అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో రిలీజ్
సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో విడుదల చేశారు. అరవ శ్రీధర్పై జనసేన వేసిన కమిటీ రిపోర్టు ఇంతవరకు రాలేదు.. కమిటీ రిపోర్టు రాకుండా పార్టీ కార్యక్రమాలకు శ్రీధర్ ఎలా హాజరవుతాడు? అంటూ ఆమె ప్రశ్నించారు. ‘‘అరవ శ్రీధర్కు పవన్ కల్యాణ్ అంటే లెక్క లేదా?. లేదంటే ఇంటర్నెల్గా శ్రీధర్కు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారా?. ఒక వేళ కమిటీ రిపోర్టు ఇస్తే మాకు చెప్పండి. నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు.’’ అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.కమిటీ నివేదిక ఇవ్వకుండానే కండువాతో అరవ శ్రీధర్ ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడటంతోపాటు పలుదఫాలు గర్భస్రావం చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తిరిగి పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షమయ్యారు. ఈ ఘటనపై ఓ కమిటీని నియమిస్తున్నామని, ఆ కమిటీ నివేదిక ఇచ్చేవరకు ఎమ్మెల్యే శ్రీధర్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆదేశిస్తున్నట్లు జనసేన అధినాయకత్వం ప్రకటించడం తెలిసిందే.అయితే ఆ కమిటీ ఇంతవరకు ఎటువంటి నివేదిక ఇవ్వకపోగా.. ఎమ్మెల్యే శ్రీధర్ శుక్రవారం రైల్వేకోడూరు నియోజకవర్గం ముక్కావారిపల్లిలో జరిగిన కార్యక్రమంలో జనసేన కండువా కప్పుకొని పాల్గొనడం గమనార్హం. కమిటీ నివేదిక ఇవ్వకుండానే ఎమ్మెల్యే ఏ విధంగా పార్టీ కండువా కప్పుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.కమిటీ పేరుతో జనసేన నాయకత్వం కాలయాపన చేస్తోందని, అరవ శ్రీధర్పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఇంతవరకు ఎమ్మెల్యే నిర్వాకాలను కనీసం ఖండించకపోవటాన్ని తప్పుబడుతున్నారు. రెండు రోజుల కిందట అరవ శ్రీధర్ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించే నెపంతో పొలాల్లో పర్యటించి ప్రజలకు ముఖం చూపించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్కు బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే.
వారిని రంగంలోకి దించుతా.. ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇవాళ జరిగిన కాంగ్రెస్ (పార్లమెంట్) సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్ధి పార్టీ (డెమోక్రాట్లు) సభ్యులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విమానాశ్రయ భద్రతకు అవసరమైన నిధులను వెంటనే ఆమోదించకపోతే ICE (Immigration and Customs Enforcement) సిబ్బందిని దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో నియమిస్తానని హెచ్చరించారు. ICE ఏజెంట్లు గతంలో ఎన్నడూ చూడని విధంగా భద్రతా తనిఖీలు చేపట్టి, అక్రమ వలసదారుల అరెస్టు చేస్తారని అన్నారు. ముఖ్యంగా సోమాలియా వలసదారులను లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు. వారు మిన్నెసోటా రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపిస్తూ, స్థానిక డెమోక్రాట్ నాయకులపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఇల్హాన్ ఒమర్ అనే మహిళా సభ్యురాలిని అవినీతిపరురాలిగా ఆరోపించారు.ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా విమానాశ్రయ భద్రత Transportation Security Administration (TSA) పరిధిలో ఉంటుంది. అయితే ICE ఏజెంట్లను అక్కడికి పంపడం అనేది అసాధారణ చర్య. ICE ఏజెంట్లు ఇమిగ్రేషన్ అమలు, సరిహద్దు భద్రత, అక్రమ వలసదారుల నియంత్రణ వంటి పనుల్లో ఉంటారు. TSA స్థానంలో ICE ఏజెంట్లు భద్రతా తనిఖీలు చేపడితే ప్రయాణికుల అనుభవం పూర్తిగా మారవచ్చు.కాగా, కాంగ్రెస్లో విమానాశ్రయ భద్రతా నిధులపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల (ట్రంప్ పార్టీ) మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ట్రంప్ తాజా హెచ్చరికను డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది.
డాక్టర్లకూ రేటింగ్ తంటాలు పేషెంట్లు జాగ్రత్త!
ఒకప్పుడు డాక్టర్ అంటే దైవంతో సమానం. ఇప్పుడు ఒక ‘ప్రోడక్ట్’తో సమానం!అమెజాన్ లో మిక్సీ కొనేటప్పుడు ముందు రేటింగ్, తర్వాత రివ్యూలు చూస్తాం. ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ చేసేటప్పుడూ ఇదే స్టోరీ ‘రేటింగ్ తక్కువగా ఉందంటే వద్దు!’ఇప్పుడు ఇదే అలవాటు ఆరోగ్య రంగంలోకి కూడా వచ్చేసింది. ఫోన్ లో డాక్టర్ పేరు టైప్ చేస్తే చాలు, పక్కనే మెరుస్తున్న ఐదు స్టార్లు. అంతే, మన మెదడు వెంటనే ‘ఈ డాక్టర్ బాగుంటారు!’ అనే తీర్పు చెప్పేస్తుంది. ఇలా వైద్యుడి నైపుణ్యం కంటే, వెబ్సైట్లో కనిపించే స్టార్లకే ప్రాధాన్యత! అయితే ఆన్ లైన్ లో జరుగుతున్న ఈ స్టార్ వార్స్లో, ప్రాణం విలువ నిజంగా ఆ ఐదు స్టార్లేనా?డిజిటల్ యుగం పుణ్యమా అని, ఒకప్పుడు ఆసుపత్రి క్యూల్లో గంటల తరబడి తపస్సు చేయాల్సిన పేషెంట్లు ఇప్పుడు సోఫాలో కూర్చునే స్మార్ట్ఫోన్ స్క్రీన్ పై డాక్టర్ల ‘జాతకాలు’ చూసేస్తున్నారు. అపాయింట్మెంట్ బుక్ చేయడం ఇప్పుడు బిర్యానీ ఆర్డర్ చేసినంత ఈజీ అయిపోయింది! ముందు ఆసుపత్రి నాలుగు గోడల మధ్య గుట్టుగా సాగిపోయే వైద్యం ఇప్పుడు రివ్యూలు, రేటింగ్స్తో పారదర్శకంగా మారింది. రోగుల చేతిలోకి ఒక డిజిటల్ మైక్ వచ్చినట్టే. తమ అనుభవాన్ని ప్రపంచానికి చెప్పే అవకాశం దొరికింది. కాని, ఇక్కడే అసలు కామెడీ మొదలైంది. కొన్ని రివ్యూలు చదివితే నవ్వాలో, ఆశ్చర్యపోవాలో అర్థం కాదు. ‘డాక్టర్ ప్రాణాలు కాపాడారు. కాని, క్లినిక్ బయట పార్కింగ్ లేదు. అందుకే ఒక స్టార్!’ అని ఒకరు.ఇంకొకరు, ‘నా సర్జరీ సక్సెస్ అయింది. హాస్పిటల్లో వైఫై సిగ్నల్ సరిగ్గా లేదు’ అని, మరొకరు, ‘డాక్టర్ గారు రాసిన మందులు వాడాక జ్వరం తగ్గింది. కాని, ఆయన చెప్పిన డైట్ పాటించడం చాలా కష్టంగా ఉంది.’ అంటూ కొన్ని కొన్ని విచిత్రమైన కారణాలతో సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చే బ్యాచ్ తయారైంది. ఇలాంటి బ్యాచ్తో వైబ్సైట్లో వైద్యుడి హస్తవాసితో పనిలేకుండానే, ఆయన స్టార్ పవర్ తగ్గుతూ పోతుంటే, ఇంకొంతమంది ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్యాకేజీలు, పేషెంట్లను ప్రత్యేకంగా రివ్యూలు పెట్టమని అడగడం, సోషల్ మీడియా క్యాంపెయిన్లు నిర్వహించడం, లేదా డిజిటల్ మార్కెటింగ్ సహాయంతో మంచి రేటింగ్స్ను పెంచుకోవడం జరుగుతోంది.ఇలా నిజమైన వైద్య నైపుణ్యంతో సంబంధం లేకుండానే, కొందరి ప్రొఫైల్లు ఆన్ లైన్ లో ఎక్కువ ‘స్టార్స్’తో మెరిసి పోతుంటాయి. దీంతో, కొత్తగా డాక్టర్ను వెతుకుతున్న పేషెంట్లకు, ఎవరి నైపుణ్యం నిజంగా ఎంత ఉందో అర్థం చేసుకోవడం కష్టంగా మారుతోంది. మరి ఇది నిజంగా పెరిగిన జవాబుదారీతనమా లేక డిజిటల్ లోకం తెచ్చిన కొత్త రకం రేటింగ్ వెర్రా అనే ఈ వింత పరిస్థితిని చూస్తుంటే, ఈ ‘స్టార్ల’ వెనుక ఉన్న అసలు కథను కాస్త లోతుగా తవ్వి చూడాల్సిందే! ఒకప్పుడు డాక్టర్ ఎంపిక ఎలా ఉండేది?కొన్ని సంవత్సరాల క్రితం వరకు డాక్టర్ను ఎంచుకోవడం ఒక చిన్న సామాజిక ప్రక్రియలా ఉండేది. మంచి డాక్టర్ పేరును గూగుల్ కంటే ముందు పక్కింటి వాళ్లే చెప్పేవారు. అందుకే, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే, మొదట ఫోన్ తిప్పేది పక్కింటి వారికే. ‘ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతారు’ అనే ఒక మాటే సిఫారసుగా సరిపోయేది. ఇలా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సహచరుల మాటలతోనే నమ్మకం పంచుకునేది. ఆ నమ్మకం ఒక్కరోజులో ఏర్పడేది కాదు. అనుభవాల నుంచి, కాలంతో పెరిగిన విశ్వాసం నుంచి అది వస్తుంది. కాని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైద్యం కూడా ఒక కొత్త స్టార్ల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రపంచంలో ఏళ్ల తరబడి చదువు, అనుభవం, వేలాది రోగులకు చేసిన చికిత్స ఇవన్నీ ఐదు చిన్న స్టార్లలోనే సరిపెట్టేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ ఆన్ లైన్ డాక్టర్ రేటింగ్స్ను నిజంగా విశ్వసించాలా? లేక కొంచెం ఆలోచించాలా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు కొన్ని విషయాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. రేటింగ్స్ చెప్పేది ఏమిటి? ఆన్ లైన్ రివ్యూలు ఎక్కువగా ఒక రోగి అనుభవాన్ని మాత్రమే ప్రతిబింబిస్తాయి. అందుకే, ఆ రివ్యూలు చదువుతుంటే మనకు డాక్టర్ ‘సర్జరీ’ కంటే, అక్కడ దొరికే ‘లగ్జరీ’ గురించే ఎక్కువ సమాచారం ఉంటుంది. డాక్టర్ ఎలా మాట్లాడారు? ఎంతసేపు వేచి చూడాల్సి వచ్చింది? సిబ్బంది ఎలా వ్యవహరించారు? హాస్పిటల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఇలాంటి అంశాలపై ఆధారపడి ఎక్కువగా రివ్యూలు వస్తాయి. ఇవి ఆరోగ్య సేవలో ముఖ్యమైన భాగమే అయినా, ఇక్కడే, డాక్టర్ అసలు నైపుణ్యం ఈ స్టార్ల మధ్యలో నలిగిపోతోంది. వైద్యం అంటే కేవలం తీపి మాటలు, మెరిసే టైల్స్ కాదు. అది ఏళ్ల తరబడి చేసిన తపస్సు, క్లిష్ట పరిస్థితుల్లో సెకన్ల వ్యవధిలో తీసుకునే ప్రాణసంకట నిర్ణయాల సమ్మేళనం! అందుకే, ఒకే చికిత్స ఇద్దరు వేర్వేరు పేషెంట్స్కు చేసినా ఫలితం ఒకేలా ఉండదు. ఒకరు వారం రోజుల్లో జిమ్కి వెళ్తే, మరొకరు నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి రావచ్చు.వయసు, వ్యాధి తీవ్రత, ఆ వ్యక్తి శరీర తత్త్వం వంటి బోలెడు ట్విస్టులు ఈ చికిత్స వెనుక ఉంటాయి. కాని, ఆన్ లైన్ రివ్యూ ఇచ్చే పేషెంట్ మాత్రం, ‘పక్కింటి పుల్లయ్యకి మూడు రోజుల్లో తగ్గింది, నాకు ఐదు రోజులైనా తగ్గలేదు.. సో వన్ స్టార్!‘ అని తీర్పు ఇచ్చేస్తుంటారు. పాపం, మెడికల్ సైన్ ్స లోని లోతుపాతులను పక్కన పెట్టి, కేవలం ఆ క్షణం కలిగిన ‘అనుభవం’ ఆధారంగానే మార్కులు వేసేస్తున్నారు. అందుకే గుర్తుంచుకోండి– ఆ స్టార్ రేటింగ్స్ అవి ఒక అనుభవాన్ని మాత్రమే నమోదు చేస్తాయి. కాని, అది డాక్టర్ మేధస్సుకు సర్టిఫికెట్ కాదు! అసంతృప్తి గళం ఎక్కువగా వినిపిస్తుంది! మనిషి సాధారణ నైజం, అన్నీ బాగానే ఉన్నప్పుడు హాయిగా నిశ్శబ్దంగా ఉండిపోతాడు. అదే ‘మౌనం అర్ధాంగీకారం’ అన్నట్టే. చికిత్స అద్భుతంగా జరిగి ప్రాణాలు నిలబడినా, ‘అబ్బా, డాక్టర్ గారు దేవుడండీ!’ అని మనసులో అనుకుని ఇంటికెళ్లి ప్రశాంతంగా పడుకుంటాడు. కాని, ఫోన్ తీసుకుని రివ్యూ రాయాలని మాత్రం ఎక్కువగా అనిపించదు. అదే, ఆసుపత్రి వాతావరణంలో కాని, డాక్టర్ నిర్లక్ష్యం, మరేదైనా చిన్న అసంతృప్తి వచ్చినా సరే, వెంటనే, తనలోని ‘సోషల్ మీడియా సింహం’ గర్జిస్తుంది! ఎవరూ అడగకపోయినా పేజీల కొద్దీ అభిప్రాయాలను పోస్ట్ చేస్తారు. సాఫ్ట్వేర్ అడ్వైజ్ సంస్థ నివేదిక ప్రకారం, కొత్త వైద్యుడిని ఎంచుకునే ముందు దాదాపు 94 శాతం రోగులు ఆన్ లైన్ రివ్యూలను పరిశీలిస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ రివ్యూలలో చాలా భాగం అసంతృప్తి చెందిన రోగుల నుంచే వస్తున్నాయి. సుమారు 70 శాతం మంది రోగులు తమకు కోపం వచ్చినప్పుడు మాత్రమే రివ్యూ రాస్తారని ఈ సర్వే చెబుతోంది. దాంతో చికిత్సతో సంతృప్తి చెందిన చాలామంది రోగుల అభిప్రాయాలు ఆ వెబ్సైట్లలో కనిపించకుండా పోతున్నాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇలా వందమందికి ప్రాణం పోసిన డాక్టర్కు వచ్చిన ప్రశంసలు నిశ్శబ్దంగా ఉండిపోతే, పార్కింగ్ దొరకలేదని ఒక పేషెంట్ ఇచ్చే ఆ ఒక్క ‘స్టార్’ మాత్రం పెద్దగా కనిపిస్తుంది. ఆ ఒక్క రేటింగ్ వెనుక వందలమంది సంతృప్తి చెందిన రోగుల మౌనం దాగి ఉందని చాలామంది గుర్తించరు. అందుకే ఆన్ లైన్ స్టార్లను చూసి డాక్టర్ను అంచనా వేయడం అంటే, సినిమా ట్రైలర్లో ఒక సీన్ చూసి, సినిమా మొత్తం ఎలా ఉందో తీర్పు చెప్పేసినట్టే! ఒక నక్షత్రం, ఒక ప్రతిష్ఠ! నెగటివ్ రివ్యూల ప్రభావం ఇప్పుడు ఒక సైలెంట్ వైరస్లా మారుతోంది. ఒక్క నెగటివ్ రివ్యూ కూడా కొన్ని సందర్భాల్లో ఒక డాక్టర్ ప్రతిష్ఠను తీవ్రంగా ప్రభావితం చేయగలదు. వందమంది రోగుల వ్యాధులను నయం చేస్తే వచ్చే కాస్తో కూస్తో గుర్తింపు, అసంతృప్తి చెందిన ఒక్క రోగి రాసే ఘాటైన రివ్యూతో ఆ డాక్టర్ ప్రతిష్ఠ డిజిటల్ నడిబజారులో మంటగలసిపోతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ నెగటివ్ వ్యాఖ్యలు నిమిషాల్లో వేలాది మందికి చేరిపోతాయి. నిజం బయటపడేలోపు అబద్ధం ఊరంతా చుట్టొచ్చినట్టే, ఆ డాక్టర్ నైపుణ్యంపై ఒక వ్యతిరేక ముద్ర పడిపోతుంది.ఇక్కడ అసలు చిక్కు ఏమిటంటే, డాక్టర్లు తమ వృత్తి గోప్యత, నైతిక విలువల కారణంగా ఈ రివ్యూలకు బహిరంగంగా స్పందించలేరు. పేషెంట్ తన అనుభవాన్ని బహిరంగంగా చెబుతాడు. కాని, ‘ఆపరేషన్ థియేటర్లో నిజంగా ఏమైంది?’ అనే విషయాన్ని డాక్టర్ డిజిటల్ వేదికలపై వివరించలేడు. దాంతో ఆయన మౌనంగా ఉండాల్సిందే. ఈ ఏకపక్ష పరిస్థితి వల్ల డాక్టర్ల ఆత్మస్థైర్యం దెబ్బతినడమే కాకుండా, కొత్తగా వచ్చే పేషెంట్లు కూడా ఆ స్టార్ రేటింగ్స్ చూసి భయపడి మంచి వైద్యులను దూరం చేసుకునే ప్రమాదం ఉంది. ఇంకో వైపు, సరుకు లేని డబ్బా ఎక్కువ చప్పుడు చేసినట్లు, కొన్ని ఆసుపత్రుల్లో జరిగే హడావిడి ప్రచారం, ఆకర్షణీయమైన ప్రదర్శనలతో మెరిసే రేటింగ్స్ చూసి మోసపోయే పేషెంట్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది.వైద్యులపై ఆన్ లైన్ రేటింగ్స్ విశ్లేషణ1 చెప్పటం లేదు?సుమారు 88 శాతం సంతృప్తి చెందిన రోగులు రివ్యూ రాయడానికి ముందుకు రారు.2 అసంతృప్తి అసంతృప్తి చెందిన రోగులు సుమారు 21 శాతం ఎక్కువగా ఆన్ లైన్ లో రివ్యూ రాస్తున్నారు.3 సౌకర్యాలు దాదాపు 70 శాతం రివ్యూలు వెయిటింగ్ టైమ్, సిబ్బంది ప్రవర్తన, పార్కింగ్ వంటి సౌకర్యాలు, బిల్లింగ్ వెసులుబాట్లు, ఆఫర్లు, ప్యాకేజీల గురించే ఉంటాయి.4 నైపుణ్యం కేవలం 30 శాతం రివ్యూలు మాత్రమే డాక్టర్ నైపుణ్యం, చికిత్స నాణ్యత ఆధారంగా ఉంటున్నాయి.5 నకిలీ రివ్యూలు కొన్ని సందర్భాల్లో సంస్థలు తమ ప్రతిష్ట పెంచుకోవడానికి సుమారు 10 శాతం వరకు రివ్యూలను స్వయంగా జోడించే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.ఆన్ లైన్ వైద్య రేటింగ్స్పై పరిశోధనలు – గణాంకాలు...హార్వర్డ్ వైద్య పాఠశాల అధ్యయనం ప్రకారం, ఆన్ లైన్ రేటింగ్స్ వైద్య రంగంపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. సుమారు 800 మంది వైద్యులు, 400 మందికి పైగా రోగులు పాల్గొన్న వివిధ పరిశోధనల విశ్లేషణ ప్రకారం, దాదాపు 78 శాతం వైద్యులు ఆన్ లైన్ లో వచ్చే నెగటివ్ వ్యాఖ్యలు తమపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సుమారు 46 శాతం వైద్యులు ఈ రేటింగ్స్ వల్ల వైద్యుడు, రోగి మధ్య ఉండాల్సిన నమ్మకం, సంబంధం దెబ్బతింటున్నాయని అభిప్రాయపడ్డారు.డిజిటల్ ప్రపంచంలో స్టార్లు మెరుస్తున్నాయంటే, నిజం చీకటిలో దాగుందని అర్థం. అందుకే డాక్టర్ను ఎంచుకునేటప్పుడు స్టార్స్ కంటే, అనుభవం, సామర్థ్యాన్ని నమ్ముకోవడం ఉత్తమం. చివరికి జీవితాన్ని కాపాడేది వెబ్సైట్లో మెరిసే స్టార్లు కాదు, వైద్యుడి చేతిలోని నిజమైన నైపుణ్యమే.డాక్టర్లకు స్మార్ట్ టిప్స్ఈ డిజిటల్ ప్రపంచంలో స్టెతస్కోప్ పక్కనే ఇప్పుడు మరో శక్తిమంతమైన సాధనం ఉంది. అదే స్టార్ రేటింగ్. అందుకే ఇప్పుడు వైద్యరంగంలో పేషెంట్ను మాత్రమే కాదు, రివ్యూను కూడా కేర్ చేయాలి! దాదాపు 94 శాతం మంది పేషెంట్లు ఒక డాక్టర్ను ఎంచుకునే ముందు ఆన్ లైన్ రివ్యూలు చదువుతారు. దాదాపు 77 శాతం మంది కొత్త డాక్టర్ కోసం వెతకడం కూడా గూగుల్తోనే మొదలుపెడతారు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే, నాలుగు స్టార్లకంటే తక్కువ రేటింగ్ ఉంటే 84 శాతం మంది సిఫారసు చేసిన డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లరు! అంటే ఇప్పుడు వైద్య నైపుణ్యం ఎంత ముఖ్యమో, డిజిటల్ స్టార్ పవర్ కూడా అంతే ముఖ్యమైపోయింది.మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సెర్చ్ రిజల్ట్స్లో ర్యాంకింగ్లో దాదాపు 13 శాతం ప్రభావం ఆన్ లైన్ రివ్యూలదే. ఎందుకంటే 92 శాతం మంది గూగుల్లో మొదటి పేజీ కూడా దాటరు. అంటే మొదటి పేజీలో కనిపించకపోతే, మీరు ఉన్నా లేనట్టే! అందుకే, ఆన్ లైన్ లో డాక్టర్ లేదా ఆసుపత్రి యాజమాన్యం తమ ప్రతిష్ఠను కాపాడుకోవడానికి నిపుణులు సూచించిన కొన్ని సింపుల్, స్మార్ట్ టిప్స్ ఇవి. ముందుగా వినండి, తర్వాత స్పందించండి.సోషల్ మీడియా, గూగుల్ రివ్యూలు, కామెంట్లు ఇవన్నీ ఇప్పుడు పేషెంట్ల డిజిటల్ ఫీడ్బ్యాక్ బాక్స్ లాంటివి. అక్కడ ఏమి జరుగుతోంది అన్నది తరచు గమనించాలి. ఎక్కడైనా పేషెంట్ ప్రశంసిస్తే వెంటనే స్పందించాలి. ఎక్కడైనా ఫిర్యాదు వస్తే మరింత త్వరగా స్పందించాలి. హ్యాష్ట్యాగ్లు, కామెంట్లు, ఫొటోలు, వీడియోలు ఏదైనా మీ హాస్పిటల్ గురించి వస్తే అది మీకు ఒక ముఖ్యమైన సూచనగా తీసుకోవాలి.స్పందనకు ఒక ప్లాన్ ఉండాలి.ఎవరైనా రివ్యూ పెట్టగానే ఎలా స్పందించాలి? ఎవరు స్పందించాలి? ఏ టోన్ లో మాట్లాడాలి? ఇవన్నీ ముందుగానే నిర్ణయించుకోవాలి. మీ హాస్పిటల్ వ్యక్తిత్వానికి తగ్గట్లుగా ఒక ‘వాయిస్’ ఉండాలి. సున్నితంగా, మానవీయంగా, నిజాయితీగా. ముఖ్యంగా పేషెంట్ సమాచారాన్ని ఎప్పుడూ పబ్లిక్గా చెప్పకూడదు. అవసరమైతే ప్రైవేట్గా మాట్లాడి సమస్యను పరిష్కరించాలి.రోజువారీ అలవాటుగా మార్చండి.రివ్యూలను ఒకసారి చూసి వదిలేయడం కాదు. ప్రతిరోజూ గమనించడం, స్పందించడం అలవాటుగా మారాలి. టీమ్లో ఎవరికైనా ఈ బాధ్యత అప్పగించాలి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఎక్కువగా వస్తోంది? ఎక్కడ మెరుగుపరచాలి? అన్నది అనలిటిక్స్ ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆన్ లైన్ సెర్చ్ ద్వారా హాస్పిటల్లకు వచ్చే పేషెంట్లు ఆఫ్లైన్ పద్ధతుల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.∙ దీపిక కొండి
ఈ రాశి వారికి వ్యాపారాలలో అధిక లాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.చవితి రా.12.09 వరకు తదుపరి పంచమి, నక్షత్రం: భరణి రా.1.34 వరకు తదుపరి కృత్తిక, వర్జ్యం: ప.11.59 నుండి 1.31 వరకు, దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.19 వరకు, అమృత ఘడియలు: రా.9.01 నుండి 10.31 వరకు.సూర్యోదయం : 6.07సూర్యాస్తమయం : 6.07రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకుమేషం: చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.వృషభం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. పనులలో ఆటంకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు విధులు.మిథునం: కొత్త పనులు చేపడతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.కర్కాటకం: కుటుంబసభ్యులతో సఖ్యత. శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.సింహం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. శ్రమా«ధిక్యం.కన్య: బంధువులతో కొన్ని వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు ఉండవచ్చు. ఇంటాబయటా చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారంతుల: పనులు విజయవంతంగా సాగుతాయి. కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. సంఘంలో విశేష పేరుప్రతిష్ఠలు. బంధువుల నుంచి ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.వృశ్చికం: పనులు దిగ్విజయంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.ధనుస్సు: ముఖ్య నిర్ణయాలలో నిదానం అవసరం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విరో«ధాలు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.మకరం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులలో జాప్యం. ధనవ్యయం. ఆలయ దర్శనాలు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో చిక్కులు.కుంభం: కొత్త మిత్రులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగులకు హోదాలు.మీనం: బంధువులతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
యాదగిరి గుట్టలో మహిళ కాలిపై వెళ్లిన ఆర్టీసీ బస్సు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
సిలిండర్ అందుబాటు గ్యాసే!
యాదాద్రికి ఎంఎంటీఎస్
ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు.. 24 గంటల్లో ఐదు సార్లు..!
ఈ రాశి వారికి వ్యాపారాలలో అధిక లాభాలు
పిల్లలకు కష్టం విలువ చెప్పాలి
అమ్మ పుట్టినరోజు
కథాకళి: అమ్మ భయపడ్డ మనిషి
జల కాలుష్యం... జబ్బులు ప్రాణాంతకం
మర్యాదగా నేను అడిగినన్ని డబ్బులు ఇవ్వు! లేకుంటే నీ మీద యుద్ధాన్ని ప్రకటించవలసి వస్తుంది!!
ఇరాన్ యుద్ధం ముగింపు.. నెతన్యాహు సంచలన ప్రకటన
భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
తెలంగాణ బడ్జెట్.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
విశాఖ జలాల్లోకి రష్యా యుద్ధ నౌకలు
Hyderabad: ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు
పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్ బోర్డు!
సర్ఫ్రైజ్.. మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా
వైష్ణవి సమాధి వద్దే నిద్రపోతూ..!
అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ నమోదుకు వీల్లేదు - సుప్రీంకోర్టు
దాడులు నిలిపివేస్తాం.. నెతన్యాహు ప్రకటన
ఇరాన్ ‘ఉండేలు దెబ్బ’!
వీధిలో పాన్ ఉమ్మినందుకు రూ.3.5 లక్షల జరిమానా
శత్రువు ఓడిపోయింది.. ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన
శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
హర్మూజ్ను తెరిచేందుకు అమెరికా సంచలన నిర్ణయం!
అతి భారీగా తగ్గిన బంగారం.. అంతలోనే..
యుద్ధంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
రూమర్స్కు క్లారిటీ ఇచ్చిన శోభితా ధూళిపాళ్ల
యాదగిరి గుట్టలో మహిళ కాలిపై వెళ్లిన ఆర్టీసీ బస్సు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
సిలిండర్ అందుబాటు గ్యాసే!
యాదాద్రికి ఎంఎంటీఎస్
ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు.. 24 గంటల్లో ఐదు సార్లు..!
ఈ రాశి వారికి వ్యాపారాలలో అధిక లాభాలు
పిల్లలకు కష్టం విలువ చెప్పాలి
అమ్మ పుట్టినరోజు
కథాకళి: అమ్మ భయపడ్డ మనిషి
జల కాలుష్యం... జబ్బులు ప్రాణాంతకం
మర్యాదగా నేను అడిగినన్ని డబ్బులు ఇవ్వు! లేకుంటే నీ మీద యుద్ధాన్ని ప్రకటించవలసి వస్తుంది!!
ఇరాన్ యుద్ధం ముగింపు.. నెతన్యాహు సంచలన ప్రకటన
భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
తెలంగాణ బడ్జెట్.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
విశాఖ జలాల్లోకి రష్యా యుద్ధ నౌకలు
Hyderabad: ఎక్కడికక్కడ నిలిచిపోయిన మెట్రో రైళ్లు
పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్ బోర్డు!
సర్ఫ్రైజ్.. మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా
వైష్ణవి సమాధి వద్దే నిద్రపోతూ..!
అడ్డగోలుగా ఎఫ్ఐఆర్ నమోదుకు వీల్లేదు - సుప్రీంకోర్టు
దాడులు నిలిపివేస్తాం.. నెతన్యాహు ప్రకటన
ఇరాన్ ‘ఉండేలు దెబ్బ’!
వీధిలో పాన్ ఉమ్మినందుకు రూ.3.5 లక్షల జరిమానా
శత్రువు ఓడిపోయింది.. ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన
శ్రీలీల.. పవన్ కూడా కాపాడలేకపోయాడు!
వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు
హర్మూజ్ను తెరిచేందుకు అమెరికా సంచలన నిర్ణయం!
అతి భారీగా తగ్గిన బంగారం.. అంతలోనే..
యుద్ధంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
రూమర్స్కు క్లారిటీ ఇచ్చిన శోభితా ధూళిపాళ్ల
ఫొటోలు
బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్' జోడీ (ఫోటోలు)
డైరెక్టర్గా ‘జబర్దస్త్’ కమెడియన్..‘కామాఖ్య’ టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)
వాళ్లు అప్పుడు నాకు సూపర్స్టార్స్.. ఇప్పుడు నేను (ఫొటోలు)
గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)
మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)
హైదరాబాద్ : రెయిన్ బో విస్టాస్ రాక్ గార్డెన్ ఫేజ్–2లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో ‘ఉగాది’ వేడుకలు (ఫొటోలు)
గద్దర్ అవార్డ్స్- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)
శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)
గద్దర్ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)
సినిమా
ఓటీటీలోకి వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా
తెలుగు బిగ్బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ సాహ్ని నటించిన తెలుగు సినిమా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇంతకీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? దీని సంగతేంటి?(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్పుత్, అబిద్ భూషణ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'మిస్టీరియస్'. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబరు 19న థియేటర్లలోకి వచ్చింది. కానీ చిన్న సినిమా కావడం, నటీనటులు ఎవరనేది జనాలకు తెలియకపోవడంతో వచ్చినట్లే వెళ్లిపోయింది. ఇప్పుడు మూడు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.'మిస్టీరియస్' విషయానికొస్తే.. కొండాపూర్ ఎస్సై రాంఖీ(అబిద్ భూషన్) 15 రోజులుగా కనిపించకుండా పోతాడు. దీంతో రాంఖీ మిస్సింగ్ కేసుని ఏసీపీ ఆనంద్ సాయి(బలరాజ్ వాడి)కి అప్పగిస్తారు. విచారణలో భాగంగా ప్రముఖ ఆర్కిటెక్ట్ విరాట్(రోహిత్ సాహ్ని), అతని భార్య శిల్ప(మేఘన రాజ్పుత్)ని విచారించాల్సి వస్తుంది. రాంఖీ మిస్సింగ్కి వీళ్లకు ఉన్న సంబంధమేంటి? విరాట్ విల్లాకి రాంఖీ ఎందుకు వెళ్లాడు? అతను అక్రమంగా ఓ గన్ ఎందుకు కొన్నాడు? రాంఖీ బతికే ఉన్నాడా? లేదా? ఈ కేసుని ఏసీపీ ఆనంద్ ఎలా ముగించాడు? ఇందులో మిస్సిరా (రియా కపూర్) పాత్ర ఏంటి? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన 26 సినిమాలు)
ట్రోలింగ్ భరించలేక ఏడ్చా.. సినిమాలు మానేయాలనుకున్నా
హిట్టు పడితే యాక్టర్స్ను నెత్తిన పెట్టుకునే జనాలు ఫ్లాప్ రాగానే వారిని దారుణంగా విమర్శిస్తుంటారు. ముఖ్యంగా హీరోహీరోయిన్లపై ఈ ట్రోలింగ్ తీవ్రస్థాయిలో ఉంటుంది. కథానాయికలనైతే రెండు మూడు ఫ్లాపులు రాగానే ఐరన్ లెగ్ అని ముద్రవేస్తారు. తనకు మరో మూవీ ఛాన్స్ వచ్చిందనగానే అయితే అది ఫ్లాప్ అవడం ఖాయం అని దారుణంగా మాట్లాడుతుంటారు.వరుస ఫ్లాప్స్ఇలాంటి ట్రోలింగ్ను కొన్నేళ్లుగా చవిచూస్తోంది శ్రీలీల. మాస్ జాతర, రాబిన్ హుడ్, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, ఆదికేశవ, స్కంద.. ఇలా తను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. తమిళంలో చేసిన పరాశక్తి కూడా లాభాలు తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా తనను ఈ ఫ్లాప్ ట్యాగ్ నుంచి గట్టెక్కించలేకపోయింది.వెళ్లిపోదామనుకున్నా..అయితే ఈ ట్రోలింగ్ భరించలేక ఎప్పుడో సినిమాలు మానేయాలనుకుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీలీల మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలోనే ఈ ట్రోల్స్కు విపరీతంగా భయపడ్డాను, బాధపడ్డాను, ఏడ్చేశాను. అమ్మా.. ఇదంతా నావల్ల అవుతుందా? కాలేజీకి తిరిగెళ్లిపోనా? అని అడిగాను. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్. కానీ, ఇప్పుడు వాటిని ఎదుర్కొనేంత ధైర్యం వచ్చింది అని పేర్కొంది. అదే భయంమరో హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ.. నాకు ఇప్పుడే కొంత భయంగా ఉంది. ఎందుకంటే ఇటీవలికాలంలోనే ఈ ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే ఏదో ఒకటి అనేస్తున్నారు. అదే అసలు సమస్య! ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో మనకంటూ ఓ స్థానం సంపాదించుకుంటాం. దాన్ని వాళ్లు చెడగొట్టేస్తున్నారన్న బాధ ఉంటుంది అని చెప్పుకొచ్చింది. రాశీ ఖన్నా, శ్రీలీల.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటించారు. హరీశ్ శంకర్ డైరెక్షన్లో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలైంది.చదవండి: ఐశ్వర్యరాయ్కు సారీ చెప్పిన స్నేహ ఉల్లాల్
'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చాన్నాళ్ల తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్ కళకళలాడుతోంది. రీసెంట్గానే థియేటర్లలోకి వచ్చిన 'ధురంధర్ 2'.. నిలకడగా వసూళ్ల సాధిస్తోంది. రిలీజ్కి భారీ హైప్ సొంతం చేసుకోగా.. సాంకేతిక కారణాల వల్ల హిందీ వెర్షన్ మాత్రమే తొలిరోజు విడుదలైంది. శనివారం నుంచి తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ రెండు రోజుల పాటు ఈ చిత్రానికి కలెక్షన్స్ ఎంతొచ్చాయి?(ఇదీ చదవండి: దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్కు అస్సలు వెళ్లకండి)రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో రూ.333 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. తొలిరోజు మన దేశంలో రూ.145 కోట్ల నెట్ వసూళ్లు రాగా, శుక్రవారం ఈ నంబర్స్ కాస్త తగ్గి రూ.81 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ.226 కోట్ల నెట్ కాగా రూ.269 కోట్ల గ్రాస్ అని తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్లోనూ రెండు రోజులకు కలిపి 7 మిలియన్ డాలర్లు వచ్చినట్లు టాక్.అలా ప్రపంచవ్యాప్తంగా 'ధురంధర్ 2' చిత్రానికి రెండు రోజులకు కలిపి రూ.333 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి వీకెండ్ అయ్యేసరికి రూ.500 కోట్ల మార్క్ దాటేయడం గ్యారంటీ అనిపిస్తుంది. గతేడాది డిసెంబరులో ఫస్ట్ పార్ట్ రిలీజైనప్పుడు ఒక్కసారి వసూళ్లు రాలేదు. రోజురోజుకీ పెరుగుతూ వెళ్లాయి. దీనికి కూడా అలానే పునరావృతమయ్యేలా కనిపిస్తుంది. మొదటి భాగానికి రూ.1300 కోట్ల మేర కలెక్షన్స్ రాగా.. ఇప్పుడొచ్చిన సీక్వెల్, ల్యాంగ్ రన్లో ఎన్ని వేలకోట్ల కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఉస్తాద్ భగత్సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్)
ఐశ్వర్యరాయ్కు సారీ చెప్పిన హీరోయిన్, ఎందుకంటే?
పిల్లి కళ్ల హీరోయిన్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే పేరు ఐశ్వర్యరాయ్.. ఆ తర్వాత కాస్త అటూఇటుగా ఐష్లాగే కనిపించే స్నేహా ఉల్లాల్ గుర్తొస్తుంది. తను కూడా హీరోయిన్ అయినప్పటికీ తనను ఐశ్వర్యతో పోల్చినందుకు తెగ సంబరపడిపోయింది. అదే సమయంలో ఒకసారి ఆమెను నేరుగా కలిసి క్షమాపణలు కూడా చెప్పింది.. అదెందుకో ఓసారి చూసేద్దాం..సినిమా'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది స్నేహా ఉల్లాల్. అప్పటికే 'లక్కీ: నో టైం ఫర్ లవ్' (2005) చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అలా ఓపక్క హిందీ సినిమాలు చేస్తూ మరోపక్క తెలుగు చిత్రాల్లో నటించింది. మధ్యలో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వగా ఆ తర్వాత అడపడాదడపా సినిమాల్లో కనిపిస్తోంది.సల్మాన్ ఎలాంటివాడంటే?తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్నేహ తన కెరీర్ తొలినాళ్ల గురించి ఓపెన్ అయింది. ఆమె మాట్లాడుతూ.. లక్కీ మూవీతో నా సినీరంగ ప్రవేశం జరిగింది. చిత్రీకరణ సమయంలో హీరో సల్మాన్ ఖాన్ నాకెంతో సపోర్ట్ చేశాడు. ఎప్పుడూ ఓపిక, సహనంతో మెదిలేవాడు. తానో పెద్ద హీరో అని ఎన్నడూ యాటిట్యూడ్ చూపించలేదు.అలా ఫేమస్నిజానికి నేను సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ కిరీటం అందుకుంది. చూడటానికి నేను ఐశ్వర్యరాయ్లాగే ఉంటానని చాలామంది అంటుంటారు. అలా ఆమె మిస్ వరల్డ్ కిరీటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకుంటే నా చుట్టూ ఉన్న చిన్నప్రపంచంలో నేను సెలబ్రిటీ అయిపోయాను.ఐశ్వర్యకు సారీనేను ఒకే ఒక్కసారి ఐశ్వర్యను కలిశాను. నన్ను చూడగానే ఆమె 'వెల్కమ్ టు ద ఫ్యామిలీ.. బాలీవుడ్కు స్వాగతం' అని సాదరంగా ఆహ్వానించింది. అప్పుడు వెంటనే నేను ఆమెకు సారీ చెప్పాను. మీడియాలో పదేపదే నన్ను ఐష్తో పోలుస్తూనే ఉన్నారు. దాని గురించే చెప్తూ నన్ను క్షమించండి, దయచేసి నన్ను ద్వేషించకండి అన్నాను. మరి ఆమె దాన్ని ఎలా తీసుకుందో నాకు తెలీదు అని స్నేహా ఉల్లాల్ పేర్కొంది.చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న పునర్నవి
క్రీడలు
‘అతడితోనే వైరం.. జైషాకు సంబంధం లేదు’
బీసీసీఐ తనను 23 ఏళ్లుగా విస్మరించిందని, అందుకే కామెంటేటర్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్ రాజీనామా వెనుక జై షా హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శివరామకృష్ణన్ మరోసారి స్పందించారు. తన రాజీనామాతో జైషాకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్ధలు కొట్టారు. శివరామకృష్ణన్ మాట్లాడుతూ.. ‘నా రాజీనామాకు బీసీసీఐతో సంబంధం లేదు. బీసీసీఐ పరిపాలనపై నాకు ఆగ్రహం లేదు. నా నిర్ణయం వెనుక బీసీసీఐ కార్యదర్శి, ప్రస్తుత ఐసీసీ చైర్మన్ జై షా హస్తం ఉందన్న వార్తలో నిజం లేదు. ఈ విషయంలోకి బీసీసీఐ యాజమాన్యాన్ని లాగవద్దు. ఇది కేవలం బీసీసీఐలో ఒక ఉద్యోగి చేసిన నిర్వాకం మాత్రమే. నా జీవిత పగ్గాలను నా చేతిలోకి తీసుకుంటున్నా. అలా చేసే హక్కు ఉందని భావిస్తున్నా’ అని వెల్లడించారు. శివరామకృష్ణన్ ఆకస్మిక నిర్ణయంపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ, "ఓహ్ నో! ఈ ఐపీఎల్కు ఎందుకు ఉండరు?" అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 1984లో ఇంగ్లండ్పై ఒకే మ్యాచ్లో 12 వికెట్లు పడగొట్టి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన శివరామకృష్ణన్, 1985లో సునీల్ గవాస్కర్ కెప్టెన్సీలో భారత్ గెలిచిన బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచ ఛాంపియన్షిప్లో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచి సత్తా చాటాడు. 2000వ సంవత్సరంలో కామెంటరీ కెరీర్ ప్రారంభించిన శివరామకృష్ణన్, అంతకుముందు ఐసీసీ క్రికెట్ కమిటీలో ఆటగాళ్ల ప్రతినిధిగా కూడా పనిచేశాడు. మొత్తంగా భారత్ తరఫున శివరామకృష్ణన్ 9 టెస్టుల్లో 26 వికెట్లు, 16 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు.Don’t bring the BCCI Administration into the picture. It’s a one on one with an employee of the BCCI. Jay Shah and Co. have nothing to do with this issue. I am taking control of my life and I think I am entitled to do it.— Laxman Sivaramakrishnan (@LaxmanSivarama1) March 21, 2026
‘వస్తారు కోట్లు పట్టుకెళ్తారు.. ప్రయోజనమెవరికీ’!
ఐపీఎల్ 2026 సీజన్ మరో వారం రోజుల్లో మొదలుకానుంది. కానీ ఐపీఎల్లో ఈసారి ఆటగాళ్ల గాయాల సమస్యలు పెరిగిపోయాయి. ముఖ్యంగా వేలంలో కోట్ల ధర పలికిన విదేశీ ఆటగాళ్లు గాయాలు, వ్యక్తిగత కారణాలతో లీగ్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానుండడం ఆయా ఫ్రాంచైజీలపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్ను గాయం నుంచి కోలుకోకపోవడంతో సీజన్ ఆరంభ మ్యాచ్లకు కమిన్స్ అందుబాటులో ఉండడం లేదు. దీంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ ఎస్ఆర్హెచ్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ రాయల్చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ జోష్ హాజిల్వుడ్ కూడా గాయంతో దూరమయ్యాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్కు గాయాల బెడద తగిలింది. ఆ జట్టు స్టార్ మిచెల్ స్టార్క్ గాయంతో సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా క్రికెట్ ఆస్ట్రేలియాపై విమర్శలు చేశాడు. ‘మిచెల్ స్టార్క్ సీజన్ ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదని తెలిసింది. ఇప్పటికే జోష్ హాజిల్వుడ్, పాట్ కమిన్స్లు దూరమయ్యారు. తాజాగా స్టార్క్ గాయంతో బాధపడుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పేర్కొంది. కానీ నిజానికి అతను ఫిట్గా ఉన్నప్పటికీ సీఏ మాత్రం ఏవో సాకులు చెప్పి అతన్ని ఐపీఎల్ మ్యాచ్లు ఆడకుండా చూస్తుంది. స్టార్క్ టీ20 క్రికెట్కు ఎప్పుడో వీడ్కోలు పలికాడు. మరి రెండు నెలలుగా స్టార్క్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఏం చేసినట్లు? అంతేకాదు స్టార్క్ యాషెస్ సిరీస్ తర్వాత మళ్లీ మ్యాచ్లు ఆడలేదు. అయితే భారత్తో ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ నేపథ్యంలో మొదట విశ్రాంతి తీసుకోమని పేర్కొన్న సీఏ ఆ తర్వాత మాట మార్చి ఐపీఎల్కు అందుబాటులో ఉంటాడని తెలిపింది. కానీ ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. ఇక న్యూజిలాండ్ బౌలర్ లోకీ ఫెర్గూసన్ విషయం నన్ను మరింత ఆశ్చర్యపరుస్తోంది. గాయం లేనప్పటికీ కుటుంబంతో కొంత సమయం గడిపేందుకు ఫెర్గూసన్ ఐపీఎల్లో తొలి ఏడు మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదని తెలిసింది. ఇది దారుణమైన అంశం. ప్రస్తుతం ఫెర్గూసన్ సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతున్నాడు. అది ముగియగానే తన కుటుంబంతో గడిపేందుకు న్యూజిలాండ్ వెళ్లనున్నాడు. అది అతని వ్యక్తిగత విషయం కావొచ్చు, కానీ ఐపీఎల్లో ఒక జట్టుకు ఆడుతూ ఏడు మ్యాచ్ల తర్వాత జట్టులో చేరి రూ.కోటి తీసుకొని వెళ్లిపోతాడు. కానీ దీనివల్ల ఎవరికీ ప్రయోజనం? ప్రతీ ఐపీఎల్లో ఇది సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంది.’ అని వెల్లడించాడు.
పాక్ క్రికెట్లో విష సంస్కృతి ఎక్కువ!
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్యారీ కిర్స్టన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమర్శలు గుప్పించాడు. వ్యవస్థాగత జోక్యం, వృత్తిపరమైన గౌరవం కొరవడడంతో పాకిస్థాన్ క్రికెట్ ప్రధాన కోచ్గా పనిచేయడం తనకు నరకంలా అనిపించిందని కిర్స్టన్ చెప్పుకొచ్చాడు. ఇటీవలే శ్రీలంక ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన కిర్స్టన్ పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ నేతృత్వంలో పని చేసే వర్క్ కల్చర్ దారుణంగా ఉండేదని పేర్కొన్నాడు. కిర్స్టన్ మాట్లాడుతూ.. ‘నేను చూసిన జట్లలో ఇంత స్థాయి జోక్యం ఎక్కడా చూడలేదు. కోచ్గా వచ్చి ప్లేయర్లతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే బయట నుంచి వచ్చే ఈ నాయిస్ చాలా కష్టంగా మారుతుంది. జట్టు ఫలితాలు సరిగా రాకపోతే కోచ్పైనే ఒత్తిడి పెంచడం, ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రతికూలంగా మారుతాయి. టీమ్ బాగా ఆడకపోతే కోచ్ను తీసేయడం లేదా అతనిపై పరిమితులు పెట్టడం చాలా ఈజీ. కానీ అదే తప్పు. అలా అయితే కోచ్ని ఎందుకు నియమిస్తారు?’అంటూ కిర్స్టెన్ ప్రశ్నించాడు. ఇక తన భవిష్యత్పై కూడా క్లారిటీ ఇచ్చిన కిర్స్టెన్, తాజాగా శ్రీలంక క్రికెట్తో రెండు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2027 ఐసీసీ వన్డే వరల్డ్కప్ కోసం శ్రీలంక జట్టును సిద్ధం చేయడం ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఈ టోర్నమెంట్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనుంది. 2024లో టీ20 ప్రపంచకప్లో లీగ్ స్టేజీలోనే పాకిస్థాన్ నిష్క్రమించడంతో పీసీబీ వైఖరితో పొసగక కిర్స్టన్ తన పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతకముందు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గిలెస్పీ నిష్క్రమణ కూడా దాదాపు ఇలాంటి పద్దతిలోనే జరగడం గమనార్హం. ఇంగ్లండ్పై స్వదేశంలో చారిత్రాత్మక టెస్టు సిరీస్ విజయాన్ని పాక్ జట్టుకు అందించినప్పటికీ, మోసిన్ నఖ్వీ నేతృత్వంలోని పీసీబీ కనీస సమాచారం ఇవ్వకుండానే గిలెస్పీని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో సంచలనంగా నిలిచింది.చదవండి: IPL 2026: పంజాబ్ ‘కింగ్స్’ అయ్యేనా?
IPL 2026: పంజాబ్ ‘కింగ్స్’ అయ్యేనా?
ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోవడం పంజాబ్ కింగ్స్ నిలకడలేని ఫామ్ను ఎత్తి చూపుతోంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ ప్లేఆఫ్స్కు చేరిన పంజాబ్ కింగ్స్ (అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) మళ్లీ 2014 ఐపీఎల్ సీజన్లో ఫైనల్ ఆడింది. ఆ సీజన్లో కేకేఆర్ చేతిలో ఓడిన పంజాబ్ రన్నరప్కే పరిమితమైంది. ఆ తర్వాత మళ్లీ 11 ఏళ్లకు కానీ ఆ జట్టు ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. అప్పుడు కేకేఆర్ అడ్డు తగిలితే ఈసారి ఆర్సీబీ పంజాబ్ను అడ్డుకుంది. అయితే, గత సంవత్సరం జట్టును సమూలంగా ప్రక్షాళించడం పంజాబ్కు కలిసి వచ్చింది. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ను భారీ ధరకు దక్కించుకుంది. అంతేకాదు అతడికి జట్టు పగ్గాలు అప్పగించింది. తనపై వెచ్చించిన మొత్తానికి, ఫ్రాంచైజీ యాజమాన్యం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శ్రేయాస్ అయ్యర్ జట్టును నిరుడు తుదిపోరుకు తీసుకొచ్చాడు. ఈనేపథ్యంలో ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న పంజాబ్ రన్నరప్గా నిలిచిన ఆత్మవిశ్వాసంతో ఈ సీజన్కు సై అంటోంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ ఈసారైనా ‘కింగ్స్’ అవుతుందా? అనేది చూడాలి.అయితే పంజాబ్కు విదేశీ ఆల్రౌండర్లు ప్రధాన బలం. మార్కస్ స్టొయినిస్, మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మిచెల్ ఒవెన్, కూపర్ కానొలీ బంతిని ఎంత బలంగా బాది భారీ షాట్లు సాధించగలరో..అదే బంతితో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలరు. పైగా ప్రపంచ వ్యాప్తంగా పలు అంతర్జాతీయ ఫ్రాంచైజీ లీగ్లలో ఆడుతున్న అపార అనుభవం ఆ ఐదుగురు ఆల్రౌండర్ల సొంతం. ప్రియాన్ష్ ఆర్యా, ప్రభ్సిమ్రన్ సింగ్ దూకుడైన బ్యాటింగ్తో స్కోరుబోర్డును పరుగులు పెట్టించగలరు. నిరుడు 400కుపైగా రన్స్ చేసిన ఆర్యా రెండో బెస్ట్ స్ట్రయిక్ రేట్ బ్యాటర్గా నిలిచాడు. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాలను కొనసాగించేందుకు శ్రేయాస్ ఎలాగూ ఉంటాడు. అర్ష్దీప్, ఫెర్గూసన్, యాన్సెన్, చాహల్తో పేస్, స్పిన్ బౌలింగ్లో వైవిధ్యం పంజాబ్కు కలిసి వచ్చే అంశం. పటిష్టమైన రిజర్వ్ బెంచ్ అదనపు బలం.పెద్దగా అనుభవంలేని భారత ఆటగాళ్లు జట్టులో ఉండడం పంజాబ్ కింగ్స్ బలహీనత. కెప్టెన్ అయ్యర్ మినహా ప్రియాన్ష్, శశాంక్ సింగ్, వధేరా, హర్ప్రీత్ బ్రార్, ముషీర్ ఖాన్, వైశాఖ్లకు అత్యున్నత స్థాయి ఐపీఎల్ మ్యాచ్లు ఆడింది తక్కువ. వీరందరిలో ప్రతిభకు కొదవ లేకపోయినా నిలకడగా రాణించలేకపోవడం, ఒత్తిడి సమయాల్లో ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడం కీలక సమయాల్లో జట్టును దెబ్బతీస్తోంది. అలాగే చాహల్ మినహా పేరు కలిగిన మరో స్పిన్నర్ లేకపోవడం లోటు.పంజాబ్ కింగ్స్ జట్టు:స్వదేశీ ఆటగాళ్లు: శ్రేయాస్ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్యా, ప్రభ్ సిమ్రన్ సింగ్ (కీపర్), నేహల్ వధేరా, శశాంక్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చాహల్, హర్ప్రీత్ బ్రార్, సూర్యాన్ష్ షెగ్డే, విష్ణు వినోద్ (కీపర్), యశ్ ఠాకూర్, ముషీర్ ఖాన్, హర్నూర్ సింగ్, పైలా అవినాశ్, ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్.విదేశీ ఆటగాళ్లు: స్టొయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, జేవియర్ బార్ట్లెట్, మిచెల్ ఒవెన్, ఫెర్గూసన్, కూపర్ కానొలీ, బెన్ డ్వార్షూయిస్.చదవండి: జట్లకు వార్నింగ్.. కేకేఆర్ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ
న్యూస్ పాడ్కాస్ట్
రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చాం, ప్రగతి చూపిస్తాం.. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
జాబులు దాచిపెట్టి క్యాలెండర్ విడుదల... ఏపీలో 22 నెలల్లో ఒక లక్ష 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ.. కేవలం 10 వేల 60 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్
పూటకో మాటతో నిరుద్యోగులతో చంద్రబాబు సర్కారు ఆటలు... జాబ్ కేలండర్ పేరిట లీకులిస్తూ మోసం
చంద్రబాబు హామీలన్నీ మోసాలే... ఒంగోలు నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల భేటీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
కూటమి ప్రభుత్వంలో దేశ డ్రగ్స్ రాజధానిగా మారిన ఏపీ
తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ గుట్టు రట్టు... డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్గా నిర్ధారణ
పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రం... ఇరాన్ ఖర్గ్ దీవిపై అమెరికా భీకర దాడులు
రైతులతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొండాట.. పేరుకే అన్నదాత సుఖీభవ, ఆచరణలో అంతా మోసం
విలువలు, విశ్వసనీయతకు వైఎస్సార్సీపీ మారుపేరు... పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడి
దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన ఆంధ్రప్రదేశ్ ఆదాయం... కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
బిజినెస్
ఎస్బీఐకి ఐటీ శాఖ భారీ ట్యాక్స్ నోటీసు..
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ఆదాయపు పన్ను శాఖ నుండి భారీ నోటీసు అందింది. వడ్డీతో కలిపి మొత్తం రూ. 6,337.5 కోట్ల మేర పన్ను చెల్లించాలని ఐటీ శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎస్బీఐ ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది.అసలు ఏం జరిగింది?ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(3), 144సి(3), 144బి కింద ఐటీ శాఖ మార్చి 19న ఈ ఉత్తర్వులను జారీ చేసింది. 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి (AY24) సంబంధించి నిర్వహించిన స్క్రూటినీ అసెస్మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ పన్ను డిమాండ్ ఉత్పన్నమైందని బ్యాంక్ తెలిపింది. వివిధ అంశాల్లో ఆదాయపు పన్ను శాఖ చేసిన కోతలే (Disallowances) ఈ భారీ మొత్తానికి కారణమని తెలుస్తోంది.సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, కంపెనీ ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపే ఏవైనా ప్రధాన పరిణామాలు చోటుచేసుకుంటే వాటిని స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ పన్ను డిమాండ్ మొత్తం 'మెటీరియాలిటీ థ్రెషోల్డ్' (నిర్ణీత పరిమితి) కంటే ఎక్కువగా ఉన్నందున, పారదర్శకత, కార్పొరేట్ గవర్నెన్స్లో భాగంగా ఎస్బీఐ ఈ వివరాలను బహిర్గతం చేసింది.ఎస్బీఐ తదుపరి చర్యలుఈ నోటీసుపై ఎస్బీఐ ధీమాగా ఉంది. గడిచిన కొన్నేళ్లుగా ఇలాంటి అంశాలపైనే బ్యాంక్ న్యాయపోరాటం చేస్తోందని, తాజా నోటీసును కూడా అప్పీలేట్ అధికారుల ముందు సవాలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ పన్ను నోటీసు వల్ల బ్యాంక్ రోజువారీ కార్యకలాపాలు లేదా వ్యాపార నిర్వహణపై ఎటువంటి ప్రభావం ఉండదని ఎస్బీఐ యాజమాన్యం పెట్టుబడిదారులకు హామీ ఇచ్చింది.
మారనున్న పాన్ కార్డు రూల్స్.. కేంద్రం కఠిన నిబంధనలు!
భారతదేశంలో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ (PAN) కోసం దరఖాస్తు చేసే విధానంలో.. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఆధార్ కార్డును ఉపయోగించి.. పాన్ కార్డుకు అప్లై చేసుకునే అవకాశం ఉండేది. అయితే మార్చి 31 తరువాత అదనంగా గుర్తింపుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.ఈ కొత్త నియమాల ప్రకారం.. PAN కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి ఆధార్తో పాటు మరో గుర్తింపు కార్డును తప్పనిసరిగా సమర్పించాలి. ఇందులో బర్త్ సర్టిఫికేట్, ఓటర్ ఐడీ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పదో తరగతి సర్టిఫికేట్ లేదా మేజిస్ట్రేట్ ఇచ్చే అఫిడవిట్ వంటి పత్రాలు ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్న సరళమైన విధానం కంటే కాస్త కఠినమైన ధృవీకరణ ప్రక్రియగా మారనుంది.కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి.. PAN కార్డులో ఉన్న పేరు, ఆధార్ కార్డులో ఉన్న పేరుతో పూర్తిగా సరిపోవాలి. ఇంతకు ముందు చిన్న మార్పులు లేదా వేరియేషన్లు ఉన్నా పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ ఏప్రిల్ నుంచి అలాంటి అసమానతలకు అవకాశం ఉండదు. ఇది వ్యక్తుల గుర్తింపు వివరాలను మరింత ఖచ్చితంగా నమోదు చేయడానికి తీసుకున్న చర్యలలో భాగం అని తెలుస్తోంది.సైబర్ నేరాలుఇటీవల కాలంలో ఈ పాన్ డౌన్లోడ్ పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. సెకన్ల వ్యవధిలో పాన్ డౌన్లోడ్ చేసుకోండంటూ.. కొందరు సైబర్ నేరగాళ్లు కొన్ని లింక్స్ పంపిస్తున్నారు. ఆ లింక్స్ నమ్మి ఓపెన్ చేయాలని చూస్తే యూజర్లు మోసపోతారు. అలాంటి మోసాలకు చెక్ పెట్టడంలో భాగంగానే.. కేంద్రం కొత్త డాక్యుమెంట్స్ కూడా అందించాలని ద్రువీకరించింది.ఇదీ చదవండి: తగ్గుతున్న బంగారం ధరలు: మళ్లీ పెరుగుతాయా?
నాడు జుకర్బర్గ్.. నేడు మన సూర్య
ఒకప్పుడు 'ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన సెల్ఫ్ మేడ్ బిలియనీర్' అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్. దాదాపు 18 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న ఆ రికార్డును ఇప్పుడు ఒక భారత సంతతి యువకుడు తిరగరాశాడు. కేవలం 22 ఏళ్ల వయసులోనే అపర కుబేరుడిగా అవతరించి, ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు మన సూర్య మిధా.18 ఏళ్ల రికార్డు బ్రేక్గతంలో మార్క్ జుకర్బర్గ్ తన 23వ ఏట బిలియనీర్ హోదాను అందుకుని రికార్డు సృష్టించారు. అయితే, సూర్య మిధా అంతకంటే ఒక ఏడాది ముందే, అంటే 22 ఏళ్లకే 2.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 18,000 కోట్లు) నెట్వర్త్తో జుకర్బర్గ్ను అధిగమించారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్ సూర్యనే!విజయానికి బాట వేసిన 'మెర్కోర్'సూర్య సాధించిన ఈ అసాధారణ విజయానికి మూలం ఆయన స్థాపించిన 'మెర్కోర్' అనే ఏఐ (AI) స్టార్టప్. 2023లో తన స్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్లతో కలిసి ఆయన ఈ సంస్థను ప్రారంభించారు.మెర్కోర్ అనేది ఒక కృత్రిమ మేధ (AI) ఆధారిత రిక్రూట్మెంట్ ప్లాట్ఫారమ్. కంపెనీలకు కావాల్సిన సరైన ప్రతిభావంతులను గుర్తించేందుకు ఇది 'AI అవతార్'లను ఉపయోగిస్తుంది. దరఖాస్తుదారులను నేరుగా ఇంటర్వ్యూ చేయడం ద్వారా నియామక ప్రక్రియను ఈ ప్లాట్ఫారమ్ సులభతరం చేస్తుంది.2025 అక్టోబర్ లో జరిగిన 'సిరీస్-సి' ఫండింగ్లో ఈ సంస్థ ఏకంగా 350 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లకు చేరుకుంది.ప్రస్తుతం ఈ సంస్థలో బ్రెండన్ ఫుడీ సీఈవోగా, ఆదర్శ్ హిరేమత్ సీటీవోగా వ్యవహరిస్తుండగా, సూర్య మిధా బోర్డు ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఢిల్లీ టూ కాలిఫోర్నియా..సూర్య మిధా మూలాలు భారతదేశంలోని ఢిల్లీలో ఉన్నాయి. ఆయన తల్లిదండ్రులు దశాబ్దాల క్రితమే అమెరికాకు వలస వెళ్లి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. మౌంటైన్ వ్యూలో జన్మించిన సూర్య, జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలో విదేశీ వ్యవహారాల అంశంపై విద్యనభ్యసించారు. సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న మక్కువతో, స్నేహితులతో కలిసి ప్రారంభించిన స్టార్టప్ నేడు ఆయనను ప్రపంచ కుబేరుల జాబితాలో నిలబెట్టింది.
మొండి బకాయిదారుల తీరుపై ఆగ్రహం
దివాలా, రుణ పరిష్కార చట్టం (ఐబీసీ)లోని లొసుగులను అడ్డు పెట్టుకునే మొండి బకాయిదారుల తీరుపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని రక్షణ కవచంగా వాడుకుంటూ అప్పులు ఎగ్గొట్టే ధోరణి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని న్యాయస్థానం హెచ్చరించింది. జస్టిస్ మనీష్ పితాలే, జస్టిస్ శ్రీరామ్ శిర్సత్లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఏమిటీ ఆందోళనకర ధోరణి?రుణ ఎగవేతదారులు అనుసరిస్తున్న వ్యూహాలను కోర్టు ‘డిస్టర్బింగ్ ట్రెండ్’(ఆందోళనకర ధోరణి)గా అభివర్ణించింది. సాధారణంగా బ్యాంకులు తాకట్టు పెట్టిన ఆస్తులను రికవరీ చేయడానికి ‘సర్ఫేసీ’ (SARFAESI) చట్టం కింద వేలం ప్రక్రియ చేపడతాయి. అయితే, ఈ ప్రక్రియ ముగిసి వేలంలో ఆస్తులు కొనుగోలు చేసిన వారు రంగంలోకి వచ్చే వరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉండే డిఫాల్టర్లు చివరి నిమిషంలో ఎన్సీఎల్టీని(వివాద పరిష్కారాల ట్రిబ్యునల్) ఆశ్రయిస్తున్నారు.‘ఐబీసీ కింద తప్పుడు మార్గాల్లో మొరటోరియం(చట్టబద్ధంగా కొంతకాలం పాటు వేలం వాయిదా వేయడం) పొందడం ద్వారా వారు అప్పటివరకు జరిగిన చట్టబద్ధమైన వేలం ప్రక్రియను స్తంభింపజేస్తున్నారు. ఇది కేవలం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమే కాకుండా దేశ వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీస్తుంది’ అని బాంబే హైకోర్టు తెలిపింది. ‘కొన్ని సంస్థల తీరువల్ల ఐబీసీ లక్ష్యం దెబ్బతింటోంది. ఐబీసీ అసలు ఉద్దేశం రుణ పరిష్కారం, కానీ ఇక్కడ అది రికవరీని అడ్డుకోవడానికి వాడుతున్నారు. ఇటువంటి చర్యలు బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. నిజాయితీ గల రుణదాతల హక్కులను కాపాడటంలో కఠినంగా వ్యవహరించాలి’ అని చెప్పింది.కేసు నేపథ్యం ఇదే..రోజినా ఫిరోజ్ హజియాని, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక సంస్థ రూ.6.25 కోట్ల రుణ సౌకర్యాన్ని పొందింది. అప్పు చెల్లించకపోవడంతో బ్యాంకు ముంబైలోని తాకట్టు ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేసింది. వేలం ప్రక్రియ పూర్తయి పిటిషనర్లు ఆ ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత.. సదరు రుణగ్రహీతలు ఒక్కసారిగా ఐబీసీని తెరపైకి తెచ్చి ఎన్సీఎల్టీ ద్వారా స్టే పొందారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) సేల్ రిజిస్ట్రేషన్ను నిలిపివేసింది. దీన్ని సవాలు చేస్తూ కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించారు.దేశంలో మొండి బకాయిల వసూలు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన బలమైన ఆయుధం ఐబీసీ. అయితే, కొందరు విల్ఫుడ్ డిఫాల్టర్లు(ఉద్దేశపూర్వక ఎగవేతదారులు) దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుని బ్యాంకుల చేతులు కట్టేస్తున్నారు. బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చట్టంలోని లొసుగులను వాడుకుని కాలయాపన చేసే వారికి గట్టి హెచ్చరిక. ఇది భవిష్యత్తులో వేలం కొనుగోలుదారులకు భరోసానివ్వడమే కాకుండా బ్యాంకింగ్ రంగంలో క్రమశిక్షణను పెంచుతుంది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!
ఫ్యామిలీ
ఖురాన్ ప్రస్తావన: ఆరోగ్యానికి ఆలంబన
ఖురాన్లో పలు సందర్భాల్లో మొక్కల ప్రస్తావన వస్తుంది. ఆయా మొక్కల నుంచి లభించే ఫలాలు, పత్రాలు, పుష్పాలు మానవాళికి ఎలా ఉపయోగపడుతాయో దైవగ్రంథం, హదీసులు వివరించాయి. అలాంటి వాటిలో ఆలివ్, ఖర్జూర, ద్రాక్ష, దానిమ్మ, అరటి, నల్ల జీలకర్ర, గుమ్మడి వంటివి ముఖ్యమైనవి.ఆలివ్ : దీని శాస్త్రీయనామం– ఓలియా యురోపియా. ఇది ఓలియేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్ లో జైతున్ అని పిలుస్తారు. ఈ మొక్క గురించి ఖురాన్లో ఆరు చోట్ల ప్రస్తావించారు. ఆలివ్ నూనెలో, ఆలివ్ పండ్లలో ఉన్న పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచివి.ఖర్జూరం : దీని శాస్త్రీయనామం– ఫోనిక్స్ డెక్టైలిఫెరా. ఇది అరికేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్లో నఖ్ల్ అని పిలుస్తారు. ఖర్జూరం లో ఉండే ΄పొటాషియం రక్తపోటును నియంత్రించడంలోనూ, కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలబద్ధక నివారణకు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికీ తోడ్పడుతుంది.దానిమ్మ : దీని శాస్త్రీయనామం– ప్యూనిక గ్రానేటం. ఇది ప్యూనికేసి కుటుంబానికి చెందినది. అరబిక్లో రూమ్మన్ అని పిలుస్తారు. దానిమ్మలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వృద్ధా΄్యాన్ని, చర్మంపై ఏర్పడే ముడతలనూ దూరం చేస్తాయి. అల్జీమర్స్, చర్మక్యాన్సర్లను అడ్డుకుంటాయి. ఆస్టియో ఆర్థ్రయిటిస్తో బాధపడేవారికిది అద్భుత ఔషధం.అంజూర : దీని శాస్త్రీయనామం– ఫైకస్ కెరిక. ఇది మొరేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్లో తీన్ అని పిలుస్తారు. దీని పండ్లను, వేర్లను, ఆకులను సాంప్రదాయ వైద్యంలో జీర్ణకోశ, శ్వాసకోశ, హృదయ సంబంధ రుగ్మతలు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.తులసి : దీని శాస్త్రీయ నామం– ఆసిమం టెన్యూ ఫ్లోరమ్. దీనిని అరబిక్లో రైహాన్ అంటారు. ఇది లామియేసి కుటుంబానికి చెందినది. తులసి ఆకులు నాడులకు టానిక్లా పని చేసి, జ్ఞాపకశక్తిని పెం΄పొందిస్తాయి. తులసి కషాయంతో గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసితో మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. తులసి కొలెస్ట్రాల్ను తగ్గించడంతోపాటు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది.ద్రాక్ష : దీని శాస్త్రీయనామం – వైటిస్ వెనిఫెరా. ఇది వైటేసి కుటుంబానికి చెందినది. దీనిని అరబిక్లో ఇనబ్ అంటారు. ద్రాక్షగింజల రసం గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది, ఎముకలను బలోపేతం చేస్తుంది, చర్మక్యాన్సర్ను నివారించడంలో, ఇన్ ఫెక్షన్ తో పోరాడడంలో సహాయ పడుతుంది.ఉల్లి : దీని శాస్త్రీయనామం – ఆలియమ్ సెపా. ఇది లిలియేసి కుటుంబానికి చెందినది. ఉల్లిపాయల్లో యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు, విటమిన్ ఎ, బి6 , సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఉల్లిని వాడితే శరీరాన్ని ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడుకున్నట్లే. మధుమేహం ఉన్నవారికి అది నియంత్రణలోకి వచ్చి.. ఎముకలు గట్టిపడతాయి.ఆవాలు : దీని శాస్త్రీయనామం– బ్రాసిక నైగ్ర. ఇది బ్రాసికేసి కుటుంబానికి చెందింది. వీటిని అరబిక్లో ఖర్దల్ అంటారు. ఆవాలనుంచి తయారు చేసిన ఆవనూనెని కొన్ని సంప్రదాయ చికిత్సలలో ఉపయోగిస్తారు. ఆవ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.మిస్వాక్ : దీని శాస్త్రీయనామం– సాల్వో డోరా పెర్సికా. ఇది సాల్వో డేరేసి కుటుంబానికి చెందినది. దీన్ని అరబిక్లో అల్ అరక్ అని పిలుస్తారు. దీని పుల్లలతో దంత ధావనం చేసుకోవడం వల్ల దంతాలు శుభ్రపడి నోటి దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది. వీటివేర్లను ఊపిరితిత్తుల సమస్యలకు, ఆకులను దగ్గు, ఉబ్బసం, స్కర్వి వ్యాధి నివారణకూ వాడతారు. బెరడును వెన్నుపోటు, తలపోటు, కడుపునొప్పి నివారణలో ఉపయోగిస్తారు.అరటి : దీని శాస్త్రీయ నామం– మ్యూసా పారడైసియాక. ఇది మ్యూసేసి కుటుంబానికి చెందినది. అరటిని అరబిక్లో తల్హ్ అంటారు. అరటిలో ΄పొటాషియం అధికంగా ఉంటుంది. దీనిలో ఉండే పోషకాలు హైబీపీ, షుగర్, ఆస్తమా, క్యాన్సర్, అజీర్తి వంటి సమస్యలను నిరోధిస్తాయి. అరటి పండ్లలోని కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియకు ఉపకరిస్తాయి. పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలకు, ఫ్యాటీ యాసిడ్స్ను ఉత్పత్తి చేసేందుకు ఇది తోడ్పడుతుంది.నల్ల జీలకర్ర : దీని శాస్త్రీయనామం – నైగెల్ల సటివ. దీనిని అరబిక్ లో హబ్బతుస్ సౌదా అంటారు. ఇది రానన్కులేసి కుటుంబానికి చెందినది. నల్ల జీలకర్ర జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ను అదుపులో వుంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.డాక్టర్ ఎల్. నాగిరెడ్డి సహాయ ఆచార్యులుశ్రీ కృష్ణదేవరాయ ఉద్యాన కళాశాల, అనంతపురంచాంద్ బాషా, ఉపాధ్యాయులు, తాడిపత్రి
మానవ హితమే ‘ఈద్’ అభిమతం
రమజాన్ నెల ముగిసిన తర్వాత ముస్లిం సమాజం అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే పర్వదినం ఈదుల్ ఫిత్ర్. ఏకధాటిగా నెలరోజులపాటు సాగిన ఆధ్యాత్మిక సాధన స్పూర్తితో, మానవీయ విలువలకు నూతన ఆరంభం. ఉపవాసం ద్వారా శరీరాన్ని మాత్రమే కాదు, తన ఆలోచనలను, ప్రవర్తనను కూడా శుద్ధి చేసుకున్న మనిషి ఆ అనుభూతిని సమాజంతో పంచుకునే రోజు ఈద్. అందుకే ఈ పండుగలో కనిపించే ఆనందం కేవలం ఉత్సవపు ఉల్లాసం కాదు; అది ఆధ్యాత్మికత, దానం, సహోదరత్వం, సామాజిక బాధ్యతల సమ్మేళనం. అందుకే ఈ నెలను ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం పాటించడం, రాత్రిళ్లు ప్రత్యేక ప్రార్థనలు చేయడం, ఖుర్ ఆన్ పఠనం, దానం వంటి ఆచారాలు విశ్వాసుల జీవితంలో ఒక శుద్ధి ప్రక్రియలా మారుతాయి. ఉపవాసం ద్వారా ఆకలి, దాహం అనుభూతిని స్వచ్ఛందంగా స్వీకరించడం ద్వారా మనిషి తన కోరికలను నియంత్రించుకోవడం నేర్చుకుంటాడు. అదే సమయంలో పేదసాదల కష్టాలను అర్థం చేసుకునే సానుభూతి కూడా అతనిలో పెరుగుతుంది.ఈ పండుగలోని ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి జకాతుల్ ఫిత్ర్ లేదా ఫిత్రా. ప్రతి ముస్లిం కుటుంబం తమ శక్తికి తగ్గట్టు పేదలకు దానం చేయడం సంప్రదాయం. దీని వెనుక ఉన్న భావం ఎంతో గొప్పది. సమాజంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే మానవీయ బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. పండుగ ఆనందం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలనే భావన ఇస్లాం లోని సామాజిక న్యాయ భావనను ప్రతిబింబిస్తుంది.ఈద్ రోజూ ఉదయం మసీదులు, ఈద్ గాహ్లలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు సమాజంలోని ఐక్యతను ప్రతిబింబిస్తాయి. వేలాదిమంది ఒకేస్థలంలో చేరి, ధనిక, పేద, పెద్ద, చిన్న అనే తేడాలు లేకుండా ఒకే వరుసలో నిలబడి ప్రార్థన చేయడం సమానత్వానికి ప్రతీక. ప్రార్థన అనంతరం ప్రజలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ అని శుభాకాంక్షలు తెలుపుకోవడం పరస్పర ప్రేమను, క్షమాభావాన్ని వ్యక్తపరుస్తుంది.ఈదుల్ ఫిత్ర్ తాత్వికంగా కూడా ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. రమజాన్ నెలలో మనిషి తనలోని స్వార్థాన్ని తగ్గించి దయ, సహనం, నియంత్రణ వంటి విలువలను పెం΄పొందించుకుంటాడు. ఈ విలువలు కేవలం ఒక నెలకు మాత్రమే పరిమితం కాకుండా జీవితాంతం కొనసాగాలని ఈద్ మనకు గుర్తు చేస్తుంది. నిజమైన ఈద్ అంటే కేవలం ఒక రోజు సంబరం కాదు; రమజాన్ ద్వారా ΄పొందిన ఆధ్యాత్మిక మార్పును జీవితంలో నిలబెట్టుకోవడం.సామాజికంగా కూడా ఈ పండుగ గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒకచోట చేరి ఆనందాన్ని పంచుకోవడం ద్వారా బంధాలు మరింత బలపడతాయి. చాలా సందర్భాల్లో సంవత్సరాలుగా కొనసాగుతున్న అపార్థాలు, విభేదాలు కూడా ఈ సందర్భంలో పరిష్కారమవుతాయి. పరస్పరం క్షమించుకోవడం, మళ్లీ దగ్గరవడం ఈ పండుగకు ప్రత్యేకమైన లక్షణం.నిజమైన ఈద్ కొత్త బట్టలు ధరించడంలో కాదు; కొత్త మనసుతో జీవించడంలో ఉంది. ద్వేషం స్థానంలో ప్రేమను, స్వార్థం స్థానంలో దానాన్ని, విభేదాల స్థానంలో ఐక్యతను పెం΄పొందించడమే ఈదుల్ ఫిత్ర్ అసలు ఆత్మ. ఈ ఆత్మను మన జీవితంలో నిలబెట్టగలిగితేనే ఈ పండుగ ఆధ్యాత్మిక, తాత్విక, సామాజిక సందేశం సార్థకమవుతుంది. దైవం మనందరికీ ఈ పర్వదినం స్ఫూర్తిని అందిపుచ్చుకొనే అవకాశం అనుగ్రహించాలని కోరుకుందాం.రమజాన్ నెల మనిషికి ఒక ఆత్మపరిశీలన సమయం. తన జీవితంలోకి ఒకసారి తొంగిచూసుకుని, తన లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసే కాలం. ఈద్ ఆ ప్రయాణానికి ఒక ఆనందకర ముగింపు. అదే సమయంలో ఒక కొత్త సంకల్పానికి ఆరంభం కూడా. ఈదుల్ ఫిత్ర్ పండుగ కేవలం ముస్లిం సమాజానికి మాత్రమే చెందిన పండుగ కాదు; అది మానవత్వానికి సంబంధించిన పండుగ. ఉపవాసం ద్వారా నేర్చుకున్న నియంత్రణ, దానం ద్వారా పెరిగిన దయాగుణం, ప్రార్థన ద్వారా ΄పొందిన ఆధ్యాత్మిక బలం – ఇవన్నీ కలిసి సమాజంలో ప్రేమ, న్యాయం, సామరస్యం స్థాపించడానికి మార్గం చూపుతాయి. అందుకే ఈ పండుగ మనకిచ్చే అసలు సందేశం ఎంతో సరళం, కానీ చాలా గొప్పది.– మదీహా అర్జుమంద్
వినూత్న వ్యాపారం.. వింటే అవాక్కే!
చిన్న సమస్య అయితే రూ. 250, పెద్ద సమస్య అయితే ఐదు వందల రూపాయలు.. ఇవేమీ ఆస్పత్రుల్లో ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి పెట్టిన ధరలు కావు. బ్యాంకుల్లో సర్వీసు చార్జీలు కూడా కాదు. సాంకేతిక సమస్యలు తీర్చడానికి పెట్టిన రేట్లు కూడా కావివి. మరేంటి? సాటి మనుషుల బాధలను వినడానికి ఓ వ్యక్తి నిర్ణయించిన ధరలు ఇవి. ఏంటి సమస్యలు వినడానికి డబ్బులు ఇవ్వాలని ఆశ్చర్యపోతున్నారా? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ముంబై బీచ్కు వెళ్లాల్సిందే.ముంబై మహానగర సముద్ర తీరంలో (Mumbai Beach) ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకున్న ఓ వ్యక్తి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అతడు పట్టుకున్న ఫ్లెక్సీపై ''మీ బాధలు నాతో పంచుకోండి. నేను వింటాను'' అని రాసుంది. అంతేకాదు అతడి రెండు ఫోన్ నంబర్లతో పాటు ఏ సమస్యకు ఎంత మొత్తం తీసుకుంటాడనే వివరాలు కూడా అందులో ఉన్నాయి. ఇదంతా ఆసక్తిగా అనిపించి ఓ వ్యక్తి అతడితో మాట కలిపాడు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ మారింది.కలిసి ఏడవడానికి రూ. 1000!చిన్న చిన్న సమస్యలు వినడానికైతే 250 రూపాయలు, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే రూ. 500 తీసుకుంటానని అతడు చెప్పాడు. సమస్యలు వినడమే కాకుండా కలిసి కూర్చుని తనివితీరా ఏడవాలనుకుంటే 1000 రూపాయలు ఇవ్వాలని తెలిపాడు. డబ్బు చెల్లించి ఇలా ఎవరైనా చేస్తారా అని అడిగితే.. ''ఏం ఎందుకు చేయరు'' అంటూ ప్రశ్నించాడు. తన సేవలకు మన్నన దక్కుతుందని చాలా నమ్మకంగా ఉన్నాడతను. తన పేరు పృథ్వీరాజ్ బోహ్రా (Prithviraj Bohra) అని.. ప్రజల సమస్యలు వినేందుకే తానిక్కడ ఉన్నానని చెప్పాడు. తనకు ఇన్స్టాగ్రామ్ పేజీ, యూట్యూబ్ ఛానెల్ ఉందని వెల్లడించాడు. భావోద్వేగ మద్దతు కోసంపృథ్వీరాజ్ వీడియో వైరల్ కావడంతో నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొంత మంది అతడి సేవలను మెచ్చుకుంటే, మరికొందరు డబ్బుల కోసం ఇలా చేస్తున్నాడని విమర్శించారు. ఏది ఏమైనా ముంబై వంటి మహానగరాల్లో ఒంటరి జీవితాలు వెళ్లదీస్తున్న వారికి భావోద్వేగ మద్దతు అవసరమన్న వాదనతో అందరూ ఏకీభవిస్తున్నారు. కష్టసుఖాలు పంచుకునేందుకు, మనుసులోని భావాలు పంచుకునేందుకు మనుషులు కరవవుతున్న నగర జీవితాల్లో పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లు ఒయాసిసు లాంటి వారని పేర్కొంటున్నారు.చదవండి: ‘నంబర్ 1’ ఎప్పటికీ ఒంటరే!కాగా, ఈ వైరల్ వీడియో తీవ్రమైన సమస్యను వెలుగులోకి తెచ్చిందని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి కారణంగా నగర జీవులు మానసిక సమస్యల బారిన పడుతున్నారని, మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇలాంటి అనధికారిక మార్గాలను వెతుకుతున్నారని విశ్లేషిస్తున్నారు. తమ బాధలను ఎవరితో పంచుకోవాలో తెలియక పృథ్వీరాజ్ బోహ్రా లాంటి వాళ్లను ఆశ్రయిస్తున్నారని వివరించారు. నెటిజనుల స్పందనపృథ్వీరాజ్ బోహ్రా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "ఈ వ్యక్తి బీచ్లో అతిపెద్ద వ్యాపార నమూనాని ఆవిష్కరించాడు" అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఇదే తదుపరి గొప్ప స్టార్టప్ ఆలోచన" అని మరొకరు పేర్కొన్నారు. ఇలాంటి సేవలను స్నేహితులు, కుటుంబ సభ్యులకు తాము ఉచితంగా అందిస్తామని కొందమంది సరదాగా కామెంట్ చేశారు. ముంబై లాంటి మహా నగరాల్లో మనుషులను ఒంటితనం ఎంతగా బాధిస్తుందో ఇలాంటి ఉదంతాలు వెల్లడిస్తున్నాయని, ఇక్కడ బాధ కూడా అమ్ముడుపోతుందని నెటిజనులు అంటున్నారు. అయితే మనుషుల బాధలను అలుసుకుగా తీసుకుని మోసగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.🚨 Mumbai Beach Viral : Man charges people to listen to problems.REPORTER : Do people come? 🤯MAN : "Yes, For small troubles, ₹250. For bigger worries, ₹500, and to cry together, ₹1,000. I am here to listen to people’s problems" 😳pic.twitter.com/cTXeKgzLzl— News Algebra (@NewsAlgebraIND) March 20, 2026
మహిళల నీటి కష్టాలు మూడురెట్లు!
ప్రపంచంలో మన దేశానికి ఉన్నది 4% మంచినీరు మాత్రమే. కానీ, ప్రపంచ జనాభాలో 18% మన దేశంలోనే నివశిస్తున్నారు. నీటి కొరత ఇప్పటికే మనకు పెనుసవాలుగా మారింది. ముఖ్యంగా వేసవిలో నీటి చుక్క కోసం అల్లాడే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు ప్రతిరోజూ నీటి సేకరణకు 25 కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. ఇది పురుషులు, బాలురు వెచ్చిస్తున్న దాని కంటే 3 రెట్లు ఎక్కువ. నీటి గణాంకాల గురించి సాధారణంగా క్యూబిక్ మీటర్లలో చెబుతూ ఉంటాం. కానీ ఈ ప్రతి సంఖ్య వెనుక ఒక మానవ ముఖం ఉంది. ఆ ముఖం, చాలా సార్లు, మహిళదే! ఇది కల్పన కాదు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునెస్కో, యూఎన్ ఉమెన్, భారత జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాల సహితంగా నమోదు చేసిన వాస్తవం ఇదే. నీటి భద్రతే లింగ సమానత్వానికి భూమిక.ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మార్చి 22న ‘ప్రపంచ నీటి దినోత్సవం’ నిర్వహిస్తూ మనలో నీటి చైతన్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది ఇతివృత్తం: ‘ప్రజలందరికీ నీరు: స్త్రీ పురుషులకు సమాన హక్కులు– సమాన అవకాశాలు’. నీటి దినోత్సవ ప్రచార నినాదం: ‘నీరు ప్రవహించే చోట, లింగ సమానత్వం వికసిస్తుంది’! అది సాగు నీరైనా, తాగు నీరైనా సరే.. నీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అయినా మహిళల అభిప్రాయాలకు, ఆకాంక్షలకు సముచితమైన చోటివ్వటం ద్వారా సమానత్వాన్ని వికసింపజేయాలని ఐరాస పిలుపునిస్తోంది! ఇది మనందరం ఆలకించాల్సిన మానవీయమైన పిలుపు!!వ్యవసాయానికి అవసరమైన శ్రమను, గృహ, ఉత్పాదక అవసరాలకు నీటిని అందించడంలో మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ.. అధికారిక నీటి నిర్వహణ, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియల నుంచి వారిని క్రమపద్ధతిలో మినహాయిస్తున్నారు. వ్యవసాయ పనులను 37%–42% వరకు మహిళలే చేస్తున్నారు. ఒక పంట కాలంలో సగటున 3,300 గంటలు పనిచేస్తారు. పురుషుల 1,860 గంటలు మాత్రమే. కలుపు తీయటం, మొక్కలు నాటటం, నీరు పెట్టటం వంటి చేతులతో చేసే పనులు, ఎక్కువ నీరు అవసరమయ్యే పనులతో ΄ాటు, పశువులకు నీరు పెట్టటం వంటి పశు΄ోషణ పనుల్లో ఎక్కువ భాగాన్ని చక్కబెట్టే బాధ్యతలను మహిళలు నెరవేర్చుతున్నారు. క్షేత్ర స్థాయిలో వీరే ‘వాస్తవ‘ నీటి నిర్వాహకులు అయినప్పటికీ, వారి ΄ాత్రను తక్కువగా చూస్తున్నారు. టైమ్ పావర్టీభూగర్భ జలమట్టాలు తగ్గి΄ోతున్నందున, మహిళలు నీటిని తెచ్చుకోవడానికి మరింత దూరం ప్రయాణించవలసి వస్తుంది. మన దేశంలో మహిళలు కొన్నిసార్లు దీనికోసం రోజూ నాలుగు గంటల వరకు సమయం వెచ్చిస్తున్నారు. బుందేల్ఖండ్, విదర్భ, రాయలసీమ వంటి కరువు పీడిత ప్రాంతాల్లో వేసవికాలంలో 15–20 లీటర్ల బిందెలను నెత్తిన పెట్టుకని రోజుకు 5–20 కిలోమీటర్ల దూరం నడచి మరీ కుటుంబాలకు మహిళలు, బాలికలు నీటిని సమకూర్చుతున్నారు. ఒక అంచనా ప్రకారం.. గ్రామీణ భారతీయ మహిళ నీటి సేకరణ కోసం 210 గంటల (27 పూర్తి పనిదినాలకు సరిపడా) సమయాన్ని ప్రతి ఏటా కేటాయిస్తోంది. ఇంటì దగ్గరకే కుళాయి వస్తే ఈ సమయం అంతా మహిళలకు ఆదా అవుతుంది. ఈ శ్రమకు విలువ కడితే దేశం యావత్తూ ఒక రోజు ఆర్జించే ఆదాయానికి సమానం. ఈ పనుల వల్ల మహిళలు, బాలికలకు తీరిక దొరక్క (టైమ్ పావర్టీ) చదువు లేదా మరింత లాభదాయకమైన వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతున్నారు. కేవలం 5% మంది మహిళలకు మాత్రమే కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. సోలార్ పంపులు వంటి వాతావరణ మార్పుల్ని తట్టుకునే టెక్నాలజీలు అందుబాటులో లేవు. అందు వల్ల, మహిళా రైతులు ఎక్కువగా కరువు బాధితులుగా మారుతున్నారు. వాతావరణ మార్పులను తట్టుకోగల సేంద్రియ వ్యవసాయ నమూనాలకు మహిళా రైతులు పెద్దపీట వేస్తున్నారు. చిరుధాన్యాలను పండించటం, ఆహారంలో భాగం చేసుకోవటంలోనూ మహిళా రైతులు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఇవన్నీ ఆహార భద్రతను పెంచుతాయని, నీటి వినియోగాన్ని తగ్గిస్తాయని అనేక సంస్థల అనుభవాలు నిరూపించాయి.పురుషులతో పోలిస్తే మహిళలు వాతావరణ మార్పుల పట్ల ఎక్కువ సున్నితంగా ఉంటారని చటర్జీ (2021) అధ్యయనంలో వెల్లడైంది. నీటి లభ్యత, వ్యవసాయ ఉత్పాదకత, పశువుల సమస్యలు వంటి వివిధ రంగాలలో పురుషుల కంటే మహిళలే వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎక్కువగా గమనిస్తారని కూడా అధ్యయనాలు ఎత్తి చూపుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 55%–65% వాటా మహిళా రైతులదే. పురుష రైతులు వ్యవసాయ రంగాన్ని విడిచిపెట్టి, వ్యవసాయేతర రంగాలలో కూలీలుగా మారుతున్న ప్రస్తుత ధోరణిని బట్టి చూస్తే, భారతదేశంలో మహిళా రైతుల సంఖ్య పెరుగుతోంది.లింగ సమానత్వానికి అడ్డంకులుమన దేశంలో నీటి హక్కులు సాధారణంగా భూ యాజమాన్యంతో ముడిపడి ఉంటాయి. సాగులో ఉన్న భూముల్లో కేవలం 13.5% మాత్రమే మహిళల ఆధీనంలో ఉన్నాయి. అధికారిక నీటి వినియోగదారుల సంఘాలు, సాగునీటి హక్కుల విషయంలో నిర్ణయాలు తీసుకోవటంలో మహిళల పాత్ర అంతంత మాత్రంగా మిగిలిపోయింది.సమావేశాలకు హాజరు కావడానికి భర్త అనుమతి అవసరం కావడం, వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం లేకపోవడం, ‘నీటిపారుదల పురుషుల పని’ అనే భావన వంటివి నీటి నిర్వహణలో లింగ సమానత్వానికి అడ్డంకులుగా నిలుస్తున్నాయి. 2012లో ప్రభుత్వం ప్రకటించిన జాతీయ జల విధానం మహిళల అవసరాలను ప్రస్తావించింది. అయినప్పటికీ, జల పరిపాలనలో పురుషులతో సమానంగా మహిళలకు నిజంగా అవకాశాలు కల్పించడానికి ఇందులో నిర్దిష్ట మార్గదర్శకాలు లేవని విమర్శకులు వాదిస్తున్నారు. మహిళల మహా శ్రమప్రతి రోజూ 20 కోట్ల మంది భారతీయులు నడిచి వెళ్లి దూరం నుంచి నీటిని తెచ్చుకుంటారు. వీరిలో అత్యధికులు మహిళలు, బాలికలు (భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ). భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది, అంటే 60 కోట్ల మంది, తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు (నీతి ఆయోగ్ సీడబ్ల్యూఎంఐ 2018). ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ఫలితంగా ప్రతిరోజూ మహిళలు నీటిని తెచ్చేందుకు ఖర్చు చేసే 5.5 కోట్ల గంటల సమయం ఆదా అవుతోంది (జల్ శక్తి మంత్రిత్వ శాఖ, 2023).ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు ప్రతిరోజూ నీటి సేకరణకు 25 కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. ఇది పురుషులు, బాలుర కంటే 3 రెట్లు ఎక్కువ (యూఎన్ ఉమెన్, 2024).ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా మహిళలు, అంటే మొత్తం మహిళల్లో 27 శాతానికి పైగా, సురక్షిత తాగునీటి సేవలను పొందలేకపోతున్నారు (యూఎన్ ఉమెన్/యూఎన్డిఈఎస్ఏ, 2023).సురక్షితమైన తాగునీరు అందక భారతదేశంలో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది మరణిస్తున్నారు (నీతి ఆయోగ్ సీడబ్ల్యూఎంఐ).మన దేశంలోని నదులు, రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటిలో 70 శాతం కలుషితమైంది. జల నాణ్యత సూచికలో 122 దేశాల్లోకెల్లా భారతదేశం 120వ స్థానంలో, చివరి నుంచి మూడో స్థానంలో, ఉంది (నీతి ఆయోగ్ / ప్రపంచ బ్యాంకు). ప్రపంచవ్యాప్తంగా 14% దేశాల్లో నీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొనడానికి ఇప్పటికీ ఎలాంటి యంత్రాంగాలు లేవు (యూఎఈ ఈపీ–డీహెచ్ఐ, జీడబ్ల్యూపీ, యూఎన్ ఉమెన్, 2025).నీటిపారుదల సామర్థ్యంవ్యవసాయరంగంలో నీటిపారుదల సామర్థ్యం ప్రపంచ సగటు 50–60%. మన దేశ వ్యవసాయ నీటిపారుదల సామర్థ్యం కేవలం 38% మాత్రమేనని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. పంటలకు నీటి వినియోగ సామర్థ్యాన్ని 60%కి పెంచితే, ఏటా 200 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) పైగా నీరు అందుబాటులోకి వస్తుంది. ఇది గృహ, పారిశ్రామిక అవసరాల కొరత మొత్తాన్ని తీర్చడానికి సరి΄ోతుందని నీతి ఆయోగ్ అంచనా.సమానమైన దిగుబడి కోసం అమెరికా, చైనా లేదా ఇజ్రాయెల్లోని రైతులతో ΄ోలిస్తే భారతీయ రైతులు (ఒక్కో పంట యూనిట్కు) 3–5 రెట్లు ఎక్కువ నీటిని ఉపయోగిస్తున్నారు. ఇది రైతుల వైఫల్యం కాదు. ఇది విధానపరమైన మౌలిక సదుపాయాల వైఫల్యమని నీతి ఆయోగ్ / ఎఫ్ఏఓ తేటతెల్లం చేశాయి.ప్రపంచంలోనే అత్యధికంగా భూగర్భ జలాలను తోడే దేశం భారతదేశం. ఏటా 239–241 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని తోడేస్తున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా తోడుతున్న నీటిలో నాలుగో వంతు కంటే ఎక్కువ. 1,592 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని అధికంగా వినియోగిస్తున్నామని అంచనా.భారతదేశంలోని నదులు, చెరువులు, రిజర్వాయర్లు, కాలువల్లోని 70% నీరు కలుషితమయ్యాయి. జల నాణ్యత సూచికలో 122 దేశాలలో భారతదేశం 120వ స్థానంలో ఉంది. మనం కేవలం నీటిని కోల్పోవడమే కాదు, మిగిలి ఉన్న నీటిని కూడా విషపూరితం చేస్తున్నామని నీతి ఆయోగ్/ప్రపంచ బ్యాంకు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మహిళలకే గ్రామస్థాయి జల నాయకత్వం నీటి సేకరణకు అనుదినం మహిళలు, బాలికలు వెచ్చించే సమయం నుంచి ఆదా చేసే ప్రతి గంట సమయమూ.. మహిళాభివృద్ధిలో, విద్యలో, వాణిజ్యంలో, సమాజ పరివర్తనలో పెట్టుబడిగా పెట్టడానికి అదనంగా దొరికిన సమయమే. నీటి భద్రత, లింగ సమానత్వం అనేవి వేర్వేరు అంశాలు కావు. నీటి భద్రతతోనే లింగ సమానత్వం సాధ్యం. ఒకే సంక్షోభం, ఒకే అవకాశం. జల్ జీవన్ మిషన్ సహా ప్రభుత్వ నీటి పథకాలన్నిటికి సంబంధించి గ్రామ స్థాయిలో మహిళలను ప్రాథమిక జల పరిపాలన నాయకులు’గా అధికారికంగా గుర్తించాలి. నీటిని పరిపాలన బాధ్యతలు మహిళలకిస్తే సమాజాలు అభివృద్ధి చెందుతాయని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. 5, 6 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, విక్సిత్ భారత్ లక్ష్యం కూడా తద్వారా నెరవేరుతాయి. – మర్ది కరుణాకర్ రెడ్డి, ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, జల సంరక్షణ ప్రచార కార్యకర్త– నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: మహిళా రైతులకు మద్దతిస్తే..!)
అంతర్జాతీయం
యుద్ధంపై వెనక్కి తగ్గిన ట్రంప్..?
పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత నానాటికీ తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం మెుదలై 20 రోజులు దాటుతున్నా ఇరువర్గాలు శాంతించడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై యుద్ధం ఆపే విషయం ఆలోచిస్తున్నామన్నారు.అమెరికా, ఇజ్రాయెల్ చేసిన చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రెండు దేశాల దాడులను తిప్పికొడుతూ ఇరాన్ పెద్దఎత్తున ప్రతిదాడులు చేయడంతో చమురు సప్లై చైన్ దెబ్బతింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతుంది. ఈ సంక్షోభ పరిస్థితులకు ట్రంప్ కారణమని ప్రపంచ దేశాలు ఆయనపై గుర్రుగా ఉన్నాయి. చమురు సంక్షోభాన్ని తెరదించడానికి IEA అత్యవసర చమురు నిల్వల విడుదలకు అనుమతిచ్చినా ప్రస్తుతం ఏర్పడ్డ చమురు కొరతకు అది ఏ విధంగానూ సరిపోదు. ఈ నేపథ్యంలో ట్రంప్ యుద్ధంపై కీలక ప్రకటన చేశారు.తన సోషల్ మీడియా పోస్ట్లో " ఇరాన్లో మేము అనుకున్న లక్ష్యాలు చేరుకోవడానికి చాలా దగ్గరవుతున్నాం. దీంతో మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ప్రయత్నాలను ముగించే విషయాన్ని పరిశీలిస్తున్నాం" అని ట్రంప్ పోస్ట్ చేశారు.. అయితే ఇది వరకే పలు మార్లు ఇరాన్ రక్షణ వ్యవస్థ చాలా దెబ్బతిందని దాని పనైపోయిందని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఇలా వ్యాఖ్యానించారు.కాగా ఇరాన్ విషయంలో ట్రంప్ అంచనా పూర్తిగా విఫలమైంది. టెహ్రాన్ని చాలా సులువుగా ఓడించవచ్చు అని ట్రంప్ భావించారు. అయితే ఇరాన్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకవడుతుంది. హర్మూజ్ క్లోజ్ చేసి చమురు సప్లైని బ్రేక్ చేసింది. అంతేకాకుండా అమెరికా ఫైటర్ జెట్ F-35 పై అటాక్ చేసింది. అంతేకాకుండా ఖతార్ లోని ప్రపంచంలోని అతి పెద్దదైన ఎల్ఎన్జీ ప్లాంట్పై దాడి చేసింది. ఈ పరిస్థితులు చూస్తుంటే టెహ్రాన్ ఎక్కడా తగ్గే ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ ఉద్రిక్తతల వేళ ట్రంప్ పోస్ట్ ఆసక్తిగా మారింది."We are getting very close to meeting our objectives as we consider winding down our great Military efforts in the Middle East with respect to the Terrorist Regime of Iran..." - President Donald J. Trump pic.twitter.com/YBG9l492Kf— The White House (@WhiteHouse) March 20, 2026
ఇరాన్ దూకుడు.. యూఎస్-యూకే సైనిక స్థావరంపై దాడి
టెహ్రాన్: ఇరాన్ యుద్ధం కొత్త వ్యూహాలతో యూ టర్న్ తీసుకుంటోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ దూకుడు పెంచింది. తాజాగా ఇరాన్.. హిందూ మహాసముద్రంపైకి రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే,ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారనే విషయం తెలియాల్సి ఉంది.వివరాల మేరకు.. ఇరాన్ హిందూ మహా సముద్రంలోని యూఎస్-యూకే సైనిక స్థావరం డిగో గార్సియా టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను తాకలేదని తెలుస్తోంది. అయితే, ఒకటి మాత్రం మార్గ మధ్యలోనే విఫలమైందని, మరొకదాన్ని తమ దేశం అడ్డుకుందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారన్న దానిపై స్పష్టత లేదు. ఈ దాడులపై ఇరాన్ కూడా స్పందించకపోవడం గమనార్హం.ఇదిలా ఉండగా.. ఇరాన్తో యుద్ధం ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే, కాల్పుల విరమణకు మాత్రం తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు. అలాగే, క్షిపణి సామర్థ్యాలను, వైమానిక, నావికా వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆ దేశం మరోసారి అణ్వాయుధాలను తయారుచేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే.. తాము తగినవిధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇక, అమెరికా దాని మిత్ర దేశాలకు భద్రత కల్పించిందని ట్రంప్ అన్నారు. ‘ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ సహా పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.
ఇరాన్తో యుద్ధం.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ట్విస్ట్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధి రక్షణ బాధ్యతను అమెరికా మోయాల్సిన అవసరం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో యుద్ధం ఆపాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని ట్రంప్ కొట్టిపారేశారు.వైట్హౌస్ నుంచి ఫ్లోరిడాలోని పామ్ బీచ్కు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ..‘హార్మూజ్ జలసంధి రక్షణ బాధ్యతను అమెరికా మోయాల్సిన అవసరం లేదు. ఆ మార్గం ద్వారా ప్రయోజనం పొందే దేశాలు కొంతైనా చొరవ చూపాలి. యుద్ధం నేపథ్యంలో ఈ మార్గం ద్వారా లబ్ధి పొందుతున్న చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు రంగంలోకి దిగాలి. మాకు హార్ముజ్ జలసంధితో పనిలేదు లేదు. కానీ యూరప్, కొరియా, జపాన్, చైనా వంటి దేశాలకు ఇది చాలా అవసరం. చైనా తన ఇంధన అవసరాల్లో 90 శాతం, జపాన్ 95 శాతం ఈ మార్గం ద్వారానే లబ్ధి పొందుతున్నాయి. ఆ దేశాలే కొంచెం శ్రమించి, ఈ మార్గం రక్షణలో భాగం కావాలి’ అంటూ వ్యాఖ్యానించారు.#WATCH | On the US-Israel vs Iran conflict, US President Donald Trump says, "We can have dialogue, but I don't want to do a ceasefire. You don't do a ceasefire when you're literally obliterating the other side... we're not looking to do that."(Source: US Network Pool Via… pic.twitter.com/4Y5AUK4jG0— ANI (@ANI) March 20, 2026యుద్ధం ఆగదు.. మరోవైపు.. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా,ఇజ్రాయెల్ విజయం వైపు దూసుకుపోతున్నాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ సైనిక వ్యవస్థను అమెరికా ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఇరాన్ వైమానిక వ్యవస్థలను ధ్వంసం చేశామని, సైనిక పరంగా ఆ దేశం పని అయిపోందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా చూడటమే తమ అంతిమ ధ్యేయమని చెప్పారు. అలాగే, యుద్ధం ఆపాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని ట్రంప్ కొట్టిపారేశారు. తాము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ కాల్పుల విరమణ మాత్రం చేయబోం. శత్రువును పూర్తిగా తుడిచిపెడుతున్న సమయంలో యుద్ధం ఆపే ప్రసక్తే లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో మిత్రదేశాలపై ట్రంప్ విమర్శలుఇరాన్ యుద్ధంలో చేరనందుకు నాటో మిత్రదేశాలపై ట్రంప్ విమర్శలు చేశారు. పిరికివాళ్లను గుర్తుపెట్టుకుంటామంటూ హెచ్చరించారు. హార్మూజ్ జలసంధిని తెరిపించేందుకు నాటో దేశాలు రాకపోవడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫారమ్లో ఆయన నాటోను "పేపర్ టైగర్" అని విమర్శించారు. అమెరికా సహాయం లేకుండా నాటో ఏమీ చేయలేదని, ఇరాన్ వంటి దేశాల ముప్పును అడ్డుకోవడంలో వారు పిరికితనం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు జలసంధి తెరిపించేందుకు నాటో దేశాలను ట్రంప్ సైనిక సహాయం కోరారు. అయితే, అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ను నాటో దేశాలు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇరాన్పై యుద్ధం.. వ్యూహం మారుస్తున్న అమెరికా!
ఇరాన్పై పరిమిత భూతల దాడుల దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారం రోజులుగా ఈ దిశగా పలు సంకేతాలిస్తూ వస్తున్నారు. జపాన్ సమీపంలోని సముద్ర జలాల్లో ఉన్న విమానవాహక యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలీని అమెరికా యుద్ధ ప్రాతిపదికన గల్ఫ్కు తరలిస్తోంది. 31వ మరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్కు చెందిన 2,500 మంది సిబ్బంది అందులో ఉన్నారు.దీంతో ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా పోరు నిర్ణాయక దశకు చేరుతున్నట్టు కనిస్తోంది. ముఖ్యంగా ఇంధనపరంగా ఇరాన్కు గుండెకాయ వంటి ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకోవడం, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ సాధించి నౌకల రవాణాను వీలైనంత త్వరగా పునరుద్ధరించడం భూతల దాడుల ముఖ్య లక్ష్యాలు కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ను ఇరాన్ మూసేయడంతో అంతర్జాతీయగా కల్లోలం రేగుతున్న విషయం తెలిసిందే. అమెరికా దాడుల్లో ఇరాన్ నావికా దళం చాలావరకు బలహీనపడిపోయింది. కనుక తక్కువ రిసు్కతోనే హార్మూజ్ను అదీనంలోకి తీసుకోవచ్చన్నది ట్రంప్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతోపాటు ఖర్గ్ దీవిని కూడా స్వాధీనం చేసుకుంటే ఇరాన్కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో ఏకంగా 90 శాతం ఖర్గ్ నుంచే జరుగుతాయి.ఖర్గ్ను అధీనంలోకి తెచ్చుకుంటే హార్మూజ్ గుండా నౌకల రాకపోకలకు అంగీకరించేలా ఇరాన్ను ఒప్పించొచ్చన్నది పెంటగాన్ వ్యూహకర్తల భావన. అంతేగాక ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులకు చెక్ పెడితే దానికి యుద్ధాన్ని కొనసాగించలేని పరిస్థితి తలెత్తుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.భూతల దాడులకు దిగే పక్షంలో పనిలో పనిగా ఇరాన్ చేతుల్లో ఉన్న 450 కిలోల పై చిలుకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను కూడా ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలని అమెరికా తలపోస్తోంది. తద్వారా ఇరాన్ అణ్వస్త్ర కార్యకలాపాలకు శాశ్వతంగా తెర దించొచ్చని భావిస్తోంది. కానీ అదంత తేలిక కాదన్నది నిపుణుల అభిప్రాయం. ‘‘ఖర్గ్ దీవి ఇరాన్ ప్రధాన భూభాగానికి 25 కి.మీ. దూరంలో ఉన్నందున దానిపై దాడి, స్వాదీనం అంత కష్టం కాకపోవచ్చు. కానీ యురేనియం నిల్వల విషయం అలా కాదు. అవి ఇరాన్ ప్రధాన భూభాగంలోనే ఉండి ఉంటాయి’’ అని వారంటున్నారు.
జాతీయం
పక్కాగా పాత వాహనాల రీసైక్లింగ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పాత, పనికిరాని వాహనాల (ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్–ఈల్వీఎస్) రీసైక్లింగ్ను పర్యావరణానికి అనుకూలంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర రోడ్డు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకమైన పటిష్ట వ్యవస్థను రూపొందించినట్లు ఇటీవల ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో చెప్పారు. అనధికార రంగం నుంచి వ్యవస్థీకృత రంగానికి మార్పులో భాగంగా దేశంలో పాత వాహనాల స్క్రాపింగ్ ఇప్పటివరకు ప్రధానంగా అనధికార రంగంలో జరుగుతోందన్నారు. దీనిని నియంత్రిత వ్యవస్థలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ‘వాహన స్క్రాపింగ్ పాలసీ’(వాలంటరీ వెహికల్ ఫ్లీట్ మోడరైజేషన్ ప్రొగ్రాం–వీ–వీఎంపీ) అమలు చేస్తోందన్నారు. దీనికి అనుగుణంగా 2021లో మోటార్ వాహనాల (వాహన స్క్రాపింగ్ సౌకర్యాల నమోదు మరియు విధులు) నిబంధనలు రూపొందించి, అనంతరం పలు సవరణలు చేసిందన్నారు. 2026 మార్చి 10 నాటికి దేశంలోని 22 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 134 రిజిస్టర్డ్ వాహన స్క్రాపింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఏటా ఆడిటింగ్ అనధికారికంగా వాహనాల విభజన వల్ల కలిగే పర్యావరణ నష్టాలపై ప్రత్యేక అధ్యయనం జరగనప్పటికీ, ఆర్వీఎస్ఎఫ్ఎస్లో పర్యావరణ భద్రతకు కఠిన ప్రమాణాలు అమలు చేస్తున్నారు. ప్రధానంగా ‘కలుíÙతాలు లీక్ కాకుండా ప్రత్యేక డీ–పాల్యూషన్ పరికరాలు, ఆయిల్, బ్యాటరీలు, గ్యాస్ వంటి హానికర పదార్థాల వేరు నిల్వ, ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, నీటి రీసైక్లింగ్ వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలు, శబ్ద కాలుష్య నియంత్రణ వంటివి ఉన్నాయన్నారు. అదనంగా ఏటా ఆడిట్తో స్క్రాపింగ్ కేంద్రాల పనితీరును అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం స్క్రాపింగ్ కేంద్రాల ఏర్పాటుకు నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ఎస్డబ్ల్యూఎస్) ద్వారా ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం కలి్పంచినట్లు పేర్కొన్నారు. అలాగే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన ‘వీ్రస్కాప్’మాడ్యూల్ ద్వారా వాహనాల స్క్రాపింగ్ ప్రక్రియను ఆన్లైన్ చేసినట్లు వెల్లడించారు. పాత ప్రభుత్వ వాహనాల వేలం కోసం ‘ఎంఎస్టీసీ’, ‘జీఈఎం’పోర్టల్స్ ఉపయోగిస్తున్నారు. రాష్ట్రాలకు ప్రోత్సాహంగా 2025–26లో ప్రత్యేక సహాయం పథకం కింద రూ.2వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. పలు రాయితీలు స్క్రాపింగ్ కేంద్రాల్లో వాహనాలను సమర్పించే వారికి ప్రభుత్వం రాయితీలు అందిస్తోంందన్నారు. ప్రధానంగా.. ‘కొత్త వాహన నమోదు ఫీజు మినహాయింపు, మోటార్ వాహన పన్నులో 15శాతం నుంచి 25శాతం వరకు రాయితీ, పాత బీఎస్–1, బీఎస్–2 వాహనాల మారి్పడిపై 50శాతం వరకు పన్ను తగ్గింపు’అని వివరించారు. ప్రస్తుతం ఉన్న 134 ఆర్వీఎస్ఎఫ్ఎస్ ద్వారా సంవత్సరానికి సగటున 10వేల నుంచి 12వేల వాహనాలను స్క్రాప్ చేసే సామర్థ్యం ఉందన్నారు. ఇప్పటివరకు 4,60,979 వాహనాలు స్క్రాప్ చేయగా, ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 2,79,792 వాహనాలు స్క్రాప్ చేసినట్లు తెలిపారు. ఈపీఆర్ విధానం పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా 2025లో ‘ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్ రూల్స్’కేంద్ర పర్యావరణ శాఖ ప్రకటించిందన్నారు. ఇందులో వాహన తయారీదారులకు ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ (ఈపీఆర్) విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, కాలుష్య నియంత్రణ మండలి– 2023 మార్గదర్శకాల ద్వారా పాత వాహనాల విభజన, రీసైక్లింగ్ ప్రక్రియను సురక్షితంగా నిర్వహించే విధానాలను నిర్దేశించిందన్నారు. దేశంలో పాత వాహనాల రీసైక్లింగ్ను పర్యావరణ అనుకూల, సాంకేతికంగా అభివృద్ధి చెందిన వ్యవస్థగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గడ్కారీ స్పష్టం చేశారు.
భార్య జీవిత భాగస్వామి.. పనిమనిషి కాదు!
న్యూఢిల్లీ: భార్య వంట చేయని కారణం చూపుతూ విడాకుల కోసం వచ్చిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు తనదైన శైలిలో కౌన్సెలింగ్ చేసింది. వంట పని, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతకడం వంటి పనుల్లో భార్యతోపాటు భర్తకు కూడా సమాన బాధ్యతుందని హితవు పలికింది. ఈ పనుల్లో భర్త కూడా పాలుపంచుకోవాలని పేర్కొంది. ‘భార్య జీవిత భాగస్వామి.. పని మనిషి కాదు’అంటూ వ్యాఖ్యానించింది. క్రూరత్వం ఆరోపణల ఆధారంగా దిగువ కోర్టు విడాకులు మంజూరు చేయగా, కర్నాటక హైకోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ భర్త వేసిన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఈ దంపతులకు 2017 మేలో వివాహమవగా, 2019 నుంచి వేరుగా ఉంటున్నారు. వీరిమధ్య రాజీ కుదిర్చేందుకు గతంలో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పిటిషనర్ తరఫు లాయర్ పేర్కొన్నారు. క్రూరత్వం ఆరోపణలపై దిగువ కోర్టువిడాకులు మంజూరు చేయగా, హైకోర్టు కొట్టివేసిందన్నారు. క్రూరత్వం ఆరోపణలేంటని ప్రశ్నించగా, ‘భార్య ప్రవర్తన బాగోలేదు, ఆమెకు వంటరాదు’అని లాయర్ చెప్పారు. ‘అయితే, హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరైందే. దానిని క్రూరత్వంగా భావించలేం. అంతేకాదు, మీరు పెళ్లి చేసుకున్నది వంట మనిషిని కాదు, జీవిత భాగస్వామిని’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘వారిద్దరినీ కలిసి ఇక్కడికి రమ్మనండి. వారితో మేం మాట్లాడుతాం’అని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 27వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు దంపతులను తమ ఎదుట హాజరుపర్చాలని ఆదేశించింది.
అస్సాంలో బీజేపీ దూకుడు
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ నడుమ మరోసారి హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవి్వళ్లూరుతోంది. కాషాయ పార్టీ ఆశలను వమ్ము చేసి అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. రెండు పారీ్టలూ భాగస్వాములతో పొత్తుల ప్రక్రియను పూర్తి చేసుకుని పోటాపోటీగా అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి. రాష్ట్రమంతటా ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి కూడా. అయితే సీఎం హిమంత సారథ్యంలో దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని కాంగ్రెస్ ఏ మేరకు అడ్డుకుంటుందన్నది ఆసక్తికరం... చొరబాట్లు, అస్తిత్వ, హిందూత్వ–ముస్లిం రాజకీయాలు. ఇవే అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తేల్చేలా కని్పస్తున్న ప్రధానాంశాలు. అస్సామీల అస్తిత్వం, భూముల పరిరక్షకునిగా ముఖ్యమంత్రి సాధించిన హిమంత బిశ్వశర్మ ఇమేజీ బీజేపీకి పెద్ద సానుకూలతగా కనిపిస్తోంది. అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆయన సర్కారు ఉక్కుపాదం మోపింది. భూమి లేని స్థానికులకు, తేయాకు కారి్మక కుటుంబాలకు భూ పట్టాలిచి్చంది. వీటికితోడు మహిళలు, విద్యార్థులు, యువత కోసం రూ.5,000 కోట్లతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఎన్డీఏ భాగస్వాములైన అస్సాం గణ పరిషద్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్), రభా హసోంగ్ జతా మంచ్ వంటివాటితో బీజేపీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కూడా సజావుగా సాగిపోయింది. ఏజీపీకి 26, బీపీఎఫ్కు 11 స్థానాలు కేటాయించింది. మోదీ కరిష్మాకు సీఎం హిమత జనాదరణ కూడా తోడవనుంది. ఇక కాంగ్రెస్ మరోసారి వామపక్షాలు, రాయ్జోర్ దళ్, అస్సాం జాతీయ పరిషద్ వంటి పార్టీలతో జట్టు కట్టింది. కానీ నేతల వలసలు కాంగ్రెస్ను కుంగదీస్తున్నాయి. పీసీసీ మాజీ చీఫ్ భూపేన్ బోరా, మాజీ ఎంపీ ప్రద్యోత్ బోర్డోలోయ్ ఇటీవల పార్టీని వీడారు. దీనికి తోడు పీసీసీ చీఫ్ గౌరవ్ గొగొయ్ ఏకంగా పాకిస్తానీ ఏజెంట్ అంటూ సీఎం హిమంత చేస్తున్న ఆరోపణలు ఓటర్లపై ప్రభావం చూపుతున్నాయి. హిందూ నేతలకు కూడా కాంగ్రెస్లో కనీస గౌరవం లేదంటూ ర్యాలీల్లో ఆయన పదేపదే చేస్తున్న విమర్శలకు కూడా మంచి స్పందన కనిపిస్తోంది. వీటికి తోడు నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ కూడా కాంగ్రెస్ను బాగానే దెబ్బ తీసింది. ఆ పార్టీ సులువుగా గెలవగలిగిన ముస్లిం ప్రాబల్య స్థానాల సంఖ్యకు గండి పడింది. బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకతపైనే గట్టిగా ఆశలు పెట్టుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్
ఎయిర్ ఇండియా భారీ తప్పిదం
భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఓ భారీ తప్పిదం చేసింది. ఓ ఫ్లైట్కు బదులు మరో ఫ్లైట్ను వినియోగించి ప్రయాణికులకు విస్మయకర అనుభవాన్ని మిగిల్చింది. సొంతంగానూ భారీ ఆర్దిక నష్టాన్ని మూటగట్టుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. మార్చి 20న ఉదయం 11:34 గంటలకు ఢిల్లీ నుంచి AI185 సర్వీస్ నంబర్తో బోయింగ్ 777-200LR విమానం ప్యాసింజర్లతో కలిసి వాంకోవర్కు (కెనడా) బయల్దేరింది. అయితే నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఈ విమానం తప్పుడు విమానం అని అధికారులు గుర్తించారు.వాస్తవానికి ఈ సర్వీస్లో బోయింగ్ 777-300ER మోడల్ విమానం వాంకోవకర్కు వెళ్లాలి. అయితే ఆపరేషనల్ తప్పిదం కారణంగా 777-300ER మోడల్కు బదులు 777-200LR విమానం వాంకోవర్కు టేకాఫ్ అయ్యింది.చైనా గగనతలంలోకి ప్రవేశించాక అధికారులు తమ తప్పిదాన్ని గుర్తించారు. కెనడాకు వెళ్లేందుకు 777-300ER మోడల్కు మాత్రమే అనుమతి ఉందని, తాము ప్రయాణిస్తున్నది 777-200LR మోడల్ అని నాలుక కరుచుకున్నారు. దీంతో వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. మొత్తం 7 గంటలు 54 నిమిషాల ప్రయాణం తర్వాత విమానం తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విషయం తెలిసి ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఎయిర్ ఇండియాపై అసంతృప్తిని వెల్లగక్కారు. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన సంస్థ.. మరుసటి రోజు సరైన విమానం ఏర్పాటు చేసి ప్రయాణాన్ని కొనసాగించింది. అప్పటివరకు ప్రయాణికులకు ఉచిత హోటల్ వసతి, ఇతర సదుపాయాలు కల్పించింది.ఈ ఘటన ఎయిర్ ఇండియాకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించింది. బోయింగ్ విమానానికి ఒక్క గంటలో 8–9 టన్నుల ఇంధనం ఖర్చు అవుతుంది. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం వల్ల వందల టన్నుల ఇంధనం వృథా అయ్యింది. దీని వల్ల భారీ ఆర్దిక నష్టం చవిచూడటంతో పాటు సంస్థ ప్రతిష్టను దిగజార్చుకుంది.
ఎన్ఆర్ఐ
గత 23 ఏళ్లుగా రంజాన్ దీక్ష చేస్తున్న 56 ఏళ్ల ఎన్ఆర్ఐ
పవిత్ర రంజాన్ (Ramadan) మాసం వేళ మత సామరస్యానికి సంబంధించి అపురూపమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రంజాన్మాసం అంతా ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేస్తారు ఇది అందరికీ తెలిసిందే. కానీ దుబాయ్లో 56 ఏళ్ల నాన్ ముస్లిం గత 23 ఏళ్లు ఉపవాస దీక్ష చేస్తుండటం విశేషంగా నిలుస్తోంది. 2002 నుండి సతీష్ కుమార్న దుబాయ్లో ఉంటున్నారు. స్వయంగా తాను హిందువు అయినప్పటికీ పవిత్ర రంజాన్ నెలలో ఉపవాసం పాటిస్తున్నారు. రంజాన్ అంటే మంచి పనులను పంచుకుంటూ, జీవించడం అంటే సమాజంతో ఐక్యంగా ఉండటం అంటారు సతీష్. తన చుట్టూ ఉన్న ప్రజల పట్ల గౌరవం ఉందని, వారిమీద ప్రేమతోనే ఈ దీక్ష చేస్తానని చెప్పుకొచ్చారు. గల్ఫ్ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, కుమార్ రోజువారీ ఉపవాసం కేవలం శారీరక సవాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రక్రియగా విశ్వసిస్తానని తెలిపారు. ఇది ఆహారం, పానీయం, పాప ప్రవర్తనకు దూరంగా ఉండటంతోపాటు స్వీయ-క్రమశిక్షణ, ఆధ్యాత్మిక శుద్ధిని పెంపొందించుకునే మార్గం ఇదని చెప్పారు.ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!దీంతోపాటు, వారి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడే వ్యక్తుల ఇబ్బందులను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి చూడటానికి ఉపవాసం తనకు సహాయపడిందన్నారు. ఆకలిదప్పుల బాధను అనుభవించడం వల్ల పేదల దుస్థితిని అర్థం చేసు కోచ్చని, తద్వారా మనలో దాతృత్వం,కరుణ అనే భావం పెరుగుతుందని తెలిపారు. ఉపవాసంతో అనేక శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయన్నారు. ముఖ్యంగా ఉపవాసంద్వారా జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వడం అంటే శారీరక ప్రయోజనాలను పొందమే అన్నారు. దీంతో మానసిక బలం పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది అనేది తన అనుభవంలో తెలిసిందన్నారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్ : మైనర్పై దారుణం, ట్రంప్కు మరో షాక్
కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య
కెనడాలో నివసిస్తున్న భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రేవాల్ (Nancy Grewal) దారుణ హత్యకు గురయ్యారు. కెనడాలోని లాసల్లె పోలీసులు ఈ హత్యను నిర్ధారించారు. దర్యాప్తు కొనసాగుతోంది. పంజాబీ మూలానికి చెందిన 45 ఏళ్ల నాన్సీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పంజాబ్లో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను, ముఖ్యంగా ఖలిస్తానీలను విమర్శిస్తూ పాపులర్ అయ్యారు. ప్రసిద్ధి చెందింది.ఈ హత్య కెనడాలోని భారతీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తించింది .ఘటన వివరాలు ఇలా ఉన్నాయి మార్చి 3, 2026, రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో. కెనడాలోని లాసల్లే (LaSalle) నగరంలోని టాడ్ లేన్ (Todd Lane) ప్రాంతంలోని ఆమె నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఎసెక్స్-విండ్సర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మరణించారు.షల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. రాజకీయ అంశాలపై ఆమె చాలా నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. సోషల్ మీడియా వేదికల ద్వారా పలు వివాదాస్పద అంశాలపై స్పందించేవారు. ముఖ్యంగా భారత్-కెనడా ఉద్రిక్తతల మధ్య ఖలిస్తానీ సానుభూతి పరులను ఆమె బహిరంగంగానే ఖండించేవారు. అకాలీదళ్ నాయకత్వంపై, ముఖ్యంగా బిక్రమ్ సింగ్ మజితియాపై ఆమె తరచుగా విమర్శలు చేసేవారు. అలాగే జైలులో ఉన్న ఎంపీ అమృత్పాల్ సింగ్, డేరా బియాస్ అధిపతి గురీందర్ సింగ్ ధిల్లాన్కు వ్యతిరేకంగా కూడా ఆమె మాట్లాడారు. దీంతోపాటు 2025 జూన్లో భటిండాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన మరో ఇన్ఫ్లుయెన్సర్ కాంచన్ కుమారి (కమల్ కౌర్ భాభి) మరణంపై కూడా ఆమె గళమెత్తారు.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్)లాసల్లే పోలీసులు ఈ కేసును యాక్టివ్ ఇన్వెస్టిగేషన్గా పరిగణిస్తున్నారు. టాడ్ లేన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. ప్రస్తుతానికి నిందితుడి ఆచూకీ ఇంకా లభించలేదు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు లేదా 'క్రైమ్ స్టాపర్స్'కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదీ చదవండి: సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా!
రణరక్కసి కోరల్లో ప్రవాసాంధ్రులు
రాజంపేట : పశ్చిమాసియాలో ఇరాన్–ఇజ్రాయల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం ఉమ్మడి కడప జిల్లా వాసులు లక్షలాదిమంది చిక్కుకుపోయారు. దీంతో ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కువైట్, దుబాయ్, సౌదీ, బహ్రెయిన్, ఒమన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన కడప జిల్లా వాసులు సుమారు రెండులక్షల మంది ఉన్నట్టు సమాచారం. ప్రవాసాంధ్రులు 12 లక్షల మంది ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.ఆయా దేశాల్లో యుద్ధం నేపథ్యంలో బాంబుల వర్షం కురుస్తుండడంతో వీరంతా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న బంధువులకు చేరవేస్తున్నారు. జనావాసాల మధ్య క్షిపణులు, బాంబు దాడులు జరుగుతుండడంతో భయం గుప్పెట్లో బతుకుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గదులకే పరిమితం యుద్ధ వాతవరణం నేపథ్యంలో చాలామంది ప్రవాసాంధ్రులు (Telugu NRIs) స్వగ్రామాలకు తిరిగి వచ్చేందుకు సామగ్రితో విమానాశ్రయాలకు వెళ్లినా ఫలితం లేకపోయిందని సమాచారం. విమానాలు రద్దవడంతో ఏం చేయాలో పాలుపోక అక్కడే ఉండిపోయినట్టు తెలుస్తోంది. బాంబు దాడుల నేపథ్యంలో తమ గదులకే పరిమితమవుతున్నట్టు సమాచారం. అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారత రాయబార కార్యాలయాల అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. ప్రవాస భారతీయుల కోసం.. ప్రవాస భారతీయుల కోసం భారత రాయబార శాఖ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఎప్పటికప్పుడు గల్ఫ్దేశాల్లో పరిస్ధితిని సమీక్షిస్తూ, బాధితులకు అవసరమైన సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు ఇప్పటికే వివిధ దేశాల్లో అత్యవసర హెల్ప్లైన్ (Helpline) నంబర్లను అధికారులు ప్రకటించారు. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొటుంటే వెంటనే సంప్రందించాలని కూడా సూచించారు. చదవండి: భారతీయులను రప్పించే ప్రయత్నాలు షురూదోహాలో ఉన్న మా కుమార్తెను క్షేమంగా తీసుకురండి ప్రభుత్వానికి బాధితురాలి తల్లిదండ్రుల విజ్ఞప్తినరసన్నపేట: ఖతర్ రాజధాని దోహాలో తమ కుమార్తె బంకుపల్లి సంజనా చంద్ ఉందని, అక్కడ బాంబు దాడుల నేపథ్యంలో ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతోందని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం సూరజ్ నగర్కు చెందిన బంకుపల్లి చంద్రశేఖర్, సుమబాల ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమార్తెను ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దోహాలో తమ కుమార్తె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోందని పేర్కొన్నారు.జర్మనీ వెళ్తుండగా..బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లా సింగుపురానికి చెందిన వెంకటగౌతం కంపెనీ పనిపై జర్మనీ వెళ్తుండగా మధ్యలో ఖతార్ దేశ రాజధాని దోహాలో దిగి అక్కడ చిక్కుకుపోయాడు.
లండన్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో విషాదం
నిజమాబాద్ జిల్లా: లండన్లో జరిగిన అగ్ని ప్రమాదం ఇద్దరు తెలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ నెల 23న దక్షిణ లండన్లోని క్రోయ్డన్ప్రాంతంలో ఉన్న రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం అంతా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో అందులో నివసిస్తున్న ముగ్గురు తెలుగు విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకున్నారు.ఈ ఘటనలో పెద్దాపురం (కాకినాడ జిల్లా)కు చెందిన గంటి అభిషేక్ అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. నిజమాబాద్ జిల్లాకు చెందిన సాయి శ్రీకర్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీకర్ను అత్యవసర సిబ్బంది ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతడిని బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన శ్రీకర్ శుక్రవారం మృతి చెందాడు. మరో యువకుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం.ముగ్గురు యువకులు ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్కు వెళ్లి, చదువు పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరినట్లు తెలిసింది. క్రోయ్డన్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కలిసి నివసిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీకర్ మృతితో నిజామాబాద్లోని శ్రీనగర్ కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. తమ బిడ్డ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు సహకరించాలని ఆయన తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
క్రైమ్
భర్తను శ్మశానవాటికలో వదిలేసిన భార్య
జగిత్యాల క్రైం: అనారోగ్యంతో ఇంటిపెద్ద మంచానపడగా.. అతడు బతికుండగానే శ్మశానవాటికలో వది లేసిన దీనగాథ పలువురిని కన్నీరు పెట్టించింది. పోషణ భారమవుతోందని సొంతింటి వారే శ్మశానవాటిక లో వదిలివెళ్లిన ఘటన జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాం«దీనగర్కు చెందిన ఎండ్రికాయల శ్రీధర్ది నిరుపేద కుటుంబం. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. శ్రీధర్ జీవనోపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లి మూడు నెలల కిందటే అనారోగ్యం బారిన పడి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. దీంతో భార్య కిరాణం షాపులో పనిచేస్తూ ఇద్దరు కూతుళ్లతో పాటు భర్తను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి శ్రీధర్ ను కుటుంబ సభ్యులు జగిత్యాల పట్టణ శివారులోని శ్మశానవాటికలో వదిలేసి వెళ్లారు. శ్మశానవాటికలో ఒంటరిగా ఉన్న శ్రీధర్ను గమనించిన స్థానిక కౌన్సిలర్ భర్త రాము 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాడు. కనికరం లేకుండా ప్రాణం ఉండగానే శ్మశానవాటికలో వదిలేసి వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై రెవెన్యూ, పోలీసులు జోక్యం చేసుకుని మానవతా దృక్పథంతో శ్రీధర్ను కుటుంబ సభ్యులే పోషించేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
పండుగ వేళ.. తీరని విషాదం
భద్రాచలం అర్బన్/ఉయ్యూరు రూరల్/కుక్కునూరు/మంగళగిరి టౌన్/ఎటపాక: గోదావరి తీరం వెంట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కొల్లుగూడెం దగ్గర గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు ఏపీ వాసులు, ఇద్దరు భద్రాచలం వాసులుగా తేలింది. ముగ్గురి మృతదేహాలు లభించాయి. భద్రాచలం పట్టణానికి చెందిన చారిగుంట్ల శ్రీకర్గుప్తా(21) విజయవాడలోని అమరావతి ఎస్ఆర్ఎమ్ కాలేజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం, పొడిచేటి అభిరామ్(21) భద్రాచలంలో వేద విద్య అభ్యసిస్తున్నారు. వీరు ఏపీ, తెలంగాణ సరిహద్దులోని గోదావరి నదిలో గతంలో దిగిన ఫొటోలను తమ స్నేహితులకు చూపించారు. దీంతో ఆ ప్రదేశం బాగుందని మిత్ర బృందం భావించింది. ఈక్రమంలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్తున్నామని చెప్పి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కనుమూరు గ్రామానికి చెందిన దగ్గుబాటి నవదీప్(19), ఉయ్యూరుకు చెందిన గోక తేజజ్ఞసాయి(19), మదనపల్లెకు చెందిన సతీశ్(19)తో పాటు మరో ఇద్దరు స్నేహితులైన సీహెచ్.దీపక్, గడ్డం హర్షవర్ధన్ ఐదుగురు గురువారం ఉదయం భద్రాచలం చేరుకున్నారు. వీరందరూ విజయవాడ సమీపంలోని విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. స్థానికులైన శ్రీకర్, అభిరామ్తో కలిసి మధ్యాహ్నం భద్రాచలం శ్రీ సీతారాముల వారిని దర్శించుకున్నారు. అనంతరం శుక్రవారం ఉదయం సరదాగా ఫొటోలు దిగేందుకు ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉన్న గోదావరి తీరానికి బయలుదేరారు. లోతు ఉన్న ప్రాంతం కావడంతో.. కొల్లుగూడెం దగ్గర గోదావరి నదిలో నీటి పాయ అవతలి ఒడ్డు(కుక్కునూరు) దిశగా ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నదిలో ఇసుక తిన్నెల్లో సుమారు రెండు కిలోమీటర్లు దూరం నడిచి, నీరు ఉన్న ప్రాంతానికి వారంతా చేరుకున్నారు. వీరు చేరుకున్న ప్రదేశానికి ఎగువన కిన్నెరసాని నది గోదావరిలో కలుస్తుండగా దిగువన కొంత దూరంలో పాములేరు వాగు కలుస్తుంది. దీంతో పెద్ద బండరాళ్లతో కూడిన ఆ ప్రదేశంలో నీరు ఎక్కువగా ఉంది. ఇక్కడ నీటి లోతు ఇరవై అడుగుల పైనే ఉంటుందని అంచనా. ఇది ప్రమాదకర ప్రదేశమని తెలియని విద్యార్థులంతా తమ ఫోన్లు ఒడ్డున ఉంచి నీళ్లలోకి దిగారు.సాయం అందలేదు వారిలో ముందుగా తేజజ్ఞ లోతును అంచనా వేయలేక మునిగిపోయాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఒకరుగా శ్రీకర్గుప్తా, అభిరామ్, నవదీప్, సతీశ్ కూడా మునిగారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ హఠాత్పరిణామంతో నీళ్లలో ఉన్న దీపక్ బయటకు వచ్చాడు. నీళ్లలోకి వెళ్లి గల్లంతవుతున్న వారిని కాపాడేందుకు హర్షవర్ధన్ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అలాగే, భద్రాచలం వైపు ఒడ్డు నుంచి రెండు కిలోమీటర్ల దూరాన ఉండడం, కుక్కునూరు వైపు పూర్తిగా నీరు ఉండడంతో సమీపంలో సాయం చేసే వారెవరూ కనిపించలేదు. కనీసం చేపలు పట్టే వారు కూడా ఆ సమయంలో లేరు. ఉదయం 11గంటలకు గోదావరిలో నీటి పాయ దగ్గరకు చేరుకుంటే కాసేపటికే 11–15 గంటలకు ప్రమాదం జరిగింది. నీళ్లలో మునిగిన స్నేహితులు ఎంతకూ బయటకు రాకపోవడంతో తమ ఫోన్ల ద్వారా 11–30 గంటలకు బయటకు సమాచారం చేరవేశారు.గజ ఈతగాళ్లతో గాలింపుస్నేహితులు ఐదుగురు గల్లంతైన సమాచారాన్ని దీపక్, హర్ష కలిసి శ్రీకర్ గుప్తా తండ్రికి ఫోన్లో చెప్పారు. దీంతో ఆయన భద్రాచలం పోలీసు, అగి్నమాపక శాఖ అధికారులతో పాటు ఎటపాక అధికారులకు కూడా ఫోన్ చేశారు. గజ ఈతగాళ్లతో అక్కడికి చేరుకున్న అధికారులు గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు శ్రీకర్, నవదీప్, అభిరామ్ మృతదేహాలు బయటపడగా.. సతీష్కుమార్, తేజజ్ఞ ఆచూకీ తెలియరాలేదు. ఉయ్యూరు మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతి విషాద చాయలు అలుముకున్నాయి.మృతులు, గల్లంతైన వారి వివరాలు 01) చారుగుళ్ల శ్రీకర్ గుప్తా(21), అమరావతి ఎస్ఆర్ఎమ్లో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: చారుగుళ్ల రామకృష్ణ, భద్రాచలం 02) దగ్గుబాటి నవదీప్(19), విజయవాడ కేఎల్యూలో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: ఫణీంద్రనాథ్, కనుమూరు గ్రామం, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ 03) పొడిచేటి అభిరామ్(19), వేదవిద్య తండ్రి: వంశీ, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ 04) పాశం సతీష్ కుమార్(19), అమరావతి ఎస్ఆర్ఎమ్లో బీటెక్ సెకండ్ ఇయర్ తండ్రి: పాశం నారాయణ, మదనపల్లె, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ 05) గోకా తేజజ్ఞ సాయి(19), అమరావతి ఎస్ఆర్ఎంలో బీటెక్ సెకండ్ ఇయర్ స్వస్థలం: ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్స్థానిక అధికారుల తీరుపై తీవ్ర విమర్శ యువకులు నదిలో గల్లంతైన ఘటనలో ఆంధ్ర అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. యువకులు గల్లంతైన విషయం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు, అధికారులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టగా ఆ తరువాత ఘటనా స్థలానికి ఎటపాక, కుక్కునూరు మండల అధికారులు వచ్చారు. ఈ ప్రాంతం తమ పరిధి కాదంటే.. తమ పరిధి కూడా కాదంటూ వాదించుకున్న తీరు స్థానికంగా వివాదాస్పదంగా మారింది. కనీసం మండల సరిహద్దులు తెలియకుండా అధికారులు విధులు నిర్వహిస్తున్నారా ? అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఆదుకోవాల్సింది పోయి తమ ప్రాంతం కాదంటూ తప్పించుకునే వ్యవహార శైలి సరైనది కాదని విమర్శిస్తున్నారు. అయినప్పటికీ సరిహద్దులు తెలియకుండా పాలనా వ్యవస్థ ఎలా నడిపిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.విద్యార్థుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి సాక్షి, అమరావతి: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరం వద్ద గోదావరి నదిలో స్నానం చేసేందుకు దిగిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు గల్లంతై ముగ్గురు మృతిచెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విషాదకరమని, ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్థులు ఇలా మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం మృతుల కుటుంబాలకు కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా మృతుల కుటుంబాలకు సానుభూతి సాక్షి, అమరావతి: ఎటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలలు.. ఓ వరుడు ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలల్లో ఓ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దుంపటి వినయ్ కుమార్ (31) ఉగాది పండుగ రోజున ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదు. అతడి కోసం బంధువులు గాలిస్తుండగా.. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినయ్ మృతికి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.కాగా, దుంపటి విజయ్, వినయ్ ఇద్దరు కవల సోదరులు. వీరి పోలికలు అచ్చం ఒకేలా ఉంటాయి. వీరి కోసం సంబంధాలు వెతుకుతున్న క్రమంలో తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి కీర్తన, కీర్తి అనే కవల సోదరీమణుల గురించి తెలిసింది. రూపురేఖల్లోనే కాదు, మనస్తత్వాల్లోనూ ఈ రెండు జంటల మధ్య చక్కని అవగాహన కుదరడంతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఒకే ముహూర్తానికి విజయ్-కీర్తన, వినయ్-కీర్తి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి నెల కూడా తిరక్కుండానే కీర్తి భర్త వినయ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
మైనర్లపై వేధింపులు.. అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్
అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్న ముఠాను శాంటా ఫే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయగా, అందులో ఒకరు తెలుగు రాష్ట్రాలకు చెందిన 26 ఏళ్ల బల్కం నాగరాజుగా గుర్తించారు. పోలీసుల ప్రత్యేక విభాగం (Special Victims Unit) ఆన్లైన్లో మైనర్లుగా నటిస్తూ ఈ అండర్కవర్ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకుంటున్న వీడియో సోషల్మీడియాలో వైరలవుతోంది.నాగరాజుపై అమెరికా చట్టాల ప్రకారం కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇలాంటి కేసులు అమెరికాలో అత్యంత కఠినంగా పరిగణించబడతాయి. మైనర్లకు సంబంధించిన నేరాలు అక్కడి చట్టవ్యవస్థలో చాలా తీవ్రమైనవిగా భావించబడతాయి. ఇలాంటి కేసులో ఇరుక్కుంటే, అది కేవలం అరెస్టుతో ముగియదు. బెయిల్ దొరకడం చాలా కష్టం. దీర్ఘకాలికంగా విచారణలు కొనసాగుతాయి. వీసా రద్దు, డిపోర్టేషన్, శాశ్వత నిషేధం వంటి పరిణామాలు ఎదురవుతాయి. భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది.
వీడియోలు
పెద్ది విడుదల మళ్ళీ వాయిదా? వార్తల్లో నిజమెంత?
యువతకు ముష్టి వేస్తున్నారా? జాబ్ క్యాలెండర్ పై జడ శ్రవణ్ రియాక్షన్
హాట్ టాపిక్ కు అడ్డాగా అమెరికా డొనాల్డ్ ట్రంప్ Vs పోప్
ఏపీలో ఈదురుగాలులతో భారీ వర్షాలు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
వలస కూలీలకు గుడ్ న్యూస్ కమర్షియల్ గ్యాస్ పై కేంద్రం కీలక నిర్ణయం
ఆ పేరు ఎత్తలంటేనే సిగ్గుగా ఉంది BR నాయుడుపై శ్యామల ఫైర్
మా భారతమ్మ పై పడి ఏడుస్తారు కదా ఉగాది వేడుకల్లో మరి మీ భార్యలు ఎక్కడ..?
పేర్ని కిట్టు ప్లెక్సీలపై కూటమి నేతల కడుపు మంట
పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారుల అవస్థలు
దాడులను ఖండిస్తూ ఇరాన్ ప్రధానికి మోదీ ఫోన్

