ఉడీ దాడిపై రంగంలోకి ఎన్‌ఐఏ | Uri attack as it happened: Army foils infiltration bids; PM Modi calls for Cabinet meeting on Wednesday | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 21 2016 7:56 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఉడీ ఉగ్రదాడిపై పూర్తిస్థాయి విచారణ కోసం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మంగళవారం రంగంలోకి దిగింది.జమ్మూ కశ్మీర్ పోలీసుల నుంచి కేసు విచారణ బాధ్యతను స్వీకరించింది. ఈ పాశవిక దాడిపై పోలీసులు ఆదివారమే కేసు నమోదు చేసి సంఘటనా స్థలంలో ఆధారాల్ని సేకరించారు. ఆయుధాలు, మందుగుండుతో పాటు రెండు మొబైల్ సెట్లు, రెండు జీపీఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్) పరికరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఉడీ చేరుకున్న ఎన్‌ఐఏ బృందం నలుగురు ఉగ్రవాదుల డీఎన్‌ఏ నమూనాల్ని సేకరించడంతో పాటు, వారి ఫొటోల్ని కూడా తీయనుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement