Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

CBN your record in dropping crop rates is unbeatable Says YS Jagan1
బాబు గారు... మీది ‘రికార్డు’ పతనం!

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితులను ప్రస్తావిస్తూ బాబు సర్కార్‌పై తన ఎక్స్‌ ఖాతాలో ధ్వజమెత్తారాయన. చంద్రబాబుగారూ.. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా?. కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా?.... క్వింటా ఉల్లిని రూ.1,200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది?. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్‌లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? మీ తప్పు కాదా చంద్రబాబుగారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయం. అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. చంద్రబాబు గారూ..తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అంటూ పోస్ట్‌ చేశారాయన. .@ncbn గారూ… పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ… pic.twitter.com/swvxxr9hse— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2025

gold and silver rates on 16th september 2025 in Telugu states2
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం కూడా బంగారం ధరలు ఊపందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Who Is Nupur Bora What Assam CM Himanta Biswa Sarma Said About Her3
ఆమె ఇంట నోట్ల కట్టలు.. కేజీల కొద్దీ బంగారం!!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అస్సాం సివిల్‌ సర్వీస్‌ అధికారిణి నుపూర్‌ బోరాను సోమవారం అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె నివాసం నుంచి కిలోల కొద్దీ బంగారం, లక్షల రూపాయల విలువున్న నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అంతేకాదు.. ఆ సమయంలో నోట్ల కట్టలను అధికారులు మెషిన్లతో లెక్కిస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. భారీ అవినీతి ఆరోపణల నడుమ.. చీఫ్‌మినిస్టర్‌ స్పెషల్‌ విజిలెన్స్‌ సెల్‌ బృందం సోమవారం గువాహతిలోని నుపూర్‌ బోరా(28) నివాసంలో తనిఖీలు నిర్వహించింది. అయితే అధికారికంగా రూ.92 లక్షలు విలువ చేసే నగదు, కోటి రూపాయల విలువ చేసే నగలను సీజ్‌ చేశారు. అలాగే.. బార్‌పేటలో ఉన్న అద్దె నివాసం నుంచి మరో రూ.10 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆపై ఆమెను అరెస్ట్‌ చేసి అవినీతి భాగోతం మీద ప్రశ్నిస్తున్నట్లు ప్రకటించింది. గోలాఘట్‌కు చెందిన నుపుర్‌ బోరా.. 2019లో అస్సాం సివిల్స్‌ సర్వీస్‌కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె గోరోయిమరి జిల్లా కంరూప్‌లో సర్కిల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బోరా తన పదవిలో ఉండగా హిందూ భూములను 'సందేహాస్పద వ్యక్తులకు' డబ్బు కోసం బదిలీ చేశారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అంటున్నారు. ఇక.. నుపూర్‌ సహాయకుడిగా పనిచేసిన లాట్ మండల్ సురజిత్ డేకాని కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. బార్‌పేట జిల్లాలో అనేక భూములు అక్రమంగా పొందినట్లు ఆరోపణలు ఈయనపై ఉన్నాయి. నుపూర్‌ కేసులో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. మరోపక్క.. కేఎంఎస్‌ఎస్‌(Krishak Mukti Sangram Samiti) అనే స్థానిక ఉద్యమ సంస్థ ఒకటి కూడా ఆమె అవినీతి భాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.ఆమెపై వస్తున్న భూ సంబంధిత ఆరోపణల నేపథ్యంలో గత ఆరు నెలలుగా నిఘా ఉంచినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. బార్‌పేట రెవెన్యూ సర్కిల్‌లో ఆమె విధుల్లో ఉన్నప్పుడు లంచం తీసుకుని హిందూ ఆలయాల భూములను ఇతరుల పేరిట బదిలీ చేసినట్లు అబియోగాలు ఉన్నాయి. మైనారిటీల జనాభా అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా అవినీతి కార్యకలాపాలు ఎక్కువగా నమోదవుతున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర దుమారం చెలరేగింది. అస్సాంలో అవినీతి రహిత పాలన పేరిట సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్‌ను 2021లో హిమంత బిశ్వ శర్మ ప్రారంభించారు.అధికారుల అక్రమ ఆస్తులపై దాడులు, అవినీతి సంబంధిత కేసుల విచారణ, సున్నితమైన భూమి బదిలీ వ్యవహారాలపై నిఘా.. తదితర అంశాలను ఈ విభాగం చూసుకుంటుంది.

Uttarakhand Dehradun Cloud Burst Tamsa River Red Alert Details4
ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. రెడ్‌ అలర్ట్‌ జారీ

ఉత్తరాఖండ్‌ డెహ్రాడూన్‌ మరోసారి క్లౌడ్‌ బరస్ట్‌ సంభవించింది. సోమవారం అర్ధరాత్రి దాటాక నుంచి కురుస్తున్న కుంభవృష్టితో తమ్సా నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. దీంతో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. వరదల ధాటికి ఇద్దరు గల్లంతు కాగా.. వాళ్ల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. పలు నివాసాలు.. దుకాణ సముదాయాలు నీట మునిగి నాశనం అయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి.రాత్రి కురిసిన వానకు భారీగా వరద చేరడంతో తపకేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం దగ్గర తమ్సా నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో.. నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (DM) కుంకుమ్‌ జోషి పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, పీడబ్ల్యూడీ సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంతో ఇవాళ అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ అధికార యంత్రాంగం ద్వారా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 📍Uttarakhand | #Watch: Torrential rains cause the Tamsa River to overflow, submerging the Tapkeshwar Mahadev Temple in Dehradun📹: ANI/X pic.twitter.com/RPCN37x2k2— Ranveer Singh (@Ranveer6829) September 16, 2025మరోవైపు.. డెహ్రాడూన్‌ క్లౌడ్‌బరస్ట్‌తో రిషికేష్‌లోని చంద్రభాగా నది ప్రవాహం కూడా పెరుగుతోంది. దీంతో తీర ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. నదిలో చిక్కుకుపోయిన ముగ్గురిని రక్షించే ఎన్డీఆర్‌ఎఫ్‌ సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఇంకోవైపు.. పితోరాఘడ్‌ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఉత్తరకాశీ, చమోలీ, రుద్రప్రయాగ, పౌరీ, భాగగేశ్వర్‌, నైనిటాల్‌ జిల్లాల్లో ఈ వర్షాకాలం సీజన్‌లో క్లౌడ్‌ బరస్ట్‌లు సంభవించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటిదాకా ప్రకృతి విపత్తులతో 85 మంది మరణించగా.. 128 మంది గాయపడ్డారు. మరో 94 మంది ఆచూకీ లేకుండా పోయారు. సెప్టెంబర్‌ 11వ తేదీన ప్రధాని మోదీ డెహ్రాడూన్‌ను సందర్శించి.. సహాయక చర్యలను సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు 1,200 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు.

KSR Comment Political Scenirio on Constitutuion5
రాజ్యాంగం కంచెను రాజకీయం మేసేస్తోంది!

దేశంలో రాజ్యాంగం తరచూ అపహాస్యం పాలవుతోంది అనేందుకు ఇదో తాజా ఉదాహరణ. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పదిమంది తాము అదే పార్టీలో ఉన్నామని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు ఇచ్చిన తీరు చూస్తే విస్తుపోవాల్సిందే. బీఆర్‌ఎస్‌ జెండాతో 2023 శాసనసభ ఎన్నికలలో గెలిచిన తరువాత వీరందరూ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన విషయం బహిరంగ రహస్యం. వీరి అనర్హత కోరుతూ బీఆర్‌ఎస్‌ న్యాయస్థానాలను ఆశ్రయించడం.. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ అంశం త్వరగా తేల్చాలని కోరడం అందరికీ తెలుసు. అయితే... చట్టాలు చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తాము అసలు పార్టీ మారనేలేదని బుకాయిస్తూండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు కాస్తా దగ్గరపడటంతో పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ఈ తీరున సమాధానమిచ్చారు. వీరు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి.ఆ ఉప ఎన్నికలలో గెలుస్తామో, లేదో అన్న అనుమానం కావచ్చు.. లేక ఎందుకు ఖర్చు అన్న భావన కావచ్చు. వీరు ఇలా కధ నడుపుతున్నారని అనుకోవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరణకు ప్రతిగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్ సూచన మేరకు మళ్లీ కొత్త సాక్ష్యాధారాలు ఆయన ఆఫీస్‌లో సమర్పించారు. ఇక్కడ చిత్రం ఏమిటంటే ఎమ్మెల్యేలు ఫిరాయించారా? లేదా అన్నదానిపై స్పీకర్‌కు, అన్ని పార్టీలకు క్లారిటీ ఉంటుంది. న్యాయ వ్యవస్థకు కూడా ఇందులో ఉన్న వాస్తవాలనండి, మతలబు అనండి తెలియకుండా ఉండదు. అయినా ఈ డ్రామా అంతా నడవాల్సిందే. అదే మన రాజ్యాంగ బలహీనతేమో! ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్‌ఎస్‌ పక్షాన గెలిచినా, తదుపరి జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2023 శాసనసభ ఎన్నికలలో పోటీ చేశారు. దీంతో దానం పరిస్థితి కాస్త అగమ్యగోచరమే అని చెప్పాలి. అయితే అనర్హత వేటుకు గురి కావాలి. లేదా రాజీనామా చేయాల్సి రావచ్చు. కాకపోతే స్పీకర్ ఎటూ అధికార పార్టీ వారే కాబట్టి కొంతకాలం జాప్యం చేయడానికి యత్నించవచ్చు. స్పీకర్ మరీ ఎక్కువకాలం పెండింగులో పెట్టడం కూడా సాధ్యపడకపోవచ్చు. అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కావ్య తరపున లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేశారు. వీరిద్దరూ నేరుగా ఆధార సహితంగా ఫిరాయించినట్లు కనిపిస్తుండడంతో ఏమి చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. గతంలో పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో నేరుగా చేరకపోయినా, పలు విచారణల తర్వాత ఆలస్యంగా అయినా అప్పటి స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి వారిపై అనర్హత వేటు వేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఈ స్పీకర్ ఎంతకాలం తీసుకుంటారో, ఏమి చేస్తారో చూడాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో భేటీ అయి మంతనాలు సాగించారు.న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకుని ఎనిమిది మందితో స్పీకర్ నోటీసులకు బదులు ఇప్పించారు. ఆ జవాబులు చూస్తే మన ఎమ్మెల్యేలు ఇలా తమను తాము ఆత్మవంచన చేసుకుంటున్నారా? లేక ప్రజలను మోసం చేస్తున్నారా? లేక న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారా? అన్న ప్రశ్నలు వస్తాయి. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని, కేవలం అభివృద్ది కోసమే సీఎంను కలిశామని, ఆ సందర్భంలో సీఎం మర్యాదపూర్వకంగా కండువా కప్పుతుంటే తిరస్కరించడం సంస్కారం కాదని నిరాకరించ లేదని, పైగా అది కాంగ్రెస్ కండువా కాదని బుకాయించారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి తన ఇంటిలో ఇప్పటికీ కేసీఆర్ ఫోటో ఉందని చెప్పారట. అంతేకాక తాను కేటీఆర్‌ను కలిసిన ఫోటోలు కూడా తన సమాధానంతోపాటు జతపరిచారట. కొంతమంది తాను కాంగ్రెస్ లో చేరినట్లు ఫ్లెక్సీలు కట్టారని, వాటితో తనకు సంబంధం లేదని, దాని ఆధారంగా తనపై ఫిరాయింపు ఆరోపణ చేశారని ఆయన వివరణ ఇచ్చారట. ఇవన్ని చూస్తుంటే తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకని అన్నట్లుగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పీకర్‌గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరు కావడం విశేషం. స్పీకర్‌గా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు, ఇతర పార్టీల వారిని కూడా బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు స్వయంగా పోచారమే పార్టీ ఫిరాయించి, తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతుండడం విశేషం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం టీఆర్ఎస్‌లో చేరడానికి ముందు పదవికి రాజీనామా చేశారు. కాని ఇప్పుడు మాత్రం వెనుకాడుతున్నారన్న విమర్శ ఎదుర్కొంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తప్ప మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ సీనియర్లే. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య గతంలో కాంగ్రెస్ పక్షాన గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరితే, ఈసారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి అనధికారికంగా మారారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొద్ది రోజుల క్రితం గండిపేట వద్ద జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తూ వివిధ పత్రికలలో ఫుల్ పేజీ ప్రచార ప్రకటనలు కూడా ఇచ్చారు. అయినా బీఆర్ఎస్ లోనే ఉన్నానని వివరణ ఇచ్చారు. వీరు తమంతట తాముగా రాజీనామా చేసినా, లేదా కాంగ్రెస్ నాయకత్వం రాజీనామా చేయించినా బాగుండేది. కాంగ్రెస్ అధిష్టానం బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఒకపక్క విమర్శలు చేస్తూ, మరో పక్క తెలంగాణలో అదే రకంగా వ్యవహరించడం ఏపాటి విలువలతో కూడినదన్న ప్రశ్న వస్తుంది. మరో సంగతి ఏమిటంటే ఒక ఇంటర్వ్యూలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి పది మంది తమ పార్టీలోకి వచ్చారని చెప్పారట. దానిని సాక్ష్యంగా తీసుకోవాలని, అప్రూవర్ గా ఆయనను పరిగణించాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ డిమాండ్ చేశారు. ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేస్తూ రాజ్యాంగం పుస్తకం పట్టుకుని టూర్ చేస్తున్నారని, తెలంగాణలో ఎమ్మెల్యేల చోరీని ఎలా సమర్థిస్తారని కేటీఆర్‌ ప్రశ్నించారు. రేవంత్ ఆధ్వర్యంలోనే ఇలా జరుగుతున్నాయని కాదు. గతంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీల ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ కింద బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. అప్పుడు కూడా కొందరికి ఆయన బీఆర్‌ఎస్‌ కండువా కప్పారు.అయినా వారిలో ఎవరిపైన అనర్హత వేటు పడలేదు.అప్పట్లో బీఆర్‌ఎస్‌ విలీనం డ్రామా నడిపితే, దానికి ఆనాటి స్పీకర్ పోచారం ఆమోద ముద్రవేశారు. బీజేపీ కేంద్రంలో కాని, కొన్ని రాష్ట్రాలలో కాని పిరాయింపులను ప్రోత్సహించడం లేదా అన్న ప్రశ్న వస్తుంది. 2014 టర్మ్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్శించి వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. దానిపై న్యాయపోరాటం జరిగినా అది ఒక కొలిక్కి రాలేదు. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ వైఎస్ జగన్ ఆనాటి రాజకీయ పరిణామాలలో పార్టీని వీడినప్పుడు రాజీనామా చేసి కడప నుంచి పోటీ చేసి ఎంపీగా తిరిగి గెలిచారు. అలాగే ఆయన పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో పోటీ చేశారు. వారిలో 15 మంది విజయం కూడా సాధించారు. ముగ్గురు ఓటమి చెందారు.అయినా విలువలకు కట్టుబడి ఉన్నట్లు గుర్తింపు పొందారు. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం చివరికి ఏ రూపు దాల్చుతుందో, అది ఎప్పటికి తేలుతుందో చెప్పలేకపోయినప్పటికి, సుప్రీం కోర్టు ఆదేశాల వల్ల ఈ నోటీసుల తతంగం అయినా సాగుతోందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ ఫిరాయింపు రాజకీయాలపై ప్రజలలో వ్యతిరేకత ఉన్నప్పటికీ, వారెవ్వరూ గట్టిగా నిరసన చెప్పలేని స్థితి ఉంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

India wrong for refusing handshake with Pakistan: Manoj Tiwary6
పాకిస్తాన్‌తో ఆడితే తప్పు కాదా? షేక్‌ హ్యాండ్‌ ఇస్తేనే తప్పా?: మనోజ్‌ తివారీ

ఆసియాక‌ప్‌-2025లో పాకిస్తాన్ జ‌ట్టుతో సంప్రదాయ కరచాలనాన్ని టీమిండియా ఆట‌గాళ్లు తిర‌ష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఖండాంతర టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదిక‌గా చిర‌కాల ప్ర‌త్య‌ర్ధులు మ‌ధ్య పోరు జ‌రిగింది. అయితే ఈ మ్యాచ్ టాస్ ద‌గ్గ‌ర నుంచి ఆట ముగిసే వ‌ర‌కు భార‌త జ‌ట్టు పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌తో అంటిముట్ట‌న‌ట్టు ఉన్నారు.తొలుత టాస్ సంద‌ర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌.. పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘాకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాక‌రించాడు. అనంత‌రం మ్యాచ్ ముగిశాక కూడా క‌ర‌చాల‌నం చేసేందుకు భార‌త జ‌ట్టు ఇష్ట‌ప‌డలేదు. దీంతో భార‌త జ‌ట్టు తీసుకున్న ఈ నిర్ణ‌యంపై దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.కానీ భార‌త మాజీ క్రికెట‌ర్ మ‌నోజ్ తివారీ మాత్రం టీమిండియా మెనెజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టాడు. పాకిస్తాన్‌తో ఆడాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు, షేక్ హ్యాండ్ ఇస్తే త‌ప్పు ఏముంద‌ని తివారీ అన్నాడు. అయితే పాకిస్తాన్ మ్యాచ్‌తో భార‌త్‌ బ‌హిష్క‌రించాల‌ని తివారీ ముందే నుంచే త‌న వాద‌న వినిపిస్తూ వ‌స్తున్నాడు."నేను భార‌త్ వ‌ర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌తో ఆసియాక‌ప్ మొత్తాన్ని బాయ్‌క‌ట్ చేస్తున్నాను. ఎందుకంటే క్రికెట్ అనేది కేవ‌లం ఒక క్రీడ మాత్ర‌మే. క్రీడ‌ల‌కు ఇచ్చిన విలువ జీవితాల‌కు ఇవ్వ‌డం లేదు. ఇది నాకు న‌చ్చ‌డం లేదు. మనం మానవ జీవితాలను క్రీడలతో పోల్చ‌డం స‌రి కాదు" అని పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు తివారీ స్టెట్‌మెంట్ ఇచ్చాడు.ఇప్పుడు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన తివారీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. "పాక్ ఆట‌గాళ్ల‌తో హ్యాండ్‌ షేక్‌ను తిరష్కరించడం సరైన నిర్ణయం కాదు. మీరు పాకిస్తాన్‌తో ఆడాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. హ్యాండ్ షేక్ చేస్తే త‌ప్పు ఏముంది. పాక్‌తో మ్యాచ్‌ను బ‌హిష్క‌రించి మీరు ఏది చెప్పినా ప్ర‌జులు న‌మ్మేవారు.ఈ టోర్నీ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో సూర్యకుమార్ యాద‌వ్‌.. పాకిస్తాన్ కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ వీడియోను నేను చూశాను. మరి అప్పుడు ఎలా క‌రచాల‌నం చేశారు. ఆ సమయంలో మీకు తప్పు అన్పించలేదా? అంటే ఇప్పుడు విమర్శకుల‌ నుంచి తప్పించుకోవడం కోసం నో హ్యాండ్ షేక్ నిర్ణ‌యం తీసుకున్నారా? ముందే వారి కెప్టెన్‌, చైర్మెన్‌కు హ్యాండ్ షేక్ ఇచ్చి ఇప్పుడు మ్యాచ్‌లో తిర‌ష్క‌రించి ఏమి సాధించారో నాకు ఆర్ధం కావ‌డం లేదు. విమ‌ర్శ‌కుల నుంచి తామును తాము ర‌క్షించుకోవ‌డానికే ఈ విజయాన్ని పహల్గామ్ బాధితులకు, భారత సాయుధ దళాలకు అంకితం చేస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు" అని ఇన్‌సైడ్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు.చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్‌?

Indian Students Select New Countries For it New Courses7
విదేశీ విద్య: కొత్త కోర్సులు.. సరికొత్త దేశాలు

విదేశాల్లో చదువుకోవాలని ఎవరికి ఉండదు? అక్కడే చదువుకుని, స్థిరపడాలన్నదీ కోట్లాదిమంది భారతీయుల కల. యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియాలోని పేరొందిన యూనివర్సిటీలకు వెళ్లడం అనేది గతం. ఇప్పుడు ట్రెండ్‌ క్రమంగా మారుతోంది. సంప్రదాయ దేశాలకు బదులుగా భారతీయ విద్యార్థులు నూతన గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు.ఎంబీబీఎస్‌ విద్య కోసం మధ్య ఆసియాలోని కిర్గిస్తాన్‌ ఇంజనీరింగ్‌ కోసం కంబోడియా, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ చదివేందుకు మాల్టా, సాంస్కృతిక అధ్యయనాల కోసం ఉత్తర కొరియాకు చలో అంటున్నారు మన విద్యార్థులు. దేశీయంగా తీవ్రమైన పోటీ, అమెరికాలో రోజుకో రకంగా మారుతున్న విధానాలు; ఆస్ట్రేలియా, బ్రిటన్‌ వంటి దేశాల్లో వలసలపై పెరుగుతున్న వ్యతిరేకత, వీసాల లభ్యత కఠినతరం కావడం; పలు ఇతర దేశాల్లో విద్యా వ్యయాలు పెరుగుతుండడం.. వీటన్నింటి కారణంగా నూతన కోర్సుల కోసం కొత్త దేశాల బాట పడుతున్నారు.సరికొత్త గమ్యస్థానాలుమాల్టా, పోలాండ్, లాత్వియా, సైప్రస్‌ వంటిచిన్న యూరోపియన్‌ దేశాలు వివిధ ప్రోగ్రామ్స్‌లో భారతీయులు సహా విదేశీయులకు సులభంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. అలా అక్కడ చదివిన గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు, అధునాతన డిగ్రీల కోసం ఫ్రాన్‌ ్స, జర్మనీ, యూకే, మధ్యప్రాచ్యాలకు వెళ్తున్నారు. రొమేనియా, బల్గేరియా, హంగేరీలలోని భారతీయ ఇంజనీరింగ్‌ విద్యార్థులు చౌకైన స్థానిక ప్రోగ్రామ్స్‌లో చేరుతున్నారు. కానీ చాలామంది అధిక జీతాలు, అంతర్జాతీయ ఎక్స్‌పోజర్‌ కోసం జర్మనీ, నెదర్లాండ్స్, స్కాండినేవియాకు మారుతున్నారు. అలాగే బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్‌లలో ఎంబీబీఎస్‌ చేసినవాళ్లు.. ఎక్కువ జీతాల కోసం మధ్య ప్రాచ్యదేశాలకు మరలుతున్నారు.లైటింగ్, లైట్‌ డిజైన్‌ఆర్కిటెక్చరల్, వేడుకల కోసం వేదికలు, నగరాల్లోని భవంతుల్లో లైటింగ్‌ కోసం కళాత్మకతను సాంకేతికతతో జోడించేలా శిక్షణ పొందడం. కేంద్రాలు: మిలాన్‌ (ఇటలీ), బిల్‌బావ్‌ (స్పెయిన్‌ ), స్టాక్‌హోం (స్వీడన్‌ ).మ్యూజిక్‌ థెరపీ భావోద్వేగ,ఆలోచన, శారీరక స్వస్థత కోసంసంగీతాన్ని వైద్యసాధనంగాఉపయోగించడం.కేంద్రాలు: లిమెరిక్‌(ఐర్లాండ్‌), నెదర్లాండ్స్‌.క్రూజ్‌ లైన్‌ నిర్వహణ ప్రపంచ క్రూజ్‌ పరిశ్రమ కోసం రూపొందించినప్రత్యేక ఆతిథ్య, కార్యకలాపాలకు సంబంధించిన విద్యా కార్యక్రమాలు. కేంద్రాలు: స్పెయిన్,స్విట్జర్లాండ్‌మాలిక్యులర్‌ గ్యాస్ట్రోనమీ నురగ (ఫోమ్‌), జెల్స్‌తదితరాలతో రుచులు, భోజన అనుభవాలను మార్చడానికి శాస్త్రాన్ని ఉపయోగించడం.కేంద్రాలు:స్పెయిన్, జపాన్,నెదర్లాండ్స్‌గేమ్‌ డిజైనింగ్‌గ్రీన్‌ సప్లై చైన్‌ పర్యావరణ అనుకూల, సమర్థవంతమైన, తక్కువ కర్బన ఉద్గారాలున్న రవాణా వ్యవస్థల రూపకల్పనకేంద్రాలు: స్వీడన్,డెన్మార్క్, నెదర్లాండ్స్‌వీడియో గేమ్స్‌ను సృష్టించడం, అభివృద్ధి, తయారీ; కేంద్రాలు: ఫిన్లాండ్‌హ్యుమానిటేరియన్‌ లాజిస్టిక్స్‌ విపత్తుల నుంచి ఉపశమనం, సహాయం, పంపిణీ, సంక్షోభ సమయంలో ప్రతిస్పందన కోసం సరఫరా వ్యవస్థల నిర్వహణకేంద్రాలు: ఫిన్లాండ్, బెల్జియం,స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికాసరఫరాను మించిన డిమాండ్‌ఈ ఏడాది 22 లక్షలకు పైగా నీట్‌ అభ్యర్థులు.. భారత్‌లో కేవలం 1.18 లక్షల ఎంబీబీఎస్‌ సీట్ల కోసం పోటీ పడ్డారు. అంటే అంతరం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే విద్యార్థులు సంప్రదాయేతర దేశాలవైపు చూస్తున్నారు.చౌకైన ఎంపికభారత్‌లోని ప్రైవేట్‌ కళాశాలలతో పోలిస్తే ‘చాలా తక్కువ ఖర్చు’తో.. ఎంబీబీఎస్‌విద్యార్థులను తూర్పు యూరప్, మధ్య ఆసియా దేశాలు ఆకర్షిస్తున్నాయి. ఉజ్బెకిస్తాన్‌ ఒక్కటే 6వేలకుపైగా విద్యార్థులకు ఆతిథ్యం ఇస్తోంది. విజయవాడ, వరంగల్, తిరుపతి వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఇప్పుడు విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఏజెన్సీలు చెబుతున్నాయి.ఖర్చు ఎంతంటే?భారత్‌ (ప్రైవేట్‌లో ఎంబీబీఎస్‌):పూర్తి డిగ్రీకి రూ.1 కోటికిపైగాఉజ్బెకిస్తాన్‌/రష్యా/ఫిలిప్పీన్‌పూర్తి ఎంబీబీఎస్‌కు రూ.15–35 లక్షలుపోలండ్‌/చెక్‌ రిపబ్లిక్‌: ఏడాదికి రూ.9.5–17.5 లక్షలు (ట్యూషన్‌+జీవన వ్యయం)జర్మనీ (ప్రభుత్వ విశ్వవిద్యాలయం):సంవత్సరానికి రూ.30,000-సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

Manchu Lakshmi Comments her debits8
అప్పుల్లో మంచు లక్ష్మీ .. ఆ ఇల్లు నా సొంతం కాదంటూ క్లారిటీ

మంచు లక్ష్మీ ప్రసన్న (Lakshmi Manchu) తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటి, నిర్మాత, టీవీ ప్రెజెంటర్‌గా పేరు పొందారు. చాలారోజుల తర్వాత ఆమె 'దక్ష' అనే యాక్షన్‌ సినిమాలో నటించారు. శ్రీలక్ష్మిప్రసన్న పిక్చర్స్‌, మంచు ఎంటైర్టెన్మెంట్స్‌ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. తనకు అప్పులు ఉన్నాయనే రూమర్స్‌ గురించి క్లారిటీ ఇచ్చారు.ఆ ఇంటితో నాకు సంబంధం లేదుమంచు లక్ష్మీ సుమారు రెండేళ్ల క్రితమే హైదరాబాద్‌ నుంచి ముంబై షిఫ్ట్‌ అయిపోయారని తెలిసిందే. అయితే, హైదరాబాద్‌లోని తన ఇల్లు అమ్మకానికి పెట్టారని, చాలా అప్పులు ఉన్నాయని రూమర్స్‌ వచ్చాయి. ఇదే విషయం గురించి తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'హైదరాబాద్‌లో నాకు ఇల్లు లేదు. అసలు నేను విక్రయించేందుకు ఇక్కడ ఇల్లు ఉండాలి కదా.. ఫిలిం నగర్‌లో ఉన్న నివాసం నాది కాదు. అక్కడ కేవలం ఉండేదానిని మాత్రమే.. ఆ ఇంటి గురించి వివరాలు కావాలంటే మా నాన్నను అడగండి చెప్తారు. ఆ ఇంటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఆ ఇంట్లో ఉండేందుకు నాన్న ఇచ్చారు. ఆ ఆస్థి నాది కాదు, నాన్నకు సొంతం. నా ఇష్ట ప్రకారమే ముంబై వెళ్లిపోయాను. అక్కడ ఇంటి అద్దె చెల్లించడానికి ఇబ్బందిగా ఉన్నా సరే ఉన్నంతలో సరిపెట్టుకుంటున్నాను. డబ్బు సాయం చేయమని నాన్నను అడగలేదు. సినిమాలు, షోల ద్వారా వచ్చిన డబ్బుతో ముందుకు వెళ్తున్నాను.' అని లక్ష్మీ ప్రసన్న చెప్పారు.మొదటి నుంచి మంచు లక్ష్మీ తన కష్టంతో వచ్చిన డబ్బుతోనే ముందుకు వెళ్లాలి అనుకునే సంకల్పంతో ఉంటారు. అమెరికాలో ఆమె చదువుతున్నరోజుల్లో కూడా పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసేవారని తెలిసిందే. తన తండ్రి వారసత్వం కంటే తనలోని టాలెంట్‌తోనే ఆమె గుర్తింపు పొందారు. ఆమె బహుముఖ ప్రతిభ కలిగిన వ్యక్తిగా, భారతీయ సినిమాతో పాటు అమెరికన్ టెలివిజన్‌లో కూడా తన ప్రతిభను చాటారు. మంచు లక్ష్మీ తన వ్యక్తిత్వం, ధైర్యం, బలమైన అభిప్రాయాలతో తెలుగు సినీ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారనిది వాస్తవం అని చెప్పొచ్చు.

IAS officer Saumya Jha AI-led Padhai With AI programme helps Rajasthan government schools9
మ్యాథ్స్‌ విత్‌ ఏఐ పఢాయి... హాయి

‘సైంటిస్ట్‌ కావాలి’ ‘ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావాలి’... ఇలా ఆ పిల్లలకు ఎన్నో కలలు ఉన్నాయి. అయితే ఆ కలలకు అడ్డుగోడ గణితంపై వారికి ఉండే భయం. ‘పఢాయి విత్‌ ఏఐ’ అనే ఏఐ సాంకేతిక కార్యక్రమంతో పిల్లల్లో గణితంపై ఉండే భయాన్ని పోగొట్టింది ఐఏఎస్‌ అధికారి సౌమ్య ఝా. ‘పఢాయి విత్‌ ఏఐ’ పుణ్యమా అని పిల్లలకు ఏఐ అంటే భయం పోయింది. నైపుణ్యం సొంతం అయింది.రాజస్థాన్‌లోని టోంక్‌కు చెందిన అమన్‌ గుజర్‌ అనే విద్యార్థికి గణితం అంటే వణుకు. చాలా కష్టంగా, ఒత్తిడిగా అనిపించేది. గణితంలో ఎప్పుడూ బొటాబొటీ మార్కులు వచ్చేవి. అయితే అతడి భయానికి ‘పఢాయి విత్‌ ఏఐ’ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. గణితం అంటే భయాన్ని పోగొట్టి, ఉత్సాహాన్ని పెంచింది.‘పఢాయి విత్‌ ఏఐ’ అంటే?అమన్‌ చదివే స్కూల్‌లో ‘పఢాయి విత్‌ ఏఐ’ పేరుతో ఏఐ ఆధారిత విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎంత క్లిష్టమైన గణిత సమస్యలనైనా సులభంగా అర్థమయ్యేలా విద్యార్థులకు వివరిస్తుంది. ‘గణితం అంటే ఒకప్పుడు ఉండే భయం ఏమాత్రం లేదు. ఇప్పుడు నాకు గణితం అనేది ఒక సబ్జెక్ట్‌ కాదు. ఆట. గణితంలోనూ మంచి మార్కులు సాధించడం నాకు ఎంతో గర్వంగా ఉంది. నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలనే ఆత్మవిశ్వాసం వచ్చింది’ అంటున్నాడు అమన్‌.ఐఏఎస్‌ అధికారి సౌమ్య ఝా ఆలోచన నుంచి పుట్టిందే... పఢాయి విత్‌ ఏఐ. ఆమె టోంక్‌ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించినప్పుడు చాలామంది విద్యార్థులు గణితం, సైన్స్‌ సబ్జెక్ట్‌లలో వెనకబడి ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకుంది. చాలామంది విద్యార్థులు గణితంలో ఎందుకు వెనకబడిపోయారు? అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించింది సౌమ్య. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నికల డ్యూటీ, రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఉపాధ్యాయులు ఎక్కువ రోజులు బడికి దూరంగా ఉంటున్నారు.స్కూలు విద్యార్థులలో చాలామంది వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయం అందించడానికి తరచు బడికి గైర్హాజరు అవుతుంటారు. గ్యాప్‌ రావడం వల్ల వారికి పాఠాలు అర్థం కావు. ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని సాంకేతికతకు మానవ ప్రయత్నాన్ని జోడిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ‘పఢాయి విత్‌ ఏఐ’ కార్యక్రమానికి రూపకల్పన చేసింది సౌమ్య.ఐఏఎస్‌ తొలిరోజులలో కొన్ని సబ్జెక్‌లకు సంబంధించి తాను ఏఐ (ఆర్టిషిఫియల్‌ ఇంటెలిజెన్స్‌) సహాయం తీసుకునేది. ఆ విషయం గుర్తు తెచ్చుకొని, ఏ సబ్జెక్ట్‌ గురించి అయితే విద్యార్థులు భయపడుతున్నారో, ఆ భయాన్ని పోగొట్టడానికి ‘ఏఐ’ని అస్త్రంలా వాడాలని నిర్ణయించుకుంది.గత సంవత్సరం పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ‘పఢాయి విత్‌ ఏఐ’ని సరికొత్త మార్పులు చేర్పులతో ఈ సంవత్సరం ‘వెర్షన్‌–2’గా లాంచ్‌ చేశారు. ఈ అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌లో టీచింగ్‌ క్యాలెండర్, విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక సాంకేతిక పరికరాలు, ప్రతి వారం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ‘పఢాయి విత్‌ ఏఐ’ని టోంక్‌ జిల్లాలోని 350కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థులలో వచ్చిన మార్పు గురించి చాలా సంతోషంగా ఉన్న సౌమ్య ఝా – ‘ఇదేమీ మాయాజాలం కాదు. మానవ ప్రయత్నానికి తోడైన సాంకేతిక అద్భుతం’ అంటుంది.

Eluru Govt Medical College established during YS Jagans tenure10
ఇదిగో.. ప్రభుత్వ వైద్య కళాశాల..‘మీ కళ్ళకు కనిపిస్తోందా’?

ఏలూరు టౌన్‌ : ‘ఇదిగో.. చంద్రబాబు గారూ... ఏలూరులో వైఎస్‌ జగన్‌ హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనం.. కూటమి నేతలూ... చూశారా’ అంటూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆ భవనాల వద్ద సెలీ్ఫలు దిగారు. ఏలూరు జిల్లాకే ప్రతిష్టాత్మకంగా.. జిల్లా ప్రజల చిరకాల కోరికను నెరవేర్చుతూ వైఎస్సార్‌సీపీ హయాంలో ఈ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక్క మెడికల్‌ కాలేజీ కట్టలేదంటూ చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తోన్న తరుణంలో వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకా‹Ù, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఏలూరులోని మెడికల్‌ కాలేజీని సోమవారం సందర్శించారు. అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్‌ తరహా లుక్‌తో మెరిసిపోతున్న వైద్య కళాశాల భవనాలను రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. ‘మీ కళ్ళకు కనిపిస్తోందా?’ అంటూ.. వీడియోలు, సెలీ్ఫలు దిగారు. జోహార్‌ వైఎస్సార్‌.. జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. కూటమి నేతలు చేస్తున్నట్లు ఇది గ్రాఫిక్స్‌ కాదంటూ మెడికల్‌ కాలేజీ భవనం వద్ద ఫొటోలు తీశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సు«దీర్‌బాబు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణే‹Ù, అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్, ఎస్సీ సెల్‌ కార్యదర్శి ఇమ్మానుయేల్, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీ‹Ù, బీసీ సెల్‌ కార్యదర్శి కొల్లిపాక సురేష్‌, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్‌జాబ్‌ తదితరులు పాల్గొన్నారు. 300 మంది విద్యార్థులు చదువుతున్నారు: ప్రిన్సిపాల్‌ ఏలూరులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనం ప్రారంభించి రెండేళ్లు పూర్తయ్యింది. 2023 సెప్టెంబర్‌ 2న ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం క్లాస్‌లు ప్రారంభించగా.. రెండేళ్లు పూర్తవడంతో వైఎస్సార్‌సీపీ నేతలు మెడికల్‌ కాలేజీ వద్ద కేక్‌ కట్‌ చేసి వేడుకలు చేసుకున్నారు. వైద్య విద్యార్థులకు, కాలేజీ ప్రొఫెసర్లు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కాలేజీలోని మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. కళాశాలలో అత్యాధునిక డిజిటల్‌ క్లాస్‌రూంలు, ల్యాబ్స్, టీచింగ్‌ రూమ్స్‌ పరిశీలించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సావిత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కళాశాల నిర్వహణపై పలు అంశాలు అడిగి తెలుసుకున్నారు. 2023 సెప్టెంబర్‌ 2న 150 మంది ఎంబీబీఎస్‌ వైద్య విద్యార్థులతో క్లాస్‌లు ప్రారంభించారని, 2024లో మరో 150 మంది చేరారని, ప్రస్తుతం 300 మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. జగన్‌ చెప్పింది చేసి చూపిస్తారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేబితే చేసి చూపిస్తారు. గ్రాఫిక్స్‌ చేయడం మాకు చేతకాదు. 2022 నవంబర్‌లో మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభించి 2023 సెపె్టంబర్‌ 2 నాటికే క్లాస్‌లు ప్రారంభించేలా పూర్తి చేసి చూపించారు. రూ.60 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి మెడికల్‌ కాలేజీని నిర్మించారు. రెండేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా కేక్‌ కట్‌ చేసి వేడుకలు చేసుకున్నాం. వైద్య విద్యార్థులు, మెడికల్‌ కాలేజీ స్టాఫ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాం. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు రూ.8500 కోట్లతో ప్రణాళిక రూపొందించి, తొలి దశలో ఐదు మెడికల్‌ కాలేజీలు ప్రారంభించారు. – మామిళ్ళపల్లి జయప్రకాష్‌ , ఏలూరు సమన్వయకర్తప్రైవేటు పరం చేయటం న్యాయమా? వైఎస్సార్‌సీపీ హయాంలో ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు అనుమతులు తెచ్చిన గొప్ప నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్‌ కాలేజీలను అధికారంలో ఉండగానే ప్రారంభించగా.. ఎన్నికల నాటికి పాడేరు, పులివెందుల మెడికల్‌ కాలేజీలు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఒక్క కొత్త భవనం నిర్మించారా?. జగన్‌ హయాంలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలు, విలేజ్‌ క్లీనిక్స్‌ నిర్మించారని, కూటమి నేతలు ఒక్క కొత్త భవనం నిర్మించారా? ప్రజలకు మంచి చేయటానికి ప్రయత్నం చేయాలి. – కొఠారు అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement