విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సహా పలు డిమాండ్లతో మరాఠా ప్రజలు చేపట్టిన భారీ ర్యాలీతో దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం బుధవారం కాషాయ సంద్రమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 3 లక్షల మంది మరాఠా ప్రజలు కాషాయ టోపీలు పెట్టుకుని, అదేరంగు జెండాలు పట్టుకుని ముంబైలో ‘మరాఠా క్రాంతి మోర్చా’ పేరుతో మౌన ప్రదర్శన నిర్వహించారు