Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Illegal case registered against Sakshi editor V Murali1
పత్రికా స్వేచ్ఛపై ‘రెడ్‌బుక్‌’ పడగ

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన మీడియాపై కూడా చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో వేధింపులకు తెగించింది. పత్రికా స్వేచ్ఛ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరా­స్తూ ఎమర్జెన్సీ రోజుల నాటి అరాచకాలకు తెరతీసింది. టీడీపీ కూటమి సర్కారు అసమర్థ, అవినీతి పరిపాలనను సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుంచుతున్న ‘సాక్షి’ మీడియా గ్రూప్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగింది. రాజ్యాంగ సూత్రాలు, పార్లమెంటు చేసిన చట్టాలకు విరుద్ధంగా విజయవాడ పోలీసులు గురువారం ‘సాక్షి’ ఎడిటర్‌ వి.మురళి, ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయ­డం చంద్రబాబు ప్రభుత్వ దమననీతికి నిదర్శనం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దుర్నీతి, కక్ష సాధింపులు ఇలా ఉన్నాయి...పత్రికా ధర్మం నిర్వర్తిస్తున్నందుకే చంద్రబాబుకు కంటగింపుటీడీపీ కూటమి రెడ్‌బుక్‌ పేరుతో సాగిస్తున్న అరాచకాలు, దాడులు, వేధింపులను ఎక్కడికక్కడ ఎండగడుతూ ‘సాక్షి’ బాధితులకు అండగా ఉంటోంది. బాధ్యతా­యుతమైన మీడియా సంస్థగా పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు పాటుపడుతోంది. ఈ క్రమంలో గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో టీడీపీ రౌడీమూకలు బరితెగించి పాల్పడుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచుతోంది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ అవినీతి, దోపిడీని ప్రజలకు వివరించి చైతన్యపరుస్తూ తన ధర్మాన్ని నిర్వర్తిస్తోంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ‘సాక్షి’ మీడియాపై కక్ష గట్టింది. సాక్షి టీవీ చానల్‌ ప్రసా­రాలకు ఆటంకాలు కల్పిస్తోంది. కేబుల్‌ ఆపరేటర్లను భయపెట్టి సాక్షి టీవీ చానల్‌ ప్రసారాలను నిలిపివేస్తోంది. మరోవైపు సాక్షి పత్రికపై కూడా కక్ష గట్టింది. సర్కారు అలసత్వంతో ఇటీవల విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదలు వస్తాయని వాతావరణ శాఖ నాలుగు రోజుల ముందే స్పష్టమైన సమాచారం ఇచ్చి హెచ్చరించినా సరే చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదు. దీంతో వరదలు ముంచెత్తి విలయం సృష్టించాయి. 50 మందికిపైగా దుర్మరణం చెందగా ఏకంగా రూ.10 వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది. వరదల సహాయ, పునరావాస చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అంతేకాదు వరద బాధితులకు సహాయ, పునరావాస వ్యయం, పరిహారం పంపిణీలో భారీ అవినీతికి పాల్పడింది. భోజనాలు, అగ్గిపెట్టెలు, మంచినీళ్ల సీసాలు తదితర వ్యయాన్ని భారీ ధరలతో అమాంతం పెంచేసింది.దీనిపై పూర్తి సాక్ష్యాధారాలతో ‘ముంపులోనూ మేసేశారు’ అనే శీర్షికతో ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. వామపక్ష పార్టీలు కూడా ఈ విషయంపై పూర్తి ఆధారాలతో ప్రెస్‌మీట్‌ నిర్వహించి ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘సాక్షి’ కథనంతో తమ అవినీతి బండారం బట్టబయలైందని ఆందోళన చెందిన చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. ఈ క్రమంలో దొంగదారిలో కక్ష సాధింపు చర్యలకు తెర తీసింది.కుట్రపూరితంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదుపత్రికా స్వేచ్ఛ కోసం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను చంద్రబాబు ప్రభుత్వం కాలరాసింది. పత్రికల్లో ప్రచురితమైన వార్తలు, కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తగిన చర్యలు తీసుకునేందుకు మన చట్టంలో స్పష్టమైన నిబంధనలున్నాయి. పత్రికలో ప్రచురితమైన కథనంపై అభ్యంతరం తెలుపుతూ ఖండన ఇవ్వవచ్చు. ఇంకా తమ పరువుకు భంగం వాటిల్లిందని భావిస్తే న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేయవచ్చు. దానిపై న్యాయస్థానం విచారించి తగిన తీర్పు వెలువరిస్తుంది. ఇదీ చట్టపరమైన విధానం. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ చట్టపరమైన మార్గాన్ని ఎంచుకోలేదు. ఎందుకంటే న్యాయస్థానంలో కేసు వేస్తే.. సాక్షి పత్రిక పూర్తి ఆధారాలతో తన వాదనను వినిపిస్తుంది. అందుకే దొంగదెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నింది. విజయవాడకు చెందిన గుడిపాటి లక్ష్మీనారాయణ అనే న్యాయవాదితో ‘సాక్షి’ కథనానికి వ్యతిరేకంగా పటమట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇప్పించారు. నిబంధనల ప్రకారం ఆ ఫిర్యాదును పోలీసులు స్వీకరించకూడదు. ఎందుకంటే ‘సాక్షి’ కథనంతో ఆ న్యాయవాదికి ఎలాంటి సంబంధం లేదు. ఆ న్యాయవాదిని ఉద్దేశించి ఆ కథనం రాయలేదు. ఆయన పరువుకు ఎక్కడా భంగం కలగలేదు. ఆ కథనంలో ప్రభుత్వ అవినీతి గురించే పేర్కొన్నారు. ఆ న్యాయవాది ప్రభుత్వ అధికార వ్యవస్థలో భాగం కూడా కాదు. అయినా సరే నిబంధనలకు విరుద్ధంగా ఆ న్యాయవాదితో ఫిర్యాదు చేయించారు. ఆయన ఫిర్యాదుపై విజయవాడ పోలీసులు ఏకంగా ‘సాక్షి’కి వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం మరింత విడ్డూరం. కేవలం చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అసమర్థ పరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా.. ‘సాక్షి’ని కట్టడి చేయాలన్న కుట్రతోనే ఈ అక్రమ కేసు బనాయించారన్నది సుస్పష్టం. ఇక తిరుపతిలోనూ ఇదే విధంగా ‘సాక్షి’పై ఫిర్యాదు చేయించారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ... రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ‘సాక్షి’ మీడియా గ్రూప్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగటాన్ని యావత్‌ పాత్రికేయ రంగంతోపాటు మీడియా నిపుణులు తీవ్ర స్థాయిలో నిరసిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.సుప్రీం ఆదేశాలు పట్టవా?‘ప్రభుత్వాన్ని విమర్శించే వార్తలు రాశారనే కారణంతో జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు ఈ నెల 4వతేదీన ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 (1) (ఏ) కింద జర్నలిస్టులకు ఉన్న భావప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వ అధికారుల్లో కుల సమీకరణాలను ఉద్దేశించి జర్నలిస్టు అభిషేక్‌ ఉపాధ్యాయ్‌ ‘యాదవ్‌ రాజ్‌ వర్సెస్‌ ఠాకూర్‌ రాజ్‌’ శీర్షికన ఓ కథనం రాశారు. దీనిపై లక్నోలోని హజ్రత్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో సెప్టెంబర్‌ 20న ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాల్సిందిగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ హృషికేశ్‌రాయ్, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి ధర్మా­సనం విచా­రించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయ­స్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘జర్నలిస్టు రాసి­నవి కేవలం ప్రభుత్వాన్ని విమర్శించేలా ఉన్నా­యనే కారణంతో క్రిమినల్‌ కేసులు పెట్ట­వద్దు’ అని స్పష్టం చేసింది. జర్నలిస్టులపై దూకుడు చర్య­లు తీసుకోవద్దని అత్యున్నత న్యాయ­స్థానం ఆదే­శాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ.. ఏపీ ప్రభు­త్వ పెద్దల ఆదేశంతో ఫిర్యాదు వచ్చిందే తడవుగా విజ­యవాడ పోలీసులు సాక్షి ఎడిటర్‌పై కేసు నమోదు చేసిన తీరుపై జర్నలిస్టులతో పాటు న్యాయ­వాదు­లు విస్తుపోతున్నారు. కుట్రతో కూడిన ఈ కేసుపై సుప్రీం కోర్టు వరకు వెళతామని ప్రకటించారు.చట్ట ప్రకారం కేసులు చెల్లవుఒక కథనం విషయంలో ఎడిటర్‌పై కేసు పెట్టడం అంటే భావ ప్రకటనా సేచ్ఛను ఆటంకం పరిచినట్టే. వాస్తవాలను బయట పెట్టకుండా బెదిరించే ప్రయత్నం ఇది. ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టుకోవచ్చు. పత్రికలు చాలా జవాబుదారీతనంతో నడుస్తాయి. అలాంటి పత్రికా ఎడిటర్‌పై కేసులు పెట్టడం అప్రజాస్వామికం. ఇలాంటి ఘటనల్లో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా ఉండాల్సింది. రాజకీయ ఒత్తిళ్లతో ఆ పని చేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి కేసులు చట్ట ప్రకారం నిలబడవు. – సుప్రీం కోర్టు న్యాయవాదులుఅభ్యంతరాలుంటే ఖండన ఇవ్వాలిరాజకీయ దురుద్దేశంతో కేసులు పెట్టి పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం సరికాదు. విపత్తుల సమయంలో ప్రభుత్వ పనితీరును తెలియచేసిన ‘సాక్షి’ ఎడిటర్‌పై పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టడం, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అకాల వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల కష్టాలను, ప్రభుత్వ చర్యలను రిపోర్టు చేయడం మీడియా బాధ్యత. ఇటీవల విజయవాడ వరదల నేపథ్యంలో బాధితులకు అందిన సహాయంపై ‘సాక్షి’ అదే పని చేసింది. పత్రికలో ప్రచురించిన కథనంపై అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. అందులో అసత్యాలు ఉన్నాయని భావిస్తే మొదట వాస్తవ గణాంకాలను చెబుతూ ఖండన ఇవ్వాలి. సాక్షి ఆ వివరణను ప్రచురించకపోతే న్యాయ స్థానాలను ఆశ్రయించాలి. అంతేగానీ పోలీసు కేసు పెట్టడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను దెబ్బతీయడమే. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అసత్య కథనాలపై సంబంధిత శాఖ ఖండనను ప్రచురించకుంటే న్యాయస్థానానికి వెళ్లే వెసులుబాటును అధికార యంత్రాంగానికి కల్పిస్తూ జీవో తీసుకొచ్చారు. అప్పట్లో దీనిపై ప్రతిపక్షాలు నానా హంగామా చేశాయి. ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పక్షాలు గొడవ చేశాయి. ఆనాడు జగన్‌ ప్రభుత్వం తెచ్చిన జీవో సరైందని అంగీకరించాకే ఇప్పుడు ముందుకు వెళ్లాలి. ఎవరైనా తప్పు వార్త రాస్తే ఖండించాలి. ఖండన ప్రచురించకుంటే పరువు నష్టం దావా వేసుకోవచ్చు. అంతేగానీ ఎవరో ఒకరి చేత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించి దానిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం ఏమాత్రం సరికాదు’ – దేవులపల్లి అమర్, ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు, మన తెలంగాణ దినపత్రిక సంపాదకుడు కచ్చితంగా కక్ష సాధింపేమీడియాపై ప్రభుత్వ కక్ష సాధింపులు సరికాదు. సాక్షిపై కేసు పెట్టడం అప్రజాస్వామికం. విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు సాయం అందడం లేదన్న వాస్తవాన్ని రాసినందుకు సాక్షిపై కూటమి ప్రభుత్వం అక్కసు పెంచుకోవడం దారుణం. ప్రజా సమస్యలపై విస్తత కథనాల ద్వారా మీడియా తన బాధ్యతగా ప్రభుత్వం, సమాజం దృష్టికి తెస్తుంది. మీడియా ప్రచురించిన కథనాలపై ఎటువంటి అభ్యంతరం ఉన్నా సంబంధిత బాధ్యులు ఖండన ఇవ్వవచ్చు.అందుకు విరుద్ధంగా కేసులు పెట్టి బెదిరింపులతో మీడియాను కట్టడి చేయాలనే ప్రయత్నం ఏ మాత్రం వాంఛనీయం కాదు. చంద్రబాబు డైరెక్షన్‌లో ఒక లాయర్‌తో ఫిర్యాదు ఇప్పించి ఆగమేఘాలపై కేసు నమోదు చేయించడం కచ్చితంగా కక్ష సాధింపే. మీడియాపై పోలీసులను పురిగొల్పి బెదిరించే ధోరణిని కూటమి ప్రభుత్వం మార్చుకోవాలి. – మలసాని మనోహర్‌రెడ్డి,వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పత్రికా స్వేచ్ఛపై కత్తి కట్టడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారని ‘సాక్షి’పై కేసు నమోదు చేయడం అత్యంత దారుణం. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడే. రోజురోజుకీ గతి తప్పి వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వం ఓ నియంతలా మారుతోంది. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరదల తర్వాత సహాయక పనుల్లో రూ.534 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ వివరాలను అధికారులు స్వయంగా ముఖ్యమంత్రికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో వివరించారు. అందులో అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, భోజనాలు, నీళ్ల బాటిల్స్‌ కోసం ఖర్చు చేసినట్లు చూపిన మొత్తం.. ఆ గణాంకాలు వాస్తవాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దాన్ని ప్రస్తావిస్తూ, వాస్తవంగా అయ్యే ఖర్చును వివరిస్తూ.. వరద సహాయ పనుల్లో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తూ రాయడం తప్పా? నిజానికి అది మీడియా బాధ్యత. అదే పని ‘సాక్షి’ చేసింది. వరద సహాయక చర్యల్లో చోటు చేసుకున్న అంతులేని అవినీతిని ఎండగట్టింది. అందువల్ల ‘సాక్షి’పై కక్ష కట్టిన కూటమి ప్రభుత్వం మరింత దిగజారి ఏకంగా కేసు నమోదు చేయడం హేయమైన చర్య. ఇప్పటికే కేబుల్‌ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి, బెదిరించి సాక్షి ఛానల్‌ ప్రసారాలను అడ్డుకుంది. ఇప్పుడు పత్రికపైనా కత్తి కట్టారు. వెంటనే ‘సాక్షి’పై కేసును ఉపసంహరించుకోవాలి. – కురసాల కన్నబాబు, మాజీ మంత్రిమీడియా స్వేచ్ఛను హరించడమే..వాస్తవాలను బయటపెడితే కూటమి ప్రభుత్వం సహించలేకపోతోంది. విజయవాడ వరదలకు సంబంధించి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి పత్రికలను టార్గెట్‌ చేస్తోంది. సాక్షి ఎడిటర్‌పై కేసు పెట్టడమంటే పత్రికా స్వేచ్ఛను హరించడమే. నిర్భయంగా, నిష్పాక్షికంగా వార్తలు రాసి వాస్తవాలు బయటపెట్టే విలేకరుల గొంతు నొక్కడమే. ఇది అత్యంత గర్హనీయం. దీనిపై మా అసోసియేషన్‌ తరఫున ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాకి ఫిర్యాదు చేస్తాం. ఇలా కేసులు పెట్టేవారిని ఏ ప్రభు­త్వం ప్రోత్సహించకూడదు. బేషరతుగా కేసును ఉపసంహరించుకోవాలి. – వీవీఆర్‌ కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌

Horoscope Today Rasi Phalalu October 18 In Telugu2
ఈ రాశి వారికి పాత బాకీలు వసూలు, ఆకస్మిక వస్తు లాభం

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.పాడ్యమి ప.3.01 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: అశ్వని సా.4.01 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: ప.12.19 నుండి 1.47 వరకు, తదుపరి రా.1.02 నుండి 2.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.10 నుండి 12.58 వరకు, అమృత ఘడియలు: ఉ.9.17 నుండి 10.46 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.56, సూర్యాస్తమయం: 5.34. మేషం: ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. నూతన ఉద్యోగాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.వృషభం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.మిథునం: కుటుంబంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం నుండి విముక్తి.కర్కాటకం: గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలయ దర్శనాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.సింహం: రాబడి కొంత నిరాశ కలిగిస్తుంది. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.కన్య: రుణయత్నాలు. పనులు ముందుకు సాగవు. బంధువుల కలయిక. ఆరోగ్యసమస్యలు. శ్రమ మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.తుల: కొత్త విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కీలక సమాచారం.వృశ్చికం: సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. విందువినోదాలు. ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు.ధనుస్సు: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశాజనకంగా ఉంటుంది.మకరం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.కుంభం: నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. పాతమిత్రుల కలయిక. ధనలాభం. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.మీనం: శ్రమానంతరం పనులు పూర్తి. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. వ్యాపారస్తులకు నిరాశ. ఉద్యోగులు ఇబ్బందులు పడతారు.

YS Jagan Comments At YSRCP state level workshop Meeting3
బలంగా ఎదుగుదాం.. పార్టీని పటిష్టంగా నిర్మిద్దాం: వైఎస్‌ జగన్‌

మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకుని అన్ని అంశాలపై స్పందించాలి. గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలి. అన్యాయాలపై స్పందించాలి. బాధితులకు అండగా నిలవాలి. మనవైపు నుంచి స్పందన లేకపోతే ఆ అంశం మరుగున పడుతుంది. ప్రజలకు న్యాయం జరగదు. – వైఎస్‌ జగన్‌ఇసుక ధర రెట్టింపు.. మద్యం టెండర్లలో దారుణాలు.. యథేచ్ఛగా పేకాట క్లబ్‌లుఈ సోషల్‌ మీడియా కాలంలో వాళ్ల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా మనం సిద్ధం కావాలిఎప్పటికప్పుడు నివేదికలతో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు, ప్రమోషన్లు సాక్షి, అమరావతి: గ్రామ, బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని మరింత వ్యవస్థీకృతంగా నిర్మించడం ద్వారా దేశంలోనే బలమైన పార్టీగా నిలుపుదామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మన పార్టీ ఏర్పాటు చేసుకుని దాదాపు 15 ఏళ్లు అవుతోందని, ఈ సమయంలో వివిధ రకాల ఎన్నికలు చూశామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నామని.. అధికారంలోనూ ఉన్నామని.. స్థానిక సంస్థలతో పాటు చాలా ఎన్నికల్లో పాల్గొన్నామని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని, గ్రామ స్థాయి నుంచి ప్రతి అడుగులోనూ పార్టీ యుద్ధం చేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలను ఇస్తుందని, అప్పుడే మనం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు శక్తివంతంగా ఉంటామని ఉద్బోధించారు. లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి ఇప్పుడు తగినంత సమయం ఉందని, దానిని సద్వినియోగం చేసుకుందామని కోరారు. శాసససభ, పార్లమెంటుకు జమిలి ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేద్దామని జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రాష్ట్ర స్థాయి వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ వర్క్‌ షాప్‌లో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. గ్రామ, బూత్‌ కమిటీలతో మరింత బలోపేతం ⇒ ఇప్పుడు మనం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా కమిటీలు, నియోజకవర్గ స్థాయి, మండల, గ్రామ స్థాయి కమిటీల వరకు ఎలా ఉన్నాయన్న దానిపై పరిశీలన, అవగాహన పెంచుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ పాత్రలను నిర్వర్తించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. మరో ఆరు నెలల్లో మళ్లీ సమావేశం నాటికి గ్రామ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు కావాలి. అక్కడే యూత్, మహిళా, విద్యార్థి విభాగాలతో పాటు విలేజ్‌ కమిటీ, బూత్‌ కమిటీల వంటి అనుబంధ విభాగాలకు గ్రామ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు కావాలి. ⇒ ఈ కమిటీల ఏర్పాటు కాగితాలకే పరిమితం కాకూడదు. దాని వల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండదు. కమిటీల ఏర్పాటుపై మీ పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ఇలా చేయగలిగితే.. దేశంలోకెల్లా నంబర్‌ వన్‌ పార్టీగా ఎదుగుతాం. పార్టీ క్షేత్ర స్థాయి నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామ స్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ సర్పంచ్‌ లేదా, పోటీ చేసిన అభ్యర్థి మన పార్టీ వారే ఉన్నారు. కాకపోతే వీరందరినీ నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలి. అప్పుడు మనం రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన పిలుపునకు గ్రామ స్థాయి వరకు ఉధృత స్పందన వస్తుంది. అది చేయగలగాలి. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు మన కార్యకర్తలు కాలర్‌ ఎగరేసుకుని తిరిగేలా⇒ ఇవాళ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎవరైనా సగర్వంగా కాలర్‌ ఎగరేసుకుని ప్రతి ఇంటికీ వెళ్లగలం. కారణం మనం చెప్పిన ఎన్నికల మేనిఫెస్టో అన్నదాన్ని చెత్తబుట్టలో వేసే డాక్యుమెంటు కింద కాకుండా.. దేశ చరిత్రలోనే సరికొత్త అర్థం తీసుకువచ్చిన పార్టీ మనది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ దానిలో చెప్పినవి తూచ తప్పకుండా అమలు చేశాం. ⇒ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌తో పాటే మనం పథకాలు అమలు చేసే తేదీలతో సహా సంక్షేమ క్యాలెండర్‌ రిలీజ్‌ చేసే వాళ్లం. నేరుగా బటన్‌ నొక్కి మధ్యలో దళారులు లేకుండా అక్కచెల్లెమ్మలకు ఆయా పథకాలు అందించింది కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? వాళ్లు ఎన్నికలప్పుడు చెప్పిన మాటలేమిటి? ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసి ఉండం. ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. అదే మనకు వాళ్లకూ తేడా. విలువలు, విశ్వసనీయత అన్నది ముఖ్యం. ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చుంటే తప్పేముంది? ప్రజల్లో ఆలోచన మొదలైంది ⇒ వైఎస్సార్‌సీపీ, జగన్‌ వల్ల జరిగిన మంచి ఏమిటి.. అంటూ మనం చేసిన మంచి పనుల గురించి ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. చెప్పినవన్నీ జగన్‌ చేశాడని ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశాడు. జగన్‌ మాకు పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూస్తే పలావు పోయింది.. బిర్యానీ లేదు.. అన్న చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. ఫలానా మంచి మా హయాంలో జరిగిందని.. ప్రజల్లోకి మనం ధైర్యంగా వెళ్లగలుగుతాం. కానీ టీడీపీ కూటమి కార్యకర్తలు ధైర్యంగా వెళ్లగలుగుతారా? ⇒ టీడీపీ వాళ్లు ప్రజల ఇళ్లకు పోయే పరిస్థితులు లేవు. చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారు. మనం ప్రజల్లోకి వెళ్లినప్పుడు, ప్రతి ఇంటికీ మన నాయకులు డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ చేసినప్పుడు, ఎవరింటికి పోయినా అందరూ సంతోషంగా దీవించారు. అయితే ఒకవైపు ఈవీఎంల వ్యవహారం, మరోవైపు టీడీపీ మోసపూరిత హామీలతోనే ఓడిపోయాం. 4 నెలల్లోనే ఎప్పుడూ లేనంత వ్యతిరేకత ⇒ మనం అమలు చేసిన హామీలే మనకు శ్రీరామ రక్ష. కేవలం నాలుగు నెలల్లోనే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ప్రభుత్వం మీద కనిపిస్తోంది. వాళ్లు ఎవరి ఇంటికైనా వెళితే మా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు అడుగుతారు. మా రూ.18 వేలు ఏమయ్యాయని మహిళలు, రూ.48 వేలు ఏమయ్యాయని అవ్వలు, మా రూ.20 వేలు ఏమయ్యాయని రైతులు, మా రూ.36 వేలు ఏమయ్యాయని నిరుద్యోగ యువత అడుగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం మరింతగా ప్రిపేర్‌ అవ్వాలి. ఒకవైపు హామీల అమలు లేకపోగా, మరోవైపు రాష్ట్రంలో పాలన దారుణంగా తయారైంది. దాదాపు రూ.2,400 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆరోగ్య ఆసరా లేదు. ప్రభుత్వం ఆస్పత్రులు నిర్వీర్యం అయ్యాయి. ⇒ మూడు త్రైమాసికాలు వచ్చినా, విద్యా దీవెన, వసతి దీవెన లేదు. ఇంగ్లిష్‌ మీడియం లేదు. సీబీఎస్‌ఈ లేదు. టోఫెల్‌ క్లాసులు లేవు. గోరుముద్ద కూడా పాడైపోయింది. అన్ని రంగాలూ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఖరీఫ్‌ సీజన్‌ పూర్తవుతున్నా రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ–క్రాప్‌ ఏమైందో తెలియదు. ఆర్బీకేలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. రైతుల పంటలకు కనీస మద్దతు దక్కని పరిస్థితి. ⇒ ఇంటి వద్దకు వచ్చే అన్ని సేవలూ నిలిచిపోయాయి. ఏం కావాలన్నా మళ్లీ జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పాలన వచ్చింది. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు తొలగించారు. లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితి ఘోరంగా ఉంది. మహిళలకు భద్రత సున్నా. దిశ యాప్‌ ఏమైందో తెలియదు. గతంలో మన పాలనలో అక్కచెల్లెమ్మలు ఫోన్‌ తీసుకుని బయటకు వెళ్లినప్పుడు, ఆపద ఎదురై ఫోన్‌ చేస్తే.. పది నిమిషాల్లో పోలీసులు వచ్చి ఏమైందని అడిగే పరిస్థితి ఉండేది. అవేవీ ఇప్పుడు లేవు. రాష్ట్రంలో దారుణంగా చిన్నారులను సైతం వదలకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసులు దొంగ కేసులకు పరిమితం అయ్యారు. విధి నిర్వహణ మరిచిపోయి మూడు సింహాలకు కాకుండా, రాజకీయ నాయకులకు మడుగులొత్తుతున్నారు. ఎక్కడ చూసినా స్కాంలే కనిపిస్తున్నాయి. ఇసుక ఉచితం అంటూ టెండర్లేంటి? ⇒ ఇసుక ఉచితం అంటూ రెండు రోజుల్లోనే గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు నిర్వహించారు. మన హయాంలో కనీసం రాష్ట్ర ఖజానాకు డబ్బులు రావడంతోపాటు ప్రజలకు రీజనబుల్‌ రేట్లకు ఇసుక వచ్చేది. ప్రతి ఆదివారం ప్రతి నియోజకవర్గంలో ధరలు ఇచ్చే వాళ్లం. అక్రమాలకు పాల్పడితే కేసులు పెట్టేవాళ్లం. అంత కట్టుదిట్టంగా అమలు చేశాం. కానీ ఇప్పుడు దోచుకోవడానికి పాలసీని మార్చారు. అడ్డగోలుగా స్టాక్‌ యార్డులు, రీచ్‌ల్లోని ఇసుకను అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఖాళీ చేశారు. ప్రభుత్వానికి సున్నా ఆదాయం. మరోవైపు ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి. ⇒ మద్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మన హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు నడిపాం. ఉన్న షాపులు తగ్గించి, పర్మిట్‌ రూమ్స్‌ తీసేసి, టైమింగ్స్‌ పక్కాగా పెట్టి, బెల్టుషాపులు లేకుండా చూసి, అమ్మకం వాల్యూమ్స్‌ తగ్గించి ప్రజలకు మంచి చేశాం. కానీ ఇప్పుడు మద్యం షాపుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉచిత వాటాలు అడుగుతూ బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. అదే మనకు వాళ్లకూ మధ్య తేడా. ప్రతిపక్షంలో కూర్చోడానికైనా మనం వెనకాడం కానీ, అబద్ధాలు చెప్పలేం. నేను చెప్పే ఈ మాటలు ఎవ్వరికీ నచ్చకపోవచ్చు. కానీ విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం ఉండాలి. రాజకీయాల్లో అధికారం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కానీ మళ్లీ మనల్ని అధికారంలోకి తెచ్చేది మన విశ్వసనీయత, విలువలే. అవి లేనప్పుడు రాజకీయాలకు అర్థం లేదు. ఎన్నికలప్పుడు ఇంటింటికీ వెళ్లి ఆ ఇంట్లో చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు (అమ్మ ఒడి), ఆ పిల్లల తల్లి కనిపిస్తే నీకు రూ.18 వేలు (నెలకు రూ.1,500), వాళ్ల చిన్నమ్మ కనిపిస్తే నీకూ రూ.18 వేలు (నెలకు రూ.1,500), 50 ఏళ్లకుపై బడిన పెద్దమ్మ కనిపిస్తే నీకు రూ.48 వేలు (బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌), ఉద్యోగం కోసం చూస్తున్న యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు (నిరుద్యోగ భృతి), అదే ఇంట్లో మెడలో కండువాతో రైతు కనిపిస్తే చాలు నీకు రూ.20 వేలు (రైతు భరోసా) అని ఇంట్లో ఎవరు కనిపించినా.. నీకు ఇంత.. నీకు ఇంత.. అని ప్రచారం చేశారు. ఇప్పుడు వాటి మాటేంటి?గ్రామ స్థాయి నుంచి పార్టీ ప్రతి అడుగులోనూ యుద్ధం చేస్తోంది. కాకపోతే మనం వ్యవస్థీకృతం(ఆర్గనైజ్డ్‌)గా యుద్ధం చేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యం. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు ఉంటాయి. గ్రామ స్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ సర్పంచ్‌ లేదా, పోటీ చేసిన అభ్యర్థి మన పార్టీ వారే ఉన్నారు. 86 శాతం సర్పంచ్‌లు, 90 శాతం పైచిలుకు ఎంపీటీసీ సభ్యులు మన వాళ్లే ఉన్నారు. దాదాపు 15 ఏళ్లుగా ప్రతి గ్రామంలో మనకు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వీటిని నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలి. గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం మరింత బలంగా ఉండాలి. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండాలి ⇒ ఇప్పుడు నడుస్తున్నది సోషల్‌ మీడియా కాలం. ఇది నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ నుంచి గ్రామ స్థాయి లీడర్‌ వరకు ధ్యాస పెట్టాల్సిన అంశం. ఇవాళ మనం యుద్ధం చేసేది చంద్రబాబుతోనే కాదు. ఒక చెడిపోయిన వ్యవస్థతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, టీడీపీ తప్పుడు సోషల్‌ మీడియాలతో యుద్ధం చేస్తున్నాం. వాళ్లే అబద్ధాలు సృష్టిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అందుకే మనం మరింత బలంగా తయారు కావాలి. ప్రతి గ్రామంలోనూ పార్టీ కమిటీలన్నీ సోషల్‌ మీడియాకు అనుసంధానం కావాలి. ⇒ నియోజకవర్గ స్ధాయిలో జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు చూపించగలగాలి. రెండో వైపున పార్టీ సందేశాలు కూడా గ్రామ స్థాయికి వెళ్లాలి. ఇది సవాల్‌తో కూడిన కార్యక్రమం. ఇది చేయగలిగే వ్యవస్థ మనకుంది. వచ్చే రోజుల్లో దీనిపై బాగా దృష్టి పెట్టాలి. వైఎస్సార్‌సీపీని దేశంలో అత్యంత బలమైన పార్టీగా తయారు చేయాలి. స్కామ్‌లలో కూడా ప్రజలను ఎలా కొత్తగా పిండాలా అని ఆలోచిస్తున్నారు. కనీసం ఇసుక టెండర్లు పిలుస్తున్నారన్న విషయం ఎవ్వరికీ తెలియదు. రెండే రెండు రోజులు టైం ఇచ్చారు. టెండర్లు వేయడానికి ఎవ్వరూ పోకుండా చూశారు. ఎన్నికలకు ముందు ఇసుక ఉచితం అన్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఇసుక రేటు మన హయాం కన్నా డబుల్, ట్రిపుల్‌ రేటు. మన హయాంలో కనీసం రాష్ట్ర ఖజనాకు డబ్బులు రావడంతో పాటు ప్రజలకు రీజనబుల్‌ రేట్లకు ఇసుక వచ్చేది.ఈ ప్రభుత్వంలో మద్యం షాపుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు 30 శాతం ఇస్తావా, 40 శాతం ఇస్తావా.. అని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. షాప్‌ల కోసం కిడ్నాప్‌లు కూడా చేస్తున్నారు. నిజంగా లిక్కర్‌ పాలసీలో దురుద్దేశాలు లేకపోతే ఎమ్మెల్యేలు ఎందుకు పోటీ పడుతున్నారు? అంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు. లిక్కర్‌ రేట్లు తగ్గిస్తామన్నారు. కానీ, రేట్లు అలాగే ఉన్నాయి. మళ్లీ పర్మిట్‌ రూమ్స్‌ తీసుకొస్తున్నారు. బెల్టుషాప్‌లు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుండగా.. ప్రభుత్వ పెద్దలకు, వాళ్ల అనుచరులకు ఆదాయం పెరుగుతోంది.నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దురా.. అని ప్రజలు చెప్పే పరిస్థితి వచ్చింది. నేనెప్పుడూ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. అంత దారుణమైన పరిపాలన సాగుతోంది. ప్రభుత్వం ఎలా విఫలమైందో నాకన్నా.. నాయకులుగా మీరే బాగా చెబుతారు. ఎన్నికలప్పుడు వాళ్లు చెప్పిన మాటలేమిటి.. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్లు చేస్తున్న పాలన ఏమిటిన్నది గమనిస్తే.. ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల మాటేమిటి? సూపర్‌ సిక్స్‌లు ఏమయ్యాయని ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక కనీసం బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో నడుపుతున్న ప్రభుత్వం ఇది. ప్రతి నియోజకవర్గంలో 10 పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో గ్రావెల్‌ తోలుకోవాలన్నా, ఫ్యాక్టరీ పెట్టుకోవాలనుకున్నా.. వ్యాపారం చేయాలనుకున్నా.. ఎవరు ఏం చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే. డబ్బు ఇవ్వకపోతే వ్యాపారమే లేదు. పోలీసుల సహాయంతో బెదిరిస్తున్నారు.ప్రతి గ్రామంలోనూ పార్టీ కమిటీలన్నీ సోషల్‌ మీడియాకు అనుసంధానం కావాలి. కమిటీల్లోని ప్రతి ఒక్కరూ వాళ్ల సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి. మీ పేజీలను మీరే నడపాలి. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌ పేజీలు తయారు చేసుకోవాలి. గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ ఆయా మాధ్యమాల్లో మీ అకౌంట్, మీ పేజీలు నిర్వహించాలి. ఎప్పుడైతే మీరు మీ పేజీలు నడుపుతారో అప్పుడే గ్రామ స్థాయిలో జరుగుతున్న అన్యాయాలను మనం ఎండగట్టగలుగుతాం.చీకటి తర్వాత వెలుగు సహజం పార్టీ భవిష్యత్తు బాధ్యతను పట్టుదలతో నిర్వర్తిస్తే మీకు, పార్టీకి మంచి జరుగుతుంది. మన పని వల్ల పార్టీకి మంచి జరుగుతుందనేది మనం మర్చిపోకూడదు. పార్టీ అధికారంలోకి వస్తే కొట్ల మంది ప్రజలకు, లక్షల మంది కార్యకర్తలకు, వేల మంది నాయకులకు మంచి జరుగుతుంది. ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకుని అడుగులు వేస్తున్నప్పుడు.. ఇది మన పార్టీ అనేది మన నరనరాల్లో ఇమిడి ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు మన పార్టీ కోసం వేస్తున్నామన్నది మన ఒంట్లో ఎక్కించుకోవాలి. కష్టం లేనిదే మనకు అందలం రాదు. 16 నెలలు నేను జైలుకు పోతేనే ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరూ చూడని వేధింపులు చూశాను. అకారణంగా 16 నెలలు ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఒక పార్టీ లేకుండా చేయాలని, ఒక వ్యక్తిని వేధించాలన్న ఉద్దేశంతోనే ఆ స్థాయి వేధింపులు చేశారు. అన్ని నెలలు జైల్లో పెట్టిన తర్వాత, ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ప్రజలకు మంచి చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. మనం మంచి చేయగలిగాం. దాని అర్థం అన్యాయం జరిగినప్పుడు ఒక మంచి జరుగుతుంది. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. దేవుడు మంచికి తోడుగా ఉంటాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. నష్టాలుంటాయి. ఒక్కోసారి జైలుకు కూడా పోవాల్సి ఉంటుంది. అయితే ఏంటి? ఇవన్నీ జరిగినప్పుడే మనిషి ఎదుగుతాడు. ప్రజల్లో, నాయకత్వం దగ్గర మన్ననలు ఉంటాయి. అన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మన భవిష్యత్‌ కోసం మనం చేస్తున్నామని గుర్తు పెట్టుకోండి. మన పార్టీ కోసం, మనం అధికారంలోకి రావాలన్న సంకల్పంతో పేదవాడికి మన వల్ల మంచి జరుగుతుందన్న స్థిరమైన నమ్మకంతో అడుగులు వేస్తున్నాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకోండి. పనితీరు ఆధారంగా ప్రమోషన్లు జిల్లా అధ్యక్షులు, కమిటీల్లోని వారు.. మీ మీ పనితీరు ఆధారంగా మీ ప్రమోషన్లు ఉంటాయి. మీరు ప్రూవ్‌ చేసుకోండి. తప్పకుండా ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తాం. మీకు ప్రమోషన్‌ ఇచ్చే బాధ్యత నాది. మనం అధికారంలోకి రాగానే మీలో ఎక్కువ మంది మంత్రివర్గంలో ఉండాలని ఆశిస్తున్నాం. జిల్లా అధ్యక్షులకు ఇదొక సువర్ణావకాశం. కష్టపడండి. మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. మీ జగన్‌ మీ కష్టాలకు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తాడు. అనుబంధ సంఘాల అధ్యక్షులకూ మంచి అవకాశాలు వస్తాయి. మీ పనితీరుపై పరిశీలన, పర్యవేక్షణ ఉంటుంది. రీజినల్‌ జనరల్‌ సెక్రటరీలను తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌ల పనితీరుపైనా మదింపు ఉంటుంది. రిపోర్టుల ప్రకారం నిర్ణయాలు ఉంటాయి. బాగా పని చేసే వారికీ రేటింగ్స్‌ ఇస్తాం.

Non cumulative assistance to those treated under Arogyashri4
‘ఆసరా’కూ మంగళం!

అనకాపల్లి జిల్లా రత్నాలపాలెంకు చెందిన పైడితల్లి ఈ ఏడాది ఆగస్టులో కోటవురట్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో బిడ్డకు జన్మనిచ్చి0ది. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్య సేవ) పథకం కింద నమోదు చేసి వైద్యులు ప్రసవం చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం ఇంటికి వెళ్లిన 24 గంటల్లో ఆమెకు ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం రూ.5 వేలు చెల్లించాల్సి ఉంది. రెండు నెలలు కావస్తున్నా ఆమె ఖాతాలో నగదు జమ అవ్వలేదు. పేమెంట్‌ ఇంకా ప్రాసెస్‌లో ఉన్నట్టు చూపిస్తోంది. కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన రైతు నాగేశ్వరరావుకు 58 ఏళ్లు. రెండు నెలల క్రితం అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. గుండెకు రక్తం సరఫరా అయ్యే రక్త నాళాల్లో పూడికలు ఉన్నట్టు తేలింది. దీంతో విజయవాడలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో స్టంట్‌లు వేశారు.అడ్మిట్‌ అయ్యే సమయంలో ఆరోగ్య ఆసరా డబ్బు జమ చేయడం కోసం ఆరోగ్య మిత్ర ఆయన బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేశారు. చికిత్స పూర్తయ్యాక నాగేశ్వరరావు ఇంటికి చేరుకుని రెండు నెలలైంది. అయినా ఇప్పటి వరకు ఆసరా సాయం అందలేదు. ఆ సొమ్ము వస్తే పౌష్టికాహారం, మందుల ఖర్చుకు ఇబ్బంది ఉండేది కాదని మధనపడుతున్నాడు. పేద ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష గట్టింది. విద్య, వైద్యం, సంక్షేమం.. ఇలా అన్ని విషయాల్లో వారిని వంచిస్తోంది. ఆరోగ్యశ్రీ స్థానంలో బీమాను ప్రవేశపెట్టే క్రమంలో ప్రొసీజర్‌లకు కోతలు, చికిత్సల అనంతరం రోగులు ఇంట్లో గడిపే విశ్రాంత సమయానికి జీవన భృతి అందించే ఆసరా కార్యక్రమాన్ని అటకెక్కించే చర్యలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా కొద్ది రోజులుగా రోగులకు ఆరోగ్య ఆసరా చెల్లింపును నిలిపి వేసింది. గత ప్రభుత్వంలో రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో భృతి మొత్తం రోగి/కుటుంబ సభ్యుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ అయ్యేది. ప్రస్తుతం రోగి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లి కోలుకున్నాక కూడా ఆ సొమ్ము చెల్లించడం లేదు. దీంతో శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంత సమయంలో పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారు. నెలకు రూ.5 వేలు2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో కునారిల్లిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం బలోపేతం చేసింది. ఇందులో భాగంగా 1,059 ప్రొసీజర్‌లను 3,257కు పెంచారు. వైద్య సేవల పరిమితిని దేశంలో ఎక్కడా లేనట్టుగా రూ.25 లక్షలకు పెంచారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని వ్యక్తులు అనారోగ్యం బారినపడి శస్త్ర చికిత్సల అనంతరం ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ క్రమంలో పూర్తిగా కోలుకోకుండానే వాళ్లు తిరిగి వృత్తి, ఉపాధి పనుల్లో నిమగ్నం అవుతారు. ఇలా చేయడంతో మళ్లీ వ్యాధులు, జబ్బులు తిరగబెట్టే అవకాశం ఉంటుంది. ఈ సమస్య తలెత్తకుండా పూర్తిగా కోలుకునే వరకు రోగులు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదనే లక్ష్యంతో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని 2019లో ప్రవేశపెట్టారు.ఈ కార్యక్రమం కింద నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జి అయిన రోజే వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి రోజుకు రూ.225 లేదా గరిష్టంగా నెలకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం చెల్లించింది. ఇలా ఐదేళ్లలో 24,59,090 మందికి రూ.1465.67 కోట్ల మేర ఆర్థిక సాయం అందించింది. రూ.30 కోట్ల మేర పెండింగ్‌ ప్రస్తుత ప్రభుత్వం ఆగస్టు నుంచి ఆసరా చెల్లింపులను నిలిపివేసినట్టు తెలుస్తోంది. ఆసరా ప్రతిపాదనలు పంపినప్పటికీ రోగుల ఖాతాల్లో డబ్బు జమ అవ్వడం లేదని ఆరోగ్య మిత్రలు చెబుతున్నారు. రోగులు, వారి బంధువులు తమకు ఫోన్‌లు చేస్తుండటంతో ఆన్‌లైన్‌లో వెరిఫై చేస్తే పేమెంట్‌ ప్రాసెస్‌లో ఉందని చూపిస్తోందని వెల్లడించారు. 60–70 రోజులుగా 1.50 లక్షల నుంచి రెండు లక్షల మంది రోగులకు రూ.30 కోట్ల మేర ఆసరా చెల్లింపులు నిలిచిపోయినట్టు సమాచారం. ఆలస్యం లేకుండా రోగుల ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి ఆరోగ్య ఆసరాను గత ప్రభుత్వం గ్రీన్‌ ఛానల్‌లో ఉంచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రీన్‌ ఛానల్‌ నుంచి ఆ పథకాన్ని తొలగించినట్టు తెలుస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌–పీఎం జన్‌ ఆరోగ్య యోజన పథకం కింద వచ్చే నిధులకు కొంత మేర రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి, బీమా రూపంలో భారం తగ్గించుకునే ప్రయ­త్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆసరా భారాన్ని కూడా దించేసుకుని చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

Sakshi Editorial On Uttar Pradesh Yogi Adityanath Govt proposal5
ప్రమాదకర ప్రతిపాదన

విజ్ఞత మరిచినచోట విపరీతాలు చోటుచేసుకోవటంలో వింతేమీ లేదు. కావడ్‌ యాత్ర సందర్భంగా జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం మొన్న జూలైలో ఇచ్చిన తీర్పు అర్థం కాకనో లేక దాన్ని ధిక్కరించే ఉద్దేశమో... ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులు తీసుకురావాలని తాజాగా నిర్ణయించింది. ఆహారంలో లేదా పానీయాల్లో ఉమ్మివేయటం లేదా మానవ వ్యర్థాలతో దాన్ని కలుషితపరచటం పదేళ్ల శిక్షకు అర్హమయ్యే నాన్‌ బెయిలబుల్‌ నేరంగా పరిగణించటం, విక్రయదారుల పూర్తి వివరాలు అందరికీ కనబడేలా చేయటం ఈ ఆర్డినెన్సుల ఉద్దేశం. ఇప్పుడున్న చట్టం ప్రకారం కల్తీ కారణంగా మరణం సంభవిస్తే బాధ్యులైనవారికి మూడేళ్ల కఠిన శిక్ష విధించవచ్చు. తినే ఆహారపదార్థం రుచిగా, పరిశుభ్రంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరు కుంటారు. అలాంటి ఆహారం దొరికేచోటకే వెళ్తారు. హోటళ్లు మొదలుకొని సైకిళ్లపై తిరుగుతూ అమ్ముకునే విక్రయదారుల వరకూ అందరూ కమ్మనైన ఆహారపదార్థాలు వడ్డించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఎవరైనా లాభార్జనకు కక్కుర్తిపడి నాసిరకం పదార్థాలను అంటగడితే అలాంటివారి పనిబట్టడానికి రకరకాల చట్టాలున్నాయి. ఆహారకల్తీని అరికట్ట డానికీ, హానికరమైన, కాలంచెల్లిన పదార్థాల విక్రయాన్ని నిరోధించటానికీ హోటళ్లపై, ఇతర దుకాణాలపై విజిలెన్సు విభాగాలు దాడులు నిర్వహిస్తుంటాయి. కేసులు పెడతాయి. అయితే ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరగటం లేదని, ప్రభుత్వాలు మొక్కుబడిగా ఈ పనిచేస్తుంటాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆహారం తిని అస్వస్థతకు గురయి పదుల సంఖ్యలో జనం ఆస్పత్రుల పాలైనప్పుడు ఆదరాబాదరాగా చర్యలు తీసుకోవటం కూడా కనబడుతుంటుంది. హఠాత్తుగా యూపీ సర్కారు ఈ చర్య తీసుకోవటం వెనక ఇలాంటి ఘటన ప్రభావం ఏమైనా ఉందా? పోనీ ఈ మాదిరి ఉదంతాల కారణంగా జనం తరచూ అస్వస్థులవుతున్న లేదా మరణిస్తున్న ఉదంతాలేమైనా గమనించారా? అసలు ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ అధికారంలోకొచ్చాక ఎన్ని హోటళ్లపై, తినుబండారాల విక్రయ సంస్థలపై దాడులు నిర్వహించారు? అక్రమాలకు పాల్పడ్డారని తేలిన ఎంతమందిని శిక్షించారు? ఈ క్రమంలో ప్రస్తుత చట్టాలు నిరుపయోగంగా ఉన్నాయని భావిస్తే తగిన డేటాతో ఆ వివరాలు ప్రజల ముందు ఉంచొచ్చు. అప్పుడు ఒక సమగ్రమైన చట్టం అవసరమేనని అందరూ భావిస్తారు. కానీ యూపీలో జరుగుతున్నది అది కాదు. ఫలానా వర్గంవారు విక్రయించే పండ్లు లేదా ఇతర ఆహారపదార్థాలు అపరిశుభ్రంగా ఉంటాయని, వాటిని కలుషితం చేసి అమ్ముతున్నారని ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. వాటి ఆధారంగా ప్రభుత్వం ఈ ఆర్డినెన్సులు తీసుకొస్తున్నట్టు కనబడుతోంది. దుశ్చర్యలకు పాల్పడేవారికి మతం, కులం ఉండవు. ఎక్కడో ఒకచోట జరిగిన ఘటనను వీడియో తీసి ఫలానా మతం వారంతా ఇలాగే చేస్తున్నారని వదంతులు వ్యాప్తిచేయటం విద్వేషాలు రెచ్చగొట్టడానికే తోడ్పడతాయి. ఇదే యూపీలోని ఘాజియాబాద్‌లో ఒక వ్యాపారి ఇంట్లో ఎనిమి దేళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న రీనా కుమార్‌ అనే యువతి రోటీల్లో మూత్రాన్ని కలుపుతోందని ఆరోపిస్తూ పోలీసులు బుధవారం ఆరెస్టు చేశారని మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ మధ్య తెలంగాణలో అధికారులు వరస దాడులు నిర్వహించినప్పుడు అనేక హోటళ్లు, తినుబండారాల దుకాణాలు పాచిపోయిన పదార్థాలను అమ్ముతున్నాయని తేలింది. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిలో అన్ని మతాలకూ చెందినవారూ ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరిగే కావడ్‌ యాత్ర సమయంలో ఆ మార్గంలోని దుకాణాల్లో విక్రయదారులు తమ పేర్లు, ఇతర వివరాలు కనబడే బోర్డులు ప్రదర్శించాలని పోలీసులు మొన్న జూలైలో నోటీసులిచ్చారు. కావడ్‌ యాత్రికులు ‘స్వచ్ఛమైన శాకాహారులు’ గనుక అపశ్రుతులు చోటుచేసుకోకుండా ఈ పని చేశామని సంజాయిషీ ఇచ్చారు. దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దుకాణంలో నచ్చిన, నాణ్యమైన, రుచికరమైన ఆహారం దొరుకుతున్నదో లేదో వినియోగదారులు చూస్తారు తప్ప, వాటి విక్రయదారు ఎవరన్నది పట్టించుకోరు. అలా పట్టించుకోవాలని యూపీ ప్రభుత్వం తహతహలాడుతున్నదని తాజా నిర్వాకం గమనిస్తే అర్థమవుతుంది. వినియోగదారుల విశ్వాసాన్ని పరిరక్షించటమే ఆర్డినెన్సుల ఉద్దేశమన్న ప్రభుత్వ వాదన నమ్మదగ్గదిగా లేదు. ఆ పని విక్రయదారులది! వారిలో అక్రమార్కులుంటే చర్య తీసుకోవటానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి. చెదురుమదురుగా జరిగిన ఉదంతాలను భూతద్దంలో చూపి జనాన్ని కలవరపెట్టడం సబబు కాదు.సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనకున్న స్ఫూర్తి అర్థం చేసుకుంటే యూపీ ప్రభుత్వం ఇలాంటి ఆర్డినెన్సుల ఆలోచన చేసేది కాదు. యూపీలో గోసంరక్షణ, లవ్‌ జీహాద్‌ తదితర ఆరోపణలతో గుంపు దాడులు, గృహదహనాలు, హత్యోదంతాల వంటివి జరిగాయి. నిందితుల ఇళ్లూ, దుకాణాలూ బుల్‌డోజర్లతో నేలమట్టం చేయటం కూడా రివాజుగా మారింది. ఎన్‌కౌంటర్లు సరేసరి. ఆర్డినెన్సుల ప్రతిపాదన ఆ క్రమంలో మరో చర్య కావొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి కరువైందని యువత... ధరలు ఆకాశాన్నంటాయని సామాన్యులు మొత్తుకుంటున్నారు. విద్య, వైద్య రంగాలు పడకేశాయని గగ్గోలు పెడుతున్నారు. వీటిపై సమర్థవంతంగా వ్యవహరించి ప్రజల విశ్వా సాన్ని పొందాల్సివుండగా, ప్రజల్లో పరస్పర అవిశ్వాసాన్ని కలిగించే ఇలాంటి పనులకు పూను కోవటం ఏం న్యాయం? అసలు నేరానికి తగ్గ శిక్ష ఉండాలన్న ఇంగితం కరువైతే ఎలా? ఆర్డినెన్సుల ప్రతిపాదనపై యూపీ సర్కారు పునరాలోచన చేయాలి.

CM Revanth Reddy fires On BRS and BJP Leaders in media meeting6
సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం!: సీఎం రేవంత్‌

సాక్షి,హైదరాబాద్‌:‘అధికారం కోల్పోయి నిస్పృహ, అసహనంతో మూసీ నది పునరుజ్జీవానికి కొంతమంది అడ్డుపడుతున్నారు. మూసీ సుందరీకరణ అనే డైలాగ్‌ను ప్రచారంలోకి తెచ్చారు. మేము అందాల కోసం పని చేయడం లేదు. అందాల భామలతో కలిసి పనిచేయడం లేదు. అలాంటి కొంతమంది.. మంత్రులు, ప్రజాప్రతినిధుల ముసుగులో పదేళ్లు రాష్ట్రాన్ని పట్టిపీడించి బందిపోటు దొంగలకంటే దుర్మార్గంగా పట్టపగలు దోపిడీ చేసి స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మూసీ పునరుజ్జీవన ప్రయత్నాలపై విష ప్రచారంతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. మూసీ మురికిని మించి మెదడులో విషం నింపుకుని తెలంగాణ సమాజంపై దాడి చేస్తున్నారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం సచివాలయంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక్కొక్కరిని ఒప్పించి తరలిస్తాం ‘ఇది సుందరీకరణ కాదు.. దుబాయ్‌కి వెళ్లి నెత్తిమీద జుట్టును నాటు వేయించుకున్న విధానం కాదు. పునరుజ్జీవంతో మూసీని, మురికిలో కాలం వెళ్లదీస్తున్న ప్రజలను కాపాడి మంచి జీవనాన్ని ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, ప్రత్యామ్నాయ ఇళ్లను ఇవ్వాలనే ఆలోచన మాకు ఉంది. కానీ పేదరికం, కట్టుబానిసలు ఉండాలనే దొరలు, భూస్వాములు, జమీందారుల భావజాలం ఉన్నవారు దీనికి అడ్డుపడుతున్నారు. అక్కడి ప్రజల భవిష్యత్తుపై అపోహలు సృష్టిస్తున్నారు. నిజానికి 4 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తును, రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించగల కార్యాచరణ ఇది. గత 10 నెలల పాటు అధికారులు 33 బృందాలుగా ఏర్పడి మూసీ దుర్గంధంలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతి ఇంటికీ వెళ్లి వారి కష్టాలు, వివరాలను తెలుసుకున్నారు. వారిని ఏ విధంగా ఆదుకోవాలనే అంశంపై మేం ఆలోచన చేస్తున్నాం. అక్కడి సమస్యలు పరిష్కరించి ఒక్కొక్కరిని ఒప్పించి తరలిస్తాం..’ అని సీఎం స్పష్టం చేశారు. సెక్యూరిటీ లేకుండా వస్తా..మీరూ రండి ‘గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మల్లన్నసాగర్‌ భూసేకరణ కోసం వేములఘాట్‌ ప్రజలపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించి గుర్రాలతో తొక్కించినట్టుగా మేం చేయం. ఇక్కడికి వస్తావా? అక్కడికి వస్తావా? అని నన్ను అడుగుతున్నారు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, గజ్వేల్‌లోని ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మకు నేను సెక్యూరిటీ లేకుండా వస్తా. బీఆర్‌ఎస్‌ నేతలూ రావాలి. రచ్చబండ నిర్వహించి పదేళ్లలో ఎన్ని దుర్మార్గాలు చేశారో ప్రజలను అడుగుదాం..’ అని రేవంత్‌ సవాల్‌ చేశారు. బఫర్‌ జోన్‌లో మరో 10 వేల గృహాలు ‘మూసీ గర్భంలో 1,690 ఇళ్లు ఉండగా వారికి దసరా పండుగ వేళ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లతో పాటు రూ.25 వేలు చొప్పున తోవ ఖర్చులకు ఇచ్చాం. అయితే హైడ్రా వస్తుంది..బుల్డోజర్లు పెడ్తున్నరు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీలో ప్రభుత్వం ఒక్క ఇల్లు కూలగొట్టలేదు. ఖాళీ చేసిన లబ్ధిదారులే తమ ఇళ్ల తలుపులు, కిటికీల కోసం కూలగొట్టుకున్నారు. అడ్డగోలుగా కట్టిన 10, 20 అంతస్తుల ఆకాశహర్మ్యాలను కూల్చడానికే బుల్డోజర్లు, హైడ్రా అవసరం. అయినా హైడ్రా ఏమైనా ఫామ్‌హౌస్‌లో నిద్రపోయే భూత­మా? మీద పడడానికి? మరో 10 వేల ఇళ్లు బఫర్‌జోన్‌లో ఉన్నాయి వారికి ప్రత్యామ్నాయం కల్పించి, మంచి జీవితాలు ఇచ్చి మనస్సు గెలవాలని భావిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. అద్భుతాలు సృష్టించిన కంపెనీలతో కన్సార్టియం ‘ప్రపంచంలో అద్భుతాలను సృష్టించిన ఐదు కంపెనీలతో ఒక కన్సార్టియం ఏర్పాటు చేయించి రూ.141 కోట్లతో మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు డీపీఆర్‌ తయారీ బాధ్యతలను టెండర్ల ద్వారా అప్పగించాం. డీపీఆర్‌ తయారీతో పాటు అంచనా వ్యయం, నిధులు, పెట్టుబడులు, రుణాల సమీకరణకు సంబంధించి కన్సార్టియం సహకారం అందిస్తుంది. 18 నెలల్లో డీపీఆర్‌ తయారు చేస్తారు. ఆ తర్వాత నాలుగైదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఆరున్నరేళ్ల పాటు కన్సార్టియం సేవలందిస్తుంది. ఈ కన్సార్టియంలో భాగమైన ‘మీన్‌హార్ట్‌’ కంపెనీకే ప్రధాని మోదీ గుజరాత్‌లో సర్దార్‌ పటేల్‌ విగ్రహం కట్టే బాధ్యత అప్పగించారు. అలాగే రాష్ట్రంలో కేసీఆర్, రామేశ్వర్‌రావు తమ కులగురువు చినజీయర్‌స్వామితో కలిసి సమతామూర్తి విగ్రహాన్ని కట్టే బాధ్యత అప్పగించారు. గత ప్రభుత్వం ఉప్పల్‌లో మూసీపై రూ.30 కోట్లతో పనులు ప్రారంభించి రూ.6 కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో ఉంది. కానీ వర్షం వచ్చి చేసిన పనికొట్టుకుపోయిందని అంటున్నారు. ఈ వ్యవహారంలో లోపల వేయవచ్చు. చర్లపల్లి జైల్లో వేస్తే తిండిదండగ అని మేం చూసీచూడనట్టుగా ఉంటే వారికి అలుసుగా ఉంది..’ అని రేవంత్‌ అన్నారు. ‘మూసీ’పై అసెంబ్లీలో చర్చకు సిద్ధం ‘మూసీ ఒడ్డున ఖాళీ చేసిన ఇళ్లల్లో హరీశ్, కేటీఆర్, ఈటల రాజేందర్‌ మూడు నెలలు ఉంటే ఈ ప్రాజెక్టును ఆపేస్తానంటూ ఓపెన్‌ ఆఫర్‌ ఇస్తున్నా. ప్రజలు అక్కడ ఉండడం అద్భుతం అనుకుంటే మీరూ ఉండండి. పునరుజ్జీవాన్ని అడ్డుకోవడం మాత్రం దేశద్రోహం. మంచి ప్రాజెక్టుగా భావిస్తే ప్రజలను తరలించడానికి ఏం చేయాలో సూచనలు చేయండి. దీనిపై అసెంబ్లీలో చర్చకు కూడా సిద్ధం. ఇళ్లు, ఉద్యోగం, ఉపాధి, ప్లాట్, నష్టపరిహారం ఇద్దామా? చెప్పండి. అనుమానాలుంటే నివృత్తి చేస్తాం ప్రత్యేక కేసుగా ఎంపీలను ఎంక్లోజర్‌లో పెట్టి శాసనసభలో మాట్లాడించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. ఎంఐఎం, బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు అసద్, కిషన్, కేసీఆర్‌ తమ అనుమానాలను శనివారంలోగా ప్రశ్నల రూపంలో తెలియజేస్తే రాతపూర్వకంగా సమాధానమిస్తాం. రాజకీయ సమ్మతి కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేస్తాం..’ అని సీఎం తెలిపారు. దామగుండాన్ని వ్యతిరేకించేవాళ్లు కసబ్‌ లాంటోళ్లు ‘దేశ భద్రత కోసం ఏర్పాటు చేసే దామగుండం నేవీ రాడార్‌ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడేవాళ్లు కసబ్‌లాంటి వాళ్లు. కేటీఆర్‌ కసబ్‌లాగా మాట్లాడితే ఎవడో వచ్చి ఇవ్వాల్సిన సమాధానం ఇస్తాడు. ఏటా రూ.500 కోట్ల లంచం వచ్చే బతుకమ్మ చీరలను నిలుపుదల చేస్తే కడుపు మండి ఆరోపణలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో వరద బాధితులకు రూ.10 వేలు చొప్పున గత ప్రభుత్వం చేసిన రూ.600 కోట్ల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించాలా?..’ అని కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌ ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడటానికి ముందు.. ప్రస్తుతం మూసీ నది ఎలా ఉంది? పునరుజ్జీవం తర్వాత ఎలా ఉండబోతోంది తెలియజేస్తూ సీఎం ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.

Pro Kabaddi League from today7
తొడగొట్టేందుకు సిద్ధం

సాక్షి, హైదరాబాద్‌: పది సీజన్లుగా కబడ్డీ అభిమానులను అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఏడాది వ్యవధిలోపే మళ్లీ ముందుకు వచ్చింది. పీకేఎల్‌ 11వ సీజన్‌కు నేటితో తెర లేవనుంది. గత సీజన్‌కంటే భిన్నంగా ఈసారి మూడు వేదికలకే టోర్నీ లీగ్‌ దశను పరిమితం చేస్తున్నారు. సీజన్‌–10 ఫైనల్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలోనే నేడు టోర్నీ ప్రారంభం అవుతుంది. నవంబర్‌ 9 వరకు ఇక్కడే పోటీలు జరుగుతాయి. ఆ తర్వాత నోయిడా, పుణే తర్వాతి దశ పోటీలకు ఆతిథ్యం ఇస్తాయి. మరోసారి 12 టీమ్‌లతోనే పీకేఆల్‌ జరగనుండగా... లీగ్‌ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్లే ఆఫ్స్‌ (ఎలిమినేటర్‌–1, ఎలిమినేటర్‌–2, రెండు సెమీఫైనల్స్, ఫైనల్‌) ఐదు మ్యాచ్‌లతో కలిపి ఓవరాల్‌గా 137 మ్యాచ్‌లు పీకేఎల్‌లో జరుగుతాయి. టోర్నీ తొలిరోజు జరిగే మొదటి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ మాజీ చాంపియన్‌ బెంగళూరు బుల్స్‌తో తలపడనుండగా... మాజీ చాంపియన్స్‌ దబంగ్‌ ఢిల్లీ, యు ముంబా మధ్య రెండో మ్యాచ్‌ మ్యాచ్‌ (రాత్రి 9 గంటల నుంచి) జరుగుతుంది. తొలి మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. డిసెంబర్‌ 24న జరిగే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ తర్వాత నాకౌట్‌ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేస్తారు. భారీ వేలంతో మొదలు... సీజన్‌–11 కోసం నిర్వహించిన వేలంలో ఆటగాళ్లకు భారీ విలువ పలికింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో రూ. 1 కోటికి పైగా విలువతో అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాలో ఏకంగా 8 మంది ఉండటం విశేషం. అత్యధికంగా తమిళ్‌ తలైవాస్‌ సచిన్‌ తన్వర్‌ను రూ.2 కోట్ల 15 లక్షలకు దక్కించుకుంది. టోర్నీ ఆరంభానికి ముందు గురువారం హైదరాబాద్‌లో ట్రోఫీ ఆవిష్కరణ సహా లీగ్‌ ప్రచార కార్యక్రమం జరిగింది. పీకేఎల్‌ కమిషనర్‌ అనుపమ్‌ గోస్వామి తదితరులు ఇందులో పాల్గొన్నారు. దశాబ్దకాలంగా తమ లీగ్‌కు మంచి ఆదరణ దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన మున్ముందు టోర్నీని మరింత ఆకర్షణీయంగా మారుస్తామని ప్రకటించారు. పీకేఎల్‌ రాకతో తమ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో ఎంతో మార్పు వచ్చి0దని... డబ్బుతో పాటు గుర్తింపూ దక్కిందని అగ్రశ్రేణి ఆటగాళ్లు పవన్‌ సెహ్రావత్, ప్రదీప్‌ నర్వాల్‌ వెల్లడించారు. టైటాన్స్‌ రాత మారేనా... ప్రొ కబడ్డీ లీగ్‌ ప్రారంభమైన నాటినుంచి లీగ్‌లో ఉన్న ఎనిమిది జట్లలో తెలుగు టైటాన్స్‌ కూడా ఒకటి. కానీ మిగతా ఏడు జట్లతో పోలిస్తే టైటాన్స్‌దే ఇప్పటి వరకు పేలవ ప్రదర్శన. టైటాన్స్‌ మినహా మిగిలిన ఏడు జట్లు కనీసం ఒక్కసారైనా విజేతగా నిలవడం విశేషం. రెండో సీజన్‌లో మూడో స్థానంలో నిలవడమే ఇప్పటి వరకు ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత మూడు సీజన్లుగానైతే మరీ చెత్త ప్రదర్శనతో చివరిదైన 12వ స్థానంలో నిలుస్తూ వచ్చి0ది. ఓవరాల్‌గా 10 సీజన్లలో కలిపి 192 మ్యాచ్‌లు ఆడితే 56 మాత్రమే గెలిచి 116 ఓడిపోయింది. ద్రోణాచార్య అవార్డు గ్రహీత, లీగ్‌లో దబంగ్‌ ఢిల్లీకి టైటిల్‌ అందించిన కోచ్‌ కృషన్‌ కుమార్‌ హుడా ఈసారి టైటాన్స్‌ కోచ్‌గా రావడం జట్టుకు సానుకూలాంశం. అతని నేతృత్వంలో టీమ్‌ రాత మారుతుందా అనేది ఆసక్తికరం. వేలంలో ఎఫ్‌బీఎం ద్వారా రూ.1.72 కోట్లకు కెపె్టన్‌ పవన్‌ సెహ్రావత్‌ను టీమ్‌ కొనసాగించింది. విజయ్‌ మలిక్, అమిత్‌ కుమార్, సంజీవి వంటి ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. అయితే పవన్‌ మినహా చెప్పుకోదగ్గ అగ్రశ్రేణి రైడర్‌ లేకపోవడం జట్టులో ఒక లోపం. ప్రఫుల్, ఓంకార్, మన్‌జీత్‌ ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. డిఫెన్స్‌లో కృషన్‌ ధుల్‌ రూపంలో కీలక ఆటగాడు ఉండగా... మిలాద్, అజిత్, సాగర్‌ నుంచి సహకారం అవసరం. పీకేఎల్‌–11లో పాల్గొనే జట్లు: తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్‌ వారియర్స్, దబంగ్‌ ఢిల్లీ, గుజరాత్‌ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, జైపూర్‌ పింక్‌ పాంథర్స్, పట్నా పైరేట్స్, పుణేరి పల్టన్, తమిళ్‌ తలైవాస్, యు ముంబా, యూపీ యోధాస్‌.

Actor Tamannaah Bhatia Questioned By Probe Agency In Money Laundering Case8
Tamannaah Bhatia: తమన్నాను ప్రశ్నించిన ఈడీ

గువాహటి: బిట్‌కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీలను సంపాదించవచ్చని హెచ్‌పీజెడ్‌ టోకెన్‌ యాప్‌లో చేసిన ప్రకటనకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో నటి తమన్నా భాటియాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు గురువారం ప్రశ్నించారు. యాప్‌కు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకే తమన్నాను ప్రశ్నించారని, ఆమెపై ఎలాంటి నేరసంబంధ కేసు నమోదుకాలేదని సంబంధిత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. యాప్‌ ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న కేసులో ఇప్పటిదాకా 299 సంస్థలను నిందితుల జాబితాలో చేర్చారు. వీటిలో 76 సంస్థలు చైనా అధీనంలో నడుస్తున్నాయి. వాటిలో పది మంది డైరెక్టర్లు చైనా జాతీయులుకాగా రెండు సంస్థలను విదేశీయులు నడిపిస్తున్నారు. బిట్‌కాయిన్లు, క్రిప్టో కరెన్సీల మైనింగ్‌ ద్వారా ఊహించని లాభాలు గడించవచ్చని ఆశపెట్టి కోట్లు దండుకున్నారని యాప్‌పై కోహిమా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదుచేశారు. ఆన్‌లైన్‌ గేమింగ్, బెట్టింగ్, బిట్‌కాయిన్‌ మైనింగ్‌ కోసం పెట్టుబడులు పెడితే భారీ లాభాలు కళ్లజూస్తారని ప్రచారం చేయడంతో ఎంతో మంది పెట్టుబడులు పెట్టారు. రూ.57వేల పెట్టుబడికి మూడు నెలలపాటు ప్రతిరోజూ రూ.4,000 ఇస్తామని చెప్పి కేవలం ఒకే ఒక్కసారి ఇచ్చి మానేశారని బాధితులు ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టిన ఈడీ ఏకంగా రూ.455 కోట్ల విలువైన స్థిర,చరాస్థులను జప్తుచేసింది. అసలు డైరెక్టర్లు లేకపోయినా డొల్ల కంపెనీలు సృష్టించి వాటి పేరు మీద బ్యాంక్‌ ఖాతాలు, మర్చెంట్‌ ఐడీలు తీసుకున్నారని తేలింది.

Reason For Gold Price Hike in India Says Ajay Kedia9
బంగారం ధరలు పెరగడానికి కారణం ఇదే..

భారతదేశంలో బంగారం ధర రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. 10 గ్రాముల బంగారం నేడు రూ. 78వేలు దాటేసింది. దిగుమతులు కొంత తగ్గడం, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలు పెరగడానికి కారణమైందని కెడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కెడియా పేరొన్నారు.బంగారం ఇప్పుడు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. బుధవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ తీవ్రస్థాయి వైమానిక దాడుల తరువాత యూఎస్ అధ్యక్ష ఎన్నికల చుట్టూ ఉన్న అనిశ్చితి కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమైందని కెడియా అన్నారు.యూఎస్ ట్రెజడీ దిగుబడులు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య.. బలమైన డాలర్ కారణంగా ధరలు అధిక స్థాయిల నుండి వెనక్కి తగ్గాయి. అయినప్పటికీ సురక్షితమైన బిడ్లు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు, ముఖ్యంగా లెబనాన్‌లోని హిజ్‌బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో, క్షీణతను పరిమితం చేయడంలో దోహదపడింది.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ అడ్వాన్స్‌ బుకింగ్‌లో కీలక మార్పుభారతదేశంలో గోల్డ్ రేటు పెరగడానికి మరో కారణం ఏమిటంటే పండుగ సీజన్స్. దీపావళికి బంగారం కొంటే మంచిదని చాలామంది సెంటిమెంట్‌గా భావిస్తారు. దీంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం ధరలకు ఆజ్యం పోసినట్లే అయింది. మొత్తం మీద పసిడి ధర ఆకాశాన్నంటేలా దూసుకెళ్తోంది.

Global water crisis leaves half of world food production at risk in next 25 years10
Global Commission on Economics of Water: దారి తప్పిన జల చక్రం!

పర్యావరణంతో శతాబ్దానికి పైగా మనిషి ఆడుతున్న ప్రమాదకరమైన ఆట పెను విపత్తుగా పరిణమిస్తోంది. దాని తాలూకు విపరిణామాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. విచ్చలవిడిగా అడవుల నరికివేత, మితిమీరిన వాతావరణ కాలుష్యం తదితరాల దెబ్బకు చివరికి భూమిపై జీవకోటి మనుగడకు అత్యవసరమైన జలచక్రం కూడా గతి తప్పింది. అంతర్జాతీయ నిపుణుల సమూహమైన గ్లోబల్‌ కమిషన్‌ ఆన్‌ ద ఎకనామిక్స్‌ ఆఫ్‌ వాటర్‌ చేపట్టిన అధ్యయనం ఈ మేరకు తేలి్చంది. ‘‘చరిత్ర పొడవునా అత్యంత భారీ వాతావరణ మార్పులనెన్నింటినో తట్టుకుని నిలిచిన జలచక్రం ఇలా సంతులనం కోల్పోవడం మానవాళి చరిత్రలో ఇదే తొలిసారి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి అతి త్వరలోనే పరాకాష్టకు చేరడం ఖాయం’’ అని బుధవారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. మనిషి నిర్వాకం వల్ల చోటుచేసుకుంటున్న పర్యావరణ మార్పులే ఇందుకు ప్రధాన కారణమంటూ కుండబద్దలు కొట్టింది! ‘‘దీనివల్ల ఆహార సంక్షోభం మొదలుకుని పలు రకాల విపరిణామాలు తలెత్తనున్నాయి. వీటి దెబ్బకు త్వరలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలే అతలాకుతలం కావడం ఖాయం’’ అని జోస్యం చెప్పింది. ఏమిటీ జలచక్రం...!? జలచక్రం భూమిపై నీటి కదలికలకు సంబంధించిన సంక్లిష్టమైన వ్యవస్థ. చెరువులు, నదులు, ముఖ్యంగా సముద్రంలోని నీరు సూర్యరశ్మి ప్రభావంతో ఆవిరిగా వాతావరణంలోకి చేరుతుంది. భారీ నీటి ఆవిరి మేఘాలుగా మారి సుదూరాలకు పయనిస్తుంది. శీతల వాతావరణం ప్రభావంతో చల్లబడి వానగా, మంచుగా తిరిగి నేలపైకి చేరుతుంది. ఈ ప్రక్రియనంతటినీ కలిపి జలచక్రంగా పేర్కొంటారు. మనిషి చేజేతులారా చేస్తూ వస్తున్న పర్యావరణ విధ్వంసం ధాటికి దీనిపై కొన్ని దశాబ్దాలుగా కనీవినీ ఎరగని స్థాయిలో ఒత్తిడి పడుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో అది భరించలేని స్థాయికి చేరిందని అధ్యయనం వెల్లడించింది. దశాబ్దాల తరబడి భూమిని విచ్చలవిడిగా విధ్వంసకర విధానాలకు వాడేయడం మొదలుకుని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు నీటి నిర్వహణలో కనబరుస్తున్న లెక్కలేనితనం దాకా జలచక్రం గతి తప్పేందుకు దారితీసిన పలు కారణాలను నివేదిక ఏకరువు పెట్టింది. గతి తప్పితే అంతే...! జలచక్రం గతి తప్పితే జరిగే చేటును తాజా నివేదిక కళ్లకు కట్టింది...→ కేవలం నీటి ఎద్దడి దెబ్బకు 2050 నాటికి దాదాపుగా అన్ని దేశాల జీడీపీ కనీసం 8 శాతం, అంతకుమించి తగ్గిపోతుందని అంచనా. అల్పాదాయ దేశాల జీడీపీలో 15 శాతానికి పైగా క్షీణత నమోదు కావచ్చు.→ దీని ప్రభావంతో ఏకంగా 300 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. చాలా దేశాల్లో పంటలూ నేలచూపులు చూస్తున్నాయి. ళీ భారీ భవనాలు తదితరాల తాలూకు ఓపలేని భారానికి తోడు భూగర్భ జల వనరులూ నిండుకుంటుండటంతో నగరాలు, పట్టణాలు నానాటికీ మరింత వేగంగా భూమిలోకి కూరుకుపోతున్నాయి. → నీటి సంక్షోభం ఇప్పటికే ప్రపంచ ఆహారోత్పత్తిని 50 శాతానికి పైగా ప్రభావితం చేస్తోంది.హరిత జలం.. అతి కీలకం చెరువులు, నదుల వంటి జలాశయాల్లోని నీటికి బ్లూ వాటర్‌ అంటారు మట్టి, మొక్కల్లో నిల్వ ఉండే తేమను హరిత జలం అని పేర్కొంటారు. మనం ఇప్పటిదాకా పెద్దగా పట్టించుకోని ఈ నీటి వనరును జలచక్రంలో అతి కీలకమైన పొరగా నివేదిక అభివరి్ణంచింది. ‘‘ప్రపంచ వర్షపాతంలో ఏకంగా సగానికి పైగా దీనివల్లే సంభవిస్తోంది. భూమిని వేడెక్కించే కర్బన ఉద్గారాలను చాలావరకు శోషించుకునేది ఈ హరితజలమే’’ అని తేలి్చంది. కానీ, ‘‘ఏ దేశంలో చూసినా చిత్తడి నేలలను నాశనం చేసే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. దీనికి తోడు అడవులనూ విచ్చలవిడిగా నరికేస్తున్నారు. దాంతో కర్బన ఉద్గారాలు నేరుగా వాతావరణంలోకి విడుదలైపోతున్నాయి. ఫలితంగా గ్లోబల్‌ వారి్మంగ్‌ ఊహాతీత వేగంతో పెరిగిపోతోంది. మట్టిలో, చెట్లలో ఉండే తేమ హరించుకుపోతోంది. ఇదో విషవలయం. దీని దెబ్బకు కార్చిచ్చుల ముప్పు కూడా నానాటికీ పెరుగుతోంది’’ అని నివేదిక హెచ్చరించింది.అడ్డూ అదుపూ లేని మానవ కార్యకలాపాల వల్ల భూమిపై జలచక్రంతో సహా అన్నిరకాల సంతులనాలూ ఘోరంగా దెబ్బ తింటున్నాయి. దాంతో వర్షపాత ధోరణులు విపరీతంగా మారుతున్నాయి. దేశాలన్నీ తమ నీటి నిర్వహణ తీరుతెన్నులను యుద్ధ ప్రాతిపదికన మెరుగు పరుచుకోవాలి. కాలుష్యానికి తక్షణం అడ్డుకట్ట వేయాలి. లేదంటే మానవాళి మనుగడకు ముప్పు మరెంతో దూరంలో లేదు’– రిచర్డ్‌ అలన్, క్లైమేట్‌ సైన్స్‌ ప్రొఫెసర్, రీడింగ్‌ యూనివర్సిటీ, ఇంగ్లండ్‌ప్రపంచ నీటి సంక్షోభం పెను సమస్య మాత్రమే కాదు. జల ఆర్థిక వ్యవస్థల్లో అత్యవసరమైన మార్పుచేర్పులకు అవకాశం కూడా. ఇందుకోసం ముందుగా నీటి విలువను సరిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. దురదృష్టవశాత్తూ చాలా దేశాల్లో అదే లోపిస్తోంది– గోజీ ఒకొంజో ఇవాలా,డైరెక్టర్‌ జనరల్, వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
కెనడా, భారత్‌ గొడవ.. మనోళ్ల పరిస్థితి ఏంటి?

Indians in Canada: ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య నేపథ్యంలో భారత్‌, కెనడా దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్

title
లండన్‌లో ఘనంగా దసరా అలాయి బలాయి

హైదరాబాద్ తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా పరాయి గడ్డపై అలాయి బలాయి సాంస్కృతికి నాంది పలికారు.

title
అమెరికాలో రోడ్డు ప్రమాదం

రేణిగుంట/ఓజిలి: అమెరికాలోని రాండాల్ఫ్‌ వద్ద సోమవారం సాయంత్రం

title
ఇండియన్‌ రైల్వే నుంచి స్పేస్‌ఎక్స్‌ వరకు..

SpaceX Sanjeev Sharma: అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ ఇటీవల చేసిన అంతరిక్ష ప్రయోగం విజయవంతం​ అయింది.

title
TCUK ఆధ్వర్యంలో తొలిసారి యూకేలో బతుకమ్మ వేడుకలు

సౌతెండ్, యునైటెడ్ కింగ్డమ్‌లో TCUK   ఆధ్వర్యంలొ ప్రప్రధముగా తెలంగాణ బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎస్సెక్

Advertisement
Advertisement