Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Seats sanctioned for medical colleges established by YS Jagan1
వైఎస్‌ జగన్‌ స్థాపించిన మెడికల్‌ కాలేజీలకు పీజీ సీట్ల మంజూరు

విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ హయాంలో స్థాపించిన మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరయ్యాయి. తొలిసారి కొత్త మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరు చేసింది ఎన్‌ఎంసీ(National Medical Commission). ఇందులో మచిలీపట్నం-12, నంద్యాల-16, విజయనగరం -12, రాజమండ్రి-16, ఏలూరు -4 చొప్పున పీజీ సీట్లు మంజూరు చేసింది. ఐదు మెడికల్ కాలేజీలకు 60 మెడికల్ పీజీ సీట్లు మంజూరు చేయడంతో ఇన్నాళ్లు కూటమి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నది అబద్ధమేనని తేలిపోయింది. వైఎస్‌ జగన్ మెడికల్ కాలేజీలు కట్టలేదంటూ మంత్రులు సైతం అబద్ధాలు చెప్పారు. వైఎస్‌ జగన్‌ స్థాపించిన మెడికల్‌ కాలేజీలకు తాజాగా పీజీ సీట్లు మంజూరు కావడంతో ప్రభుత్వ పెద్దలు చెప్పేదంతా అసత్య ప్రచారమేనని నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే 5 కాలేజీల్లో 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు మంజూరు కాగా, తాజాగా 60 పీజీ సీట్లు మంజూరు చేసింది ఎన్ఎమ్‌సీ.ఇదీ చదవండి: ‘వైద్య రంగంలో జగన్‌ సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే’

BCCI Condoles Tragic loss of Afghan cricketers Support to ACB Cancelling2
BCCI: పిరికిపందల దాడి.. అఫ్గన్‌ బోర్డుకు మద్దతుగా బీసీసీఐ ప్రకటన

అఫ్గనిస్తాన్‌ క్రికెటర్ల మృతి పట్ల భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సంతాపం వ్యక్తం చేసింది. అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (ACB)కు సంఘీభావం ప్రకటించింది. తమ క్రికెటర్ల మరణానికి కారణమైన దేశంతో.. అఫ్గన్‌ బోర్డు సిరీస్‌ రద్దు చేసుకోవడాన్ని బీసీసీఐ స్వాగతించింది.పిరికిపందల దాడి.. ఈ మేరకు.. ‘‘సరిహద్దులోని పక్తికా ప్రావిన్స్‌లో పిరికిపందలు జరిపిన సీమాంతర వైమానిక దాడుల్లో అఫ్గనిస్తాన్‌ యువ క్రికెటర్లు కబీర్‌ ఆఘా, సిబ్ఘతుల్లా, హరూన్‌ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. వీరి మృతి పట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.ఈ కష్ట సమయంలో బీసీసీఐ అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు మద్దతుగా నిలుస్తుంది. అఫ్గన్‌ క్రికెట్‌ ప్రపంచానికి, మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. మీ దుఃఖాన్ని మేమూ పంచుకుంటాం. ఇందుకు కారణమైన అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.తీవ్రంగా కలచివేస్తోందివైమానిక దాడుల్లో మరణించిన అమాయక ప్రజలు.. ముఖ్యంగా క్రీడల్ని భవిష్యత్తుగా ఎంచుకున్న వ్యక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేస్తోంది. అఫ్గనిస్తాన్‌ ప్రజలకు బీసీసీఐ హృదయపూర్వకంగా సానుభూతి ప్రకటిస్తోంది. వారి బాధను మేమూ పంచుకుంటాము’’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా పేరిట బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది.కాగా పాకిస్తాన్‌ జరిపిన వైమానిక దాడుల్లో అఫ్గన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఇందులో ముగ్గురు స్థానిక క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాక్‌ వైఖరికి నిరసనగా పాకిస్తాన్‌తో ఆడాల్సిన ముక్కోణపు సిరీస్‌ నుంచి తప్పుకొంటున్నట్లు అఫ్గన్‌ బోర్డు ప్రకటించింది.ఆట కంటే దేశమే ముఖ్యంఅఫ్గన్‌ టీ20 జట్టు కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌తో పాటు పలువురు క్రికెటర్లు బోర్డు నిర్ణయాన్ని స్వాగతించారు. ఆట కంటే దేశమే ముఖ్యమని పేర్కొన్నారు. కాగా రావల్పిండి వేదికగా నవంబరు 19 నుంచి పాకిస్తాన్‌- శ్రీలంక- అఫ్గనిస్తాన్‌ మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్‌ నిర్వహణకు ముందుగా షెడ్యూల్‌ ఖరారైంది.అయితే, పాక్‌ దుశ్చర్య కారణంగా అఫ్గన్‌ బోర్డు ఈ సిరీస్‌ను బహిష్కరించగా.. తాము మరో జట్టు కోసం వెతుకుతున్నట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. ‘‘అప్గనిస్తాన్‌ తప్పుకొన్నా ట్రై సిరీస్‌ కచ్చితంగా జరుగుతుంది. అఫ్గన్‌ జట్టు స్థానాన్ని భర్తీ చేయగల టీమ్‌ కోసం చూస్తున్నాం’’ అని పీసీబీ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి.చదవండి: రషీద్‌ ఖాన్‌ సంచలన నిర్ణయం!

AP CM Chandrababu No IR And PRC To Employees3
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ మొండిచేయి

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ మొండిచేయి చూపెట్టారు. ఉద్యోగులకు ఐఆర్‌పై ఎటువంటి ప్రకటన చేయని చంద్రబాబు.. పీఆర్‌సీపైనా కూడా నోరు మెదపలేదు. వీటిని పక్కన పెట్టిన చంద్రబాబు.. కేవలం సింగిల్‌ డీఏతో సరిపెట్టేశారు. నాలుగు డీఏల్లో ఒక డీఏను మాత్రమే ప్రకటించారు. ఇక, ఐఆర్‌, పీఆర్‌సీపై ప్రకటన వస్తుందని ఉద్యోగులుకు కేవలం ఒక డీఏనే ప్రకటించడంతో మరోసారి చంద్రబాబు చిత్తశుద్ధి బయటపడింది. చంద్రబాబు ప్రకటనతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. గత రెండు రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో మంత్రులు హైడ్రామా నడిపినప్పటికీ, చివరికి ఒక డీఏనే ప్రకటించారు చంద్రబాబు. మరొకవైపు పెండింగ్‌ బకాయిల అంశానికి సంబందించి కూడా ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. ఇదీ చదవండి:గూగుల్‌తో లక్ష ఉద్యోగాలు అనేది అబద్ధం: బీజేపీ ఎమ్మెల్యే విష్ణు

Gold is Flashing a Big Warning Signal Zoho CEO Sridhar Vembu Tweet4
గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్

పెరుగుతున్న బంగారం ధరలు.. ఆర్ధిక శ్రేయస్సు కంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడిని సూచిస్తుందని జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ శ్రీధర్ వెంబు హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఐఎమ్ఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ రాసిన కథనంపై స్పందిస్తూ.. యూఎస్ మార్కెట్లపై చేసిన అంచనాతో తాను ఏకీభవిస్తున్నానని శ్రీధర్ వెంబు చెప్పారు. ''అమెరికా స్టాక్ మార్కెట్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంగారం కూడా ఒక పెద్ద హెచ్చరిక సంకేతాన్ని సూచిస్తోంది. నేను బంగారాన్ని పెట్టుబడిగా భావించను, దానిని ఆర్థిక ప్రమాదానికి బీమాగా భావిస్తున్నాను. వ్యవస్థలోని అన్ని రుణాలను తిరిగి చెల్లించడానికి AI కృషి చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను'' అని ఆయన ట్వీట్ చేశారు.గీతా గోపీనాథ్ ఏమన్నారంటే?వాణిజ్య ఉద్రిక్తతల మధ్య అమెరికన్ స్టాక్ మార్కెట్ ఇటీవల బాగా దెబ్బతింది. డాట్ కామ్ క్రాష్ తరువాత జరిగిన దానికంటే.. స్టాక్ మార్కెట్ కరెక్షన్ మరింత తీవ్రమైంది. టారిఫ్ యుద్ధాలు.. సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అంతర్లీన సమస్య అసమతుల్య వాణిజ్యం కాదు అసమతుల్య వృద్ధి. అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని మరిన్ని దేశాలు/ప్రాంతాల్లో అధిక వృద్ధి మరియు రాబడి అవసరం.పెట్టుబడిదారులు చాలావరకు సురక్షితమైన ఆస్తిగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగిపోతోంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్లలో అస్థిరత పెరగడం మాత్రమే కాకుండా.. ఆర్థిక స్థిరత్వంలో కొత్త ఆందోళనలు పుడుతున్నాయి. ఈ తరుణంలో 2026 జనవరి నాటికి 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.50 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు!కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు.. ముఖ్యంగా చైనా, జపాన్‌లలో బలమైన డిమాండ్ కారణంగా ప్రపంచ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరుగుతాయని, ఆల్ ఇండియా జెమ్ & జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) వ్యవస్థాపక సభ్యుడు & మాజీ చైర్మన్ అనంత పద్మనాబన్ పేర్కొన్నారు.I agree with Dr Gita Gopinath.The US stock market is in a clear and massive bubble.The degree of leverage in the system means that we cannot rule out a systemic event like the global financial crisis of 2008-9. Gold is also flashing a big warning signal. I don't think of… https://t.co/7xVPL3FXDq— Sridhar Vembu (@svembu) October 18, 2025

Fire Broke Out In Dhaka International Airport5
ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం

బంగ్లాదేశ్‌లోని ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢాకా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆకస్మికంగా మంటలు ఎగిసి పడ్డాయి. దాంతో ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది, ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. ఢాకాలోని హజ్రాత్‌ షాహ్‌జలాల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో మధ్యాహ్నం గం. 2. 15 ని.ల ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. దాంతో పొగ దావానలంలా వ్యాపించింది. కిలో మీటర్ల మేర పొగ కమ్మేయడంతో విమానాల రాకపోకలను ఉన్నపళంగా నిలిపివేశారు. అంతర్జాతీయ గూడ్స్‌ వస్తువులు ఉంచే కార్గో ఏరియా గేట్‌ నంబర్‌ 8 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌లో ఉన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం ఇది. ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.VIDEO | Dhaka, Bangladesh: A fire broke out at a section of the Cargo Village of Hazrat Shahjalal International Airport this afternoon. More details awaited.#Dhaka #AirportFire #HazratShahjalal(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/flGkHso2xq— Press Trust of India (@PTI_News) October 18, 2025ఇదీ చదవండి:Air China: విమానంలో కలకలం.. గాల్లో ఉండగానే మంటలు

Special Story On Maoists leave the forests and the mainstream of life6
అడవి విడిచిన ఆయుధం…

మావోయిస్టు పార్టీలో శిఖర సమానులైన ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు పోలీసుల ముందు లొంగిపోయారు. తమ బలగంతో సహా ముఖ్యమంత్రుల ఎదుట సరెండర్ అయ్యారు. ఆయుధం వదిలి రాజ్యాంగ ప్రతిని చేతబట్టారు. తుపాకీ వదిలి ప్రజాస్వామ్య ప్రతిన బూనారు. రెండు రోజుల్లో దాదాపు 300లకు పైగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. భారత దేశ సాయుధ పోరాట చరిత్రలో ఇదో కీలక మైలురాయి. అర్థ శతాబ్దపు నక్సల్బరీ పోరాట చరిత్రలో అతిపెద్ద కుదుపు. ఇది సైద్ధాంతిక భావాజాలనికి ఎండ్ పాయింట్ అని కొందరంటుంటే… పోరాట పంథాలో మార్పు మాత్రమే అని మరికొందరంటున్నారు. కాలమాన పరిస్థితులను ఎదుర్కొన్న మావోయిస్టు సిద్దాంతాన్ని… మరో రూపంలో రాబోయే తరానికి అందించడానికే… అన్నలు అస్త్రసన్యాసం చేస్తున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఒకరు సిద్ధాంత కర్త… మరొకరు గెరిల్లా వీరుడుమావోయిస్టు పార్టీలో ప్రస్తుతం తీవ్రమైన అంతర్గత ఘర్షణ ఉంది.ముఖ్యంగా ఆయుధం వదలాలనే వర్గం ఇప్పటికే మూటా ముల్లే సర్దుకుని… అడవీని వీడుతున్నారు. దాదాపు 300మంది మావోలు అటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్ఘడ్ సర్కార్ల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ సర్వోన్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, మరో కేంద్రకమటీ సభ్యుడు ఆశన్న ఉన్నారు. వీరిద్దరు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో కీలక భూమిక పోషించారు. ముఖ్యంగా మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు పార్టీ సైద్ధాంతిక రూపకల్పన, సాహిత్య రచనా విభాగంలో ఎంతో పనిచేశారు. మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో ఆమోదించిన ఎన్నో సైద్ధాంతిక పత్రాలకు రూపకల్పన చేసింది కూడా మల్లోజుల వేణుగోపాల్ రావే. సాధన పేరుతో ఎన్నో పుస్తకాలు రాసిన చరిత్ర మల్లోజుల వేణుగోపాల్ది. మావోయిస్టు పార్టీ మేధావి వర్గంలో ఎలాంటి శశభిషలు లేకుండా అత్యున్నతుడు అనే పేరు తెచ్చుకుంది కూడా మల్లోజుల వేణుగోపాలే. సల్వాజుడుం వల్లే మావోయిస్టు పార్టీ బలోపేతం అయింది అంటూ థాంక్స్ టు సల్వాజుడుం పేరుతో పేరుతో మల్లోజుల వేణుగోపాల్ పుస్తకం రాశారు. ఒక దశలో గణపతి తరువాత బాధ్యతలు మల్లోజుల వేణుగోపాల్కు ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇక ఆశన్న అలియాస్ తక్కలపల్లి వాసుదేవరావు మావోయిస్టు పార్టీ మిలటరీ విభాగంలో ఆరితేరిన యుద్ధవీరుడు. 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కారు కింద క్లైమోర్మెన్లు పెట్టింది కూడా ఆశన్నే. దండకారుణ్యంలో ఎన్నో అంబుష్లకు నేతృత్వం వహించిన ఆశన్న మావోయిస్టు పార్టీలోనే నెంబర్-1 ఆర్మీ కమాండర్గా ఎదిగాడు. మావోయిస్టు పార్టీ అబూజ్మఢ్లో నిర్వహించిన చాలా ఆంబుష్లకు నేతృత్వం వహించింది కూడా ఆశన్ననే. 2013లో ఛత్తీస్ఘడ్లోని ఝీరమ్ ఘాటి దాడిలో మహేంద్రకర్మతో పాటు పదిమందిని హత్యచేసిన సంఘటనలోనూ ఆశన్న ప్లానింగ్ ఉందని చెబుతారు. ఇక 2011లో మావోయిస్టు పార్టీ సుక్మా జిల్లాలో 75మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపేసిన సంఘటన ప్లానింగ్ కూడా ఆశన్నదే అని చెప్తారు. అందుకే మావోయిస్టు పార్టీలో సైద్ధాంతికంగా అత్యంత బలమైన మల్లోజుల… యుద్ధవిద్యలో ఆరితేరిన గెరిల్లా ఆశన్నలు ఆయుధాలు వదిలివేయడం ఇప్పుడు ఓ సంచలనం. లేఖలతో యుద్ధం… మావోయిస్టు పార్టీకి చెందిన సాయుధ క్యాడర్ వందల సంఖ్యలో ఆయుధాలతో లొంగిపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు పార్టీని విభేదించి బయటకు వచ్చిన మల్లోజుల, ఆశన్నలది ద్రోహం అని కొందరు మావోయిస్టు సానుభూతిపరులు చెబుతున్నారు. పార్టీకి ద్రోహం చేసి వీరంతా బయటకు వచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది ఇప్పటికైనా మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావడం మంచి పరిణామం అంటూ వీరికి మద్దతునిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడమే పోరాటంగా మారినప్పుడు లొంగిపోవడంలో తప్పులేదని చెబుతున్నారు. తెలుగు ప్రజల్లో మావోయిస్టుల సరెండర్పై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇక చాలాకాలం నుంచి మావోయిస్టులను అరాచకశక్తులు అని తిట్టిపోసే… ఛత్తీస్ఘడ్ మీడియా మాత్రం లొంగిపోయిన మావోలను హీరోలుగా కీర్తిస్తోంది. మొత్తానికి మావోయిస్టు పార్టీలో అంతర్గతంగా ఉన్నట్లుగానే బయట కూడా లొంగుబాటుపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. దాదాపు రెండు నెలలుగా మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే… ఈ లొంగుబాటుకు కారణాలు అర్ధమవుతాయి. గత నెలలో మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలి బయటకు వచ్చే విషయంపైనా పెద్ద ఎత్తున లేఖల పర్వం కొనసాగింది. ముఖ్యంగా అభయ్ పేరుతో మల్లోజుల రాసిన లేఖలు పార్టీలో ప్రకంపణలు సృష్టించారు. మావోయిస్టు పార్టీ సైద్ధాంతికంగా తప్పులు చేసిందని.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని అందువల్లే ఇంతటి నిర్బంధం ఎదుర్కోవాల్సి వస్తుందని మల్లోజుల 21పేజీల లేఖను విడుదల చేశాడు. దీనికి రూపేష్ పేరుతో దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటి హెడ్ ఆశన్న మద్దతు పలికాడు. అయితే మల్లోజుల రాసిన లేఖపై మావోయిస్టు పార్టీలోని మరో వర్గం తీవ్రంగా స్పందించింది. ఇటీవలే ఎన్కౌంటర్లో చనిపోయిన ఇద్దరు కేంద్రకమటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డిలు సైతం దీనిని ఖండిస్తూ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ తెలంగాణా విభాగం సైతం దీనిని వ్యతిరేకించింది. పైగా మల్లోజుల పార్టీకి ద్రోహం చేస్తున్నాడని… అతను తన ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పజెప్పాలని లేదంటే బలవంతంగా లాక్కుంటామని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. దీంతో మావోయిస్టు పార్టీలో చీలిక తప్పదని తేలిపోయింది. దీనికి అనుగుణంగానే మావోయిస్టు పార్టీలో మల్లోజుల వర్గం వరుస లొంగుబాట్లకు తెరతీసింది. తెలుగు మావోయిస్టుల్లో విభేదాలుమావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టు పార్టీలోని తెలుగు నక్సలైట్లలో వచ్చి విభేదాలే ఈ లొంగుబాటుకు కారణం అనే చర్చ వేగం పుంజుకుంది. ముఖ్యంగా ఈ ఏడాది మే నెలలో మావోయస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజు ఎన్కౌంటర్లో మృతి చెందిన తరువాత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభం అయ్యాయని చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ చీఫ్గా మల్లోజుల వేణుగోపాల్కు పగ్గాలు ఇవ్వకపోవడం పట్ల ఆయన వర్గం పార్టీతో విభేదించింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముప్పాళ్ల లక్ష్మణరావు తరువాత పార్టీ పగ్గాలు మల్లోజులకు ఇస్తారనే చర్చ జరిగింది. అయితే అప్పుడు నంబాళ కేశవరావు వైపే కేంద్రకమిటీ మొగ్గుచూపింది. ఇక నంబాళ అలియాస్ బసవరాజు తరువాతనైనా మల్లోజులను చీఫ్గా ఎన్నుకుంటారని భావించారు. అకస్మాత్తుగా తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ పేరు తెరమీదకు వచ్చింది. దీంతో మల్లోజుల వర్గం పూర్తిగా పార్టీ కేంద్రకమిటీలోని ఇతర నాయకత్వంతో విభేదాలు పెంచుకుందనే చర్చ జరుగుతోంది. దీనివల్లే మల్లోజుల వర్గం ఆయుధాలు వీడాలనే నిర్ణయానికి వచ్చిందని పార్టీలోని ఓ వర్గం చెబుతోంది. ఇటీవలే పోలీసుల ముందు లొంగిపోయిన తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సైతం మావోయిస్టు పార్టీకి ప్రస్తుతం ఎవరు ప్రధాన కార్యదర్శి లేరని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. అసలు కేంద్రకమిటీ సమావేశమే జరగలేదని ఆశన్న స్పష్టం చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే తిప్పరి తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా మల్లోజుల వర్గం అంగీకరించడం లేదని స్పష్టమవుతోంది. అయితే మల్లోజుల వేణుగోపాల్ను వ్యతిరేకించే వారిలో కేంద్రకమిటీకి చెందిన మల్లా రాజిరెడ్డి, తిప్పరి తిరుపతి, పాక హనుమంతుతో పాటు గోండి మావోయిస్టు నాయకుడు హిడ్మా పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణా మావోయిస్టు పార్టీ చీఫ్గా ఉన్న దామోదర్ అలియాస్ జగన్ దీనిపై ఎలాంటి స్టాండ్ తీసుకున్నారనే విషయం ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే మల్లోజుల లేఖను వ్యతిరేకించిన వారిలో దామోదర్ కూడా ఉండటంతో… మల్లోజులను సపోర్ట్ చేసే నాయకత్వం పెద్దగా మావోయిస్టు పార్టీలో మిగల్లేదని అర్ధమవుతోంది. లొంగుబాటలో మరికొంతమందిభారతదేశ చరిత్రలోనే అతిపెద్ద నక్సలైట్ లొంగుబాటుగా భద్రతా బలగాలు కీర్తిస్తున్న ఈ సరెండర్స్ ప్రభావం ఎలా ఉండబోతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత నాలుగు రోజుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన దాదాపు 310మంది మావోయిస్టులు లొంగిపోయారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. లొంగిపోయిన వారిలో మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న పాటు చాలామంది దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. వీరిలో డీకేఎస్జెడ్సీ మెంబర్ భాస్కర్, టెక్నికల్ టీమ్లో పనిచేసిన సరోజ మరికొంత మంది కమాండర్లు ఉన్నారు. దాదాపు 20 వరకు ఏకే-47 తుపాకులు, 40వరకు ఆటోమెటిక్ వెపన్స్ మొత్తానికి 200 ఆయుధాలను మావోయిస్టులు లొంగుబాటు సమయంలో పోలీసులకు అప్పగించారు. అయితే మొత్తం మావోయిస్టు పార్టీ కేడర్లో ఇది ఎంత భాగం అనేది ఇప్పుడ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. కేంద్ర నిఘా వర్గాల లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా మావోయిస్టుల సంఖ్య వేయిలోపే ఉందని తెలుస్తోంది. అయితే వివిధ వర్గాల ద్వారా వస్తున్న సమాచారంతో పాటు లొంగిపోయిన మావోయిస్టులు చెబుతున్న లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి 2500మంది సాయుధ సైన్యం ఉన్నట్లు అంచనా. గణాంకాల పరంగా చూసుకుంటే ప్రస్తుతం లొంగిపోయిన వారి సంఖ్య మొత్తం సాయుధ మావోయిస్టులలో దాదాపు 15శాతంగా చెప్పుకోవచ్చు. దీంతో మిగిలిన మావోయిస్టుల సంగతేంటనే చర్చ జరుగుతోంది. ఒకవేళ మిగిలిన వారు కూడా ఇదే బాట పడితే దాదాపు వేయి మంది వరకు లొంగపోవచ్చని పోలీసులు అంచనా వేస్తన్నారు. వచ్చే వారంరోజుల్లో లొంగుబాట్లకు సంబంధించి స్పష్టమైన ముఖచిత్రం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటీ దారిలోనే మావోయిస్టు పార్టీకి చెందిన ఉదంతి ఏరియా కమిటీ కూడా లొంగుబాటు వైపు మొగ్గు చూపింది. దీనికి అనుగుణంగా తమ మావోయిస్టు కామ్రెడ్లకు ఉదంతి ఏరియా కమిటి కార్యదర్శి సునీల్ లేఖ రాశారు. ఈ నెల 20వ తేదీన మద్యాహ్నం 12గంటల ముప్పై నిమిషాలకు ఎక్కడ కలువాలో కూడా తన లేఖలో సునీల్ స్పష్టం చేశారు. దీంతో పాటు తాము ఎక్కడ కలవాలో కూడా లేఖలో స్పష్టంగా మావోయిస్టులు పేర్కొన్నారు. దీనిని బట్టి ఒక విధంగా ప్రభుత్వం ఛత్తీస్ఘడ్లో కూంబింగ్ ఆపేసినట్లు సంకేతాలు వస్తున్నాయి. మావోయిస్టులు స్వేచ్ఛగా అడవి నుంచి లొంగుబాటు కోసం బయటకు వచ్చే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే లొంగిపోయిన మావోయిస్టుల కోసం ప్రభుత్వం నది దాటేందుకు వీలుగా బోట్లు కూడా ఏర్పాటు చేసింది. మొత్తానికి ప్రభుత్వం ఇచ్చిన ఈ కాలపరిమితిలో మావోయిస్టులు లొంగిపోతారా… లేక మరో ఎత్తుగడతో వస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివాసీలు ఎటువైపు…మావోయిస్టు పార్టీకి ఇది సంధికాలం. ఓ వైపు లొంగుబాట్లు పెరుగుతుంటే ఆ పార్టీలో ఉన్న మిగిలిన నాయకత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయడం లేదు. లొంగిపోతున్న వారిది తప్పని కాని… ఎవరూ ఈ ట్రాప్లో పడొద్దు అనే మాట కూడా మావోయిస్టు పార్టీ నాయకత్వం నుంచి రావడం లేదు. చాలామందిలో అసలు మావోయిస్టు పార్టీకి ఇంకా నాయకత్వం మిగిలి ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు పార్టీ కార్యదర్శి తిప్పరి తిరుపతి పేరుతో ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు లొంగుబాటు అవుతున్న వారు స్వేఛ్చగా అడవి నుంచి వస్తున్న క్రమంలో మిగిలిన వారి పరిస్థితిపై ఆశన్న చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. తమతో పాటు రావడానికి కొంతమంది నిరాకరించారని… వారికి కావాల్సిన సామాగ్రి ఇచ్చి జాగ్రత్తలు చెప్పి మరీ వారిని ఇతర దళాల కాంటాక్ట్లోకి పంపించామని ఆయన చెప్పారు. పార్టీ ఫండ్తో పాటు మిగిలిన ఆయుధాలను డంప్లను సాయుధ పోరాటం చేస్తున్న వారికే అప్పజెప్పామని ఆశన్న చత్తీస్ఘడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంటే ఓ వర్గం ఇంకా దీనిని వ్యతిరేకిస్తోందననేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వర్గం ఎంత బలంగా ఉందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఓ అంచనా ప్రకారం మావోయిస్టు పార్టీ గత రెండున్న దశాబ్దాలుగా బస్తర్లో జనతన సర్కార్ను నిర్వహిస్తోంది. అంటే ప్రభుత్వానికి సమాతంరంగా మరో ప్రభుత్వం లాంటింది అన్న మాట. ఒక తరం మొత్తం మావోయిస్టు పార్టీ పాలనలో ఎదిగిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 10లక్షల మంది జనాభా మావోయిస్టు పార్టీ పాలన కింద ఉందనేది ఆ పార్టీ ప్రకటనల ద్వారా అర్ధమవుతున్న మాట. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇది 5లక్షల వరకు ఉండవచ్చనేది అంచనా. ఇందులో దాదాపు 25వేల మంది మిలిషియా సభ్యులుగా ఉన్నట్లు ఛత్తీస్ఘడ్ పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరిలో ఎంతమంది ఇప్పుడు లొంగుబాటు వైపు నిలుస్తారు. మావోయిస్టు పార్టీ ఏకమొత్తంగా నిర్ణయం తీసుకుంటే తప్ప వీరు పూర్తిగా ప్రభుత్వానికి సహకరించే అవకాశం లేదు. రాబోయే కాలంలో వీరు ఏవిధంగా ప్రభుత్వ పాలన కిందికి వస్తారు. ఎంత వరకు కొత్త ప్రభుత్వంతో వీరికి సయోధ్య కుదురుతుంది. పాత కొత్తల ఘర్షణ వల్ల ఎలాంటి కొత్త సామాజిక ఆర్ధిక పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అనే అనుమానాలు ఉన్నాయి. మేధావుల మౌనం…మావోయిస్టు పార్టీ నిజంగానే తన పంథా మార్చుకుని జనజీవనంలోకి రావాలనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ తరువాత పిట్టల్లా రాలిపోతున్న మావోయిస్టులపై జనాల్లో సానుభూతి పెరుగుతోంది. ఎందుకు ఈ పోరాటం… ఎవరి కోసం ఈ ఆరాటం అనే భావన మావోయిస్టుల్లోనూ పెరిగిపోయింది. ముఖ్యంగా కేవలం తాము తయారు చేసుకున్న జనతన సర్కార్ తప్ప బయట ఎక్కడా తమ అవసరం లేదనే వాస్తవం వారికి అర్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచన సామాజిక, ఆర్ధిక పరిస్థితులు మారిని విషయాన్ని మావోయిస్టులు విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు మేధావి వర్గం కూడా మావోయిస్టులు లొంగిపోతే తప్పులేదని చెబుతోంది. చాలా వరకు మావోయిస్టులను సపోర్ట్ చేసిన తెలుగు మేధావులు అందుకే ఇప్పుడ మౌనం వహిస్తున్నారు. ఇక మావోయిస్టులు అడవిలోనే ఉండాలనే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇప్పుడు జరుగుతున్న లొంగుబాట్లపై కొందరు విమర్శలు చేస్తున్నా… 40ఏళ్లు పోరాటం చేసిన వారిని విమర్శించే నైతికత ఎంతమందికి ఉంటుంది. అడవిలో ఆదివాసీల కోసం పోరాడిన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, భాస్కర్లాంటి వారి కంటే ఎక్కువ సామాజిక స్పృహ ఎవరికి ఉంది. నమ్ముకున్న ఆదివాసీలను వదిలేసి రావడం ద్రోహం అనే వారు… ఎవరిని ప్రశ్నిస్తున్నారో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలని లొంగిపోయిన మావోయిస్టులు చెబుతున్నారు. గట్టుపై కూర్చోని సిద్ధాంతాలు చెప్పేవారు… అడవిలో గంజి తాగి పోరాటం చేసిన వారిపై రాళ్లు వేయడం ఎంత వరకు కరెక్టు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పుడు అధికారికంగా మాట్లాడటానికి… మేధావులు సైతం వెనుకంజ వేస్తున్నారు. మొత్తానికి ఇది మావోయిస్టులు తేల్చుకోవాల్సిన వివాదం. ఆయుధాలు వదిలివేయాలా లేక సాయుధ పోరాటంలో కొనసాగాలా అనే విషయంలో లోకస్ స్టాండి కేవలం సాయుధ మావోయిస్టులకు మాత్రమే ఉంది. అంతమా… మరో ఆరంభమా…మావోయిస్టుల లొంగుబాటు పూర్తయితే ఇక దేశంలో నక్సలిజం పూర్తిగా మాయమవుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. మావోయిస్టు పార్టీ పుట్టినిల్లు అయిన తెలంగాణా చరిత్రను కాస్త వెతికితే దీనికి సమాధానం దొరికే అవకాశం ఉంది. తెలంగాణా సాయుధ పోరాటం అందించిన నాయకత్వం… సైద్ధాంతిక భావజాలమే తరువాతి క్రమంలో తెలంగాణాలో నక్సల్ ఉద్యమానికి ఊపిరిలూదింది. తొలి తెలంగాణా ఉద్యమంతో పాటు మలి దశ పోరాటానికి అదే పోరాట స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు లొంగిపోతున్న మావోయిస్టులు… తమ వెంట ఎన్నో సైద్ధాంతిక సూత్రీకరణలు, సామాజిక అనుభవాలతో అడవిని వీడి జనారణ్యంలోకి తీసుకువస్తారు. ఈ డిజిటల్ యుగంలో వారి అనుభవాలు, ఆలోచనలు అన్నీ ఇంటర్వ్యూల రూపంలో, పుస్తకాల మార్గంలో మళ్లీ ప్రజలను తాకే అవకాశం లేకపోలేదు. ఈ మొత్తం భావజాలాన్ని ఎవరు కంస్యూమ్ చేస్తారు. వందల వేల యూట్యూబ్ చానెల్స్లో వీరి ఇంటర్వ్యూలు.. రానున్నాయి. ఇందులో మంచి ఎంత చెడు ఎంత అని ఆలోచించే కన్నా… ఇదంతా తరువాతి తరాలకు ట్రాన్స్ఫర్ అవుతుందనేది సుస్పష్టం. సాయుధ పోరాట భావజాలం మరో రూపంలో… మరో తరానికి బదిలీ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం లొంగిపోయిన మావోయిస్టు నేత భాస్కర్ తన ఇంటర్వ్యూలో మా అనుభవాలు, పోరాటాలు రాబోయే తరాలకు చెప్పాలన్నా మేము బతకాలి కదా అని అన్నారు. మావోయిస్టు పార్టీ గత నాలుగు దశాబ్దాల్లో చేసిన పోరాటం ఇప్పటికే చాలా వరకు పుస్తకాల్లో రికార్డు అయింది. అయితే ఛత్తీస్ఘడ్ పోరాటాలు మాత్రం అడవిని వదలి వస్తున్న మల్లోజుల, ఆశన్న, బాస్కర్, సరోజలాంటి వారు చెబితేనే తెలుస్తాయి. అందుకే ఇప్పుడు వీరంతా ఏంచేస్తారు. ప్రజా పోరాటాలను నిర్మిస్తారా. రాజకీయాల్లోకి వస్తారా. లేక పుస్తకాలు రాస్తారా అనే చర్చ జరుగుతోంది. వీరు చేయబోయే పనులే … మావోయిస్టు పార్టీ భావజాలం ఎలా ఉండబోతుందనే విషయాన్ని నిర్దేశించబోతోంది. అయితే ఇదంతా భవిష్యత్తు… దీనిని ఎవరూ నిర్దేశించలేరు. చివరి మాట… లొంగుబాటు విషయంలో ఎవరెన్ని మాటలన్నా… మావోయిస్టు పార్టీ నాయకత్వం ప్రకటన వస్తేనే దీనిపై క్లారిటీ రానుంది. అయితే మావోయిస్టు పార్టీ గురించి ప్రతీ ఒక్కరు ఆతృతగా చూస్తున్న మరో అంశం మావోయిస్టు పార్టీ కీలక నేత గణపతి ఎక్కడున్నారు అనేది. గణపతి బతికే ఉన్నారా ఉంటే ఆయనెందుకు స్పందించడం లేదు. ఆయనకు అల్జీమర్స్ వచ్చిందనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ గణపతి బతికి ఉంటే… ఆయన ప్రకటన చేస్తే ఈ కన్ఫ్యూజన్ పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు మావోయిస్టులు అడవిని వీడుతున్నారు. మేము లొంగిపోవడం లేదు కేవలం ఆయుధాలను ప్రజల ముందు ప్రభుత్వాల ముందు వదిలేస్తున్నాం అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఆయుధం ఇప్పుడు అడవిని వీడింది. ఈ ప్రయాణం చీకటి దారుల్లోకా లేక వెలుగు రేఖల వైపా అనేది కాలమే నిర్ణయిస్తుంది. - ఇస్మాయిల్‌, సాక్షి టీవీ

Delhi NCR Air Quality Plunges To Poor Ahead of Diwali7
చిమ్మ చీకటిలో ఢిల్లీ..!

​చీకటి.. ఢిల్లీ నగరానికి బాగా అలవాటైపోయింది. ఎన్ని చర్యలు చేపట్టినా ఢిల్లీలో ‘చీకటి’ని తగ్గించలేకపోతున్నాయి ప్రభుత్వాలు. దీనికి కారణం గాలి కాలుష్య తీవ్రత అదుపులో లేకపోవడమే. దాంతో మరొకసారి ఢిల్లీని చిమ్మ చీకటి అల్లేసింది. దీపాల పండుగ దీపావళి రాకముందే దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది. గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి దిజారిపోవడంలో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) వ్యాప్తంగా వాయు కాలుష్యం 'చాలా ప్రమాదకరం' కేటగిరీకి చేరింది. ఈ పరిస్థితి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వాయు కాలుష్య నియంత్రణ మండలి తెలిపిన వివరాల ప్రకారం గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 301 నుంచి 400 మధ్య ఉన్నప్పుడు దానిని ‘చాలా ప్రమాదకరం’గా పరిగణిస్తారు. ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 300 మార్కును దాటేసింది. ఘజియాబాద్‌లోని లోనిలో అత్యధికంగా 339గా నమోదయ్యింది. నోయిడా సెక్టార్ 125లో 358కి చేరింది. అలాగే ఆనంద్ విహార్ (335), వజీర్‌పూర్ (337) ప్రాంతాల్లో కూడా వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది.ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) తొలి దశను అమలులోకి తెచ్చారు. ఈ దశలో నిర్మాణ, కూల్చివేతల పనులను నిలిపివేయాల్సి ఉంటుంది. అలాగే డీజిల్ జనరేటర్ల వాడకంపై నిషేధం లాంటి ఆంక్షలు విధించారు. కాలుష్యం మరింత పెరిగిన పక్షంలో రెండో దశ కింద అధికారులు మరిన్ని కఠినమైన చర్యలను చేపట్టనున్నారు.#WATCH | Delhi | The Air Quality Index (AQI) around Akshardham was recorded at 369 this morning, in the 'Very Poor' category in Delhi as per the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/aPVJ2SZ9ID— ANI (@ANI) October 17, 2025 ఓజోన్, పీఎం10 రేణువుల సాంద్రత వాతావరణంలో పెరగడమే ఈ కాలుష్యానికి ప్రధాన కారణమని నిపుణులు తెలిపారు. గాలి వేగం తక్కువగా ఉండటానికి తోడు ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా కాలుష్య కారకాలు గాలిలోనే నిలిచిపోతున్నాయని వారు చెబుతున్నారు. కాలుష్యంతో నిండిన గాలిని పీల్చడం వల్ల చిన్నారులు, వృద్ధులతో పాటు శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తీవ్రమైన ఆనారోగ్య సమస్యల బారిన పడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లకూడదని, ఒకవేళ తప్పని సరిగా వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడాలని చెబుతున్నారు.

2 Men Rob Bengaluru Women: Chop Fingers With Machete8
బెంగుళూరులో దారుణం.. సీసీ కెమెరాల్లో షాకింగ్‌ దృశ్యాలు

బెంగుళూరు: ప్రమాదం ఏ రూపంలో ఎదురవుతుందో చెప్పలేం.. బెంగుళూరులో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపింది. గత నెల సెప్టెంబర్ 13న గణేష్ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాకు హాజరై తిరిగి వస్తుండగా.. ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి.. నగలు దోచుకున్నారు. నిందితులను ప్రవీణ్, యోగనందగా పోలీసులు గుర్తించారు. బైక్‌పై ఆ మహిళల వద్దకు వచ్చి వారి బంగారు గొలుసులను లాక్కోవడానికి ప్రయత్నించారు.భయపడిన ఉష తన గొలుసును వారికి ఇచ్చేసింది. కానీ మరొక మహిళ వరలక్ష్మి, ప్రతిఘటించింది. దీంతో యోగానంద ఆమెపై కత్తితో క్రూరంగా దాడి చేసి.. రెండు వేళ్లను నరికాడు. ఆ తర్వాత నిందితులు 55 గ్రాముల బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి పారిపోయారు. సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది.ఈ ఘటనపై పోలీసులు వారాల తరబడి దర్యాప్తు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితులను అరెస్టు చేసింది. వారు దొంగిలించిన బంగారాన్ని, దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన జరిగిన తర్వాత యోగనంద పుదుచ్చేరి, ముంబై, గోవా వంటి నగరాలకు పారిపోయి.. ఆ తర్వాత కర్ణాటకలోని తన సొంత గ్రామానికి తిరిగి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. అతనికి గతంలో నేర చరిత్ర ఉందని, ఒక హత్య కేసులో కూడా ప్రమేయం ఉందని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు వరలక్ష్మి ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు.On camera: Two men on a bike wielding machetes rob women in Bengaluru, chop off two fingers and snatch their gold chain. Arrested after a month, police have now recovered 74g of gold and the weapons.https://t.co/ymRnB0fF5t pic.twitter.com/ElKFdlFKH2— Deepak Bopanna (@dpkBopanna) October 18, 2025

Nita Ambani wears Tshirt with Radhika Merchant photo at birthday party9
ముద్దుల కోడలి పుట్టిన రోజు వేడుకల్లో నీతా : ఆమె టీ షర్ట్ గమనించారా?

రిలయన్స్‌ ముఖేష్‌ అంబానీ, నీతా దంపతుల ముద్దుల కోడలు, అనంత్‌ అంబానీ భార్య రాధిక మర్చంట్ పుట్టిన రోజు పార్టీ ఉత్సాహంగా జరిగింది.అనన్య పాండే, జాన్వి కపూర్ , తారా సుతారియా వంటి అనేక మంది బి-టౌన్ సెలబ్రిటీలు వేడుకలకు హాజరు కావడంతో ఈ బర్త్‌డే వేడుక స్టార్-స్టడ్ ఈవెంట్‌గా మారింది. ఓర్రీ అని పిలిచే ఓర్హాన్ అవత్రమణి తన సోషల్ మీడియా హ్యాండిల్‌ దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశాడు. దీంతో వేడుకలు వైరల్‌గా మారాయి.అక్టోబర్ 16న రాధిక మర్చంట్ పుట్టినరోజు సెలబ్రేషన్‌ జరిగింది. ఈ వేడుకలో అత్తగారు నీతా అంబానీ హైలైట్‌గా నిలిచారు. రాధిక ఫోటో ఉన్నటీ షర్టు ధరించి, ముద్దుల కోడల్ని ముద్దుగా ఆలింగనం చేసుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఆకాష్ అంబానీతో పాటు, రాధిక స్నేహితులు కూడా పార్టీలో కనిపించారు. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry) కాగా వ్యాపారవేత్త వీరెన్ , శైలా మర్చంట్ దంపతుల కుమార్తె రాధిక, తన బాల్య స్నేహితుడు, ప్రేమికుడుఆకాష్ అంబానీని ( జూలై 2024)వివాహం చేసుకుంది.

K Ramp Movie Review And Rating In Telugu10
‘కె-ర్యాంప్‌’ మూవీ రివ్యూ

ఈ దీపావళికి ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. ఇక ఇప్పుడు నాలుగో సినిమాగా ‘కె- ర్యాంప్‌’(K- Ramp Review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్‌ 18) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? కిరణ్‌ అబ్బవరం ఖాతాలో హిట్‌ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కుమార్‌ అబ్బవరం(కిరణ్‌ అబ్బవరం) రిచ్‌ కిడ్‌. ఎంసెంట్‌ ఫెయిల్‌ అవ్వడమే కాకుండా రోజు తాగుతూ..చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. కొడుకు మీద ప్రేమతో నాన్న(సాయి కుమార్‌) ఒక్క మాట కూడా అనలేకపోతాడు. జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్‌ చదివించేందుకు కొడుకును కేరళకు పంపుతాడు. అక్కడ కూడా ఇలాగే తాగుతూ ఎంజాయ్‌ చేస్తున్న కుమార్‌.. తొలి చూపులోనే క్లాస్‌మేట్‌ మెర్సీ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు. మెర్సీ కూడా కుమార్‌ని ఇష్టపడుతుంది. ఇద్దరి ఫ్యామిలీకీ వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో మెర్సికి అరుదైన వ్యాధి పోస్ట్ ట్రామాటిక్ స్టెస్ డిజార్డర్ (PSTD) ఉందనే విషయం తెలుస్తుంది. ఆమెకు ఉన్న వ్యాదితో కుమార్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? మెర్సీకి ఆ వ్యాది ఎలా సోకింది? దాని పరిష్కారం కోసం కుమార్‌ ఏం చేశాడు? ఈ కథలో నరేశ్‌ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ప్రమోషన్స్‌లో చెప్పినట్లుగానే ఇది కామెడీతో కూడిన కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌. ఇలాంటి సినిమాలలో లాజిక్స్‌ గురించి వెతుకొద్దు. కథలో కొత్తదనం, ట్విస్టులు కూడా పెద్దగా ఆశించొద్దు. ఊరమాస్‌ కామెడీ సీన్లతో ఫన్‌ జనరేట్‌ చేస్తే చాలు.. ఆడియన్స్‌ ఎంటర్‌టైన్‌ అవుతారు. నూతర దర్శకుడు జైన్స్‌ నాని అదే పని చేశాడు. కథపై దృష్టిపెట్టకుండా హీరో కిరణ్‌ అబ్బవరం బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా సీన్లను పేర్చుకుంటూ వెళ్లాడు. అవి హిలేరియస్ అనిపించాయి. రొటీన్‌ కామెడీ స్టోరీకి చివరిలో ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరో పాత్ర నేపథ్యాన్ని వివరిస్తూ కథ ప్రారంభం అవుతుంది. ఇక కిరణ్‌ అబ్బవరం ఎంట్రీ సీన్‌ థియేటర్స్‌లో ఈళలు వేయిస్తుంది. రాజశేఖర్‌ సినిమా పాటలకు ఆయన వేసే స్టెప్పులు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత కథంతా రొటీన్‌గానే సాగుతుంది. కుమార్‌ కేరళకు వెళ్లడం.. మెర్సీని చూసి ప్రేమలో పడడం.. ఆమె కోసం చేసే పనులు ఇవ్వన్నీ రెగ్యులర్‌ సినిమాల్లో చూసినట్లుగానే ఉంటాయి. కొన్ని ఊరమాస్‌ సన్నివేశాలు మినహా ఫస్టాఫ్‌ అంతా రొటీన్‌గానే అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం మొత్తం హీరోయిన్‌ ఉన్న ఆరోగ్య సమస్యతో హీరో ఎలా ఇబ్బందికి గురయ్యాడనేదే చూపించారు. అయితే ఈ క్రమంలో వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా వెన్నెల కిశోర్‌ పాత్ర ఎంట్రీ తర్వాత ఫన్‌ డోస్‌ ఇంకాస్త పెరుగుతుంది. ఒకవైపు వెన్నెల కిశోర్‌.. మరోవైపు నరేశ్‌..వీరిద్దరి మధ్య సాగే సంభాషణలు..ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ప్రీ క్లైమాక్స్‌ నుంచి క్లైమాక్స్‌ వరకు కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. నరేశ్‌ చెప్పే మాటలు.. సాయి కుమార్‌-కిరణ్‌ అబ్బవరం మధ్య వచ్చే సీన్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. నరేశ్‌ పాత్ర చెప్పే కొన్ని డైలాగ్స్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. లాజిక్స్‌, కొత్తదనం ఆశించకుండా థియేటర్స్‌కి వెళితే.. హాయిగా నవ్వుకొవచ్చు. ఎవరెలా చేశారంటే.. ఈ చిత్రానికి కిరణ్‌ వన్‌ మ్యాన్‌ షో అని చెప్పొచ్చు. యాక్షన్‌, ఫన్‌తో పాటు ఎమోషనల్‌ సీన్లలోనూ అదరగొట్టేశాడు. ఆయన కామెడీ టైమింగ్‌ కూడా సినిమాకు ప్లస్‌ అయింది. అరుదైన వ్యాధి ఉన్న మెర్సీ పాత్రలో యుక్తి తరేజా ఒదిగిపోయింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్‌ లేదు కానీ.. సెకండాఫ్‌లో మాత్ర తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై కిరణ్‌-యుక్తిల కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. అయితే కిరణ్‌ పాత్ర పూరి జగన్నాథ్‌ సినిమాల్లోని హీరోని గుర్తు చేస్తే.. యుక్తి పాత్ర మారుతి సినిమాల్లోని హీరోయిన్‌ని గుర్తు చేస్తుంది. ఇక వీకే నరేశ్‌ పాత్ర ఈ సినిమాకు మరో ప్రధాన బలం. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి నవ్వులు పూశాయి. అయితే ఆయనకు ఇంకొన్ని సీన్లు పడితే బాగుందనిపించింది. ఇక వెన్నెల కిశోర్‌ కనిపించేది కాసేపే అయినా.. ఆ ఎపిసోడ్‌ అదిరిపోతుంది. సాయి కుమార్‌, మురళీధర్‌ గౌడ్‌ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. పాటలు సందర్భానుసారంగా వచ్చాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కేరళ అందాలను తెరపై బాగా చూపించారు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement