సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ. | YS Jagan pens open letter to Chandrababu | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 9 2014 4:19 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ప్రభుత్వ ఆదాయవ్యయాల లెక్కలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు ఒక లేఖ రాశారు. బడ్జెట్ లెక్కలపై కేంద్రం అనుసరిస్తున్న పద్ధతినే రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పుడే పారదర్శకత ఉన్న పాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే పద్దతి అనుసరిస్తోందని తెలిపారు. తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి ఏపీ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని అనుసరించాలని ఆ లేఖలో వైఎస్ జగన్ కోరారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement