
ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావ, కుమారి 21 ఎఫ్ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ తరువాత ఆ ఫాం కంటిన్యూ చేయలేకపోయాడు. ఇటీవల ఈ యంగ్ హీరో చేసిన సినిమాలన్ని బోల్తా పడటంతో కెరీర్ కష్టాల్లో పడింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్ తరువాత మరో సినిమాతో రెడీ అవుతున్నాడు.
రాజ్ తరుణ్ చివరి చిత్రం లవర్ సినిమాను నిర్మించిన దిల్ రాజు ఈ యంగ్ హీరో మరో ఛాన్స్ ఇస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా ఆడు మగాడ్రా బుజ్జి సినిమాను తెరకెక్కించిన కృష్ణ రెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు నీది నాది ఒకటే లోకం అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. మరి ఈ సినిమాతో అయిన రాజ్ తరుణ్కు సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment