించారు. నేను ఈ విషయం నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పగా, వెళ్లాలని సూచించాడు. హైదరాబాదులోని పిల్లలను పిలిచించి ఉదయం 11 గంటలకు వారితో కలిసి వెళ్లాను. మేము చెప్పినట్లుగా సహకరించాలని కోరారు. ఇందుకు నేను మరోమారు అభ్యంతరం చెబుతూ.. నాకు తెలిసిన విషయాలన్నీ చెబుతానని చెప్పాను. దాంతో ఆయన కట్టె తీసుకుని నన్ను కొట్టాడు. నిజం చెబితే కొడతారా? అంటూ మా పిల్లలు అడ్డుతగిలారు. సాయంత్రం వరకు నన్ను అక్కడే పెట్టుకుని బూతులు తిట్టి పంపారు. మళ్లీ పిలిచి నప్పుడు కూడా ఇలాగే మాట్లాడితే నీ కథ ఉంటాదని హెచ్చరించారు. చెప్పినట్లు వినలేదని పెళ్లి ఆపించేశారు అప్పటికి వారం రోజుల్లో నా చిన్న కుమారుడి పెళ్లి. సీబీఐ వాళ్లకు నేను సహకరించలేదని నర్రెడ్డి రాజశేఖర్రెడ్డి, సునీతకు కోపం వచ్చింది. వారు పెళ్లి కుమార్తె వారికి ఫోన్ చేసి ‘కృష్ణారెడ్డి హత్య కేసులో ఉన్నాడు. వైఎస్ అవినాష్రెడ్డికి సహకరించాడు. త్వరలో ఆస్తులు స్వాధీనం చేసుకుంటారు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి’ అని ఫోన్ చేసి చెప్పారు. నాకు విషయం తెలిసి నేను నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డి వద్దకు వెళ్లగా సరైన స్పందన లేదు. పెళ్లి క్యాన్సిల్ అయితే కానీ అని నేను నిజాన్ని నిర్భయంగా చెప్పాలని భావించాను. ఆ తర్వాత నా కుమారుడు అమెరికా వెళ్లాడు. నేను ప్రాణ రక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వబోతే ఆయన తీసుకోలేదు. అందుకే పులివెందుల కోర్టులో ప్రైవేటు కంప్లైంట్ వేశాను. దాని గురించి ఇప్పటివరకు అతీగతీ లేదు. నా పాస్పోర్టు రెన్యూవల్ కాకుండా ఆగిపోయింది. నా ప్రమోషన్ ఆగిపోయింది., నా కుమారుడు పెళ్లి ఆగిపోయింది. నేను వివేకాకు సేవ చేసినందుకు ఇస్తామన్న ఐదు ఎకరాల భూమి ఇవ్వలేదు. ఇలా అన్ని విధాలా నాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు సీబీఐ కొత్త బృందం వచ్చింది. వారికి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను. పారదర్శకంగా విచారణ జరిగితే అసలు దోషులెవరన్నది తెలుస్తుంది. వివేకాకు హైదరాబాద్, పులివెందుల, కడపల 200 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఆ ఆస్తులన్నీ దాదాపు కంపెనీ పేరుపైనే ఉండేవి. అలాగైతే జైలుకెళ్లేది నువ్వేనని భర్తకు సునీత హెచ్చరిక అవినాశ్ నన్ను మేనేజ్ చేయడం ఏమిటని అప్పుడే గట్టిగా వ్యతిరేకించాను. అప్పుడు సునీత నాపై ఫైర్ అవుతూ ‘నువ్వు ఏమనుకుంటున్నావు.. నిన్ను ఎవ్వరూ కాపాడలేరు’ అని హెచ్చరించారు. రాజశేఖరరెడ్డి నన్ను సముదాయించేలా భుజం తట్టాడు. నేను ఉన్నది ఉన్నట్లు చెబుతానన్నాను. ఆ సమయంలో సునీత.. రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి నేను సహకరించకపోతే నర్రెడ్డి జైలుకు వెళ్తాడని చెప్పింది. ఆయనతో ఆమె అలా ఎందుకు అన్నాదో నాకు అప్పట్లో అర్థం కాలేదు. తర్వాత కొద్ది రోజులకు రాత్రి వేళ సీబీఐ అధికారి రాంసింగ్ నా సెల్కు మిస్డ్ కాల్ ఇచ్చారు. తర్వాత మా అబ్బాయితో ఫోన్ చేయించి (రాంసింగ్కు తెలుగు రానందున) మాట్లాడించాను. -
సీబీఐ చెప్పినట్టు చేయమని సునీత చెప్పారు: వివేకా పీఏ కృష్ణారెడ్డి
సాక్షి, వైఎస్సార్: వివేకా హత్య కేసులో ఆయన ఏపీ కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. ఇక, విచారణ సందర్బంగా కృష్ణా రెడ్డి.. కీలక విషయాలను వెల్లడించారు. కృష్ణారెడ్డి.. ‘వివేకా హత్య జరిగిన రోజు ఉదయం 5:30 గంటలకే ఆయన ఇంటికి వెళ్లాను. ఇంటి వద్ద వాచ్మెన్ రంగన్న పడుకుని ఉండటం చూశాను. అప్పటికీ వివేకా తలుపులు తీయకపోవడంతో లోపలికి వెళ్లి చూశాను. ఆ సమయంలో బాత్రూమ్లో వివేకా రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఈ విషయం గురించి మొట్టమొదట సునీత భర్త రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పాను. అనంతరం, వివేకా పక్కనే ఉన్న లెటర్ చూసి మరోసారి రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడాను. దీంతో, లెటర్ విషయం ఎవరికీ చూపించవద్దని.. దాచిపెట్టమని ఆయన నాకు చెప్పారు. అందుకే వివేకా ఫోన్, లెటర్ మా ఇంట్లో దాచిపెట్టాను. ఇక, ఉదయం 6:30 గంటలకు వివేకా ఇంటికి వైఎస్ అవినాష్ రెడ్డి వచ్చారు. బాత్రూమ్లో ఉన్న వివేకా డెడ్ బాడీ చూసి బయటకు వెళ్లిపోయారు. బాత్రూమ్ నుంచి వివేకా డెడ్బాడీని బయటకు తెచ్చే సమయంలో అవినాష్ రెడ్డి అక్కడ లేరు. వివేకా మృతదేహాన్ని క్లీన్చేసే సమయంలో కూడా అవినాష్ అక్కడ లేరు. ఇది కూడా చదవండి: వివేకా హత్యకేసులో సాక్షి రంగన్నకు తీవ్ర అస్వస్తత అయితే, బాత్రూమ్ గోడకు వివేకా తల బలంగా తగలడంతో చనిపోయారని ఎర్ర గంగిరెడ్డి చెప్పారు. కాగా, గంగిరెడ్డి చెప్పినప్పుడే నేను అనుమానించాను. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేద్దామంటే గంగిరెడ్డి వద్దన్నాడు. సీఐ చెప్పినట్టు కంప్లయింట్ రాసి పోలీసు స్టేషన్లో ఇవ్వమని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. రాజశేఖర్ రెడ్డి.. వివేకా ఇంటికి వచ్చాక ఫోన్, లెటర్ ఆయనకు అప్పగించాను. అదేరోజు నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బెయిల్పై విడుదలయ్యాక నన్ను.. సునీత ఇంటికి పిలిచారు. సీబీఐ చెప్పినట్టు చేయ్.. లేదంటే ఇబ్బందులు తప్పవని సునీత.. నన్ను బెదిరించారు. సీబీఐ చెప్పినట్టు కృష్ణారెడ్డి వినకపోతే జైలుకు వెళ్తావంటూ సునీత హెచ్చరించింది. వివేకాకు చెందిన 200 ఎకరాల భూమి రాజశేఖర్ రెడ్డి కంపెనీ పేరుపై ఉన్నాయని’ తెలిపారు. ఇది కూడా చదవండి: వివేకా కేసు: ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు -
Munugode: కాంగ్రెస్లో కయ్యం.. రేవంత్, జానారెడ్డి సపోర్ట్ ఆ నేతకేనా!
నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్లో వర్గపోరు మొదలైందా? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఇద్దరు నేతల మధ్య పైటింగ్ స్టార్టయిందా? మళ్ళీ నేనే అంటున్న పాల్వాయి స్రవంతి. ఒప్పందం ప్రకారం తనకే ఇవ్వాలంటున్న మరో నేత. ఇద్దరి పంతంతో తలలు పట్టుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఇంతకీ మునుగోడు కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్కు బలమైన కేడర్ ఉన్న నియోజకవర్గాల్లో మునుగోడు ఒకటి. మొన్నటి ఉప ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచినా అధికార బీఆర్ఎస్, బీజేపీల అంగ, అర్థ బలాలకు ఎదురొడ్డి నిలబడి కూడా 24 వేల ఓట్లను సాధించింది. ఉప ఎన్నికలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలన్న కసితో కాంగ్రెస్ కేడర్ సిద్ధమవుతోంది. అయితే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య మొదలైన టికెట్ పోరు కార్యకర్తల్ని కన్ఫూజన్కు గురి చేస్తోందట. టికెట్ తనదంటే తనదని ఇద్దరు నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తుండటం మునుగోడు కాంగ్రెస్లో కలవరం రేగుతోంది. మొన్నటి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పాల్వాయి స్రవంతికి సీనియర్ల మద్దతు ఉంది. ఉప ఎన్నికలో టిక్కట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన టీపీసీసీ జనరల్ సెక్రెటరీ చలమల్ల కృష్ఱారెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అండగా ఉన్నారు. ఉప ఎన్నికలో ఓడిపోయినా పార్టీ పరువు కాపాడాను కాబట్టి తనకు మరో అవకాశం ఇవ్వాలని స్రవంతి కోరుతున్నారట. చదవండి: గులాబీ బాస్నే ఢీకొడుతున్న పొంగులేటి.. బీఆర్ఎస్ కౌంటర్ ఎలా ఉండబోతుంది? పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి మరోవైపు గతంలోనే టికెట్ వచ్చినట్లు వచ్చి చేజారిందని, దీనికి తోడు ఉప ఎన్నికల సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట చల్లమల్ల కృష్ణారెడ్డి. ఉప ఎన్నికల్లో అవకాశం ఇస్తే సాధారణ ఎన్నికల్లో తనకు సహకరిస్తానని స్రవంతి మాట ఇవ్వడం నిజం కాదా అని కృష్ణారెడ్డి గుర్తు చేస్తున్నారట. రేవంత్ ఆశీస్సులు కృష్ణారెడ్డికి పుష్కలంగాఉండటంతో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేత జానారెడ్డి కూడా ఈసారి కృష్ణారెడ్డికే మద్దతుగా నిలుస్తున్నారట. దీంతో తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో చలమల్ల కృష్ణారెడ్డి నియోజవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నియోజకవర్గంలోని మండలాలకు పార్టీ కమిటీలను ప్రకటించేలా రేవంత్పై ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యారు చల్లమల్ల. ఈ పరిణామాలతో పాల్వాయి స్రవంతి అలెర్ట్ అయ్యారు. నేరుగా గాంధీభవవ్ను వెళ్లి మునుగోడు తాజా పరిణామాలను సీనియర్ నేతల దృష్టికి తీసుకెళ్లారట. నియోజకవర్గ ఇంచార్జ్గా ఉన్న తనకు సమాచారం ఇవ్వకుండా కమిటీలను ఎలా ప్రకటిస్తారని ఆమె ప్రశ్నించారట. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే జిల్లాలోని నకిరేకల్లోని మండల కమిటీలు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యంతో నిలిచిపోయాయి. దీంతో స్రవంతి ఒత్తిడితో మునుగోడులో మండల కమిటీలు ఆగిపోయాయి. పార్టీ కోసం పనిచేసిన వారికే మండలాధ్యక్ష పదవులు ఇవ్వాలని స్రవంతి కోరుతున్నారు. అయితే తన అనుచరుడు కృష్ణారెడ్డి మాటను కాదని స్రవంతి సూచించిన వారికి రేవంత్ పదవులు ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా ఇద్దరి నేతల మధ్య నెలకొన్న వర్గపోరు మునుగోడు కాంగ్రెస్ రాజకీయాలను రసవత్తరంగా మార్చాయని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి వస్తుందనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. చదవండి: కోడెల ఆత్మహత్య తర్వాత అసలు అక్కడ ఏం జరుగుతోంది? -
నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు ‘ఈనాడు’పై వివేకా పీఏ ఫైర్
సాక్షి, పులివెందుల: తాను పారిపోయానంటూ ‘ఈనాడు’ తప్పుడు ప్రచారం చేస్తోందని వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను కాలేజీ పని మీద కడపకు వెళితే.. ఈనాడు పత్రిక వాళ్లు ‘కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు.. పారిపోయారు’ అంటూ తప్పుడు కథనాలు రాశారని మండిపడ్డారు. సీబీఐ అధికారులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఫోన్ కూడా చేయలేదని తెలిపారు. కాగా, వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఆ షాక్ నుంచి జేసీ బ్రదర్స్ ఇంకా తేరుకోలేదా? -
వివేకా కేసు: ఎంపీ అవినాష్ రెడ్డి ఫుల్ వీడియో
సాక్షి, వైఎస్సార్: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా, వివేకా హత్యకు సంబంధించి తన దగ్గరున్న సమాచారంతో ఎంపీ అవినాష్ రెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూ అవినాష్ రెడ్డి వీడియోను విడుదల చేశారు. వివేకా లెటర్ విషయంపై సీబీఐ ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు? సీబీఐ అధికారి రాంసింగ్ ఎవరిని కాపాడుతున్నారు? ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారు? అన్న వివరాలను అవినాష్ రెడ్డి ఇందులో వివరించారు. "వివేకా హత్య తర్వాత శివప్రకాష్ రెడ్డి నాకు ఫోన్ చేశారు. నేను పులివెందుల రింగ్ రోడ్ దగ్గర ఉన్నప్పుడు నాకు కాల్ వచ్చింది. వివేకా మరణించినట్టు శివప్రకాష్ రెడ్డే నాకు చెప్పారు. ఏమైనా అనుమానాస్పదంగా ఉందా అని వివేకా పీఏ కృష్ణారెడ్డిని అడిగాను. ఎలాంటి అనుమానాలు లేవని వివేకా పీఏ చెప్పారు. మేము వెళ్లకముందే వివేకా రాసిన లేఖ, మొబైల్ దాచిపెట్టమని హైదరాబాద్ నుంచి సునీత భర్త ఫోన్ లో ఆదేశించారు. డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టవద్దని వివేకా లెటర్లో రాశారు. హత్య అని తేల్చే లేఖను ఎలా దాచిపెడతారు? లెటర్ దాచిపెట్టమని నేనే చెప్పానని సునీత పోలీసులకు ఎందుకు చెప్పలేదు? వివేకా చనిపోయారు, చాలా బ్లడ్ ఉందని మాత్రమే నేను సీబీఐకి చెప్పాను. సీబీఐ విచారణ తీరు ప్రజలకు తెలియాలి. వివేకా హత్య కేసు చుట్టూ ఎన్నో రాజకీయాలు నడుస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడవద్దనే.. ఎన్ని విమర్శలు వచ్చినా మౌనంగా ఉన్నామని" అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: సీబీఐ స్టేట్మెంట్లో వివేకా రెండో భార్య షమీమ్ సంచలన విషయాలు వివేకా కుటుంబానికి హత్య విషయం తెలిసినా చాలా సేపటివరకు మౌనంగా ఉన్నారని, హత్య విషయం తెలిసినా వెంటనే ఎందుకు పోలీసులకు చెప్పలేదని ప్రశ్నించారు అవినాష్ రెడ్డి. వివేకా కుటుంబం మౌనంగా ఉండడం.. పోలీసులకు చెప్పకపోవడం వెనక అనుమానాలున్నాయని అన్నారు. ఆ కోణంలో సిబిఐ అధికారులు ఎందుకు దర్యాప్తు చేయట్లేదని, తనను ఇరికించేందుకే సిబిఐ కుట్ర పన్నినట్లు తెలుస్తోందని, ఈ కేసులో అన్ని విషయాలు నిజాయతీగా నిగ్గుతేలాల్సిన అవసరం ఉందని అన్నారు అవినాష్ రెడ్డి. -
అది కృష్ణారెడ్డిగారికే చెల్లింది – గోపీచంద్ మలినేని
‘‘దర్శకత్వం అంటేనే చాలా ఒత్తిడితో కూడిన క్రియేటివ్ వర్క్. అంత టెన్షన్ లోనూ తన ప్రతి సినిమాకి స్వయంగా సంగీతం అందించడం కృష్ణారెడ్డిగారికే చెల్లింది. దర్శకుల పేరు చూసి సినిమాకు వెళ్లే ట్రెండ్ను సృష్టించిన అతికొద్ది మందిలో కృష్ణారెడ్డిగారు ఒకరు’’ అన్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. డా. రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధానపా త్రల్లో, సోహైల్, మృణాళిని జంటగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించారు. ఈ చిత్రంలోని ‘నమ్ముకోరా.. నమ్ముకోరా..’ అంటూ సాగే పాటని గోపీచంద్ మలినేని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈపా టని రేవంత్ ఆలపించారు. ‘‘ఈ మూవీ సూపర్ హిట్టవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు సి. కల్యాణ్. ‘‘మంచి ఫ్యామిలీ డ్రామాతోపా టు ఈ చిత్రంలో ఒక సందేశం ఉంటుంది. మార్చిలో రానున్న ఈ సినిమా హిట్ అవుతుంది’’ అన్నారు కె. అచ్చిరెడ్డి. ‘‘హిలేరియస్ కామెడీ, ఫ్యామిలీ, యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు కొట్టే చప్పట్ల కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాకు తొలిసారి డైలాగ్స్ రాశాను’’ అని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. -
70 ఏళ్లు.. 9 కి.మీటర్లు.. 83 నిమిషాలు
కాచిగూడ (హైదరాబాద్): కాచిగూడలోని జీవీఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్.గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ ఎద్దుల కృష్ణారెడ్డి (70) 9 కిలోమీటర్లను 83 నిమిషాల్లో నడిచి వరల్డ్ రికార్డును సాధించారు. ఇప్పటికే గతంలో రెండు వరల్డ్ రికార్డ్స్ను డాక్టర్ కృష్ణారెడ్డి తన ఖాతాలో వేసుకున్నారు. సైదాబాద్లోని వివేక్ ఆస్పత్రి వద్ద డాక్టర్ కృష్ణారెడ్డి ప్రారంభించిన నడకను జైళ్ళ శిక్షణ కళాశాల (చంచల్గూడ) ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, జైలర్ రత్నంలు ప్రారంభించారు. ట్యాంక్బండ్లోని వివేకానంద విగ్రహం వరకు 9 కిలోమీటర్ల దూరాన్ని 83 నిమిషాల్లో నడిచి ఆయన ఈ రికార్డును నెలకొల్పారు. కృష్ణారెడ్డి చేసిన ఈవెంట్ను గుర్తించి (9 వరల్డ్ రికార్డ్ సంస్థలు) వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ట్రెజర్ వరల్డ్ రికార్డ్స్, గ్రాండ్ వరల్డ్ రికార్డ్స్, స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఫోకస్ వరల్డ్ రికార్డ్స్, గ్లోరీ వరల్డ్ రికార్డ్స్, కోహినూర్ వరల్డ్ రికార్డ్స్, విశ్వం వరల్డ్ రికార్డ్స్ సంస్థలు రికార్డ్ను నమోదు చేశాయి. ఈ సందర్భంగా జీవీఆర్ కరాటే అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధుల సమక్షంలో రికార్డును కృష్ణారెడ్డికి అందజేశారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ...ఈ రికార్డ్ను సీనియర్ సిటిజన్స్కు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాయామం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీవీఆర్ కరాటే అకాడమి కరాటే బ్లాక్బెల్ట్ ప్రతినిధులు కరీం, సుభాష్, సర్వర్, అమృత తదితరులు పాల్గొన్నారు. -
Congress: స్రవంతికే మునుగోడు టికెట్.. తెర వెనుక జరిగిందిదే!
మునుగోడు కాంగ్రెస్ టిక్కెట్ పాల్వాయి స్రవంతికి ఇవ్వడం వెనుక ఏం జరిగింది? టిక్కెట్ ఆశించిన ఆ ముగ్గురు పార్టీ కోసం పనిచేస్తారా? అభ్యర్థికి పార్టీ ఆర్దిక వనరులు సమకూరుస్తుందా? స్రవంతికి టిక్కెట్ ఇప్పించేందుకు హైకమాండ్కు సీనియర్లు ఏం చెప్పారు? అసలు మునుగోడు టిక్కెట్ విషయంలో టీ కాంగ్రెస్ లో ఏం జరిగింది? కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేసింది. అయితే స్రవంతికి టికెట్ ఇవ్వడం వెనక చాలా తతంగమే నడిచిందంటున్నారు పార్టీలోని కొందరు నేతలు. మొదటి నుంచి పాల్వాయి స్రవంతి, చెల్లమల్ల కృష్ణారెడ్డి టికెట్ విషయంలో తీవ్రంగా పోటీపడ్డారు. కృష్ణారెడ్డికే టిక్కెట్ కన్ఫార్మ్ అయినట్లుగా ప్రచారం కూడా జరిగింది. ఉప ఎన్నిక అంటే అంత ఈజీ కాదు.. మునుగోడు ఎన్నికల్లో నిలబడాలంటే 50 నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టాలనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా వీక్గా ఉన్న స్రవంతికి టిక్కెట్ ఇస్తే ఉపయోగం లేదని, ఆర్దికంగా బలంగా ఉన్న కృష్ణారెడ్డికి ఇస్తే పార్టీకి ఉపయోగం ఉంటుందని కొందరు సలహా ఇచ్చారు. అయితే టికెట్ విషయంలో నల్లగొండ జిల్లా సీనియర్ నేతలంతా ఏకమయ్యారు. హైకమాండ్ దగ్గర తమ పలుకుబడిని ఉపయోగించారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి వంటి సీనియర్లంతా పాల్వాయి స్రవంతికే టిక్కెట్ ఇవ్వాలని తెగేసి చెప్పారట. ఒక వేళ డబ్బే ఎన్నికల్లో ప్రధానం అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ను ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల కాదని కూడా వారు స్పష్టం చేసినట్లు సమాచారం. దీనికి తోడు దివంగత నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వారసురాలిగా , మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న స్రవంతిని కాదని కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే భవిష్యత్లో పార్టీ కోసం ఎవరూ పనిచేయరని సీనియర్ నేతలు అధిష్టానానికి విస్పష్టంగా చెప్పినట్లు సమాచారం. దీంతో అన్నీ ఆలోచించిన అధిష్టానం పాల్వాయి స్రవంతి పేరునే ఖరారు చేసిందట. చదవండి: (కరీంనగర్ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు) జిల్లాకు చెందిన సీనియర్ నేతల సూచన మేరకే.. టిక్కెట్ అయితే అనౌన్స్ చేసారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్కు కొత్త చిక్కు వచ్చి పడింది. టిక్కెట్ ఆశించిన మిగతా ముగ్గురు నేతలు ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేస్తారా అనే సందేహం ఇప్పుడు మిగతా నేతల్ని తొలిచేస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలిసిన కృష్ణారెడ్డి పార్టీ కోసం పనిచేస్తానని చెప్పినా గ్రౌండ్లోలో పనిచేస్తారో లేదో చూడాలి. ఇంకో వైపు కృష్ణారెడ్డి, పల్లెరవి, కైలాష్ నేతలతో పీసీసీ, సీఎల్పీ నేతలు గాంధీ భవన్కు పిలిపించుకుని బుజ్జగించారు. అయినప్పటికీ ఏ మేరకు వీరు ముగ్గురు పాల్వాయి స్రవంతి కోసం పనిచేస్తారో చూడాలి. మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖర్చుతో కూడుకున్నదని ఇప్పటికే పార్టీలో చర్చ జరుగుతోంది. టిఆర్ఎస్, బీజేపీలు పెట్టే ఖర్చులో సగం అయినా కాంగ్రెస్ పార్టీ పెట్టాలని.. లేదంటే పోటీలో ఉండటం కష్టమనే అభిప్రాయం గాంధీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పాల్వాయి స్రవంతికి లోకల్గా కొంత పట్టున్నా ఆర్థికంగా బలహీనంగా ఉందని పార్టీ నేతలే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్రవంతికి పార్టీ తరపున ఆర్థిక వనరులు సమకూర్చాలని సునీల్ కనుగోలు సూచించినట్లు తెలుస్తోంది. పీసీసీ ఛీఫ్తో పాటు సీఎల్పీ, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు ఆర్థికంగా సపోర్ట్ చేయాలనే డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది. పాల్వాయి స్రవంతికి టికెట్ ఇప్పించడంలో సీనియర్లు పంతం నెగ్గించుకున్నారు. మరోవైపు స్రవంతికి టికెట్ ఇవ్వడం ద్వారా తొలినుంచీ కాంగ్రెస్లో ఉన్న వారికి ప్రాధాన్యత లభిస్తుందనే నమ్మకాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ లలో కల్పించిందనే అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజాపంథా రాష్ట్రకార్యదర్శి డీవీ కృష్ణ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి దుర్గంపూడి వెంకట కృష్ణారెడ్డి(డీవీ కృష్ణ) ఆదివారం ఉదయం ఇక్కడ అనారోగ్యంతో మరణించారు. డీవీ కృష్ణ(77) కొంతకాలంగా కేన్సర్ తో పోరాడుతున్నారు. డీవీ కృష్ణ 1945 ఆగస్టు 20న గుంటూరు జిల్లా మాచర్ల దగ్గర గల తేలుకుంట్లలో జన్మించారు. తల్లిదండ్రులు నాగేంద్రమ్మ, వెంకటప్పారెడ్డి. డీవీ కృష్ణకు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే ఆయన కుటుంబం వ్యవసాయం నిమిత్తం నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని పెంటకుర్దు గ్రామానికి వలస వచ్చింది. శ్రీకాకుళం, నగ్జల్బరీ పోరాటాల ప్ర«భావంతో 1970లో విప్లవ కమ్యూనిస్టు పార్టీలో చేరారు. 1973లో సీపీఐ (ఎంఎల్) నేత చండ్ర పుల్లారెడ్డితో కలసి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో విప్లవోద్యమ నిర్మాణానికి కృషి చేశారు. కృష్ణ భార్య కొంతకాలం క్రితమే మరణించారు. ఆయన కూతురు దీప అమెరికాలోని ఓ బ్యాం కులో ఉద్యోగం చేస్తున్నారు. విద్యానగర్లోని మార్క్స్ భవన్లో ఉంచిన డీవీకృష్ణ భౌతికకాయాన్ని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం, ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్య దర్శి పి.రంగారావు, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. వెంకటేశ్వర్రావు సందర్శించి నివాళులర్పించారు. -
‘తెలుగు అకాడమీ’ కేసులో మరొకరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల కుంభకోణం కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. అకాడమీకి సంబంధించిన రూ.64.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు కాజేసిన కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీసులు మరో నిందితుడు జీవీ కృష్ణారెడ్డిని మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 16 మంది అరెస్టయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని పొద్దుటూరుకు చెందిన కృష్ణారెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ నిజాంపేటలో నివసిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలోనే మూడేళ్ల క్రితం సాయికుమార్తో అతడికి పరిచయం ఏర్పడింది. తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్ము కాజేయడానికి సాయి ఏడాది క్రితం పథకం వేయగా దీనికి సహకరించడానికి కృష్ణారెడ్డి ముందుకు వచ్చాడు. క్రమేణా కృష్ణారెడ్డితో ఎక్కువ అవసరం లేకపోవడాన్ని గమనించిన సాయికుమార్ అతడిని దూరంగా ఉంచాడు. అయితే ప్రతి అక్రమ లావాదేవీ నుంచి అతడికి వాటా ఇస్తూనే వచ్చాడు. సాయి అరెస్టు తర్వాత కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విచారణలో సాయి ఈ విషయాలను వెల్లడించడంతో ఏసీపీ కె.మనోజ్కుమార్ నేతృత్వంలోని బృందం కృష్ణారెడ్డి కోసం ముమ్మరంగా గాలించింది. ఎట్టకేలకు మంగళవారం అతడిని అరెస్టు చేసింది. కుంభకోణం సొమ్ము నుంచి అతడి వాటాగా రూ.6 కోట్ల వరకు ఇచ్చానంటూ సాయి పోలీసులకు చెప్పగా, తనకు రూ.2.65 కోట్లు మాత్రమే అందాయని కృష్ణారెడ్డి అంటున్నాడు. ఈ విషయంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. కృష్ణారెడ్డిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఏపీలోనూ నేరాలు దాదాపు పుష్కరకాలంగా కుంభకోణాలకు పాల్పడుతున్న సాయికుమార్ ముఠా ఆంధ్రప్రదేశ్లోని రెండు సంస్థల ఫిక్స్డ్ డిపాజిట్లనూ కొల్లగొట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్కు చెందిన రూ.10 కోట్లు, ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్కు చెందిన రూ.5 కోట్లను ఇదే పంథాలో స్వాహా చేసింది. తెలుగు అకాడమీ కేసులో అరెస్టు అయిన సాయి ఈ విషయాలను విచారణలో బయటపెట్టాడు. దీనిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ అధికారులకు సమాచారం అందించగా విజయవాడ సీసీఎస్లో రెండు కేసులు నమోదు చేశారు. వీటిలోనూ కృష్ణారెడ్డి నిందితుడిగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి కేసుల్లో అరెస్టులు, కస్టడీలు పూర్తయిన తర్వాత సాయి, కృష్ణారెడ్డిసహా ఇతర నిందితులను విజయవాడ పోలీసులు పీటీ వారంట్పై అక్కడకు తరలించి విచారించే అవకాశముంది. -
మా సినిమా చూడకుండా కామెంట్స్ చేయకండి
MAD Movie Pre Release Event: ‘‘సినిమా విడుదల ముందు వరకే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉంటుంది. చిన్న సినిమా అయినా బాగుంటే పెద్ద సినిమా అవుతుంది. ‘మ్యాడ్’ మంచి విజయం సాధించాలి’’ అని నిర్మాత టి. రామ సత్యనారాయణ అన్నారు. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతావర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. లక్ష్మణ్ మేనేని దర్శకత్వం వహించారు. టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న రిలీజవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ– ‘‘మ్యాడ్’ రెగ్యులర్ చిత్రంలా ఉండదు. సినిమా చూసి, బాగుంటే తోటివారికి కూడా చెప్పండి’’ అన్నారు. ‘‘మేమంతా చాలా నమ్మకంతో ‘మ్యాడ్’ చేశాం. మా మూవీ థియేటర్లో రిలీజ్ అవుతుండటం హ్యాపీ’’ అన్నారు మాధవ్ చిలుకూరి. ‘‘మా సినిమా చూడకుండా కామెంట్స్ పెట్టకండి.. సినిమా చూశాకే స్పందించాలని నా విన్నపం’’ అన్నారు రజత్ రాఘవ్. ‘‘కరోనా టైమ్లో మా చిత్రం ద్వారా ఓ 50 మందికి ఉపాధి కల్పించాననే సంతృప్తి ఉంది. ఈ సినిమా సక్సెస్ అయితే మరో సినిమా చేసే నమ్మకం వస్తుంది’’ అన్నారు నిర్మాత కృష్ణారెడ్డి. -
కాషాయ క్రమ‘శిక్ష’ణ షురూ!
సాక్షి, కరీంనగర్: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర రథ సారథి బండి సంజయ్ సొంత జిల్లా నుంచే పార్టీని గాడిలో పెట్టే చర్యలకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా ఉంటూనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్ద బాధ్యతలు మోస్తున్న సంజయ్ కరీంనగర్ కమలదళం నుంచే కొరడా ఝులిపించే పనిలో పడ్డారు. పార్టీ జిల్లా బాస్గా కీలక బాధ్యతల్లో ఉన్న నాయకుడు పార్టీలోకి కొత్తగా వచ్చిన ఓ మహిళ ట్రాప్లో చిక్కుకున్న వీడియో, ఆడియో గురువారం రాత్రి నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వచ్చే నెలలో దుబ్బాక ఉప ఎన్నికకు పార్టీ సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా స్థానిక ఛానెల్ ద్వారా సోషల్ మీడియాలో వీడియో ప్రసారం కావడంపై బండి సంజయ్ సీరియస్ అయ్యారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఆయన శుక్రవారం ఉదయం హుటాహుటిన పార్టీ ముఖ్య నాయకులతో ఫోన్లో చర్చించి, ప్రస్తుత పార్టీ అధ్యక్ష పదవి నుంచి బాస సత్యనారాయణను తొలగించారు. ఆ వెంటనే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన గంగాడి కృష్ణారెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు. ఒక్కరోజులో పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో నాయకులు, కార్యకర్తలు షాక్కు గురయ్యారు. ఉమ్మడి జిల్లాపైనే తొలి దృష్టి పార్టీ జిల్లా అధ్యక్షున్ని తొలగించి వేరొకరికి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాను పూర్తిస్థాయిలో గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త స్థాయి నుంచి ఏబీవీపీ, బీజేవైఎం, బీజేపీలలో వివిధ స్థాయిల్లో పనిచేసిన సంజయ్కు ఉమ్మడి కరీంనగర్లో పార్టీ నాయకుల జాతకాలన్నీ తెలుసు. కరీంనగర్ నుంచి అసెంబ్లీకి, పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు కొందరు నాయకులు వ్యవహరించిన తీరుపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. సంజయ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇతర జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి ప్రయత్నించారు. సొంత జిల్లా అంతర్గత వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించలేదు. కానీ ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తొలుత సొంత జిల్లాను ప్రక్షాళన చేసే విషయమై దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అధ్యక్షుడే బాస్ బీజేపీలో పార్టీ అధ్యక్షుడే సుప్రీం. రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మండల, గ్రామ అధ్యక్షుడి వరకు ఆయా స్థాయిలో కీలక పాత్ర పోషిస్తారు. అయితే ఇటీవల ఉమ్మడి జిల్లాలో పార్టీ సీనియర్లు, ముఖ్య నాయకులు అని చెప్పుకునే వారు పార్టీ అధ్యక్షులతో సంబంధం లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. కరీంనగర్ జిల్లాతోపాటు పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. దీనిపై అంతర్గత సమావేశాల్లో సంజయ్ అన్యపదేశంగా హెచ్చరికలు చేసినా, ఎవరికి వారే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు సమాచారం. సంజయ్ కన్నా వయసులో పెద్దవాళ్లు, గతంలో పార్టీలో పలు హోదాల్లో పనిచేసిన వారు గ్రూపులు కడుతున్న వ్యవహారాలు కూడా వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో సొంత జిల్లా(ఉమ్మడి కరీంనగర్) నుంచే క్రమశిక్షణ చర్యలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన నేపథ్యంలో కరీంనగర్కు చేరుకొని పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దే పనికి ఉపక్రమించనున్నట్లు తెలిసింది. బీజేపీ నూతన అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్ బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడిగా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన న్యాయవాది గంగాడి కృష్ణారెడ్డి నియామకం అయ్యారు. వీణవంక మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో రాజకీయ ఓనమాలు నేర్చుకొని బీజేవైఎం, బీజేపీలలో వివిధ హోదాల్లో పనిచేశారు. కమలాపూర్ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్గా, జిల్లా కార్యదర్శిగా, మూడు సార్లు జిల్లా ఉపాధ్యక్షునిగా, బీజేపీ జిల్లా సంస్థాగత శిక్షణ కమిటీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కృషి : గంగాడి కృష్ణారెడ్డి బీజేపీలో సామాన్య కార్యకర్తకు కూడా గుర్తింపు ఉంటుందనేది మరోసారి రుజువైంది. నాపై ఎంతో నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహి స్తా. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.కింది స్థాయి కార్యకర్తలు కూడా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే తగిన గుర్తింపు లభిస్తుందని నాతో రుజువైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్కు కృతజ్ఞతలు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో తెలుగువెన్నెల సాహిత్య సదస్సు
డాలస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో నెల నెలా తెలుగు వెన్నెల153 వ సాహిత్య సదస్సు ఏప్రిల్ మూడవ ఆదివారం ఆన్ లైన్లో డాలస్లో ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 153 నెలల పాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ యొక్క విశేషం. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో 153వ సాహిత్య సదస్సుని ఆన్లైన్లో ఘనంగా నిర్వహించిన ఘనత ఉత్తర టెక్సస్ తెలుగు సంఘానికే దక్కుతుంది. ముందుగా సాహిత్య సమన్వయకర్త మల్లిక్ కొండా ఆధ్వర్యంలో చిన్నారుల ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యం, డాక్టర్ ఉర్మిండి నర్సింహారెడ్డి, భాషా శాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి, డాక్టర్ బల్లూరి ఉమాదేవి, అయినంపూడి శ్రీలక్ష్మి, అనంత్ మల్లవరపు తదితరులు పాల్గొని తమ కార్యక్రమాలతో వీక్షకులను ఆనందింపజేశారు. కార్యక్రమం చివర్లో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పాలగుమ్మి రాజగోపాల్కు, ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొన్న సాహితీ ప్రియులందరికి కృతజ్ఞతలు తెలిపి ముగించారు. -
ఫిరాయింపులపై టీడీపీ తీరు హాస్యాస్పదం
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి మండి పడ్డారు. గతంలో వైఎస్సార్సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను పార్టీలో చేర్చుకొని, వారిలో నలుగురిని మంత్రులను చేసి.. ఇప్పుడు ఫిరా యింపులపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంద న్నారు. ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీనంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు కళా వెంకట్రావు తదితరులు అవగా హనారాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శిం చారు. షెడ్యూల్ 10లోని పేరా 4 ప్రకారం మెజారి టీ సభ్యుల తీర్మానం ప్రకారమే టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైందన్నారు. గతంలో ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చంద్ర బాబు ఏ ప్రాతిపదికన సీఎంఅయ్యారో మర్చిపో యారా.. అని ప్రశ్నించారు. తెలంగాణలోని 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మంది తమదే ప్రధాన గ్రూప్ అంటూ టీఆర్ఎస్లో విలీనమ య్యారని చెప్పారు. సుజనాచౌదరి, సీఎం రమేష్ లు బీజేపీలో చేరాక.. నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను చేర్చుకున్నారంటూ ఎద్దేవా చేస్తున్న టీడీపీకి.. గతంలో వారు టీడీపీ ఎంపీలేనన్న విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. -
ఫ్లాప్ హీరోకి చాన్స్ ఇస్తున్నాడు!
ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ తరువాత ఆ ఫాం కంటిన్యూ చేయలేకపోయాడు. ఇటీవల ఈ యంగ్ హీరో చేసిన సినిమాలన్ని బోల్తా పడటంతో కెరీర్ కష్టాల్లో పడింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ తరువాత మరో సినిమాతో రెడీ అవుతున్నాడు. రాజ్ తరుణ్ చివరి చిత్రం లవర్ సినిమాను నిర్మించిన దిల్ రాజు ఈ యంగ్ హీరో మరో ఛాన్స్ ఇస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా ఆడు మగాడ్రా బుజ్జి సినిమాను తెరకెక్కించిన కృష్ణ రెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు నీది నాది ఒకటే లోకం అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. మరి ఈ సినిమాతో అయిన రాజ్ తరుణ్కు సక్సెస్ దక్కుతుందేమో చూడాలి. -
వైఎస్సార్సీపీలో సీఈసీ సభ్యుల నియామకం
సాక్షి, హైదరాబాద్ : నెల్లూరు జిల్లాకు చెందిన ఎల్లసిరి గోపాల్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, టీజీ కృష్ణారెడ్డిలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యులుగా నియమితులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామకం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. -
డీఎంను బతికించిన భార్య ఫోన్ కాల్
సాక్షి, నెల్లూరు(పొగతోట): పౌరసరఫరాల సంస్థ డీఎం ఎన్.కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం జిల్లాలో సంచలనంగా మారింది. సోమవారం ఆయన తన కార్యాలయంలో ఫ్యాన్కు ఉరి వేసుకున్న విషయం తెలిసిందే. అధికార పార్టీ నాయకులు, జిల్లా అధికారులు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఒత్తిళ్ల కారణంగా డీఎం ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని బీజేపీ, ఇతర పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారుల బెదిరింపులు ఉన్నతాధికారులు డీఎంను బెదిరించినట్లు సమాచారం. బీపీటీ ధాన్యం వ్యవహారంలో ‘మంత్రితో చెప్పిన మాటలు సీఎం వీడియో కాన్ఫరెన్స్లో చర్చించాలి, సాయంత్రానికి నీవు ఔట్, పెన్షన్ కుడా రానివ్వను, నీపై కేసులు పెటిస్తా’ అని రాష్ట్ర అధికారి డీఎంను ఫోన్లో బెదిరించినట్లు తెలిసింది. అధికారపార్టీ నాయకులు, పలువురు రాష్ట్ర, జిల్లా అధికారులు భయాందోళనకు గురిచేయడంతో డీఎం ఆత్మహత్యకు పూనుకున్నారు. కాగా ఆయన ఆత్మహత్యకు గల కారణాలను, అధికారులు పేర్లను సూసైడ్ నోట్లో రాసినట్లు సమాచారం. అయితే దీనిని అదృశ్యం చేశారు. మీ వల్లనే.. డీఎంను పరామర్శించేందుకు కొందరు అధికారులు ఆస్పత్రికి వెళ్లారు. ఈ సమయంలో ఆయన భార్య వారిని నిలదీసినట్లు తెలిసింది. మీరు చిన్న వయసులో ఉన్నారు.. ఆయన వయసు పెద్దది. ఇటువంటి ఒత్తిళ్లను ఏవిధంగా తట్టుకోగలడని ఆమె ప్రశ్నించారు. మీ ఒత్తిళ్ల వల్లనే ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతిచెంది ఉంటే ఆయన్ను తిరిగి తీసుకురాగలరా అని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. డీఎం నాన్ రెవెన్యూ అధికారి. రెవెన్యూ అధికారి అయిఉంటే ఇప్పటికే ఉద్యోగులు విధులు బహిస్కరించి ధర్నాలు, నిరసనలు మొదలుపెట్టి ఉండేవారు. గతంలో పౌరసరఫరాల శాఖలో సీఎస్ డీటీ, ఏఎస్ఓ పోస్ట్లంటే ఉద్యోగులు క్యూ కట్టేవారు. రూ.లక్షలు చెల్లించి పోస్ట్లను దక్కించుకునే వారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోలు డ్యూటీలంటే సీఎస్ డీటీలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏం జరిగిందంటే.. సోమవారం ధాన్యం కొనుగోలుపై మంత్రి సోమిరెడ్డి ఆర్అండ్బీ గెస్ట్హోస్లో సమావేశం పెట్టారు. ఇందులో బీపీటీ సేకరించాలని అధికార పార్టీ నాయకులు, కొనుగోలు చేస్తే ఏసీబీకి పట్టిస్తాం, పింఛన్ రానివ్వకుండా చేస్తామని ఉన్నతాధికారులు బెదిరించడంతో మనస్తాపానికి గురైన డీఎం ఆత్మహత్యే శరణ్యమని భావించాడు. అనంతరం ఉదయం కార్యాలయానికి వచ్చారు. ఇన్చార్జి డీఎస్ఓ ఎంవీ రమణకి ఫోన్ చేసి అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నాను, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారు. ఆయన తాను మాట్లాతానని చెప్పినా వినకుండా కృష్ణారెడ్డి ఫోన్ పెట్టేశారు. అనంతరం డీఎం భార్యకు ఫోన్ చేసి టెన్షన్లు అధికంగా ఉన్నాయి, ఆత్మహత్య చేసుకుంటున్నాను, పిల్లలు జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆమె వెంటనే కార్యాలయ ఉద్యోగులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఉద్యోగులు డీఎం గదిలోకి చేరుకునే సరికి ఆయన ఉరి వేసుకుని ఉన్నారు. వారు ఆయన్ను రక్షించారు. -
కలెక్టర్ అమ్రపాలిపై కోర్టు ఆగ్రహం
సాక్షి, వరంగల్ అర్బన్ : జిల్లా కలెక్టర్ అమ్రపాలిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ కార్యాలయం ఉన్న ప్రైవేటు భవనానికి అద్దె చెల్లించనందుకు కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేయాలని జిల్లా కోర్టు శనివారం ఆదేశాలు ఇచ్చింది. తన భవనాన్ని ఐసీడీఎస్ కార్యాలయం కోసం వాడుకుంటూ.. రెండేళ్లుగా అద్దె చెల్లించడం లేదని, అద్దె బకాయిలు రూ.3 లక్షల చెల్లించాలని నోటీసులు జారీచేసినా కలెక్టర్ స్పందించలేదని పేర్కొంటూ ఇంటి యజమాని కృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన సీనియర్ సివిల్ జడ్జి.. జిల్లా కలెక్టర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వాహనం జప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. బకాయిలు చెల్లించిన తర్వాతే వాహనాన్ని తిరిగి అప్పగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ ఫార్చున్ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు కోర్టు సిబ్బంది కలెక్టరేట్కు వచ్చారు. -
శంషాబాద్ చేరిన జవాను క్రిష్ణారెడ్డి పార్ధివ దేహం
శంషాబాద్ : ఆర్మీ జవాను తల్లెపురెడ్డి క్రిష్ణారెడ్డి(21) పార్ధివ దేహం శుక్రవారం శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకుంది. జమ్ము కశ్మీర్లోని నౌశిరాలోని పూంచ్ సెక్టర్లో గురువారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో క్రిష్ణారెడ్డి అమరులయ్యారు. క్రిష్ణారెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఒబుళాపురం గ్రామం. పోలీసులు విమానాశ్రయంలో క్రిష్ణారెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్మీ అధికారులు తల్లెపురెడ్డి క్రిష్ణారెడ్డి మృతదేహాన్ని స్వగ్రామనానికి తరలించారు. -
తుడా అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (తుడా) అధికారి కోలేరి కృష్ణారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. భారీగా అస్తులు కూడబెట్టినట్టు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు కృష్ణారెడ్డి బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. తుడాలో కృష్ణారెడ్డి స్పెషల్ గ్రేడ్ ప్లానింగ్ ఆఫీసర్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అజిత్రెడ్డికి క్లీన్చిట్?
- హాలియా యువకుడి ఆత్మహత్యాయత్నం కేసు దర్యాప్తులో ముందంజ - అన్ని విషయాలు పోలీసుల ముందుంచిన ప్రధాన నిందితుడు కృష్ణారెడ్డి? సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన వడ్డె సతీశ్రెడ్డి ఆత్మహత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం పేషీకి చెందిన ఇద్దరిలో అజిత్రెడ్డికి క్లీన్చిట్ లభించిందా? మరో వ్యక్తి గంగాధర్ ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్రెడ్డి కృష్ణారెడ్డి నుంచి ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు తీసుకున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా కృష్ణారెడ్డిని నల్లగొండ పోలీసులు విచారించగా ఆయన పలు విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. అజిత్రెడ్డికి డబ్బులు ఇవ్వలేదని, అతడి ప్రమేయం ఏమీ లేదని కృష్ణారెడ్డి చెప్పాడని సమాచారం. గంగాధర్కు లక్షల రూపాయలు ముట్టజెప్పా నని చెప్పినట్లు తెలుస్తోంది. కృష్ణారెడ్డిని ఒకట్రెండు రోజుల్లో అరెస్టు చేయడంతో పాటు, విచారణలో వెల్లడయిన అంశాలతో నివేదికను ఉన్నతాధికారులకు పంపేందుకు నల్లగొండ జిల్లా పోలీసులు సిద్ధమవుతున్నారని సమాచారం. అజిత్రెడ్డి పట్టించుకునేవాడు కాదు.. గత నెల 30న హాలియాకు చెందిన యువకుడు సతీశ్రెడ్డి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ నోట్లో కృష్ణారెడ్డి, అజిత్రెడ్డి, గంగాధర్ పేర్లను రాశాడు. ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి తమవద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారన్నాడు. దీంతో ఇంటెలిజెన్స్ సైతం ఈ కేసుపై ఆరా తీసింది. కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణా రెడ్డిని నల్లగొండ జిల్లా పోలీసులు విచారిం చినట్టు సమాచారం. అజిత్రెడ్డిని గంగాధర్ పరిచయం చేశాడని, ఆ తర్వాత తనను పట్టించుకోలేదని, అజిత్రెడ్డికి డబ్బులు ఇవ్వలేదని కృష్ణారెడ్డి పోలీసు విచారణలో చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒత్తిడితోనే ఐపీ నోటీసులిచ్చిన కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి విచారణలో చెప్పిన సమాచారం ప్రకారం.. ఆయన చాలా మంది వద్ద నుంచి ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడు. తెలంగాణ జెన్కోతోపాటు ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కూడా ఓ వ్యక్తి వద్ద డబ్బులు తీసుకున్నాడని, హైదరాబాద్లోని భార్యా భర్తలను, నల్లగొండ డీఎంహెచ్వో కార్యా లయంలో ఓ ఉద్యోగిని కూడా ఇలాగే మోసం చేశాడని తెలుస్తోంది. మొన్నటి వరకు హైదరాబాద్లో ఓ ఆఫీసును కూడా నడిపించాడని సమాచారం. దీంతో పాటు చిన్నపాటి కాంట్రాక్టు పనులు చేసే కృష్ణారెడ్డి ఆ రంగంలో కూడా పలువురుకి అప్పు పడ్డాడని, అన్నివైపుల నుంచి రానున్న ఒత్తిడిని తట్టుకోలేకనే ఐపీ నోటీసులిచ్చాడని పోలీసులు చెపుతున్నారు. కొనసాగుతున్న విచారణ గంగాధర్కు మాత్రమే తాను లక్షల రూపాయలు ముట్టజెప్పానని కృష్ణారెడ్డి పోలీసు విచారణలో అంగీకరించాడని సమాచారం. గంగాధర్ ద్వారా తనకు అజిత్ పరిచయం అయ్యాడని, గంగాధరే తనను రెండు, మూడుసార్లు సీఎం వద్దకు కూడా తీసుకెళితే ఫొటోలు కూడా దిగానని కృష్ణారెడ్డి చెప్పాడని తెలుస్తోంది. తనకు గంగాధర్తో ఐదేళ్లుగా పరిచయం ఉందని, గంగాధర్ హైదరాబాద్లో నిర్మించిన ఓ ఇంటికి కూడా తన సహకారం ఉందని కృష్ణారెడ్డి చెప్పడంతో ఆ విషయాన్ని కూడా దర్యాప్తు చేయాలని పోలీసులు యోచిస్తున్నారు. అయితే, సతీశ్రెడ్డి మాత్రం కృష్ణారెడ్డికి రూ.40 లక్షల వరకు ఇచ్చానని చెపుతుండగా, ఇతరుల వద్ద నుంచి వసూలు చేసిన దాంట్లో గంగాధర్కు ఎంత ఇచ్చాడన్న దానిపై విచారణ జరుగుతోందని పోలీసులు చెపుతున్నారు. -
ఆ ఇద్దరికీ సంబంధం ఉందా..!
- నల్లగొండ జిల్లాకు చెందిన సతీశ్రెడ్డి ఆత్మహత్యాయత్నం కేసు - ఉద్యోగాలిప్పిస్తామని రూ.40 లక్షలు తీసుకొని మోసం చేశారని ఆరోపణ - బాధితుడిని విచారించిన ఇంటెలిజెన్స్ సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన వడ్డె సతీశ్రెడ్డి ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తనతో పాటు ఎనిమిది మందికి ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి రూ.40 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ గత గురువారం సతీశ్రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. సీఎం పేషీలో ఉండే అజిత్రెడ్డి, గంగాధర్తోపాటు హాలియా మండలానికి చెందిన కృష్ణారెడ్డిలు తనను మోసం చేసినందునే ఆత్మహత్యకు యత్నించానని బాధితుడు చెబుతున్న నేపథ్యంలో.. అసలు ఏం జరిగిందన్న దానిపై నిగ్గు తేల్చేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఈ కేసులో ముఖ్యమంత్రి పేషీ పాత్ర ఏ మేరకు ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు. సోమవారం రాత్రి బాధితుడు సతీశ్రెడ్డిని అతను చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే అరగంటకు పైగా విచారించారు. ఈ కేసులో సీఎం పేషీకి చెందిన అజిత్రెడ్డి, గంగాధర్ల ప్రమేయం ఉందా? అసలు డబ్బులు ఎవరికి ఇచ్చారు? అనే కోణాల్లో బాధితుడు సతీశ్రెడ్డిని ప్రశ్నించారు. జరిగిన విషయాన్నంతటినీ వివరించిన అనంతరం కొన్ని ఫొటోలను చూపించి అజిత్రెడ్డి, గంగాధర్ను గుర్తించాలని ఇంటెలిజెన్స్ అధికారులు అడిగారని, తాను ఇద్దరినీ గుర్తుపట్టి చూపించానని సతీశ్రెడ్డి చెబుతుండట గమనార్హం. ఈ కేసులో అజిత్రెడ్డి, గంగాధర్ను తప్పించేందుకు పోలీసు లపై ఒత్తిడి తెస్తున్నారని సతీశ్రెడ్డి ఆరోపిస్తున్నాడు. మంగళవారం అతను ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ కేసులో కృష్ణారెడ్డిని మాత్రమే బాధ్యులను చేసే దిశలో పోలీసులు వెళుతున్నట్లు తనకు అనుమానం వస్తోందన్నారు. తనకు న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా ముఖ్యమంత్రి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. పోలీసుల అదుపులో కృష్ణారెడ్డి? ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న హాలియా మండలానికి చెందిన పల్రెడ్డి కృష్ణారెడ్డిని సోమవారం రాత్రి నల్లగొండ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నం చేసేందుకు ముందు రోజు డబ్బులు తీసుకున్న కృష్ణారెడ్డిని బాధితుడు సతీశ్రెడ్డి కలిశాడని, అప్పుడు కృష్ణారెడ్డి కూడా సతీశ్రెడ్డితో తన గోడు చెప్పుకున్నాడని తెలుస్తోంది. తనను గంగాధర్ మోసం చేశాడని, ఈ విషయాన్ని అజిత్ దృష్టికి తీసుకెళితే అలా చేయడానికి వీల్లేదు.. కూర్చోబెట్టి మాట్లాడుదాం.. విషయాన్ని పెద్దది చేయకండి అని సర్ది చెప్పాడని కృష్ణారెడ్డి సతీశ్రెడ్డికి చెప్పినట్లు తెలిసింది. కాగా, నల్లగొండ డీఎంహెచ్వో కార్యాలయ ఉద్యోగితో పాటు హైదరాబాద్కు చెందిన ప్రసాద్రెడ్డి, హైదరాబాద్కే చెందిన మరో భార్యాభర్తల నుంచి.. ఇలా చాలా మంది వద్ద నుంచి రూ.4 కోట్ల వరకు వసూలు చేశాడని కృష్ణారెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. -
డీఈవోకు పదోన్నతి
జాయింట్ డైరెక్టర్గా బదిలీ రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యమని మరోసారి రాష్ట్ర మంత్రి పి.నారాయణ రుజువు చేశారు. లీజు పేరుతో కబ్జా చేసిన స్థలాన్ని కూడా వెనక్కితీసుకోకుండా అడ్డుపుల్ల వేయగలిగారు. కబ్జా చేసిన స్థలానికి కాపలాగా నిలబడ్డారు. ఓ కార్పొరేటు విద్యాసంస్థకు మేలు చేకూర్చారు. స్టీల్ప్లాంట్ భవిష్యత్ అవసరాలకై నిర్మిస్తున్న కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్–2 (కేబీఆర్–2) డిజైన్నే కాదు.. ఏకంగా దిశనే మార్చేశారు. విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డికి పదోన్నతి లభించింది. ఈయనకు ప్రాథమిక విద్యాశాఖ సంయుక్త సంచాలకుని (జేడీ)గా పదోన్నతి కల్పిస్తూ, రాజధాని అమరావతి (ఇబ్రహీంపట్నం)లో నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో డిప్యూటీ డీఈవోగా పనిచేస్తున్న ఆయన 2014 మే 11న డీఈవోగా పదోన్నతిపై విశాఖ వచ్చారు. అప్పట్నుంచి దాదాపు రెండు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఆయన డీఈవోగా విధులు నిర్వహించారు. ఇటీవల కాలంలో ఎక్కువ రోజులు డీఈవోగా పనిచేసింది ఈయనే. తన హయాంలో పదో తరగతిలో మంచి ఫలితాలు రావడానికి కృషి చేశారు. 2014లో 90.86 శాతం, 2015లో 91.76 శాతం, 2016లో 94.70 శాతం పదో తరగతిలో ఫలితాలు సాధించారు. జిల్లా విద్యాశాఖకు చినగదిలిలో రూ.కోటి 35 లక్షలతో ప్రత్యేకంగా భవనం ఏర్పాటుకు కృషి చేశారు. డీఎస్సీ 2014 నియామకాల్లో ఆరోపణలకు తావులేకుండా పూర్తి చేశారు. సోమవారం ఆయన డిప్యూటీ డీఈవో నాగమణికి చార్జి అప్పగించి విధుల నుంచి రిలీవ్ అయ్యారు. మంగళవారం జేడీగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన స్థానంలో ప్రభుత్వం ఇంకా ఎవరినీ నియమించలేదు. -
అర్హులకు సంక్షేమ ఫలాలు
జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి నేరడిగొండ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడడమే ప్రధాన లక్ష్యమని జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వాగ్ధారి గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. సంక్షేమ ఫలాలు అర్హులకు చేరుతున్నాయా.. లేదా? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను జేసీకి విన్నవించగా, ఓపికగా ప్రతీ సమస్యకు పరిష్కార మార్గాలు చూపించారు. సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు, పేదలు, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ సందర్భంగా కొందరు పింఛన్లు రావడం లేదని, రేషన్కార్డులు లేవని జేసీకి తెలిపారు. అర్హులకు వెంటనే పింఛన్లు, రేషన్కార్డులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు మరుగుదొడ్ల నిర్మాణానికి జేసీ భూమిపూజ చేశారు. స్థానిక సర్పంచ్ సిడాం పార్వతిబాయి, ప్రత్యేక అధికారి మధుసూదనచారి, తహసీల్దార్ కూనాల గంగాధర్, ఎంపీడీవో మహ్మద్ రియాజొద్దీన్, ఎంఈవో భూమారెడ్డి, వైద్యాధికారి శ్రీధర్రెడ్డి, పశువైద్యాధికారిణి నేహ, ఈజీఎస్ ఏపీవో మంజులారెడ్డి, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు వేణుగోపాల్రెడ్డి, ఇర్ఫాన్, ఐకేపీ ఏపీఎం సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో స్వచ్ఛభారత్
►జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి ►ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో స్వచ్ఛభారత్ ఆదిలాబాద్ స్పోర్ట్స్ : ప్రతీఒక్కరు స్వచ్ఛత వైపుగా అడుగేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి సూచించా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో మంగళవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామా లు, పట్టణాల్లో స్వచ్చభారత్ కార్యక్రమాలను నిర్వహిస్తూ యువత ఆదర్శంగా నిలవాలన్నారు. విద్యార్థులు సేవా దృక్పదాన్ని కలిగి ఉండి సమాజా ఉన్నతికి తమవంతు కృషి చేయాలని సూచించారు. భావిభారత పౌ రులు విద్యార్థులేనని, భవిష్యత్తు తరాలకు ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నారు. అనంతరం ఐపీ స్టే డియంలోని పిచ్చిమొక్కలు, మైదానం చుట్టూ ఉన్న పి చ్చిమొక్కలు తొలగించి గుంతలను పూడ్చారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ఎన్.వెంకటేశ్వర్లు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్దన్రెడ్డి, ఎన్ఎస్ఎస్ సమన్వయ కర్త తిరుపతి రెడ్డి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. -
కారు అద్దాలు పగలగొట్టి రూ.3 లక్షల చోరీ
గుర్తుతెలియని వ్యక్తులు కారు(టీఎస్07ఈడీ2000) అద్దాలు పగలగొట్టి రూ.3 లక్షలు చోరీ చేశారు. ఈ సంఘటన శామీర్పేట్ పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో చోటుచేసుకుంది. బాబాగూడ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి వ్యాపారం కోసం తనతో తీసుకువచ్చిన రూ.3 లక్షల్ని కారులో ఉంచి పోలీసుస్టేషన్ ఎదుట ఉన్న ఆఫీసులోకి వెళ్లాడు. వెళ్లి వచ్చి చూసేసరికి కారు అద్దాలు పగలగొట్టి ఉన్నాయి. అందులో ఉంచిన రూ.3 లక్షల నగదు కూడా తస్కరించారు. ఈ ఘటనపై బాధితుడు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నాడు. -
ఫిల్మ్ నగర్ క్లబ్ ఫర్నీచర్ ధ్వంసం
-
ఫిల్మ్ నగర్ క్లబ్ ఫర్నీచర్ ధ్వంసం
హైదరాబాద్: అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపడుతూ ఇద్దరు కార్మికులు మృతి చెందడానికి కారణమైన ఫిల్మ్ నగర్ క్లబ్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చాంబర్లోకి దూసుకెళ్లిన కార్యకర్తలు ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో మాజీ ఎమ్మెల్యే కే లక్ష్మారెడ్డి వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుతో పాటు యూత్ కాంగ్రెస్ నేత అనిల్, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని.. లేదంటే నిరాహారదీక్ష చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఫిల్మ్ నగర్ ఘటనలో మృతులకు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ సంతాపం తెలిపింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని టీవైఎస్ఆర్ సీపీ అధ్యక్షడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్
విధులకు సక్రమంగా హాజరు కాని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని డీఈఓ సస్పెండ్ చేసిన ఘటన బుధవారం మండలంలోని చందనాడ గ్రామంలో చోటుచేసుకుంది. చందనాడ ప్రాథమిక పాఠశాలలో శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే.. కొంత కాలంగా.. విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు. దీంతో పాటు.. ఇష్టానుసారం.. స్కూలుకు సెలవులు ప్రకటిస్తున్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్ పై ఆందోళనగా ఉందంటూ.. గ్రామస్తులు డీఈఓ కృష్ణా రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ హెచ్ఎం శ్రీనివాస్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
భూమికోసం పిల్లలను హత్య చేసిన తండ్రి
బీబీనగర్: భూమి రిజిస్ట్రేషన్కు అడ్డుగా ఉన్నారనే నెపంతో ఓ తండ్రి తన కూతురు, కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో జరిగింది. కనగల్ మండలం బచ్చన్నగూడెంకు చెందిన కోయ కృష్ణారెడ్డి, అతడి సోదరుడు దామోదర్రెడ్డి వారసత్వ భూమిని పంచుకోవాలని అనుకున్నారు. కానీ దామోదర్రెడ్డితో సహా కుటుంబ సభ్యులు కృష్ణారెడ్డి పేరుపై కాకుండా అతడి పిల్లలు రవళి(11), విత్తీష్(8)లపై భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడంతో ఒప్పుకున్నాడు. దీంతో రిజిస్ట్రేషన్ చేయిస్తానని శనివారం పిల్లలను తీసుకొని వెళ్లాడు. అనంతరం రిజిస్ట్రేషన్ చేయించకుండానే తన హోటల్కు వెళ్లాడు. ఆదివారం ఇద్దరు పిల్లలకు తొలుత విషం ఇచ్చి, అనంతరం బండకేసి కొట్టి హత్య చేశాడు. కృష్ణారెడ్డి ఇంటికి రాకపోవడంతో భార్య, బంధువులు సోమవారం హోటల్ వద్దకు వచ్చారు. వారి అలికిడిని గుర్తించిన కృష్ణారెడ్డి.. పురుగులమందు తాగాడు. షట్టర్ను పగులగొట్టి చూడగా ఇద్దరు చిన్నారులు రక్తపుమడుగులో కనిపించారు. కృష్ణారెడ్డిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. -
రేవంత్రెడ్డి అన్న మృతి
మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే, ఓటుకు నోట్లు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి(62) గుండెపోటుతో మృతి చెందారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని తన నివాసంలో సోమవారం ఉదయం కృష్ణారెడ్డికి గుండెపోటు వచ్చింది. ఆయన్ని కుటుంబ సభ్యులు కల్వకుర్తిలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేసేలోపే ఆయన మృతి చెందారు. దీంతో ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కృష్ణారెడ్డి భార్య వనజ గతంలో గ్రామ సర్పంచ్గా పనిచేశారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. -
అధిక వడ్డీ ఆశచూపి..రూ.12 కోట్లతో పరారీ
-
అధిక వడ్డీ ఆశచూపి..రూ.12 కోట్లతో పరారీ
మహబూబ్నగర్: వడ్డీ ఎంతయినా పర్వాలేదు.. నెలనెలా నిక్కచ్చిగా ఇస్తానన్నాడు. కొంతకాలం అలాగే చేశాడు. ఇంకేముంది అధిక వడ్డీ వస్తుంది కదా అని అతడికి వడ్డీకిచ్చిన వ్యక్తులు తమ బంధువులు, స్నేహితుల నుంచి కూడా అప్పులు ఇప్పించారు. తీరా రూ.12 కోట్ల దాకా పోగేసుకున్న ఓ వ్యక్తి అదను చూసి పరారయ్యాడు. దీంతో బాధితులు బోరుమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లాలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్లో నివాసం ఉండే రమేష్ నాలుగేళ్ల క్రితం మహబూబ్నగర్లో మేధ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశాడు. దీంతో పాటు అతను షేర్ మార్కెట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ఇందులో పెట్టుబడి పెట్టటానికి పట్టణంలోని ప్రముఖ వ్యాపారుల యువకులను నమ్మించి లక్షల్లో తీసుకున్న డబ్బులకు నెలసరి వడ్డీలు చెల్లిస్తూ వచ్చాడు. వచ్చిన లాభాల్లో కూడా పర్సంటేజీలు ఇస్తానని మరింత ఆశ పెట్టాడు. తెలిసిన వారితో పాటు ఉద్యోగులను, వారి బంధువులను కూడా ఈ ఉచ్చులోకి లాగాడు. ప్రారంభంలో వందకు రూ.5 వడ్డీ చెల్లించాడు. ఈ విషయం ప్రచారం కావడంతో చాలామంది లక్షల రూపాయలు అతనికి ఇచ్చారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి అతనికి రూ.2 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. కొన్ని నెలలైన తరువాత అప్పులు ఇచ్చిన వారితో మరో ఒప్పందం చేసుకున్నాడు. వందకు రూ.10 వడ్డీ ఇస్తానని ఎవరి వద్దయినా తీసుకు రావచ్చన్నాడు. దీంతో చాలామంది బయట అప్పులు తెచ్చి రమేష్కు వడ్డీకి ఇచ్చారు. ఇలా జిల్లాలో రూ.12కోట్ల వరకు తీసుకున్నాడు. కొంతకాలం నుంచి అతడు వడ్డీ చెల్లించక పోవడంతో అతడిని నిలదీశారు. దీంతో కొంతమందికి చెక్కులు ఇచ్చాడు. అయినా, డబ్బులు ఇవ్వలేదు. పైగా మహబూబ్నగర్లో ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్కు వెళ్లాడు. దీంతో బాధితులు అతడిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. శుక్రవారం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. -
కారు బీభత్సం..ఇద్దరికి గాయాలు
లంగర్హౌస్: యువకుడు నిర్లక్ష్యంగా కారు నడిపి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఇద్దరు అయ్యప్ప మాలధారులకు తీవ్ర గాయాలయ్యాయి. లంగర్హౌస్ పోలీసుల కథనం ప్రకారం..విశాఖపట్నానికి చెందిన కృష్ణారెడ్డి(24), ఏడుకొండలురెడ్డి(28) రాజేంద్రనగర్ మండలం హైదర్షాకోట్లో నివాసముంటున్నారు. ఇటీవల అయ్యప్ప మాల వేసుకుని అత్తాపూర్లోని సన్నిధానంలో ఉంటున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు బైక్పై బాపూఘాట్ మీ దుగా లంగర్హౌస్కు వెళుతున్నారు. అదే సమయం లో బషీర్బాగ్కు చెందిన గుల్జార్ అగర్వాల్(24) కారులో పోలీస్ అకాడమీ నుంచి లంగర్హౌస్ వైపు వేగంగా వచ్చాడు. అతడి కారు ఒక్కసారిగా గుండ్రంగా తిరుగుతూ కృష్ణారెడ్డి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లి టైర్లలో గాలి పెట్టించుకుంటున్న మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో గుల్జార్ స్వల్ప గాయాలతో బయటపడగా, కృష్ణారెడ్డి, ఏడుకొండలరెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. రెండు కార్లు, ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న లంగర్హౌస్ 108 ఈఎంటీ రఘుపతి, ఫైలట్ ముజాఫర్లు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంత జరిగినా గుల్జార్, అతడి సంబందీకులు స్థానికులు, బాధితుల పై దాడికి పాల్పడటం అందరిని నిశ్చేష్టులను చేసింది. -
రెండో రోజు ముమ్మరంగా భూ సర్వే
దామరచర్ల : థర్మల్ పవర్ ప్రాజెక్టు భూ సర్వే శనివారం రెండో రోజు మండలంలో ముమ్మరంగా కొనసాగింది. భూ సర్వే నిమిత్తం ఏర్పాటుచేసిన 21టీములు 6 గ్రామాల్లో పర్యటించాయి. బృందం సభ్యులు ఆయా గ్రామాల్లోని భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూ మి ఎంత ఉంది, ఏయే ప్రాంతాల్లో ఉందో ఆరా తీశారు. మండలంలోని 7 గ్రామాల్లో 9వేల ఎకరాల సేకరణ లక్ష్యంగా సర్వే సాగింది. అయితే అధికారుల కోసం ఆయా గ్రామాల రైతులు పనులు మానుకొని భూముల వద్ద అందుబాటులో ఉన్నారు. అందుబాటులో లేకపోతే భూములు కోల్పోతామోనన్న బెంగతో ఉద యం 9 గంటలు మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకు వేచి ఉన్నారు. వీర్లపాలెంలో అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు మిర్యాలగూడ తహసీల్దార్ కృష్ణారెడ్డి బృందం మండలంలోని వీర్లపాలెం గ్రామంలో సర్వే చేసేందుకు వచ్చింది. విషయం తెలుసుకున్న సాత్తండా, దుబ్బతండా గిరిజనులు అధికారులను సర్వే చేయకుండా అడ్డుకున్నారు .మహిళలు వాహనాలు ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. దీంతో కృష్ణారెడ్డి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినలేదు. దీంతో ఫోన్ ద్వారా మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్రావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆర్డీఓ హుటాహుటిన వీర్లపాలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి నీటివసతి కల్పించుకుని సాగుచేసుకుంటున్న భూములు పవర్ప్లాంట్కు పోతే తమకు జీవనాధారం లేకుండా పోతుందని రైతులు.. ఆర్డీఓకు మొర పెట్టుకున్నారు. సాగుచేసిన భూములు ఫారెస్టువని, వాటికి నష్ట పరిహారం రాదని, దీంతో భూములు నమ్ముకుంటూ బతుకుతున్న కుటుంబాలు వీధిన పడతాయని విన్నవించారు. ఆర్డీఓ కిషన్రావు మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందడంలో తప్పులేదని, ఈ విషయాలను సీఎం వచ్చిన నాడే కలెక్టర్కు, సీఎంకు విన్న వించామని తెలిపారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. భూమిని నమ్ముకొని జీవించే ఏ ఒక్క కుటుంబానికీ నష్టం కలగకుండా చూస్తామని, భూమి కోల్పోయిన వారికి భూమి, లేదా నష్టపరిహారం, కుటుం బంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు నిరసనను విరమించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దుర్గెంపూడి నారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ కోట్యానాయక్, టీఆర్ఎస్ నాయకులు చల్లా అంజిరెడ్డి, పర్ష్యానాయక్, బాలు, అనిమిరెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈ పేపర్లు ఏం చేసుకోవాలి?
తరిమెల (శింగనమల) : ‘ఏ ఒక్క రైతుకూ రుణ మాఫీ సక్రమంగా చేయలేదు.. రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి మాట మార్చారు. రైతుకు రూ.ఒకటిన్నర లక్ష వరకు రుణమాఫీ అని చె ప్పారు. కనీసం అది కూడా వేయకుండా మోసం చేశార’ని రైతు సాధికరత సదస్సుకు వచ్చిన రైతులు గురువారం అధికారులను నిలదీశారు. ఈ సంఘటన శింగనమల మండలం తరిమెలలో చోటుచేసుకుంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు సదస్సును బాయ్ కాట్ చేశారు. తరిమెల గ్రామంలో రుణ మాఫీపై రైతు సాధికారత సదస్సు ప్రారంభం కాగానే.. రైతులకు ప్రభుత్వం రుణాలు మాఫీ చేసిందని, అందుకు గాను రైతులకు విముక్తి పత్రాలు అందించనున్నట్లు ఎంపీడీఓ లలితకుమారి తెలిపారు. దీంతో రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.‘ఈ పత్రాలు తీసుకుని ఏం చేయూలి? అంతా మోసం చేశారు.. రుణాలు పూర్తిగా మాఫీ అని చెప్పి, రకరకాల పేరుతో తగ్గించేశారు.. గ్రామంలో ఎంత మందికి పూర్తిగా రుణం పోయిందో చెప్పండ’ని అధికారులను నిలదీశారు. పత్రాలను బ్యాంకులకు తీసుకుని పోతే, రేపు తిరిగి రుణాలు మంజూరు చేస్తారని అధికారులు నచ్చజెప్పారు. ఈ విషయూన్ని ఎంత వరకు నమ్మాలని.. అక్కడే ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ మనోహర్ను రైతులు ప్రశ్నించారు. బ్యాంకులకు అలాంటి ఆదేశాలు ఇంకా రాలేదని, వచ్చిన వెంటనే రైతులకు తెలియజేస్తామని చెప్పారు. ఎందుకూ ఉపయోగం లేని ఈ పత్రాలు ఎందుకని అధికారులను ప్రశ్నించారు. బ్యాంకులలో మాఫీ అయినప్పుడు ఇస్తే తీసుకుంటామని, అంతవరకు ఈ పత్రాలు మీదగ్గరే పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు హనుమంతురెడ్డి, బాలిరెడ్డి, కోటేశ్వర్రెడ్డి, క్రిష్ణారెడ్డి, సీపీఐ నాయకులు రామాంజినేయులు మాట్లాడుతూ రైతులను నిలువునా మోశారని ఆవేదన చెందారు. రుణాలు పూర్తిగా మాఫీ అని చెప్పి, ప్రభుత్వం ఏర్పడిన తరువాత మాట మార్చారన్నారు. స్కేల్ ఆఫ్ పైనాన్స్ పేరుతో రైతులను మోసం చేశారన్నారు. రూ.50 వేలు ఏ ఒక్కరికీ మాఫీ కాలేదన్నారు. ఇది రైతులను దగా చేయడమేనన్నారు. పింఛన్ల విషయంలో కూడా అలాగే చేశారని మండిపడ్డారు. గ్రామంలో 90 మంది పింఛన్లు తొలగిస్తే, కేవలం 10 మందికి మాత్రమే పునరుద్దరించారని, మిగిలిన వారికి రాలేదని ప్రశ్నించారు. గ్రామంలో ఇంకా చాలా మంది రైతుల పేర్లు రుణ మాఫీ జాబితాలో లేవన్నారు. రైతులకు పూర్తిగా మాఫీ అయిన తరువాత ఈ పత్రాలు అందించాలని రైతులందరం బాయ్ కాట్ చేస్తున్నామని చెప్పి అందరు వెళ్లిపోయారు. దీంతో సదస్సును అధికారులు నిలిపి వేశారు. సదస్సులో ఈఓఆర్డీ యశోదమ్మ, ఏఏఓ శైలజ, ఆత్మ పీపీఎం లావణ్య, వీఆర్వో భరత్కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేశ్వర్రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆదినారాయణ పాల్గొన్నారు. -
ఈ పేపర్లు ఏం చేసుకోవాలి?
తరిమెల (శింగనమల) : ‘ఏ ఒక్క రైతుకూ రుణ మాఫీ సక్రమంగా చేయలేదు.. రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి మాట మార్చారు. రైతుకు రూ.ఒకటిన్నర లక్ష వరకు రుణమాఫీ అని చె ప్పారు. కనీసం అది కూడా వేయకుండా మోసం చేశార’ని రైతు సాధికరత సదస్సుకు వచ్చిన రైతులు గురువారం అధికారులను నిలదీశారు. ఈ సంఘటన శింగనమల మండలం తరిమెలలో చోటుచేసుకుంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు సదస్సును బాయ్ కాట్ చేశారు. తరిమెల గ్రామంలో రుణ మాఫీపై రైతు సాధికారత సదస్సు ప్రారంభం కాగానే.. రైతులకు ప్రభుత్వం రుణాలు మాఫీ చేసిందని, అందుకు గాను రైతులకు విముక్తి పత్రాలు అందించనున్నట్లు ఎంపీడీఓ లలితకుమారి తెలిపారు. దీంతో రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.‘ఈ పత్రాలు తీసుకుని ఏం చేయూలి? అంతా మోసం చేశారు.. రుణాలు పూర్తిగా మాఫీ అని చెప్పి, రకరకాల పేరుతో తగ్గించేశారు.. గ్రామంలో ఎంత మందికి పూర్తిగా రుణం పోయిందో చెప్పండ’ని అధికారులను నిలదీశారు. పత్రాలను బ్యాంకులకు తీసుకుని పోతే, రేపు తిరిగి రుణాలు మంజూరు చేస్తారని అధికారులు నచ్చజెప్పారు. ఈ విషయూన్ని ఎంత వరకు నమ్మాలని.. అక్కడే ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ మనోహర్ను రైతులు ప్రశ్నించారు. బ్యాంకులకు అలాంటి ఆదేశాలు ఇంకా రాలేదని, వచ్చిన వెంటనే రైతులకు తెలియజేస్తామని చెప్పారు. ఎందుకూ ఉపయోగం లేని ఈ పత్రాలు ఎందుకని అధికారులను ప్రశ్నించారు. బ్యాంకులలో మాఫీ అయినప్పుడు ఇస్తే తీసుకుంటామని, అంతవరకు ఈ పత్రాలు మీదగ్గరే పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. రైతులు హనుమంతురెడ్డి, బాలిరెడ్డి, కోటేశ్వర్రెడ్డి, క్రిష్ణారెడ్డి, సీపీఐ నాయకులు రామాంజినేయులు మాట్లాడుతూ రైతులను నిలువునా మోశారని ఆవేదన చెందారు. రుణాలు పూర్తిగా మాఫీ అని చెప్పి, ప్రభుత్వం ఏర్పడిన తరువాత మాట మార్చారన్నారు. స్కేల్ ఆఫ్ పైనాన్స్ పేరుతో రైతులను మోసం చేశారన్నారు. రూ.50 వేలు ఏ ఒక్కరికీ మాఫీ కాలేదన్నారు. ఇది రైతులను దగా చేయడమేనన్నారు. పింఛన్ల విషయంలో కూడా అలాగే చేశారని మండిపడ్డారు. గ్రామంలో 90 మంది పింఛన్లు తొలగిస్తే, కేవలం 10 మందికి మాత్రమే పునరుద్దరించారని, మిగిలిన వారికి రాలేదని ప్రశ్నించారు. గ్రామంలో ఇంకా చాలా మంది రైతుల పేర్లు రుణ మాఫీ జాబితాలో లేవన్నారు. రైతులకు పూర్తిగా మాఫీ అయిన తరువాత ఈ పత్రాలు అందించాలని రైతులందరం బాయ్ కాట్ చేస్తున్నామని చెప్పి అందరు వెళ్లిపోయారు. దీంతో సదస్సును అధికారులు నిలిపి వేశారు. సదస్సులో ఈఓఆర్డీ యశోదమ్మ, ఏఏఓ శైలజ, ఆత్మ పీపీఎం లావణ్య, వీఆర్వో భరత్కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేశ్వర్రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆదినారాయణ పాల్గొన్నారు. -
మీ ప్రేమ అసామాన్యం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘ప్రజల నుంచి పుట్టి, ప్రజల కోసమే జీవించి, ప్రజాసేవ చేస్తూనే మరణించిన నాయకుడు వైఎస్. రాష్ట్ర ప్రజల కోసం పెద్ద మనసు చేసుకుని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మంచి పనులు చేశారు. వెనక్కివెళ్లి ఆలోచిస్తే ఆయనలా ఆలోచించే నాయకుడు చరిత్రలో మరొకరు లేరు’ అని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డితో కలిసి వరుసగా బుధవారం మూడోరోజు జిల్లాలోని కొల్లాపూర్, వనపర్తి, దేవరకద్ర, గద్వాల, మక్తల్ నియోజకవర్గాల మీదుగా పరామర్శయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక గుండె చెదిరి మరణించిన ఆరుగురి కుటుంబాలను షర్మిల పరామర్శించారు. వనపర్తిలో స్వాగతం పలికిన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ‘రుణమాఫీ, ఉచిత విద్యుత్, పంటల బీమా, సబ్సిడీ ఇలా అనేక విధాలుగా సాయంచేసి వైఎస్ రైతులను నెత్తిన పెట్టుకుని గౌరవించారు. పేద ప్రజలకు భారం పడకుండా ఏ ఒక్క చార్జీ పెంచకుండా వైఎస్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ‘108’ సేవలు ఇలా పథకమేదైనా లక్షల మందికి ఉపయోగపడే పనులు చేశారు’ అని వైఎస్ పాలనను షర్మిల గుర్తుచేశారు. ‘వైఎస్ మనసు ఎంతో పెద్దది. రాష్ట్రంలో గుడిసెలు లేకుండా ప్రతిఒక్కరికీ పక్కా ఇల్లు ఉండాలని కోరుకున్నారు. మనిషిని మనిషిలా చూసి, తెలుగు ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకున్నారని’ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. ‘మా కుటుంబంపై మీప్రేమ సామాన్యమైనది కాదు. మీ ప్రాణం కంటే ఎక్కువగా మా నాన్న గారిని ప్రేమించిన ందుకు రాజన్న కుటుంబం శిరస్సు వంచి నమస్కరిస్తోంది’ అని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య భారతదేశంలో వైఎస్ లాంటి నాయకుడు చనిపోతే వందల గుండెలు ఆగిపోవడం అసామాన్యమని షర్మిల అన్నారు. అవసరమైన ప్రతిఒక్కరికీ అండగా నిలిచిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అంటూ వివిధ పథకాల అమల్లో ఆయన కృషిని ఆమె ప్రస్తావించారు. చేయిచేయి కలిపి రాజన్నరాజ్యం సాధించుకుందామని పిలుపునిచ్చారు. జిల్లాకు అత్యంత ప్రాధాన్యత: ఎడ్మ కిష్టారెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో జిల్లాకు వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యంత ప్రాధాన్యమిచ్చారని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు. వనపర్తికి చెందిన చిన్నారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో పాటు పట్టణంలో రాజీవ్ నగరబాట పర్యటనకు అనేక హామీలు ఇచ్చారన్నారు. నగరబాటలో ఇచ్చిన హామీల వల్లే వనపర్తిలో వసతులు, సౌకర్యాలు సమకూరాయన్నారు. వనపర్తికి హార్టికల్చర్ ఇనిస్టిట్యూట్ కూడా వైఎస్ హయాంలోనే మంజూ రైన విషయాన్ని కిష్టారెడ్డి గుర్తుచేశారు. మూడోరోజు పరామర్శ యాత్రలో రాష్ట్ర నేతలు కొండా రాఘవరెడ్డితో పాటు జిల్లా నేతలు మామిడి శ్యాంసుందర్రెడ్డి, భీష్వ రవీందర్, రాంభూపాల్రెడ్డి, మాదిరెడ్డి భగవంత్రెడ్డి, జశ్వంత్రెడ్డి, బంగి లక్ష్మణ్, జెట్టి రాజశేఖర్, రహమాన్, కావలి మధుమిత తదితరులు వైఎస్ షర్మిల వెంట ఉన్నారు. -
ఇదేం ‘ఆదర్శం’
కశింకోట: మండలంలోని తేగాడ ఆదర్శ పాఠశాల నిర్వహణ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్, సిబ్బంది పనితీరుపై ఫిర్యాదుల మేరకు శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వి. కృష్ణారెడ్డి సందర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కొరవడిందని, దీనివల్ల చదువులు సరిగ్గా సాగక విద్యార్థుల భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిందని తల్లిదండ్రులు వాపోయారు. కార్పోరేట్ కళాశాలల్లో చదివించే స్థోమత లేక, ఉన్నతమైన ఐఐటి పరీక్షలకు తయారు చేస్తారని ఆశించి తమ పిల్లలను ఇక్కడ చేర్పించామన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రధాన పాఠ్యాంశాలైన రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం బోధించడానికి చాలా కాలంగా ఉపాధ్యాయులే కొరవడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల వసతి గృహాన్ని నిర్మించి ప్రారంభించినప్పటికీ దాన్ని వినియోగంలోకి తీసుకురాకపోవడం పట్ల దూరప్రాంత బాలికలు రోజూ పాఠశాలకు రావడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు. యూనిఫాం ఇవ్వలేదని, ఆర్టీసీ బస్సును బయ్యవరం హెరిటేజ్ డెయిరీ వరకే పరిమితం చేయకుండా తాళ్లపాలెం వరకు నడపడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల రోడ్డును మెరుగు పర్చాలన్నారు. వ్యక్తిగత కక్షతో తమ అమ్మాయిని ప్రిన్సిపాల్ అవమానిస్తున్నారని, ఇది శోచనీయమని పి.కల్యాణి ఈ సందర్భంగా డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఎంపీపీ పెంటకోట సుబ్బలక్ష్మి మాట్లాడుతూ విద్యా సంస్థలో రాజకీయాలకు, వ్యక్తిగత ప్రతిష్టలకు తావు లేకుండా నడపాలన్నారు. సర్పంచ్ సిదిరెడ్డి సూర్యనారాయణ,విద్యార్థుల తల్లిదండ్రులు జి.నానాజీ,మజ్జి వెంకట రామకృష్ణ పరమహంస తదితరులు తమ అభిప్రాయాలను, పాఠశాలలో ఎదురయ్యే సమస్యలను డీఈవో దృష్టికి తెచ్చారు. త్వరలో ఉపాధ్యాయుల కొరత నివారణ: ఈ సందర్భంగా డీఈవో కృష్ణారావు మాట్లాడుతూ 15 రోజుల్లోగా కొత్త ఉపాధ్యాయులు రానున్నారన్నారు. బాలికల వసతి గృహం తెరవడానికి ఉన్నతాధికారుల అనుమతి కోసం లేఖ రాశామన్నారు. అదనంగా ఆర్టీసీ బస్సును నడపడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రిన్సిపాల్ సంధ్యకు అనుకూలంగా, వ్యతిరేకంగా తల్లిదండ్రులు విడిపోయి కొంతసేపు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్తో డీఈవో సమావేశమయ్యారు. అంతా సమన్వయంతో పని చేసి పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు బంగారు భవిష్యత్ను కృషి చేయాలని ఆదేశించారు. -
‘వినవయ్య రామయ్యా’ షూటింగ్ ప్రారంభం
-
జననేతకు ఘన నివాళి
సాక్షి బృందం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 5వ వర్ధంతి వేడుకలను మంగళవారం కల్వకుర్తి, అచ్చంపేట, కొత్తకోట, దేవరకద్ర, షాద్నగర్, అలంపూర్, జడ్చర్ల, కొడంగల్, కొల్లాపూర్, నర్వ, ఆత్మకూర్, పట్టణాల్లో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు వైఎస్ విగ్రహాలకు పూలమాల లు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పలువురు నేతలు వైఎస్ సేవలను కొనియాడా రు. పాలమూరు నుంచి పలు సంక్షేమపథకాలను ప్రారంభించారని గుర్తుచేశారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాల యంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి వైఎస్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల ప్రజలకు సంక్షేమపథకాలు అందజేసిన ఘనత వైఎస్కే ద క్కిందన్నారు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందజేసి.. ఎంతోమందికి చదువుకునే అవకాశం కల్పించారని గుర్తుచేశారు. ఇప్పుడేమో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా పేద విద్యార్థులతో చెలగాటమాడుతుందన్నారు. అనంతరం అనాథ విద్యార్థులకు పండ్లు పంపిణీచేశారు. అచ్చంపేటలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బీష్వ రవీందర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు ప్రజ లగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. వైఎస్ పథకాలను గత ప్రభుత్వాలు నీరుగార్చాయని విమర్శిం చారు. అనంతరం స్థానిక ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పం పిణీ చేశారు. వ్యవసాయానికి ఊపిరిపోసి..రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. కొల్లాపూర్లో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆ పార్టీ నేత మేనుగొండ రాముయాదవ్ వైఎస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీచేశారు. మక్తల్లోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో వైఎస్కు ఘనంగా నివాళులర్పించారు. నారాయణపేటలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి జమీర్పాషా ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించారు. అనంతరం ‘పేట’ ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో వైఎస్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో అన్నివర్గాలకు అభివృద్ధి, సంక్షేమఫలాలు అందాయని డీసీసీ ఉపాధ్యక్షుడు రంగారావు కొనియాడారు. వైఎస్ అమలుచేసిన పథకాలను జిల్లానుంచే ప్రారంభించేవారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మహబూబ్నగర్ మునిసిపల్ చైర్పర్సన్ రాధాఅమర్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఆశయ సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. కొత్తకోటలోని కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో వర్ధంతి జరిపారు. డీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పి.విశ్వేశ్వర్ మాట్లాడుతూ.. పేదప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణయుగంగా సాగిందని ఎమ్మెల్యే సంపత్కుమార్ కీర్తించారు. అలంపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. మహానేత హయాం లోనే చెప్పుకోదగిన అభివృద్ధి పనులు జరిగాయని కొనియాడారు. గద్వాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి 5వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. స్థానిక డీకే బంగ్లా నుంచి వైఎస్ఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ బండల పద్మావతి, మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. -
రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరమా?
రాష్ట్రాల ఏర్పాటు-సరిహద్దుల మార్పు, పునర్వ్యవస్థీకరణ భారత్లో సమాఖ్య వ్యవస్థ ఉంది. కేంద్ర రాష్ట్రాలు రాజ్యాంగంలో పేర్కొన్న అధికార విభజన సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. సమాఖ్య ఏ విధంగా ఏర్పడింది? రాష్ట్రాల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణ మొదలైన అంశాలను ఒకటో భాగంలో ప్రకరణ 1 నుంచి 4 వరకు ప్రస్తావించారు. భారత భూభాగం: ప్రకరణ ఒకటి ప్రకారం భారత భూభాగం అంటే రాష్ట్రాల సరిహద్దులు, కేంద్రపాలిత ప్రాంతాలు. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం సముపార్జ్జించుకున్న ఇతర భూభాగాలు కూడా ఉంటాయి. భారత యూనియన్: ఇందులో రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. సమాఖ్యలో అంతర్భాగంగా ఉండే రాష్ట్రాలకు నిర్ణీత అధికారాలు ఉన్నాయి.భారత భూభాగం అనే భావన విస్తృతమైంది. అది భారత సార్వభౌమాధికారం ఏవిధంగా విస్తరించి ఉంటుందో తెలియజేస్తుంది. ఇది భౌగోళిక ప్రాంతాలకే పరిమితం కాదు. భారత సముద్ర జలాలు (Territorial Waters, 12 నాటికల్ మైళ్ల వరకు), విశిష్ట ఆర్థిక మండళ్లు (Exclusive Economic Zones, 200 నాటికల్ మైళ్ల వరకు), భారత అంతరిక్ష సరిహద్దుకు కూడా సార్వభౌమాధికారం వర్తిస్తుంది. రాష్ట్రాల సమ్మేళనం: భారత రాజ్యాంగంలో ఒకటో ప్రకరణలో భారతదేశాన్ని ‘రాష్ట్రాల యూనియన్’(యూనియన్ ఆఫ్ స్టేట్స్) గా పేర్కొన్నారు. సమాఖ్య (ఫెడరేషన్) గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కెనడా సమాఖ్యను స్ఫూర్తిగా తీసుకుని ‘యూనియన్’ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు. భారత సమాఖ్య అమెరికాలా రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడలేదు. అదేవిధంగా కెనడాలా ఏకకేంద్ర రాజ్యాన్ని సమాఖ్యగా విడగొట్టలేదు. ఇది ఒక ప్రత్యేక పద్ధతిలో ఏర్పడింది. కేంద్ర రాష్ట్రాల మధ్య ఒప్పందం లేదు కాబట్టి రాష్ట్రాలు యూనియన్ నుంచి విడిపోలేదు. అమెరికా సమాఖ్యలో ప్రారంభంలో రాష్ట్రాలకు కేంద్రం నుంచి విడిపోయే హక్కు ఉండేది. ఈ హక్కును ఆ తర్వాత రద్దు చేశారు. అందువల్ల భారత సమాఖ్యను విచ్ఛిన్నం అయ్యే రాష్ట్రాలు, అవిచ్ఛిన్న యూనియన్గా పేర్కొంటారు (Indestructible Union of Destructible States) ప్రకరణ 2 దీని ప్రకారం పార్లమెంట్ ఒక చట్టంద్వారా కొత్త ప్రాంతాలను చేర్చుకోవచ్చు. ఇతర దేశాలకు బదిలీ చేయవచ్చు. ఈ అధికారం భారత భూభాగంలో లేని అంశాలకు వర్తిస్తుంది. ఇది పార్లమెంటుకు సంబంధించిందే అయినా అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి ఉంటుంది. విదేశీ భూభాగాలను భారతదేశంలో చేర్చుకున్నప్పుడు పార్లమెంటు ప్రత్యేక మెజార్టీతో రాజ్యాం గ సవరణ చేయాల్సి ఉంటుంది. ఉదా: 1961లో 12వ రాజ్యాంగ సవరణ ద్వారా గోవాను, 1962 లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా పాండిచ్చేరిని భారత్లో కలిపారు. అదేవిధంగా 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను భారత రాష్ర్టంగా చేర్చుకున్నారు. ప్రకరణ 3 దీనిలో కింది అంశాలు ఉన్నాయి. ఎ) కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలను కలిపి కొత్త రాష్ర్టంగా ఏర్పాటు చేయవచ్చు. ఉదా: 1956లో ఆంధ్రరాష్ర్టం, హైదరాబాద్లను కలిపి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ర్టంలోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త రాష్ర్టంగా ఏర్పాటు చేయవచ్చు. బి) రాష్ర్ట విస్తీర్ణాన్ని పెంచవచ్చు సి) రాష్ర్ట విస్తీర్ణాన్ని తగ్గించవచ్చు డి) రాష్ర్ట సరిహద్దులను సవరించవచ్చు ఇ) రాష్ట్రాల పేర్లను మార్చవచ్చు రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ ప్రకరణ 3లో పేర్కొన్న అన్ని అంశాలకు ఒకే ప్రక్రియ ఉంటుంది. పై అంశాలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాష్ర్ట పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఆర్థిక వనరుల పంపకాలు ఉంటే అది స్పెషల్ కేటగిరి బిల్లు అవుతుంది. అలాంటి సందర్భాల్లో బిల్లును లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు విషయంలో ఈ విధానాన్ని అనుసరించారు. బిల్లులను రాష్ర్టపతి అనుమతితోనే ప్రవేశపెట్టాలి. ఈ నిబంధనను 1955లో ఐదో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడానికి ముందే రాష్ర్టపతి సంబంధిత రాష్ట్రాల శాసనసభల అభిప్రాయాన్ని కోరుతారు. శాసన సభలు నిర్ణీత సమయంలోగా అభిప్రాయాన్ని తెలపాలి. ఈ అభిప్రాయాలను పార్లమెంటు పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. పార్లమెంటు ఉభయసభలు బిల్లును సాధారణ మెజారిటీతో విడివిడిగా ఆమోదించాలి. ఉభయసభల మధ్య ప్రతిష్ఠంభన ఏర్పడితే సంయుక్త సమావేశానికి ఆస్కారం ఉండదు. బిల్లు వీగిపోతుంది. పార్లమెంటు అంగీకారం పొందిన బిల్లును రాష్ర్టపతి తప్పనిసరిగా ఆమోదించాలి. రాష్ర్టపతి ఆమోదం తెలిపిన తర్వాత బిల్లు చట్టంగా మారుతుంది. దాంతో ప్రక్రియ పూర్తవుతుంది. కొత్త రాష్ర్టం అమల్లోకి వచ్చే తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీన్నే ‘అపాయింటెడ్ డేట్’ అంటారు. ప్రకరణ 4 ఈ ప్రకరణ తర్వాత పరిణామాల గురించి వివరిస్తుంది. ప్రకరణ 2, 3 ప్రకారం ఏదైనా సవరణ చేసినప్పుడు 1, 4 షెడ్యూళ్లలో పేర్కొన్న అంశాలను కూడా మార్చాలి. ఇందుకోసం పార్లమెంటు ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం లేదు. ప్రకరణ 2, 3 ప్రకారం ఏ సవరణ చేసినా ఆటోమేటిక్గా 1, 4 షెడ్యూళ్లలోని అంశాలు కూడా మార్పునకు గురవుతాయి. ప్రకరణ 2, 3 ప్రకారం ఎలాంటి మార్పు చేసినా దాన్ని రాజ్యాంగ సవరణగా పరిగణించరు. ఈ అంశాన్ని ప్రకరణ 4(2)లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే రాష్ట్రాల ఏర్పాటుకు, పునర్వ్యవస్థీకరణకు, ఇతర అంశాలకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి కాదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వివాదాలు-సుప్రీంకోర్టు తీర్పులు బెరుబారి యూనియన్ వివాదం (1960): బెరుబారి అనేది పశ్చిమ బెంగాల్ రాష్ర్టంలోని ఒక ప్రాంతం. దీని విస్తీర్ణం 9 చదరపు మైళ్లు. ప్రకరణ 3 ప్రకారం పార్లమెంటుకు రాష్ట్రాల సరిహద్దును కుదించే అధికారం ఉంది. అయితే, ‘ఒక రాష్ర్ట వివాదాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసే అధికారం ఉందా?’అనే సంశయం తలెత్తిన సందర్భంగా రాష్ర్టపతి సుప్రీంకోర్టు సలహా కోరారు. సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ రాష్ర్ట భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేయాలంటే పార్లమెంటు ప్రకరణ 368 ప్రకారం ప్రత్యేక మెజార్టీతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అంతర్గతంగా బదిలీ చేసేందుకు సాధారణ మెజార్టీ సరిపోతుంది. బాబూలాల్ మారండి వర్సెస్ బాంబే స్టేట్ (1960): రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును ఒక్కసారి మాత్రమే సంబంధిత రాష్ర్ట శాసనసభల అభిప్రాయానికి నివేదిస్తారు. ఒకవేళ ఆ బిల్లులో తర్వాత ఏవైనా మార్పులు చేస్తే, దాన్ని మరోసారి రాష్ర్ట పరిశీలనకు పంపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.దీనికి తాజా ఉదాహరణ తెలంగాణ రాష్ర్టంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్కు బదలాయించడం. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ యూనియన్(1982): భారత రాజ్యాంగం నిర్ణీతమైన సమాఖ్య వ్యవస్థను ఏర్పర్చలేదు. నిర్మాణపరంగా సమాఖ్య అయినప్పటికీ, ఇది సమాఖ్య, ఏక కేంద్ర ప్రభుత్వాల మిశ్రమంగా సుప్రీంకోర్టు పేర్కొంది. ముల్లా పెరియార్ పర్యావరణ వివాదం (2006): నదీ జలాల పంపిణీపై చట్టాలు చేసే అధికారం రాష్ర్ట శాసనసభకు లేదని, ఇది పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మాదిరి ప్రశ్నలు 1. గవర్నర్ను కేంద్ర ప్రభుత్వం నియమి స్తుంది. ఈ విధానాన్ని ఏమంటారు? 1) నిఖరమైన సమాఖ్య 2) పరిపూర్ణ ప్రజాస్వామ్యం 3) రిపబ్లికనిజం 4) విశిష్ట సమాఖ్య విధానం 2. కొత్త రాష్ట్రాల ఏర్పాటును తెలిపే రాజ్యాంగ అధికరణ? 1) 2 2) 3 3) 1 4) 4 3. భారత ప్రభుత్వం కొత్త రాష్ట్రాలను దేని ద్వారా ఏర్పాటు చేయవచ్చు? 1) భారత రాష్ర్టపతి 2) పార్లమెంటు శాసనం 3) రాజ్యాంగ సవరణ ద్వారా 4) అంతర్రాష్ర్ట మండలి 4. కింది రాష్ట్రాలు ఏర్పడిన వరుస క్రమాన్ని గుర్తించండి. ఎ. ఆంధ్రప్రదేశ్ బి. నాగాలాండ్ సి. మహారాష్ర్ట డి. హర్యానా 1) ఎ, సి, బి, డి 2) ఎ, సి, డి, బి 3) సి, ఎ, బి, డి 4) సి, ఎ, డి, బి 5. రాష్ట్రాల ఏర్పాటులో ప్రాతిపదిక కానిది? 1) భాష 2) భౌగోళిక అంశాలు 3) ప్రాంతీయ అసమానతలు 4) పైవేవీ కావు 6. రాష్ట్రంగా మారిన కేంద్రపాలిత ప్రాంతం? 1) అరుణాచల్ప్రదేశ్ 2) గోవా 3) హిమాచల్ ప్రదేశ్ 4) పైవన్నీ 7. నవంబరు 1న అవతరణ దినోత్సవాన్ని జరుపుకునే రాష్ర్టం? 1) కర్ణాటక 2) కేరళ 3) ఛత్తీస్గఢ్ 4) పైవన్నీ 8. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి. 1) తెలంగాణ మొదటి ఉప ముఖ్యమంత్రులు - మహ్మద్ అలీ, డాక్టర్ టి. రాజయ్య 2) నూతన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్య మంత్రులు - కె. క్రిష్ణమూర్తి, ఎన్. చినరాజప్ప 3) తెలంగాణ రాష్ర్ట విధానసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి 4) పైవన్నీ 9. కిందివాటిలో తెలంగాణాకు సంబంధించి సరైన అంశం ఏది? 1) జనాభాలో 12వ స్థానం 2) విస్తీర్ణంలో 12వ స్థానం 3) లోక్సభ స్థానాల్లో 13వ స్థానం 4) పైవన్నీ 10. నూతన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. 1) జనాభాలో 10వ స్థానం 2) విస్తీర్ణంలో 8వ స్థానం 3) లోక్సభ స్థానాల్లో 9వ స్థానం 4) పైవన్నీ సమాధానాలు 1) 4; 2) 2; 3) 2; 4) 1; 5) 4; 6) 4; 7) 4; 8) 4; 9) 4; 10) 4. కాంపిటీటివ్ కౌన్సెలింగ్ పోటీపరీక్షల్లో జనరల్ స్టడీస్ విభాగంలో ‘శక్తి వనరులు’ పాఠ్యాంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు? ఈ టాపిక్ ప్రిపరేషన్కు సంబంధించి కొన్ని సూచనలివ్వండి. - ఆర్.అనురాధ, ఏఎస్రావు నగర్. దేశాభివృద్ధికి ‘శక్తి’ వెన్నెముక లాంటిది. శక్తి వనరులు ఎన్ని రకాలుగా ఉంటాయి? వాటి వర్గీకరణ లాంటి అంశాలను అధ్యయనం చేయడం అన్ని పోటీ పరీక్షలకు అవసరమే. ఆబ్జెక్టివ్ తరహా పరీక్షల్లో దేశంలో శక్తి వనరుల లభ్యత, స్థూల, స్థాపిత సామర్థ్యం విలువలు, శక్తి మంత్రిత్వశాఖ, దాని పరిధిలోని సంస్థలు/కేంద్రాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. శక్తి వనరులు రెండు రకాలు. అవి: సంప్రదాయ, సంప్రదాయేతరమైనవి. బొగ్గు, సహజవాయువు, చమురు, జల విద్యుత్, అణువిద్యుత్ సంప్రదాయ శక్తి వనరులు. దేశంలో వీటి లభ్యత, ఉత్పాదన గురించి తెలుసుకోవాలి. అదనంగా కోల్ బెడ్, మీథేన్, షెల్ గ్యాస్ల గురించి చదవాలి. సంప్రదాయేతర శక్తి వనరులు పునర్వినియోగ, నవీన వనరులు అని రెండు రకాలుగా ఉంటాయి. జీవశక్తి, సౌరశక్తి, పవన శక్తి, చిన్న తరహా జలవిద్యుత్ లాంటివి పునర్వినియోగ శక్తి వనరులు. హైడ్రోజన్ శక్తి, జియోథర్మల్, సముద్ర తరంగ శక్తి, బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు లాంటివి నవీన శక్తి వనరులు. ఏ శక్తి వనరుల లభ్యత ఏవిధంగా ఉంది? ప్రస్తుతం వాటి ఉత్పాదన, ఏ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏయే రకాల శక్తి వనరుల నిర్వహణ ఉంది? లాంటి అంశాలకు సంబంధించి పూర్తి అవగాహన ఉండాలి. శక్తి రంగంలో పరిశోధన కేంద్రాల గురించి కూడా తెలుసుకోవాలి. ఇండియా ఇయర్ బుక్, ఎకనామిక్ సర్వే లాంటి పుస్తకాల్లో వీటికి సంబంధించిన వర్తమాన అంశాలు, సమగ్ర సమాచారం లభిస్తుంది. - సి. హరికృష్ణ, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ. -
650 పోస్టల్ బ్యాలెట్లు గల్లంతు
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్లైన్: సంగారెడ్డి నియోజకవర్గంలోని 650 మంది ఉద్యోగుల ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు తిరిగి తమకు ఓటు వేసే అవకాశాన్ని కల్పిం చాలని కోరుతూ తహశీల్దారు కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న తమకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఆవకాశం ఇవ్వాలని కోరు తూ గత నెల 25న తహశీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నామన్నారు. కాగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లు అందకపోవడంతో ఉద్యోగులు 4 రోజులుగా కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవ రూ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ సమయంలో అసిస్టెంట్ ఎన్నికల అధికారి, తహశీల్దారు కృష్ణారెడ్డి అందుబాటులో లేకపోవ డంతో సంబంధిత ఎన్నికల విభాగం ఇన్చార్జి విజయ్కుమార్ ఉద్యోగులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జాబితాలో తమ పేరు లేకపోయినా దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయో తెలపాలన్నారు. దీంతో సంబంధిత సెక్షన్ అధికారి అందుబాటులో లేరని తెలపడంతో ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదుచేశారు. రికార్డు మాయం చేశారు: చంద్రశేఖర్(టీచర్) పోస్టల్ బ్యాలె ట్ కోసం గత నెల 25న తహశీల్దారు కార్యాలయంలో ఫారం-12 ఫాంతో పాటు ఎన్నికల గుర్తింపు కార్డు, ఎన్నికల విధుల నియామకం ఉత్తర్వుల కాపీని జతచేసి దరఖాస్తు చేసుకున్నామని టీచర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. దర ఖాస్తు చేసుకునే సమయంలో తాను సిబ్బంది ఇచ్చిన రికార్డులో పూర్తి సమాచారంతో నమోదు చేశానని, ఆ రికార్డు ఈ రోజు లేకపోవడమే కాకుండా కొత్త రికార్డులను ఏర్పాటు చేశారని ఆరోపించారు. తమ దరఖాస్తు ఫారాలు సైతం డిలెట్ జాబితాలో, గాని పోస్టల్ బ్యాలె ట్ జాబితాలో గాని తమ పేరు లేదని ఫారాలు సైతం మాయమయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల అధికారి వివరణ ఈ విషయంపై నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్వీఎంపీఓ యాస్మిన్పాషా వివరణ కోరగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాయమైన విషయం తమకు తెలియదని, దీనిపై తహశీల్దారును విచారణ జరపాలని ఆదేశించినట్లు తెలిపారు. ఉద్యోగులకు ఓటు హక్కు వినియోగించుకోనే ఆవకాశం కల్పించాలని కలెక్టర్ దృష్టికి తీసుకె ళ్లనున్నట్లు తెలిపారు. -
రైతులకోసమే నేనున్నా
ఆశీర్వదించి గెలిపించండి : ఎడ్మ మాడ్గుల, న్యూస్లైన్: రైతులకు ఏ కష్టమొచ్చినా ముందుండి అండగా ఉంటానని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డిఅన్నారు. మాడ్గుల మండలంలోని నాగిళ్ల, కాట్రాంతండా, కొర్రతండా, గుడితండా, అన్నెబోయిన్పల్లి, అప్పారెడ్డిపల్లి, దోడ్లపహాడ్ గ్రామాల్లో శనివారం ఎడ్మ ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. స్థానికులు ఆయనను బ్యాండుమేళాలతో ఘనస్వాగతం పలికారు. తనను రెండు సార్లు మ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నీతి నిజాయితీతో పని చేశానని, రైతుల కరెంట్ కష్టాలు చూసి అత్యధికంగా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయించి లోవోల్టేజీ సమస్యలను పూర్తిగా తగ్గించి రైతులకు తోడ్పాటు అందించానన్నారు. జిల్లాలో 152 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారంలో ఉన్న వారు ఏ ఒక్కరిని ఆదుకోలేదన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న ప్రతీ కుటుంబానికి తాము ఆర్థిక సహాయం అందించామని ఎడ్మ గుర్తు చేశారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో పేదల పొట్ట కొట్టారని, వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చాక ప్రతీపేదవాడి కన్నీళ్ళను తుడిచేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.బాబు వ్యవసాయం దండగ అంటే దాన్ని పండగలా మార్చిన ఘనత వైఎస్దేనన్నారు. హైద్రాబాద్లో ఉండి రూ.కోట్లు సంపాదించి స్థానిక సమస్యలపై ఎలాంటి అవగాహన లేని నేతలు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారన్నారు. నీ తి నిజాయితీతో ఎళ్లవేళలా తాను అండగా ఉంటాననీ...ఫ్యాను గుర్తుకు ఓటేసి తనను మరోసారి ఆశీర్వదించాలని కిష్టారెడ్డి వి/్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ వెంకటయ్యగౌ డ్, నాయకులు సత్తయ్యగౌడ్, రంజిత్రెడ్డి, కరుణాకర్రెడ్డి, వెంకట్నారాయణగౌడ్, ఆరోగ్యరెడ్డి, విక్రం, యాదగిరిగౌడ్, మర్రెడ్డి,తదితరులు పాల్గొన్నారు. భారీగా చేరికలు.. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలుగ్రామాల యువకులు, వివిధ వర్గాల వారు శనివారం ఎడ్మ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరి ఆయన తరఫున సుశిక్షుతులైన సైనికుల్లా పనిచేస్తామని ప్రతిన చేశారు. వారికి సాదరంగా పార్టీలోకి కిష్టారెడ్డి ఆహ్వానించారు. తన గెలుపునకు వారు గట్టి కృషిచేయాలని కోరారు. మహానేత వైఎస్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. -
బీసీలను అణగదొక్కే కుట్ర
గ్రూపులతో సిట్టింగులకు ఎసరు డీసీసీ నేతల తీరుపై నందీశ్వర్ ఫైర్ సామాజిక తెలంగాణే కావాలి సోనియా దయవల్లే ప్రత్యేక రాష్ట్రం సంగారెడ్డిలో అభినందన సభ సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్లైన్: గ్రూపు రాజకీయాలతో సిట్టింగు ఎమ్మెల్యేలకు ఎసరు పెట్టే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు కృతజ్ఞతగా మంగళవారం సంగారెడ్డిలో ని జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూ పాల్రెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, ముత్యంరెడ్డి, నందీశ్వర్గౌడ్, పార్టీ జిల్లా ఇన్చార్జ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందీశ్వర్గౌడ్ మాట్లాడుతూ.. విమర్శించటాని కి ఇది సమయం కాదంటూనే.. ఘాటైన విమర్శలు చేశారు. జిల్లా జనాభాలో 80 శాతం ఉన్న బీసీలకు కనీసం నాలుగు స్థానాలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఒకే ఒక సీటు ఇచ్చారని, ఇప్పుడు ఆ ఒక్క సీటును కూడా లాగేసుకునేందుకు కుట్ర లు చేస్తున్నారని ఆరోపించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పోటీగా ఇతర నాయకులు వచ్చి టికెట్ మాకే వస్తుందంటూ అస త్య ప్రచారం చేసి కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారని, ఇది ఎంతమాత్రం మంచిది కాద న్నారు. 60 ఏళ్ల తెలంగాణ చరిత్రలో కేవలం ఏడాదిన్నర మాత్రమే దళిత, వెనుకబడిన కులాలకు చెందిన వ్యక్తులు పరిపాలన చేశారని తెలిపారు. ఇప్పటికైనా దొరల తెలంగాణ కాకుండా సామాజిక తెలంగాణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు బీసీ కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పా టు కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఘనతే అని అన్నారు. కల సాకారం చేసినందు కు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చంద్రబాబు వైఖరి వల్లే యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ సహకరించినందుకు జిల్లా కమిటీ తరపున ఆ పార్టీ అగ్రనేతలకు కృతజ్ఞత లు తెలిపారు. ఎమ్మెల్యే కిష్టారెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధీ ఆశీస్సులతో 60 ఏళ్ల కల సాకారమైందన్నారు. ఎమ్మెల్యే ముత్యంరెడ్డి మాట్లాడుతూ తాము మొ దటి నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందన్న విషయాన్ని ప్రజలకు వివరిస్తూ వచ్చామన్నారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకులు సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు డోకూరి రామ్మోహన్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పీసీసీ ప్రధాన కార్యదర్శి సాజిద్ పాషా, డీసీసీబీ చైర్మన్ భూపాల్రెడ్డి, డీసీఎం ఎస్ చైర్మన్ సిద్దన్నపాటిల్, జడ్పీ మాజీ చైర్మన్ బాలయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆదర్శ్రెడ్డి పాల్గొన్నారు. -
శ్రమకు తగిన ‘ఫలితం’
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష ఫలితాలు శనివారం వెల్లడయ్యాయి. పరీక్ష నిర్వహించిన నెల రోజుల్లోపే ఫలితాలు వెల్లడి కావడం.. వెనువెంటనే ఉద్యోగంలో చేరే అవకాశం రావడంతో విజేతలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. అయితే ర్యాంకుల వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడి కాకపోవడం అభ్యర్థులను కాస్త నిరాశకు గురిచేసింది. జిల్లాలో 105 వీఆర్వో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా పరీక్షలో 66,788 మంది పోటీ పడ్డారు. వీరిలో వైట్నర్ ఉపయోగించడం.. దిద్దడం.. ఓఎంఆర్ షీట్ సరిగా భర్తీ చేయకపోవడం తదితర కారణాలతో 4,697 జవాబు పత్రాలను తిరస్కరించారు. జిల్లా స్థాయిలో మొదటి, మూడవ ర్యాంకులు కల్లూరువాసులకే దక్కడం విశేషం. కల్లూరుకు చెందిన కృష్ణారెడ్డి(హాల్ టిక్కెట్ నెం.113100257) 98 మార్కులతో మొదటి ర్యాంకును.. పత్తికొండకు చెందిన ఎర్రం విజయకుమార్(హాల్ టిక్కెట్ నెం.113126999) 97 మార్కులతో రెండో ర్యాంకు.. కల్లూరుకు చెందిన కట్టా దస్తగిరి(హాల్ టిక్కెట్ నెం.1131223175) 96 మార్కులతో మూడో ర్యాంకు కైవసం చేసుకున్నారు. హైదరాబాద్లో సీసీఎల్ఏ ఫలితాలను విడుదల చేయగా.. రాత్రి 7 గంటల ప్రాంతంలో మెరిట్ లిస్టు సీడీ జిల్లాకు చేరింది. ఆ వెంటనే రిజర్వేషన్ ప్రకారం మెరిట్ జాబితా తయారీకి కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది శ్రీకారం చుట్టారు. ఆదివారం మధ్యాహ్నం లోపు రోస్టర్ పాయింట్ ప్రకారం సెలెక్షన్ జాబితాను సిద్ధం చేయనున్నారు. సోమవారం అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి 26న ఎంపిక ఉత్తర్వులు అందివ్వనున్నారు. వీఆర్ఏ పరీక్షకు 5,546 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 4,958 మంది హాజరయ్యారు. 399 మందికి చెందిన జవాబు పత్రాలను వివిధ కారణాలతో తిరస్కరించారు. రెవెన్యూ డివిజన్ వారీగా వీఆర్ఏల ఫలితాల సీడీలను ఆర్డీఓలకు పంపారు. వీఆర్వో పోస్టులను జిల్లా యూనిట్గా.. వీఆర్ఏ పోస్టులను మండలం యూనిట్గా భర్తీ చేస్తున్నారు. వీఆర్ఏ రాత పరీక్షలో వెల్దుర్తి మండలం లక్ష్మీనగర్కు చెందిన బసిరెడ్డి గారి సత్యశీలారెడ్డి(హాల్ టిక్కెట్ నెం.0313100016) 95 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచినట్లు సమాచారం. వీఆర్ఏ పోస్టులకు సంబంధించి మండలం యూనిట్గా ర్యాంకులు ప్రకటించినట్లు తెలుస్తోంది. వీఆర్ఓలకు జిల్లాస్థాయిలో కలెక్టర్.. వీఆర్ఏలకు ఆర్డీఓలు పోస్టింగ్లు ఇవ్వనున్నారు. -
కనికరం లేని కొడుకులు
తల్లికి పిల్ల భారమా.. చెట్టుకు కాయ భారమా..? అంటే భారం కానేకాదు అనేది ప్రకృతి ధర్మం. కానీ పిల్లకు మాత్రం తల్లి భారమే! అనే సమాధనం వస్తోంది నేడు. నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిపై కొడుకుల కనికరం కరువైంది. వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచేసుకుని పెంచిన తల్లిని మాత్రం తరమేశారు తనయులు. దీంతో ఆ తల్లి అధికారులను ఆశ్రయించి న్యాయం కోసం వేడుకుంది. దేవరకద్ర, న్యూస్లైన్: వృద్ధాప్యంలో తల్లిని చేర దీ యాల్సిన కొడుకులు ఛీదరించుకున్నారు. ఇంటి నుంచి గెంటి వేయడంతో తనకు న్యాయం చేయాలని ఆ తల్లి అధికారులను ఆశ్రయించింది. మండలంలోని కౌకుంట్లకు చెందిన కృష్టారెడ్డి మృతి చెందగా ఆయనకు వారసత్వంగా ఉన్న పొలంతోపాటు కొంత కొనుగోలు చేసిన పొలం కలుపుకుని 9 ఎకరాలను ముగ్గురు కొడులు పురేందర్రెడ్డి, దామోదర్రెడ్డి, రా జేశ్వరెడ్డిలు పంచుకున్నారు. అయితే తల్లి బడుగుల పద్మమ్మ(65) గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కొంత కాలం గ్రా మంలో ఉండే చిన్న కొడుకు ఆశ్రయం కల్పించిన తరువాత తల్లిని ఇంటి నుంచి గెంటి వేశాడు. అక్కడ ఇక్కడ బంధువుల ఇళ్లలో, కూతుళ్ల వద్ద కొంత కాలం గడుపు తూ వచ్చింది. చివరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో నారాయణపేట ఆర్డీఓను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని వే డుకుంది. వెంటనే విచారణ చేసి పద్మమ్మ కు న్యాయం కల్పించాలని దేవరకద్ర తహశీల్దార్కు ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు. మానవ హక్కుల సభ్యురాలు శాంత స్పం దించి వృద్ధురాలికి ఆశ్రయం కల్పించాలని గురువారం తహశీల్దార్ అంజిరెడ్డికి ఫిర్యా దు చేశారు. ఈ విషయమై ఆమె కొడుకుల ను పిలిచి విచారణ చేసి చర్యలు తీసుకుం టామని తహశీల్దార్ హామీ ఇచ్చారు. -
దురాశే ముంచింది
సాక్షి, ఒంగోలు : దురాశే నెల్లూరు డీఎంహెచ్ఓ కొంపముంచింది. తక్కు వ డబ్బుతో బంగారం బిస్కెట్లు పొందేందుకు డాక్టర్ సుధాకర్ నెల్లూరులోని మాగుంట లేఅవుట్కు చెందిన కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ మధ్యవర్తిత్వంతో రూ.25 లక్షలను హైవే కిల్లర్ మున్నాకు పెట్టుబడిగా పెట్టినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. అయితే రూ.25 లక్షలు తీసుకున్న మున్నా బెంగళూరులో బంగారం బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి అనంతరం చేతులెత్తేసినట్లు తెలిసింది. పోలీసు విచారణలో మున్నా వెల్లడించిన అనేక ఆసక్తికర విషయాల్లో ఇదొకటిగా తెలిసింది. సాధారణంగా ఒక జిల్లా స్థాయి ప్రభుత్వాధికారిని ఎలాంటి ఆధారాలు లేనిదే పోలీసులు అదుపులోకి తీసుకోరు. ఒకవేళ అదుపులోకి తీసుకోవాలంటే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంది. తాజాగా ఒంగోలులో నేర పరిశోధనలో దిట్ట అని పేరున్న ఒక పోలీసు అధికారి, సింగరాయకొండకు చెందిన మరో అధికారుల బృందం నెల్లూరు డీఎంహెచ్ఓ సుధాకర్ను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఆ బృందం లోతుగా దర్యాప్తు చేస్తూ ఇతర వ్యవహారాలు, సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. దానిలో భాగంగానే సుధాకర్ను వెంట పెట్టుకుని ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది. మున్నా కేసులో ‘మరో సంచలనం’ నరహంతకుడు, సెలైంట్ కిల్లర్ మహమ్మద్ అబ్దుల్సమద్ అలియాస్ మున్నాభాయ్ కేసులో అనేక సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. చిన్నచిన్న నేరాలతో ప్రారంభమైన అతని నేరప్రస్థానం లక్షలు, కోట్ల రూపాయలతో ముడిపడి సాగినట్లు తెలుస్తోంది. తాజాగా ఒంగోలు పోలీసులు అతన్ని విచారించగా నెల్లూరు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ రూ.25 లక్షలను అతనికి పెట్టుబడి పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఒక కిడ్నాప్ కేసుకు సంబంధించి కర్నూలు పోలీసులకు మున్నాభాయ్ పట్టుబడిన విషయం విదితమే. అక్కడ రిమాండ్లో ఉన్న అతన్ని 2008లో జరిగిన ఒక లారీడ్రైవర్, క్లీనర్ హత్య కేసులో పీటీ వారెంట్పై మద్దిపాడు పోలీసులు అరెస్ట్ చేసి ఒంగోలులోని జిల్లా జైలుకు తీసుకువచ్చారు. ఒంగోలు ఒన్టౌన్, టూటౌన్, తాలూకా పోలీస్స్టేషన్, మద్దిపాడు, సింగరాయకొండ పోలీస్స్టేషన్లలో అతనిపై పది కేసుల వరకు పెండింగ్లో ఉన్నాయి. -
మహోన్నతం
కడప అర్బన్, న్యూస్లైన్: దానాల్లోకెల్లా శరీరదానం కూడా మహోన్నతమైనదని ఆదివారం జరిగిన ఓ సంఘటన నిరూపించింది. స్థానిక బసిరెడ్డి కృష్ణారెడ్డి (92) మృతదేహాన్ని ఆయన తనయుడు ఆదివారం రిమ్స్కు అప్పగించారు. విశాఖపట్టణానికి చెందిన సావిత్రిభాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పారు. మహానేత వైఎస్ జిల్లా ప్రజలకు అందించిన రిమ్స్లో వైద్య విద్యార్థుల పరిశోధనార్థం తమ శరీరాలను దానంగా ఇవ్వాలని కొం దరు సంకల్పించారు. ఇందులోభాగంగా రాయచోటి పరిధిలోని మడితాడు చెరువుకిందపల్లెకు చెందిన బసిరెడ్డి కృష్ణారెడ్డి కుమారుడు బసిరెడ్డిగారి రామ్మోహన్రెడ్డి, కోడలు తులసి ఆంధ్రప్రదేశ్ బాడీ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గతంలో రిమ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమ మరణానంతరం రిమ్స్కు తమ శరీరాన్ని దానంగా ఇస్తామని ఒప్పుకున్నారు. కృష్ణారెడ్డి (92) కడపలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న జయపద్మ అపార్టుమెంటులో తన కుమారుడు, కోడలు వద్ద ఉంటూ ఆదివారం సహజ మరణం చెందారు. తాము మాట ఇచ్చిన ప్రకారం బసిరెడ్డి కృష్ణారెడ్డి మృతదేహాన్ని వారు రిమ్స్ అధికారులకు అప్పగించి తమ మహోన్నత గుణాన్ని చాటుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన స్నేహ ఫౌండేషన్ వారు కృష్ణారెడ్డికి సంబంధించిన రెండుకళ్లను రిమ్స్ అధికారుల సిఫార్సు మేరకు తీసుకెళ్లారు. -
ప్రజలకు అందుబాటులో ఉండాలి
కల్వకుర్తి రూరల్, న్యూస్లైన్: ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి సూచించారు. గత నెల 25న ప్రమాదవశాత్తు కల్వకుర్తి కూరగాయల మార్కెట్లో దుకాణాలు కాలిపోవడంతో బాధితులకు పార్టీ తరఫున రూ.1.7 లక్షలు ఇస్తామని అప్పట్లో ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం 34 మంది బాధితులకు రూ.ఐదు వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సాయాన్ని రాష్ట్ర పార్టీ అందించిందన్నారు. పేదవాడికి సాయం అం దించడానికి కులం మతం లేదన్నారు. భవిష్యత్తులో ఈ మార్కెట్లో ప్రమాదాలు జరగకుండా శాశ్వతమైన నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడ్డారని విమర్శించారు. దివంగత రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్క కల్వకుర్తి నియోజకవర్గానికే 384 మందికి రూ.1.42 కోట్లు అందజేశారన్నారు. ఈ ప్రాంతానికి ఎన్నో పథకాలు అందించడంతోపాటు విద్యుత్ సమస్య తీర్చడానికి ఎన్నో సబ్స్టేషన్లు మంజూరు చేశారన్నారు. పేదవారితో పాటు బాధితులను ఆదుకోవడానికి ఆయన ముందుండే వారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాధవయ్య, కూరగాయల మార్కెట్ కమిటీ అధ్యక్షు డు పాషా, పార్టీ నాయకులు రవిప్రకాష్, రాంరెడ్డి, ఎడ్మసత్యం, జూపల్లి వెంకటయ్య, శేఖర్, జంగయ్యగౌడ్, విష్ణువర్ధన్రెడ్డి, సుధాకర్రెడ్డి, మసూద్, సూరి, ఆనంద్గౌడ్, నరేష్, తహసీల్దార్ శ్యాం సుందర్ తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణం..కమనీయం
మల్దకల్, న్యూస్లైన్: మల్దకల్ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం ఆదిశిలా క్షేత్రంలో నేత్ర పర్వంగా కొనసాగింది. మార్గశిర పర్యదినాన్ని పురస్కరించుకుని స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివార్ల కల్యాణోత్సవానికి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ తరుఫున మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆదివారం రాత్రి 12.00గంటలకు లక్ష్మీవేంకటేశ్వరస్వామిల కల్యాణాన్ని ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతి శ్రీ 1008 విద్యాధీశ తీర్థ శ్రీపాదుల స్వామిజీ వేద మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా నిర్వహించారు. వివిధ మండలాలు, గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గజ వాహనంపై ఊరేగిన స్వామి వారు స్థానిక స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని గజ వాహనంపై కూర్చోబెట్టి దశమికట్ట వరకు భాజాభ్రజంతీల నడుమ ఊరేగించారు. అనంతరం ఆలయ ఆవరణలో జ్యోషి అగమయ్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమన్ని తిలకించేందుకు మహిళలు, భక్తులు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కార్యనిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దైవచింతనతోనే పరిపూర్ణమైన ఆరోగ్యం: దైవ చింతనతో ప్రజలు పరిపూర్ణమైన ఆరోగ్య జీవితం గడపవచ్చునని ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతి విద్యాధీశతీర్థ శ్రీపాదులు తెలిపారు. వెంకటేశ్వరస్వామి పల్లకి సేవకు ఆయన హాజరయ్యారు. ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ గురురాజులు, మండల నాయకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఆవరణలో భక్తులనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు రోజూ కొన్ని నియమ నిబంధనలు పాటిస్తుంటే పరిపూర్ణమైన ఆరోగ్య జీవితం గడపవచ్చన్నారు. సత్యం, ధర్మంతో కూడిన పనులు చేయాలన్నాయి. పోయిన డబ్బు, భూమి సంపాదించుకోవచ్చని, గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి పొందలేమని చెప్పారు. కార్యక్రమంలో గద్వాల మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రంసింహారెడ్డి, సింగిల్విండో చైర్మన్ మాణిక్యరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రంగస్వామినాయుడు, నాయకులు సీతారాంరెడ్డి, పటేల్ ప్రభాకర్ తదిరతులు పాల్గొన్నారు. -
మిస్ సింహపురిగా కల్యాణి
నెల్లూరు(బృందావనం), న్యూస్లైన్: ‘మిర్రర్స్ మిస్ సింహపురి-2013’ కిరీటాన్ని నెల్లూరు నగరానికి చెందిన కల్యాణి దక్కించుకొంది. స్థానిక పురమందిరంలో ఆదివారం మిర్రర్స్ బ్యూటీపార్లర్ ఆధ్వర్యంలో జరిగిన సంప్రదాయ అందాల యువరాణి పోటీల్లో యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలి మూడుస్థానాల్లో కె.కల్యాణి(మూలాపేట), పి.అనిషారెడ్డి (బాలాజీనగర్), ఎం.లక్ష్మీప్రీతి (రంగనాయకులపేట) నిలిచారు. ముఖ్య అతిథిగా హాజరైన హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహానగరాలకే పరిమితమైన ఇలాంటి పోటీలను నెల్లూరులో తొలిసారిగా నిర్వహించడం అభినందనీయమన్నారు. మిర్ర ర్స్ బ్యూటీపార్లర్ అధినేత నాగిశెట్టి లాలిత్యసుమన్ మాట్లాడుతూ భారతీయ సంప్రదాయ విలువలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఈ పోటీలు దోహదపడుతాయన్నారు. మిస్బ్యూటిఫుల్, మిస్ట్రెడిషనల్, మిస్స్మైల్, మిస్హెయిర్, మిస్పర్సనాలిటీ, మిస్ఎక్స్ప్రెషన్స్, మిస్ఫొటోజెనిక్, మిస్ స్కిన్, మిస్కాస్మొటిక్స్ తదితర 25 విభాగాల్లో పోటీలను నిర్వహించామన్నారు. తొలిమూడు స్థానాలు సాధించిన వారికి ప్రోత్సాహక నగదు బహుమతితోపాటు, కిరీటాలు, ముత్యాలహారాలు,జ్ఞాపికలను జోయాలుక్కాస్, కాస్మోటిక్స్ప్లస్ , మిర్రర్స్బ్యూటీపార్లర్ సహకారంతో అందచేస్తున్నామన్నారు. పోటీల న్యాయనిర్ణేతలుగా చీతిరాల పద్మావతి, సుప్రజ, దుర్గాదేవి, అన్నపూర్ణమ్మ, లావణ్య వ్యవహరించారు. విజేతలకు అమరావతికృష్ణారెడ్డి, దేవరాల సుబ్రహ్మణ్యంయాదవ్, ఎస్వీఆర్స్కూల్ అధినేత అందె శ్రీనివాసులు, పెనుశిల డ్రైవింగ్స్కూల్ అధినేత శ్రీనివాసులురెడ్డి, టీవీ సుబ్బారావు, కోసూరురత్నం తదితరులు బహుమతులు అందజేశారు. కార్యక్రమ నిర్వాహకులుగా గాలికిరణ్కుమార్, వై.సుమన్ వ్యవహరించారు. -
ప్రజావాణికి వెల్లువలా దరఖాస్తులు
కలెక్టరేట్, న్యూస్లైన్ : క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో బాధితులు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వెల్లువలా తరలివస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో 500 మందికిపైగా అర్జీలు సమర్పించగా మండల, డివిజన్ కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమాలు జనం లేక బోసిపోయాయి. గ్రామ, వార్డు సందర్శనల పేరిట అధికారులు గ్రామాలకు వస్తున్నా సమస్యలు పరిష్కరించడం లేదని, అందుకే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని బాధితులు వాపోతున్నారు. వ్యక్తిగత సమస్యల కోసం కలెక్టరేట్లో ప్రజావాణికి రావొద్దని అధికారులు సూచించినా... క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేవారు లేకపోవడంతో వారు పట్టించుకోవడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి వస్తున్నామని అర్జీదారులు పేర్కొంటున్నారు. సోమవారం కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జేసీ అరుణ్కుమార్ కొద్ది సేపు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం వివిధ పనుల నిమిత్తం వెళ్లిపోవడంతో డీఆర్వో కృష్ణారెడ్డి అర్జీలు స్వీకరించారు. డీవైసీకి 9 ఫిర్యాదులు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి తొమ్మిది మంది ఫోన్ ద్వారా సమస్యలు తెలపగా... చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కమాన్పూర్ మండలం గుండారం నుంచి లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామంలో ఏడాది క్రితం అంగన్వాడీ కేంద్రం ప్రారంభించినా టీచర్ను నియమించలేదని తెలపగా జేసీ అరుణ్కుమార్ స్పందిస్తూ నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. రామడుగు మండలం కొక్కెరకుంట నుంచి లక్ష్మి మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకున్నప్పటికీ బిల్లులు చెల్లించలేదని తెలపగా జేసీ స్పందిస్తూ సంబంధిత అధికారుల ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. డీఆర్వో కృష్ణారెడ్డి, డీఆర్డీఏ పీడీ శంకరయ్య, జెడ్పీ సీఈవో చక్రధర్రావు తదితరులు పాల్గొన్నారు.