National Investigation Agency (NIA)
-
రామేశ్వరం బ్లాస్ట్ కేసు: నిందితుడు షాజిబ్ అరెస్ట్!
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి నిందితుడు, ఉగ్రవాది షాజిబ్ హుస్సన్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. వివరాల ప్రకారం.. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనలో నిందితుడు షాజిబ్ను ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. బాంబు పేలుడు అనంతరం పరారీలో ఉన్న షాజిబ్ను ఎట్టకేలకు ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. ఇక, పేలుళ్ల తర్వాత అతను అస్సాం, పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు చెప్పాయి. #RameshwaramCafe accused arrested from #WestBengal pic.twitter.com/hmtccWxVXT — JOKER (@TheJokerBhai) April 12, 2024 ఇదిలా ఉండగా.. మార్చి ఒకటో తేదీన బెంగళూర్లోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడుతో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో నిందితుడిని పట్టుకునేందుకు ఎస్ఐఏ రంగంలోకి దిగింది. -
బెంగళూర్ కేఫ్ పేలుడుతో జగిత్యాలకు లింక్?
సాక్షి, బెంగళూరు: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుతో.. తెలంగాణ జిల్లా జగిత్యాలకు సంబంధం ఉందా?.. తాజా అరెస్టుతో ఆ దిశగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ NIA మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. అయితే అతని స్వస్థలం జగిత్యాల కావడం.. పైగా అతనొక మోస్ట్ వాంటెడ్ కావడంతోకీ అంశం తెర మీదకు వచ్చింది.. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో.. నిషేధిత పీఎఫ్ఐ కీలక సభ్యుడు సలీం హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్న అతన్ని ఎన్ఐఏ వైఎస్సార్ జిల్లా(ఏపీ) మైదుకూరు మండలం చెర్లోపల్లి ప్రాంతంలో అరెస్ట్ చేసింది. బెంగళూరు పేలుడు కేసులో.. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. సలీం స్వస్థలం జగిత్యాల కేంద్రంలోని ఇస్లాంపురా. చాలాకాలంగా పరారీలో ఉన్న అతన్ని.. NIA సెర్చ్ టీం మైదుకూరులో అదుపులోకి తీసుకుంది. రామేశ్వరం కెఫ్ బాంబు పేలుడులో.. ఇతని హస్తమున్నట్టు ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అలాగే సలీంతో పాటు ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎండీ అబ్దుల్ అహ్మద్, నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ ఇలాయస్ అహ్మద్ పేర్లు కూడా ఉన్నాయి. వీళ్లిద్దరి కోసం ఇప్పుడు ఎన్ఐఏ టీంలు గాలింపు చేపట్టాయి. ఇదిలా ఉంటే.. గతంలో ఉగ్రమూలాలకు కేరాఫ్గా జగిత్యాల పేరు పలుమార్లు వినిపించింది. ఇప్పుడు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్ల కేసు లింకుతో మరోసారి జగిత్యాల్లో ఉగ్రమూలాలపై చర్చ నడుస్తోంది. గతంలో జగిత్యాలతో పాటు కరీంనగర, నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు, పలువురి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
బెంగళూరు పేలుడు కేసు.. NIA కీలక ప్రకటన
ఢిల్లీ: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) శనివారం కీలక ప్రకటన చేసింది. అనుమానితుడి కొత్త ఫొటోలను విడుదల చేసి.. ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందజేయాలని ప్రజలను కోరింది. ఇందుకుగానూ రూ.10 లక్షల రివార్డు కూడా ఉంటుందని ఫోన్ నెంబర్లు, మెయిల్ అడ్రస్ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మార్చి 1వ తేదీ మధ్యాహ్నాం రామేశ్వరం కేఫ్లో పేలుడు జరిగింది. బస్సులో వచ్చిన ఓ వ్యక్తి తన బ్యాగ్ను కేఫ్లో వదిలివెళ్లడం.. కాసేపటికే అది పేలడం సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. ఈ పేలుడు ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. అయితే.. ఫుటేజీల ఆధారంగా అనుమానితుడి కదలికలను దర్యాప్తు బృందం పరిశీలించింది. అయితే.. ఆ రోజు రాత్రి సమయంలో బళ్లారి బస్టాండ్లో అనుమానితుడు సంచరించినట్లుగా పేర్కొంటూ ఓ ఫుటేజీని నిన్న జాతీయ దర్యాప్తు సంస్థ విడుదల చేసింది. ఘటన తర్వాత.. తుమకూరు, బళ్లారి, బీదర్, భట్కల్.. ఇలా బస్సులు ప్రాంతాలు మారుతూ.. మధ్యలో దుస్తులు మార్చుకుంటూ.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. చివరకు అతను పుణే వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. వీలైనంత త్వరలో అతన్ని పట్టుకుని తీరతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అనుమానితుడికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా సరే తమకు తెలియజేయాలని ఎన్ఐఏ ప్రజల్ని కోరుతోంది. పేలుడు జరిగిన రెండ్రోజులకు.. అంటే మార్చి 3వ తేదీన రామేశ్వరం బ్లాస్ట్ కేసులోకి యాంటీ-టెర్రర్ ఏజెన్సీ NIA దిగింది. ఈ కేసును బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్తో కలిసి సంయుక్తంగా దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ. రెండేళ్ల కిందటి బళ్లారి బాంబు పేలుడుతో పోలికలు ఉండేసరికి.. ఆ పేలుడుకు కారణమైన నిందితుడ్ని జైల్లోనే అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. ఇక మరోవైపు బెంగళూరులో స్కూళ్లకు బాంబు బెదిరింపులకు సంబంధించిన కేసుల్ని సైతం పరిశీలిస్తోంది. అంతేకాదు.. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలున్న ఓ గ్రూప్ను సైతం ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇక.. ఇప్పుడు రామేశ్వరం కేఫ్లో అనుమానితుడి చిత్రాలు విడుదల చేసి.. ఆచూకీ తెలిపిన వాళ్ల వివరాల్ని గోప్యంగా ఉంచడంతో పాటు పది లక్షల రివార్డు సైతం ప్రకటించింది ఎన్ఐఏ. NIA seeks citizen cooperation in identifying the suspect linked to the #RameswaramCafeBlastCase. 📞 Call 08029510900, 8904241100 or email to info.blr.nia@gov.in with any information. Your identity will remain confidential. #BengaluruCafeBlast pic.twitter.com/ISTXBZrwDK — NIA India (@NIA_India) March 9, 2024 -
తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు..
చెన్నై: తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడువ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా, తమిళనాడులో కారుబాంబు కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. వివరాల ప్రకారం.. తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు శనివారం తెల్లవారుజాము నుంచే కొనసాగుతున్నాయి. చెన్నై, మధురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఎనిమిది మండలాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కాగా, కోయంబత్తూరులో 2021 నాటి కారుబాంబు కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. #JustIn | NIA Raids Across Tamil Nadu's Tiruchirappalli — NDTV (@ndtv) February 10, 2024 ఇక, ముఖ్యంగా కోయంబత్తూరులోనే నిషేధిత సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో 12 చోట్ల ఎన్ఐఏ అధికారులు దాడులు, తనిఖీలు చేపట్టారు. 2021లో కోయంబత్తూరులోని ఉక్కడం కొట్టమేడు ప్రాంతంలో కారు బాంబు పేలుడుతో సంబంధాలపై దర్యాప్తు వేగవంతం చేశారు. అరబిక్ కాలేజీలో చదివిన విద్యార్థులకు నిషేధిత ఉద్యమాలతో సంబంధం ఉందా? అనే కోణంలో ఈ విచారణ జరుగుతున్నట్టు సమాచారం. -
ఉగ్ర దాడులకు ప్లాన్.. బెంగళూరులో ఎన్ఐఏ సోదాలు
బెంగళూరు: కర్ణాటకలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరులో దాదాపు ఆరు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. కాగా, ఉగ్రవాద కుట్ర కేసులో భాగంగా ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక, దేశవ్యాప్తంగా రెండు రోజులుగా పలుచోట్ల ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. దేశంలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కుట్రలను భగ్నం చేసే చర్యల్లో భాగంగా ఎన్ఐఏ పలుచోట్ల సోదాలు చేపట్టింది. రెండు రోజులు క్రితం.. మహారాష్ట్ర, కర్ణాటకల్లోని 44 ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఐసిస్ మాడ్యూల్ నాయకుడితో సహా మొత్తం 15 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని పడఘా - బోరివలీ, ఠాణె, పుణె.. అటు కర్ణాటకలోని బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ బృందాలు ఈ దాడులు నిర్వహించినట్లు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. దాడుల్లో భారీ మొత్తంలో లెక్కలోకి రాని నగదుతోపాటు తుపాకులు, ఇతర ఆయుధాలు, కొన్ని పత్రాలు, స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే, దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందన్న సమాచారంతోనే జాతీయ దర్యాప్తు సంస్థ ఈ దాడులు చేపడుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. The National Investigation Agency is conducting searches over half a dozen locations in Bengaluru in a terror conspiracy case. pic.twitter.com/az1k80U07m — ANI (@ANI) December 13, 2023 -
ఐసిస్ మాడ్యూల్ నేత సహా 15 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్)పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కొరడా ఝళిపించింది. సంస్థకు చెందినట్లుగా అనుమానిస్తున్న మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పలు ప్రాంతాల్లో శనివారం దాడులు జరిపి 15 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఐసిస్ మాడ్యూల్ సూత్రధారి సాకిబ్ నచాన్ కూడా ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఇతడు కొత్తవారిని తమ గ్రూప్లోకి చేర్చుకుంటూ వారితో విధేయతతో ఉంటామని ప్రమాణం చేయిస్తుంటాడని వెల్లడించారు. మహారాష్ట్రలోని పగ్ధా–బోరివలి, థానె, మిరా రోడ్డు, పుణెలతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఉదయం దాడులు జరిపినట్లు వివరించారు. ఐసిస్ తరఫున ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం, ఉగ్ర సంబంధ చర్యల్లో వీరు పాల్గొంటున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు, తుపాకులు, ఇతర ఆయుధాలు, నిషేధిత సాహిత్యం, సెల్ఫోన్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో తీర్పు వెల్లడి
సాక్షి, ఢిల్లీ: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో గురువారం తీర్పు వెలువడింది. ఈ కేసులో పదకొండు మంది నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ ఎన్ఐఏ(National Investigation Agency) న్యాయస్థానం. ఈ కేసులో కీలక సూత్రధారి ఒబెద్ ఉర్ రెహమాన్తో పాటు 10 మందికి జైలు శిక్ష ఖరారు చేసింది ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం. పాక్ నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చి పేలుళ్లకు ఒబెద్ కుట్ర పన్నాడు. అయితే.. తెలంగాణ పోలీసులు ఆ కుట్రను ముందుగానే భగ్నం చేశారు. ఒబెద్ పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు కోర్టు విచారణలో తేలింది. ఇక ‘ముజాహిద్దీన్ కుట్ర’గా ప్రాచుర్యం పొందిన ఈ కేసులో సయ్యద్ ముక్బుల్ను సెప్టెంబర్ 22వ తేదీన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఐదవ నిందితుడిగా ఉన్నాడు ముక్బుల్. నాందేడ్కు చెందిన ముక్బుల్ను ఉగ్ర కదలికల నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన అరెస్ట్ చేశారు. పాక్ ఉగ్ర సంస్థ ముజాహిద్దీన్లోని కీలక సభ్యులతో ముక్బుల్ దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది కూడా. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. లక్షల్లో నగదు, పలు డాక్యుమెంట్లు సీజ్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేపట్టిన సోదాలు ముగిశాయి. తెలుగు రాస్ట్రాల్లో ఏకకాలంలో 62 ప్రాంతాల్లో ఎన్ఐఏ ఈరోజు(సోమవారం) సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో రూ. 13 లక్షల నగదు, పిస్టల్తో సహా 14 రౌండ్ల బుల్లెట్ల స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ. దాంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసింది. ముంచుంగిపట్టు కేసులో భాగంగా సోదాలు నిర్వహించింది ఎన్ఐఏ. ప్రగతిశీల కార్మిక సమాఖ్య సభ్యుడు చంద్ర నర్సింహులు అరెస్ట్తో ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో సోదాలు జరిపింది ఎన్ఐఏ. సోమవారం ఉదయం 5.30 గంటల నుంచి పౌర హక్కుల నేతలు, న్యాయవాదుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతోంది. మావోయిస్టులకు సహకరించారన్న ఆరోపణలపై హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలో తనిఖీలు చేపట్టింది. పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నేతలే టార్గెట్గా ఈ సోదాలు నిర్వహించారు,. గుంటూరు జిల్లా పొన్నూరు ప్రజావైద్యకళాశాలలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. డాక్టర్ టీ రాజారావు పౌరహక్కుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. నెల్లూరులో ఏపీ సీఎల్సీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, అరుణ ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు. తిరుపతిలోని న్యాయవాది క్రాంతి చైతన్య, గుంటూరులో డాక్టర్ రాజారావు ఇళ్లతో ఎన్ఐఏ సోదాలు జరుపుతోంది. విజయవాడలో విప్లవ రచయితల సంఘం నేత అరసవల్లి కృష్ణ ఇంట్లో సోదాలు చేపట్టింది. రాజమండ్రి బొమ్మెరులో పౌరహక్కుల నేత, అడ్వకేట్ నాజర్, శ్రీకాకుళం కేఎన్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిస్కా కృష్ణయ్య ఇంట్లో తనిఖీలు చేపట్టింది. నెల్లూరు జిల్లాలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉంటున్న ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంట్లో సోదాలు జరుపుతోంది. ఎల్లంకి వెంకటేశ్వర్లు పౌర హక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నారు. అనంతపురం బిందెల కాలనీలో కుల వివక్ష పోరాట సమితి నేత శ్రీరాములు ఇంట్లో తనిఖీలు నిర్వహించింది. సలకంచెరువు పాఠశాలలో శ్రీరాములు హిందీ పండిట్గా పనిచేస్తున్నారు. తీవ్రవాదులతో సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీశారు.. కుల నిర్మూలన పోరాట సమిత నేత దుడ్డు వెంకట్రావు, సంతమాగలూరు సంతమాగులూరులో శ్రీనివాసరావు, విశాఖ ఎంవీపీ కాలనీలో ఎన్ఆర్ఎఫ్ ప్రతిప్రతినిధి, మంగళగిరి మండలం నవులూరులోని మక్కేవారిపేట, గన్నవరంలో అమ్మిసెట్టి రాధా, తాడేపల్లి బత్తుల రమణయ్య ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు సోదాలు జరుపుతోంది. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో కుల నిర్మూలనా పోరాట సమితి నేతగా వ్యవహరిస్తున్న కోనాల లాజర్ ఇంట్లో సోదాలు చేస్తోంది. హైదరాబాద్లోనూ సోదాలు హైదరాబాద్లోనూ సోదాలు నిర్వహించింది ఎన్ఐఏ. విద్యానగర్లోని పౌర హక్కుల సంఘం నేత సురేష్, బంధుమిత్రుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు జరిపింది. -
అరబిక్ క్లాసుల ముసుగులో ఉగ్ర పాఠాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ–తమిళనాడుల్లో ఉన్న కొన్ని కేంద్రాలు అరబిక్ క్లాసుల ముసుగులో ఉగ్రవాద పాఠాలు బోధిస్తూ, యువతను ఐసిస్ వైపు ఆకర్షిస్తున్నాయా? ఔననే అంటున్నాయి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వర్గాలు. ఇలా ప్రేరేపించిన నేపథ్యంలోనే 2022 అక్టోబర్ 23 కోయంబత్తూరులోని సంగమేశ్వర దేవాలయం వద్ద కారు బాంబు పేలుడు జరిగిందని స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చెన్నై ఎన్ఐఏ యూనిట్ శనివారం హైదరాబాద్లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు చేసింది. హైదరాబాద్–తమిళనాడుల్లో మొత్తం 31 చోట్ల తనిఖీలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సోదాల్లో ఉగ్రవాద సంబంధిత పుస్తకాలు, పత్రాలతో పాటు ఫోన్లు, ల్యాప్టాప్స్, హార్డ్ డిస్క్లు వంటి డిజిటల్ పరికరాలు, రూ.60 లక్షల నగదు, 18,200 అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ పుస్తకాలు, పత్రాలు అరబిక్తో పాటు తెలుగు, తమిళం భాషల్లో ఉన్నట్లు అధికారులు వివరించారు. యువతను ఐఎస్ఐఎస్ వైపు ఆకర్షించడానికి కొందరు ఉగ్రవాదులు ప్రాంతాల వారీగా అధ్యయన కేంద్రాలు, అరబిక్ బోధన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వాట్సాప్, టెలిగ్రామ్లో ఏర్పాటు చేసిన గ్రూపుల ద్వారా తమ భావజాలాన్ని ఐసిస్ విస్తరిస్తోందని ఎన్ఐఏ గుర్తించింది. చెన్నైకి చెందిన ఉగ్రవాది ఈ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. కొన్ని రోజులపాటు హైదరాబాద్లోనూ నివసించిన ఇతగాడు అల్ ఫుర్ఖాన్ పేరుతో ఓ పబ్లికేషన్స్ నిర్వహించాడు. ఇందులో తెలుగు, తమిళం, అరబిక్ భాషల్లో ఉగ్రవాద సాహిత్యం, భావజాలాన్ని వ్యాప్తి చేసే మెటీరియల్ ముద్రించాడు. ఐసిస్ మీడియా వింగ్ పేరు కూడా అల్ ఫుర్ఖానే కావడం గమనార్హం. ఇతగాడు ఇటీవలే విదేశాలకు పారిపోయాడని నిఘా వర్గాలు గుర్తించాయి. ఐదుగురి ఇళ్లపై ఏకకాలంలో దాడులు.. ఈ చెన్నై వాసి నగరంలో నివసించిన కాలంలో సైదాబాద్ పరిధిలోని సపోటాబాద్కు చెందిన హసన్, రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్కు చెందిన అమీర్, యూసుఫ్గూడ, బోరబండ ప్రాంతాలకు చెందిన నూరుల్లా, జాహెద్లతో పాటు గోల్కొండ పరిధిలోని షేక్పేటకు చెందిన జబ్బార్తో సన్నిహితంగా మెలిగాడు. వీరితో పాటు మరికొందరు ఉగ్రవాద సానుభూతిపరులతో సోషల్ మీడియా గ్రూపులు నిర్వహించాడు. తాను ముద్రించిన పుస్తకాలను అందించడంతో పాటు వివిధ అంశాలకు సంబంధించిన సాఫ్ట్కాపీలను షేర్ చేశాడు. కోయంబత్తూరు బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడిగా ఉన్న కేరళ వాసి మహ్మద్ అజారుద్దీన్ను ఈనెల 1న ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇతడి నుంచీ ఎన్ఐఏ అధికారులు అల్ ఫుర్ఖాన్ ద్వారా ముద్రితమైన సాహిత్యం, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ పుస్తకాలపై హైదరాబాద్లో ముద్రితమైనట్లు చిరునామా ఉంది. దీంతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి నగరానికి చెందిన ఐదుగురి వ్యవహారం ఎన్ఐఏ దృష్టికి వెళ్ళింది. దీంతో శనివారం నగరానికి చేరుకున్న ఎన్ఐఏ చెన్నై యూనిట్కు చెందిన ప్రత్యేక బృందం ఐదుగురి ఇళ్లపై ఏకకాలంలో దాడి చేసి సోదాలు నిర్వహించింది. అల్ ఫుర్ఖాన్ పబ్లిషర్స్ ద్వారా ముద్రితమైన పుస్తకాలు, ఇతర పత్రాలతో పాటు సెల్ఫోన్లు, హార్డ్డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. హసన్, అమీర్, నూరుల్లా, జాహెద్, జబ్బార్లకు సీఆర్పీసీ 41–ఏ కింద నోటీసులు జారీ చేశారు. -
భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన NIA
సాక్షి, హైదరాబాద్/చెన్నై: జాతీయ దర్యాప్తు సంస్థ NAI ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసింది. దక్షిణాదిలోని 31 చోట్ల సోదాలు నిర్వహించి.. పలువురిని అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో భారీ ఉగ్రనెట్వర్క్ బయటపడింది. కోయంబత్తూరులో 22 ప్రాంతాల్లో, హైదరాబాద్లో ఐదు ప్రాంతాల్లో, మిగతా చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అరబిక్ భాషలో ఉన్న కొన్ని పేపర్లు, వీటితో పాటు రూ. 60 లక్షలు, 18,200 US డాలర్స్ స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ. అరబిక్ క్లాసుల పేరుతో యువతను ఆకర్షిస్తున్నారు ఉగ్రవాదులు. రీజనల్ స్టడీ సెంటర్ల పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ల ద్వారా ప్రత్యేక శిక్షణ తరగతులు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిలాఫత్ ఐడియాలజీని వ్యాప్తి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఒక గ్రూపుగా ఏర్పడి స్థానిక యువతను రిక్రూట్ చేసుకుంటున్నారు ఉగ్రవాదులు. కిందటి ఏడాది అక్టోబర్ 23 న కోయంబత్తూర్ లో కారు పేలుడు చర్యకు పాల్పడింది ఈ తరహా శిక్షణ పొందిన ఉగ్రవాదులేనని ఎన్ఐఏ గుర్తించింది. -
పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు.. ఇద్దరు అరెస్ట్?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి పాతబస్తీ సహా నాలుగుచోట్ల ఎన్ఐఏ సోదాలు చేపట్టారు అధికారులు. ఐఎస్ఐ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అటు తమిళనాడులో కూడా ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. వివరాల ప్రకారం.. హైదరాబాద్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే, నగరంలో వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్ఐఎస్ఐ మాడ్యుల్లో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఐసిస్ సానుభూతి పరుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తమిళనాడు సహా హైదరాబాద్లోని పాతబస్తీ, మలక్పేట, టోలీచౌకీ సహా మరికొన్ని ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చెన్నైలో పది ప్రాంతాల్లో, కోయంబత్తూరులో 20 చోట్ల సోదాలు జరుపుతున్నారు. ఇక, హైదరాబాద్లో నాలుగు చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగిస్తోంది. 2022లో కోయంబత్తూర్ కార్ బ్లాస్ట్కు సంబంధించి ఎన్ఐఏ దాడులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ సోదాల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. #WATCH | NIA conducts raids at 30 locations in both Tamil Nadu and Telangana in ISIS Radicalization and Recruitment case. The raids are underway in 21 locations in Coimbatore, 3 locations in Chennai, 5 locations in Hyderabad/Cyberabad, and 1 location in Tenkasi. (Visuals from… pic.twitter.com/KcCiO7SZ6u — ANI (@ANI) September 16, 2023 ఇది కూడా చదవండి: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసులో నటుడు నవదీప్ పేరు -
షరియత్ స్థాపనే హెచ్యూటీ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని పడగొట్టి షరియత్ స్థాపనే లక్ష్యంగా హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (హెచ్యూటీ) సంస్థ పనిచేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్ధారించింది. ఈ సంస్థకు చెందిన 16 మంది ఉగ్రవాదులను మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు గత నెల్లో హైదరాబాద్, భోపాల్లో అరెస్టు చేసిన విషయం విదితమే. ఎన్ఐఏ ఈ కేసును గత నెల 24న రీ–రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టింది. ఇస్లామిక్ రాజ్యస్థాపనకు వ్యతిరేకంగా, అడ్డంకిగా ఉన్న ఓ వర్గానికి చెందిన నాయకులను టార్గెట్గా చేసుకోవడంతోపాటు ప్రార్థన స్థలాలు, రద్దీ ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద దేశంలో దీనిపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాంతాల వారీగా తన్జీమ్లు ఏర్పాటు దేశంలో ఉన్న ప్రభుత్వం ఓ వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని, వారి హక్కుల కోసం పోరాడే సంస్థలపై నిషేధం విధిస్తూ, కార్యకర్తలను జైళ్లకు పంపుతోందని తమ కేడర్కు నూరిపోస్తోంది. దీనికి సంబంధించి ఆడియోలు, వీడియోలను రూపొందించి రాకెట్ చాట్, త్రీమా యాప్స్ ద్వారా ప్రచారం చేసింది. ఈ ఉగ్ర సంస్థ మధ్యప్రదేశ్, హైదరాబాద్ల్లో విస్తరించి ఉన్నట్లు దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ ఉగ్రవాదులు ప్రాంతాల వారీగా తన్జీమ్గా పిలిచే మాడ్యుల్స్ ఏర్పాటు చేసుకున్నట్లు ఎన్ఐఏ తేల్చింది. మధ్యప్రదేశ్ తన్జీమ్కు యాసిర్ ఖాన్, తెలంగాణ తన్జీమ్కు మహ్మద్ సలీం నేతృత్వం వహించారు. వీళ్లు మరింత మందిని తన సంస్థలో చేర్చుకుని వివిధ ప్రాంతాలకు విస్తరించడానికి కుట్ర పన్నారు. ఈ ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటిలో ఆడియో, వీడియోలతోపాటు ఐఎస్ఐఎస్ రూపొందించే ఆన్లైన్ పత్రిక వాయిస్ ఆఫ్ హింద్ ప్రతులు, ఖలాఫతుల్లా అల్ మహదీపై ఉన్న పత్రాలు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్, ఏకే 47, 303 రైఫిల్తోపాటు వివిధ పేలుడు పదార్థాల ఫొటోలు, వాటి డాక్యుమెంట్లను రిట్రీవ్ చేశారు. హైదరాబాద్లోనే కీలక నిర్ణయాలు మధ్యప్రదేశ్, తెలంగాణ తన్జీమ్లకు చెందిన 17 మంది ఉగ్రవాదులు గతేడాది హైదరాబాద్లో సమావేశమయ్యారు. గోల్కొండ ప్రాంతంలోని సలీం ఇంట్లో జరిగిన ఈ మీటింగ్లోనే భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించి, అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని అధికారులు తేల్చారు. సలీం సహా హైదరాబాద్ తన్జీమ్కు చెందిన ఆరుగురూ ఆపరేషన్స్ చేయడానికి సిద్ధమవుతూ శిక్షణ కూడా తీసుకున్నారు. హైదరాబాద్ తన్జీమ్కు సంబంధించి జవహర్నగర్కు చెందిన మహ్మద్ సల్మాన్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. ఇతడిని పట్టుకునేందుకు ఎన్ఐఏ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపింది. -
ఆరోగ్యం ముసుగులో ఉగ్రవాదం.. పీఎఫ్ఐ చార్జిషీటులో విస్మయకర అంశాలు
సాక్షి, కరీంనగర్: రాడ్డు.. కర్ర..కత్తి ఏ ఆయుధాన్ని ఎలా వాడాలి..? ఎలా దాడి చేయాలి? మనిషి శరీరంలో ఎక్కడెక్కడ సున్నిత ప్రాంతాలు ఉంటాయి..? ఎక్కడ కొడితే ప్రాణాలు పోతాయి..? ఇవీ.. ఆరోగ్య పరిరక్షణ ముసుగులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) రహస్యంగా నిర్వహించిన కార్యకలాపాలు. శారీరక, మానసిక ఆరోగ్యం ముసుగులో పీఎఫ్ఐ చేసిన సంఘ వ్యతిరేక చర్యలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. యోగా.. కరాటే పేరుతో ఆయుధాల వినియోగం, మనుషులను సులువుగా చంపడం ఎలా..? తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారని తేలింది. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో అనేక కీలక విషయాలు వెలుగుచూశాయి. ఇవే విషయాలను ఎన్ఐఏ ఇటీవల దాఖలు చేసిన చార్జిషీటులోనూ పేర్కొంది. శారీరక ఆరోగ్యానికి, ఆత్మరక్షణ పేరిట నడిపిన కరాటే శిబిరాలు, యోగా పేరిట నడిపిన ధ్యానకేంద్రాలన్నీ ఉగ్ర కార్యకలాపాలకు నిలయంగా మారాయని చార్జిషీటులో పేర్కొంది. ఎలా బయటపడిందంటే..? పీఎఫ్ఐ కీలక సభ్యుడు, నిజామాబాద్కు చెందిన (స్వస్థలం జగిత్యాల) అబ్దుల్ఖాదర్ను పోలీసులు నిజామాబాద్లో అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఇతను నిజామాబాద్లో దాదాపు 200 మంది ముస్లిం యువకులకు శిక్షణ ఇచ్చినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. గతేడాది జూలై 4న పోలీసులు అబ్దుల్ ఖాదర్, అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో సాదుల్లా, ఇమ్రాన్, మొబిన్ను మరుసటి రోజు అరెస్టు చేశారు. వీరి నెట్వర్క్ను ఏపీలోని కడప, కర్నూలు నుంచి పీఎఫ్ఐ సభ్యులు ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో నిజామాబాద్ 4వ టౌన్లో పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో నిందితుడు అబ్దుల్ఖాదర్ విదేశాలకు వెళ్లి రావడం, పలు దేశాల నుంచి పీఎఫ్ఐకి నిధులు తెచ్చినట్టు కూడా పోలీసులకు సమాచారం ఉంది. దీంతో ఎన్ఐఏ రంగంలోకి దిగి సెక్షన్ 120 (బి), 153(ఎ), ఐపీసీ సెక్షన్లు 17, 18, 18(ఎ), 18(బి) యూఏ(పి) యాక్ట్ కింద ఆగస్టు 26న తిరిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో అబ్దుల్ ఖాదర్ (ఆటోనగర్, నిజామాబాద్), అబ్దుల్ అహ్మద్ (ముజాహెద్నగర్, నిజామాబాద్), షేక్ ఇలియాస్ అహ్మద్ (ఖాజానగర్, నెల్లూరు), అబ్దుల్ సలీమ్ (ఇస్లాంపూర్, జగిత్యాల), షేక్ షాదుల్లా (గుండారం, నిజామాబాద్), ఫిరోజ్ ఖాన్ (శాంతినగర్, ఆదిలాబాద్), మహమ్మద్ ఉస్మాన్ (తారకరామనగర్, జగిత్యాల), సయ్యద్ యాహియా సమీర్ (ఆటోనగర్, నిజామాబాద్), షేక్ ఇమ్రాన్ (ముజాహెద్నగర్, నిజామాబాద్), మొహమ్మద్ అబ్దుల్ ముబీన్ (హబీబ్నగర్, నిజామాబాద్), మొహమ్మద్ ఇర్ఫాన్ (హుస్సేన్పురా, కరీంనగర్)పై చార్జీషీటు దాఖలు చేసింది. హింసలో సుశిక్షితులు నిజామాబాద్లో శిక్షణ పొందిన 200 మంది యువతను పథకం ప్రకారం ముందుగా ఆరోగ్యం, ధ్యానం పేరిట యోగా, కరాటే అంటూ పోగుచేశారు. ఆపై వారిలో దేశ వ్యతిరేక భావజాలం నింపుతూ వారి మనసులను కలుషితం చేసేందుకు యత్నించారు. యోగా క్యాంపుల ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టడం, కరాటే పేరిట దాడి చేయడంలో తర్ఫీదు ఇచ్చారని ఎన్ఐఏ చార్జిషీటులో పేర్కొంది. గొంతు, తల, ఉదరం తదితర సున్నిత ప్రాంతాలపై దాడి చేయడం, ఎక్కడ కొడితే మనిషి త్వరగా మరణిస్తాడన్న విషయాలపైనా తరగతులు ఇచ్చినట్లు కూడా ఎన్ఐఏ ఛార్జిషీటులో స్పష్టం చేసింది. కొనసాగుతున్న నిఘా.. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాపై ఎన్ఐఏ నిఘా కొనసాగుతోంది. గతంలో క్రియాశీలకంగా ఉన్న సిమి (స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) నిషేధానికి గురవడంతో పీఎఫ్ఐ ముసుగులో తిరిగి కార్యకలాపాలు మొదలుపెట్టినట్టు గుర్తించింది. అందుకే దేశవ్యాప్తంగా దీని కార్యకలాపాలకు కళ్లెం వేసేందుకు గతేడాది సెప్టెంబర్ 18న పీఎఫ్ఐ స్థావరాలపై దాడులు చేసింది. అందులోభాగంగా జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించింది. పలువురి నుంచి కీలక డాక్యుమెంట్లు, పీఎఫ్ఐ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుంది. సంస్థకు సంబంధించి ఇంకా ఎవరైనా సానుభూతిపరులు, స్లీపర్సెల్స్ ఉన్నారా? అన్న కోణంలో నిరంతర నిఘా కొనసాగుతూనే ఉంది. -
పాపులర్ ఫ్రంట్పై ఎన్ఐఏ గురి
న్యూఢిల్లీ: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తోపాటు దాని అనుబంధ సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు దృష్టి పెట్టారు. చట్టవ్యతిరేక, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సదరు సంస్థలపై ఇప్పటికే కేసు నమోదయ్యింది. కేసు దర్యాప్తులో భాగంగా కేరళలో 12 జిల్లాల్లో పీఎఫ్ఐ, అనుబంధ సంస్థలకు సంబంధించిన 56 ప్రాంతాల్లో గురువారం అధికారులు సోదాలు నిర్వహించారు. పీఎఫ్ఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, జోనల్ హెడ్స్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్–ట్రైనర్స్తోపాటు మారణాయుధాలు ఉపయోగించడంలో శిక్షణ పొందిన మరికొందరి నివాసాల్లో సోదాలు చేసినట్లు ఎన్ఐఏ ప్రతినిధి చెప్పారు. మరో 20 మంది అనుమానితుల ఇళ్లను తనిఖీ చేసినట్ల తెలిపారు. ఆయుధాలు, డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పీఎఫ్ఐ, అనుబంధ సంస్థలపై గతంలోనే కేసు నమోదు చేసింది. -
ఉత్తరాది గ్యాంగ్స్టర్లు దక్షిణాది జైళ్లకు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో గ్యాంగ్స్టర్ల ఆగడాలను చెక్పెట్టేందుకు, వారి విస్తృత నెట్వర్క్ను సమూలంగా నాశనం చేసేందుకు ఎన్ఐఏ కొత్త ఆలోచనను తెరపైకి తెచ్చింది. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్లను దక్షిణాది రాష్ట్రాల జైళ్లకు తరలించాలని భావిస్తోంది. నాలుగు ఉత్తరాది రాష్ట్రాల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాల సరఫరా, సుపారీ హత్యలు, హవాలా దందా, బెదిరింపు వసూళ్లు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాల్లో కొందరు గ్యాంగ్స్టర్లను అరెస్ట్ చేసి సెంట్రల్ జైళ్లలో పడేశారు. వాళ్లు అక్కడి నుంచే నిక్షేపంగా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. తొలి దశలో వారిలో 25 మందిని దక్షిణాది జైళ్లకు బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. మూసావాలా హత్యతో అలర్ట్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. దక్షిణాసియాలోని అతిపెద్ద, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే జైళ్లలో ఒకటైన ఢిల్లీలోని తీహార్ జైలు నుంచే మూసేవాలా హత్య ప్రణాళికను గ్యాంగ్స్టర్లు అమలు చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తిహార్లో జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన నెట్వర్క్ ద్వారా ఈ హత్య చేయించారనే కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. తిహార్లోనే ఉన్న మరో గ్యాంగ్స్టర్ నీరాజ్ బవానా సైతం జైలు నుంచే తన వ్యాపారాన్ని ఇష్టారీతిగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ జైళ్లలో ఉన్న గ్యాంగ్స్టర్లదీ ఇదే పంథా. జైళ్లలో కొత్తగా చిన్న ముఠాలుగా ఏర్పడి తమ ప్రణాళికను అమలుచేస్తున్నారు. ఏప్రిల్లో గ్యాంగ్స్టర్ జితేంద్ర గోగిను చంపేశాడనే కోపంతో మరో గ్యాంగ్స్టర్ శేఖర్ రాణాను గోగి సన్నిహితుడు రోహిత్ మోయి జైలు నుంచే కుట్ర పన్ని హత్య చేయించాడు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఉత్తరాదిన పెరిగాయి. కొన్ని కేసుల్లో గ్యాంగ్స్టర్లకు జైలు సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం మధ్య ఆధిపత్య పోరు పెరిగి గొడవలకు దారితీస్తోంది. వీరికి విదేశాల నుంచి ఆర్ధిక సహకారం అందుతోందనే దారుణ వాస్తవాలు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడయ్యాయి. ఉత్తరాది జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం కూడా ఎన్ఐఏ ప్రతిపాదనకు మరో కారణం. ఢిల్లీలో 14 సెంట్రల్ జైళ్ల సామర్ధ్యం 9,346 కాగా 17,733 మంది ఖైదీలున్నారు. పంజాబ్లో జైళ్లలో 103 శాతం, హరియాణాలో 127 శాతం, రాజస్థాన్లో 107 శాతం ఖైదీలున్నారు. -
మంగళూరు పేలుడు: షరీఖ్ కళ్లు తెరవాలని పోలీసులు..
బెంగళూరు: శనివారం సాయంత్రం మంగళూరు మైసూర్ శివారులో ఓ ఆటోలో ఉన్నట్లుండి పేలుడు సంభవించిన ఘటన.. ప్రమాదం కాదని, ఉగ్రకోణం ఉందని తేలడంతో కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పైగా అంతర్జాతీయ ఉగ్రసంస్థ ప్రమేయం బయటపడడంతో.. విస్తృత దర్యాప్తు ద్వారా తీగ లాగే యత్నంలో ఉంది కర్ణాటక పోలీస్ శాఖ. ఈ క్రమంలో.. పేలుడులో గాయపడ్డ మొహమ్మద్ షరీఖ్ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. కర్ణాటక పోలీసుల కథనం ప్రకారం.. శివమొగ్గ జిల్లా తీర్థాహల్లికి చెందిన షరీఖ్.. ఆటోలో డిటోనేటర్ ఫిక్స్ చేసిన ప్రెషర్కుక్కర్ బాంబుతో ప్రయాణించారు. మంగళూరు శివారులోకి రాగానే అది పేలిపోయింది. దీంతో ఆటో డ్రైవర్తో పాటు షరీఖ్ కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం నగరంలోని ఓ ఆస్పత్రిలో అతనికి చికిత్స అందుతోంది. ఇక ఇది ముమ్మాటికీ ఉగ్ర చర్యగానే ప్రకటించిన కర్ణాటక పోలీసు శాఖ.. కేంద్ర సంస్థలతో కలిసి దర్యాప్తు చేపడుతోంది. నగరంలో విధ్వంసం సృష్టించే ఉద్దేశంతోనే షరీఖ్ యత్నించినట్లు భావిస్తున్నామని అదనపు డీజీపీ అలోక్ తెలిపారు. 24 ఏళ్ల వయసున్న షరీఖ్పై ఓ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ప్రభావం ఉందని శాంతి భద్రతల అదనపు డీజీపీ అలోక్ కుమార్ సోమవారం వెల్లడించారు. అంతేకాదు.. కర్ణాటక బయట అతనికి ఉన్న లింకులను కనిపెట్టేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. బెంగళూరు సుద్ధాగుంటెపాళ్యాకు చెందిన అబ్దుల్ మాటీన్ తాహా.. షరీఖ్కు గతంలో శిక్షకుడిగా వ్యవహరించాడు. అంతేకాదు అతనిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐదు లక్షల రివార్డు ప్రకటించింది అని అడిషినల్ డీజీపీ వెల్లడించారు. అతను(షరీఖ్) ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని, తద్వారా అతన్ని విచారించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన అంటున్నారు. సుమారు 45 శాతం కాలిన గాయాలతో.. మాట్లాడలేని స్థితిలో చికిత్స పొందుతున్నాడు ఆ యువకుడు. ఇక.. మైసూర్లో షరీఖ్ అద్దెకు ఉంటున్న ఇంట్లో అగ్గిపెట్టెలు, పాస్పరస్, సల్ఫర్, గీతలు, నట్లు-బోలట్లు లభించాయి. ఆ ఇంటి ఓనర్ మోహన్ కుమార్కు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు నిర్ధారించారు. ఇక ప్రేమ్ రాజ్ అనే పేరుతో ఫేక్ ఆధార్కార్డు తీసి.. ఆ గుర్తింపుతో దాడులకు యత్నించి ఉంటాడని, ఇంట్లోనే ప్రెషర్ కుక్కర్ బాంబ్ తయారుచేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మంగళూరు, శివమొగ్గ, మైసూర్, తీర్థహల్లితో పాటు మరో మూడు చోట్ల ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. #Mangaluru மங்களூர் ஆட்டோவில் குண்டு வெடிப்பு பயங்கரவாத செயல் என்று டிஜிபி அறிவிப்பு pic.twitter.com/rPDLRHgLMY — E Chidambaram. (@JaiRam92739628) November 20, 2022 మరికొందరికి బ్రెయిన్వాష్..? ఇదిలా ఉంటే 24 ఏళ్ల షరీఖ్.. ఓ బట్టల దుకాణంలో పని చేసేవాడు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు గానూ UAPA కింద అతనిపై కేసు కూడా నమోదు అయ్యింది. మంగళూరులో గతంలో మత సంబంధిత అభ్యంతరకర రాతలు, బొమ్మలు గీసి.. జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చాడు. శివమొగ్గలో పంద్రాగష్టున జరిగిన మత ఘర్షణల్లోనూ ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ సమయంలో ఒకతన్ని కత్తితో పొడిచిన కేసులో సహ నిందితుడిగా ఉండడమే కాదు.. ఆ కేసులో పరారీ నిందితుడిగా ఉన్నాడు షరీఖ్. ఈ కేసులో అరెస్ట్ అయిన యాసిన్, ఆమాజ్లు.. షరీఖ్ తమకు బ్రెయిన్వాష్ చేశాడని వెల్లడించారు. అంతేకాదు.. అతనికి సంబంధాలు ఉన్న ఉగ్ర సంస్థ కోసం ఇక్కడా షరీఖ్ పని చేశాడని వాంగ్మూలం ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ల నుంచి భారత్కు సిద్ధించింది నిజమైన స్వాతంత్రం కాదని..ఇస్లాం రాజ్య స్థాపనతోనే అది పూర్తవుతుందని ఇతరులకు షరీఖ్ బోధించేవాడని పోలీసులు వెల్లడించారు. Karnataka | Mangaluru Police displays the material recovered from the residence of Mangaluru autorickshaw blast accused, Sharik. pic.twitter.com/y3Atxfi96p — ANI (@ANI) November 21, 2022 సిరియాకు చెందిన ఆ మిలిటెంట్ సంస్థ నుంచి ఓ మెసేజింగ్ యాప్ ద్వారా సందేశం అందుకున్న షరీఖ్.. అందులోని పీడీఎఫ్ ఫార్మట్ డాక్యుమెంట్ ద్వారా బాంబు ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాడని కర్ణాటక పోలీసులు ట్రేస్ చేయగలిగారు. అంతేకాదు తుంగ నది తీరాన బాంబు పేలుడు తీవ్రతను తెలుసుకునేందుకు.. ట్రయల్ను సైతం నిర్వహించారని పోలీసులు తెలిపారు. -
‘ఫెడరల్’ పరిరక్షణ ముఖ్యం
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను మరింత పటిష్ఠం చేయబోతున్నామనీ, వచ్చే రెండేళ్లలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాని విభాగాలుంటాయనీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ప్రకటించారు. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), నేరశిక్షా స్మృతి(సీఆర్పీసీ)లకు సవరణలు కూడా చేస్తామన్నారు. హరియాణాలోని సూరజ్కుంద్లో ముఖ్యమంత్రులు, హోంమంత్రులు పాల్గొన్న మేధోమథన సదస్సులో ఆయన ఈ ప్రకటన చేశారు. ఎన్ఐఏ విస్తరణ, నేరాల స్వభావం మారు తున్న తీరు గురించి అమిత్ షా వ్యక్తం చేసిన అభిప్రాయాలతో విభేదించాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదం సైబర్ ప్రపంచంలో కూడా స్వైరవిహారం చేస్తూ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తుండటం రహస్యమేమీ కాదు. కనుక అమిత్ షా అన్నట్టు నేర సామ్రాజ్యాన్ని కూల్చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి బాధ్యతే. అయితే తీసుకురాదల్చిన ఏ మార్పుల విషయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వాసంలోకి తీసుకోవటం, వాటి మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మార్పులు, చేర్పులకు సిద్ధపడటం అవసరమని కేంద్రం గుర్తించాలి. ముంబై మహానగరంపై ఉగ్ర దాడి నేపథ్యంలో 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎన్ఐఏ చట్టాన్ని తెచ్చింది. ఒక రాష్ట్రానికి చెందిన ఉగ్రవాదులు మరో రాష్ట్రంలోకి ప్రవేశించి అలజడులు సృష్టించటం, వేరే దేశాల ఉగ్రవాదులు చొరబడి విధ్వంసక చర్యలకు పాల్పడటం వంటి తీవ్ర నేరాల అణచివేతకు సాధారణ పోలీసు విభాగాలు సరిపోవనీ, సీబీఐపై ఇప్పటికే ఉన్న ఒత్తిళ్ల వల్ల అది కూడా ఈ తరహా నేరాలపై దృష్టి కేంద్రీకరించలేదనీ అప్పటి ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ఎన్ఐఏకు విశేషాధికారాలు ఇవ్వటం కోసం తాను ‘రాజ్యాంగ పరిమితులను అతిక్రమించే ప్రమాదకరమైన విన్యాసం చేయ వలసి వస్తున్నద’ని అప్పటి అమెరికా ఎఫ్బీఐ చీఫ్ రాబర్ట్ మ్యూలర్తో 2009లో నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం వాపోయినట్టు 2011లో బయటపడిన వికీలీక్స్ టేపుల్లో వెల్లడైంది. ఎన్ఐఏ ఏర్పాటు వ్యవహారం ఎంత సున్నితమైనదో ఈ అభిప్రాయమే చెబుతోంది. రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరిస్తున్నదని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీయే పలుమార్లు ధ్వజమెత్తారు. ఆయన నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది మరింత పెరిగిందే తప్ప తగ్గలేదని పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, కేరళ తదితర విపక్ష పాలిత రాష్ట్రాలు ఆరోపించటం రివాజైంది. రాష్ట్రాల ఆదాయవనరులు కుదించటం మొదలుకొని పలు రంగాల్లో కేంద్రం జోక్యం పెరుగుతున్నదనీ, రాష్ట్రాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజారుస్తున్నారనీ ఆ ఆరోపణల సారాంశం. వీటన్నిటికీ పరాకాష్ఠ ఎన్ఐఏపై రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్ దాఖలు చేసిన పిటిషన్. తమ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఈ చట్టం తెచ్చిందన్న సంగతి కూడా మరిచి శాంతిభద్రతల పరిరక్షణ వ్యవహారంలో చట్టం తెచ్చే అధికారం పార్లమెంటుకు ఎక్కడిదని ఛత్తీస్గఢ్ ప్రశ్నించింది. నిజానికి ఎన్ఐఏ చట్టం తెచ్చినప్పుడే ఆ చర్య రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకోవటం అవుతుందన్న సంగతి చిదంబరానికి తెలుసు. మ్యూలర్ దగ్గర చిదంబరం వాపోవటం దీన్ని దృష్టిలో ఉంచుకునే. నేరాల దర్యాప్తులో రాష్ట్రానికుండే అధికారాలను ఎన్ఐఏ చట్టం హరిస్తున్నదని ఛత్తీస్గఢ్ ప్రధాన ఆరోపణ. ఎన్ఐఏకు మరిన్ని అధికారాలు కట్టబెట్టి, దాన్ని మరింత కఠినతరం చేస్తూ 2019లో ఎన్డీఏ ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగా ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏకు కూడా సవరణలు చేసింది. ఛత్తీస్గఢ్ సవాలు చేసింది ఈ సవరణలను కాదు. మొత్తం ఎన్ఐఏ చట్టమే ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తుందని వాదించింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందన్న సంగతలా ఉంచి, ఎన్ఐఏ తీరుతెన్నుల విషయంలో రాజకీయ పక్షాల నుంచి, ప్రజాసంఘాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. సాధారణ పౌరులకు ఫెడరలిజం వంటి అంశాలపై పెద్ద పట్టింపు లేకపోవచ్చు. కానీ రాష్ట్రాలు శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా వ్యవహరించలేవనీ, ఉగ్రవాదంవంటి అంశాల్లో దర్యాప్తు కోసం వాటి అనుమతి తీసుకోవటంలో అపరిమితమైన జాప్యం చోటుచేసు కుంటున్నదనీ నిర్ధారించేందుకు అవసరమైన డేటా కేంద్రం దగ్గర ఉన్నదా? ఇటీవలే జరిగిన కొయం బత్తూరు పేలుడుకు సంబంధించి తమిళనాడు పోలీసులు చురుగ్గా స్పందించి, ఎన్ఐఏ ఆ కేసును తీసుకొనే లోపే ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదాన్ని ఏ రాష్ట్రమూ ఉపేక్షించదని ఈ ఉదంతం చెబుతోంది. స్వేచ్ఛాయుత సమాజాలను భయకంపితం చేయటం, రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నపరచటం ఉగ్రవాదుల ఆంతర్యం. అందుకు దీటుగా పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దటం, పకడ్బందీ దర్యాప్తు జరిపి నేరగాళ్లకు శిక్షపడేలా చూడటం అవసరం. అలాగే న్యాయవ్యవస్థను పటిష్టం చేయటం ముఖ్యం. ఇలాంటి చర్యలు ఉగ్రవాదాన్ని దుంపనాశనం చేయ గలవు తప్ప చట్టాలను మరింత కఠినం చేసు కుంటూ పోవటం పరిష్కారం కాదు. ఎన్ఐఏను పటిష్టపరచటం, బ్రిటిష్ వలసపాలకుల కాలంలో పుట్టుకొచ్చిన ఐపీసీ, సీఆర్పీసీ లను ప్రక్షాళన చేయటం వంటి అంశాల్లో పార్లమెంటులోనే కాదు, వెలుపల కూడా సమగ్ర చర్చ జరిగేలా చూడాలి. రాష్ట్రాల అభీష్టాన్నీ, పౌర సమాజం అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసు కోవాలి. తీసుకొచ్చే ఏ మార్పులైనా ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలగని రీతిలో ఉండాలి. -
హన్మకొండ జిల్లాలో ఎన్ఐఏ సోదాలు కలకలం..
సాక్షి, హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, కో కన్వీనర్ రాధ, సభ్యురాలు అనిత, ఇంట్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్, హన్మకొండలో సోదాలు చేపట్టింది. న్యూ ప్రకాష్రెడ్డి పేటలోని ప్రభుత్వ టీచర్, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనిత ఇంట్లో ఎన్సోఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. స్థానిక పోలీసులు అనిత ఇంటివద్ద మోహరించి అటు వైపు ఎవరూ వెళ్ళకుండా చర్యలు చేపట్టారు. సామాజిక కార్యకర్తగా మహిళా చైతన్య కార్యక్రమాలు అనిత నిర్వహిస్తారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనిత ఇంట్లో మూడుగంటల పాటు సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు మహిళల మ్యానిఫెస్టో, పాటల పుస్తకాలు తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. గతంలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఉండేదని ప్రస్తుతం కమిటీలు లేవని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తమ ఆక్టివిటీస్ కొనసాగుతున్నాయని చెప్పారు. ఆరు నెలలకు ఓసారి సమావేశం నిర్వహిస్తామని మహిళా చైతన్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇటీవల జరిగిన సమావేశంలో రాసుకున్న బుక్ ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్ళారని చెప్పారు. గతంలో కార్యాలయానికి పిలిచి మాట్లాడారని తెలిపారు. మహిళలకు సమాజంలో జరుగుతున్న అన్యాయంపై మాట్లాడొద్దని చెప్పారని తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో వారం రోజులుగా పోలీస్ ప్రత్యేక బలగాలు సరిహద్దులో మోహరించి కూంబింగ్ చేపట్టాయి. ఓ వైపు సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ మరోవైపు మావోయిస్టుల సానుభూతిపరుల గురించి ఎన్ఐఏ ఆరా తీయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అనిత ఇంట్లో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
దావూద్ ఇబ్రహీం ఆచూకీ చెబితే 25లక్షల రివార్డ్
-
దావూద్ ఇబ్రహీంపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా?
ఢిల్లీ: గ్లోబల్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై భారీ రివార్డు ప్రకటించింది భారత ఉగ్రవాద వ్యతిరేక సంస్థ ఎన్ఐఏ. దావూద్ గురించి సమాచారం అందించిన వాళ్లకు పాతిక లక్షల రూపాయలు అందిస్తామని ప్రకటించింది. దావూద్తో పాటు అతని అనుచరుడు చోటా షకీల్ మీద కూడా రూ.20 లక్షలు ప్రకటించింది జాతీయ విచారణ సంస్థ. భారత ఉగ్రవాద వ్యతిరేక విభాగాల్లో టాప్ అయిన ఎన్ఐఏ.. తాజాగా దావూద్కు సంబంధించి ఫొటోను సైతం విడుదల చేసింది. దావూద్, చోటా షకీల్తో పాటు ఉగ్రవాదులైన అనీస్ ఇబ్రహీం, జావెద్ చిక్నా, టైగర్ మెమోన్ల మీద రూ.15 లక్షల బౌంటీ ప్రకటించింది ఎన్ఐఏ. దావూద్తో పాటు ఇతరులంతా కలిసి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్, అల్ కాయిదాలతో కలిసి పని చేస్తున్నారని, బడా వ్యాపారవేత్తలను, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నారని ఎన్ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. వీళ్ల గురించి సమాచారం అందించిన వాళ్లకు రివార్డు అందిస్తామని పేర్కొంది. ► 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం.. పన్నెండు చోట్ల పేలుళ్లతో 257 మంది అమాయకుల మరణానికి, 700 మంది గాయపడడానికి కారణం అయ్యాడు. ► గ్లోబల్ టెర్రరిస్ట్గా ఐరాస భద్రతా మండలి దావూద్ను గుర్తించగా.. అరెస్ట్ను తప్పించుకోవడానికి దావూద్ పాక్లో తలదాచుకున్నాడు. ఈ విషయాన్ని 2018లో భారత్ సైతం ధృవీకరించింది. తాజాగా భద్రతా మండలి రిలీజ్ చేసిన ఉగ్రవాద జాబితాలో దావూద్ ఉండగా.. కరాచీ పేరిట అతని చిరునామా సైతం ఉండడం గమనార్హం. ► అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా తరలించడానికి పాకిస్తాన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థల సహాయంతో ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి డీ-కంపెనీ భారతదేశంలో ఒక యూనిట్ను ఏర్పాటు చేసిందని దర్యాప్తులో తేలింది. ► మే నెలలో ఎన్ఐఏ 29 ప్రాంతాల్లో దాడులు చేసింది. అందులో హాజీ అలీ దర్గా, మహిమ్ దర్గా ట్రస్టీ అయిన సమీర్ హింగోరా(1993 ముంబై పేలుళ్లలో దోషి), సలీం ఖురేషీ(ఛోటా షకీల్ బావమరిది), ఇతరులకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ► 2003లో, దావూద్ ఇబ్రహీంను భారతదేశం, అమెరికాలు గ్లోబల్ టెర్రరిస్ట్గా గుర్తించాయి. అంతేకాదు 1993 ముంబై పేలుళ్ల సూత్రధారిపై 25 మిలియన్ల డాలర్ల రివార్డును సైతం ప్రకటించాయి. ► ముంబై బాంబు పేలుళ్ల కేసు, పలు ఉగ్ర సంబంధిత కార్యకలాపాలతో పాటు దోపిడీలు, హత్యలు, స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా దావూద్పై కేసులు నమోదు అయ్యాయి. ► 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో, దావూద్ తాజ్ మహల్ హోటల్తో సహా నగరంలో పేలుళ్లకు ఉగ్రవాదులను తరలించాడు. ► 2013 ఐపీఎల్ సమయంలో తన సోదరుడు అనీస్ సాయంతో బెట్టింగ్ రాకెట్ను దావూద్ నడిపించాడని కొన్ని జాతీయ మీడియా హౌజ్లు కథనాలు వెలువరించాయి. ► డీ కంపెనీ.. ప్రస్తుతం ఆఫ్రికా దేశాలను పట్టి పీడిస్తోందని, నైజీరియాకు చెందిన బోకో హరామ్ ఉగ్ర సంస్థలో పెట్టుబడులు పెట్టిందని సమాచారం. ఇదీ చదవండి: శాఖ మార్చిన కాసేపటికే మంత్రి రాజీనామా -
హైదరాబాద్ వెళ్లాలంటే ఎన్ఏఐ కోర్టును అడగండి: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: షరతులతో కూడిన మెడికల్ బెయిల్పై విడుదలైన విప్లవ రచయిత వరవరరావు హైదరాబాద్కు వెళ్లాలంటే అనుమతి కోసం జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) కోర్టును అభ్యర్థించాలని సుప్రీంకోర్టు సూచించింది. కంటి చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం కోర్టు విచారించింది. వరవరరావు తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదనలు వినిపించారు. సొంత నివాస స్థలమైన హైదరాబాద్లో చికిత్స చేయించుకుంటే ఆ వాతావరణంలో వరవరరావు త్వరగా కోలుకుంటారని తెలిపారు. దీంతో అనుమతి కోసం ఎన్ఐఏ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని వరవరరావుకు సుప్రీంకోర్టు సూచించింది. ఇదీ చదవండి: Varavara Rao: వరవరరావుకు ఊరట.. శాశ్వత బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు -
ఎన్ఐఏ విస్తృత తనిఖీలు
సాక్షి, అమరావతి/టంగుటూరు/అజిత్సింగ్నగర్ (విజయవాడ సెంట్రల్): జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పర్యవేక్షణలో ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ సిబ్బంది విజయవాడ, ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో పలువురు మావోయిస్టు సానుభూతిపరుల నివాసాల్లో మంగళవారం ఉదయం 6 గంటల నుంచే సోదాలు నిర్వహించడం ప్రారంభించారు. మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్లకు సహకరిస్తున్నారనే అనుమానంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. దాదాపు 10 గంటలకు పైగా సోదాలు నిర్వహించి, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విజయవాడ సింగ్నగర్లోని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర (కేఎన్పీఎస్) అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్, కొత్త రాజరాజేశ్వరిపేటలో పట్టపు జ్యోతి (డప్పు రమేష్ భార్య) నివాసాల్లో ఎన్ఐఏ బృందాలు సోదాలు చేశాయి. ఇక ప్రకాశంజిల్లాలోని ఆలకూరపాడులోని మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష అలియాస్ రమాదేవి వాసంలోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె నివాసంలో లేరు. ఇంటికి తాళం వేసి ఉంది. శిరీష ఇంటి పరిసరాల్లో 200 మీటర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని ప్రజలను, మీడియాను రాకుండా నిలువరించారు. తహసీల్దారు, వీఆర్ఏ సమక్షంలో ఎన్ఐఏ అధికారులు ఆ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థినిని దళాలకు వైద్యం చేసేలా నియమించుకుని, దళం వైపు అకర్షించేలా చేశారని వైద్య విద్యార్థిని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు క్రమంలోనే ఈ తనిఖీలు చేసినట్లు తెలిసింది. కాగా, విజయవాడలో దుడ్డు ప్రభాకర్ నివాసంలో ఎన్ఐఏ అధికారుల తనిఖీలు చేయడానికి వ్యతిరేకంగా విరసం, కేఎన్పీఎస్, ఇఫ్టూ తదితర ప్రజా సంఘాలు నిర్వహించిన ధర్నాలో శిరీష పాల్గొన్నారు. తన భర్త, కుమారుడు చనిపోయాక టైలరింగ్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న తమ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. -
దివంగత నక్సలైట్ ఆర్కే భార్య శిరీష ఇంట్లో సోదాలు
-
టైలర్ కన్హయ్య హత్య కేసు.. సర్కార్ సంచలన నిర్ణయం
రాజస్థాన్ ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంలో దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నూపుర్ శర్మ ఫోటోను స్టేటస్గా పెట్టుకున్న వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య తర్వాత ఉదయపూర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆంక్షలు ఉన్నప్పటికీ హంతకులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ర్యాలీ తీశారు. ఇదిలా ఉండగా.. టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్య నేపథ్యంలో ఉదయపూర్ ఇన్స్పెక్టర్ జనరల్, పోలీస్ సూపరింటెండెంట్తో సహా ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)కి చెందిన 32 మంది అధికారులను బదిలీ చేశారు. కాగా, సున్నితమైన ఈ కేసు దర్యాప్తును దేశంలోని అత్యున్నత ఉగ్రవాద నిరోధక సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి కేంద్ర హోంశాఖ అప్పగించింది. ఈ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా, మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. కన్హయ్య లాల్ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ హత్య కేసుపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఇది తీవ్రమైన నేరమని అన్నారు. హంతకులిద్దరికీ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ హత్య కేసులో ప్రభుత్వం వెంటనే స్పందించి నేరస్థులను పట్టుకోగలిగామని అన్నారు. ఇదే సమయంలో హంతకులకు ఉగ్రవాద సంస్థలతో ఉన్న లింకులను సైతం కనుగొన్నట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ఉదయ్పూర్ కంటే వారం ముందే మరో ఘటన!.. అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరం -
ఉదయ్పూర్ ఘటనలో ఉగ్రకోణం?.. హోం శాఖ కీలక ఆదేశాలు
Udaipur Tailor Murder: రాజస్థాన్ ఉదయ్పూర్ టైలర్ హత్య కేసుపై దేశవ్యాప్తంగా స్పందన పెరిగిపోతుండగా.. మరోవైపు చర్చ కూడా విపరీతంగా నడుస్తోంది. ఈ తరుణంలో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పందించింది. బుధవారం ఉదయం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో ఉగ్రకోణం అనుమానాలు వ్యక్తం అవుతున్నందున.. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) విచారణకు ఆదేశించింది. టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కస్టమర్లలాగా నటిస్తూ కొలతలు ఇస్తుండగానే.. కన్హయ్య గొంతు కోసి హత్య చేస్తూ వీడియో వైరల్ చేయడం, ఆపై ప్రధానికి సైతం హెచ్చరికలు జారీ చేసిన వీడియోలు వైరల్ కావడం తెలిసిందే. ప్రవక్తపై నూపర్ కామెంట్ల వివాదం తర్వాత.. నూపుర్కు మద్ధతుగా కన్హయ్య పోస్టులు పెట్టినందుకే ఈ హత్య జరిగనట్లు నిందితుల వీడియో ద్వారా స్పష్టమైంది. మరోవైపు .. సదరు వీడియోలను తొలగించాలంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంకోవైపు ఉగ్ర కోణం నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించినట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ట్విటర్లో ప్రకటించింది కూడా. ఏదైనా సంస్థ ప్రమేయం, అంతర్జాతీయ లింకులు క్షుణ్ణంగా పరిశోధించబడతాయి అని ట్వీట్లో పేర్కొంది. ఇక ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ ఐజీ స్థాయి అధికారితో పాటు ఎన్ఐఏ బృందం ఒకటి మంగళవారమే ఉదయ్పూర్కు చేరుకుని పరిశీలించింది. తాజా సమాచారం ప్రకారం.. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉదయ్పూర్ ఘటనపై ఎన్ఐఏ బృందం కేసు నమోదు చేయొచ్చని తెలుస్తోంది. MHA has directed the National Investigation Agency (NIA) to take over the investigation of the brutal murder of Shri Kanhaiya Lal Teli committed at Udaipur, Rajasthan yesterday. The involvement of any organisation and international links will be thoroughly investigated. — गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 29, 2022 చదవండి: అచ్చం ఐసిస్ తరహాలో క్రూరంగా కన్హయ్య గొంతు కోశారు -
ఎన్ఐఏ చీఫ్గా దినకర్ గుప్తా
న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి, పంజాబ్ మాజీ డీజీపీ దినకర్ గుప్తాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గుప్తా నియామకానికి కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్ఐఏ చీఫ్గా ఆయన 2024 మార్చి 31 దాకా కొనసాగుతారు. సంస్థకు ఏడాది తర్వాత రెగ్యులర్ చీఫ్ నియామకం జరిగింది. గతేడాది మేలో వై.సీ.మోదీ రిటైరయ్యాక సీఆర్పీఎఫ్ డీజీ కులదీప్ సింగ్కు అదనపు బాధ్యతలిచ్చారు. -
Terror Funding Case: యాసిన్ మాలిక్కు యావజ్జీవం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ (56)కు పటియాలా హౌస్ ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు బుధవారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మాలిక్ ఇటీవలే తన నేరాన్ని అంగీకరించడం తెలిసిందే. అతనికి మరణ శిక్ష విధించాలని ఎన్ఐఏ కోరింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంతో పాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద మాలిక్పై కేసులు నమోదయ్యాయి. అతనికి యావజ్జీవంతో పాటు ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ రూ.11 లక్షల జరిమానా కూడా విధించారు. 2017లో కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించడానికి ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో నిధులు సమకూర్చాడంటూ మాలిక్పై ఎన్ఐఏ తొలి కేసు నమోదు చేసింది. కోర్టును మాలిక్ క్షమాభిక్ష కోరలేదని అతని లాయర్ వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తేలితే ఉరి తీయండనే కోరాడన్నారు. తీర్పు సందర్భంగా కోర్టు వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పీఓకేలో శిక్షణ.. భారత్లో ధ్వంస రచన నిషేధిత జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) నేతగా తరచూ వార్తల్లో కనిపించే మాలిక్ 1966 ఏప్రిల్ 3న శ్రీనగర్లోని మైసుమాలో పుట్టాడు. 1980ల నుంచే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు తెర తీశాడు. 1988లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆయుధాల వాడకం, ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ పొందాడు. జేకేఎల్ఎఫ్లో చేరి చురుగ్గా పనిచేశాడు. 1990 ఆగస్టులో ఎన్కౌంటర్లో పోలీసులకు దొరికిపోయాడు. 1994 మేలో బెయిల్పై విడుదలయ్యాడు. కశ్మీర్ విముక్తికి శాంతియుత ఉద్యమం కొనసాగిస్తానని ప్రకటించాడు. జేకేఎల్ఎఫ్ చైర్మన్గా ఎదిగాడు. కొన్నాళ్లు హురియత్ కాన్ఫరెన్స్లోనూ çపనిచేశాడు. కశ్మీర్లో ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ 1999లో ప్రజా భద్రత చట్టం (పీఎస్ఏ) కింద అరెస్టయ్యాడు. 2002లో విడుదలయ్యాడు. 2009లో పాకిస్తానీ కళాకారిణి ముషాల్ హుస్సేన్ ములిక్ను పెళ్లి చేసుకున్నాడు. వారికి పదేళ్ల కుమార్తె రజియా ఉంది. ఆమె ప్రస్తుతం తల్లితో కలిసి పాకిస్తాన్లో నివసిస్తోంది. యాసిన్ మాలిక్ 2013 ఫిబ్రవరిలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్తో కలిసి వేదిక పంచుకున్నాడు. 2017 నాటి టెర్రర్ ఫండింగ్ కేసులో 2019లో మాలిక్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. జమ్మూకశ్మీర్లో హింసాకాండకు సంబంధించి అతడిపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబైయా సయీద్ను 1989లో కిడ్నాప్ చేసిన కేసులో కూడా విచారణను ఎదుర్కొన్నాడు. 1990లో శ్రీనగర్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిబ్బందిపై దాడి చేశాడు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. -
ఉగ్ర నిధుల కేసు: యాసిన్ మాలిక్ దోషే
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు నిధులు అందించిన కేసులో కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ను దోషిగా తేలుస్తూ గురువారం ఢిల్లీలోని ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నెల 25న అతనికి శిక్ష ఖరారు చేయనున్నట్టుగా వెల్లడించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లోని 16, 17, 18, 20 సెక్షన్ల ప్రకారం యాసిన్ మాలిక్కు గరిష్టంగా మరణశిక్ష కాగా, కనిష్టంగా యావజ్జీవ కారాగార శిక్ష పడేందుకు అవకాశాలున్నాయి. యాసిన్ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి తెలిపితే తదనుగుణంగా జరిమానా విధిస్తామని ఎన్ఐఏని కోర్టు ఆదేశించింది. మాలిక్ కూడా తన ఆదాయాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్)పేరుతో యాసిన్ మాలిక్ ఏర్పాటు చేసిన ఉగ్ర సంస్థను కేంద్రం నిషేధించింది. స్వాతంత్య్ర పోరాటం పేరుతో కశ్మీర్ లోయలో మాలిక్ నిధులు పెద్ద ఎత్తున సేకరించి, ఉగ్ర సంస్థలకు అందించాడు. చదవండి: జీవితంలో మూడేళ్లు వృథా -
ప్రధానిని చంపేస్తామంటూ ఎన్ఐఏకు మెయిల్
ముంబై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్ ఒకటి ముంబైలోని ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కార్యాలయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ప్రధాని మోదీ హత్యకు 20 మంది స్లీపర్ సెల్స్ను తయారు చేశామని, 20 కేజీల ఆర్డీఎక్స్ను సిద్ధం చేశామని ఆగంతకులు ఆ మెయిల్లో పేర్కొన్నారు. ఈ మెయిల్ను ధృవీకరించిన ముంబై ఎన్ఐఏ కార్యాలయం.. ప్రధాని భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు సమాచారం. దీనిపై మరింత అప్డేట్స్ అందాల్సి ఉంది. -
కశ్మీర్ వేర్పాటువాదులకు షాక్
Terror Funding Case: కశ్మీర్ వేర్పాటువాదులకు జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. 2017లో కశ్మీర్ అల్లర్లకు సంబంధించి.. వేర్పాటువాద సంస్థలపై టెర్రరిస్టు ఫండింగ్ నేరారోపణలు నమోదు చేయాలని ఆదేశించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం Unlawful Activities (Prevention) Act లోని పలు సెక్షన్ల కింద నేరారోపణలు నమోదు చేయాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వేర్పాటువాదులతో పాటు పనిలో పనిగా ఉగ్రసంస్థల నేతలకూ షాక్ ఇచ్చింది కోర్టు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్తో పాటు హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ పేరును సైతం చేర్చింది. టెర్రర్ ఫండింగ్ కేసులో వీళ్ల పేర్లను పొందుపర్చాలని ఆదేశించింది కోర్టు. ఈ మేరకు ఢిల్లీ పాటియాలా హౌజ్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పర్వీన్ సింగ్ మార్చి 16వ తేదీనే ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్ వేర్పాటువాదులు, ఉగ్ర సంస్థలు పక్కా కుట్రతోనే 2017లో కశ్మీర్లో అలజడులు సృష్టించారని న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. తీవ్రవాద నిధుల కేసులో పలువురు నిందితులు పాకిస్థాన్తో ఉమ్మడి ఎజెండాను పంచుకున్నారని పేర్కొన్నారాయన. మొత్తం పదిహేను మంది కశ్మీరీ వేర్పాటువాద నేతలతో పాటు హఫీజ్ సయ్యద్, సయ్యద్ సలావుద్దీన్, Jammu & Kashmir Liberation Front చీఫ్ యాసిన్ మాలిక్, షబ్బీర్ షా, ముసారత్ అలమ్పై నేరారోపణలు నమోదు కానున్నాయి. -
భారత్పై దావూద్ ఇబ్రహీం మళ్లీ గురి
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మళ్లీ భారత్పై గురిపెట్టాడా? ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను హత్య చేసేందుకు సిద్ధమయ్యాడా? ఈ ప్రశ్నలకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అవుననే సమాధానం చెబుతోంది. భారత్లో భీకర దాడులతో అల్లకల్లోలం సృష్టించేందుకు దావూద్ ఓ ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేసినట్లు ఎన్ఐఏ బహిర్గతం చేయడం సంచలనాత్మకంగా మారింది. ‘ఇండియాటుడే’ కథనం ప్రకారం.. దావూద్పై ఎన్ఐఏ ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దేశవ్యాప్తంగా పలు కీలక ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు, మారణాయుధాలతో విరుచుకుపడేందుకు దావూద్ ముఠా ప్రణాళిక రూపొందించిందని ఎఫ్ఐఆర్లో ప్రస్తావించింది. ఢిల్లీ, ముంబై నగరాలపై దావూద్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ఎన్ఐఆర్ వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందించారన్న ఆరోపణలతో దావూద్ ఇబ్రహీంతోపాటు అతడి అనుచరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవలే మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ కేసులో దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ను న్యాయస్థానం ఈ నెల 24వ తేదీ వరకు ఈడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. -
నెల్లూరులో NIA అధికారుల సోదాలు
-
నెల్లూరులో ఎన్ఐఏ సోదాలు
నెల్లూరు(క్రైమ్): మావోయిస్టులకు నిధులు సమకూరుస్తున్న కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు శనివారం నెల్లూరు నగరంలో తనిఖీలు నిర్వహించారు. మావోలకు నిధులు సమకూరుస్తున్నారంటూ బిహార్లో ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం ఏకకాలంలో బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఏపీలో సోదాలు చేపట్టింది. అందులో భాగంగా శనివారం రాంజీనగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న కాంట్రాక్టర్ పెంచలయ్యనాయుడి ఇంటికి శనివారం ఎన్ఐఏ అధికారులు చేరుకున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేసి మూడు గంటల పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ సోదాల విషయాలు బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. గతేడాదీ నెల్లూరు అరవిందానగర్లోనూ ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. -
తమిళనాడులో మళ్లీ పులుల కదలికలు
సాక్షి, చెన్నై: ప్రత్యేక రాష్ట్రం కోరుతూ శ్రీలంకలో పోరాటాలు సాగించిన విడుదలై పులులు (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) తమిళనాడులో మళ్లీ బలం పుంజుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయా? కొత్తగా సభ్యత్వాలు చేర్చుకోవడం ద్వారా ఎల్టీటీఈని పునరుద్ధరించేందుకు పావులు కదుపుతున్నాయా? అందరిలోనూ ఆందోళన కలిగించే ఈ ప్రశ్నలకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఎల్టీటీకి మద్దతుగా నిలిచే ముగ్గురు ముఖ్య రాజకీయనేతలపై ఎన్ఐఏ అధికారులు నిఘా పెట్టడం, నిధుల సమీకరణ అనుమానంపై ఐదుగురిపై కేసులు నమోదుచేయడం ఇందుకు తార్కాణంగా భావించవచ్చు. తమిళనాడులోని సానుభూతిపరుల సహకారంతో ఎల్టీటీఈ శ్రీలంకలో సుదీర్ఘకాలం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ శ్రీలంకతో శాంతి ఒప్పందం చేసుకుంటారనే అనుమానంతో చెన్నై సమీపం శ్రీపెరంబుదూరులో మానవబాంబు ద్వారా ఆయనను హతమార్చింది. మరికొద్ది కాలానికి ఎల్టీటీఈ ఉద్యమసారధి ప్రభాకరన్ను 2009లో అక్కడి ప్రభుత్వం మట్టుబెట్టడంతో ఆందోళనలు చల్లారాయి. తమిళం పోరాటం ముగిసినట్లుగా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తమిళనాడులో సైతం ఎల్టీటీఈ కనుమరుగైంది. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఎల్టీటీఈ ఉద్యమం చాపకింది నీరులా మళ్లీ రాజుకుంటోందని ఎన్ఐఏలో అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా తమిళనాడు కేంద్రంగా ఎల్టీటీఈ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎన్ఐఏ భావిస్తోంది. చదవండి: (నటుడు విజయ్కి హైకోర్టులో ఊరట) ఇందుకు రాష్ట్రంలోని ముగ్గురు ప్రముఖ రాజకీయనేతలు దన్నుగా నిలుస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులకు పక్కా సమాచారం అందింది. అనధికారికంగా తమిళనాడులో తలదాచుకుంటున్న లక్ష్మణన్ మేరీ బిరాన్సింఘే అనే 50 సంవత్సరాల శ్రీలంక మహిళను గత ఏడాది అక్టోబరులో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ యువతికి ఎల్టీటీఈతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. 2019లో శ్రీలంక పాస్పోర్టు ద్వారా పర్యాటక వీసాతో ఆమె ఇండియాకు చేరుకోగా 2020 డిసెంబరులో వీసా గడువు ముగిసింది. చెన్నై అన్నానగర్లో ఒక ఇంటిని లీజుకు తీసుకుని ఆ పత్రాల ద్వారా వంటగ్యాస్ పొందింది. గ్యాస్ బిల్లు ఆధారంగా ఇండియా పాస్పోర్టు సంపాదించింది. బెంగళూరు మీదుగా ముంబయికి ప్రయాణం అవుతుండగా చెన్నై విమానాశ్రయంలో గత ఏడాది ఆమెను అరెస్ట్ చేశారు. ఇండియా పాస్పోర్టు పొందేందుకు ఆమెకు సహకరించిన వారెవరని అధికారులు ఆరాతీస్తున్నారు. ఆమె సెల్ఫోన్ సంభాషణలను పరిశీలించారు. ఈ సమయంలో ఇండియాలోని లక్షదీవుల సమీపంలో ఎల్టీటీఈలో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉండిన సద్గుణం అలియాస్ సెబాస్టియన్ను గత ఏడాది మార్చిలో అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఏకే 47 రకం తుపాకీలు, తూటాలు, 300 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఎల్టీటీఈని పునరుద్ధరించేందుకు ధనార్జన కోసం హెరాయిన్ మాదకద్రవ్యాలను అక్రమరవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇదిలాఉండగా కెన్నిసన్ పొర్మాండో, భాస్కరన్, జాన్సన్ సామువేల్, సెల్లముదన్ అనే శ్రీలంకకు చెందిన నలుగురు వ్యక్తులు ముంబయి హార్బర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎం ద్వారా నగదు డ్రా చేసినట్లు ఎన్ఐఏ కనుగొంది. చెన్నైలో పట్టుబడిన మహిళతోపాటు ఈ నలుగురిపైనే ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. ఈ సంఘటనలతో అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులు తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబుతో సమాలోచనలు జరపడం ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి ఎన్ఐఏ అధికారులు మూడు పేజీల నివేదికను కూడా అందజేశారు. శ్రీలంకకు సరిహద్దు రాష్ట్రం కావడంతో ఎల్టీటీఈని పునరుద్ధరించేందుకు తమిళనాడులో ప్రయత్నాలు సాగుతున్నాయని ఆ నివేదికలో ఎన్ఐఏ స్పష్టం చేసింది. అంతేగాక కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి విచారణ జరిపి 15 రోజుల్లోగా బదులివ్వాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఎన్ఐఏ కోరింది. ఎల్టీటీఈ పునరుద్ధరణకు సహకరిస్తున్న తమిళనాడుకు చెందిన ముగ్గురు రాజకీయనేతలపై కూడా గట్టి నిఘా పెట్టాలని సైతం సూచించింది. తమిళనాడు ప్రభుత్వం 15 రోజుల్లో సమర్పించే నివేదిక అనంతరం ఎన్ఐఏ అధికారులు రాష్ట్రంలో విచారణ చేపట్టవచ్చని అంచనా. -
ఐసిస్తో సంబంధమున్న మహిళ అరెస్ట్
యశవంతపుర: కర్ణాటకలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ కన్నడ రచయిత దివంగత బీఎం ఇదినబ్బ మనవడి భార్య దీప్తి మార్లా అలియాస్ మరియం.. యువకులను ఐసిస్ వైపు ఆకర్షితులను చేస్తున్నారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) ఆమెను సోమవారం అరెస్ట్ చేసింది. ఉళ్లాలలో ఇదినబ్బ కొడుకు బీఎం బాషా నివాసంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గతంలో బాషా చిన్నకొడుకు రహమాన్ను అరెస్ట్ చేశారు. -
రాష్ట్రంలో పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు
ఒంగోలు/టంగుటూరు/చీరాల/ఆరిలోవ (విశాఖ తూర్పు)/నెల్లూరు (క్రైమ్): రాష్ట్రంలో ప్రకాశం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని హైదరాబాద్, మెదక్లలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం సోదాలు నిర్వహించింది. ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. టంగుటూరు మండలం ఆలకూరపాడులో నివాసముంటున్న విరసం నేత కల్యాణ్రావు, వేటపాలెం మండలం జాండ్రపేటలోని మాచర్ల మోహన్రావు ఇళ్లల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేశారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆయన పేరుతో హైదరాబాద్లో పుస్తకాన్ని ముద్రించేందుకు ఆయన సతీమణి ప్రయత్నించిన నేపథ్యంలో ప్రింటింగ్ ప్రెస్ను సైతం పోలీసులు సీజ్ చేశారు. మరోవైపు గడ్చిరోలి ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యంలో కీలక సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది. ఆర్కేకు చెందిన డైరీ లభించినట్టు తెలిసింది. 2019 జూలై 28న చత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. కల్యాణ్రావు ఇంట్లో రెండు సంచుల పుస్తకాలను సీజ్ చేశారు. ఆయనకు ఆర్థిక సహకారం ఏమైనా అందుతుందా అనే కోణంలోనూ విచారించినట్టు సమాచారం. చేనేత జనసమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు మాచర్ల మోహన్రావు ఇంట్లో కూడావిప్లవ సాహిత్యాన్ని సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో మార్కాపురం ఓఎస్డీ కె.చౌడేశ్వరి, ఐదుగురు ఎన్ఐఏ అధికారులు, 11 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మహిళా న్యాయవాది అన్నపూర్ణ నివాసంలో.. విశాఖ ఆరిలోవలో మావోయిస్టు సానుభూతిపరురాలు ఎ.అన్నపూర్ణ నివాసముంటున్నారు. ఆమె న్యాయవాదిగా ఉంటూ ప్రగతిశీల కార్మిక సమాఖ్య సభ్యురాలుగా ఉన్నారు. ఆమె భర్త ఎం.శ్రీనివాసరావు కూడా న్యాయవాదే. దీంతో ఎన్ఐఏ అధికారులు ఆమె ఇంటిలో సోదాలు చేశారు. రూరల్ రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇంట్లో లభించిన పలు డాక్యుమెంట్లు, పుస్తకాలు సీజ్ చేశారు. మావోయిస్టులకు సహాయసహకారాలు అందిస్తున్నారని గతంలో ఆమెను పోలీసులు రెండుసార్లు అరెస్టు చేసినట్లు తెలిసింది. రవి కుటుంబ సభ్యుల ఇంటిలో.. నెల్లూరు అరవిందానగర్లో ఎన్ఐఏ అధికారులు.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి అలియాస్ జైలాల్ అలియాస్ సునీల్ కుమార్ కుటుంబసభ్యుల ఇంటిలో సోదాలు నిర్వహించారు. రవి సోదరీమణులు.. అనూష, అన్నపూర్ణల సెల్ఫోన్లు, వారు రాసుకుంటున్న కవితల పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా రవి గతేడాది జూన్లో జార్ఖండ్లోని కొల్హాన్ అటవీ ప్రాంతంలో బాణం బాంబును పరీక్షిస్తుండగా తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్లోనూ సోదాలు హైదరాబాద్లోని నాగోల్లో నివాసం ఉండే బీహార్, జార్ఖండ్ మావోయిస్టు పార్టీ కమిటీ నేతగా ఉన్న నార్ల రవి శర్మ, ఆయన భార్య బెల్లపు అనురాధ, అల్వాల్లో నివాసం ఉంటున్న అమర వీరుల బంధు మిత్రుల కమిటీ సభ్యురాలు పద్మకు మారి, న్యాయ శాస్త్ర విద్యార్థిని బి.పద్మ, కవి అరుణాంక్ లత తదితరుల ఇళ్లల్లోనూ, హిమాయత్ నగర్లోని అదితి ఉమెన్స్ హాస్టల్లో సోదాలు చేసి విప్లవ సాహిత్యం, పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ అనుమానాలతోనే సోదాలు.. మావోయిస్టులకు సహకారం అందిస్తున్నట్లు ఆధారాలు లభించినందువల్లే సోదాలు నిర్వహించారని సమాచారం. మెయిల్స్ రూపంలో మావోయిస్టు పార్టీకి, వీరికి మధ్య సమాచార మార్పిడి జరిగిందని ఎన్ఐఏ అనుమానిస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసిన కొందరు మళ్లీ సాయం చేస్తున్నట్లు ఎన్కౌంటర్ ప్రాంతంలో దొరికిన కొన్ని ఆధారాల ద్వారా బయటపడి ఉంటుందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ప్రశ్నించడమే నేరంగా మారింది సమాజంలో ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడమే నేరంగా మారింది. ఎన్ఐఏ అధికారులు ఇంట్లోని ప్రతి పుస్తకాన్ని, కాగితాన్ని పట్టిపట్టి చూశారు. నిజం మాట్లాడేవారిపై, ప్రజల పక్షాన నిలబడేవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. రాసే హక్కు రచయితకు, మాట్లాడే హక్కు మనిషికి, ఉద్యమం చేసే హక్కు ఉద్యమకారులకు ఉంది. ఇలా వేధించడం అప్రజాస్వామికం. – కల్యాణ్రావు, విరసం నేత కోర్టు ఆదేశాలతో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.. ఎందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారని అధికారులను అడిగాం. కోర్టు ఆదేశాలతోనే తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మా సెల్ఫోన్లు, పుస్తకాలను తీసుకెళ్లారు. తమ్ముడు రవి సుమారు ఎనిమిదేళ్ల కిందట ఉద్యోగం కోసం వెళుతున్నా అని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఇటీవల మృతి చెందడంతో ఉద్యమంలో పనిచేశాడని తెలిసింది. – రవి సోదరి అన్నపూర్ణ -
రెండు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మాజీ మావోయిస్టులు, సానుభూతిపరుల ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం సోదాలు చేసింది. వేర్వేరు బృందాలు, స్థానిక పోలీసులతో.. అన్నిచోట్లా ఉదయం ఆరు గంటల సమయంలో ఒకేసారి తనిఖీలు చేపట్టింది. 2019 జూలై 28న ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్టు ప్రకటించింది. హైదరాబాద్తోపాటు రాచకొండ, మెదక్, ప్రకాశం, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు జిల్లాల్లో చేసిన ఈ సోదాల్లో.. కీలక డాక్యుమెంట్లు, సాహిత్యం, సెల్ఫోన్లు పెన్డ్రైవ్లను సీజ్ చేసినట్లు వెల్లడించింది. 2019 బస్తర్ ఎన్కౌంటర్కు సంబంధించి.. సంజు అలియాస్ పాండు, పునెం అలియాస్ లక్ష్మణ్, మున్నీతోపాటు మరో 40 మందిపై ఈ ఏడాది మార్చిలో ఎన్ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో మావోయిస్టులకు కొందరు సహకరించినట్టుగా లభించిన ఆధారాల మేరకు తాజాగా సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. ఒక్క గది.. ఏడు గంటలు సోదాలు గురువారం హైదరాబాద్లోని హిమాయత్నగర్లో ఉన్న ఓ ప్రైవేటు మహిళా హాస్టల్లోని ఓ గదిలో ఎన్ఐఏ సోదాలు చేసింది. ఉదయం 6నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తనిఖీలు నిర్వహించింది. ఓయూ, సెంట్రల్ వర్సిటీ, ఇతర కాలేజీల్లో చదువుకునే ఆరుగురు విద్యారి్థనులు ఆ గదిలో ఉంటున్నారని తెలిసింది. వీరిలో ఓ విద్యారి్థని వివాహిత అని, ఆమె భర్త మావోయిస్టులతో కలిసి పనిచేశారని సమాచారం. తనిఖీల్లో కొన్నిపత్రాలు, పుస్తకాలను స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. ►అల్వాల్లో అమరవీరుల బంధు మిత్రుల కమిటీ సభ్యురాలు పద్మకుమారి, సుభానగర్లో సహాయ కార్యదర్శి భవాని నివాసాల్లో అధికారులు సోదాలు చేశారు. ►ఉమ్మడి మెదక్ జిల్లా చేగుంటలో మావోయిస్టు అగ్రనేత దుబాసి శంకర్ కుమారుడు నాగరాజు నివాసంలో సోదాలు చేసిన ఎన్ఐఏ అధికారులు.. ఒక ల్యాప్టాప్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ►హైదరాబాద్లోని నాగోల్లో మాజీ మావోయిస్టులు నార్ల రవిశర్మ, బెల్లపు అనురాధ దంపతుల నివాసంలో సోదా చేసి.. కంప్యూ టర్ హార్డ్డిస్క్లు, విప్లవ సాహిత్యాన్ని స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. ►వనస్థలిపురం ఇంజనీర్స్కాలనీలో రిటైర్డ్ లెక్చరర్, టీపీఎఫ్ చైర్మన్ కె.రవిచంద్ర నివాసంలోనూ ఎన్ఐఏ తనిఖీ చేసింది. ►మరోవైపు ఏపీలోని వైజాగ్లో న్యాయవాద దంపతులు అందలూరి అన్నపూర్ణ, శ్రీనివాస్రావు.. ప్రకాశం జిల్లా అలకురపాడులో విప్లవ సాహిత్య రచయిత జి.కల్యాణ్రావు నివాసాల్లోనూ ఎన్ఐఏ తనిఖీలు చేసింది. ఎన్ఐఏ దాడులు సరికాదు సమాజంలో వివిధ వర్గాల సమస్యల పరిష్కారం, న్యాయమైన హక్కుల సాధన కోసం పోరాడుతున్న ప్రజాసంఘాల కార్యకర్తలపై ఎన్ఐఏ దాడులను ఖండిస్తున్నట్టు అమరుల బంధుమిత్రుల సంఘం ప్రకటించింది. వందల మంది పోలీసుల పహారాతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొంది. హక్కుల కార్యకర్తలు, రచయితలపై ఎన్ఐఏ దాడులను ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రకటించారు. నార్ల రవిశర్మ, బెల్లపు అనురాధ దంపతులు -
2013 పట్నా పేలుళ్ల కేసు: నలుగురికి ఉరిశిక్ష
న్యూఢిల్లీ: 2013 పట్నా పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు దోషులకు మరణశిక్ష విధించింది. ఇద్దరికి జీవిత ఖైదు, మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. మరో దోషికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. పేలుళ్ల కేసులో మొత్తం 9 మందిని ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. 2013 అక్టోబర్ 13న మోదీ ర్యాలీ లక్ష్యంగా వరుస పేలుళ్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ దాడులు
న్యూఢిల్లీ: ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. మూడు రాష్ట్రాల్లోని 18 ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహిస్తాంది. లష్క్రర్, జైష్, హిజ్బుల్,అల్బదర్ సంస్థలపై ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి సారించింది.కశ్మీర్ వ్యాలీలోని పలు చోట్ల, ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ దాడులు చేస్తోంది. షోపియాన్, శ్రీనగర్, పుల్వామా, బారాముల్లాలో తనిఖీలు చేస్తున్నారు. -
బెజవాడ అడ్రస్తో బురిడీ.. గమ్యస్థానం ఢిల్లీయే..
సాక్షి, అమరావతి: ఇటీవల గుజరాత్లో స్వాధీనం చేసుకున్న హెరాయిన్ నిల్వలతో ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదని కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు స్పష్టం చేశాయి. అఫ్గానిస్తాన్ నుంచి ఇరాక్ మీదుగా గుజరాత్కు దిగుమతైన రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్ గమ్యస్థానం దేశ రాజధాని ఢిల్లీయేనని ప్రాథమికంగా నిర్ధారించింది. డీఆర్ఐ, ఇతర నిఘా సంస్థలను బురిడీ కొట్టించేందుకే స్మగ్లర్లు విజయవాడ చిరునామాను వాడుకున్నట్లు తుది అంచనాకు వచ్చింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో ముడిపడిన డ్రగ్స్ అక్రమ తరలింపు కేసులో దర్యాప్తును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. హెరాయిన్ దిగుమతితో ఏపీకి సంబంధం లేదని ఈ కేసుకు సంబంధించిన నివేదికలో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. విజయవాడకు సంబంధమే లేదు... ఈ కేసులో చెన్నైకు చెందిన మాచవరం సుధాకర్, ఆయన భార్య గోవిందరాజు దుర్గాపూర్ణిమ వైశాలితోపాటు ఆరుగురు అఫ్గాన్వాసులు, ఉజ్బెకిస్తాన్కు చెందిన ఓ మహిళను డీఆర్ఐ ఇప్పటికే అరెస్టు చేసింది. అఫ్గానిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా హెరాయిన్ దిగుమతి దందాలో సుధాకర్ దంపతులను కమీషన్ ప్రాతిపదికన వాడుకుందని డీఆర్ఐ ప్రాథమికంగా గుర్తించింది. ఈ క్రమంలోనే నిందితులు విజయవాడ చిరునామాతో రిజిస్టర్ చేసిన అషీ ట్రేడింగ్ కంపెనీ పేరును వాడుకునేందుకు సమ్మతించారు. అఫ్గానిస్తాన్కు చెందిన ముఠా సభ్యులే మన దేశంలోనూ తిష్టవేసి డ్రగ్స్ రాకెట్ నడిపించారు. సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో దాదాపు రూ.21 వేల కోట్ల విలువైన రెండు కంటైనర్ల హెరాయిన్ను డీఆర్ఐ జప్తు చేసిన విషయం విదితమే. అషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో జూన్లో కూడా అఫ్గానిస్తాన్ నుంచి రెండు కంటైనర్ల హెరాయిన్ను ముంద్రా పోర్టులో దిగుమతి చేసి గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీకి తరలించినట్లు విచారణలో వెల్లడి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ రెండు కంటైనర్ల హెరాయిన్ను గుజరాత్ నుంచి నేరుగా ఢిల్లీకి తరలించారని, విజయవాడకుగానీ ఆంధ్ర ప్రదేశ్లోని ఇతర చోట్లకుగానీ తరలించలేదన్నది కీలక అంశమని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. అంటే కేవలం తమ కళ్లు గప్పేందుకే విజయవాడ చిరునామాను వినియోగించుకున్నారని, హెరాయిన్ స్మగ్లింగ్తో ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి సంబంధం లేదన్నది స్పష్టమైందని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. ప్రాధాన్యం సంతరించుకున్న న్యాయమూర్తి వ్యాఖ్యలు గుజరాత్లో హెరాయిన్ జప్తు కేసులో అరెస్టైన నిందితులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విజయవాడకు చెందిన సంస్థ హెరాయిన్ను దిగుమతి చేసుకుంటే పశ్చిమ తీరాన గుజరాత్లో ఉన్న ముంద్రా పోర్టుకు ఎందుకు తెస్తారు? విజయవాడకు సమీపంలో తూర్పు తీరంలోనే పలు పోర్టులు ఉన్నాయి కదా? అని పేర్కొన్నారు. హెరాయిన్ను ఢిల్లీకి తరలించాలన్నదే స్మగ్లర్ల ఉద్దేశమని డీఆర్ఐ కూడా న్యాయస్థానానికి తెలిపింది. విజయవాడకు చేర్చడం అసలు స్మగ్లర్ల లక్ష్యమే కాదని పేర్కొంది. స్మగ్లింగ్ ముఠా అంతా అఫ్గానిస్తాన్, ఇరాన్, ఢిల్లీల్లో ఉన్నట్లు స్పష్టం చేసింది. చెన్నై నుంచి అఫ్గానిస్తాన్లోని ముఠా సభ్యులతో ఫోన్లో మాట్లాడి హెరాయిన్ను గుజరాత్ తీరానికి తెప్పించి ఢిల్లీకి తరలిస్తున్నారని తెలిపింది. అఫ్గానిస్తాన్, ఇరాన్లోని ముఠాలు నడుపుతున్న ఈ దందాలో ఉగ్రవాద, దేశ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉన్నట్లు కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సాధారణ స్మగ్లింగ్ కేసులు విచారించే డీఆర్ఐ కాకుండా ఉగ్రవాద నేరాలను దర్యాప్తు చేసే ‘ఎన్ఐఏ’కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. -
డ్రగ్స్ రాకెట్ కేసు: రంగంలోకి ఎన్ఐఏ!
సాక్షి, ఢిల్లీ: డ్రగ్స్ రాకెట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రంగంలోకి దిగనుంది. ఉగ్రవాదం కోణంలో ఎన్ఐఏ దృష్టి సారించనుంది. డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చే డబ్బుతో ఉగ్రవాదులు మారణాయుధాలు కొనుగోలు చేస్తున్న కోణంలో విచారణ జరపనుంది. తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత అఫ్ఘాన్ నుంచి వచ్చే సరుకుపై గట్టి నిఘా ఏర్పాటు చేయనుంది. సరకు రవాణా ముసుగులో ఉగ్రవాదులు మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని హెరాయన్ అక్రమ దిగుమతి కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. అఫ్గానిస్తాన్లోని కాందహార్ నుంచి ఇరాన్లోని ముంద్రా పోర్టుకు వచ్చిన రెండు కంటెయినర్లలో 2,998 కేజీల హెరాయిన్ను ఈ నెల 17, 19 తేదీల్లో స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. -
‘ఇస్లామిక్ స్టేట్’ ప్రేరణతో ఉగ్ర ఉచ్చులోకి..
న్యూఢిల్లీ/చెన్నై: కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ప్రేరణతో భారత్లోనూ ముష్కరులు పెచ్చరిలి్లపోతున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వెల్లడించింది. ఉగ్రవాద దాడులు, కుట్ర, నిధుల అందజేతకు సంబంధించిన 37 కేసుల్లో ఇప్పటిదాకా 168 మందిని అరెస్టు చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. 31 కేసుల్లో చార్జిషీట్లను కోర్టుల్లో దాఖలు చేశామని తెలిపింది. నిందితుల్లో ఇప్పటిదాకా 27 మందిని న్యాయస్థానాలు దోషులుగా తేల్చాయని పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ ముఠా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఆమాయక యువతపై వల విసురుతోందని, భారత్లో తన భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఎన్ఐఏ అధికార ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రచారం పట్ల ఆకర్షితులైన వారిని విదేశాల నుంచే సోషల్ మీడియా వేదికల ద్వారా సంప్రదించి ఉచ్చులోకి లాగుతున్నారని తెలిపారు. తమిళనాడులో ఒకరి అరెస్టు ఇస్లామిక్ స్టేట్, హిజ్్బ–ఉత్–తహ్రీర్ ఉగ్రవాద సంస్థల సిద్ధాంతాలు, భావజాలాన్ని ఫేస్బుక్ ద్వారా వ్యాప్తి చేస్తున్నారన్న సమాచారంతో తమిళనాడులో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా గురువారం రాష్ట్రంలో రెండు చోట్ల సోదాలు నిర్వహించి ఒకరిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. తిరువారూర్ జిల్లాలో బవా బహ్రుద్దీన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. -
ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు బెయిల్ రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన విజ్ఞప్తిని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ గతంలో ఇచ్చిన తీర్పునే పునరుద్ఘాటిస్తూ ఆదేశాలిచ్చింది. గత ఏడాది జర్నలిస్ట్ బండారి మద్దిలేటి, న్యాయవాదులు నలమాస కృష్ణ, మెంచు సందీప్లను జాతీయ దర్యాప్తు సంస్థ యూఏపీఏ కింద అరెస్టు చేసింది. కాగా, ప్రత్యేక కోర్టు ఈ నిందితులకు గత సంవత్సరం ఆగస్టు 21, సెప్టెంబర్ 15, 28 తేదీల్లో వేర్వేరు తీర్పుల ప్రకారం బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ను సవాల్ చేస్తూ ఎన్ఐఏ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు ఈ కేసును మళ్లీ విచారించాలని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు సూచించింది. ఇటీవల ప్రత్యేక కోర్టు, కేసును తిరిగి విచారించింది. నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది వి.పట్టాభి, న్యాయవాదులు నందిగం కృష్ణారావు, వి.రఘునాథ్ వాదించారు. కాగా బెయిల్ రద్దు చేసేందుకు ఎలాంటి కారణాలు లేనందున గతంలో బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పునే పునరుద్ఘాటిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. -
వరవరరావు బెయిల్ పొడిగింపుపై 6న విచారణ
ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 6 దాకా ఎలాంటి చర్యలు తీసుకోబోమని జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం బాంబే హైకోర్టుకు తెలియజేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు బాంబే హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర మెడికల్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 5న తలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెడికల్ బెయిల్ను పొడిగించాలని విజ్ఞప్తి చేస్తూ వరవరరావు శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 6న విచారణ చేపడతామని కోర్టు చెప్పింది. అప్పటిదాకా వరవరరావుపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని ఆయన తరపు న్యాయవాది హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఎన్ఏఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్సింగ్ స్పందిస్తూ.. ఈ నెల 6దాకా వరవరరావుకు వ్యతిరేకంగా చర్యలు తీసుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
మాజీ ఎమ్మెల్యే కుమారుడికి ఐసిస్తో లింక్?
సాక్షి, బనశంకరి: సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మాజీ ఎమ్మెల్యే బీఎం ఇదినబ్బ కుమారుడి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళూరులోని మస్తికట్టెలో ఉన్న బీఎం బాషా నివాసంపై బుధవారం ఎన్ఐఏ ఐజీపీ ఉమా నేతృత్వంలో 25 మంది బృందం దాడి చేసింది. స్థానిక పోలీసులతో కలిసి సోదాలతో పాటు విచారణ ప్రారంభించారు. బాషా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, అతని ఇద్దరు కుమారులు విదేశాల్లో స్థిరపడ్డారు. అతడి కుమార్తె కొన్నేళ్ల క్రితం కేరళ నుంచి అదృశ్యమైంది. ఆమె సిరియాలో ఐసిస్లో చేరినట్లు అనుమానాలున్నాయి. బాషా కుటుంబసభ్యులు ఐసిస్ నిర్వహించే యుట్యూట్ చానల్ను సబ్స్క్రైబ్ చేసినట్లు తెలి సింది. దీంతో ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలు ఉన్నాయనే అనుమానం వ్యక్తమైంది. అంతేగాక జమ్మూకశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న యువకులతో బాషా కుటుంబీకులు ఫోన్లో సంభా షించినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. ఉళ్లాల నియోజకవర్గంలో మూడుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న బీఎం.ఇదినబ్బ పాత్రికేయుడు, స్వాతం త్య్ర సమరయోధుడు, కన్నడ సాహితీవేత్త, కన్నడ ఉద్యమకారునిగా పేరుగాంచారు. ఆయన 2009లో కన్నుమూశారు. ఆయన కుమారుడు బాషా ఉగ్రవాద ఆరోపణల్లో చిక్కుకోవడం గమనార్హం. -
దర్భంగా బ్లాస్ట్: కశ్మీర్లో ఇమాజ్ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
కశ్మీర్: దర్భంగా బ్లాస్ట్ కేసులో జాతీయ దర్యాఫ్తు సంస్థ( ఎన్ఐఏ) మరొక నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసింది. కశ్మీర్లో ఇమాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో నిందుతులైన మాలిక్ సోదరులతో కలిసి ఇమాజ్ దర్భంగా పేలుడుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇటీవల దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. నిందితులకు ఈనెల 23వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. విచారణలో ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టింది. పేలుడు వెనుక లష్కరే తొయిబా ముఖ్యనేత ఇక్బాల్ ఉన్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్తో పాటు అండర్ వరల్డ్ డాన్ టైగర్ మెమేన్ ఆదేశాలతో భారత్లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు అధికారులు నిర్థారించారు. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేందుకు ఇక్బాల్ సొంత గ్రామం ఖైరానాకు చెందిన వారితో పరిచయాలు పెంచుకున్నట్లు గుర్తించారు. దర్భంగా బ్లాస్ట్ కేసులో ఖలీం అనే మరో వ్యక్తి పాత్ర కూడా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. -
తెలంగాణలోని 5 జిల్లాలో ఎన్ఐఏ సోదాలు
-
ఒక్కో బ్లాస్ట్కు రూ.కోటి ఇస్తామని నిందితులకు లష్కరే తోయిబా ఆఫర్
-
తెలంగాణలోని 5 జిల్లాలో ఎన్ ఐ ఏ సోదాలు
-
NIA అధికారులనే బురుడీ కొట్టించిన మాలిక్ బ్రదర్స్
-
తెలంగాణలో పలుచోట్ల ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్ఐఏ పలుచోట్ల సోదాలు నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసులో మహబూబ్నగర్ జిల్లాలో ముత్తు నాగరాజు, వి. సతీష్ , మేడ్చల్లోని కొమ్మరాజు కనకయ్య, భద్రాద్రి జిల్లాలో గుంజి విక్రమ్, త్రినాథరావు, జనగామలో సూర సారయ్య, వరంగల్లో వేలుపుస్వామి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితుల నుంచి 400 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 500 నాన్ఎలక్ట్రిక్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని మావోయిస్టు నేత హిడ్మాకు రవాణా చేస్తుండగా ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. పేలుడు పదార్థాల తయారీకి సంబంధించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. -
గోల్డు స్మగ్లింగ్ ఉగ్రవాద చర్యే, వారికి బెయిల్ ఇవ్వొద్దు
కొచ్చీ: బంగారాన్ని అక్రమంగా దిగుమతి చేయడం దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వానికి ముప్పేనని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కేరళ హైకోర్టుకు తెలియజేసింది. 2019 నవంబర్ నుంచి 2020 జూన్ వరకు స్వప్నా సురేష్తోపాటు మరికొందరు యూఏఈ నుంచి 167 కిలోల బంగారాన్ని భారత్లోకి అక్రమంగా రవాణా చేశారని, వారిది ముమ్మాటికీ ఉగ్రవాద చర్యేనని తేల్చిచెప్పింది. గోల్డు స్మగ్లింగ్ కోసం ‘దౌత్య’ మార్గాలను ఉపయోగించుకున్నారని, ఈ వ్యవహారం భారత్–యూఏఈ మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందని తెలిసి కూడా తప్పుడు పనికి పాల్పడ్డారని ఆక్షేపించింది. ఈ నేరం చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం(యూఏపీఏ) కిందకు వస్తుందని ఎన్ఏఐ స్పష్టం చేసింది. స్వప్నాసురేష్తోపాటు ఇతర నిందితులకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయొద్దని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. స్వప్నా సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఎన్ఐఏ కోర్టు గతంలోనే కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ స్వప్నాసురేష్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను వ్యతిరేకిస్తూ ఎన్ఐఏ శుక్రవారం కేరళ హైకోర్టులో తన వాదనలు వినిపించింది. బంగారం స్మగ్లింగ్ కోసం నిందితురాలు పెద్ద కుట్ర పన్నారని, కొందరు వ్యక్తులను నియమించుకొని, ఉగ్రవాద ముఠాను తయారు చేశారని ఆక్షేపించింది. నిధులు సేకరించి మరీ 167 కిలోల బంగారాన్ని యూఏఈ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నారని గుర్తుచేసింది. ఇందుకోసం తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్ జనరల్ కార్యాలయ దౌత్యవేత్తల పేర్లను వాడుకున్నారని తెలిపింది. నిందితులను బెయిల్పై విడుదల చేస్తే దర్యాప్తుపై అది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వెల్లడించింది. గత ఏడాది జూలై 5న తిరువనంతపురం ఎయిర్పోర్టులో 15 కిలోల బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. యూఏఈ కాన్సులేట్ చిరునామాతో వచ్చిన సంచిలో ఈ బంగారం దొరికింది. అధికారులు తీగ లాగడంతో స్వప్నా సురేష్తో సహా మొత్తం ఏడుగురు నిందితులు మొత్తం 167 కిలోల బంగారాన్ని యూఏఈ నుంచి స్మగ్లింగ్ చేసినట్లు తేలింది. -
ఢిల్లీకి ‘దర్భంగ ఉగ్రవాదులు’
సాక్షి, హైదరాబాద్: బిహార్లోని దర్భంగ రైల్వే స్టేషన్లో జరిగిన విస్ఫోటనం కేసులో నిందితులుగా ఉన్న లష్కరే తొయిబా ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఢిల్లీకి తరలించారు. ఇద్దరినీ హైదరాబాద్లోని మల్లేపల్లి ప్రాంతంలో పట్టుకున్న విషయం తెలిసిందే. వీరి కస్టడీ గడువు పూర్తి కావడంతో శుక్రవారం బిహార్ రాజధాని పట్నాలో ఉన్న ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. వీరి నుంచి మరికొంత సమాచారం సేకరించాల్సి ఉందని, మరో పది రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన న్యాయస్థానం ఈ నెల 16 వరకు అనుమతించింది. దీంతో ఇద్దరినీ కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు సోమవారం బిహార్ నుంచి ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఈ ఉగ్రవాద కుట్రలో కీలకంగా వ్యవహరించిన ఉత్తరప్రదేశ్లోని ఖైరానా వాసి సలీంను సైతం కస్టడీలోకి తీసుకోవాలని ఎన్ఐఏ భావించింది. అనారోగ్య కారణాలతో అతగాడు పట్నా హాస్పిటల్లో చేరడంతో సాధ్యం కాలేదు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఓ ప్రత్యేక బృందం సిటీకి వచ్చే అవకాశం ఉంది. -
దర్భంగ కేసు’.. ఎవరీ ఇక్బాల్ ఖానా?
సాక్షి, హైదరాబాద్: దర్భంగ ఎక్స్ప్రెస్ దహ నానికి కుట్ర కేసుతో ఇక్బాల్ ఖానా పేరు దక్షిణాదిలో వెలుగులోకి వచ్చింది. ఉత్తరాది పోలీసులు, కేంద్ర నిఘా వర్గాలకు ‘సుపరిచితుడైన’ ఇతడే ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా(ఎల్ఈటీ) తరఫున పనిచేస్తూ మల్లేపల్లిలో నివసించిన అన్నదమ్ములు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్లతో పాటు ఉత్తరప్రదేశ్కు చెందిన హాజీ, ఖఫీల్ను ఉగ్రవాదులుగా మార్చాడు. వీరి ద్వారానే దర్భంగా ఎక్స్ప్రెస్లో భారీ అగ్ని ప్రమాదం సృష్టించడానికి కుట్రపన్నాడు. జాతీయ దర్యాప్తు సంస్థకు(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్గా మారిన ఇక్బాల్ ఖానా నేపథ్యమిది.. ►ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ సమీపంలో ఉన్న ఖైరానా ప్రాంతానికి చెందిన ఇతడి అసలు పేరు మహ్మద్ ఇక్బాల్ మాలిక్. పుట్టుకతోనే కుడి కంటిలో లోపం ఉండటంతో ఇక్బాల్ ఖానాగా మారాడు. ►ఖైరానా ప్రధాన రహదారిపై కూరగాయల దుకాణం నిర్వహించే ఇక్బాల్కు ఆది నుంచి ధనార్జనపై ఆశ ఎక్కువగా ఉండేది. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి తమ ప్రాంతానికే చెందిన గోల్డ్ స్మగ్లర్ హాజీ అనీస్ ముఠాలో చేరాడు. ►1980 నుంచి బంగారం స్మగ్లింగ్ చేసిన ఈ గ్యాంగ్ 1990లో ఇక్బాల్ చేరిన తర్వాత మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కూడా ప్రారంభించింది. దీంతో ఖైరానా ప్రాంతానికి చెందిన మిగిలిన ముఠాలతో వైరం ఏర్పడింది. ►ఇక్బాల్ 1992లో యూపీలోని సహరన్పూర్కు చెందిన ముస్తారీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. 1993–94లో రెండుసార్లు ప్రత్యర్థి వర్గాలు ఇక్బాల్పై దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేశాయి. ►మరోపక్క పోలీసు నిఘా కూడా ముమ్మరం కావడంతో 1995 జూన్లో పాక్కు మకాం మార్చిన ఇక్బాల్ అక్కడి లాహోర్లో ఉన్న బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందాడు. కొన్నాళ్లకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెల్నీ అక్కడకు రప్పించుకున్నాడు. ►లాహోర్ చేరిన తొలినాళ్లలో ఇక్బాల్ ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడలేదు. అక్కడి యతీంఖానా ప్రాంతంలో నివసించే ఐఎస్ఐ ఏజెంట్ తారిఖ్తో పరిచయం ఏర్పడిన తర్వాత స్మగ్లర్గా మారాడు. ►ఇక్బాల్ నేరచరిత్ర, ఖైరానా ప్రాంతంలో అతడికి ఉన్న పరిచయాలు, భారత్లో ఉన్న నెట్వర్క్ తెలుసుకున్న తారిఖ్ అతడి ద్వారా ఆయుధాలను అక్రమ రవాణా చేయించాడు. వీటిని ఖైరానాలో ఉన్న ఇక్బాల్ గ్యాంగ్ ఉత్తరాదిలో విక్రయించేది. ►1996 నుంచి భారీస్థాయిలో ఆయుధాల సరఫరా స్మగ్లింగ్ చేయాలని తారిఖ్–ఇక్బాల్లు భావించారు. అందుకోసం అప్పట్లో పాకిస్థాన్లో నివసించిన స్విస్ జాతీయుడు క్రిస్టోఫర్ను వాడుకున్నాడు. ►అతడి కార్వ్యాన్లో రహస్య అరలు ఏర్పాటు చేసి వాటిలో ఆయుధాలు మందుగుండు సామాగ్రి నింపారు. ఖర్చుల కోసం రూ.లక్ష ఇచ్చి భారత్కు పంపారు. ఆయుధాల డెలివరీ పూర్తయిన తర్వాత మరో రూ.35 వేల డాలర్లు ఇస్తామన్నారు. ►ఇతగాడిని ఢిల్లీ పోలీసులు 1996 ఫిబ్రవరి 17న అరెస్టు చేసి భారీస్థాయిలో ఆయుధాలు స్వాదీనం చేసుకున్నారు. క్రిస్టోఫర్కు సహకరిస్తున్న హసన్ పోద్దార్ను పట్టుకున్నారు. ►వీరి విచారణలోనే ఇక్బాల్ లాహోర్ కేంద్రంగా చేస్తున్న కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇతగాడు భారత ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్గా మారాడు. 1999 తర్వాత ఐఎస్ఐకి మరింత సన్నిహితంగా మారాడు. ►భారత సైనిక రహస్యాలను అందించడానికి అవసరమైన ఏజెంట్లను రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించాడు. ఇలా ఇతడి కోసం పనిచేస్తున్న ఖైరానావాసి సమయుద్దీన్ 2001 డిసెంబర్లో పట్టుబడ్డాడు. ►ఆ తర్వాత నుంచి భారత్కు నకిలీ కరెన్సీ సరఫరా, చెలామణి కోసం ఐఎస్ఐ ఇక్బాల్ను వాడుకుంది. ఏటా వందల కోట్ల నకిలీ కరెన్సీని తన అనుచరుల ద్వారా చెలామణి చేయించాడు. ► పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐఎస్ఐ ఆదేశాల మేరకు ఇక్బాల్ మాలిక్ నకిలీ కరెన్సీ చెలామణి నుంచి ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ వైపు మారాడు. తాజాగా లష్కరే తొయిబా కోసం కొందరిని రిక్రూట్ చేసి దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు ప్లాన్ చేశాడు. -
అందుకే ‘దర్భంగ బాంబు’ విస్ఫోటనం ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: లాహోర్లోని ఇక్బాల్ ఖానా న్యూస్ పేపర్ వాడమంటే.. నగరంలో నివసిస్తున్న లష్కరేతొయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు అట్టముక్క వినియోగించారు. ఇదే దర్భంగా ఎక్స్ప్రెస్ అగ్నికి ఆహుతి కాకుండా కాపాడింది. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్న ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ అధికారుల విచారణలో ఈ విషయం బయటపెట్టారు. మరోపక్క కేసు దర్యాప్తులో భాగంగా క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం ఇద్దరు ఉగ్రవాదుల్నీ అధికారులు సోమవారం నగరానికి తీసుకువచ్చారు. ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీ తరఫున పని చేస్తున్న ఇక్బాల్ ఖానా ఉత్తరప్రదేశ్కు చెందిన తండ్రీకొడుకులు హాజీ, ఖఫీల్ ద్వారా నగరంలోని మల్లేపల్లిలో నివసిస్తున్న యూపీ వాసులైన అన్నదమ్ములు ఇమ్రాన్, నాసిర్లను రంగంలోకి దింపారు. దర్భంగ ఎక్స్ప్రెస్లో రసాయనాల బాటిల్ ద్వారా విస్ఫోటనం కలిగించి భారీ అగ్ని ప్రమాదం సృష్టించడమే వీరి కుట్ర. దీనికోసం స్థానికంగా లభించే రసాయనాలతోనే బాంబు మాదిరి తయారు చేయాలని అన్నదమ్ములకు ఆదేశాలు జారీ చేశారు. వీరిద్దరు హబీబ్నగర్, చిక్కడపల్లిలోని దుకాణాల నుంచి సల్ఫ్యూరిక్, నైట్రిక్ యాసిడ్స్, పంచదార తదితరాలు ఖరీదు చేశారు. ఈ రసాయనాలతో విస్ఫోటనం ఎలా సృష్టించాలో వివరించే యూ ట్యూబ్ లింకుల్ని షేర్ చేశారు. దర్భంగ ఎక్స్ప్రెస్లో పంపాల్సిన పార్శిల్ ఉంచాల్సిన ‘బాటిల్ బాంబు’ తయారీపై ఇక్బాల్ ఈ అన్నదమ్ములకు సూచనలు చేస్తూనే ఉన్నాడు. ఓ టానిక్ సీసాలో ఈ మూడింటినీ నేర్పుగా, వేర్వేరుగా ఏర్పాటు చేయించాడు. సిడ్స్ను వేరు చేయడానికి మందంగా మడతపెట్టిన న్యూస్ పేపర్ వాడాలంటూ ఇక్బాల్ స్పష్టం చేశాడు. పంచదార కరిగి రసాయనాల్లో కలవడానికి చిన్న సిరంజీతో నీళ్లు ఉంచి చుక్కలు పడేలా ఏర్పాటు చేయాలని సూచించాడు. ‘బాటిల్’ను సిద్ధం చేస్తున్న ఇమ్రాన్, నాసిర్లు ఎన్నిసార్లు ప్రయత్నించినా న్యూస్ పేపర్ ఏర్పాటు చేయడం సాధ్యం కాలేదు. దీంతో మందమైన అట్ట ముక్కను వినియోగించి యాసిడ్స్ను వేరు చేశారు. దీన్ని వ్రస్తాల పార్శిల్ మధ్యలో పెట్టారు. దీంతో ఆ అట్టముక్క పూర్తిగా కరిగి రెండు యాసిడ్స్ కలవడానికి ఎక్కువ సమయం పట్టింది. ఫలితంగా రైలు నడుస్తుండగా కాజీపేట– రామగుండం స్టేషన్ల మధ్య జరగాల్సిన విస్ఫోటనం దర్భంగ స్టేషన్లో పార్శిల్ దింపిన తర్వాత చోటు చేసుకుంది. క్రైమ్ సీన్ రీ–కన్స్ట్రక్షన్ కోసం ఎన్ఐఏ అధికారులు నగరంలో అరెస్టు చేసిన ఇద్దరు ఉగ్రవాదులను సోమవారం ఇక్కడకు తీసుకువచ్చారు. -
భీమా కోరేగావ్ కేసు: స్టాన్ స్వామి కన్నుమూత
ముంబై: ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి సోమవారం మృతి చెందారు. అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేయాలన్న ఆయన విజ్ఞప్తిపై బొంబాయి హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే 84 ఏళ్ల స్వామి ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆదివారం నుంచి ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. కోవిడ్కు చికిత్స పొందుతూ స్టాన్ స్వామి సోమవారం గుండెపోటుతో మృతి చెందారని ఆయన బెయిల్ కేసును విచారిస్తున్న ధర్మాసనానికి స్వామి తరఫు న్యాయవాది మిహిర్ దేశాయి తెలిపారు. దీనిపై జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎన్జే జమాదార్ల ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ వార్తపై స్పందించేందుకు తమకు మాటలు రావడం లేదని, స్టాన్ స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని వ్యాఖ్యానించింది. రోమన్ కేథలిక్ ప్రీస్ట్గా ఉన్న స్టాన్ స్వామి మృతిపై జెస్యూట్ ప్రొవిన్షియల్ ఆఫ్ ఇండియా సంతాపం వ్యక్తం చేసింది. ‘ఆదివాసీలు, దళితులు, అణగారిన వర్గాల కోసం ఆయన జీవితాంతం పోరాడారు. పేదలకు గౌరవప్రదమైన జీవితం లభించాలని పోరాటం చేశారు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. స్టాన్ స్వామి మృతి విషయంలో చికిత్స అందించిన ఆసుపత్రిపై కానీ, బెయిల్ కేసు విచారణ జరుపుతున్న కోర్టుపై కానీ తమకెలాంటి ఫిర్యాదులు లేవని చెప్పగలమని.. అయితే, ఎల్గార్ పరిషత్ కేసును విచారిస్తున్న ఎన్ఐఏపై, జైలు అధికారులపై మాత్రం అలా చెప్పలేమని న్యాయవాది మిహిర్ దేశాయి ధర్మాసనంతో వ్యాఖ్యానించారు. స్వామికి సరైన సమయంలో వైద్య సదుపాయం కల్పించే విషయంలో ఎన్ఐఏ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. విచారణ ఖైదీ అయిన తన క్లయింట్ స్వామి మృతికి దారితీసిన కారణాలపై హైకోర్టు న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి 10 రోజుల ముందు స్వామిని జేజే ఆసుపత్రికి తీసుకువెళ్లారని, కానీ, ఆయనకు అక్కడ కోవిడ్ నిర్ధారణ పరీక్ష జరపలేదని కోర్టుకు వివరించారు. ఆ తరువాత హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో పరీక్షించగా, కోవిడ్ నిర్ధారణ అయిందన్నారు. స్టాన్ స్వామికి బెయిల్ మంజూరు చేయడాన్ని ప్రతీసారి ఎన్ఐఏ వ్యతిరేకించిందని, కానీ, ఒక్కరోజు కూడా ఆయనను విచారించడానికి కస్టడీకి తీసుకోలేదని ఆరోపించారు. విచారణ ఖైదీగా ఉన్న సమయంలోనే స్టాన్ స్వామి మరణించినందువల్ల, ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం అధికారులు ఆయనకు పోస్ట్మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాగా, న్యాయ విచారణకు హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం స్టాన్ స్వామి అంత్యక్రియలు ముంబైలో జరుగుతాయని కోర్టు తెలిపింది. ఎల్గార్ పరిషత్– మావోయిస్ట్ సంబంధాలకు సంబంధించిన కేసులో, కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద 2020 అక్టోబర్ నుంచి స్వామిని విచారణ ఖైదీగా మొదట తలోజా జైళ్లో నిర్బంధించారు. మొదట అక్కడి ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. అనంతరం, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మే నెలలో హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, జేజే ఆసుపత్రిలో తనను చేర్చడాన్ని స్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. ఫాదర్ స్టాన్ స్వామి మృతికి నా హృదయపూర్వక నివాళులు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీ హత్యను మోదీ, షా విజయవంతంగా ముగించారు. ఆయనకు బెయిల్ నిరాకరించిన జడ్జీలు ఇక రాత్రులు నిద్ర పోలేరనుకుంటా. వారికీ ఈ హత్యలో భాగం ఉంది’ అని సీపీఐఎంల్ పొలిట్బ్యూరో మెంబర్ కవిత కృష్ణన్ ట్వీట్ చేశారు. స్టాన్ స్వామి విషయంలో ఎన్ఐఏ వ్యవహరించిన తీరుపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. పార్కిన్సన్ వ్యాధితో బాధపడ్తున్న తనకు జైలులో ఆహారం తీసుకోవడానికి వీలుగా ఒక సిప్పర్ను, స్ట్రాను ఇవ్వాలని ఎన్ఐఏను ఆదేశించాలని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు స్వామి మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నారు. స్వామి చేసిన ఆ చిన్న అభ్యర్థనపై స్పందించడానికి ఎన్ఐఏ 4 వారాల గడువు కోరింది. అయితే, ఆ తరువాత స్వామికి సిప్పర్, స్ట్రాతో పాటు, వీల్ చెయిర్ను, చేతికర్రను, వాకర్ను, ఇద్దరు సహాయకులను సమకూర్చామని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ఆదివాసీల కోసం 30 ఏళ్ల పోరాటం ఫాదర్ స్టాన్ స్వామి పూర్తి పేరు స్టానిస్లాస్ లూర్దుసామి. జార్ఖండ్లో ఆదివాసీలు, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవిత పర్యంతం ఆయన కృషి చేశారు. నక్సలైట్లను ముద్రవేసి అక్రమంగా జైళ్లో మగ్గుతున్న ఆదివాసీల దుస్థితిపై ఆయన ఒక పరిశోధన గ్రంథం రాశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని తమపై తప్పుడు ఆరోపణలతో జైల్లో పెట్టారని దాదాపు 97 శాతం విచారణ ఖైదీలు తనతో చెప్పినట్లు స్వామి అందులో పేర్కొన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన 3దశాబ్దాల పాటు కృషి చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో 1937లో ఆయన జన్మించారు. ‘జంషెడ్పూర్ ప్రావిన్స్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ జీసస్’లో చేరి, ప్రీస్ట్గా మారారు. 1970లలోనే యూనివర్సిటీ ఆఫ్ మనీలాలో సోషియాలజీలో పీజీ చేశారు. బ్రసెల్స్లో చదువుకుంటున్న సమయంలో బ్రెజిల్లోని పేదల కోసం కృషి చేస్తున్న ఆర్చ్ బిషప్ హోల్డర్ కామరా సేవలు ఆయనను అమితంగా ఆకర్షించాయి. 1975 నుంచి 1986 వరకు బెంగళూరులోని ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్కు డైరెక్టర్గా పనిచేశారు. 30 ఏళ్లుగా జార్ఖండ్ గిరిజనుల కోసం పనిచేస్తున్నారు. వారి భూములను అభివృద్ధి పేరుతో డ్యాములు, గనులు, టౌన్షిప్ల కోసం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేశారు. నక్సలైట్లతో సంబంధాలున్నాయన్న తప్పుడు ఆరోపణలతో జైళ్లలో మగ్గుతున్న గిరిజన యువత విడుదలకి కృషి చేశారు. కేన్సర్తో, పార్కిన్సన్ వ్యాధితో బాధపడ్తున్న స్టాన్ స్వామిని, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత అక్టోబర్ 8న రాంచిలో అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. -
దర్భంగా కేసు : హైదరాబాద్ కేంద్రంగా ఎన్ఐఏ విచారణ
సాక్షి, హైదరాబాద్: దర్భంగ రైల్వే స్టేషన్లో జరిగిన విస్ఫోటం కేసులో హైదరాబాద్ కేంద్రంగా విచారణ కొనసాగనుంది. నలుగురు ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్, హాజీ సలీం, ఖాఫిల్ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కస్టడీలోకి తీసుకున్నారు. ఈనెల 9 వరకు ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్ఐఏ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ కేంద్రంగా బాంబు తయారుచేసిన నేపథ్యంలో.. హైదరాబాద్ నుంచే ఎన్ఐఏ విచారణ చేపట్టనుంది. బాంబు తయారీ, అమర్చిన తీరుపై ఎన్ఐఏ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ రెండ్రోజుల్లో నిందితులను హైదరాబాద్కు తీసుకురానుంది. ఇప్పటికే ఢిల్లీ ఎన్ఐఏ బృందం హైదరాబాద్కు చేరుకుంది. -
దర్భంగ పేలుడు: తండ్రికి తగని కుమారులు!
సాక్షి, సిటీబ్యూరో: దర్భంగ రైల్వే స్టేషన్లో జరిగిన విస్ఫోటం కేసులో అరెస్టు అయిన లష్కరేతొయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్లు తండ్రికి తగని కుమారులని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. వీరి తండ్రి మూసా ఖాన్ ఆర్మీలో పనిచేసి చైనాపై పోరాడగా.. ఈ ద్వయం హైదరాబాద్లో ఉండి పాకిస్థాన్ కోసం పని చేశారని వివరిస్తున్నారు. ఈ ఇద్దరు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శుక్రవారం పట్నాలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో పట్నా సెంట్రల్ జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. 1962 యుద్థంలో పాల్గొన్న మూసా... ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లా ఖైరానానగర్లో ఉన్న మొహల్లా ఖయాస్తవాడ ప్రాంతానికి చెందిన మూసా ఖాన్ది వ్యవసాయ కుటుంబం. చిన్న వయస్సులోనే ఆర్మీలో సైనికుడిగా చేరిన మూసా 1962లో జరిగిన ఇండో–చైనా యుద్ధంలో పాల్గొన్నాడు. భారత సైనికుల తరఫున కీలకపాత్ర పోషించిన ఈయన ఆ యుద్ధం తర్వాత పదవీ విరమణ పొందారు. ఆపై ఖైరానానగర్లోనే వంట సామాగ్రి విక్రయించే దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. తన కుమారులను లష్కరేతొయిబా ఉగ్రవాదులుగా ఆరోపిస్తూ ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారనే విషయం మీడియా వచ్చిన బుధవారం నుంచి ఇల్లు, దుకాణానికి తాళం వేసిన మూసా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. ఉగ్రవాదులు, సికింద్రాబాద్ స్టేషన్ వద్ద కారు నుంచి పార్శిల్ దింపుతున్న సీసీ టీవీ ఫుటేజ్ అటు ఉగ్రవాదులు..ఇటు మాఫియా... రెండు నెలల క్రితం వరకు ఇమ్రాన్ ఖాన్ తండ్రి దుకాణంలోనే ఉంటూ ఆ వ్యాపారంలోనే ఉంటూ సహకరించాడు. కొన్నాళ్ల క్రితం ఇతడికి పాకిస్థాన్లో ఉంటున్న ఇక్బాల్ ఖానాతో పరిచయమైంది. కొన్నేళ్లుగా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం పని చేస్తున్న ఇతగాడు భారత్ ఏజెన్సీలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన ఇక్బాల్పై నకిలీ నోట్ల సరఫరా, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించడం వంటి అనేక కేసు లు నమోదై ఉన్నాయి. ఇతడి ఆదేశాలతో 2012లో తన బంధువుల వద్దకు వెళ్తున్నట్లు వీసా తీసుకున్న ఇమ్రాన్ పాకిస్థాన్కు వెళ్లాడు. అక్కడి ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఎల్ఈటీ ట్రైనింగ్ క్యాంప్లో నాలుగు నెలల పాటు ఉగ్రవాద శిక్షణ పొందాడు. ఖైరానాలో జరిగిన కుట్ర... దర్భంగ విస్ఫోటనానికి సంబంధించిన కుట్ర ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్ధారించింది. ఉత్తరప్రదేశ్లోని ఖైరానాలో ఉన్న లష్కరేతొయిబా ఉగ్రవాది మహ్మద్ సలీం అహ్మద్ అలియాస్ హాజీ సలీం ఇంట్లో సమావేశమైన ఉగ్రవాదులు ఈ మేరకు కుట్ర చేశారు. ఈ మీటింగ్లో హాజీతో పాటు అతడి కుమారుడు ఖఫీల్, నగరం నుంచి వెళ్లిన ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ పాల్గొన్నారు. కదిలే రైలుకు మంటలు అంటుకునేలా చేస్తే అది ఆగేలోపే భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలు ఉంటాయని ఇలా చేశారని ఎన్ఐఏ పేర్కొంది. పాకిస్థాన్లో ఉండి కథ నడుపుతున్న ఇక్బాల్ ఖానాకు ప్రధాన అనుచరుడిగా ఉన్న హాజీనే ‘దర్భంగ కుట్ర’కు సూత్రధారని స్పష్టమైంది. ఇక్బాల్ నుంచి హాజీకి రూ.1.6 లక్షలు కోల్తాలోని హవాలా వ్యాపారి ద్వారా అందినట్లు దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. దాదాపు వారం రోజులుగా బీహార్ ఏటీఎస్ కస్టడీలో ఉన్న హాజీ, ఖఫీల్లను అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. చదవండి: ఫ్యాషన్ డిజైనింగ్ ముసుగులో వ్యభిచారం.. బిల్ కలెక్టర్ బాగోతం -
దర్భంగ పేలుడు: హైదరాబాదే.. ఎందుకు?
సాక్షి, సిటీబ్యూరో: దర్భంగ ఎక్స్ప్రెస్ దహనానికి కుట్ర పన్నిన ఉగ్రవాదులు స్థానికంగా లభించే పదార్థాలతోనే ‘బాంబు’ తయారు చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నిర్ధారించింది. హబీబ్నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లోని దుకాణాల నుంచి ఖరీదు చేసిన సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, పంచదార వినియోగించే దాన్ని తయారు చేసినట్లు తేల్చారు. వాస్తవానికి ఇది బాంబు కాదని మండుతూ చుట్టూ మంటలు వ్యాపించేలా డిజైన్ చేసినట్లు దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లా ఖైరాన ప్రాంతానికి చెందిన నాసిర్ మాలిక్ దాదాపు 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి మల్లేపల్లిలోని భారత్ గ్రౌండ్స్ సమీపంలో ఉన్న ఓ ఇంటి మొదటి అంతస్తులో నివసిస్తున్నాడు. ఇక్కడి యువతినే వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. ఇతడి సోదరుడైన ఇమ్రాన్ మాలిక్ తమ స్వస్థలంలోనే ఉండేవాడు. ఖైరాన ప్రాంతానికే చెందిన మహ్మద్ ఇక్బాల్ ఖానా అలియాజ్ హఫీజ్ ఇక్బాల్ అలియాస్ మాలిక్ భాయ్ 1993 నుంచి నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నాడు. ఇతడిపై సీబీఐ, ఢిల్లీ పోలీసు సహా అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో పాకిస్థాన్లో ఉంటున్నాడు. అక్కడ ఉంటూనే ఐఎస్ఐ సహకారంతో నకిలీ నోట్ల చెలామణితో పాటు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇక్బాలే కొన్నాళ్ల క్రితం ఆన్లైన్ ద్వారా ఇమ్రాన్ను ఉగ్రవాదం వైపు ఆకర్షించాడు. యూట్యూబ్లో లింకులు షేర్.. స్థానికంగా దొరికే పదార్థాలతో వివిధ రకాల పేలుళ్లు సృష్టించడం ఎలా? అగ్ని ప్రమాదాలు జరిగేలా చేయడం ఎలా? తదితర అంశాలపై ఆన్లైన్లో శిక్షణ ఇస్తూ యూట్యూబ్లో ఉన్న కొన్ని వీడియోల లింకులూ షేర్ చేశాడు. దర్భంగ ఎక్స్ప్రెస్ను దహనం చేయాలనే కుట్రతో దాదాపు 15 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన ఇమ్రాన్ తన సోదరుడు నాసిర్ వద్ద ఆశ్రయం పొందాడు. చిక్కడపల్లి, హబీబ్ నగర్ల్లోని వివిధ దుకాణాల నుంచి సేకరించిన సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, పంచదార వినియోగించి మంటలు సృష్టించే బాంబు వంటివి తయారు చేశాడు. పాక్ నుంచి సూచనలు.. ఇంట్లోనే ఇమ్రాన్, నాసిర్లు రెండు మూడింటిని తయారు చేసి మండించి చూశారు. దీనికి సంబంధించిన సూచనల్ని పాక్ నుంచి ఇక్బాల్ ఖానా ఇస్తూనే ఉన్నాడు. ఇంట్లో ప్రయోగం సక్సెస్ అయిన విషయం తెలుసుకున్న ఇక్బాల్ ఓ టానిక్ సీసాలో ఈ మూడింటినీ నేర్పుగా ఏర్పాటు చేయించాడు. పేపర్, ఇంజెక్షన్ సిరంజ్లతో చేసిన ఏర్పాటు కారణంగా గరిష్టంగా 16 గంటల్లో ఈ మూడు కలిసి మంటలు చెలరేగేటా ప్లాన్ చేశారు. అయితే ఇమ్రాన్, నాసిర్లు 50 మిల్లీ లీటర్ల పరిమాణంలో తయారు చేసిన దాన్ని పక్కాగా రూపొందించలేకపోయారు. ఫలితంగా ఆ సీసాలో ఉన్న రసాయనాలు బయటకు కారడంతో పాటు దర్భంగ రైల్వేస్టేషన్లో ఆ పార్శిల్ దింపిన కూలీ కింద పడేస్తే కానీ మంటలు అంటుకోలేదు. సికింద్రాబాద్లో పార్శిల్ ఆఫీస్లో ఈ అన్నదమ్ములు మహ్మద్ సూఫియాన్ పేరుతో ఇచ్చిన పాన్ కార్డు కాపీ సైతం ఇక్బాల్ వాట్సాప్ ద్వారా షేర్ చేశాడని ఎన్ఐఏ గుర్తించింది. ఈ కేసులో ఇమ్రాన్ను ప్రధాన నిందితుడిగా(ఏ1), నాసిర్ను రెండో నిందితుడిగా(ఏ2) చేర్చిన ఎన్ఐఏ వీరితో సంప్రదింపులు జరిపిన ఖైరాన వాసులు హాజీ సలీం, మహ్మద్ ఖాఫిల్ను మిగిలిన నిందితులుగా చేర్చాలని నిర్ణయించింది. ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల అరెస్టు బిహార్ రాష్ట్రం దర్బంగ రైల్వే స్టేషన్లో జరిగిన పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ముందడుగు వేసింది. ఘటనకు కారణమైన ఇద్దరు లష్కర్–ఎ–తోయిబా ఉగ్రవాదులను అరెస్టు చేసింది. యూపీలోని శాలినీ జిల్లాకు చెందిన ఇమ్రాన్ మాలిక్ అలియాస్ ఇమ్రాన్ఖాన్, నజీర్ ఖాన్ అలియాస్ నజీర్ మాలిక్ ప్రస్తుతం నాంపల్లిలో నివసిస్తున్నారు. ఈ నెల17న దర్బాంగా రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నంబరు 1లోని ఓ పార్సిల్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి ముజఫర్ నగర్ జిల్లా, దర్బంగా రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పార్సిల్ సికింద్రాబాద్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. ఈ కేసులో ఉగ్రకోణాలు బయటపడటంతో కేసును ఈ నెల 24న ఎన్ఐఏకి అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ లష్కర్–ఎ–తోయిబా దేశవ్యాప్తంగా పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిందని గుర్తించింది. పాకిస్తాన్ హండ్లర్ల ఆదేశాల మేరకు నజీర్ అతని సోదరుడు ఇమ్రాన్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) ఈ పేలుడుకు ప్లాన్ చేశారని నిర్ధారించారు. దుబాయ్ ఎందుకు వెళ్లారో..? ఈ నలుగురూ కలిసి 2016లో దుబాయ్ వెళ్లారని గుర్తించిన దర్యాప్తు అధికారులు అది ఎందుకన్నది ఆరా తీస్తున్నారు. ఇమ్రాన్, నాసిర్లను ఎన్ఐఏ అధికారులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పీటీ వారెంట్పై బీహార్లోని పాట్నా ఎన్ఐఏ కోర్టులో హాజరుపర్చేందుకు వారిని ఇక్కడి నుంచి తరలించారు. ఇక్బాల్ ఖానా సైతం ఖైరానలో ఉండగా వస్త్ర వ్యాపారం చేసే వారు. ఇలానే ఇతడికి ఇమ్రాన్తో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. హైదరాబాదే.. ఎందుకు? ఒకవేళ వీరు భారీ విధ్వంసానికి పాల్పడే క్రమంలో దీన్ని ఒక ట్రయల్గా ఈ పేలుడుకు పాల్పడ్డారా? అన్న కోణంలోనూ ఎన్ఐఏ ఆరా తీస్తోంది. పాకిస్తాన్ నుంచి పక్కాగా ఆదేశాలు అందాయి. నిందితులిద్దరూ ఇందుకోసం ఎన్క్రిప్టెడ్ సౌకర్యం ఉన్న అనేక రకాల సామాజిక మాధ్యమాలను వినియోగించారు. మొత్తానికి టెర్రర్ మాడ్యుల్ను పక్కాగా అమలు చేశారు. అయితే హైదరాబాద్లో అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా ఉన్నందున ఎలాంటి నేరం జరిగినా నిందితులు కేవలం 24 గంటల్లో దొరికిపోతారు. ఈ విషయం నేరస్తులకు తెలుసు. అలాంటిది చిన్నపాటి పేలుడుకు కుట్ర పన్నినా.. పోలీసులు వెదుక్కుంటూ వస్తారన్న విషయం మాత్రం విస్మరిస్తారా? లేక వీరు మరేదైనా ప్లాన్ అమలు చేసే క్రమంలో దర్యాప్తు సంస్థల దృష్టిని మరల్చేందుకు ఈ పేలుడుకు పాల్పడ్డారా? అన్న కోణంలో ఎన్ఐఏ ఆరా తీస్తోంది. చదవండి: జూబ్లీహిల్స్: లైసెన్స్డ్ గన్కు పని చెప్పమంటావా..? -
దర్బాంగా ఎక్స్ప్రెస్ పేలుడు కేసులో ఉగ్రకుట్ర
-
దర్బంగా పేలుడు కేసులో కీలక మలుపు
-
ఇజ్రాయెల్ ఎంబసీ పేలుడు; ఎన్ఐఏ అదుపులో నలుగురు
ఢిల్లీ: ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద చోటుచేసుకున్న పేలుడు కేసులో నలుగురు యువకులను ఎన్ఐఏ గురువారం అదుపులోకి తీసుకుంది. కాగా జనవరి 29న ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. హై సెక్యూరిటీ జోన్లోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులో సంభవించిన ఈ ఘటనలో అప్పట్లో ఎవరు గాయపడలేదు. కాగా ఆరోజు సాయంత్రం 5 గంటల సమయంలో దౌత్య కార్యాలయం సమీపంలోని ఓ పూలకుండీలో ఉంచిన ఐఈడీ పేలింది. దాని తీవ్రతకు దగ్గర్లో పార్కు చేసిన మూడు కార్ల అద్దాలు మాత్రం పగిలిపోయాయి. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు.. ప్రశ్నల వర్షం
ముంబై: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంబానీ ఇల్లు ఎంటిలియా ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసులో ఇవాళ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మాజీ పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా గుర్తింపు పొందిన ప్రదీప్ శర్మ ఇంట్లో ఆరుగంటలపాటు సోదాలు చేపట్టి.. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. అంధేరీలోని ప్రదీప్ శర్మ ఇంట్లో గురువారం ఉదయం ఎన్ఐఎతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది తనీఖీలు చేపట్టారు. ఉదయం ఐదుగంటల నుంచి సుమారు ఆరుగంటలపాటు ఈ సోదాలు కొనసాగినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రదీప్పై పశ్నల వర్షం కురిపించింది ఎన్ఐఏ. ఇక ఈ కేసులో షీలర్ అనే అనుమానితుడితో శర్మ గతంలో దిగిన ఫోటోలు బయటకు రావడంతో ఆయనపై దర్యాప్తు ప్రారంభించారు. షీలర్ గతంలో పోలీసు ఇన్ఫార్మర్గా పని చేశాడని, అయినా రోజూ తనతో ఎంతో మంది ఫొటోలు దిగుతారని ప్రదీప్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో శర్మను ఏప్రిల్లోనే ఓసారి ప్రశ్నించారు కూడా. వాజే గురువు ఇక మన్సుక్ హిరేన్ మృతి కేసులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయన్న ఉద్దేశంతోనే శర్మ ఇంట్లో సోదాలు చేపట్టినట్లు ఓ అధికారి చెప్పారు. ఇక ఈ కేసులో ఎన్ఐఎ కస్టడీలో ఉన్న మాజీ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేకు, శర్మ గురువులాంటోడు. ముకేశ్ అంబానీ ఇంటి ముందు వాహనంలో దొరికిన 20 జెలిటిన్ స్టిక్స్ను ప్రదీప్ శర్మ ద్వారనే తెప్పించినట్లు వాజే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ కేసుతో పాటు వ్యాపారవేత్త మన్సుక్ హిరేన్ మృతి కేసులోనూ వాజే అనుమానితుడిగా ఉన్నారు. కాగా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరున్న ప్రదీప్ శర్మపై 2006లో లఖన్ భయ్యా ఎన్కౌంటర్, అందులో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్కు సాయం చేశారన్న ఆరోపణలు రావటంతో వేటు పడింది. 2017లో తిరిగి విధుల్లోకి వచ్చిన ఆయన.. 2019లో ప్రదీప్ శర్మ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశారు. శివసేనలో చేరి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తన పేరుమీద ఓ ఎన్జీవో నడుపుతున్నారు 59 ఏళ్ల ప్రదీప్. చదవండి: రియల్ అబ్ తక్ చప్పన్: పాతికేళ్ల సర్వీస్. 100 ఎన్కౌంటర్లు -
గోల్డ్ స్కామ్లో కీలక మలుపు: ప్రధాన సూత్రధారి అరెస్ట్
తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించిన బంగారం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఆ స్కామ్లో సూత్రధారిగా ఉన్న మహమ్మద్ మన్సూర్ను జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించి విచారణ ముమ్మరంగా సాగే అవకాశం ఉంది. ఈ బంగారం కుంభకోణం కేరళ రాజకీయంతో ముడిపడి ఉండడంతో ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే అతడిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ అనంతరం మహమ్మద్ మన్సూర్ను కొచ్చిలోని ఎన్ఐఏ కోర్టులో అధికారులు హాజరుపరిచారు. మన్సూర్ను 5 రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. 2020 జూలై 5వ తేదీన త్రివేండ్రం విమానాశ్రయంలో 30 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మన్సూర్ దుబాయ్ నుంచి కుంభకోణం మొత్తం నడిపాడని పోలీస్ అధికారులు తెలిపారు. ఇతర నిందితులతో కలిసి బంగారాన్ని భారత్కు తెచ్చేందుకు మన్సూర్ ప్రణాళిక రచించాడని వెల్లడించారు. తిరువననంతపురంలో ఉన్న యూఏఈ కాన్సులేట్ చిరునామాకు కార్గో ద్వారా బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అరెస్టయిన మన్సూర్ ఏం వివరాలు వెల్లడిస్తాడో.. ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోనని కేరళలో హాట్ టాపిక్ కొనసాగుతోంది. -
సీఆర్పీఎఫ్ డీజీకి ఎన్ఐఏ బాధ్యతలు
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ చీఫ్ కుల్దీప్ సింగ్కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలను కూడా అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్ఐఏ డీజీగా ఉన్న వైసీ మోదీ సోమవారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శనివారం కుల్దీప్సింగ్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగిస్తూ అదేశాలు వెలువడ్డాయి. కుల్దీప్ సింగ్ 1986 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన పశ్చిమబెంగాల్ కేడర్ అధికారి. ప్రస్తుతం ఆయన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తదుపరి చీఫ్ నియామకం వరకు కుల్దీప్ ఎన్ఐఏ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని హోంశాఖ స్పష్టం చేసింది. పదవీ విరమణ చేయనున్న మోదీ 1984 ఐపీఎస్ బ్యాచ్ అస్సాం–మేఘాలయ కేడర్ అధికారి. (చదవండి: MK Stalin: అనాథ బాలలకు రూ.5 లక్షల సాయం) -
మధురైలో ఎన్ఐఏ సోదాల కలకలం
సాక్షి ప్రతినిధి, చెన్నై: కేరళ నుంచి వచ్చిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు మధురైలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇద్దరు తీవ్రవాద అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. శ్రీలంక చర్చిలో మూడేళ్ల క్రితం జరిగిన మారణహోమంలో తమిళనాడుకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందని భారత్కు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు లోతుగా విచారణ చేపట్టగా తమిళనాడు పాత్రను గుర్తించారు. అనాటి నుంచి తమిళనాడులోని అనుమానితులపై నిఘాపెట్టారు. ఫేస్బుక్లో సందేహాస్పద పోస్టింగ్లను గమనించిన మధురై పోలీసులు అదే ప్రాంతానికి చెందిన సెంథిల్కుమార్ అలియాస్ మహమ్మద్ ఇక్బాల్కు తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉండవచ్చని అనుమానించి గతంలో కేసు పెట్టారు. ఈ కేసు ఏప్రిల్లో ఎన్ఐఏకు బదిలీకాగానే ఇక్బాల్ను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, కేరళ నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మధురై కాజీమర్ వీధి, కే పుత్తూరు, పెత్తానియాపురం, మగప్పాళయం తదితర ప్రాంతాల్లో ఇక్బాల్ అతని స్నేహితుల ఇళ్లలో మధ్యాహ్నం 1 గంట వరకు తనీఖీలు సాగాయి. ఇక్బాల్ ఇంటి నుంచి పెన్ డ్రైవ్, సిమ్కార్డు సహా 16 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక తిరుప్పూరుకు చెందిన ఒక యువకుడు ఇక్బాల్తో ఎక్కువసేపు వాట్సాప్లో చాటింగ్ చేసిన విషయం బయటపడింది. సుమారు 8 గంటలపాటూ ఆ యువకుడిని విచారించి విడిచిపెట్టారు. (చదవండి: Covid-19: తలైవా విరాళం రూ. 50 లక్షలు) -
ఎన్ఐఏ ఏజెంట్గా పరిణీతి చోప్రా
ఏజెంట్గా ఓ కోవర్ట్ ఆపరేషన్ ప్లాన్ చేశారు బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా. ఈ ఆపరేషన్ త్వరలోనే స్టార్ట్ కానుంది. దర్శకుడు రిబుదాస్ గుప్తా, హీరోయిన్ పరిణీతి చోప్రా కాంబినేషన్లో ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమాకు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా పరిణీతి, రిబు కాంబినేషన్లో మరో సినిమా సెట్స్పైకి వెళ్లనుందని బాలీవుడ్ తాజా సమాచారం. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పరిణీతి ఎన్ఐఏ ఏజెంట్ పాత్రలో కనిపిస్తారట. ఓ కోవర్ట్ ఆపరేషన్తో దోషులను చట్టానికి అప్పగిస్తారట. మరి... ఈ ఆపరేషన్ను పరిణీతి ఎలా డీల్ చేశారన్నది తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే. చదవండి: నన్ను వజ్రాల నెక్లెస్తో అలంకరించినందుకు థ్యాంక్స్: సన్నీలియోన్ కంగనాను అలా చూసి నిర్ఘాంతపోయిన వృద్ధురాలు.. -
చత్తీస్గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ హిడ్మా
-
చత్తీస్గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ హిడ్మా
రాయ్పూర్: చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపుర్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శనివారం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరుకుంది. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు జవాన్లపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గల్లంతైన ఏడుగురు జవాన్ల కోసం రెండు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బీజాపూర్ ఘటనకు ప్రధాన సూత్రధారైన హిడ్మాపై తెలంగాణ, చత్తీసగఢ్, ఒడిశా ప్రభుత్వాలు 50 లక్షల రివార్డు ప్రకటించాయి. ఎన్కౌంటర్లో మృతి చెందిన మహిళా మావోయిస్టును మడివి. వనజగా గుర్తించారు. ఆమె వద్ద నుంచి పోలీసులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టు, ఇన్సాస్ ఆయుధం స్వాధీనం చేసుకున్నారు. తెర్రం ప్రాంత గుట్టలపై బాగా పట్టున్న మావోలు.. హిడ్మా అక్కడే ఉన్నాడని పోలీసులు నమ్మేలా చేశారు. అతడిని పట్టుకునేందకు వెళ్లిన దళాలు అతడి వ్యూహంలో చిక్కుకున్నాయి. అనంతరం భద్రతా దళాలను హిడ్మా కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. గతంలో కసాపాల్, మినపా ఘటనలకు హిడ్మానే నాయత్వం వహించాడు. ఎవరీ హిడ్మా.. హిడ్మా అలియాస్ హిడ్మాన్న(40) సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామానికి చెందిన గిరిజనుడు. 90వ దశకంలో తిరుగుబాటుదారులతో చేతులు కలిపాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్జిఎ) బెటాలియన్ నంబర్1కి నాయకత్వం వహిస్తున్నాడు. భయంకరమైన, ఘోరమైన ఆకస్మిక దాడులు చేయడంలో హిడ్మా దిట్ట. ప్రస్తుతం మహిళలతో సహా 180-250 మంది మావోయిస్టుల దళానికి అతడు నాయకత్వం వహిస్తున్నాడు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీలో (డీకేఎస్జడ్) లోనే కాక సీపీఐ(ఎం) 21 సుప్రీం మెంబర్ సెంట్రల్ కమిటీలో కూడా హిడ్మా సభ్యుడు. అనధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుతం అతడిని సెంట్రల్ మిలిటరీ కమిషన్కు చీఫ్గా నియమించినట్లు తెలిసింది. భీమ్ మాండవి హత్యా నేరంలో ఎన్ఐఏ హిడ్మాపై చార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఎలా దాడి చేస్తారంటే.. ప్రతి ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో మావోయిస్టులు భద్రతా దళాలను టార్గెట్ చేసుకుని వ్యూహాత్మక ఎదురు దాడి (కౌంటర్ ఆఫెన్సివ్ కాంపెయిన్(టీసీఓసీ) అంబుష్ ఆపరేషన్ (ఎరవేసి చుట్టుముట్టి దాడి చేయడం)లను నిర్వహిస్తారు. ఈ కాలాన్నే ఎందుకు ఎన్నుకుంటారంటే.. ఈ సీజన్లో చెట్లు ఆకులు రాలి మోడులుగా మారడంతో భద్రతా దళాల కదలికలు బాగా కనిపిస్తాయి. అందుకే మావోయిస్టులు ఎక్కువగా ఈ సీజన్లో ఎదురుదాడులకు దిగుతారు. నేడు చత్తీస్గఢ్కు అమిత్ షా.. మావోయిస్టుల దాడుల నేపథ్యంలో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చత్తీస్గఢ్కు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం ఉ.10.30 గంటలకు జగదల్పూర్కు వెళ్లి.. అమరులైన జవాన్లకు అమిత్ షా నివాళులర్పించనున్నారు. అనంతరం అధికారులతో సమావేశం అయ్యి పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం అమిత్ షా రాయ్పూర్లో చికిత్సపొందుతున్న జవాన్లను పరామర్శించనున్నారు. చదవండి: మావోయిస్టుల కాల్పులు: పెళ్లి ముచ్చట తీరకుండానే -
సచిన్వాజే కేసులో వెలుగులోకి కొత్త కొత్త అంశాలు
ముంబై: అంబానీ ఇంటిముందు పేలుడు పదార్ధాల కేసులో అరెస్టయిన పోలీసు అధికారి సచిన్వాజే విషయంలో కొత్త కొత్త అంశాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేసిన ఐదు రోజుల అనంతరం ఆయన జాయింట్ అకౌంట్ నుంచి రూ.26.50 లక్షలు విత్డ్రా అయినట్లు ఎన్ఐఏ కోర్టుకు వెల్లడించింది. జాయింట్ అకౌంట్లో వాజేతో పాటు మరో వ్యక్తి ఉన్నారని, వీరికి సంబంధించిన జాయింట్ లాకర్ నుంచి నేరపూర్వక సామగ్రిని సైతం ఎవరో బయటకు తీసుకువెళ్లారని ఎన్ఐఏ తెలిపింది. కేసులో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని, వీటిని అధ్యయనం చేసేందుకు సమయం కావాలని ఎన్ఐఏ కోరడంతో వాజే కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 7వరకు పొడిగించింది. హిరేన్ మృతదేహం కనుగొనే ముందు రోజు వాజే ఆ ప్రాంతంలో కనిపించారని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. అలాగే ముంబైలో ఒక బార్ నుంచి వాజేకు పెద్ద మొత్తంలో నగదు అందిందంటూ పేర్కొన్న ఒక డైరీని కూడా స్వాదీనం చేసుకున్నట్లు తెలిపింది. వాజే ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి పాస్పోర్ట్ ఒకటి లభ్యమైందని, అతనెవరో గుర్తించే వరకు వాజే కస్టడి పొడిగించాలని కోరింది. అయితే ఎన్ఐఏ అభ్యర్ధనను ఆమోదించవద్దంటూ వాజే లాయర్ కోర్టును కోరారు. వాజేను ఉపా కింద కస్టడీలో ఉంచేందుకు ఎన్ఐఏ ఒక్క సరైన కారణం చూపలేదన్నారు. జాయింట్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ను చూపాలని ఆయన డిమాండ్ చేయగా, ఎన్ఐఏ నిరాకరించింది. ఎన్ఐఏ కావాలనే కొన్ని పరికరాలను నదిలో వేసి తన క్లయింట్పై ఆరోపణలు చేస్తోందని న్యాయవాది వాదించారు. మరోవైపు తనకు గుండె నొప్పి ఉందని కార్డియాలజిస్టుకు చూపాలని వాజే కోర్టును కోరారు. కానీ ఆయన గుండె మాములుగానే పనిచేస్తోందని తమ డయాగ్నోసిస్లో తేలినట్లు ఎన్ఐఏ తెలిపింద. వాదనలు విన్న కోర్టు వాజే కస్టడీని 7వరకు పొడిగించింది. చదవండి: మావోయిస్టుల కాల్పులు: దద్దరిల్లిన దండకారణ్యం -
సచిన్వాజేకు మరోసారి ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం రేపిన వివాదంలో సస్పెండైన పోలీసు అధికారి, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజే చుట్టూ అల్లుకున్న ఉచ్చు మరింత బిగిస్తోంది. తాజాగా ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజే కస్టడీని ఏప్రిల్ 7వ తేదీవరకు పొడగించింది. అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో పట్టుబడిన వాహనం స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మృతి కేసులో వాజే ఎన్ఐఏ అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్ఐఏ విచారణలో షాకింగ్ విషయాలు ఈ కేసులో సచిన్ వాజే ప్రమేయం ఉందని గుర్తించిన ఎన్ఐఏ వాజేను మార్చి 13 న అరెస్టు చేసింది. ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది ఎన్ఐఏ. ముఖ్యంగా ముంబైలోని నారిమన్ పాయింట్ ఫైవ్ స్టార్ హోటల్ లోని ఓ గదిని తన కోసం 100 రోజుల పాటు ఒక వ్యాపారవేత్త చేత 12 లక్షల వ్యయంతో బుక్ చేసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ తెలిపింది. నకిలీ ఆధార్ కార్డుతో స్టార్ హోటల్లో సదరు వ్యాపారవేత్త ద్వారా 1964 రూమ్ ను బుక్ చేసుకున్నాడని వెల్లడించింది. వంద రోజులకు 12 లక్షల రూపాయలు వెచ్చించి దీన్ని తమ అధీనంలో ఉంచుకున్నారనితెలిపింది. చాలా వ్యాపార వివాదాల్లో వాజే ఈ వ్యాపారవేత్తకు అండగా ఉంటున్నాడని తేలిందని ఎన్ఐఏ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నసంగతి తెలిసిందే. -
ముంచంగిపుట్టు కేసులో ఆరుగురు అరెస్ట్
సాక్షి,అమరావతి/ద్వారకానగర్ (విశాఖ దక్షిణ)/వజ్రపుకొత్తూరు రూరల్/టంగుటూరు: విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు కేసులో ఆరుగురు పౌరహక్కుల సంఘం నేతలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. మావోయిస్టులకు విప్లవ సాహిత్యం తీసుకెళ్తున్న జర్నలిస్టు పాంగి నాగన్నను ముంచంగిపుట్టు పోలీసులు గతేడాది అరెస్టు చేశారు. దీనిపై గత నవంబర్ 23న ముంచంగిపుట్టు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు గత నెల 7న కేసు నమోదు చేసిన ఎన్ఐఏ పాంగి నాగన్నను విచారించింది. మావోయిస్టులకు సహకరిస్తున్నట్టు నాగన్న అంగీకరించడంతోపాటు మరో 64 మంది పౌరహక్కుల సంçఘాల, విరసం నేతల పేర్లు వెల్లడించడంతో వారిపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 12 జిల్లాల్లోని 31 ప్రాంతాల్లో ఉన్న పౌర హక్కుల నేతల ఇళ్లల్లో బుధ, గురువారాల్లో ఎన్ఐఏ సుదీర్ఘంగా సోదాలు నిర్వహించింది. ఆరుగురిని అరెస్టు చేసినట్టు మీడియాకు గురువారం తెలిపింది. విస్తృతంగా సోదాలు.. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి, కడప జిల్లాలతోపాటు తెలంగాణలోని రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మెదక్ జిల్లాల్లో ఈ సోదాలు జరిగాయి. సోదాల్లో దొరికిన పలు ఆధారాలతో పాంగి నాగన్న, అందులూరి అన్నపూర్ణ, జంగర్ల కోటేశ్వరరావు, మునుకొండ శ్రీనివాసరావు, రేల రాజేశ్వరి, బొప్పూడి అంజమ్మలను ఎన్ఐఏ అరెస్టు చేసింది. సోదాల్లో రూ.10 లక్షల నగదు, 40 మొబైల్ ఫోన్లు, 44 సెల్ఫోన్ సిమ్లు, 70 స్టోరేజ్ డివైజెస్(హార్డ్డిస్క్లు), మైక్రో ఎస్డీ కార్డులు, ఫ్లాష్ కార్డులు, 184 సీడీలు, డీవీడీలు, 19 పెన్డ్రైవ్లు, ట్యాబ్, ఆడియో రికార్డర్లు, సీపీఐ మావోయిస్టు జెండాలు, మావోయిస్టులకు సంబంధించిన సాహిత్యం, లేఖలు, పత్రాలు, ప్రెస్నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టులకు పౌరహక్కుల నేతలు సహకరించారని, పోలీసుల కదలికలను మావోయిస్టులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని, ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలను మావోయిస్టులకు అనుకూలంగా సమీకరించి పోలీసులను అక్కడికి రాకుండా అడ్డంకులు కల్పిస్తున్నారని, ప్రజలను పోలీసులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని అభియోగాలు మోపింది. సోదాలపై నిరసన.. పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, న్యాయవాదుల ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించడాన్ని ఖండిస్తూ గురువారం విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో ఆయా సంఘాలు నిరసన చేపట్టాయి. పీవోడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ ఎన్ఐఏ అధికారులు ప్రజాసంఘాల నేతల ఇళ్లపై అక్రమంగా సోదాలు చేయకూడదని హైకోర్టు ఇచ్చిన రిలీఫ్ఆర్డర్ను కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ముంచంగిపుట్టు సంఘటనకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో 32 మందిపై ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నారని, అందులో భాగంగానే సోదాలు జరిపి విచారించారని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లిసారధి గ్రామానికి చెందిన ప్రజాసంఘ నాయకురాలు పోతనపల్లి అరుణ పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలను అణగదొక్కేందుకే ఈ దాడులు చేస్తున్నట్లు విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వరా? ప్రజాజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి మీరిచ్చే గౌరవం ఇదేనా.. ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వరా? అంటూ మావోయిస్టు నేత ఆర్కే సతీమణి శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. బుధవారం రాత్రి, గురువారం సోదాలు చేసిన ఎన్ఐఏ అధికారులు పెన్డ్రైవ్, 5 పుస్తకాలు తీసుకెళ్లారన్నారు. ఎన్ఐఏ విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారని తెలిపారు. ఇదేనా మాకిచ్చే భరోసా.. ఇక్కడి కంటే అడవుల్లో ఉండటం మంచిదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆమె వెంట విరసం నేత కళ్యాణరావు తదితరులు ఉన్నారు. చదవండి: మన బాధ్యత మరింత పెరిగింది: సీఎం జగన్ వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు!
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పౌర హక్కుల సంఘాల నేతలు, పలువురు న్యాయవాదులు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించి సెల్ఫోన్లు, పలు పుస్తకాలు, విప్లవ గీతాల సీడీలు, డీవీడీలు, హార్ట్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, కేరళ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందాలు తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్లోని మెహిదీపట్నం, దిల్సుఖ్నగర్, జవహర్నగర్లో నివసించే పలువురు పౌరహక్కుల సంఘం న్యాయవాదులు, ప్రజాసంఘాల నేతలపై ఏకకాలంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా దిల్సుఖ్నగర్లోని కోదండరాం నగర్లో నివసించే రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షుడు, న్యాయవాది వి.రఘునాథ్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపి ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి పొద్దుపోయేదాకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్నగర్లో ప్రజా కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్ నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇక గుడిమల్కాపూర్ తాళ్లగడ్డ బస్టాప్ సమీపంలోని ఒక ఇంటి వద్దకు వచ్చిన ఎన్ఐఏ అధికారులు.. ఆ ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఇరుగుపొరుగు వారిని విచారించారు. ఎక్కడా కూడా మీడియాను అనుమతించలేదు. అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారం అధికారులు ఈ సోదాలు చేసినట్టు తెలుస్తోంది. ఏపీలోనూ సోదాలు.. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది చిలుకా చంద్రశేఖర్ ఇంట్లో ఎన్ఐఏ బృందం తనిఖీలు జరిపింది. అదేవిధంగా గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రభునగర్లో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రాజేశ్వరి నివాసంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.రాజేశ్వరితో పాటు లా చదువుతున్న ఆమె కుమార్తెను, వైజాగ్లో చదువుతున్న ఆమె కుమారుడిని సైతం ఎన్ఐఏ బృందం విడివిడిగా ప్రశ్నించింది. కుటుంబ సభ్యుల సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు, కారు, ద్విచక్ర వాహనాలు, చెప్పుల స్టాండును సైతం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రాజమహేంద్రవరంలోని ఉంటున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు ఇంట్లోనూ బుధవారం రాత్రి సోదాలు జరిగాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో విప్లవ రచయితల సంఘం (విరసం) మాజీ రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. న్యాయవాదుల ఇళ్లలో సోదాలు విశాఖ నగరంలోని ముగ్గురు న్యాయవాదుల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు మెరుపు సోదాలు నిర్వహించారు. పిఠాపురం కాలనీ కళా భారతి సమీపంలోని న్యాయవాది, సీఆర్పీపీ ప్రతినిధి కె.పద్మ ఇంట్లో తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులను విచారించినట్టు సమాచారం. చినవాల్తేరులో న్యాయవాది కె.శివాచలం, హెచ్బీ కాలనీలో న్యాయవాది బాలకృష్ణ ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న విప్లవ రచయితల సంఘం నాయకుడు దివంగత చలసాని ప్రసాద్ ఇంటి వద్ద కూడా ఎన్ఐఏ పోలీసులు భారీగా మోహరించారు. న్యాయవాది బాలకృష్ణను పోలీసులు విచారిస్తున్నారు. రాత్రి ఏ క్షణమైనా ఈ ముగ్గుర్నీ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కర్నూలు నగరం శ్రీలక్ష్మీ నగర్లో ఉంటున్న విరసం సభ్యుడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్న పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. విశాఖ కేసు ఆధారాలతోనే.. విశాఖ ఏజెన్సీ పరిధిలోని ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 7వ తేదీన విప్లవ సాహిత్యం తీసుకెళ్తున్న పాంగి నాగన్న అనే జర్నలిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద మావోయిస్ట్ విప్లవ సాహిత్యం, ప్రెస్నోట్లు, వైర్లు, మరికొంత సామగ్రి లభించాయి. అతన్ని విచారించగా మావోయిస్టుల కోసం పనిచేస్తున్నట్టు అంగీకరించాడని ఎన్ఐఏ తెలిపింది. జర్నలిస్టుగా పని చేస్తూ పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు మావోయిస్టులకు చేరవేస్తున్నట్టు గుర్తించారు. కూంబింగ్ ఆపరేషన్ కోసం వెళ్తున్న పోలీసులను అడ్డుకునేలా గ్రామస్తులను రెచ్చగొట్టాడని పేర్కొన్నారు. అతనిచ్చిన సమాచారంతో దాదాపు 64 మంది అనుమానితుల జాబితాను ఎన్ఐఏ రూపొందించింది. ఇప్పుడు ఆ జాబితాలోని అనుమానితుల ఇళ్లల్లోనే సోదాలు నడుస్తుండటం విశేషం. ప్రజా గొంతుక నొక్కడమే పౌర హక్కుల నేతల ఇళ్లపై ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించడాన్ని ఆ సంఘం తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. తమపై ముందే కేసులు పెట్టి ఇపుడు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా ఉద్యమాల గొంతు నొక్కే ప్రయత్నమని ధ్వజమెత్తారు. పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ఈ సోదాలను ఖండించారు. -
వాజే ఎన్ఐఏ కస్టడీ పొడిగింపు
ముంబై: ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజే కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు పొడిగించింది. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో పట్టుబడిన వాహనం కేసులో వాజే ఎన్ఐఏ అదుపులో ఉన్నారు. రిమాండ్ గడువు ముగియడంతో గురువారం ఎన్ఐఏ అధికారులు ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం(యూఏపీఏ)లోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ అధికారులు..మరో 15 రోజులు కస్టడీకి అప్పగించాలని జడ్జీ పీఆర్ సిత్రేని కోరారు. ఈ సందర్భంగా వాజే..తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేకున్నా బలిపశువును చేశారంటూ వాపోయారు. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు వాజే నివాసం నుంచి 62 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయన వాటిని ఇంట్లో ఎందుకు ఉంచారనే విషయమై విచారణ చేపట్టారు. పోలీసు శాఖ ఆయనకు మంజూరు చేసిన 30 బుల్లెట్లలో 5 మాత్రమే దొరికాయి. మిగతావి లభ్యం కాలేదు’అని అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ చెప్పారు. ఇదే కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన మరో ఇద్దరితోపాటు వాజేను కలిపి విచారణ జరపాల్సి ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి వాజే కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై హైకోర్టులో పరమ్బీర్ సింగ్ పిటిషన్ మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్పై తక్షణం నిష్పాక్షి విచారణ జరిపించాలంటూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ గురువారం ముంబై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) వేశారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ పోలీస్ అధికారి సచిన్ వాజేను ఆయన కోరారంటూ పరమ్బీర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
విజయ్ వ్యూహం
ప్రజల జీవితాల్లో అలజడి సృష్టించిన టెర్రరిస్టులను పట్టుకునేందుకు ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఏసీపీ విజయ్వర్మ ఓ ప్లాన్ వేశాడు. విజయ్ వ్యూహం ఎలా ఉంటుందో ‘వైల్డ్ డాగ్’లో చూడొచ్చు. నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వైల్డ్డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం. వరుస బాంబు దాడులతో దేశంలో మారణకాండ సృష్టించిన ఉగ్రవాదులను తన టీమ్తో విజయ్ వర్మ ఎలా తుదముట్టించాడనే విషయాన్ని సినిమాలో ఆసక్తికరంగా చూపిస్తున్నాం. ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటికే 10 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు ఎన్ .ఎం. పాషా, జగన్మోహన్ వంచా సహ నిర్మాతలు. -
సాక్ష్యాలు నాశనం చేసేందుకు యత్నించిన వాజే
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియోని నిలిపి కలకలం సృష్టించిన ఘటనలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తొలత ఈ కేసును ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజే దర్యాప్తు చేశాడు. రోజులు గడుస్తున్న కొద్ది.. ఈ కేసుతో వాజేకు ఉన్న సంబంధాలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఈ కేసుకు సంబంధించి వాజే మీద కేసు బుక్ చేసింది. అలానే మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా వాజేను దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ప్రచారం అవుతోంది. వాజే ఈ కేసు దర్యాప్తులో సమయంలో సేకరించిన సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వాజే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సమయంలో సేకరించిన ఆధారాలను రికార్డులో పేర్కొనలేదని తెలిసింది. అలానే సచిన్ వాజే తన సొంత రెసిడెన్షియల్ సొసైటీకి చెందిన సీసీటీవీ ఫుటేజ్, డీవీఆర్ మెషన్ డాటాతో పాటు తాను సేకరించిన ఇతర సమాచారాన్ని నాశనం చేసేందుకు యత్నించినట్లు సమాచారం. ప్రసుత్తం అధికారులు డిలీట్ అయిన డాటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొదటి స్కార్పియో వాహనం యజమానిగా భావించిన మన్సుఖ్ హిరెన్ను ప్రశ్నించిన పోలీసులు ఆ వాహనం దొంగలించబడిందని గుర్తించారు. ఆ తర్వాత హిరెన్ హత్యకు గురికావడంతో కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక హిరెన్ భార్య ఆ స్కార్పియో వాహనాన్ని ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే నాలుగు నెలల పాటు వాడుకున్నాడని చెప్పడంతో కేసులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. స్కార్పియో వాహనాన్ని ఉపయోగించిన సచిన్ వాజేనే ఆ తర్వాత.. ఈ కేసులో మొదటి దర్యాప్తు అధికారిగా వ్యవహంచడంతో అతనిని బదిలీ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ఎన్ఐఏ అధికారులు. చదవండి: అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం అంబానీ ఇంటి వద్ద కలకలం : సచిన్పై బదిలీ వేటు -
అంబానీ ఇంటి వద్ద పేలుడు: సచిన్ వేజ్కు 25 వరకు కస్టడీ
ముంబై: రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నివాసం వద్ద లభించిన పేలుడు పదార్థాలతో కూడిన కారు కేసులో ముంబై పోలీసు అధికారి సచిన్ వేజ్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. 49 ఏళ్ల వయసున్న సచిన్ వేజ్ ఫిబ్రవరి 25న అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన కారుని పార్కు చేశారన్న ఆరోపణలతో ఎన్ఐఏ ఆయనని శనివారం అర్ధరాత్రి దాటాక అరెస్ట్ చేసింది. ఆదివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వేజ్ను దక్షిణ ముంబైలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనని ఈ నెల 25వరకు ఎన్ఐఏ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మొదట పోలీసు అధికారి స్టేట్మెంట్ని రికార్డు చేయడానికి ఎన్ఐఏ ఆయనకి సమన్లు పంపింది. శనివారం ఉదయం 11.30కి కంబాలా హిల్లోని ఎన్ఐఏ కార్యాలయానికి చేరుకున్న వేజ్ని 12 గంటల సేపే జాతీయ దర్యాప్తు బృందం అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. అనంతరం ఆయనని ఐపీసీ, ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం లభ్యం కావడమే కలకలాన్ని సృష్టిస్తే ఆ కారు తన దగ్గర్నుంచి అంతకు వారం రోజుల ముందే చోరీకి గురైందని థానేకు చెందిన వ్యాపారి మన్సుఖ్ హిరాణ్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మార్చి 5న ఆయన అనుమానాస్పద రీతిలో మరణించారు. దీంతో కేసుని ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టు 1990 బ్యాచ్కు చెందిన అధికారి అయిన సచిన్ వేజ్కు ఎన్కౌంటర్ స్పెషలిస్టు అన్న పేరుంది. మొత్తంగా 63 మంది క్రిమినల్స్ని ఆయన ఎన్కౌం టర్ చేసినట్టుగా ఆరోపణలున్నాయి. ఘట్కోపార్ పేలుళ్లలో అనుమానితుడు ఖ్వాజా యూనస్ కస్టడీ మరణంలో సచిన్ ప్రమేయం ఉందని తేలడంతో 2004లో ఆయనని సస్పెండ్ చేశారు. తిరిగి గత ఏడాదే ఆయన విధుల్లోకి వచ్చారు. గత ఏడాది అన్వయ్ నాయక్ ఆత్మహత్య కేసులో జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి అరెస్ట్ చేసిన పోలీసు బృందానికి వేజ్ నేతృత్వం వహించారు. 2008 వరకు ఆయన శివసేనలో కూడా కొనసాగారు. -
అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం
సాక్షి, ముంబై: బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద బాంబు కేసులో మరోకీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజేను జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) శనివారం రాత్రి అరెస్టు చేసింది. ఆదివారం ఆయనను కోర్టు ముందు హాజరు పర్చి, కస్టడీకి డిమాండ్ చేయనున్నామని ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. 12 గంటల పాటు విచారణ జరిపిన తర్వాత 286, 465, 473, 506 (2), 120 బి ఐపిసి, మరియు 4 (ఎ) (బి) (ఐ) పేలుడు పదార్థాల చట్టం 1908 కింద వాజేను అరెస్టు చేశామని వెల్లడించారు.(అంబానీ ఇంటి వద్ద కలకలం: మరో కీలక ట్విస్టు) ఫిబ్రవరి 25న అంబానీ నివాసం యాంటిలియా వద్ద జిలిటెన్ స్టిక్స్తో ఉన్న వాహనం కలకలం రేపింది. ఈ కేసులో ఆటో విడిభాగాల వ్యాపారి వాహన యజమాని మాన్సుఖ్ హిరేన్ ఈ నెల 5న అనుమానాస్పద స్థితిలో థానేలో మృతి చెందారు. దీంతో హిరేన్ భార్య ఫిర్యాదు మేరకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజేపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవీస్ కూడా వాజేపాత్రపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో వాజేను క్రైమ్ బ్రాంచ్ నుంచి బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. (వెలుగులోకి ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది) -
నేవీ ‘హనీ ట్రాప్’ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల కుట్రే
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖ నేవీ అధికారులకు యువతులను ఎరవేసి సైనిక రహస్యాలను తెలుసుకునేందుకు పన్నిన హనీ ట్రాప్ వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల కుట్ర దాగి ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో నిందితుడైన ఇమ్రాన్ యాకూబ్పై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. భారత రక్షణ దళాలను లక్ష్యంగా చేసుకుని నావికాదళ అధికారులను హనీట్రాప్ చేయడం ద్వారా దేశ సైనిక రహస్యాలను తెలుసుకోడానికి పాకిస్తాన్ నిఘా అధికారులు పన్నిన కుట్రను 2019లో కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టి దర్యాప్తు చేపట్టిన విషయం విదితమే. దీనిపై 2019 నవంబర్ 16న విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గూఢచర్యం ద్వారా దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన సమాచారంతో పాటు హవాలా ద్వారా నగదు చేతులు మారినట్టు నిఘా వర్గాలకు కీలక ఆధారాలు లభించాయి. దీంతో కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించగా 2019 డిసెంబర్ 12న కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో పాకిస్తాన్తో వ్యాపార సంబంధాలున్న ముగ్గురు పౌరులతో పాటు 11 మంది నావికాదళ అధికారుల పాత్ర ఉన్నట్టు ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ వారిని అరెస్ట్ చేసింది. వారిపై 2020 జూన్ 15న ఎన్ఐఏ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేసింది. అనంతర దర్యాప్తులో గుజరాత్లోని గోద్రాకు చెందిన యాకూబ్ ఇమ్రాన్కు పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. నావికాదళ రహస్యాలు, సమాచారం సేకరించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల సూచనల మేరకు ఇమ్రాన్ యాకూబ్ నేవీ అధికారుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేసినట్టు ఆధారాలు సేకరించారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఇమ్రాన్ చట్టవిరుద్ధంగా వస్త్ర వ్యాపారం పేరుతో నిధులను సమీకరించినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో రుజువైంది. ఈ విషయాలతో అతడిపై అనుబంధ చార్జ్షీట్ను దాఖలు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఏ ప్రకటించింది. -
నరక కూపం.. వేశ్యావాటికల్లో యువతులు
సాక్షి, హైదరాబాద్ : బంగ్లాదేశ్లో బతుకుదెరువు లేక చాలా పేద కుటుంబాలు అక్రమంగా భారత్కు వలస వస్తుంటాయి. అయితే ఉపాధి పేరిట కొందరు బంగ్లాదేశ్ యువతులకు డబ్బు ఎరవేసి అక్రమంగా సరిహద్దులు దాటించి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. ఏజెంట్ల మాటలు నమ్మి వచ్చిన వారిని నరకకూపంలోకి నెడుతున్నారు. ఇక్కడికి వచ్చాక తిరిగి వెళ్లలేక.. కుటుంబ కష్టాలను గుర్తుకు తెచ్చుకుని, ఇష్టం లేకున్నా మనసు చంపు కొని నిర్వాహకులు ఎలా చెబితే అలా చేస్తున్నారా యువతులు. చదువు రాకపోవడం, బెంగాలీ తప్ప మరో భాష తెలియకపోవడంతో ఎవరితోనూ తమ బాధలు చెప్పుకోలేని నిస్సహాయ స్థితి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో వెలుగుచూసిన హైటెక్ సెక్స్ రాకెట్ బంగ్లాదేశ్ యువతుల బాధలకు అద్దం పడుతోంది. 19–25 ఏళ్లలోపు వారే టార్గెట్ బంగ్లాదేశ్లో పేదరికం, నిరక్షరాస్యత ప్రధానంగా ప్రజలను పీడిస్తున్న అంశాలు. ఈ నేపథ్యంలో భారత్కు అక్రమంగా వచ్చిన కొందరు డబ్బు సంపాదనకు వక్రమార్గం పట్టారు. ‘భారత్లోని వేశ్యావాటికల్లో యువతులను ఉంచితే ఎవరికీ అనుమానం రాదు, పైగా తక్కువ సమయంలో ఎక్కువగా సంపాదించొచ్చు’అన్న దురాశతో ఇదే పనిని వృత్తిగా ఎంచుకున్నారు. బంగ్లాదేశ్లోని వీరి ఏజెంట్లు తమకు తెలిసిన మురికివాడల్లోని పేదలను సంప్రదిస్తారు. భారత్లో బాగా స్థితిమంతుల ఇళ్లు, హోటళ్లలో పనిచేసే అవకాశాలు ఉన్నాయంటూ అమ్మాయిలను పంపాలని కోరతారు. చిన్నపిల్లలైతే ఇబ్బందులు వస్తాయన్న అనుమానంతో 19 నుంచి 25 ఏళ్ల యువతులను ఎంపిక చేసుకుంటారు. పాస్పోర్ట్, వీసాలు లేకుండానే వీరిని అక్రమమార్గాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లోని వేశ్యా గృహాల్లో ఉంచుతారు. త్వరలో ఎన్ఐఏకు కేసు బదిలీ! అబ్దుల్లాపూర్మెట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ బాటసింగారం సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం రాకెట్ను పోలీసులు ఛేదించారు. వారి చెరలో మగ్గుతున్న ఇద్దరు యువతులను రక్షించారు. ఈ రాకెట్ ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన లిటన్ సర్కార్ది బంగ్లాదేశ్. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కావడంతో ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు త్వరలో బదిలీ కానుంది. యాప్లతో దందా లాక్డౌన్ కాలంలో వ్యాపారం తగ్గిందని చాలామంది నిర్వాహకులు అక్రమమార్గంలో తీసుకొచ్చిన బంగ్లాదేశీ యువతులను తిరిగి స్వదేశానికి పంపించేస్తున్నారు. అయితే కడుబీదరికంలో ఉన్న కొందరు మాత్రం ఇక్కడే ఉండిపోతున్నారు. డేటింగ్ యాప్స్లో ఈ యువతుల చిత్రాలు ఉంచి విటులను ఆకర్షిస్తున్నారు. గూగుల్పే, ఫోన్ పే ద్వారా చెల్లింపులు చేస్తే.. వారి వద్దకు యువతులను పంపడం లేదా విటులనే రప్పించుకోవడం పనిగా పెట్టుకున్నారు. -
ఉగ్రవాదుల లిస్టులో ప్రముఖ వ్యాపారవేత్త!
న్యూఢిల్లీ/రాంచీ: మోస్ట్వాంటెడ్ ఉగ్రవాదుల లిస్టులో ప్రముఖ వ్యాపారవేత్త పేరును చేర్చిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తన నిర్ణయాన్ని వెనక్కితీసుకుంది. ఉగ్రవాదుల జాబితా నుంచి అతడి పేరు, ఫొటోను వెబ్సైట్ నుంచి తొలగించింది. జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే సదరు వ్యాపారవేత్తపై నమోదు చేసిన అభియోగాలు మాత్రం సరైనవేనని స్పష్టం చేసింది. అసలు ఏం జరిగిందంటే.. బొగ్గు వ్యాపారం, స్టీల్ ప్లాంట్లు కలిగి ఉన్న అధునిక్ గ్రూప్ అధినేత మహేష్ అగర్వాల్ జార్ఖండ్లో బొగ్గు ఆధారిత పవర్ ప్లాంటును నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తన వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా స్థానిక మావోయిస్టు సంస్థ తృతీయ ప్రస్తుతి కమిటీ(టీపీసీ)కి అతడు నిధులు సమకూరుస్తున్నట్లు ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. 2016 నాటి కేసు(బిహార్, జార్ఖండ్లో వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల నుంచి నక్సల్స్ భారీ మొత్తంలో దోచుకున్నారన్న ఆరోపణలు)కు సంబంధించి ఈ ఏడాది జనవరి 10న ఈ మేరకు అభియోగాలు నమోదు చేసింది. (చదవండి: దీపావళి: చైనాకు 40 వేల కోట్ల మేర నష్టం!) ఈ నేపథ్యంలో రాంచిలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మహేష్కు వ్యతిరేకంగా నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జనవరి 17 నాటి ఈ ఆదేశాల తర్వాత ఎన్ఐఏ తన వెబ్సైట్లో మహేష్ అగర్వాల్ను మోస్ట్వాంటెడ్ ఉగ్రవాదిగా పేర్కొంటూ అతడి ఫొటోను అప్లోడ్ చేయడం చర్చకు దారితీసింది. ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అగర్వాల్ తరఫు న్యాయవాది నితీశ్ రానా జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ‘‘నా క్లైంట్ను అనవసరంగా ఇరికించారు. నిజానికి తను ఈ కేసులో కీలక సాక్షి. ఈ విషయాన్ని ఎన్ఐఏ కూడా ధ్రువీకరించింది. 2019లో ప్రత్యేక న్యాయస్థానంలో సీఆర్పీసీ 164 కింద మహేష్ను సాక్షిగా పేర్కొంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. కానీ అకస్మాత్తుగా ఆయనను నిందితుడిగా పేర్కొనడం ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేనప్పటికి తీవ్రమైన అభియోగాలు నమోదు చేసింది. అంతేకాదు ఉగ్రవాదుల జాబితాలో ఆయన పేరు, ఫొటోను ఉంచి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించింది’’అని పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు అక్టోబరు 21న మహేష్ అగర్వాల్ పేరును ఉగ్రజాబితా నుంచి తొలగించిన ఎన్ఐఏ, అభియోగాలను మాత్రం యథాతథంగా ఉంచినట్లు నవంబరు 3న దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. అయితే ఈ విషయంపై అధికారులు ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. -
బంగ్లాదేశ్ టు హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: ఉపాధి పేరుతో అమాయక యువతులను బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ అక్రమంగా తరలిస్తున్న కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆదివారం చార్జిషీటు దాఖలు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ వ్యవహారం జాతీయస్థాయిలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. తొలుత 2019 సెప్టెంబర్లో పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఉదంతం వెలుగుచూసింది. ఓ వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు తరువాత దీనితో సంబంధమున్న పది మందిని అరెస్టు చేశారు. జల్పల్లి, బాలాపూర్ తదితర ప్రాంతాల నుంచి పోలీసులు రక్షించిన యువతుల్లో బంగ్లాదేశ్కు చెందినవారు ఉన్నారు. వీరిని ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా దేశం దాటించి తీసుకువచ్చారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరి వద్ద భారతీయులుగా చలామణి అయ్యేందుకు ఉన్న నకిలీ ధ్రువపత్రాలు, ఐడెంటిటీ కార్డులతో పాటు ఫోన్లు, సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కావడంతో ఈ కేసు తరువాత ఎన్ఐఏకు బదిలీ అయింది. 1980 నుంచి ఇదే దందా.. ఈ కేసులో ఏ2గా ఉన్న రుహుల్ అమిన్ దాలిని 2019, డిసెంబర్ 12న ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇతను 1980లో అక్రమ మార్గాల్లో బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి తన భార్య బిత్తి బేగంతో కలిసి దేశంలోని పలు ప్రాంతాల్లో పలు వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నాడు. ఇందుకు కావాల్సిన యువతులను బంగ్లాదేశ్లోని తన ఏజెంట్ల ద్వారా భారత్కు రప్పిస్తున్నాడు. ముఖ్యంగా 19 నుంచి 25 ఏళ్ల వయసున్న యువతులకు ఉపాధి ఎరవేసి భారత్కు తీసుకువస్తున్నారు. వీరికి అధికారిక వీసా రావడం కష్టం.. అందుకే అడ్డదారుల్లో తీసుకువస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. బెంగాల్లోని సోనాయ్ నది మార్గం గుండా తొలుత కోల్కతాలోకి తీసుకువస్తారు. అక్కడ నుంచి కోల్కతా, ముంబై, హైదరాబాద్లలోని వ్యభిచార గృహాలకు పంపిస్తున్నారు. ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు అబ్దుల్ బారిక్ షేక్తో కలిసి భారత్ నుంచి యువతులను బంగ్లాదేశ్కు కూడా తరలించేవాడు. కాగా, అబ్దుల్ బారిక్ షేక్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇతడు బంగ్లాదేశ్కు పారిపోయి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన వారిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. పోలీసులు రక్షించిన బంగ్లాదేశీ యువతులు ప్రస్తుతం హైదరాబాద్లోని షెల్టర్ హోంలలో ఆశ్రయం పొందుతున్నారు. నిందితులు వీరే.. యువతులను అక్రమంగా దేశ సరిహద్దులు దాటిస్తున్న వ్యవహారంలో మొత్తం 12 మందిని ఎన్ఐఏ నిందితులుగా గుర్తించింది. వీరిలో ప్రధాన సూత్రధారితో సహా పది మంది బంగ్లాదేశీయులు కాగా.. ఇద్దరు భారతీయులు. ఎన్ఐఏ చార్జిషీటు ప్రకారం... బంగ్లాదేశ్కు చెందిన 1.అబ్దుల్ బారిక్ షేక్, 2. రుహుల్ అమీన్ దాలి 4. మహమ్మద్ యూసుఫ్ఖాన్ , 5.బిత్తి బేగం, 6. మహమ్మద్ రానా హుస్సేన్ , 8. మహమ్మద్ అల్ మెమన్ 9. సోజిబ్ షేక్, 10. సురేశ్కుమార్ దాస్. 11. మహమ్మద్ అబ్దుల్లా మున్షి, 12.మహమ్మద్ అబ్దుల్ షేక్.. మహారాష్ట్రకు చెందిన 3. అసద్ హసన్ , 7.షరీఫుల్ షేక్లు నిందితులు. -
బంగ్లా యువతులచే బలవంతపు వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ కీలక ముందడుగు వేసింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో అభియోగ పత్రాలను దాఖలు చేసింది. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు యువతులను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. దీనిలో తొమ్మిది మంది బంగ్లాదేశీయులు కాగా మిగతావారు స్థానికులుగా ఎన్ఐఏ గుర్తించింది. నకిలీ ఇండియన్ ఐడీ కార్డు సృష్టించి బంగ్లాదేశ్ నుంచి యువకులను అక్రమంగా తరలించి.. గృహాల్లో బందించి బలవంతంగా వ్యభిచారం చేయించిన నిందితులపై తాజాగా ఎన్ఐఏ చార్జ్షీట్ దాఖలు చేసింది. ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ తరలించి వ్యభిచార గృహాలకు తరలిస్తున్నట్లు పేర్కొంది. (తాహీర్ హుస్సేన్పై ఛార్జిషీట్) సోన్ నది దాటించి కలకత్తా మీదుగా ముంబాయి, హైదరాబాద్ తరలించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వారిని గృహాల్లో బందించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు అభియోగాలు మోపింది. తొలుత నగరంలోని పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల అక్రమ రవాణాపై కేసు నమోదు కాగా, ఆ తరువాత ఎన్ఐఏకు బదిలీ చేశారు. జల్పల్లి ప్రాంతంలో వ్యభిచార గృహాల్లో ఉన్న నలుగురు బంగ్లా యువతులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. వారు ప్రస్తుతం హైదరాబాద్ షెల్టర్ హోమ్స్లో ఉంచారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎన్ఐఏ పేర్కొంది. కాగా ఉమెన్ ట్రాఫికింగ్ అప్పట్లో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. (కంగనాపై దేశద్రోహం కేసు) -
ఐసిస్ అడ్డాగా ఐటీ రాజధాని..!
బెంగళూరు / బనశంకరి: దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారుతోందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. భారత్లో అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి సిరియాలో ఉగ్ర శిక్షణ తీసుకున్న ఐదుగురు ఐసిస్ ఉగ్రవాదులు బెంగళూరులో తిష్టవేసినట్లు ఎన్ఐఏ అధికారులు నిర్ధారించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నగర వాసుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: వీవీ అల్లుడికి ఎన్ఐఏ నోటీసులు) ఆ ఏడుగురు ఎక్కడ.. గతనెలలో అరెస్ట్ అయిన నగరంలోని ఎంఎస్.రామయ్య ఆసుపత్రిలో డాక్టరుగా ఉన్న బసవనగుడి నివాసి అనుమానిత ఐసీస్ ఉగ్రవాది డాక్టర్ అబ్దుల్ రెహమాన్ ఇచ్చిన సమాచారంతో గుర్రప్పనపాళ్యలోని బిస్మిల్లానగరలో ఎన్ఐఏ అధికారులు తనిఖీ చేపట్టగా ఏడుగురు యువకులు కొంతకాలంగా కనిపించలేదని తేలింది. వీరంతా సౌదీ అరేబియా ద్వారా ఇరాన్ సరిహద్దుకు చేరుకుని అక్కడి నుంచి సిరియాకు వెళ్లినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ‘మేకింగ్ ఆఫ్ ఫ్యూచర్’ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఈ అనుమానిత ఉగ్రవాదులు ఓల్డ్ మద్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో శిక్షణ తీసుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించినట్లు సమాచారం. ఎన్ఐఏ అరెస్ట్ చేసిన డాక్టర్ అబ్దుల్ రెహమాన్ బెంగళూరులో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచి పోషించడంలో కీలకంగా వ్యవహరించినట్లు ఎన్ఐఏ విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. చదువుకున్న యువతను ఐసీస్లో చేర్చుకొని శిక్షణ ఇచ్చేందుకు ఇక్బాల్ జమీర్, అబ్దుల్ రెహమాన్ బ్యాంకు ఖాతాలకు భారీగా నగదు జమ అయినట్లు ఎన్ఐఏ విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం. -
కోరెగావ్ కేసులో స్టాన్ స్వామి అరెస్ట్
ముంబై: భీమా కోరెగావ్ హింసకు సంబంధిం చి మానవ హక్కుల నేతలు గౌతమ్ నవ్లఖా, 82 ఏళ్ల ఫాదర్ స్టాన్ స్వామి సహా 8 మందిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శుక్రవారం అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధానికి వారు కుట్ర పన్నినట్లు అందులో ఆరోపించింది. ఇందులో మావోయిస్టులతో పాటు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ పాత్ర ఉందని పేర్కొంది. ఫాదర్ స్టాన్ స్వామి సహా ఆ 8 మంది సమాజంలో శాంతిభద్రతలకు విఘా తం కల్పిస్తున్నారని 10 వేల పేజీల చార్జిషీట్లో ఎన్ఐఏ వెల్లడించింది. గౌతమ్ నవ్ల ఖాకు ఐఎస్ఐతో సంబంధాలున్నాయంది. వీరంతా వ్యవస్థీకృత మావోయిస్టు నెట్వర్క్లో భాగమని, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని మావోలకు చేరవేసేవారని తమ దర్యాప్తులో తేలిం దని స్పష్టం చేసింది. స్థానిక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడానికి ముందు ఫాదర్ స్టాన్ స్వామిని రాంచీలో ఎన్ఐఏ అరెస్ట్ చేసి ముంబైకి తీసుకువచ్చింది. శుక్రవారం ఆయనను కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీ షియల్ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేయగా, వారిలో ఎక్కువ వయస్సున్న వ్యక్తి 82 ఏళ్ల స్టాన్ స్వామినేనని అధికారులు తెలిపారు. మిలింద్ తెల్తుంబ్డే మినహా చార్జిషీట్లో పేర్కొన్న వారందరూ ప్రస్తుతం కస్టడీలోనే ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థ చార్జ్షీట్ దాఖలుచేయడం ఇది మూడోసారి. తొలిసారిగా పుణె పోలీసులు 2018 డిసెంబర్లో, రెండోసారి 2019ఫిబ్రవరిలో చార్జ్షీట్లు వేశారు. తర్వాత కేంద్రప్రభుత్వం ఈ కేసును ఈ ఏడాది జనవరిలో పుణే పోలీసుల నుంచి ఎన్ఐఏకు బదిలీచేసింది. అసలేం జరిగిందంటే.. మహారాష్ట్రలోని పుణె సమీపంలో భీమా కోరెగావ్ వద్ద జనవరి 1, 2018న జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అంతకు ముందు రోజు, ఎల్గార్ పరిషత్ సభ్యులు చేసిన రెచ్చ గొట్టే ప్రసంగాల తరువాతనే ఈ హింసాత్మక ఘటనలు జరిగాయని ఎన్ఐఏ పేర్కొంది. వారు దేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని, మావోయిస్టులకు ఆర్థిక సాయం అందించా రని అభియోగాలు మోపింది.∙అందుకు తగ్గ సాక్ష్యాలు తమ దర్యాప్తులో బయటపడ్డాయని తెలిపింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మేధావులను ఏకం చేసే బాధ్యతను నవ్లఖా నిర్వహించేవారని చెప్పింది. ఫాదర్ స్టాన్ స్వామి మావో కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారని, ఇతర కుట్రదారులతో సంప్రదింపులు జరుపుతుండేవారని ఎన్ఐఏ ఆరోపించింది. ఈ ఆరోపణలను స్టాన్ స్వామి ఖండించారు. -
బీమా కోరేగావ్: స్టాన్ స్వామి అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో సామాజికవేత్తను అరెస్ట్ చేసింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఫాదర్ స్టాన్ స్వామి (83)ని ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. కాగా, ఆదివాసీల హక్కుల కోసం స్టాన్ స్వామి గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. భీమా కోరేగావ్ కేసులో అరెస్టైన రోనా విల్సన్, అరుణ్ ఫెరారియతో స్తాన్ స్వామికి సంబంధం ఉన్నట్టు ఎన్ఐఏ అధికారులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం. అయితే, ఎలాంటి వారెంట్ లేకుండా స్టాన్ స్వామిని అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఐఎస్తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
బెంగళూరు: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఇస్లామిక్ స్టేట్ మాడ్యూల్ని ఒకదాన్ని చేధించి.. దానితో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్ట్ చేసింది. నిందితులను బెంగళూరుకు చెందిన అహ్మద్ అబ్దుల్(40), ఇర్ఫాన్ నజీర్(33)గా గుర్తించింది. అంతేకాక 2013-14 మధ్య కాలంలో 13-14 మంది వ్యక్తులు బెంగళూరు నుంచి సిరియా వెళ్లినట్లు ఏజెన్సీ గుర్తించింది. వీరిలో ఇద్దరు సిరియాలో హత్యకు గురి కాగా.. కొందరు 2014 లో నిశ్శబ్దంగా తిరిగి వచ్చారని.. చాలామంది ఇప్పటికీ పరారీలో ఉన్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. 2014 లో ఇరాక్, సిరియాలను ఐఎస్ అధిగమించింది. ఇరాక్ 2017 లో ఈ టెర్రర్ గ్రూపుపై విజయం సాధించినట్లు ప్రకటించింది. 2019 మార్చిలో సిరియాలో అమెరికా మద్దతు ఉన్న దళాలు ఈ బృందాన్ని ఓడించాయని, ఈ గ్రూపు ప్రాదేశిక నియంత్రణకు ముగింపు పలికాయని వెల్లడించింది. ఇక నేడు చేధించిన మాడ్యూల్లోని సభ్యులందరినీ ఎన్ఐఏ గుర్తించింది. వీరు సన్నిహితంగా ఉన్నవారి గురించి అలానే వీరి కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఒక బ్యాంకు వ్యాపార విశ్లేషకుడు కాడర్, కుటుంబ వ్యాపారాన్ని నడుపుతున్న నాసిర్, మాడ్యూల్లో చాలా మంది సభ్యులను సమూలంగా మార్చారని కనీసం ఐదుగురు సభ్యుల ప్రయాణానికి ఆర్థిక సాయం చేశారని ఎన్ఐఏ తెలిపింది. జహన్జైబ్ సామి, హినా బషీర్ బేగ్ కేసుకు సంబంధించి ఆగస్టులో బెంగళూరు నుంచి అరెస్టయిన నేత్ర వైద్య నిపుణుడు అబ్దుల్ రెహ్మాన్ను ప్రశ్నించగా బెంగళూరు మాడ్యూల్ గురించి ఎన్ఐఏ ఏజెన్సీ అధికారులకు తెలిసింది. దాంతో వారు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కాడర్, నాసిర్లను గుర్తించారు. వీరు హిజ్బ్ ఉత్ తహ్రీర్(హుట్)లో సభ్యులు. వీరు ఖురాన్ సర్కిల్ అనే మాడ్యూల్ని ఏర్పాటు చేసి బెంగళూరులోని వ్యక్తులను ప్రలోభాలకు గురి చేశారు. అంతేకాక వీరు నిధులు సేకరించి సిరయా పర్యటనలకు, ఐఎస్కు సహాయం చేడానికి, దాని భావజాల వ్యాప్తికి ఈ నిధులను వినియోగించారు. కాడర్ హుట్ నుంచి నిధులు సేకరించి తన బ్యాంక్ ఖాతా ద్వారా సిరియాకు పంపించాడని అధికారులు తెలిపారు. నేత్ర వైద్య నిపుణుడు ఐఎస్లో చేరడానికి బెంగళూరు నుంచి సిరియాకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కాడర్, నాజిర్ నిధులు సమకూర్చారు. (చదవండి: ‘వాయిస్ ఆఫ్ హింద్’ బాసిత్ సృష్టే!’) కేరళలోని కాసరగోడ్, పాలక్కాడ్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దాదాపు 22 మంది సభ్యుల మాడ్యూల్ 2016 లో ఇరాక్, సిరియాకు ప్రయాణించింది. భారతదేశం నుంచి ఈ ప్రాంతానికి ప్రయాణించిన అతిపెద్ద సమూహం ఇదే అని ఎన్ఐఏ తెలిపింది.ఇరాక్, సిరియా,ఆఫ్ఘనిస్తాన్లలో ఐఎస్ ఆధీనంలో ఉన్న భూభాగాలకు 2014 నుంచి అనేక మంది కార్యకర్తలు ప్రయాణించారని, అయితే వారంతా చిన్న సమూహాలలో లేదా వ్యక్తిగతంగా వెళ్లారని అధికారులు తెలిపారు. కాసరగోడ్ మాడ్యూల్ అతిపెద్ద మాడ్యూల్ దాని తర్వాత ఇప్పుడు 13-14 మంది కలిసి వెళ్లిన ఈ తాజా బెంగళూరు మాడ్యూల్ పెద్దదిగా ఉంది" అని ఒక అధికారి తెలిపారు. -
దేశంలో పాగాకు అల్కాయిదా కుట్ర
న్యూఢిల్లీ/కోల్కతా: భారత్లో వేళ్లూనుకునేందుకు నిషేధిత అల్కాయిదా ఉగ్ర సంస్థ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బట్టబయలు చేసింది. కీలక ప్రాంతాల్లో ఉగ్రదాడులు, కొందరు ముఖ్యులను చంపేందుకు సాగుతున్న యత్నాలను భగ్నం చేసింది. పశ్చిమ బెంగాల్, కేరళలలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపి ఈ ముఠాలోని 9 మందిని అరెస్ట్చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు, రాష్ట్రాలు పోలీసుల సాయంతో 18, 19 తేదీల్లో కేరళ, బెంగాల్లలో దాడులు జరిపి 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. ముర్షీద్ హసన్, ఇయాకుబ్ బిశ్వాస్, మొసారఫ్ హొస్సేన్ అనే వారిని కేరళలోని ఎర్నాకులంలోను, నజ్ముస్ సకిబ్, అబూ సుఫియాన్, మైనుల్ మొండల్, లియు ఈన్ అహ్మద్, అల్ మమూన్ కమల్, అటిటుర్ రహ్మాన్లను ముర్షీదాబాద్లో అరెస్ట్చేశారు. ఈ ముఠాకు హసన్ నేతృత్వం వహిస్తున్నాడని చెప్పారు. కేరళలో పట్టుబడిన వారూ బెంగాల్ వాసులే. 11న అల్కాయిదా మాడ్యూల్పై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా ఈ ఆపరేషన్ను చేపట్టింది. అరెస్టయిన వారంతా సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తాన్లోని అల్ కాయిదా ఉగ్రవాదుల బోధనల ప్రభావానికి లోనయ్యారు. ఢిల్లీ సహా దేశంలోని కీలకప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిపి భారీగా ప్రాణనష్టం కలిగించేందుకు, ప్రముఖులను చంపేందుకు పథకం వేశారు. ఇందుకు అవసరమైన డబ్బుతోపాటు ఆయుధాలు..ఆటోమేటిక్ రైఫిళ్లు, పిస్టళ్లు, పేలుడు పదార్థాల కోసం కశ్మీర్తోపాటు ఢిల్లీ వెళ్లాలని ఈ ముఠా పథకం వేసింది. అంతేకాకుండా, కశ్మీర్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అల్కాయిదా నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది. టపాసులను ఐఈడీ(ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్)గా మార్చేందుకు ఈ ముఠా ప్రయత్నిం చిందని సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న స్విచ్చులు, బ్యాటరీలను బట్టి తేలిందని ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. దాడుల్లో జిహాదీ సాహిత్యం, కొన్ని ఆయుధాలు, దేశవాళీ తయారీ తుపాకులు, స్థానికంగా రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, పేలుడు పదార్థాల తయారీని తెలిపే సమాచారం, డిజిటల్ పరికరాలు లభించాయి. ఆరుగురికి 24 వరకు రిమాండ్ పశ్చిమబెంగాల్లో అరెస్టు చేసిన అల్కాయిదా ముఠాలోని ఆరుగురు సభ్యులకు కోల్కతాలోని స్పెషల్ ఎన్ఐఏ కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు రిమాండ్ విధించింది. వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. బాంబుల తయారీ కేంద్రం బెంగాల్: గవర్నర్ ధన్కర్ పశ్చిమ బెంగాల్కు చెందిన అల్కాయిదా ఉగ్ర ముఠా సభ్యులను ఎన్ఐఏ అరెస్టు చేయడంపై రాష్ట్ర గవర్నర్ ధన్కర్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. బాంబుల తయారీకి రాష్ట్రం కేంద్రంగా మారిందని ధన్కర్ ఆరోపించారు. శాంతి, భద్రతలు దారుణంగా క్షీణించాయన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం, డీజీపీ ఇందుకు బాధ్యత వహించకతప్పదని పేర్కొన్నారు. -
భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ
-
భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఉగ్ర దాడులకు కుట్రపన్నిన ఆల్ఖైదా ఆపరేటర్లను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ఎన్ఐఏ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఈ మేరకు శనివారం ఉదయం బెంగాల్, కేరళలో 11 మంది ఆల్ఖైదా ఆపరేటర్లను అరెస్ట్ చేసింది. కేరళ, బెంగాల్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాడికల్స్ను అధికారులు విచారిస్తున్నారు. దేశంలోని ముఖ్య పట్టణాల్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఈ బృందం ప్రణాళికలు రచిస్తున్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. వీరి నుంచి మరింత సమచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. (తృటిలో తప్పిన పుల్వామా తరహా ఘటన!) కాగా శుక్రవారం నాడు కశ్మీర్లోని గుడీకల్ ప్రాంతంలో భారీ పేలుడు సామాగ్రీని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడి తరహాలోనే మరోసారి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని బలగాలు భావిస్తున్నాయి. ఆ ప్రాంతంలో 125 గ్రాముల చొప్పున మొత్తం 416 ప్యాకెట్లలో పేలుడు పదార్థాలు లభించాయని ఆర్మీ వెల్లడించింది. మరిన్ని సోదాలు నిర్వహించగా మరో ట్యాంక్లో 50 డిటోనేటర్లు కనుగొన్నామని పేర్కొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో హోంశాఖ అధికారులు అప్రమ్తతమైయ్యారు. -
12 రాష్ట్రాల్లో యాక్టివ్గా ఐసిస్: ఎన్ఐఏ
న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఐసిస్ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో యాక్టివ్గా ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది. వాటిల్లో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో ఐసిస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా నిన్న రాజ్యసభలో ఇదే విషయాన్ని వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లోని యువత ఐసిస్వైపు ఆకర్షితులవుతున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఐసిస్ సానుభూతిపరులపై ఇటీవల 17 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. 122 మంది నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఐసిస్ తమ సిద్ధాంతాలను ప్రచారంయువతకు గాలం వేస్తోందని తెలిపారు. ఉగ్ర సంస్థల కార్యకలపాలపై నిఘా కొనసాగుతోందని మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. (చదవండి: పాతబస్తీలోని వ్యభిచారగృహంపై పోలీసుల దాడి) -
విశాఖ గూఢచర్యం కేసు.. మరొకరి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: 2019 లో విశాఖపట్నం 'హానీట్రాప్' గూఢచర్యం కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది. గిటేలి ఇమ్రాన్ అనే వ్యక్తిని ఎన్ఐఏ గుజరాత్లో అదుపులోకి తీసుకుంది. ఈ వ్యక్తి పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. విశాఖలోని నేవీ రహస్యాలను సేకరించేందుకు కుట్ర పన్నినట్లు తెలిపింది. ఈ క్రమంలో నేవీ సిబ్బందికి భారీగా ముడుపులు అందజేసినట్టు విచారణలో వెల్లడయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఎన్ఐఏ 11 మంది నేవీ సిబ్బంది సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంఖ్య 15కు చేరింది. హవాలా మార్గాల్లో నేవీ సిబ్బందికి నిధులు సమకూర్చినట్టు సదరు వ్యక్తి దర్యాప్తులో వెల్లడించినట్లు ఎన్ఐఏ తెలిపింది. (చదవండి: విశాఖలో ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ ) పాకిస్తాన్కు చెందిన కొందరు గూఢచారులు.. భారత నౌకలు, జలాంతర్గాముల లొకేషన్, ఇతర సమాచారాన్ని సేకరించేందుకు జూనియర్ స్థాయి నేవీ అధికారులను ట్రాప్ చేయడానికి ప్రయత్నించారు. ఇందుకు గాను సోషల్ మీడియా ద్వారా అందమైన యువతులను వారు ఎర వేసి.. వివరాలను కనుగొనేందుకు ప్రయత్నించారు. -
9 మంది ఉగ్రవాదులను దోషులుగా తేల్చిన కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో భారీ ఉగ్ర కుట్రకు పథకం పన్నిన కేసుకు సంబంధించి మరో 9 మంది ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ స్పెషల్ కోర్టు శనివారం దోషులుగా తేల్చింది. డిసెంబర్ 2015లో ఎన్ఐఏ నమోదు చేసిన కేసులో మొత్తం 15 మందికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ముస్లిం యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించి ఐసిస్లో చేరేలా ప్రేరేపించిన 19 మందిని ఎన్ఐఏ 2015 లో అరెస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఐసిస్కు యువకులను రిక్రూట్ చేసిన ఉదంతంలో ఎన్ఐఏ దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో "జునోధ్ ఉల్ ఖిలాఫా ఫీల్ హింద్" పేరుతో గ్రూప్ ఫామ్ చేసి ఐసిస్ కుట్రను నెరవేర్చేందుకు 19 మంది ఉగ్రవాదులు కుట్ర పన్నారు. దేశంలో పేళ్లులకు భారీ కుట్ర రచించారు. (చదవండి: నరేంద్ర మోదీకి బెదిరింపు మెయిల్) ఈ క్రమంలో హైదరాబాద్, బెంగుళూర్, మహారాష్ట్ర, యూపీలలో ఐసిస్ సానుభూతిపరులు మీటింగ్లు కూడా నిర్వహించారు. సిరియాలో ఉంటున్న యూసఫ్ ఆల్ హింద్ అలియాస్ అంజన్ భాయ్ ఆదేశాలను అమలు చేయడం వీరి పని. ఐసిస్ మీడియా చీఫ్గా అంజన్ భాయ్ వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్ఐఏ 2016-17 మద్యలో ఈ కేసుకు సంబంధించి 17 మంది పై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. వీరిలో 15 మందిపై నేరం రుజువయ్యింది. వీరికి ఈ నెల 22న ఎన్ఐఏ స్పెషల్ కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. -
కొచ్చిన్ షిప్యార్డు కేసు నిందితుల అరెస్ట్
న్యూఢిల్లీ: గత ఏడాది జూన్, సెప్టెంబర్ మధ్య కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో నిర్మిస్తున్న స్వదేశీ విమాన వాహక నౌక నుంచి క్లిష్టమైన ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ను దొంగిలించినందుకుగాను బిహార్, రాజస్తాన్లకు చెందిన ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. గత ఏడాది అక్టోబర్లో కేరళ పోలీసుల నుంచి దర్యాప్తు స్వీకరించిన ఉగ్రవాద నిరోధక సంస్థ అనేక రాష్ట్రాల్లో దాదాపు తొమ్మిది నెలల పాటు విస్తృతమైన దర్యాప్తు జరిపిన తరువాత నిందితులు సుమిత్ కుమార్ సింగ్ (23), దయా రామ్(22)లను బుధవారం అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుల వద్ద నుంచి ‘దేశ భద్రతకు సంబంధించిన’ డాటాతో పాటు ప్రాసెసర్లు, ర్యామ్లు, సాలిడ్ స్టేట్ డ్రైవ్లతో సహా దొంగిలించిన ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. సుమిత్ కుమార్ సింగ్ బిహార్లోని ముంగేర్ జిల్లాకు చెందిన వాడు కాగా.. దయా రామ్ రాజస్తాన్కు చెందిన హనుమన్గఢ్కు చెందినవారు. ఎన్ఐఏ దర్యాప్తులో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. దొంగిలించబడిన కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: తిరుచ్చిలో ఎన్ఐఏ దూకుడు) (నిందితులు దయారమ్, సుమిత్ కుమార్ సింగ్(ఎడమ నుంచి)) ఈ సందర్భంగా ఎన్ఐఏ అధికారులు మాట్లాడుతూ.. ‘వీరిద్దరు నిర్మాణంలో ఉన్న విమాన వాహక నౌకలో పెయింటింగ్ పనిలో కాంట్రాక్టు కార్మికులుగా చేరారు. డబ్బుకు ఆశపడి ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలించారు. వాటిలో ఐదు మైక్రో ప్రాసెసర్లు, 10 ర్యామ్లు, ఓడలోని మల్టీ-ఫంక్షనల్ కన్సోల్ల నుంచి ఐదు సాలిడ్ స్టేట్ డ్రైవ్లు ఉన్నాయి. ఆ తర్వాత సెప్టెంబరులో నిందితులు తమ స్వగ్రామాలకు బయలుదేరారు. విషయం తెలియడంతో కేరళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎన్ఐఏ సెప్టెంబర్ 26 న కేసును రీ రిజస్టర్ చేసి అక్టోబర్ 16 న కేరళ పోలీసుల నుంచి దర్యాప్తు బదిలీ చేయించుకున్నాము. నిందితుల కోసం ఈ తొమ్మది నెలల కాలంలో ఓడలో పనిచేసిన 5,000 మందికి పైగా వేలు, అరచేతి ముద్రలను ఏజెన్సీ విశ్లేషించింది. పెద్ద సంఖ్యలో సాక్షులను విచారించాము. అంతేకాక ఈ "బ్లైండ్ కేసు" నిందితులను పట్టుకోవడం కోసం 5 లక్షల రివార్డును ప్రకటించాము’ అని తెలిపారు. -
నరేంద్ర మోదీకి బెదిరింపు మెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరిస్తూ జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్ఐఏ)కు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. మోదీకి వచ్చిన బెదిరింపు మెయిల్కు సంబంధించిన వివరాలపై ఎన్ఐఏ హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసిందని ఓ జాతీయ వార్తా ఛానెల్ వెల్లడించింది. ఓ ఈమెయిల్ ఐడీ నుంచి ప్రముఖ వ్యక్తులకు వచ్చిన బెదిరింపు కాపీలను హోంశాఖకు పంపిన ఎన్ఐఏ వీటిపై తగిన చర్య తీసుకోవాలని ఆ లేఖలో కోరింది. ఆగస్ట్ 8న వచ్చిన ఈ బెదిరింపు మెయిల్తో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. చదవండి : పీఎం కేర్స్కు తొలి విరాళం మోదీనే బెదిరింపు మెయిల్ నేపథ్యంలో ప్రధానమంత్రి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎన్ఐఏ లేఖ ఆధారంగా హోంమంత్రిత్వ శాఖ ఈ వ్యవహారాన్ని ప్రధానికి భద్రతను కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) దృష్టికి తీసుకువెళ్లింది. బెదిరింపు మెయిల్పై దర్యాప్తు చేపట్టేందుకు రా, ఇంటెలిజెన్స్ బ్యూరో, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రతినిధులను ఎన్ఐఏ రంగంలోకి దించింది.అసలు ఈమెయిల్ ఎక్కడినుంచి వచ్చిందో రాబట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. -
మావో గణపతి.. ఎప్పుడొచ్చారు?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి ఆరోగ్యం క్షీణించిందని, ఆయన త్వరలోనే జన జీవన స్రవంతిలో కలుస్తారన్న ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. అసలు ఆయన విదేశాలకు దేని కోసం వెళ్లారు?.. అక్కడి నుంచి ఎప్పుడొచ్చారు?.. ఎందుకు వచ్చారు?.. అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు దొరకడంలేదు. మావోయిస్టు కేంద్ర కార్యదర్శి పదవి నుంచి 2018 నవంబర్లో తప్పుకున్నాక గణపతి ప్రస్థానం సందేహంలో పడింది. ఆయన స్థానంలో నంబాల కేశవరావు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఓ సీనియర్ పోలీసు ఉన్నతాధికారి గణపతి ఆచూకీపై సంచలన విషయం వెల్లడించారు. గణపతి ఛత్తీస్గఢ్ దండకారణ్యం నుంచి బిహార్ మీదుగా నేపాల్ వెళ్లాడని, అక్కడ నుంచి ఫిలిప్పీన్స్కు వెళ్లిపోయాడని తమ వద్ద సమాచారం ఉందని పేర్కొన్నారు. మావోయిస్టుల టెలిఫోన్ సంభాషణలపై నిఘా ఉంచగా తమకు ఈ విషయం తెలిసిందని ఆయన అన్నారు. చివరిసారిగా కనిపించింది అక్కడే..! ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి కోసం పలు రాష్ట్రాల పోలీసులే కాకుండా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా అన్వేషిస్తోంది. చివరిసారిగా 2017లో బిహార్లోని గయ ప్రాంతంలో సంచరించినట్లుగా నిఘా వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి. నేపాల్ మీదుగా ఫిలిప్పీన్స్కు వెళ్లడం కోసమే ఆయన అక్కడ ఉన్నట్లు విశ్లేషణలు ఉన్నాయి. గణపతిపై ఎన్ఐఏ రూ.15 లక్షల రివార్డు ప్రకటించింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిపితే ఆయన తలపై రూ.3.6 కోట్ల వరకు రివార్డు ఉంది. ఒకవేళ గణపతి విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నించి ఉంటే.. సదరు పోలీసు అధికారి కథనం నమ్మదగినదే అని పలువురు అంగీకరిస్తున్నారు. భారతీయులంతా బిహార్ ద్వారా రోడ్డు మార్గంలో నేపాల్కు వెళ్లడం సర్వసాధారణమే. అక్కడి నుంచి విమానాల్లో పలు దేశాలకు వెళ్లడం పెద్ద విషయమేమీ కాదు. భారతదేశంలో అశాంతికి పాల్పడే అంతర్జాతీయ ఉగ్ర సంస్థల సభ్యులు ఇదే పంథాను అనుసరిస్తారు. (చదవండి: కీలక నిర్ణయం తీసుకోనున్న మావో గణపతి) నేడు గణపతి.. నాడు కత్తుల సమ్మయ్య గతంలో లొంగిపోయిన కరీంనగర్ జిల్లా కాచాపూర్కు చెందిన కత్తుల సమ్మయ్య కూడా నక్సలైట్లలో ఉండగా పలుమార్లు విదేశాలకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. అదే క్రమంలో 1993లో దళంతో విభేదించి.. తోటి సభ్యులను కాల్చిచంపిన అనంతరం అతడు పోలీసులకు లొంగిపోయాడు. తరువాత హైదరాబాద్లో కొందరు అవినీతి ఉన్నతాధికారుల పరిచయాలతో రియల్ ఎస్టేట్ వ్యవహారాలతో పాటు అనేక దందాలు నడిపాడు. 2001లో కొలంబోలో జరిగిన విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించాడు. ఫిలిప్పీన్స్కు ఎందుకు వెళ్లాడు? గణపతి.. ఫిలిప్పీన్స్కు వెళ్లి ఉంటే.. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనారోగ్యంతో ఉన్న ఆయన చికిత్స కోసమే వెళ్లారా? అక్కడ ఆయనకు ఆశ్రయం కల్పించిందెవరు? అన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. జీవితంలో అధిక భాగం దండకారణ్యంలో ఉన్న గణపతికి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చక్కటి సంబంధాలు ఉన్నాయన్న పేరుంది. పార్టీకి పలువురు ప్రవాసీయుల నుంచి రూ.కోట్ల చందాలు తీసుకురావడంలో ఆయనది కీలకపాత్రగా పలువురు పేర్కొంటారు. నేపాల్, ఫిలిప్పీన్స్లోనూ మావోయిస్టు పార్టీ క్రియాశీలకంగా ఉండటం ఆయనకు కలిసి వచ్చిన అంశాలుగా పరిశీలకులు భావిస్తున్నారు. మంచి వ్యూహకర్త, సిద్ధాంతకర్త అయిన గణపతి.. మావోయిస్టు పార్టీకి అంతర్జాతీయ సంబం ధాల బలోపేతం కోసం ఫిలిప్పీన్స్ వెళ్లి ఉండొచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. (చదవండి: గణపతి లొంగుబాటుకు లైన్క్లియర్..!) -
కేరళ సచివాలయం: రాజకీయ దుమారం
తిరువనంతపురం: కేరళ సచివాలయ భవనంలో మంగళవారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొన్ని కీలక పత్రాలు కాలి బూడిదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. సెక్రటేరియట్ రెండో అంతస్తులోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ) పొలిటికల్ సెక్షన్ నుంచి పొగలు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను అదుపుచేసి కొన్ని పత్రాలను బయటకు తీశారు. కానీ, అప్పటికే కొన్ని మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. అక్రమ బంగారం రవాణా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను నాశనం చేయడానికే ప్రభుత్వం ఈ అగ్నిప్రమాదం డ్రామాకు తెరతీసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్రమ బంగారం కేసు ప్రసుత్తం ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయ పరిశీలనలో ఉంది. (చదవండి: తిరుచ్చిలో ఎన్ఐఏ దూకుడు) ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేరళ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల గవర్నర్ అరిఫ్ మొహమూద్ ఖాన్ను కలిసి.. ఇందులో జోక్యం చోసుకోవాలని కోరారు. బంగారు అక్రమ రవాణా కేసులోని అన్ని ఆధారాలను నాశనం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ అగ్ని ప్రమాదం సంఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా త్వరలోనే ఎన్ఐఏ, ఈడీ సీఎంఓకు చేరుకుంటాయని తెలిసినందున ఫైళ్లు ధ్వంసమయ్యాయి అని విమర్శించారు. మరోవైపు సెక్రటేరియట్ ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అయితే గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించిన ఫైల్స్ను ఇప్పటికే డిజిటలైజేషన్ చేశామని, పత్రాలను నాశనం చేశామనడం అర్ధరహితమని ప్రభుత్వ అధికారులు వ్యాఖ్యానించారు. -
పుల్వామా దాడులు.. చార్జిషీట్ దాఖలు
న్యూఢిల్లీ: దేశ ప్రజలను తీవ్ర విచారంలోకి నెట్టడమే కాక పాక్, ఇండియా మధ్య యుద్ధ పరిస్థితులకు దారి తీసిన పుల్వామా దాడి కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. జైషే మహ్మద్ చీఫ్, ఉగ్రవాది మసూద్ అజర్తో పాటు అతడి సోదరుడు రౌఫ్ అస్గర్ పేరును ఎన్ఐఏ ఈ చార్జిషీట్లో చేర్చింది. పుల్వామా దాడికి వీరిద్దరే ప్రధాన సూత్రధారులని ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొంది. 5,000 పేజీలతో కూడిన ఛార్జిషీట్ను ఎన్ఐఏ జమ్మూ కోర్టులో సమర్పించనుంది. ఈ దారుణమైన ఉగ్రదాడులకు ఎలాంటి ప్రణాళిక రచించారు.. పాక్ నుంచి ఎలా అమలు చేశారనే దాని గురించి అధికారులు చార్జిషీట్లో పూర్తిగా వివరించారు. అంతేకాకుండా జైషే మహ్మద్కు చెందిన 20 మంది ఉగ్రవాదులు ఈ దాడికి అవసరమైన ఆయుధాలను సమకూర్చారని ఛార్జిషీట్లో తెలిపారు. వీటన్నింటికీ అవసరమైన పూర్తి ఆధారాలను కూడా ఎన్ఐఏ బృందం కోర్టుకు సమర్పించనుంది. వాట్సాప్ చాటింగ్, ఫొటోలు, ఆర్డీఎక్స్ రవాణాకు సంబంధించిన ఫొటోలు, ఫోన్ కాల్స్ డేటా... ఇలా కీలక ఆధారాలను ఎన్ఐఏ అధికారులు కోర్టుకు నివేదించనున్నారు. (చదవండి: మళ్లీ ‘పూల్వామా’ దాడి జరిగితేనే బీజేపీ గెలుపు!) భారత్ కశ్మీర్ను ఆక్రమించుకున్నందనే పాక్ ఈ దాడులకు తెగబడిందని ఎన్ఐఏ తెలిపింది. భారత్పై దాడికి పాక్, స్థానికుడు ఆదిల్ అహ్మద్ దార్ను ఉపయోగించింది. అతడు సూసైడ్ బాంబర్గా మరి సీఆర్పీఎఫ్ దళాలు ప్రయాణిస్తున్న కాన్వాయ్ మీదకు పేలుడు పదార్థాలతో నిండిని కారును దూకించాడని అధికారులు తెలిపారు. ఇక పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన దేశం పాత్రను ఖండించిన సంగతి తెలిసిందే. భారతదేశం సాక్ష్యాలు ఇస్తే నేరస్థులను విచారిస్తామని కూడా తెలిపారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. పైగా అంతర్జాతీయ సమాజం నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నప్పటికి పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
వరవరరావు బెయిల్ను వ్యతిరేకించిన ఎన్ఐఏ
ముంబై: విరసం కవి, ఉద్యమకారుడు వరవరరావు (81) బెయిల్ పిటిషన్ను తిరస్కరించాలని బాంబే హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వాదించింది. ప్రస్తుతం ఆయనకు మంచి వైద్య సహాయం అందుతోందని, జైలు అధికారులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆయనకు సరైన వైద్యసేవలు అందిస్తారని, అందువల్ల ఆయన బెయిల్ పిటిషన్ను ఆమోదించవద్దని కోరింది. ఎల్గార్ పరిషద్– కోరేగావ్ భీమా కుట్ర కేసులో వరవరరావును అరెస్టు చేశారు. జైల్లో ఆయన ఆరోగ్యం దెబ్బతినడం, కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని వరవరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ అమ్జాద్ సయిద్ బెంచ్ ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా వరవరరావుకు బెయిల్ ఇవ్వవద్దని ఎన్ఐఏ న్యాయవాది అనిల్సింగ్ వాదించారు. ఈ సందర్భంగా వరవరరావు తరఫు న్యాయవాది సత్యనారాయణ..గతనెల 31న చివరిసారిగా ఆయన కుటుంబసభ్యులతో వీడియోకాల్లో మాట్లాడించారని తెలిపారు. దీంతో ఆయనతో కుటుంబసభ్యులను వీడియోకాల్లో మాట్లాడించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను 2వారాలు వాయిదా వేశారు. -
తిరుచ్చిలో ఎన్ఐఏ దూకుడు
సాక్షి, చెన్నై: కేరళ బంగారం స్మగ్లింగ్ విచారణ తిరుచ్చికి చేరింది. ఎన్ఐఏ అధికారులు మంగళవారం తిరుచ్చిలో తిష్ట వేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం యూఏఈ కాన్సులేట్కు బంగారంతో వచ్చిన పార్శిల్ గుట్టు ఆ రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అక్కడి అధికారి స్వప్న సురేష్తో పాటు మరెందరో అరెస్టయ్యారు. ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ అధికారులను ఎన్ఐఏ వర్గాలు విచారణ చేశాయి. ఈ కేసు ప్రస్తుతం తమిళనాడు వైపుగా మరలడం చర్చకు దారితీసింది. ప్రధానంగా ఎన్ఐఏ వర్గాల దృష్టి తిరుచ్చిపై పడింది. ఈ స్మగ్లింగ్ రాకెట్లో ఏజెంట్లుగా వ్యవహరించిన వారందరూ తిరుచ్చికి చెందిన వారుగా ఎన్ఐఏ గుర్తించింది. దీంతో ఇక్కడి పోలీసులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎన్ఐఏ వర్గాలు ఉదయాన్నే దూకుడు పెంచాయి. తిరుచ్చిలోని అండగుండం, జాఫర్ ఖాన్ వీధుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, అక్బర్ అలీ అనే వ్యక్తిని ప్రత్యేక ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. వీరంతా ముంబై, కోల్కతాలకు బంగారం స్మగ్లింగ్ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. వీరితో పాటు తిరుచ్చిలోని ఓ ప్రముఖ నగల వ్యాపారికి సైతం సంబంధాలు ఉన్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిని ఆగమేఘాలపై తిరువనంతపురానికి తరలించారు. ఇక ఇటీవల కాలంగా తిరుచ్చి విమానాశ్రయంలో బంగారం పెద్ద ఎత్తున పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ బంగారంతో ఈ కేసుకు సంబంధాలు ఉండవచ్చన్న కోణంలోనూ ఎన్ఐఏ విచారణ వేగం పెరిగింది. -
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన వాస్తవాలు
-
కేరళ గోల్డ్ స్కామ్: కీలక విషయాలు వెలుగులోకి
తిరువనంతపురం: కేరళలో వెలుగు చూసిన 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో కొత్త విషయాలు బయట పడుతున్నాయి. హవాలా రూపంలో గత ఏడాది నుంచి ఇప్పటిదాకా దాదాపు 180 కేజీల బంగారం అక్రమ రవాణా జరిగినట్లు ఎన్ఐఏ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దాదాపు 13 సార్లు విమానాల ద్వారా బంగారాన్ని స్మగ్లింగ్ చేశారని ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అధికారులు భావిస్తున్నారు. భారీ ఎత్తున బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన కేసులో సరిత్, స్వప్న సురేష్, ఫాజిల్ ఫరీద్, సందీప్ నాయర్లను ఎన్ఐఏ నిందితులుగా గుర్తించింది. ఈ కేసులో పట్టుబడిన స్వప్న సురేష్, సందీప్ నాయర్లను ఎన్ఐఏ ఇప్పటికే కస్టడీలోకి తీసుకుంది. చదవండి: కేరళ గోల్డ్ స్కామ్కు హైదరాబాద్కు లింకు? దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించడానికి వీరివురిని శనివారం నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. దర్యాప్తులో భాగంగా స్వప్నా సురేష్, సరిత్లను వారి ఇళ్లకు, కార్యాలయాలకు కూడా తీసుకెళ్లారు. కీలక నిందితడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫాజిల్ ఫరీద్ కోసం బ్లూ నోటీసు జారీ చేయాలని ఇంటర్ పోల్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ కోరింది. కేసులో మరో నిందితుడైన సరిత్ని కూడా తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ అధికారులు కస్టమ్స్ శాఖను కోరారు. కాగా బంగారం స్మగ్లింగ్ ద్వారా వఛ్చిన సొమ్మును హవాలా మార్గాల ద్వారా దుబాయ్కి తరలించారని.. ఈ వ్యవహారమంతా ఫాజిల్ ఫరీద్ అధ్వర్యంలో జరిగిందని అనుమానిస్తున్నారు. చదవండి: గోల్డ్ స్మగ్లింగ్ కేసు : ఎన్ఐఏ కస్టడీకి కీలక నిందితులు కాగా తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్కు చెందిన పార్మిల్లో 30 కిలోల బంగారాన్ని జూలై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్నా సురేష్ ఆరోపణలు ఎదుర్కోవడంతో వీరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో స్వప్నా సురేష్తో సన్నిహితంగా ఉన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్ను బదిలీ చేశారు. ఈ వ్యవహారంపై కేసు దర్యాప్తుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలపడంతో కేంద్రం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పజెప్పింది. ఇక దీనిపై విచారణ చేపట్టిన ఎన్ఐఏ గోల్డ్ స్మగ్లింగ్ ఉగ్రవాద కార్యకలాపం లాంటిదేనని, త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేస్తామని పేర్కొంది -
కేరళ గోల్డ్ స్కామ్కు హైదరాబాద్కు లింకు?
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న కేరళ బంగారం స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు హైదరాబాద్తో లింకులు ఉన్నట్లు కస్టమ్స్ విభాగం గుర్తించిందని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ కేసులో అత్యంత కీలకమైన నగదు చెల్లింపులు హైదరాబాద్ నుంచే జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు. రూ. కోట్లాది విలువ చేసే బంగారం కొనేందుకు నిందితులు అడ్డదారుల్లో హవాలా మార్గాల్లో చెల్లిస్తారన్న విషయం తెలిసిందే. ఈ కేసులో రూ. కోట్లు హైదరాబాద్ నుంచి హవాలా రూపంలో దుబాయ్కి చెల్లింపులు చేశారన్న సమాచారంపై కస్టమ్స్ శాఖ కూడా కూపీ లాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులు స్వప్నా సురేశ్, సందీప్ నాయర్ను అరెస్ట్ చేసింది. కాగా గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళలో పెను ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఏకంగా సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్ను తొలగించారు. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఐటీ శాఖ ఉద్యోగి పాత్రపై ఆరోపణలు బయటపడిన వెంటనే శివకంర్పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. ఈ నెల 6వ తేదీన దుబాయ్ నుంచి చార్టర్డ్ విమానంలో వచ్చిన కన్సైన్మెంట్ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. దౌత్య మార్గంలో తరలిన రూ. 15 కోట్ల విలువైన బంగారం విమానాశ్రయంలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా.. ఇందులో ఐటీ విభాగంలో పనిచేసే స్వప్న సురేశ్ హస్తం ఉన్నట్టు వెల్లడించాడు. దీంతో రాష్ట్ర ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పరిధిలోని స్పేస్ పార్క్ మార్కెటింగ్ ఆఫీసర్గా ఉన్న స్వప్న బంగారం తరలింపులో కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. -
గోల్డ్ స్మగ్లింగ్ కేసు : ఎన్ఐఏ కస్టడీకి కీలక నిందితులు
తిరువనంతపురం : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇద్దరు కీలక నిందితులను ప్రత్యేక న్యాయస్ధానం సోమవారం 8 రోజుల పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీకి తరలించింది. ఈ కేసులో శనివారం బెంగళూర్లో అరెస్ట్ అయిన స్వప్నా సురేష్, సందీప్ నాయర్లను దర్యాప్తు ఏజెన్సీ అభ్యర్థన మేరకు ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. కాగా తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్కు చెందిన పార్మిల్లో 15 వేల కోట్ల రూపాయల విలువైన 30 కిలోల బంగారాన్ని జూలై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాన్సులేట్కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కోవడంతో వీరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వ పెద్దల అండతోనే ఈ నిర్వాకం సాగిందని, తక్షణమే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సీఎం కార్యాలయం నేర కార్యకలాపాలకు అడ్డాగా మారిందని సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల ఆరోపించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై సీబీఐచే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి : గోల్డ్ స్మగ్లింగ్: ఎవరీ స్వప్న సురేశ్? -
‘కేరళ బంగారం’ కేసు ఎన్ఐఏకు
న్యూఢిల్లీ: తిరువనంతపురం విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం కేసు విచారణ బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. ఈ వ్యవహారం దేశ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని హోం శాఖ పేర్కొంది. ఈ అంశంపై జోక్యం చేసుకుని, మరింత మెరుగైన దర్యాప్తు జరపాలంటూ కేరళ సీఎం విజయన్ ప్రధాని మోదీకి లేఖ రాసిన మరుసటి రోజే కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆదివారం గల్ఫ్ నుంచి తిరువనంతపురం వచ్చిన ఓ విమానంలో దౌత్యపరమైన సామగ్రి పేరుతో ఉన్న బ్యాగులో సుమారు 30 కిలోల బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. -
నలమాస కృష్ణకు 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను అరెస్టు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచింది. విచారణ అనంతరం 14 రోజుల జ్యుడిషియల్ రీమాండ్పై నలమాస కృష్ణను చర్లపల్లి జైలుకు ఎన్ఐఏ తరలించింది. (తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్న్యూస్) మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసింది. గత ఆదివారం ఖమ్మంలో కృష్ణను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నారు. గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కృష్ణ 8 నెలల పాటు జైలు జీవితం గడిపి ఇటీవల బెయిల్పై బయటకు వచ్చారు. అనారోగ్యం కారణంగా ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఎన్ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం ఖమ్మం కోర్టులో ప్రవేశ పెట్టి పిటి వారెంట్పై హైదరాబాద్కు తరలించారు. (సరిహద్దు వివాదం: ముగిసిన చర్చలు ) -
ఖమ్మంలో ఎన్ఐఏ కలకలం
ఖమ్మంక్రైం: తెలంగాణ ప్రజా ఫ్రంట్ అగ్రనేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమాసు కృష్ణను ఖమ్మంలో ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రెండు రోజులుగా చికిత్స పొందుతున్న కృష్ణను.. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఎన్ఐఏ పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడైన ఆయనను రహస్యంగా విచారించినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. తీవ్ర చర్చనీయాంశం.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీసులు ఖమ్మానికి రావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేకుండా తెలంగాణ ప్రజా ఫ్రంట్ అగ్రనేతను అదుపులోకి తీసుకొని విచారించడంతో పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేకెత్తింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని కోమరారం గ్రామానికి చెందిన నల్లమా సు కృష్ణ 2004లో మావోయిస్టులకు ప్రభుత్వానికి జరిగిన చర్చల్లో సైతం కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్లో ప్రస్తుతం తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న కృష్ణ కోసం హైదరాబాద్ నుంచి ఎన్ఐఏ బృందం కోమరారం వచ్చి కృష్ణ సోదరుడి ఇంట్లో తనిఖీలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల కాలంలో తెలంగాణ విద్యావంతుల వేదికకు చెందిన ఒక అగ్రనేతను అదుపులోకి తీసుకోగా అతను కృష్ణ గురించి కీలక సమాచారం తెలిపినట్లు తెలియవచ్చింది. ఆస్పత్రికి చేరుకున్న ఎన్ఐఏ టీంలోని ఒక డీఎస్పీ స్థాయి అధికారి కృష్ణ కూతురును, ఆయన బంధువులను విచారించారు. అనంతరం కృష్ణను తమ అదుపులోకి తీసుకుంటున్నట్లు ఎఫ్ఐఆర్ కాపీ అందించారని విలేకరులతో కృష్ణ కూతురు తెలిపింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న అతడిని హైదరాబాద్ తరలించేందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో స్థానిక పోలీసులకు ఎన్ఐఏ టీం ఈ వ్యవహరాన్ని అప్పగించి వెళ్లినట్లు తెలిసింది. -
యువతుల అక్రమ రవాణా: కీలక వ్యక్తి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : విదేశీ యువతుల అక్రమ రవాణా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. బంగ్లాదేశ్ నుంచి భారత్లోని నగరాలకు యువతులను తరలిస్తున్న కేసులో ప్రధాని నిందితుడైన హైదరాబాద్కు చెందిన అబ్దుల్ సలాంను ఎన్ఐఏ శనివారం అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలోనే నిందితుడి నుంచి ఇద్దరు యువతులను ఎన్ఐఏ కాపాడింది. కేసు విచారణలో భాగంగా కీలక డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని వివరాలను కోసం దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఇదే కేసులో పలువురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. భారీ నెట్వర్క్తో యువతులను దేశ సరిహద్దులు అక్రమంగా దాటిస్తున్న ముఠాను ఎన్ఐఏ గుర్తించి.. కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ ముఠా ఇప్పటికే ఎంతో మంది యువతులను తరలించిందని, వారి వివరాల కోసం ప్రయత్నిస్తున్నామని ఎన్ఐఏ తెలిపింది. -
కరోనా విపత్తులో ఉగ్రదాడికి కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ రక్కసితో ప్రజలంతా యుద్ధం చేస్తుంటే దేశంలో దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నుతున్నారు. ఢిల్లీలోని తిహార్ జైలు వేదికగా ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన అనుమానిత ఉగ్రవాది దీనికి పథకం రచిస్తుండగా ఇరాన్కు చెందిన ఉద్రవాద జంట గుట్టువిప్పింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన అనుమానిత ఉగ్రవాది తిహార్ జైల్లో ఖైదీగా ఉంటూ ఓ వర్గం యువతకు ఉగ్రపాఠాలు నేర్పుతున్నాడు. యువతను ఉద్రదాడులకు పాల్పడేలా పురిగొల్పుతున్నాడు. అయితే అదే జైల్లో శిక్ష అనుభివస్తున్న ఇరాన్ ఖొరాసన్ మోడ్యూల్కు చెందిన జంట ఉగ్రదాడి కుట్ర గురించి పోలీసులుకు సమాచారం ఇచ్చి బయటపెట్టింది. రంగంలోకి దిగిన ఎన్ఐఏ విచారణ జరపగా.. ఉగ్రవాది కుట్రను బయపెట్టాడు. గతంలో ఐఎస్ఐఎస్లో చేరేందుకు సిరియా వెళ్ళడానికి యత్నించి మహారాష్ట్రలో పోలీసులకు చిక్కింది కూడా ఇతనే అని పోలీసులు గుర్తించారు. దేశంలో స్వతహాగా దాడులకు దిగేలా యువతను ప్రేరేపిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే నిందితున్ని 2018లో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజా ఘటనతో ఉగ్రవాదిని ఎన్ఐఏ కస్టడికి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులకు ఎన్ఐఏ అధికారులు సమాచారం ఇచ్చారు. (ఐసోలేషన్కు కాదు.. జైలుకు వెళ్లాడు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1341281459.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తొలి విదేశీ కేసులో ఎన్ఐఏ ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో గురుద్వారాపై జరిగిన ఉగ్రవాద దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఇది ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న మొట్ట మొదటి విదేశీ కేసు కావడం విశేషం. ఎన్ఐఏ చట్టంలో సవరణ చేయడంతో విదేశాల్లో కేసులను దర్యాప్తు చేసే అధికారం దక్కింది. దీని ప్రకారం భారత్ వెలుపల భారతీయులపై ఎటువంటి ఉగ్రవాద దాడులు జరిగినా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. అంతేకాదు భారత్ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా జరిగే ఘటనలపైనా ఎన్ఐఏ దర్యాప్తు సాగిస్తుంది. కాగా, మార్చి 25న గురుద్వారాపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో భారతీయ పౌరుడితో పాటు 27 మంది మృతి చెందారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ ఐపీసీ, తీవ్రవాద వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసీస్కు చెందిన నిషేధిత తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ ప్రావిన్స్(ఐఎస్కేపీ) ప్రకటించుకుంది. (కుక్కల బోనులో బంధిస్తారు... చితకబాదుతారు!) -
పుల్వామా దాడి: అమెజాన్లో రసాయనాలు కొని..
శ్రీనగర్: గతేడాది 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలితీసుకున్న పుల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. జవాన్ల కాన్వాయ్ను పేల్చివేసేందుకు ఉపయోగించిన ఐఈడీ తయారీలో కీలకంగా వ్యవహరించిన వాజ్-ఉల్-ఇస్లాం(19), మహ్మద్ అబ్బాస్(32)లను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. బాంబు తయారీ కోసం వీరిద్దరు అమెజాన్లో పలు రసాయనాలు కొనుగోలు చేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు. విచారణలో భాగంగా.. జైషే మహ్మద్ ఉగ్రవాదుల సూచనల మేరకు.. తన అమెజాన్ షాపింగ్ అకౌంట్ను ఉపయోగించి వివిధ రసాయనాలు, బ్యాటరీలు, ఇతర పదార్థాలు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లు ఇస్లాం అంగీకరించాడని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. పుల్వామా ఉగ్రకుట్రలో భాగంగా ఇస్లామే వీటన్నింటినీ జైషే ఉగ్రవాదులకు వ్యక్తిగతంగా చేరవేశాడని పేర్కొన్నారు. (చదవండి: ఉగ్రవాది ఆదిల్కు శిక్షణ ఇచ్చింది అతడే!) అదే విధంగా పుల్వామా దాడికి ఉపయోగించిన ఐఈడీని తయారు చేసిన మహ్మద్ ఉమర్కు.. అబ్బాస్ 2018 నుంచి తన ఇంటిలో ఆశ్రయం కల్పించాడని తెలిపారు. కొన్నేళ్లుగా రహస్యంగా జైషే కోసం పనిచేస్తున్న అబ్బాస్... జవాన్ల వాహనశ్రేణిపై ఆత్మాహుతికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ దార్, పాకిస్తాన్ నుంచి వచ్చిన సమీర్ అహ్మద్ దార్, కమ్రాన్లకు సహకరించాడని పేర్కొన్నారు. అంతేగాకుండా జైషే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన తారీఖ్ అహ్మద్ షా, అతడి కూతురు ఇన్షా జాన్కు కూడా సహకారం అందించాడని వెల్లడించారు. త్వరలోనే ఇస్లాం, అబ్బాస్ను ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని తెలిపారు. కాగా పుల్వామాలోని హక్రిపొరాకు చెందిన ట్రక్ డ్రైవర్ తౌఫిక్ అహ్మద్ షా, అతడి కూతురు ఇన్షాజాన్(23)లు 2018-19 కాలంలో ఉగ్రవాదులకు చాలాసార్లు ఆహారం, ఇతర వస్తువులను సమకూర్చారన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు వారిని బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలతో ఈ కేసులో అరెస్టైన నిందితుల సంఖ్య ఐదుకు చేరింది.(‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్ ) -
పుల్వామా కేసులో తండ్రి, కూతురు అరెస్టు
శ్రీనగర్: గత ఏడాది 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఘటన విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కీలక పురోగతి సాధించింది. నిందితులకు జమ్మూలోని ప్రత్యేక న్యాయస్థానం 10 రోజుల రిమాండ్ విధించింది. పుల్వామాలోని హక్రిపొరాకు చెందిన ట్రక్ డ్రైవర్ తౌఫిక్ అహ్మద్ షా, అతడి కూతురు ఇన్షాజాన్(23)లు 2018–19 కాలంలో ఉగ్రవాదులకు చాలాసార్లు ఆహారం, ఇతర వస్తువులను సమకూర్చారు. పాకిస్తాన్ ఉగ్రవాది, పేలుడు పదార్థాల నిపుణుడు అయిన మొహ్మద్ ఉమర్ ఫరూక్, పాకిస్తాన్కే చెందిన కమ్రాన్, ఇస్మాయిల్ అలియాస్ ఇబ్రహీం, అలియాస్ అద్నాన్లు తౌఫిక్ ఇంట్లోనే బస చేశారు. ‘మొహ్మద్ ఉమర్తో ఇన్షా జాన్ టెలిఫోన్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు సాగించింది. అతడు చనిపోయే దాకా ఈ సంబంధాలు కొనసాగాయని మా దర్యాప్తులో తేలింది’అని ఎన్ఐఏ తెలిపింది. -
పుల్వామా ఉగ్రదాడి : తండ్రికూతుళ్ల అరెస్ట్
శ్రీనగర్ : పుల్వామా ఉగ్రదాడి విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక ముందడుగు వేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న తండ్రికూతుళ్లను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో జమ్మూకశ్మీర్లోని లెత్పొరాకు చెందిన తారిక్ అహ్మద్ షా, ఇన్షా తారిక్లు ఉన్నారు. సోమవారం రాత్రి వారి ఇళ్లపై సోదాలు జరిపిన అధికారులు మంగళవారం తెల్లవారుజామున అహ్మద్, ఇన్షాలను అరెస్ట్ చేశారు. పుల్వామా దాడికి కొద్ది రోజుల ముందు వీరు జైషే మొహ్మద్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్టుగా తెలుస్తోంది. అహ్మద్, ఇన్షా అరెస్ట్లతో ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసిన వారి సంఖ్య మూడుకు చేరింది. గతవారం పుల్వామా ఉగ్రదాడికి సహకరించిన జైషే మొహ్మద్ సభ్యుడు షకీర్ బషీర్ మాగ్రేను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పుల్వామా దాడిలో పాల్గొన్న ఆత్మా హుతి సభ్యుడు ఆదిల్ అహ్మద్ ధార్కు షకీర్ వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాడు. షకీర్ను విచారిస్తున్న ఎన్ఐఏ అధికారులు.. అతడి నుంచి రాబట్టిన సమాచారం మేరకే అహ్మద్, ఇన్షాలను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. కాగా, గతేడాది ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. (చదవండి : ‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్) -
‘పుల్వామా’ నిందితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: గత సంవత్సరం జరిగిన పుల్వామా దాడికి సంబంధించి ఒక కీలక నిందితుడిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) శుక్రవారం అరెస్ట్ చేసింది. అతడిని పాక్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహ్మద్ సభ్యుడిగా గుర్తించారు. పుల్వామాలోని కాకాపొరా ప్రాంతంలోని హజిబల్కు చెందిన షకీర్ బషీర్ మాగ్రే పుల్వామా దాడిలో పాల్గొన్న ఆత్మా హుతి సభ్యుడు ఆదిల్ అహ్మద్ ధార్కు వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాడు. బషీర్కు అక్కడ ఒక ఫర్నిచర్ షాప్ కూడా ఉంది. 2018లో పాకిస్తాన్ ఉగ్రవాది మొహ్మద్ ఉమర్ ఫారూఖ్ ద్వారా ధార్కు బషీర్ పరిచయం అయ్యాడు. ఆ తరువాత బషీర్.. జైషే మొహ్మద్ కోసం పూర్తి కాలం పనిచేశాడు. పలు సందర్భాలో ఆయుధాలు, పేలుడు సామగ్రిని ఉగ్రవాదుల కోసం సిద్ధం చేశాడని ఎన్ఐఏ తెలిపింది. -
కోర్టు ముందుకు ‘ఎల్గార్’ కేసు నిందితులు
ముంబై: ఎల్గార్ పరిషద్–మావోయిస్టు లింకు కేసులో అరెస్టయిన ఏడుగురు శుక్రవారం ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసు విచారణను ఎన్ఐఏ తీసుకున్న కొద్దిరోజులకే నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. 2017కు సంబంధించిన ఈ కేసును పుణే పోలీసులు విచారణ జరుపుతుండగా, ఈ ఏడాది జనవరిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బదలాయించారు. నిందితుల్లో సురేంద్ర గాడ్లింగ్, మహేశ్ రౌత్, రోనా విల్సన్, సుధీర్ ధవలే, వరవరరావు, అరుణ్ ఫెర్రీరా, సుధా భరద్వాజ్, షోమ సేన్, వెర్నన్ గోన్సాల్వేస్ ఉన్నారు. వీరిని బుధవారమే ఎర్రవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాలతో శుక్రవారం వీరిని కోర్టు జడ్జి డీఈ కొతాలికర్ ముందు ప్రవేశపెట్టారు. కాగా, తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేసింది. -
మద్యం..మగువ..వయాగ్రా..ఓ డీఎస్పీ!
శ్రీనగర్ : హిజ్బుల్ ముజహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పోలీసుల రిమాండ్లో ఉన్న జమ్ము కశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. దవీందర్ సింగ్ను అరెస్ట్ చేసిన క్రమంలో వారం పాటు ఉత్తర, దక్షిణ కశ్మీర్లో జరిగిన దాడుల్లో లభ్యమైన ఆధారాలు, రికార్డులు, సీజ్ చేసిన మెటీరియల్ ద్వారా సింగ్ నిర్వాకాలు దిగ్భ్రాంతిగొలిపేలా బయటపడ్డాయి. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా డీఎస్పీ దవీందర్ సింగ్ ఎవరిమాటా వినే రకం కాదని, ఆయన ఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి పనిచేయకుండా ఇష్టానుసారం వ్యవహరించేవాడని తెలిసింది. సింగ్ ఫోన్ మెసేజ్లు, సాగించిన సంభాషణలను స్కాన్ చేసిన మీదట ఆయన భిన్నమైన లైఫ్స్టైల్ను కలిగి ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. నిత్యం మద్యం సేవించడంతో పాటు దాదాపు పన్నెండు మంది మహిళలతో ఆయనకు సంబంధాలున్నట్టు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. మహిళలతో ఎఫైర్లు నడపటంపై సింగ్ విచ్చలవిడిగా ఖర్చు చేస్తారని లైంగిక సంబంధాలకు బానిసగా మారిన ఆయన నిత్యం వయాగ్రాను వాడతారని ఓ ప్రైవేట్ టీవీ చానెల్తో ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. అరెస్ట్ అయిన నాలుగు వారాల తర్వాత దవీందర్ సింగ్ పీలగా, వయసుమీరిన వ్యక్తిగా కనిపిస్తున్నాడని ఆ వర్గాలు తెలిపాయి. తన ఖరీదైన అలవాట్లను కొనసాగించేందుకు ఆయనకు డబ్బు అవసరం విపరీతంగా పెరిగిందని, తన లైఫ్స్టైల్ను మెయింటెయిన్ చేసేందుకు భారీ మొత్తాలు అవసరమయ్యాయని పేర్కొన్నాయి. ప్లేబాయ్ లైఫ్స్టైల్తో పాటు శ్రీనగర్ ఇంద్రానగర్లో తాను నిర్మించే విలాసవంతమైన భవంతికి నిధుల కొరత ఏర్పడిందని, బంగ్లాదేశ్లో వైద్యవిద్యను అభ్యసిస్తున్న ఇద్దరు కుమార్తెలకు ఫీజు చెల్లించాల్సి వచ్చిందని విశ్లేషించాయి. శ్రీనగర్లోని ప్రముఖ స్కూల్లో ఆయన కుమారుడు చదువుతున్నాడని, మిలిటెంట్లు, ఆయుధాలతో ఆయన రెడ్హ్యాండెడ్గా పట్టుబడేవరకూ ఖర్చులను బాగానే నిర్వహించారని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. నాలుగు దశాబ్ధాలుగా తాను చేసిన సేవలు ఈ ఆరోపణలతో నీరుగారిపోయాయని విచారణ సందర్భంగా సింగ్ వాపోయారని చెప్పాయి. తాను చేసిన పనులపై ఇప్పుడు ఆయనలో పశ్చాత్తాపం కనిపిస్తోందని, దర్యాప్తులో పలుమార్లు ఆయన కంటనీరు పెట్టుకున్నారని తెలిపాయి. హిజ్బుల్ కమాండర్ నవీద్ బాబు, అతడి ఇద్దరు అనుచరులకు సింగ్ సాయం చేశారని ఇంతకు మినహా దేశ వ్యతిరేక కార్యకలాపాలతో ఆయనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఎన్ఐఏ ఇంకా ఏమీ గుర్తించలేదని ఆ వర్గాలు వెల్లడించాయి. చదవండి : ఉగ్రవాదులకు పోలీసు సాయం.. -
నన్ను మరో జైలుకు పంపండి
న్యూఢిల్లీ: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ దవీందర్ సింగ్ తనను మరో జైలుకు మార్చాలంటూ.. జమ్మూలోని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్టును అభ్యర్థించారు. తను గతంలో అరెస్ట్ చేసిన పులువురు ఉగ్రవాదులు కోట్బాల్వాల్ జైలులో ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారితో తనకు ప్రాణహాని ఉందని కోర్టుకు విన్నవించుకున్నారు. తనను కోట్బాల్వాల్ జైలు నుంచి హీరానగర్ జైలుకు పంపించాలని ఎన్ఐఏ న్యాయస్థానాన్ని దవీందర్ అభ్యర్థించారు. కాగా దవీందర్ అభ్యర్థనకు కోర్టు అనుమతిస్తూ ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: ఉగ్రవాద డీఎస్పీ దవీందర్ సింగ్! ఇక పదిరోజుల పాటు జమ్మూకశ్మీర్ పోలీసుల అదుపులో ఉన్న దవీందర్ను.. దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ 15 రోజులపాటు తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం దవీందర్ను రిమాండ్కి పంపించింది. కాగా డీఎస్పీ దవీందర్ సింగ్ కరుడుగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది నవీద్ బాబా, అతని అనుచరుడితో కలిసి కారులో ప్రయాణిస్తూ జనవరి 11న పోలీసులకు చిక్కిన విషయం విదితమే. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు తన ఇంట్లో ఆశ్రయించి కల్పించినందుకు పోలీసులు దవీందర్ సింగ్ను ఆరెస్ట్ చేశారు. -
ఎన్ఐఏకు కోరెగావ్ కేసు
పుణే: 2018 కోరెగావ్–భీమా అల్లర్ల కేసు పుణే పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయింది. ఈ మేరకు తమకు కేంద్ర హోంశాఖ నుంచి శుక్రవారం సమాచారం వచ్చినట్లు మహారాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ తెలిపారు. 2018లో చెలరేగిన కోరెగావ్–భీమా అల్లర్ల కేసులో వామపక్ష నేతలు వరవరరావు, సుధీర్ ధావలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేశ్ రౌత్, షోమా సేన్, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గొన్సాల్వెస్, సుధా భరద్వాజ్లను అర్బన్ నక్సల్స్ పేరుతో అరెస్ట్ చేయడం తెల్సిందే. గత బీజేపీ ప్రభుత్వంలో కోరెగావ్–భీమాపై పెట్టిన కేసును తిరగదోడితే తమ బండారం బయటపడుతుందనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. -
నేవీలో హనీట్రాప్: పోలీసు కస్టడీకి నిందితులు
సాక్షి, విజయవాడ: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ విచారణను వేగవంతం చేసింది. ఈ మేరకు 11 మంది నేవీ సిబ్బందిని ఎన్ఐఏ అధికారులు సోమవారం ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు. విచారణలో భాగంగా నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు కోరారు. నిందితుల తరపు న్యాయవాది కోటంరాజు వెంకటేష్ శర్మ మాట్లాడుతూ న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నిందితులను ఈ నెల 17 నుంచి 22 వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిందితుల రిమాండ్ను మరో 14 రోజుల పాటు పొడిగించింది. పాకిస్తాన్ వలపు వల.. భారత నౌకాదళ సమాచారాన్ని తెలుసుకునేందుకు పాకిస్తాన్.. భారత నేవీ సిబ్బందిని టార్గెట్ చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఏజెంట్లు ఫేస్బుక్లో యువతుల పేరుతో నేవీ ఉద్యోగులను ట్రాప్ చేసి భారత్ రహస్యాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఈ వలలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న నేవీ సిబ్బంది చిక్కుకున్నారు. ఇక ఈ వ్యవహారంపై ఎన్ఐఏ, ఏపీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ మొదలుపెట్టాయి. ఈ ఘటనతో నౌకాదళం ఒక్కసారిగా ఉలిక్కిపడగగా ఇంటిదొంగల పనిపట్టేందుకు విచారణ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో పాక్ హనీట్రాప్లో పడి భారత నేవీ రహస్యాలను చేరవేసిన 11 మంది నేవీ సిబ్బందిని కోర్టులో హాజరుపర్చి విచారణ జరుపుతున్నారు. చదవండి: నేవీలో హానీట్రాప్పై ఎన్ఐఏ విచారణ! -
గొగోయ్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు
గువాహటి: సమాచార హక్కు కార్యకర్త అఖిల్ గొగోయ్ ఇంట్లో గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. తనిఖీల సందర్భంగా ల్యాప్టాప్తో పాటు వివిధ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. డిసెంబర్ 12న ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో నిరసనల నేపథ్యంలో అనేక రైతు సంఘాలకు సలహాదారుగా ఉన్న గొగోయ్ను ప్రభుత్వం అరెస్టు చేసింది. గువాహటిలోని నిజరపరా ప్రాంతంలోని గొగోయ్ నివాసంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. అతని పాన్ కార్డు, ఎస్బీఐ డెబిట్ కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్బుక్ కాపీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన తనిఖీలు మూడు గంటలపాటు జరిగాయి. తనిఖీలు ముగిసిన అనంతరం గొగోయ్ భార్య గీతాశ్రీ తములీ స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాను విలేకరులకు చూపించారు. కజిరంగలోని కేఎంఎస్ఎస్ ఆర్చిడ్ ఎన్విరాన్మెంట్ పార్కుకు సంబంధించిన పత్రాలను కూడా ఎన్ఐఏ బృందం కోరిందనీ, అయితే దానికి సంబంధించిన సమాచారం ఏమీ తన దగ్గర లేదని ఆమె వారికి చెప్పింది. కాగా, గొగోయ్ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం ఆదేశించింది. -
హిందూ నేతల హత్యకు కుట్ర..
చెన్నై : ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రభావానికి లోనైన కొంతమంది హిందూ నేతల హత్యకు కుట్రపన్నారన్న సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తమిళనాడులో సోదాలు చేపట్టింది. కోవై, ఇలయంగూడి, ట్రిచి, కయల్పట్టిణం, నాగాపట్టిణం తదితర ఆరు ప్రాంతాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్, ఆయన కుమారుడు ఓంకార్ను హత్య చేయడమే ప్రధాన లక్ష్యంగా కొన్ని ఉగ్రసంస్థలు కుట్ర పన్నాయని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. వారితో పాటు మరికొంత హిందూ నేతలను కూడా హతమార్చేందుకు పథకం రచించినట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు. కాగా తమిళనాడుకు చెందిన హిందూ నేతలు సంపత్, హిందూ మున్నై నేత మూకాంబికా మణి, శక్తి సేన నేత అంబు మారిల హత్యకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఎన్ఐఏ ప్రత్యేక బృందం ఛేదించిన విషయం తెలిసిందే. ఇక దక్షిణ రాష్ట్రంలో ఐఎస్ ప్రభావిత ఉగ్ర గ్రూపుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. 2014 నుంచి దేశ వ్యాప్తంగా మొత్తం 127 మంది ఐఎస్ సానుభూతి పరులను అరెస్టు చేయగా వారిలో 27 మంది తమిళనాడుకు చెందిన వారే ఉండటం గమనార్హం. -
ఉగ్రమూకలకు ఫండ్స్.. కరెక్ట్గా స్పాట్ పెట్టాం!
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్న విదేశీ సంస్థలకు కరెక్ట్గా చెక్ పెట్టామని, ఉగ్రవాదానికి నిధుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు ద్వారా ఆయా విదేశీ సంస్థలపై సరైనరీతిలో ఒత్తిడి తీసుకురాగలిగామని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం టాప్ పోలీసుల సదస్సులో దోవల్ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సమగ్రమైన వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి నిధులు అందకుండా ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని, క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. కశ్మీర్ లోయలో ఉగ్రమూకలకు అందుతున్న నిధులపై ఎన్ఐఏ గట్టిగా చెక్ పెట్టడం, యాంటీ టెర్రర్ ఫైనాన్సింగ్ గ్రూప్ అయిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పాకిస్థాన్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పాకిస్థాన్లో ఉగ్రవాదులకు అందుతున్న నిధులపై ఎఫ్ఏటీఏఫ్ గట్టి చర్యలు తీసుకుందని, ఇది పాకిస్థాన్పై ఒత్తిడిని పెంచిందని పేర్కొంటూ.. సరైన ఆధారాలు, సమాచారం సేకరించడం ద్వారా ఇది సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రాల్లోని యాంటీ టెర్రరిస్ట్ టీమ్స్ను.. ఆయన ఉగ్రవాద వ్యతిరేక సైనికులుగా అభివర్ణించారు. ‘మీరు కేవలం దర్యాప్తు అధికారులు కాదు.. ఉగ్రవాద వ్యతిరేక సైనికులు. కేవలం దర్యాప్తు చేయడమే కాదు.. ఉగ్రవాదంపై సమగ్ర పోరాటాన్ని చేయాలి. కేవలం నిఘా సంస్థలే దీనిని చేయలేవు. దర్యాప్తు అధికారులు ఎఫ్ఐఆర్, చార్జ్షీట్లను మించి లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని సూచించారు. -
భారత్లోకి ఉగ్ర మూకలు?
భుజ్(గుజరాత్)/కోయంబత్తూరు: కశ్మీర్కు స్వతంత్రప్రతిపత్తి రద్దు అనంతరం పాకిస్తాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఆ దేశం నుంచి ఉగ్రవాదులు దేశంలోకి దొంగచాటుగా ప్రవేశించే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో గుజరాత్ తీరం కచ్ జిల్లాలోని కాండ్లా, ముంద్రా పోర్టులతోపాటు కీలక సంస్థల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) కేరళ–తమిళనాడు మాడ్యూల్ కార్యకలాపాలపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోయంబత్తూర్లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. పాక్ కమాండోలు సముద్రం మీదుగా భారత్లోకి ప్రవేశించి మత విద్వేషాలు సృష్టించడంతోపాటు నీటిలో ఉండి దాడులకు తెగబడే అవకాశాలున్నాయంటూ భారత నేవీ హెచ్చరికలు పంపిన నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. కచ్ తీరంలో అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న ముంద్రా పోర్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. దేశంలోని అతిపెద్ద పోర్టుల్లో ఇది ఒకటి కాగా, ప్రభుత్వరంగ కాండ్లా నౌకాశ్రయం ద్వారా పెద్ద మొత్తంలో సరుకు రవాణా జరుగుతుంది. అరేబియా సముద్ర తీరంలోని ఈ రెండు పోర్టులు పాకిస్తాన్కు చేరువలో ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో జామ్నగర్లోని ప్రపంచంలోనే అతిపెద్ద రిలయన్స్ చమురుశుద్ధి కర్మాగారం, వడినార్ వద్ద రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ ఆయిల్ రిఫైనరీలున్నాయి. ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కచ్ జిల్లాలోని కాండ్లా పోర్టుతోపాటు కీలక సంస్థల వద్ద భద్రతను భారీగా పెంచాం’ అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బోర్డర్ రేంజ్) డీబీ వఘేలా తెలిపారు. పోలీసులు, మెరైన్ బలగాలు, ఇతర భద్రతా సంస్థలు ఈ ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశాయి. తీరప్రాంత భద్రతా చర్యలను పటిష్టం చేశామని, ఉగ్రవాదులు పాల్పడే ఎలాంటి దుస్సాహసాన్నయినా తిప్పికొట్టేందుకు బలగాలను అప్రమత్తం చేశామని డిప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ మురళీధర్ పవార్ తెలిపారు. ఐఎస్ లింకులపై ఎన్ఐఏ తనిఖీలు ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ కేరళ–తమిళనాడు మాడ్యూల్ కార్యకలాపాలపై కూపీ లాగుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం కోయంబత్తూరులో విస్తృతంగా సోదాలు చేపట్టింది. ఎర్నాకులంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జారీ చేసిన వారంట్ల మేరకు నిందితుల సంబంధీకులకు చెందిన ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేశాం. ఈ తనిఖీల్లో ఒక ల్యాప్టాప్, 5 సెల్ఫోన్లు, 4 సిమ్ కార్డులు, 1 మెమరీ కార్డు, 8 సీడీలు/డీవీడీలు, అభ్యంతరకర పత్రాలు లభించాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాం’ అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఎస్ కార్యాకలాపాలకు సంబంధించిన సమాచారంపై కొందరిని ప్రశ్నించామని తెలిపింది. కాగా, గత వారం రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడిన లష్కర్–ఇ– తైబా ఉగ్ర సంస్థ సభ్యులతో వీరికి సంబంధాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెడదారి పట్టిన యువతను సోషల్ మీడియా ద్వారా కొందరు వ్యక్తులు ఐఎస్ ఉగ్ర సంస్థలోకి ఆకర్షించి కేరళ, తమిళనాడుల్లో దాడులకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎన్ఐఏ మేలో కేసులు నమోదు చేసింది. -
వైఎస్ జగన్పై దాడి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం
సాక్షి, అమరావతి: గత ఏడాది విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దు చేస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. నిందితుడు శ్రీనివాస్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎన్ఐఏ వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఎన్ఐఏ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం శ్రీనివాస్ బెయిల్ రద్దు చేసింది. అయితే నిందితుడు బెయిల్పై అప్పీలు చేసుకునే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది. శ్రీనివాస్కు ఈ ఏడాది మే 22న బెయిల్ మంజూరు కాగా, 25న జైలు నుంచి విడుదల అయ్యాడు. దీంతో కోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ....హైకోర్టులో అభ్యర్థించారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్న విషయాన్ని కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, అసలు బెయిల్ మంజూరుకు కారణాలు కూడా తెలపలేదన్నారు. జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రత చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుందని, ఈ చట్టంలోని సెక్షన్ 6ఏ ప్రకారం బెయిల్ మంజూరుకు కారణాలు చెప్పడం తప్పనిసరని కోర్టుకు విన్నవించారు. 2018 అక్టోబర్ 25న వైఎస్ జగన్పై శ్రీనివాసరావు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని... హైదరాబాద్కు తిరిగి వస్తున్న సమయంలో విశాఖ ఎయిర్పోర్టు లాంజ్లో ఆయనపై దాడి జరిగింది. -
ప్రధాని లక్ష్యంగా దాడికి కుట్ర!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని దాడికి కుట్రపన్నినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులకు ఢిల్లీలో పట్టుబడిన తమిళనాడుకు చెందిన 14 మంది ఉగ్రవాదులు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, ‘వాగాద్–ఇ–ఇస్లామీ హింద్’ ఉగ్రసంస్థ చీఫ్ సయ్యద్ బుఖారీ, మిగతా ఉగ్రవాదులు అసన్ అలీ, ఆరిష్ మహమ్మద్ అలీ, తవ్హీద్ అహ్మద్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురిలో అసన్ అలీ, ఆరిష్ మహమ్మద్ అలీ అనే ఇద్దరిని చెన్నై పూందమల్లిలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా ఈనెల 25వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. మిగిలిన ఇద్దరినీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారించగా ఢిల్లీలో 14 మంది ఉన్నట్లు వాంగ్మూలం ఇచ్చారు. ఉగ్రవాదులు ఢిల్లీ, అరబ్ ఎమిరేట్స్లో ఉంటూ భారత్లో విధ్వంసాలకు కుట్రపన్నినట్టు తెలిపారు. ఈ విధ్వంసాలకు పాల్పడేందుకే ఈ 14 మంది అరబ్ నుంచి ఢిల్లీకి చేరుకున్నట్టు వివరించారు. ఈ ఉగ్రసంస్థ తమిళనాడుతోపాటు మోదీని టార్గెట్ చేసేందుకే వెలిసినట్లు చెప్పారు. ఢిల్లీలో పట్టుబడిన ఈ 14 మందిని ప్రత్యేక విమానంలో చెన్నైకి తీసుకొచ్చి మంగళవారం చెన్నై ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. -
దుర్వినియోగానికి తావీయొద్దు
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు మరిన్ని అధికారాలు కట్టబెట్టే సవరణ బిల్లుకు సోమవారం లోక్సభ ఆమోదం తెలిపింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం(యూఏపీఏ) సవరణ బిల్లును సభ ఇంకా ఆమోదించాల్సి ఉంది. ముంబైపై 2008లో ఉగ్రదాడి జరిగాక ఈ తరహా నేరాలను సమర్థవంతంగా అణచడం కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ అవసరమన్న అభిప్రాయం వ్యక్తమైంది. నిజమే, ఉగ్రవాదం మూలాలు వెదికి పట్టుకోవడం అంత సులభం కాదు. ఒక రాష్ట్రానికి చెందిన ఉగ్రవాదులు మరో రాష్ట్రంలోకి ప్రవేశించి భయోత్పాత ఘటనలకు పాల్పడి పరారు కావడం లేదా సరిహద్దు ఆవలినుంచి వచ్చి అలజడులు సృష్టించి తప్పించుకోవడం వంటి ఉదంతాలను సాధారణ పోలీసు దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయడం అసాధ్యం. ఇతరత్రా కేసుల ఒత్తిడి ఉండే సీబీఐకి కూడా అది కుదరని పని. ఇవన్నీ చూశాకే అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దశాబ్దకాలం ఆచరణ గమనించాక ఆ సంస్థకు మరిన్ని అధికారాలు అవసరమని భావించినట్టు కేంద్రం చెబుతుండగా...దేశంలో పోలీసు రాజ్యం స్థాపించడమే దీని ఆంతర్యమని కాంగ్రెస్, ఎంఐఎం, ఇతర విపక్షాలు ఆరోపించాయి. ఇలాంటి విమర్శలే గతవారం లోక్సభలో ప్రవేశపెట్టిన యూఏపీఏ సవరణ బిల్లుపై కూడా వ్యక్తమయ్యాయి. విదేశాల్లో ఉండే మన పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు చేసేవారిని, విదేశాల్లో మన ప్రయోజనాలను దెబ్బతీసేవారిని గుర్తించి వారిపై ఉగ్రవాద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ సవరణ బిల్లు అవకాశమిస్తోంది. అలాగే ఈ సంస్థ ఇకపై సైబర్ నేరాలను, మనుషుల అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలను, నకిలీ కరెన్సీ బెడదను దర్యాప్తు చేయడం ఈ సవరణల వల్ల వీలవుతుంది. వీటితోపాటు జిల్లా సెషన్స్ కోర్టులను అవసరాన్నిబట్టి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులుగా పరిగణించి ఉగ్రవాద కేసుల్ని అక్కడ విచారించేందుకు వీలు కల్పించడం కూడా ఈ సవరణల ఉద్దేశం. యూఏపీఏ సవరణ బిల్లు ఏ వ్యక్తినైనా ఉగ్రవాదిగా పరిగణించడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. వారి ఆస్తుల్ని స్వాధీనం లేదా జప్తు చేసేందుకు ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్కు అధికారమిస్తుంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఏదైనా సంస్థను ఉగ్రవాద సంస్థగా పరిగణించడానికి మాత్రమే వీలుంది. పాకిస్తాన్లో ఉంటున్న ఉగ్రవాద కార్యకలాపాలు సాగించే మసూద్ అజర్ వంటివారిని ఉగ్రవాదిగా పరిగణిస్తే ఆ దేశంపై అది ఒత్తిడి కలిగిస్తుందన్నది ప్రభుత్వం భావన. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించాలన్నదే తమ ఏకైక ఉద్దేశమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చ సందర్భంగా వివరించారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయబోమని కూడా హామీ ఇచ్చారు. కొత్త కొత్త రూపాల్లో సవాళ్లు ఎదురైనప్పుడు, ఉన్న చట్టాలు చాలనప్పుడు కొత్త చట్టాల ఆలోచన వస్తుంది. సమస్యను ఎదుర్కొనడానికి అవసరమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు అన్ని పక్షాలూ సహకరిస్తాయి. కానీ ఇలాంటి చట్టాలతో చిక్కేమిటంటే వాటిల్లో ఏదీ స్పష్టంగా ఉండదు. 1967లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం మొదటిసారి చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం–యూఏపీఏను చేసినప్పుడు ఆనాటి విపక్ష నేతలు వాజపేయి, పీలూ మోడీ దాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేశ ప్రజల్లో నమ్మకం కోల్పోయిన పర్యవసానంగానే పాలకులు ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తున్నారని నిశితంగా విమర్శించారు. ఆ చట్టానికే యూపీఏ హయాంలో 2004, 2008 సంవత్సరాల్లో సవరణలు తీసుకొచ్చారు. అప్పుడు కూడా వామపక్షాలు, కొన్ని ఇతర పార్టీలు అభ్యంతరం చెప్పాయి. ఉగ్రవాద చర్యకు ఈ సవరణలు విస్తృతార్థం ఇవ్వడం వల్ల చట్టబద్ధ నిరసనలు సైతం నేరంగా మారతాయని, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం లేని సాధారణ సంస్థలపై కేసులు బనాయించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ఆరోపించాయి. ఈ చట్టం కింద నిందితులైనవారికి సుదీర్ఘ కాలం నిర్బంధంలో ఉండక తప్పని స్థితి ఏర్పడుతుం దన్నాయి. విషాదమేమంటే అవన్నీ కేవల భయాలు కావని ఆ చట్టం అమలు చాటింది. ఉదాహ రణకు మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితులైనవారు పదేళ్లపాటు జైల్లో ఉన్నారు. తీరా వారంతా నిర్దోషులుగా తేలారు. బహిరంగంగా పనిచేసే సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్, విప్లవకవి వరవరరావు తదితరులు గత కొన్ని నెలలుగా జైళ్లలో మగ్గుతున్నారు. పైగా యూఏపీఏ చట్టం కింద నమోదైన కేసుల్లో అత్యధికం న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయి. జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం 2016లో 67 శాతం కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటి కొచ్చారు. అంతకుముందు సంవత్సరం 85 శాతం కేసుల పరిస్థితి కూడా ఇంతే. ఒక నేరం చేసిన వారిని శిక్షించడం కోసం కాక, ఇష్టం లేని, ఇబ్బందికరంగా మారిన వ్యక్తులను దీర్ఘకాలం నిర్బం ధించడానికి మాత్రమే ఇది వినియోగపడుతోంది. జిల్లా సెషన్స్ కోర్టులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులుగా పరిగణించి ఆ సంస్థ దర్యాప్తు చేసిన కేసు లపై విచారణ జరిపేందుకు అవకాశమివ్వడం కూడా అంత సబబైన నిర్ణయం అనిపించదు. మన న్యాయస్థానాలు ఇప్పటికే పెండింగ్ కేసుల భారంతో ఇబ్బందులు పడుతున్నాయి. సామా న్యులకు సకాలంలో న్యాయం లభించడం అసాధ్యమవుతోంది. ఇప్పుడు వాటిని ఎన్ఐఏ కోర్టులుగా పరిగ ణించడం వల్ల ఆ కేసుల విచారణ భారం కూడా తోడవుతుంది. రోజువారీ కేసుల విచారణతోపాటు ఉగ్రవాద కేసుల్ని కూడా చూడాల్సిరావడం వల్ల వాటి పని మందగిస్తుంది. మరోపక్క ఉగ్రవాద నిందితులను త్వరితగతిన విచారించి శిక్షించడం అసాధ్యమవుతుంది. కఠినమైన చట్టాలు తీసుకొచ్చినప్పుడు అమాయకులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చట్ట నిబంధనల్లో అస్పష్టతను పరిహరించడం ద్వారా, ఆ చట్టాలు దుర్వినియోగం కాకుండా తగిన రక్షణలు కల్పించడం ద్వారా మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలి. -
14 మంది ఉగ్రవాదులకు రిమాండ్
సాక్షి, చెన్నై: విదేశాల్లో ఉగ్రశిక్షణ పొంది భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 14 మంది ఉగ్రవాదుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోమవారం అరెస్ట్ చేసింది. శ్రీలంకలో ఉగ్రదాడుల అనంతరం ఎన్ఐఏ అధికారులు తమిళనాడుపై దృష్టి సారించారు. కోయంబత్తూరు, మదురై, సేలం, నాగపట్నం, చెన్నైలో సోదాలు నిర్వహించి ఇస్లామిక్ స్టేట్ మాడ్యుల్ సూత్రధారి అజారుద్దీన్ సహా ముగ్గురిని అరెస్ట్చేశారు. వీరిని విచారించగా విదేశాల్లో ఉగ్రశిక్షణ పొందిన 14 మంది తమిళనాడుకు రాబోతున్నట్లు తేలింది. దీంతో అరబ్ ఎమిరేట్స్ విమానంలో సోమవారం ఢిల్లీలో దిగిన 14 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుండి ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అన్జారుల్లా అనే తీవ్రవాద సంస్థతో వీరికి సంబంధాలున్నాయని, ఆ సంస్థకు నిధులు సమకూరుస్తున్నట్టు అనుమానిస్తున్నారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా ఈనెల 25 వరకు రిమాండ్ విధించింది. రిమాండ్లో భాగంగా వీరిని పుళల్ సెంట్రల్జైలుకు తరలించారు. (చదవండి: తమిళనాడులో పేలుళ్లకు కుట్ర?) -
ఎన్ఐఏకి కోరలు
న్యూఢిల్లీ: భారతీయులు లేదా భారత దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విదేశాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపైనా విచారణ చేపట్టేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అధికారాలిచ్చేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును లోక్సభ సోమవారం ఆమోదించింది. విదేశాలకు సంబంధించిన కేసుల విచారణను ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు పర్యవేక్షిస్తుంది. సైబర్ ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ నోట్లను వ్యాప్తిచేయటం, నిషేధిత ఆయుధాల తయారీ, వాటి అమ్మకం కేసులపై విచారించేందుకు కూడా ఎన్ఐఏకి ఈ బిల్లు అధికారం ఇస్తోంది. ఇలాంటి కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే అధికారం కూడా ఎన్ఐఏకు ఉంటుంది. 2008లో ముంబైలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించి 166 మందిని చంపేసిన అనంతరం, 2009లో ఉగ్రవాద కేసుల విచారణకు ప్రత్యేకంగా ఎన్ఐఏను ఏర్పాటు చేశారు. కొత్త సవాళ్లను పరిష్కరించేందుకు ఎన్ఐఏకు మరిన్ని అధికారాలు అవసరమని 2017 నుంచీ హోం శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ‘జాతీయ దర్యాప్తు సంస్థ (సవరణ) బిల్లు–2019’ని లోక్సభలో ప్రవేశపెట్టగా, అది ఆమోదం పొందింది. ఎన్ఐఏ చట్టాన్ని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయదని అమిత్ అన్నారు. తమ ప్రభుత్వ లక్ష్యం ఉగ్రవాదాన్ని అంతం చేయడమేననీ, దీనికి మతంతో సంబంధం లేదనీ, ఉగ్రవాదులు ఏ మతంలో ఉన్నా తాము వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు. ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు పంపేలా పార్లమెంటు అంతా ఈ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని అమిత్ షా కోరారు. హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదనీ, ఇప్పుడు వారి తప్పులను తాము సరిచేస్తున్నామని అన్నారు. బిల్లుకు 278 మంది సభ్యులు మద్దతు తెలపగా, ఆరుగురు మాత్రమే వ్యతిరేకించారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ ఓ కేసు విచారణ సందర్భంగా ఓ రాజకీయ నాయకుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను గతంలో బెదిరించాడని అన్నారు . ఆ మాటకు హైదరాబాద్ ఎంపీ ఒవైసీ అభ్యంతరం తెలుపుతూ ఆయన చెప్పిన దానికి ఆధారాలు చూపాలని కోరారు. దీంతో అమిత్ షా కలగజేసుకుంటూ ప్రతిపక్షం వాళ్లు మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ వాళ్లు అడ్డు తగలడం లేదనీ, అలాగే అధికార పార్టీ వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షం వాళ్లు కూడా ప్రశాంతంగా ఉండాలని ఒవైసీని ఉద్దేశించి అన్నారు. దీనికి ఒవైసీ స్పందిస్తూ, తనవైపు వేలు చూపించవద్దని అమిత్ షాకు చెప్పారు. తననెవరూ భయపెట్టలేరని ఆయన పేర్కొన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ తానెవరినీ భయపెట్టడానికి ప్రయత్నించడం లేదనీ, ఒవైసీ మనసులో భయం ఉంటే తానేమీ చేయలేనని అన్నారు. ఈ మాటల అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. లోక్సభకు అద్దెగర్భం బిల్లు అద్దె గర్భం (సరోగసీ) విధానాన్ని వ్యాపారంగా వాడుకోకుండా చూసేందుకు పలు నిబంధనలతో కూడిన ‘అద్దె గర్భం (నియంత్రణ) బిల్లు–2019’ని కూడా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కూడా గతేడాది డిసెంబర్లోనే లోక్సభ ఆమోదించినప్పటికీ పార్లమెంటు దీనికి పచ్చజెండా ఊపకపోవడంతో గడువు చెల్లింది. దీంతో ఈ బిల్లును మళ్లీ కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం కనీసం ఐదేళ్ల క్రితం పెళ్లి అయ్యి, ఇంకా పిల్లలు పుట్టని దంపతులకు మాత్రమే అద్దె గర్భం ద్వారా బిడ్డను కనే అవకాశం కల్పిస్తారు. అలా పుట్టిన బిడ్డను వారు మళ్లీ ఏ కారణం చేతనైనా వదిలేయకూడదు. దంపతుల్లో భార్య వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్య, భర్త వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. ఒక మహిళ తన జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి దంపతులకు తన గర్భాన్ని అద్దెకివ్వవచ్చు. ఆమె కచ్చితంగా పిల్లలు లేని దంపతులకు దగ్గరి బంధువై ఉండాలి. ఆమెకు అప్పటికే పెళ్లి అయ్యి, పిల్లలు ఉండాలి. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఇప్పటివరకు అద్దెగర్భం విధానానికి సంబంధించి ఇండియాలో చట్టం ఏదీ లేదు. దీంతో విదేశీయులు ఇక్కడకు వచ్చి, మన దేశంలోని మహిళల ద్వారా ఈ విధానంలో బిడ్డలను కంటూ ఆ మహిళకు సరైన పరిహారం ఇవ్వడం లేదు. అలాంటి మహిళలు ఇకపై దోపిడీకి గురవకుండా ఉండటం కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. -
ఎన్ఐఏ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సవరణ బిల్లును సోమవారం లోక్సభ ఆమోదించింది. ఎన్ఐఏకు మరిన్ని అధికారాలు కల్పించే విధంగా సవరణ బిల్లును రూపొందించారు. తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కూడా బిల్లులో పొందుపరిచారు. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శల నడుమ ఈ బిల్లు ఆమోదం పొందింది. సవరణ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు వ్యతిరేకించిన్పటికీ.. బిల్లు సునాయాసంగా పాసయ్యింది. తదుపరిగా రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభిస్తే చట్టంగా మారనుంది. కాగా చర్చలో భాగంగా సభలో విపక్షాల ఆరోపణలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో లా అండ్ ఆర్డర్ను పరిరక్షించడానికే ఎన్ఐఏను సవరించామని వివరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోటా చట్టం రద్ద చేసిన అనంతరం దేశంలో ఉద్రదాడులు మరింత పెరిగాయని విమర్శించారు. కేవలం ఓట్ల కోసం పోటా చట్టాన్ని రద్దు చేశారని, ఆ తరువాత ముంబై దాడులు జరిగాయని గుర్తుచేశారు. దాని స్థానంలోనే 2009లో ఎన్ఐఏ చట్టం చేశారని తెలిపారు. కీలకమైన బిల్లుకు పార్టీలన్నీ మద్దతు ఇవ్వాలని షా విజ్ఞప్తి చేశారు. మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఎప్పటికీ చట్టాలను దుర్వినియోగం చేయదని స్పష్టం చేశారు. -
ఒకేసారి 3 కీలక బిల్లులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డికి ఒకే రోజు మూడు కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం లభించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం –1967ను సవరిస్తూ తెచ్చిన బిల్లును, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యాక్ట్ –2008ను సవరిస్తూ ప్రతిపాదించిన బిల్లును, అలాగే మానవ హక్కుల చట్టం –1993ను సవరిస్తూ ప్రతిపాదించిన బిల్లులను ఆయన సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఇలా బిల్లులను ప్రవేశపెట్టడాన్ని విపక్ష సభ్యులు అధీర్ రంజన్ చౌదరి, శశిథరూర్, ఎన్.కె.ప్రేమచంద్రన్ తదితరులు వ్యతిరేకించారు. ముఖ్యంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం –1967ను సవరిస్తూ తెచ్చిన బిల్లును వ్యతిరేకించారు. సంస్థలుగా కాకుండా వ్యక్తులు గానూ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని నిర్బంధించేందుకు వీలుగా ఈ బిల్లును రూపొందించారు. అయితే ఈ బిల్లు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని, తీవ్రవాది అనే పేరుతో ఎవరినైనా నిర్బంధంలోకి తీసుకునే ప్రమాదం ఉందని విపక్ష సభ్యులు వ్యతిరేకించారు. మిగిలిన బిల్లులపైనా విభిన్న అంశాలను ప్రస్తావిస్తూ ఆయా సభ్యులు వ్యతిరేకించారు. అయితే మంత్రి కిషన్రెడ్డి ఆయా విమర్శలను దీటుగా తిప్పికొట్టారు. తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం సహించబోదని, సంస్థలను నిషేధించినా వాటి నుంచి విడిపోయి బయటకు వచ్చి వ్యక్తిగతంగా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అందుకే ఈ చట్టం తేవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆధార్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం: ఆధార్ను స్వచ్చందంగా ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పించే ఆధార్ సవరణ బిల్లు–2019ను రాజ్యసభ ఆమోదించింది. గత వారం ఈ బిల్లు లోక్సభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఫోన్ కనెక్షన్లు, బ్యాంకు అకౌంట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు తమ ధ్రువీకరణకు ఆధార్ వివరాలను వాడుకునేందుకు తాజా ప్రతిపాదనల్లో ప్రభుత్వం వీలు కల్పించింది. -
ఎన్ఐఏ దర్యాప్తు పరిధిని పెంచబోతున్నాం : కిషన్రెడ్డి
సాక్షి, విజయవాడ : తెలుగు రాష్ట్రాలు దేశంలో అగ్ర రాష్ట్రాలుగా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఆదివారం విజయవాడ దుర్గమల్లేశ్వరస్వామిని కిషన్రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని కోరుకున్నట్టు తెలిపారు. ఎన్ఐఏ దర్యాప్తు పరిధిని పెంచబోతున్నట్టు వెల్లడించారు. ఇతర దేశాల్లో కూడా మనపై జరుగుతున్న దాడులపై కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేసేలా చర్యలు తీసుకుంటాన్నామని అన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ను కూడా ఎన్ఐఏ పరిధిలో తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ మూడు బిల్లులను సోమవారం పార్లమెంట్లో హోం శాఖ ప్రవేశపెట్టబోతున్నట్టు చెప్పారు. అంతకు ముందు అమ్మవారి దర్శనానికి వచ్చిన కిషన్రెడ్డికి మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రాలతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ పండితులు కిషన్రెడ్డి వేద ఆశీర్వచనం చేసి, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. -
శ్రీనివాసరావు బెయిల్ పొడగింపు
సాక్షి, విజయవాడ : గత ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నానికి పాల్పడిన జె.శ్రీనివాసరావు బెయిల్ను ఎన్ఐఏ కోర్టు పొడగించింది. జూలై 12 వరకు బెయిల్ను పొడగిస్తూ ఏఐఏ కోర్టు తీర్పు వెల్లడించింది. బుధవారం విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో శ్రీనివాసరావును పోలీసులు ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలంటూ అధికారులు కోర్టును కోరారు. విచారణ చేపట్టిన ధర్మాసనం శ్రీనివాస్రావు బెయిల్ను వచ్చే నెల 12 వరకు పొడగించింది. 2018 అక్టోబర్ 25న వైఎస్ జగన్పై శ్రీనివాసరావు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని... హైదరాబాద్కు తిరిగి వస్తున్న సమయంలో ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ఆయనపై దాడి జరిగింది. -
శ్రీనివాసరావు బెయిల్ రద్దు చేయండి
సాక్షి, అమరావతి: గత ఏడాది వైఎస్ జగన్పై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నానికి పాల్పడిన జె.శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.సిద్ధిరాములు బుధవారం హైకోర్టును అభ్యర్థించారు. ఈ కేసుకు సంబంధించిన కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్న విషయాన్ని కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. అసలు బెయిల్ మంజూరుకు కారణాలు కూడా తెలియచేయలేదన్నారు. జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రత చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుందని, ఈ చట్టంలోని సెక్షన్ 6ఏ ప్రకారం బెయిల్ మంజూరుకు కారణాలు చెప్పడం తప్పనిసరని ఆయన వివరించారు. ఆ తరువాత శ్రీనివాసరావు తరఫు న్యాయవాది మట్టా జయకర్ వాదనలు వినిపించారు. -
‘ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశాం’
జమ్మూ కశ్మీర్: ఉగ్రవాద కార్యకలాపాలకు విదేశాల నుంచి నిధులు సేకరించారన్న కేసులో నిందితులుగా ఉన్న.. ఆషియా, మసరత్ ఆలామ్, సబీర్ షాలు నేషన్ల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణలో కీలక అంశాలను వెల్లడించారు. నిషేధిక ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా (జేయూడీ)కు తాము నిధులను సమీకరించామని విచారణలో ఒప్పుకున్నారు. జేయూడీ కార్యకలాపాలకు నిధులు మళ్లిస్తున్నారన్న ఆరోపణలతో వారిని ఈనెల 4న ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నిధుల మళ్లింపులో నిజాలు బయటకు రావడంతో అధికారులు వారిని అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా.. వారి మద్దతు దారులు కశ్మీర్ లోయలో నిరసనలు చేపట్టారు. కాగా కశ్మీర్లో భద్రతా బలగాలపైకి రాళ్లు విసురుతూ అల్లర్లు సృష్టిస్తున్న ఆరోపణలతో ఆషియాపై 2017లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
శ్రీనివాసరావు బెయిల్ను రద్దు చేయండి..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఏపీ హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పిటిషన్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, కావున అతని బెయిల్ను రద్దు చేయాల్సిందిగా ఎన్ఐఏ పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై హైకోర్టు త్వరలోనే విచారణ జరిపే అవకాశం ఉంది. కాగా వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో శ్రీనివాసరావు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన మే 25న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. బెయిల్ పత్రాలు అందడంతో జైలు అధికారులు శ్రీనివాసరావుని విడుదల చేశారు. -
ఐసిస్ మాడ్యూల్ సూత్రధారి అరెస్టు
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం శ్రీలంక ఆత్మాహుతి బాంబర్ జహ్రాన్ హషీంకు ఫేస్బుక్ స్నేహితుడైన ఐసిస్ తమిళనాడు మాడ్యూల్ సూత్రధారి మొహమ్మద్ అజారుద్దీన్ను అరెస్టు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఏడు ప్రాంతాల్లో సోదాల సందర్భంగా అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 14 మొబైల్ ఫోన్లు, 29 సిమ్కార్డులు, 10 పెన్డ్రైవ్లు, మూడు ల్యాప్టాప్లు, ఆరు మెమొరీ కార్డులు, నాలుగు హార్డ్ డిస్క్ డ్రైవ్లు, సీడీలు, డీవీడీలు, ఒక కత్తి ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈస్టర్ పర్వదినం సందర్భంగా శ్రీలంకలో సాగిన వరుస బాంబు పేలుళ్లలో రెండు వందల మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్ల అనంతరం తమిళనాడుపై ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత నెల కోయంబత్తూరులో ముగ్గురి ఇళ్లలో సోదాలు జరిపి, ల్యాప్టాప్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈనేపథ్యంలో బుధవారం 35మందితో కూడిన అధికారుల బృందం కోయంబత్తూరుకు చేరుకుంది. స్థానిక పోలీసులతో కలసి ఏడు చోట్ల తనిఖీలు చేపట్టారు. ఉక్కడం అన్భునగర్లోని అజారుద్దీన్, పోతనూరులోని సదాం, అక్బర్, అక్రమ్ తిల్లా, కునియ ముత్తురులోని అబూబక్కర్ సలీం, అల్లమిన్ కాలనీలోని ఇదయతుల్లా, కరీంషా ఇళ్లలో సోదాలు జరిపారు. కోయంబత్తూర్కు చెందిన అజారుద్దీన్తో పాటు మరో ఐదుగురు నాయకత్వంలో నడుస్తున్నట్టుగా అనుమానిస్తున్న తమిళనాడు మాడ్యూల్పై మే 30వ తేదీన కేసు నమోదు అయ్యింది. తమిళనాడు, కేరళలో ఉగ్రదాడులు నిర్వహించేందుకు యువతను ఆకర్షించడం వారి లక్ష్యమని ఎన్ఐఏ తెలిపింది. -
ఇంతకు తెగిస్తావా; జీవిత ఖైదు,రూ. 5 కోట్ల ఫైన్!
న్యూఢిల్లీ : విమానాన్ని హైజాక్ చేస్తామంటూ ప్రయాణీకులు, సిబ్బందిని భయాందోళనకు గురిచేసిన ముంబైకి చెందిన వ్యాపారవేత్త బిర్జు సల్లాకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అదే విధంగా బాధితులకు నష్ట పరిహారంగా 5 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. 2017లో జెట్ఎయిర్వేస్కు చెందిన 9W339 నంబరు గల విమానంలో బిర్జు ప్రయాణించాడు. ఈ క్రమంలో..‘ ఈ విమానాన్ని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్కు తీసుకువెళ్లాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అల్లా గ్రేట్’ అంటూ పలు బెదిరింపులతో టిష్యూ పేపర్పై లేఖ రాసి టాయిలెట్లో ఉంచాడు. ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో రాసిన ఈ లేఖను చూసి బెంబేలెత్తిపోయిన సిబ్బంది హుటాహుటిన విమానాన్ని అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర అసౌర్యానికి గురయ్యారు. ఈ క్రమంలో బిర్జును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాంటీ హైజాక్ చట్టం కింద అరెస్టు చేసి సెక్షన్ 3(1), 3(2)(a), 4(b)ల కింద కేసు నమోదు చేశారు. బిర్జు ఉద్దేశపూర్వకంగానే ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించాడని, దీనికి ఉగ్రవాదులతో సంబంధం లేదని ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారు. విచారణలో భాగంగా.. తన గర్ల్ఫ్రెండ్ జెట్ఎయిర్వేస్ ఢిల్లీ విభాగంలో పనిచేస్తుందని, ఇలా చేయడం ద్వారా అక్కడి ఆఫీసును మూసివేస్తే తనతో పాటు ముంబైకి వస్తుందనే ఆశతో హైజాక్ చేస్తామంటూ లేఖ రాశానని ఒప్పుకొన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అతడికి జీవిత ఖైదుతో పాటు భారీ జరిమానా విధిస్తూ ఎన్ఐఏ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. -
బాసిత్ కోణంలోనూ ఆంద్రాబీ విచారణ?
సాక్షి, హైదరాబాద్: కశ్మీర్ వేర్పాటువాద సంస్థ దుక్త్రాన్–ఏ–మిల్లత్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అసియా ఆంద్రాబీని నగరవాసి అబ్దుల్లా బాసిత్ కోణంలోనూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు విచారించనున్నారని తెలిసింది. ఆమె ఉగ్రవాద కార్యకలాపాలకు అవసరమైన నిధుల సమీకరణ కేసులో అరెస్టు అయి, ప్రస్తుతం ఎన్ఐఏ ఢిల్లీ యూనిట్ అదుపులో ఉన్నది. ఈమెకు నగరంతోనూ కొన్నిలింకులు ఉన్నాయి. 2015లో నగరంలో చిక్కిన బాసిత్ నేతృత్వంలోని ‘ఐసిస్ త్రయం’సైతం కశ్మీర్ వెళ్లి ఈమెను కలవడానికి ప్రయత్నాలు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు కనుగొన్నారు. ఉగ్ర నిధుల కేసులో ఎన్ఐఏ అధికారులు ఈ నెల 4న అసియా ఆంద్రాబీతోపాటు ముసరత్ ఆలం, షాబీర్ షాలను అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం పది రోజులపాటు వీరిని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. అప్పట్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి) జాతీయ మాజీ అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ కుటుంబాన్ని 2014లో నగరంలో ఆమె పరామర్శించి వెళ్లినట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఐసిస్లో చేరేందుకు సిరియా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న అబ్దుల్లా బాసిత్(గత ఏడాది మళ్లీ అరెస్టు అయ్యాడు) సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్లను 2015 డిసెంబర్లో సిట్ పోలీసులు నాగ్పూర్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. ‘సిమి’సలావుద్దీన్కు బంధువులైన వీరు నాగ్పూర్ నుంచి విమానంలో శ్రీనగర్ వెళ్లి అసియాను కలవాలనే ఉద్దేశంతో బయలుదేరారనే విష యం వెలుగులోకి వచ్చింది. ఈమె కుమారుడు సైతం నగరంలోని ఓ విద్యాసంస్థలో విద్యనభ్యసించాడు. ఈ నేపథ్యంలోనే 2012లోనూ ఆంద్రాబీ ఓసారి హైదరాబాద్కు వచ్చి వెళ్లారని సమాచారం. పాక్ అనుకూలవాదిగా ముద్రపడ్డ ఆంద్రాబీ 2015 సెప్టెంబర్లో కశ్మీర్లో పాకిస్తాన్ జాతీయ జెండాలను ప్రదర్శించి వివాదాస్పదమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన శ్రీనగర్ పోలీసులు ఆమెను అరెస్టు కూడా చేశారు. 2016లో ఓ సందర్భంలో జాతీయ మీడియాతో మాట్లాడిన అసియా హైదరాబాద్ వచ్చి సలావుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించినట్లు అంగీకరించారు. తాజాగా ‘అబుదాబి మాడ్యుల్’ కేసులో గత ఏడాది బాసిత్ అరెస్టు కావడం, ఇప్పుడు ఆంద్రాబీ సైతం ఎన్ఐఏ కస్టడీలో ఉండటంతో ఆమెను బాసిత్కు సంబంధించిన వివరాలపై ప్రశ్నించే అవకాశం ఉందని తెలిసింది. -
ఎన్ఐఏ కోర్టులో సాధ్వికి చుక్కెదురు
నూఢిల్లీ : బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్కు ఎన్ఐఏ కోర్టులో చుక్కెదురయ్యింది. మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టుకు హాజరు అయ్యే విషయంలో తనకు మినహాయింపు ఇవ్వాలంటూ సాధ్వి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ పిటిషన్ని విచారించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆమె పిటిషన్ను తిరస్కరించింది. వారంలో ఒక్క సారైనా తప్పకుండా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. 29 డిసెంబర్ 2008న రంజాన్ సమయంలో మాలేగావ్ లోని అంజుమన్ చౌక్, భీఖూ చౌక్ దగ్గర వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో ఆరుగురు చనిపోయారు. 101 మంది గాయపడ్డారు. మహారాష్ట్ర ఏటీఎస్ ఈ కేసులో సాధ్వీ ప్రజ్ఞా, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా అనేక మందిని దోషులుగా భావించి అరెస్ట్ చేసింది. డిసెంబర్ 2017లో మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వీ ప్రజ్ఞా, కల్నల్ పురోహిత్ పై మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ యాక్ట్ తొలగించారు. -
శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్పై వాదనలు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాస్ను పోలీసులు ఎన్ఐఏ కోర్డులో హాజరుపరిచారు. విచారణలో భాగంగా రిమాండ్లో ఉన్న శ్రీనివాస్ జ్యూడిషీయల్ రిమాండ్ ఇవాల్టితో ముగియనున్న విషయం తెలిసిందే. తనకు ఆరోగ్యం సరిగా లేదని, చికిత్సం కోసం బెయిల్ మంజూరు చేయాలని శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. లేఖ ద్వారా న్యాయమూర్తికి బెయిల్ పిటిషన్పై గతంలోనే విన్నవించిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్పై కోర్టు నేడు తుది నిర్ణయం తీసుకోనుంది. -
జనుపల్లి శ్రీనివాసరావుకు అనారోగ్యం..!
సాక్షి, తూర్పు గోదావరి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్రావు తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. అతన్ని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. శ్రీనివాస్ ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్పై.. టీడీపీ నేతకు చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేసే శ్రీనివాసరావు పదునైన కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే సీఎం చంద్రబాబుతో పాటు డీజీపీ, మంత్రులు, టీడీపీ నేతలు తెరపైకి వచ్చి నిందితుడు శ్రీనివాసరావు వైఎస్ జగన్ అభిమానే అంటూ తప్పుడు ప్రచారం చేశారు. హత్యాయత్నాన్ని చాలా తేలిగ్గా తీసిపారేశారు. ఈ కేసును తొలుత రాష్ట్ర ప్రభుత్వం సిట్కు అప్పగించింది. అయితే, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఈ కేసును శ్రీనివాసరావు ఒక్కడికే పరిమితం చేసి, సూత్రధారులు, కుట్రదారులను తప్పించారు. చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించారు. అయితే, ఈ కేసులో ఇంకా ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తి కాకుండానే చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు ఈ కేసును మొదటి నుంచీ తప్పుదోవ పట్టించేలా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారి మహ్మద్ సాజిద్ఖాన్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి : మా విచారణ పూర్తికాలేదు) -
కలిసే చదివారు... విడివిడిగా చేరారు!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అనుమానితులుగా, ఉగ్రవాది అబ్దుల్లా బాసిత్ అనుచరులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ 3 రోజులుగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణకు హాజరవుతున్న మసూద్ తహాజ్, షిబ్లీ బిలాల్ క్లాస్మేట్స్ అనే విషయం వెలుగులోకి వచ్చింది. విదేశంలో పీజీ వరకు కలిసే చదువుకున్నట్లు వెల్లడైంది. అయితే ఐసిస్లోకి మాత్రం బాసిత్ వేసిన ట్రాప్లో వేర్వేరుగా ఇరుక్కున్నారని ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. ఈ ఇద్దరితో పాటు మరో అనుమానితుడు జీషాన్ను సైతం అధికారులు వరుసగా మూడో రోజైన సోమవారమూ ప్రశ్నించారు. మాదాపూర్లోని హైదరాబాద్ యూనిట్ కార్యాలయంలో వీరిని, బాసిత్ రెండో భార్య మోమిన్ను మహారాష్ట్రలోని వార్దాలో విచారించారు. మహారాష్ట్రకు చెందిన మసూద్, షిబ్లీ కుటుంబాలు కొన్నేళ్ల క్రితం ఒమన్ను వలసవెళ్లాయి. దీంతో ఇద్దరూ అక్కడి ఎంబసీ అదీనంలో నడిపే భారతీయ పాఠశాలలో చదువుకున్నారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఇద్దరూ క్లాస్మేట్స్. గతేడాది ఎవరికి వారుగా భారత్కు వచ్చి నగరంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం వేర్వేరు సంస్థల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. బాసిత్ అనుచరులుగా... ఐసిస్ భావజాలానికి ఆకర్షితులైన వీరు వెబ్సైట్లు, సోషల్ మీడియాల్లో ఆ అంశాల కోసం బ్రౌజింగ్ చేస్తుండేవారు. ఈ క్రమంలో బాసిత్ నిర్వహిస్తున్న ఫేస్బుక్ పేజ్, టెలిగ్రామ్ చానల్ గ్రూప్ల్లో సభ్యులుగా మారారు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు బాసిత్కు అనుచరులయ్యారు. పాతబస్తీలో జరిగిన సమావేశంలో నేరుగా పాల్గొనే వరకు తామిద్దరం ఒకే సూత్రధారితో కలసి పని చేస్తున్నామన్నది మసూద్, షిబ్లీకి తెలియదు. మరోపక్క బాసిత్కు మోమిన్ పరిచయమైంది కూడా ఇలాంటి ఐసిస్ సంబంధిత సోషల్ మీడియా గ్రూపుల్లోనే. మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన ఈమె ఆయా గ్రూపుల్లో చేస్తున్న చర్చలు బాసిత్ను ఆకర్షించాయి. దీంతో గత ఏడాది తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా మోమిన్ను వివాహం చేసుకున్నాడు. ఆమెను హైదరాబాద్కు తీసుకువచ్చి మలక్పేటలో కాపురం పెట్టాడు. విదేశాల్లో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్లతో బాసిత్తో పాటు మోమిన్ సైతం సోషల్ మీడియా ద్వారా టచ్లో ఉండేది. గత ఏడాది ఆగస్టులో బాసిత్ అరెస్టు తర్వాత ఈమె వ్యవహారం కీలకంగా మారిందని అధికారులు చెప్తున్నారు. బిలాల్ తండ్రీ ఉగ్రవాద కేసు నిందితుడే... పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో (ఎల్ఈటీ) సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలున్న షిబ్లీ బిలాల్ తండ్రి మహ్మద్ షఫీఖ్ ముజావర్ 2002లో దిల్సుఖ్నగర్లోని సాయిబాబా ఆలయం వద్ద జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితుడే కావడం గమనార్హం. ఈ కేసులో ముజావర్పై నాంపల్లి కోర్టు నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కొన్నేళ్లుగా ఒమన్ కేంద్రంగానే వ్యవహారాలు నడిపిన ముజావర్ గత ఏడాది ఫిబ్రవరిలో ఖతర్ పయనమయ్యాడు. ఖతర్ ఎయిర్పోర్ట్లో దిగిన ఇతడిని పట్టుకున్న ఇంటర్ పోల్ భారత్కు బలవంతంగా (డిపోర్టేషన్) పంపింది. ఢిల్లీకి చేరుకున్న ఇతడిని సీఐడీ అరెస్టు చేసింది. ఈ అరెస్టు నేపథ్యంలోనే షిబ్లీ బిలాల్ సైతం హైదరాబాద్కు రావాల్సి వచ్చింది. గత జూన్లో ముజావర్కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
మా విచారణ పూర్తికాలేదు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్పై విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన హత్యాయత్నం కేసులో ఇంకా తమ విచారణ పూర్తి కాలేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారి మహ్మద్ సాజిద్ఖాన్ వెల్లడించారు. ఇంకా ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తి కాలేదని తెలిపారు. సీఎం చంద్రబాబు సహా పలువురు టీడీపీ నేతలు ఈ కేసును మొదటి నుంచీ తప్పుదోవ పట్టించేలా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కుట్ర కోణమేదీ లేదని ఏకంగా ఎన్ఐఏ తేల్చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎన్ఐఏ అధికారులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్పై.. టీడీపీ నేతకు చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేసే శ్రీనివాసరావు పదునైన కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే సీఎం చంద్రబాబుతో పాటు డీజీపీ, మంత్రులు, టీడీపీ నేతలు తెరపైకి వచ్చి నిందితుడు శ్రీనివాసరావు వైఎస్ జగన్ అభిమానే అంటూ తప్పుడు ప్రచారం చేశారు. హత్యాయత్నాన్ని చాలా తేలిగ్గా తీసిపారేశారు. సిట్ కూడా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఈ కేసును శ్రీనివాసరావు ఒక్కడికే పరిమితం చేసి, సూత్రధారులు, కుట్రదారులను తప్పించారు. ఎన్ఐఏకు మొదట్నుంచీ సహాయనిరాకరణే.. చివరకు హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ చేపట్టిన ఎన్ఐఏకు.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విశాఖ పోలీసులు సహాయ నిరాకరణ చేశారు. కేసు వివరాలు సైతం ఎన్ఐఏ అధికారులకు వెల్లడించలేదు. సీఎం చంద్రబాబు స్వయంగా ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. ఓ దశలో సుప్రీంకోర్టుకు సైతం వెళ్లాలని యోచించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు విశాఖ పోలీసులు ఓ దశలో ఏకంగా కోర్టుకు కూడా ఈ కేసు సీడీ ఫైల్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఎన్ఐఏ ప్రధాన దర్యాప్తు అధికారి (సీఐవో) మహ్మద్ సాజిద్ఖాన్తో సహా అధికారుల బృందాన్ని విశాఖ పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. చివరకు న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో చార్జిషీట్ ఫైల్ తీసుకుని ఎన్ఐఏ విచారణ చేపట్టింది. ఆ ఫైల్లోని వివరాలు ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. పదేపదే తప్పుడు ప్రకటనలు.. సీఎం చంద్రబాబు సిట్ మాదిరే ఈ కేసులో ఏమీ లేదంటూ ఎన్ఐఏ తేల్చేసిందని ఇష్టారీతిన పదేపదే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బహిరంగసభల్లో కోడికత్తి కేసుపై ఎన్ఐఏ వాళ్లు ఏం పీకారు.. మేం చెప్పిందే వాళ్లూ చెప్పారంటూ అసత్య ప్రకటనలు చేస్తున్నారు. దీనిపై ఎన్ఐఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మేమింకా ప్రాథమిక దర్యాప్తు కూడా పూర్తి చేయలేదని సీఐవో సాజిద్ ఖాన్ వెల్లడించారు. విచారణ కొనసాగుతున్న దశలో.. వివరాలేమీ చెప్పలేమన్నారు. -
అన్ని ‘సంఝౌతా’ కేసులేనా?
సాక్షి, న్యూఢిల్లీ : 12 ఏళ్ల క్రితం 68 మంది ప్రయాణికులను బలితీసుకున్న సంఝౌతా ఎక్స్ప్రెస్ బాంబు పేలుడు కేసులో నిందితులంతా విడుదలయ్యారు. నెంబర్ వన్ నిందితుడు స్వామి అసీమానంద్ సహా నిందితులందరిని మార్చి 20వ తేదీన కేసును విచారించిన ప్రత్యేక కోర్టు విడుదల చేసిన విషయం తెల్సిందే. నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలను సమర్పించడంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విఫలమైనే కారణంగానే నిందితులను విడుదల చేస్తున్నట్లు ప్రత్యేక కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇంతకుముందు మక్కా మసీదు, ఆజ్మీర్ షరీఫ్ బాంబు పేలుళ్ల కేసుల నుంచి కూడా స్వామి అసీమానంద్ సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగానే విడుదలయ్యారు. హిందూత్వ టెర్రర్ కేసులన్నింటిలో సరైన సాక్ష్యాధారాలు సేకరించడంలో ఎన్ఐఏ విఫలమైందంటూ కోర్టులు పలు సార్లు ఆరోపించడం ఇక్కడ గమనార్హం. ప్రత్యేక కోర్టు తీర్పుతో విడుదలైన అసీమానంద బయటకు రాగానే తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. 2010, డిసెంబర్ నెలలో, 2011, జనవరి నెలలో బాంబు పేలుళ్ల వెనక తన హస్తం ఉందని కోర్టు ముందు అసీమానంద స్వయంగా వాంగ్మూలం ఇచ్చారు. కొన్ని నెలల తర్వాత మాటమార్చి పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేయడం వల్ల అలా తాను వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత ‘కారవాన్’ అనే వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను పోలీసులు చిత్ర హింసలకు గురిచేశారన్న విశయాన్ని ఖండించారు. ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన అన్ని హింసాత్మక సంఘటనల్లో తన హస్తం ఉందని గర్వంగా చెప్పుకున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ముస్లింలు లక్ష్యంగా జరిగిన అన్ని బాంబు పేలుళ్ల సంఘటనలకు ఆరెస్సెస్ నాయకులు మోహన్ భగవత్, ఇంద్రేశ్ కుమార్ల దీవెనలు కూడా ఉన్నాయని ఆయన ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2006లో జరిగిన మాలెగావ్ బాంబ్ కేసు, 2007లో జరిగిన సంఝౌతా బాంబ్ కేసు, 2007లో జరిగిన మెక్కా మసీదు పేలుడు కేసు, 2007లోనే జరిగిన అజ్మీర్ షరీఫ్ పేలుడు కేసు, 2008లో జరిగిన మాలేగావ్ మరో కేసు... వీటన్నింటి వెనక హిందూత్వ శక్తుల హస్తం ఉందనే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ఈ అన్ని కేసుల వెనక హిందూత్వ శక్తుల నెట్వర్క్ హస్తం ఉందనడానికి సరైన ఆధారాలు ఉన్నాయని ‘సంఝౌతా ఎక్స్ప్రెస్ బాంబు పేలుడు కేసు’ ప్రత్యేక దర్యాప్తు బృందానికి మూడేళ్లపాటు నాయకత్వం వహించిన హర్యానా పోలీసు అధికారి వికాస్ నారాయణ్ రాయ్ 2016, జూన్ 6వ తేదీన ‘ది వైర్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సంఝౌతా ఎక్స్ప్రెస్ కేసు దర్యాప్తు సందర్భంగా ఆయన ఇండోర్ వెళ్లడం, అక్కడి ఆరెస్సెస్ సభ్యుడు సునీల్ జోషి, అతని ఇద్దరు అనుచరుల హస్తం ఉందని విచారణలో తేలడం, ఆ బృందం సునీల్ జోషిని అరెస్ట్ చేసేలోగా ఆయన హత్య జరగడం తదితర పరిణామాల గురించి పోలీసు అధికారి వికాస్ నారాయణ్ రాయ్ పూసగుచ్చినట్లు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. సంఝాతా కేసులో నిందితులను మార్చి 20వ తేదీన ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ‘ది వైర్ న్యూస్’ నాటి వికాస్ నారాయణ్ రాయ్ ఇంటర్వ్యూను ఈ మార్చి 21వ తేదీన పునర్ ప్రచురించింది. ఈ హిందూత్వ కేసుల దర్యాప్తును 2011లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) స్వీకరించినప్పటి నుంచి కొన్ని కేసులు కాల గర్భంలో కలిసి పోయాయి. కొన్ని కేసుల్లో సాక్ష్యాధారాలు లేక నిందితులు విడుదలయ్యారు. కొన్ని కేసుల్లో నిందితులంతా బెయిల్పై విడుదలయ్యారు. ఒక్క కేసులో కూడా ఒక్క నిందితుడికి కూడా శిక్ష పడలేదు. 2008 నాటి మాలెగావ్ కేసులో నిందితులైన సాధ్వీ ప్రజ్ఞా, లెఫ్ట్నెంట్ కల్నల్ పురోహిత్ బెయిల్పై విడుదలయ్యారు. నాటి ఆరెస్సెస్ స్థానిక నాయకుడు ఇంద్రేశ్ కుమార్ నేడు ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎదిగారు. సాక్ష్యాధారాలు లేక సంఝౌతా కేసు నుంచి కూడా పురోహిత్ విడుదలయ్యారు. ఎవరి మధ్య ఏం ‘సంఝౌతా’ కుదరిందోగానీ నేరస్థులతా తప్పించుకున్నారు. దేశంలో జరగుతున్న టెర్రరిస్టు దాడుల కేసులను త్వరతిగతిన దర్యాప్తు జరిపి నేరస్థులకు తగిన శిక్ష విధించేందుకు 2009లో కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ సంస్థను ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ టెర్రరిస్టు కేసుల దర్యాప్తునకు ఏ రాష్ట్రం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంస్థకు చీఫ్గా 2017లో ఐపీఎస్ అధికారి వైసీ మోదీ నియమితులయ్యారు. -
సంఝౌతా కేసులో స్వామి అసీమానందకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : సంఝౌతా ఎక్స్ప్రెస్ పేలుళ్ల కేసులో స్వామి అసీమానందతో పాటు నలుగురిని ఎన్ఐఏ కోర్ట్ నిర్దోషులుగా ప్రకటించింది. 12 ఏళ్ళ తరువాత సంఝౌతా ఎక్స్ప్రెస్ బాంబు పేలుళ్ళ కేసులో హర్యానా లోని పంచకుల ఎన్ఐఏ కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. బాంబు పేలుళ్లలో నిందితుల హస్తం ఉందని నిరూపించే సాక్షాలు సమర్పించడంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ బృందం విఫలమవడంతో స్వామి అసీమానంద సహా నలుగురు నిందితులకు పంచకుల నేషనల్ ఇన్వెస్టిగేషన్ కోర్ట్ ఊరట కల్పించింది. 2007 ఫిబ్రవరి 18న సంఝౌతా ఎక్స్ప్రెస్లో ఐఈడీ పేలుడులో 63 మంది ప్రయాణికులు మరణించారు. బాధితులు పాకిస్తాన్కు చెందిన వారు కావడం గమనార్హం. సంఝౌతా ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం అఠారీకి వెళుతుండగా హర్యానాలోని పానిపట్ జిల్లా దీవానా రైల్వేస్టేషన్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. పేలుడు కేసుపై దర్యాప్తునకు ఫిబ్రవరి 20, 2007న సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 2010లో కేసును ఎన్ఐఏకు బదలాయించింది. కాగా దర్యాప్తులో భాగంగా 290 మంది సాక్షులను ఎన్ఐఏ విచారించింది. ఈ కేసులో స్వామి అసీమానంద, సునీల్ జోషి, లోకేష్ శర్మ, సందీప్ డాంగే, రామచంద్ర కలసాంగ్ర, రాజేంద్ర చౌదరి, కమల్ చౌహాన్లను దోషులుగా ఎన్ఐఏ తన చార్జిషీట్లో ఆరోపించింది. ఇక కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొన్న సునీల్ జోషి 2007 లో మధ్యప్రదేశ్ దీవాస్ లో మరణించగా, ఇతర నిందితులు రామచంద్ర కలసాంగ్ర, సందీప్ డాంగేల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం గమనార్హం -
‘పుల్వామా’తో ఏకతాటిపైకి ప్రపంచం
సాక్షి, హైదరాబాద్: పుల్వామా ఉగ్ర దాడి యావత్ ప్రపంచాన్ని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం చేసిందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఉగ్రవాదంపై నిర్ణయాత్మకమైన పోరు జరగాల్సిన సమయం ఇదేనని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని మాదాపూర్లో రూ. 37 కోట్లతో నిర్మించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నూతన భవనాన్ని, నివాస సముదాయాలను రాజ్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఉగ్రవాదంపై అంతిమ యుద్ధం మన గడ్డపైనే మొదలు కావాలి. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ పుల్వామా ఉగ్ర దాడి తరువాత అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. పుల్వామా దాడిలో 40 మంది సీఆర్ర్పీఎఫ్ జవాన్లు మరణించారు. గతంలోనూ ఇలాంటి ఉగ్ర దాడులు జరిగినప్పటికీ తాజా ఘటన మాత్రం ప్రపంచ దేశాలను ఉగ్రవాదంపై గట్టిగా తిరగబడేందుకు సిద్ధం చేసింది. ఉగ్రవాద సంస్థలకు అనేక మార్గాల ద్వారా అందుతున్న నిధులను అడ్డుకోగలిగితే సమస్య సమసిపోతుంది. ఈ అంశంలో ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు కూడా భారత్కు మద్దతు పలుకుతున్నాయి’అని చెప్పారు. ఎన్ఐఏ తీసుకున్న అనేక చర్యల వల్ల ఉగ్రవాదులకు అందుతున్న నిధులు గణనీయంగా తగ్గిపోయాయని, దొంగ నోట్ల చెలామణి కూడా తగ్గిపోయిందన్నారు. ఎన్ఐఏ 92 శాతం కేసుల్లో నేరాలు రుజువు చేసి శిక్ష వేయించగలిగిందని అభినందించారు. ఉగ్రవాదానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించేందుకు ఎన్ఐఏ విదేశీ సంస్థల సహకారం కూడా తీసుకుంటోందని చెప్పారు. వైఖరి మారుతోంది... ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ లాంటివి తొలిసారి భారత విదేశాంగ మంత్రిని వారి సదస్సుకు ఆహ్వానించడం స్వాగతించదగ్గ పరిణామమని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి కులమతాలేవీ ఉండవని.. కొందరు మతానికి, ఉగ్రవాదానికి ముడిపెట్టడం ఏమాత్రం సరికాదన్నారు. పుల్వామా దాడి తరువాత భారతీయులందరూ కులమతాలకు అతీతంగా తమ ఆవేదనను వ్యక్తం చేశారన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థలను బలోపేతం చేసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని.. ఇందులో భాగంగా ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)పై ప్రత్యేక పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చామని రాజ్నాథ్ తెలిపారు. అంతేకాకుండా కేసుల దర్యాప్తును వేగవంతం చేసేందుకు 100 పోస్టులు సిద్ధం చేశామన్నారు. -
రాష్ట్రం అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో ఉన్న ప్రధాన నగరాల్లో దాడులు జరగవచ్చన్న సమాచారంతో అన్ని రాష్ట్రాల డీజీపీలను అలర్ట్ చేసింది. దీంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానిత ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్తోపాటు ఉత్తర తెలంగాణలోని కొన్ని సున్నిత ప్రాంతాల్లో అనుకోని ఘటనలు జరగవచ్చన్న సమాచారంతో నిఘా పెంచిన ఇంటెలిజెన్స్ విభాగం ఎప్పటికప్పుడు సమాచారాన్ని డీజీపీ కార్యాలయానికి చేరవేసింది. క్రోడీకరించిన స్థానిక సమాచారాన్ని తెలంగాణ పోలీసులు గంటగంటకూ ఐబీ కార్యాలయానికి అందజేశారు. కేంద్ర సంస్థల వద్ద భద్రత పెంపు.. హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రైల్వేస్టేషన్లు, శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టుతోపాటు పలు చోట్ల సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. స్లీపర్సెల్స్ దాడులు ఉంటాయన్న అనుమానంతో కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. వాస్తవానికి గోకుల్చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల తరువాత హైదరాబాద్లో ఉగ్ర దాడులు జరిగిన దాఖలాలు లేవు. కానీ పాక్ సానుభూతిపరులు, పాక్ ప్రేరేపిత ఉగ్రమూక సంస్థలకు పనిచేసే వారిని నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు గుర్తించి అరెస్టు చేస్తున్నాయి. ఫలితంగా పలు ఉగ్ర కుట్రలను ముందే ఛేదించగలిగారు. ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను 2016 జూలైలో జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసిన తరువాత తిరిగి అలాంటి కలకలమేదీ రేగలేదు. నగరంలో స్లీపర్ సెల్స్ ఉన్నట్లు సమాచారం లేకున్నా.. ముందు జాగ్రత్తగా పకబడ్డందీ రక్షణ చర్యలు చేపట్టారు. జనసమ్మర్థ, సున్నిత ప్రాంతాల్లో తనిఖీలు, అనుమానితులపై నిఘాను పెంచారు. -
జగన్పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ కీలక నిర్ణయం
-
ఇకపై ‘ఇన్ కెమెరా’ విచారణ
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన కేసు విచారణను ఇకపై ఇన్ కెమెరా ద్వారా చేపట్టాలని విజయవాడలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించిన ఇరుపక్షాల న్యాయవాదులు తప్ప, మరెవ్వరూ కూడా ఈ కేసు విచారణ సమయంలో కోర్టులో ఉండరాదని స్పష్టంచేసింది. అలాగే, ఇకపై ఈ కేసుకు సంబంధించి కోర్టులో జరిగే విచారణపై ఎలాంటి వార్తలు రాయడంగానీ, ప్రసారం చేయడంగానీ చేయరాదని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. జగన్పై జరిగిన హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. చార్జిషీట్కు ప్రత్యేక కోర్టు నెంబర్ కేటాయించక ముందే ఈ చార్జిషీట్ బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో గత విచారణ సమయంలోనే న్యాయమూర్తి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ నిర్వహణకు ఆదేశాలిస్తానని సూచనప్రాయంగా చెప్పారు. ఈ కేసు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ ముగియడంతో అతన్ని పోలీసులు ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. విచారణ ప్రారంభం కాగానే, న్యాయమూర్తి ఎన్ఐఏ చట్టంలోని సెక్షన్ 17(3) ప్రకారం ఈ కేసును ఇకపై ఇన్ కెమెరా (కేసుకు సంబంధించిన వారి సమక్షంలోనే విచారణ జరపడం) ద్వారా విచారణ చేపడతామంటూ ఉత్తర్వులు జారీచేయడం ప్రారంభించారు. కేసు విచారణ వేగవంతం అయ్యేందుకు, అలాగే నిష్పాక్షికంగా విచారణ జరిగేందుకు ఈ విచారణ తోడ్పతుందని న్యాయమూర్తి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, సాక్షులు, నిందితుడు, పీపీలు, న్యాయవాదుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు తరఫు న్యాయవాది మట్టా జయకర్ చార్జిషీట్లోని అంశాలు పత్రికల్లో వచ్చాయంటూ, వాటి కాపీలను న్యాయమూర్తికి ఇచ్చారు. ఈ ఉత్తర్వులు జారీచేసిన తరువాత కోర్టు హాలులో ఉన్న ఇతర కక్షిదారులు, న్యాయ విలేకరులు, ఇతర రిపోర్టర్లు, న్యాయవాదులను బయటకు పంపేశారు. -
ఎన్ఐఏకు పుల్వామా ఉగ్రదాడి కేసు
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాతీయదర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించింది. హోంశాఖ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎన్ఐఏ విచారణ చేపట్టింది. ఘటనాస్థలి నుంచి ఇప్పటికే ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ, ఫోరెన్సిక్ బృందం మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఫిబ్రవరి 14న సీర్పీఎఫ్ జవాన్ల వ్యాన్పై జరిగిన ఆత్మహుతి దాడిలో 40 మందికి పైగా జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందని భారత ప్రభుత్వం ఆరోపిస్తుండగా మరోవైపు పాక్ మాత్రం తమకెలాంటి సంబంధం లేదంటోంది.