వైఎస్ జగన్ రూ. 50 లక్షల విరాళం | ys-jagan-mohan-reddy-donate-rs-50-lacs-to-hudhud-victims | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 16 2014 10:46 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనవంతుగా రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ సాయాన్ని బాధితులను ఆదుకునేందుకు వినియోగించనున్నారు. తుపాను కారణంగా సర్వం కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ముందుకు రావాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్నారు. కాగా, తుపాన్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని వైఎస్ఆర్ ఫౌండేషన్- 'సాక్షి' మీడియా గ్రూపు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. సహాయం చేయదలిచిన వారికోసం బ్యాంకు ఖాతా ప్రారంభించినట్టు వెల్లడించాయి. సహాయం చేయదలిచిన వారు డిడిలు, చెక్కులు ఇందులో జమ చేయొచ్చని తెలిపాయి. సాక్షి' కార్యాలయాల్లోనూ నేరుగా డిడిలు, చెక్కులు అందజేయవచ్చు. అకౌంట్ పేరు: వైఎస్ఆర్ ఫౌండేషన్ అకౌంట్ నంబర్: 31868397566 బ్యాంకు పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎస్ సీ కోడ్: ఎస్ బీఐఎన్ 0008022 బ్రాంచి: బంజారాహిల్స్, హైదరాబాద్ బ్రాంచి కోడ్: 08022

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement