టెస్టుల్లో తడబాటు... పరిమిత ఓవర్లలో పైచేయి...
సాక్షి క్రీడా విభాగం : ఇంగ్లండ్లో యువ జట్టుతో ఓటమి లేకుండా తిరిగొచ్చామని సంబరం ఒకవైపు, సొంతగడ్డపై పాతికేళ్ల తర్వాత సఫారీలకు సిరీస్ కోల్పోయిన పరాభవం మరోవైపు.... వన్డేల్లో పుష్కర కాలం తర్వాత ఐసీసీ ట్రోఫీ ఆనందాన్ని పంచితే... టి20ల్లో అజేయ ఆటతో ఆసియా కప్ గెలుచుకొని ఈ ఫార్మాట్లో మన స్థాయి కనిపించింది. మొత్తంగా 2025లో భారత క్రికెట్ జట్టు మిశ్రమ ఫలితాలు సాధించింది. టెస్టుల్లో ప్రదర్శన కాస్త అసంతృప్తిని మిగల్చగా... పరిమిత ఓవర్ల క్రికెట్లో వరుస విజయాలతో ప్రత్యర్థులపై పైచేయి చూపించింది. మరోవైపు పురుషులకు ఏమాత్రం తగ్గని రీతిలో భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ టైటిల్ సాధించడం అన్నింటికంటే చిరస్మరణీయ ఘట్టం. కెప్టెన్ శుబ్మన్ గిల్ ముద్ర... సిడ్నీలో ఆ్రస్టేలియాతో ఐదో టెస్టుతో ఈ ఏడాది మొదలైంది. ఈ మ్యాచ్లో ఓటమితో సిరీస్ 1–3తో చేజారింది. అయితే 32 వికెట్లతో బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. పేలవ బ్యాటింగ్తో జట్టుకు భారం కాలేనంటూ రోహిత్ శర్మ స్వయంగా మ్యాచ్కు ముందు తప్పుకోవడం చర్చకు దారి తీసింది. చివరకు ఇదే అతని ఆఖరి టెస్టుగా మారగా, కొన్నాళ్ల తర్వాత సరిగ్గా ఇంగ్లండ్తో సిరీస్కు ముందు మరో స్టార్ కోహ్లి కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొత్త కెప్టెన్గా శుబ్మన్ గిల్ నాయకత్వంలో సీనియర్లు లేకుండా అంచనాలు లేకుండా ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు అద్భుతమే చేసింది. నాలుగు టెస్టుల తర్వాత 1–2తో వెనుకబడి సిరీస్ కోల్పోయే స్థితిలో పడిన జట్టు ఓవల్లో జరిగిన ఆఖరి టెస్టులో మొహమ్మద్ సిరాజ్ అసాధారణ బౌలింగ్తో అనూహ్యంగా 6 పరుగులతో నెగ్గి సంతృప్తిగా 2–2తో ముగించింది. బ్యాటర్గా 4 సెంచరీలు సహా ఏకంగా 754 పరుగులు చేసిన గిల్, ఇటు కెప్టెన్గా తొలి సిరీస్ను ఘనంగా ముగించాడు. ఆ తర్వాత స్వదేశంలో బలహీన వెస్టిండీస్పై 2–0 సిరీస్ గెలుచుకోవడం ఎవరినీ ఆశ్చర్యపర్చలేదు. అయితే ఇంగ్లండ్ గడ్డపై వచి్చన పేరు కాస్తా సొంతగడ్డపై భారత జట్టు చేజార్చుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో టెస్టు సిరీస్ను కోల్పోవడం ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. మన గడ్డపై సఫారీల చేతిలో పాతికేళ్ల తర్వాత జట్టు సిరీస్ ఓడింది. ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఇదే తరహా 0–3 పరాజయాన్ని గుర్తుకు తెచి్చన టీమ్ మేనేజ్మెంట్ తీవ్ర విమర్శలకు గురైంది. కోచ్ గౌతమ్ గంభీర్ జట్టును నడిపిస్తున్న శైలిపై చర్చకు దారి తీసింది. మొత్తంగా ఈ ఏడాది 4 టెస్టులు గెలిచిన జట్టు 5 ఓడింది. రోహిత్ ఖాతాలో మరో ఐసీసీ టైటిల్... వన్డేల్లో భారత్ గుర్తుంచుకోదగ్గ ఏడాదిగా 2025 నిలిచింది. ముందుగా స్వదేశంలో ఇంగ్లండ్పై 3–0తో సిరీస్ గెలుచుకున్న టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటింది. వరుసగాఆడిన ఐదు మ్యాచ్లలోనూ (బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్లపై) నెగ్గి విజేతగా నిలిచింది. 2013 తర్వాత భారత్ గెలుచుకున్న ఐసీసీ వన్డే టోర్నీ ఇదే కావడం విశేషం. 2024 టి20 వరల్డ్ కప్లో భారత్ను విజేతగా నిలిపిన రోహిత్ ఏడాది తిరిగేలోగా మరో ఐసీసీ ట్రోఫీని అందించి తన ఘనతను ప్రదర్శించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్లో అనూహ్యంగా రోహిత్ను తప్పించిన సెలక్టర్లు గిల్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈ సిరీస్ను జట్టు 1–2తో కోల్పోయింది. అయితే సరిగ్గా ఇక్కడి నుంచే రోహిత్, కోహ్లిల భవిష్యత్తుపై చర్చ మొదలైంది. కోహ్లి రెండు డకౌట్ల తర్వాత అర్ధసెంచరీ సాధించగా, రోహిత్ ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచి తన విలువను చూపించాడు. అనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగి వన్డే సిరీస్ను జట్టు 2–1తో గెలుచుకుంది. అయితే ఈ సారి కోహ్లి వంతు వచ్చింది. 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీలతో 302 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలవడంతో కోహ్లి, రోహిత్ల గురించి చర్చకు ఫుల్స్టాప్ పడింది. మొత్తంగా 11 మ్యాచ్లు గెలిచిన టీమ్ 3 ఓడింది. అభిషేక్ శర్మ అదరహో... టి20 ఫార్మాట్లో 2024లో వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టు అదే జోరును ఈ ఏడాదీ కొనసాగించింది. సొంతగడ్డపై ఇంగ్లండ్పై 4–1తో సిరీస్, ఆ్రస్టేలియా గడ్డపై 2–1తో సిరీస్, మళ్లీ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 3–1 సిరీస్... ఇలా ఆడిన మూడు సిరీస్లూ జట్టు గెలుచుకుంది. వీటిలో రెండింటిలో వరుణ్ చక్రవర్తి, మరో దాంట్లో అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’లుగా నిలిచారు. అయితే 2025లో హైలైట్గా నిలిచిన అంశం భారత జట్టు ఆసియా కప్ గెలుచుకోవడం. ఆడిన 7 మ్యాచ్లలో ఓటమి లేకుండా (వరుసగా యూఏఈ, పాకిస్తాన్, ఒమన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్లపై) అజేయంగా నిలిచి భారత్ టైటిల్ సాధించింది. 314 పరుగులతో అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ 53 బంతుల్లో అజేయంగా 69 పరుగులతో జట్టును గెలిపించి హీరోగా అవతరించాడు. పహల్గాం దాడి తర్వాత జరిగిన ఈ టోర్నీలో పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత క్రికెటర్లు నిరాకరించడం, చివరకు ఆసియా కప్ ట్రోఫీని మన జట్టుకు అందించకుండా ఏసీసీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ తన వద్దే ఉంచుకోవడం టోర్నీని వివాదాస్పదంగా మార్చాయి. మొత్తంగా 16 మ్యాచ్లు గెలిచిన జట్టు 3 మాత్రమే ఓడింది. ఈ ఏడాది అభిషేక్ శర్మ ఓపెనర్గా చెలరేగి కొత్త స్టార్గా నిలిచాడు. 21 మ్యాచ్లు ఆడి 444 బంతులు ఎదుర్కొన్న అతను ఏకంగా 193.46 స్ట్రయిక్రేట్తో 859 పరుగులు చేసి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. హర్మన్ బృందానికి హ్యాట్సాఫ్... ప్రపంచ కప్లో పది ప్రయత్నాల తర్వాత రెండుసార్లు రన్నరప్కే పరిమితమై, ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవకుండా సుదీర్ఘ కాలం ఎదురు చూసిన భారత మహిళల క్రికెట్ జట్టు చిరకాల స్వప్నం 2025లో నెరవేరింది. ఈ ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్లో తొలిసారి చాంపియన్గా సగర్వంగా శిఖరాన నిలిచింది. లీగ్ దశలో ఆడిన 7 మ్యాచ్లలో 3 విజయాలు, 3 పరాజయాలతో శ్రమించి జట్టు సెమీస్ చేరింది. వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చేతుల్లో పరాజయాల తర్వాత ఇక నిష్క్రమణ ఖాయమనిపించిన దశలో హర్మన్ బృందం కోలుకున్న తీరు స్ఫూర్తిదాయకం. ఆపై సెమీఫైనల్లో అసాధారణ ఆటతో ఆస్ట్రేలియాను చిత్తు చేయడంతోనే ట్రోఫీపై ఆశలు చిగురించగా... నవంబర్ 2న జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగులతో గెలవడం భారత క్రికెట్ అభిమానులెవరూ మర్చిపోలేని ఘట్టం. హర్మన్, స్మృతి, జెమీమా, ప్రతీక, షఫాలీ, దీప్తి, శ్రీచరణి, క్రాంతి... ఇలా ప్రతీ ఒక్కరూ చేయి వేసి వరల్డ్ కప్ను భారత్కు అందించారు. అండర్–19 వరల్డ్ కప్ కూడా మనదే... ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరిలో మలేసియా వేదికగా జరిగిన అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. ఈ ఫార్మాట్లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు 9 వికెట్లతో గెలిచింది. తెలంగాణకు చెందిన గొంగడి త్రిష 7 మ్యాచ్లు ఆడి 309 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును గెల్చుకుంది. భారత్కే చెందిన వైష్ణవి శర్మ (17 వికెట్లు) టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచింది.
మా ‘సిక్స్త్ సెన్స్’ ముందే చెప్పింది
న్యూఢిల్లీ: విబేధాలతో వ్యక్తిపై అత్యాచార కేసు నమోదుచేసిన బాధితురాలు తన మనసు మార్చుకుని అతడినే పెళ్లాడవచ్చని తాము ముందే ఊహించామని, తమ ‘సిక్స్త్ సెన్స్’ అదే చెప్పిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఓ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. మహిళను రేప్ చేశాడన్న కేసులో దోషిగా తేలి మధ్యప్రదేశ్ హైకోర్టులో పదేళ్ల శిక్ష పడిన వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించగా సంబంధిత కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల విచారించింది. బాధితురాలు, దోషి వివాహంచేసుకుని గత ఆరునెలలుగా సంతోషంగా జీవిస్తున్న నేపథ్యంలో దోషికి గతంలో హైకోర్టు విధించిన శిక్షను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పలు ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. డిసెంబర్ ఐదున వెలువ డిన ఈ కేసు తీర్పు వివరాలు ఆలస్యంగా శనివారం వెలుగుచూశాయి. ‘‘ శిక్షను రద్దుచేయాలంటూ అప్పీల్ చేసుకున్న వ్యక్తిని బాధితురాలు ఒకవేళ వివాహం చేసుకునేందుకు సుముఖత చూపితే ఇద్దరూ మళ్లీ కలిసిపోతారని మేం ముందే ఊహించాం. మా సిక్త్స్ సెన్స్ ఇదే చెప్పింది. ముందుచూపుతో ముందే ఊహించాం. ఇలాంటి కేసు నిజంగా అరుదైంది. బాధితురాలిని పెళ్లిచేసుకోవడం ద్వారా దోషిపై ఉన్న నేరారోపణలను, శిక్షను రద్దుచేస్తున్నాం’’ అని న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. 2015లో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వ్యక్తిని మధ్యప్రదేశ్కు చెందిన ఒక యువతి ఇష్టపడింది. తర్వాత కొన్నాళ్లపాటు ఇద్దరూ సహజీవనంచేశారు. తర్వాత మనస్పర్థలొచ్చాయి. దీంతో పెళ్లాడతానని మాయమాటలు చెప్పి తనను పలుమార్లు అత్యాచారంచేశాడని మహిళ ఫిర్యాదుచేయడంతో 2021 నవంబర్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. గత ఏడాది ఏప్రిల్లో ట్రయల్ కోర్టు ఆ వ్యక్తిని దోషిగా తేల్చింది. తీర్పును అతను మధ్యప్రదేశ్ హైకోర్టులో సవాల్చేయగా అక్కడా అతనికి చుక్కెదురైంది. పైగా పదేళ్ల కఠిన కారాగార శిక్షను, రూ.55,000 జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పుచెప్పింది. దీంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఇద్దరినీ, వాళ్ల తల్లిదండ్రులను సుప్రీంకోర్టు ధర్మాస నం పిలిపించింది. వివాహంచేసుకునేందుకు ఇరువైపులా సమ్మతి తెలపడంతో పెళ్లాడేందుకు వీలుగా అతనికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. ఆ తర్వాత వాళ్లు పెళ్లాడారు. ఈ విషయంతెల్సి ధర్మాసనం ఈ కేసును విచారించింది. ‘‘ఇద్దరి మధ్య చిన్నపాటి బేధాభిప్రాయాలు ఉన్నట్లు మాకు అర్థమైంది. అనివార్య కారణాలతో వివాహం వాయిదావేద్దామని కలిసున్నకాలంలో అబ్బాయి చెప్పడంతో ఆగ్రహించిన అమ్మాయి నేరపూరిత రంగు పులిమి విషయాన్ని పెద్దదిచేసింది. వాస్తవానికి పెళ్లిచేసుకోవాలన్న ఉద్దేశం ఇద్దరికీ ఉందని మా సిక్త్స్ సెన్స్ ఎప్పుడో చెప్పింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా మాకు సంక్రమించిన అసాధారణ అధికారాలతో ఎఫ్ఐఆర్ను, ట్రయల్ కోర్టులో తీర్పును రద్దుచేస్తున్నాం. తద్వారా హైకోర్టులో పెండింగ్లో ఉన్న సంబంధిత కేసు నిర్వీర్యమైపోయినట్లే’’అని ధర్మాసనం స్పష్టంచేసింది.
ఇంటి చిట్కాలకు మించి ఆలోచిద్దాం: హెయిర్ ఫాల్కి అసలైన పరిష్కారం ఏది?
కోల్కాతాకు చెందిన యానీ(28), ఢిల్లీకి చెందిన భావన(40) లకు, ఈ చిన్న చిన్న మార్పులే పెద్ద ఆందోళనగా మారాయి. వీరి కథ, ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతున్న ఎంతోమంది భారతీయ మహిళల కథ లాంటిదే.పోషకాహార లోపం, స్ట్రెస్ (stress), హార్మోన్ల మార్పుల వల్ల సిటీల్లో ఉండేవాళ్లకు హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువవుతోందని డెర్మటాలజీ స్టడీస్ చెబుతున్నాయి. అందరిలాగే వీళ్ళు కూడా మొదట్లో ఇంటి చిట్కాలు, రకరకాల నూనెలు వాడి చూసారు. కానీ చివరికి క్లినికల్ ట్రీట్మెంట్ (clinical treatment) అవసరమని తెలుసుకున్నారు.ఇంటి చిట్కాలు పనిచేయకపోతే?యానీ, భావన ఇద్దరూ హెయిర్ ఫాల్ లక్షణాలు స్పష్టంగా కనిపించాయని చెప్పారు.షాంపూ చేసుకున్నప్పుడు చేతి నిండా జుట్టు రావడం యానీకి గుర్తుంది. ''చేతిలో అంత జుట్టు చూసి నాకు భయమేసింది. అసలు ఏం జరుగుతోంది? నెక్స్ట్ ఏం చెయ్యాలి? అనిపించింది. ఆన్లైన్లో దొరికిన ప్రతి కిచెన్ రెమెడీ (kitchen remedy) ట్రై చేశాను. కానీ ఏదీ పనిచెయ్యలేదు. అవి ట్రీట్మెంట్ కోసం చేసినవి కాదు, జనరల్ చిట్కాలు మాత్రమే" అని అన్నారు.భావన కూడా ఇలాంటి కన్ఫ్యూజన్లోనే ఉండేవారు. తల స్నానం చేసాక దువ్వెన నిండా జుట్టు వచ్చేది. కరివేపాకు, ఉల్లిపాయ రసం.. అన్నీ ట్రై చేశాను, కానీ లాభం లేకపోయింది. ఏ హెయిర్ సీరమ్ (hair serum) వాడాలో తెలియక దాదాపు ఒక నెల రోజులు అయోమయంలో ఉన్నానని ఆమె చెప్పారు.వీరి అనుభవం డాక్టర్లు చెప్పేదాన్ని నిజం చేస్తోంది: ఇంటి చిట్కాలు సేఫ్గా అనిపించినా, అవి దీర్ఘకాలిక హెయిర్ ఫాల్ను తగ్గించలేవు.సైన్స్ వైపు మలుపువీళ్లు తీసుకున్న నిర్ణయం ఒక్క రోజులో జరిగింది కాదు. నెలల తరబడి ఇంటి వైద్యం, డాక్టర్ల చుట్టూ తిరిగి విసిగిపోయిన తర్వాత తీసుకున్న నిర్ణయం. యానీ స్వయంగా ఫార్మాస్యూటికల్ సొల్యూషన్స్ గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే ఆమెకు ఆన్లైన్లో Bontress గురించి తెలిసింది."నేను ఒక మంచి ఫార్మా కంపెనీ ప్రొడక్ట్ కోసం వెతుకుతున్నాను. ఏదో పేరుకు కాకుండా.. నిజంగా ట్రీట్మెంట్ కోసం పనిచేసేది కావాలి." ఆమె అందులోని ఇంగ్రీడియంట్స్ (ingredients) చెక్ చేసి, గూగుల్లో రివ్యూస్ చదివిన తర్వాతే డిసైడ్ అయ్యాను'' అని యానీ చెప్పారు.భావనకు, ఆమె కజిన్ Bontress Pro+ గురించి చెప్పారు. జుట్టు పెరగడానికి ఇందులో సైంటిఫిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని తెలుసుకున్నారు. Nykaaలో రివ్యూస్ చూసాక ఆమె నమ్మకం ఇంకా బలపడింది. చాలామంది తమకు 'బేబీ హెయిర్' (baby hair) వస్తోందని, హెయిర్ ఫాల్ తగ్గిందని రాశారు. అది చూశాక నాకు నమ్మకం వచ్చింది" అని భావన అన్నారు.మార్పు నిశ్శబ్దంగా వచ్చినప్పుడుఇద్దరూ అద్భుతాలు జరుగుతాయని ఆశించలేదు. హెయిర్ ఫాల్ తగ్గడానికి 6-8 వారాలు, కొత్త జుట్టు రావడానికి కనీసం 3 నెలలు పడుతుందని సైన్స్ చెబుతోంది.యానీకి, నుదుటి దగ్గర సన్నని కొత్త వెంట్రుకలు రావడం కనిపించింది. మా అమ్మ నన్ను చూసి, 'నీకు చాలా బేబీ హెయిర్స్ వస్తున్నాయే' అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది నిజంగా పనిచేస్తోందని. ఆమె ప్రతి రాత్రి క్రమం తప్పకుండా (without fail) Bontress వాడారు.భావన ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఉంది. ''ఒకటిన్నర నెల తర్వాత, నాకు బేబీ హెయిర్ కనిపించింది. కానీ నాకు డౌట్ వచ్చింది. సో, పార్లర్కు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చెక్ చేయమన్నాను. తను 'అవును మేడమ్, చిన్న వెంట్రుకలు వస్తున్నాయి'' అని చెప్పింది. అది వినగానే చాలా హ్యాపీగా అనిపించింది." దువ్వెనలో జుట్టు రావడం కూడా తగ్గిందని ఆమె గమనించారు.చిత్రం: Bontress Pro+తో భావన జుట్టు పెరుగుదల ప్రయాణంఎవరూ మాట్లాడని ఎమోషనల్ మార్పుజుట్టు పెరగడమే కాదు, ఇద్దరూ మానసికంగా కూడా చాలా రిలీఫ్ ఫీలయ్యారు. రిజల్ట్ రాకముందు పడ్డ టెన్షన్ గురించి.. ''ఇది పనిచేయడం మొదలుపెట్టాకే నేను ప్రశాంతంగా నిద్రపోగలిగాను. అంతకు ముందు వరకు చాలా కంగారుగా ఉండేది'' అని యానీ చెప్పారు.ఏ సీరమ్ కొనాలన్నా భావనకు మొదట్లో భయంగా ఉండేదట. "ఇవి చాలా కాస్ట్లీ (costly). డబ్బులు ఖర్చు పెట్టి రిజల్ట్ రాకపోతే బాధేస్తుంది కదా. Bontress వాడేటప్పుడు కూడా ఇది పనిచేస్తుందా లేదా అని డౌట్ ఉండేది. కానీ మార్పు కనిపించాక చాలా రిలీఫ్గా అనిపించింది'' అని అన్నారు.హెయిర్ ఫాల్ వల్ల ఆడవాళ్లు ఎంత ఎమోషనల్ స్ట్రెస్ ఫీలవుతారో వీరి కథలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా చిట్కాలను పక్కన పెట్టి, Bontress లాంటి క్లినికల్ సొల్యూషన్స్ వైపు వస్తున్నారు. యానీ చెప్పినట్టు: ట్రీట్మెంట్ అన్నాక టైమ్ పడుతుంది. మ్యాజిక్ లాగా జరగదు. కానీ ట్రీట్మెంట్ కోసం చేసిన ప్రొడక్ట్ అయితే కచ్చితంగా పనిచేస్తుంది. భావన కూడా.. టెన్షన్ పడకండి. సైన్స్ ప్రకారం పనిచేసే ప్రొడక్ట్ ఎంచుకోండని అన్నారు.
నకిలీ ఆరోగ్య ఉత్పత్తులతో జాగ్రత్త
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియునిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించిహెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి.
కర్ణాటకలో మైనారిటీ ఇళ్లపైకి బుల్డోజరా?
మా ‘సిక్స్త్ సెన్స్’ ముందే చెప్పింది
న్యాయానికి గంతలు కట్టొచ్చేమో.. న్యాయమూర్తులకు కాదు
ఫొటో 2025
బలవంతపు భూసేకరణపై కన్నెర్ర
గత సర్కార్ రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసింది
2025: ట్రంప్ నామ సంవత్సరం
ఎరువు.. ధరల దరువు
ఉపాధిని నిర్వీర్యం చేసే కుట్రే..
నెల్లూరు జిల్లాలోకి గూడూరు
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
స్విమ్ సూట్లో అనసూయ వీడియో.. శివాజీపై కోపమా?
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
‘సీఎం కుర్చీ’లో కూడా ఈ విధానం ఉంటే చెప్పండని ప్రైవేటు భాగస్వామ్యం వాళ్లు అడుగుతున్నార్సార్!
వేళాకోళంగా ఉందా? వీళ్ల పేర్లు ‘రెడ్బుక్’లో రాయండి!!
రెండో బిడ్డకు జన్మనిచ్చిన 'దేవర' నటి
హరీ.. హరా..! సర్కారు వైఫల్యానికి ని‘దర్శనం’
గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన 'బిగ్బాస్' ఇమ్మాన్యుయేల్
నాకేమో రాజకీయ కాలుష్యంతో అలర్జీ సార్!
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు బద్దలు
ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి
వెండి ఇంకా కొనచ్చా.. ఇప్పటికే లేటైందా?
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!
రాజ్తో పెళ్లి తర్వాత తొలి క్రిస్మస్.. ఫోటోలు పంచుకున్న సమంత..!
అర్ధరాత్రితో మారిపోయే ఆధార్ రూల్స్..
Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే..
75 ఏళ్ల బామ్మగా ఒకప్పటి స్టార్ హీరోయిన్
కర్ణాటకలో మైనారిటీ ఇళ్లపైకి బుల్డోజరా?
మా ‘సిక్స్త్ సెన్స్’ ముందే చెప్పింది
న్యాయానికి గంతలు కట్టొచ్చేమో.. న్యాయమూర్తులకు కాదు
ఫొటో 2025
బలవంతపు భూసేకరణపై కన్నెర్ర
గత సర్కార్ రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసింది
2025: ట్రంప్ నామ సంవత్సరం
ఎరువు.. ధరల దరువు
ఉపాధిని నిర్వీర్యం చేసే కుట్రే..
నెల్లూరు జిల్లాలోకి గూడూరు
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
స్విమ్ సూట్లో అనసూయ వీడియో.. శివాజీపై కోపమా?
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
‘సీఎం కుర్చీ’లో కూడా ఈ విధానం ఉంటే చెప్పండని ప్రైవేటు భాగస్వామ్యం వాళ్లు అడుగుతున్నార్సార్!
వేళాకోళంగా ఉందా? వీళ్ల పేర్లు ‘రెడ్బుక్’లో రాయండి!!
రెండో బిడ్డకు జన్మనిచ్చిన 'దేవర' నటి
హరీ.. హరా..! సర్కారు వైఫల్యానికి ని‘దర్శనం’
గర్ల్ఫ్రెండ్ని పరిచయం చేసిన 'బిగ్బాస్' ఇమ్మాన్యుయేల్
నాకేమో రాజకీయ కాలుష్యంతో అలర్జీ సార్!
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు బద్దలు
ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి
వెండి ఇంకా కొనచ్చా.. ఇప్పటికే లేటైందా?
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!
రాజ్తో పెళ్లి తర్వాత తొలి క్రిస్మస్.. ఫోటోలు పంచుకున్న సమంత..!
అర్ధరాత్రితో మారిపోయే ఆధార్ రూల్స్..
Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే..
75 ఏళ్ల బామ్మగా ఒకప్పటి స్టార్ హీరోయిన్
ఫొటోలు
బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)
చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్.. ట్రెండింగ్లో 'అనసూయ' (ఫోటోలు)
తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)
తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)
విశాఖపట్నం : గంగమ్మా..మమ్మేలు మాయమ్మా! (ఫొటోలు)
'ఛాంపియన్' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
సినిమా
మోహన్లాల్కు కలిసిరాని డిసెంబర్.. డిజాస్టర్ తప్పదా!
యంగ్ హీరోలను సైతం అబ్బురపరిచేలా వరుస విజయాలు అందుకున్నాడు సీనియర్ హీరో మోహన్లాల్. ఒకటా రెండా.. ఈ ఏడాది ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ హిట్లే! కానీ చివరగా ఓ డిజాస్టర్ సినిమాతో 2025కి ముగింపు పలుకుతున్నాడు. అదే విషాదకరం! మరో విషయమేంటంటే.. డిసెంబర్లో రిలీజైన సినిమాలు ఆయనకు అస్సలు అచ్చిరావడం లేదు! అదెలాగో ఓసారి చూసేద్దాం...అన్నీ హిట్లే..తెలుగులో హీరోలు ఏడాదికో, రెండేళ్లకోసారో సినిమా చేస్తారు. కానీ, మలయాళంలో అలా కాదు.. వాళ్లు ఏడాదికి నాలుగైదు సినిమాలైనా ఫటాఫట్ షూట్ చేస్తుంటారు, ఆ వెంటనే రిలీజ్ చేస్తారు. అలా 2025లో మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఎల్ 2: ఎంపురాన్, తుడరుమ్, హృదయపూర్వం.. బాక్సాపీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి హిట్లుగా నిలిచాయి. కానీ రూ.70 కోట్లు పెట్టి తీసిన వృషభ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర దారుణంగా చతికిలపడింది. మొదటిరోజు కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోయింది.లుక్పై విమర్శలుఅదేంటో కానీ డిసెంబర్ నెల మోహన్లాల్కు ఇటీవలి కాలంలో పెద్దగా కలిసిరావడం లేదు. 2018 డిసెంబర్ ఓడియన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మోహన్లాల్. కలెక్షన్స్పరంగా సినిమా మంచి హిట్టయినప్పటికీ మోహన్లాల్ లుక్పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. 2021 డిసెంబర్లో రూ.100 కోట్ల బడ్జెట్ మూవీ మరక్కర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మోహన్లాల్. సగం కూడా రాలే!ఈ సినిమా రిలీజ్కు ముందే మూడు జాతీయ అవార్డులు అందుకుంది. భారీ ఓటీటీ డీల్స్ వచ్చినా కూడా థియేటర్లోనే ముందుగా రిలీజ్ చేయాలని సినిమాటీమ్ పట్టుబట్టింది. వారి అంచనాలను తలకిందులు చేస్తూ మరక్కర్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.45 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే బడ్జెట్లో సగం కూడా తిరిగి రాలేదు.దర్శకుడిగా డిజాస్టర్వందలాది సినిమాల్లో తన సత్తా ఏంటో చూపించిన మోహన్లాల్ బరోజ్ చిత్రంతో దర్శకుడిగా మారాడు. 2024 డిసెంబర్ 25న విడుదలైన ఈ మూవీ ఘోరంగా చతికిలపడింది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ.15 కోట్లు మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది.ఈసారి కూడా పరాజయమే!సరిగ్గా ఏడాది తర్వాత అదే తేదీ (డిసెంబర్ 25న) వృషభతో పలకరించాడు ఈ స్టార్ హీరో. కలెక్షన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. బుకింగ్స్ పేలవంగా ఉన్నాయి. దీంతో ఈసారి కూడా మళ్లీ ఘోర పరాజయం తప్పేలా కనిపించడం లేదు. మరి మోహన్లాల్ ఈ డిసెంబర్ సెంటిమెంట్ ఎప్పుడు బ్రేక్ చేస్తాడో చూడాలి!
ఐసీయూలో టాలీవుడ్ 'చిన్న' సినిమా
ఓ రాజ్యం ఉంది. అందులో రాజు, రాణి, మంత్రి, సైనికులు, ప్రజలు.. ఇలా అందరూ ఉన్నారు. రాజుకి అందరూ జేజేలు పలుకుతారు. కానీ సైనికులు లేకపోతే ఆయనకు విలువ ఎక్కడిది? ఇలా ఆలోచించేవాళ్లు ఎంతమంది? టాలీవుడ్ పరిస్థితి కూడా ఇలానే తయారైనట్లు కనిపిస్తోంది! రాజు లాంటి స్టార్ హీరోల మూవీస్ని పట్టించుకుంటున్న ప్రేక్షకుడు.. సైనికుడు లాంటి చిన్న సినిమాని లైట్ తీసుకుంటున్నాడు. ఇంతకీ దీనికి కారణమేంటి? ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది?ఒకప్పుడు కూడా తెలుగులో స్టార్ హీరోలు ఉన్నారు. వాళ్లు సినిమాలు చేసేవారు. కానీ ఎప్పుడూ పెద్దా చిన్నా అని తేడా ఉండేది కాదు. తెలుగు మూవీ అని మాత్రమే అని మాట్లాడుకునేవారు. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందో అప్పటినుంచి రోజురోజుకీ టాలీవుడ్లో చిన్న చిత్రాల పరిస్థితి అంతకంతకు దిగజారుతూ వచ్చింది. చూసే ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ చాలా మార్పులొచ్చాయి.ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా మాత్రమే. దీంతో వీకెండ్ వస్తే చాలు థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించేవారు. చిన్నపెద్దా మూవీస్ అన్నీ చూసేవారు. ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలు అనగానే ఎలానూ నెలరోజులకు ఓటీటీల్లోకి వచ్చేస్తాయిగా, ఇంట్లో చూసుకోవచ్చులే అని చాలామంది.. ముందే ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే మీడియం బడ్జెట్ చిత్రాల్ని థియేటర్లలో రిలీజ్ చేసినా సరే వాటికి పెద్దగా ఆదరణ ఉండట్లేదు.గీతా ఆర్ట్స్, సితార, మైత్రీ, ఎస్వీసీ లాంటి పెద్ద సంస్థలు నిర్మించే మీడియం బడ్జెట్ సినిమాలకు కాస్తోకూస్తో హైప్ ఉంటుంది. అందుకు తగ్గట్లే వాళ్లు ప్రమోషన్ చేస్తుంటారు. ఖర్చు విషయంలో అస్సలు వెనకాడరు. స్టార్స్తోనూ ప్రమోషన్స్ చేయిస్తారు. దీంతో ఆయా పెద్ద నిర్మాణ సంస్థల నుంచి వచ్చే చిత్రాలకు మాత్రం అంతో ఇంతో ఆదరణ దక్కుతోంది. మిగిలిన వాటి వైపు ఆడియెన్స్ చూడటమే గగనమైపోతోంది.మూవీ టీమ్ చేసే కొన్ని పనులు కూడా చిన్న సినిమాలని ప్రేక్షకులు లైట్ తీసుకునేలా చేస్తున్నాయి. సినిమా రిలీజ్ కావడమే లేటు.. మా మూవీ తోపు, బంపర్ హిట్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. కంటెంట్ ఉంటే పర్లేదు లేదంటే మాత్రం.. వీటిని చూసి నమ్మి, థియేటర్కి వెళ్లిన చాలామంది.. పలుమార్లు మోసపోయారు. ఇలా జరిగిన తర్వాత చిన్న సినిమా అంటే ఇంతే అని ఓ అభిప్రాయం వాళ్లకు కచ్చితంగా ఏర్పడుతుంది.చిన్న చిత్రాలంటే బడ్జెట్ తక్కువే. అందుకు తగ్గట్లే క్వాలిటీ, కంటెంట్ ఉంటుంది. ప్రస్తుతం ఓటీటీల్లో ఇంటర్నేషనల్ క్వాలిటీ కంటెంట్ చూస్తున్న ప్రేక్షకుడు.. మన నిర్మాతలు తీసే రొటీన్ రొట్టకొట్టుడు చిత్రాలకు ఎందుకు వెళ్తాడు? ఈ విషయంపై దర్శకనిర్మాతలు కచ్చితంగా దృష్టిపెట్టాలి. రెగ్యులర్ కమర్షియల్, థ్రిల్లర్, హారర్ చిత్రాలు తీస్తే.. పరుగెత్తుకుని వచ్చి చూసేసే రోజులు కావివి. కామెడీ కావొచ్చు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావొచ్చు సమ్థింగ్ డిఫరెంట్ ఉంటేనే ఆడియెన్స్, థియేటర్కి వచ్చి చూస్తారు. లేదంటే కనీసం ఆ వైపు కూడా చూడరు.చిన్న సినిమాల్లో స్టార్స్ పెద్దగా ఉండరు. సదరు హీరో లేదా హీరోయిన్ కోసం థియేటర్కి వెళ్లి చూడాలా? అని సగటు ప్రేక్షకుడు కచ్చితంగా అనుకుంటాడు. స్టార్ హీరోల సినిమాలు రిలీజైనప్పుడు ఇంతింత టికెట్ రేట్లు పెట్టి చూస్తారు. వాటికే మొత్తం ఖర్చు పెట్టేస్తే చిన్న చిత్రాలు వచ్చినప్పుడు చూసేందుకు డబ్బులు ఎక్కడుంటాయి?ఈ వీకెండే తీసుకుందాం. ఒకటి రెండు కాదు అరడజనుకు పైగా చిన్న సినిమాలు ఒకేసారి రిలీజయ్యాయి. వీటిలో ఒక్కదానికి మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది. మిగిలిన వాటికి మిక్స్డ్, నెగటివ్ టాక్ వచ్చింది. ఇలా ముకుమ్మడి విడుదల కూడా మీడియం బడ్జెట్ చిత్రాల్ని చంపేస్తోందని చెప్పొచ్చు. ఇలా చాలా చాలా అంశాలు టాలీవుడ్లో చిన్న సినిమాలకు రోజురోజుకీ శాపంగా మారుతున్నాయా అనిపిస్తోంది!
‘బిగ్ బాస్’కి రుణపడి ఉంటా : సంజన
"ఓ ఐదేళ్ళ క్రితం నా ప్రమేయం లేకుండా జరిగిన ఓ సంఘటన నా జీవితాన్ని,కెరీర్ ని ఒక కుదుపు కుదిపేసింది. అయితే స్వతహా నేను ఫైటర్ ని. అందుకే ప్రతికూల పరిస్థితులతో నేను పెద్ద పోరాటమే చేశాను. చివరికి విజేతగా నిలిచాను" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు బిగ్ బాస్ సీజన్-9లో టాప్ 5 ఫైనలిస్ట్ గా నిలిచిన ప్రముఖ హీరోయిన్ సంజనా గర్లాని. ఒడిదుడుకుల్లో తన వెన్నంటి నిలిచిన తన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు, అభిమానులకు ఆమె ఈసందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. బిగ్ బాస్ సీజన్ -9లో టాప్ 5 ఫైనలిస్ట్ గా నిలిచిన సంజన మీడియాతో ప్రత్యేకంగా సమావేశమై, బిగ్ బాస్ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు.బిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఈ అనుభవంతో తన కెరీర్ లో ఫ్రెష్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నానని ఆమె తెలిపారు. ముఖ్యంగా జీవితంలో తాను మళ్ళీ గర్వంగా తలెత్తుకుని తిరిగేందుకు కారణంగా నిలిచిన బిగ్ బాస్ కి ఎప్పటికీ ఋణపడి ఉంటానని సంజనా ప్రకటించారు. బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునకు ఈ షోలో పాల్గొన్నాక మరింత పెద్ద ఫ్యాన్ అయిపోయానని ఆమె పేర్కొన్నారు. ఇకపై తెలుగు సినిమాలపై మరింత దృష్టి సారిస్తానని, ఇప్పటికే కొన్ని ఎంక్వైరీస్ వచ్చాయని అన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ "బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై"లో త్రిష చెల్లెలిగా నటించిన సంజనా.... ఆ చిత్రంలోని ఓ పాపులర్ డైలాగ్ చెప్పి, అభిమానులను అలరించారు. తనను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఇకపై నడుచుకుంటానని సంజనా అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన 'విజనరీ వౌస్' కి సంజనా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
2025లో 'వైరల్' వయ్యారి వీళ్లే..
ఈ ఏడాది బాగా క్లిక్కయిన సాంగ్స్లో వైరల్ వయ్యారి ఒకటి. యంగ్ హీరోయిన్ శ్రీలీల స్టెప్పులు.. పాట రిథమ్.. అన్నీ సరిగ్గా సెట్టయ్యాయి. అందుకే ఆ పాట అంత వైరల్ అయింది. ఈ సాంగ్లో.. ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోయింగు చూశావంటే మైండ్ బ్లోయింగు.. ఫాలోవర్స్ అందరికీ నేనే డార్లింగు నేనేమీ చేసినా ఫుల్లు ట్రెండింగు అన్న లిరిక్స్ ఉంటాయి. అన్నట్లుగానే కొందరు పూసలమ్ముకుని ఫేమస్ అయితే మరికొందరు సెలబ్రిటీలతో లవ్లో పడి వైరల్ అయ్యారు. అలా ఈ ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయిన మహిళలెవరో చూసేద్దాం..మోనాలిసామోనాలిసా.. మొన్నటివరకు పూసలమ్ముకునే అమ్మాయి. కానీ ఇప్పుడు సినిమా హీరోయిన్. మధ్యప్రదేశ్కు చెందిన మోనాలిసా.. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో పూసల దండలు అమ్ముకునేందుకు వెళ్లింది. కానీ తన తేనెకళ్లతో అందరి దృష్టిలో పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలోకి ఎక్కింది. ఇంకేముంది రాత్రికిరాత్రే స్టార్ అయిపోయింది. ఒక సాంగ్లో నటించడంతో పాటు హిందీ, తెలుగు భాషల్లో హీరోయిన్గా సినిమాలు చేస్తోంది.ఆర్యప్రియ భుయన్కేవలం ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్తో వైరల్ అయిపోయింది ఆర్యప్రియ భుయన్. ఈ ఏడాది ఏప్రిల్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన ఓ మ్యాచ్కు అందరిలాగే ఆర్యప్రియ కూడా హాజరైంది. మహేంద్ర సింగ్ ధోనీ అవుట్ అయినప్పుడు ఆమె కోపంతో ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. కెమెరామన్ దాన్ని క్యాప్చర్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడం ఇట్టే జరిగిపోయింది. అలా ఒక్క వీడియోతో ఓవర్నైట్ స్టార్ అయింది.గౌరీ స్ప్రాట్బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్కు ఇదివరకే రెండు పెళ్లిళ్లవగా.. ఇద్దరు భార్యలకు విడాకులిచ్చేశాడు. మూడో పెళ్లి ఆలోచన లేదంటూనే ఓ మహిళతో ప్రేమలో పడ్డాడు. ఆవిడే గౌరీ స్ప్రాట్. ముంబైలో ఓ సెలూన్ నడుపుతూ ప్రైవేట్ లైఫ్ గడుపుతున్న గౌరీ.. ఆమిర్తో ప్రేమ వ్యవహారం వల్ల సెన్సేషన్గా మారింది.అలీషా ఓరీఈమె కూడా ఐపీఎల్ మ్యాచ్ ద్వారా క్లిక్ అయిన బ్యూటీనే! అలీషా కేకేఆర్ (కోల్కతా నైట్ రైడర్స్) అభిమాని. వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం డ్వేన్ బ్రావోతో కలిసి అలీషా స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఎవరీ మిస్టరీ గర్ల్ అని నెటిజన్లు తెగ వెతికేసి తనను వైరల్ చేశారు. అలీషా మోడల్, మేకప్ ఆర్టిస్ట్. తను 2021లో మిసెస్ ఇండియా లీగసీ టైటిల్ గెల్చుకుంది. 2023లో జరిగిన మిసెస్ యూనివర్స్ 2022 పోటీల్లో మిసెస్ పాపులర్ 2022 టైటిల్ అందుకుంది. Alisshaa Ohri 'Eid ka Chand' girl with DJ Bravo was unexpected but exciting to see pic.twitter.com/QN98UJMURO— Kashish (@kaha_jaa_rhe) April 9, 2025 మహికా శర్మక్రికెటర్ హార్దిక్ పాండ్యా 2024లో భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మహికా శర్మ అనే మోడల్తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బోలెడున్నాయి. అలా క్రికెటర్తో ప్రేమ కారణంగా మహికా ఒక్కసారిగా వైరల్ అయింది.చదవండి: 'విగ్ కావాలా? ధురంధర్ నటుడికి పొగరు తలకెక్కింది'
క్రీడలు
టీమిండియా కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ..
జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న అండర్-19 ప్రపంచకప్-2026 భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా ఆయూష్ మాత్రే ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా విహాన్ మల్హోత్రా వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు.అయితే అండర్-19 ఆసియా కప్ 2025 జట్టులో భాగమైన యువరాజ్ హోగిల్, నమన్ పుష్పక్లపై సెలక్టర్లు వేటు వేశారు. వారిద్దరి స్ధానంలో మహ్మద్ ఎనాన్, ఆర్.ఎస్. అంబ్రిష్లకు చోటు దక్కింది. ఈ టోర్నమెంట్ జనవరి 15 నుండి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. ఈ మెగా ఈవెంట్లో యువ భారత జట్టు తమ తొలి మ్యాచ్లో జనవరి 15న అమెరికాతో తలపడనుంది.కెప్టెన్గా వైభవ్..ఇక ఈ టోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈ టూర్కు రెగ్యూలర్ కెప్టెన్ మాత్రే, వైస్ కెప్టెన్ మల్హోత్రా గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో మాత్రే స్ధానంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ జట్టును నడిపించనున్నాడు. మాత్రే, మల్హోత్రా నేరుగా ప్రపంచకప్ జట్టులో చేరనున్నారు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.అండర్-19 ప్రపంచ కప్ 2026 కోసం భారత జట్టు:ఆయుష్ మాత్రే (కెప్టెన్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, డి. దీపేష్, మొహమ్మద్ ఈనాన్, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు, కిషన్ కుమార్ సింగ్, విహాన్ మల్హోత్రా, ఉదవ్ మోహన్, హెనిల్ పటేల్, ఖిలాన్ ఎ. పటేల్, హర్వాన్ష్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది.సౌతాఫ్రికా టూర్కు భారత జట్టువైభవ్ సూర్యవంశీ(కెప్టెన్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, డి. దీపేష్, మొహమ్మద్ ఈనాన్, ఆరోన్ జార్జ్, అభిజ్ఞాన్ కుందు, కిషన్ కుమార్ సింగ్, ఉదవ్ మోహన్, హెనిల్ పటేల్, ఖిలాన్ ఎ. పటేల్, హర్వాన్ష్ సింగ్, వేదాంత్ త్రివేది.
టీమిండియాలోకి ఉహించని ప్లేయర్.. ఎవరంటే?
భారత పురుషల క్రికెట్ జట్టు.. కొత్త ఏడాదిని సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్తో ప్రారంభించనుంది. జనవరి 11 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కివీస్-భారత జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే టీ20 సిరీస్కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. మరో నాలుగైదు రోజుల్లో వన్డే జట్టును కూడా ఖరారు చేయనుంది. టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు దూరమైన గిల్.. తిరిగి టీ20 సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ గాయపడడంతో సిరీస్ మధ్యలోనే వైదొలిగాడు. అయితే గిల్ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో కివీస్తో వన్డే సిరీస్లో జట్టును గిల్ నడిపించనున్నాడు.శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ?ఇక ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ భారత మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్ కూడి తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయ్యర్ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఉన్నాడు.అతడు తన ప్రాక్టీస్ను కూడా మొదలు పెట్టాడు. అతడికి రెండు మూడు రోజుల్లో ఫిట్నెస్ పరీక్షను నిర్వహించనున్నారు. అందులో అతడు ఉత్తీర్ణ సాధిస్తే కివీస్తో సిరీస్కు ఎంపిక కానున్నాడు.పడిక్కల్కు చోటు..!ఒకవేళ అయ్యర్ ఫిట్నెస్ సాధించకపోతే అతడి స్ధానంలో కర్ణాటక ఆటగాడు దేవ్దత్త్ పడిక్కల్ను సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. పడిక్కల్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ-2025లో పడిక్కల్ దుమ్ములేపుతున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ పడిక్కల్ శతక్కొట్టాడు. లిస్ట్-ఎ క్రికెట్లో పడిక్కల్ సగటు దాదాపు 83. 64గా ఉంది. దీంతో అతడిని వన్డే జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. మరోవైపు 2026 టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా కివీస్తో వన్డేలకు స్టార్ ప్లేయర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చే అవకాశముంది.న్యూజిలాండ్తో వన్డేలకు భారత జట్టు(అంచనా)శుభ్మన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్)/ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్ , రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్
ఇది ఔటా? అంపైర్పై లబుషేన్ సీరియస్! వీడియో
యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ చేధించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లీష్ జట్టుకు 15 ఏళ్ల తర్వాత ఇదే తొలి టెస్టు విజయం. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఆసీస్ ఆటగాడు లబుషేన్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదస్పదమైంది.అసలేం జరిగిందంటే?ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 18 ఓవర్లో ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్ తొలి బంతిని.. లబుషేన్కు గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని లబుషేన్ డిఫెండ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఫస్ట్ స్లిప్లో ఉన్న జో రూట్ ఆ బంతిని అందుకున్నాడు.వెంటనే ఇంగ్లండ్ ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోగా.. లబుషేన్ మాత్రం బంతి నేలకు తగిలి చేతిలోకి వచ్చిందా లేదా నేరుగా రూట్ అందుకున్నాడా సందేహంతో క్రీజులో ఉండిపోయాడు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు.థర్డ్ అంపైర్ పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించిన తర్వాత, రూట్ వేళ్లు బంతి కింద ఉన్నాయని చెబుతూ లబుషేన్ను ఔట్గా ప్రకటించాడు. దీంతో ఈ ఆసీస్ షాకయ్యాడు. ఎందుకంటే ఓ కోణంలో బంతి నేలకు తాకినట్లు అన్పించింది. థర్డ్ అంపైర్ అసహనం వ్యక్తం చేస్తూ లబుషేన్ మైదానాన్ని వీడాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అది క్లియర్గా నాటౌట్ అంటూ కామెంట్లు చేస్తున్నాయి. ఇప్పటికే మూడో టెస్టులో స్నికో లోపాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.చదవండి: గంభీర్కు పదవీ గండం!.. అతడితో చర్చలు జరిపిన బీసీసీఐ?What did you make of this catch? Out or not out?#Ashes | #DRSChallenge | @Westpac pic.twitter.com/pnWo2qt6qc— cricket.com.au (@cricketcomau) December 27, 2025
గంభీర్కు పదవీ గండం!.. అతడితో చర్చలు జరిపిన బీసీసీఐ?
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో విజయవంతమైనప్పటికి.. రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. గంభీర్ పర్యవేక్షణలో సేనా(సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా) దేశాలపై భారత్ ఇప్పటివరకు 10 టెస్టుల్లో ఓటమి చవిచూసింది. ముఖ్యంగా గత నెలలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో భారత్ ఘోర పరాజయం పాలవ్వడంతో గంభీర్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.అతడిని వెంటనే ప్రధాన కోచ్గా తప్పించాలని చాలా మంది మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. దీంతో బీసీసీఐ కూడా హెడ్ కోచ్ మార్పుపై ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. టెస్టు జట్టు కోసం ప్రత్యేకంగా కోచ్ను నియమించాలన్న యోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం.ఈ క్రమంలో హెడ్ కోచ్ పదవి కోసం లెజెండరీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ను బోర్డు ప్రతినిధులు సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బీసీసీఐ ఆఫర్ను లక్ష్మణ్ను తిరష్కరించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. లక్ష్మణ్ ప్రస్తుతం బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (CoE) హెడ్గా ఉన్నాడు. అయితే ప్రస్తుత బాధ్యతలతోనే తను సంతోషంగా ఉన్నానని, సీనియర్ జట్టు కోచింగ్పై ఆసక్తి లేదని బోర్డుకు తెలియజేశాడంట. కానీ మరోసారి లక్ష్మణ్తో చర్చలు జరిపేందుకు బోర్డు పెద్దలు సిద్దమైనట్లు సమాచారం. గంభీర్ మెడపై కత్తి..కాగా వన్డే ప్రపంచకప్-2027 ముగిసే వరకు బీసీసీఐతో గంభీర్ కాంట్రాక్ట్ ఉంది. కానీ మరి కొద్ది రోజుల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో భారత ప్రదర్శన బట్టి అతడి కాంట్రాక్ట్ను బోర్డు పునః సమీక్షించే అవకాశముంది. గంభీర్ కోచింగ్లో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియాకప్ను సొంతం చేసుకుంది.గంభీర్ ముందు పొట్టి ప్రపంచకప్తో పాటు చాలా సవాళ్లు ఉన్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ 2025-27లో టీమిండియా ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలతో పాటు ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అత్యంత కీలకం. మిగిలిన మ్యాచ్లలో గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకుంటుంది. భారత క్రికెట్ జట్టుకు మరో ఎనిమిది నెలల వరకు ఎటువంటి టెస్టు సిరీస్లు లేవు.చదవండి: న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం
న్యూస్ పాడ్కాస్ట్
ఏపీ రాజధానిలో అన్నదాత గుండె ఆగింది... ప్రభుత్వం ఒత్తిడి వల్ల గుండెపోటుతో కుప్పకూలిన రైతు దొండపాటి రామారావు
ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు గ్రహణం. కేంద్ర నిధులపై బాబు సర్కారు ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్కు అందజేత
ఆంధ్రప్రదేశ్లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
బిజినెస్
2026లో సంపద సృష్టించే ‘టాప్-4’ థీమ్స్ ఇవే!
2025లో భారత స్టాక్ మార్కెట్ కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, 2026వ సంవత్సరం ఇన్వెస్టర్ల పాలిట వరంగా మారబోతోందని మార్కెట్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల తగ్గింపు, భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి, కార్పొరేట్ లాభాలు పుంజుకోనుండటం మార్కెట్కు కొత్త ఊపిరి పోయనున్నాయని అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా నిఫ్టీ-50 ఇండెక్స్ 2026 చివరి నాటికి 28,000 పాయింట్ల మైలురాయిని చేరుకోవచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేవలం సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా.. కృత్రిమ మేధ(AI), గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్తు అవసరాలను గుర్తించి పెట్టుబడి పెట్టే వారికి దీర్ఘకాలికంగా భారీ లాభాలు అందనున్నాయని చెబుతున్నాయి. మరి 2026లో మదుపరుల అదృష్టాన్ని మార్చబోతున్న ఆ కీలక రంగాలు ఏమిటో చూద్దాం.కృత్రిమ మేధభారతదేశం ప్రస్తుతం ఏఐ విప్లవంలో ఒక కీలక దశలో ఉంది. ఇది కేవలం సాఫ్ట్వేర్ సేవలకే పరిమితం కాకుండా, ఉత్పాదకతను పెంచే ప్రధాన సాధనంగా మారుతోంది. అమెజాన్, మెటా, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలు సుమారు 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్లో ఏఐ మౌలిక సదుపాయాల కోసం కేటాయించాయి. 2026 ఫిబ్రవరి 19-20 తేదీల్లో జరగనున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ ఈ రంగానికి దిశానిర్దేశం చేయనుంది. భారత ప్రభుత్వ లక్ష్యం ప్రకారం, స్వదేశీ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పాదకతను పెంచే ‘చిన్న మోడల్స్’(Small Language Models) అభివృద్ధిపై దృష్టి సారించింది.ఈవీ చార్జింగ్ సదుపాయాలుఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతున్నా, వాటికి అవసరమైన చార్జింగ్ సౌకర్యాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. 45 శాతం మంది ఈవీ వినియోగదారులు పబ్లిక్ చార్జింగ్ పాయింట్లపై ఆధారపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ భారీ అంతరాన్ని పూడ్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సబ్సిడీలను అందిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఈ మేరకు సర్వీసులు అందిస్తున్న కంపెనీలు భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉంది.ఆఫీస్ వర్క్స్పేస్భారతదేశం ఇప్పుడు కేవలం బ్యాక్ ఆఫీస్ హబ్గా కాదు.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (GCC) కంపెనీల వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. అంతర్జాతీయ కంపెనీలు తమ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ సెంటర్లను భారత్లో ఏర్పాటు చేస్తున్నాయి. దీనివల్ల అత్యాధునిక సౌకర్యాలు గల 50-100 సీటర్ ఆఫీసులకు, మీటింగ్ రూమ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.లగ్జరీ, ప్రీమియం వస్తువులుపెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ వల్ల లగ్జరీ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. గృహాలంకరణ, ఖరీదైన వాచీలు, ప్రీమియం కార్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో బలమైన వృద్ధి కనిపిస్తోంది.ఇదీ చదవండి: క్విక్ కామర్స్.. గిగ్ వర్కర్ల సమస్యలివే..
ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు!
2025 ప్రారంభంలో రూ. 90500 వద్ద ఉన్న కేజీ సిల్వర్ రేటు.. ఇప్పుడు భారీగా పెరిగింది. ధరలు పెరుగుదల క్రమంలో జులై 26న 1,18,120 రూపాయల వద్ద నిలిచింది. ఆ తరువాత నెలలో (ఆగష్టు 26) రూ.1,23,126 వద్దను చేరింది. ఇలాగే కొనసాగుతూ.. డిసెంబర్ 26 నాటికి కేజీ వెండి రూ. 2,36,350 వద్ద నిలిచింది.జులై 26 ధరలతో పోలిస్తే.. డిసెంబర్ 26నాటి ధరలు రెట్టింపు. అంటే ఆరు నెలల కాలంలో వెండి రేటు డబుల్ అయింది. ఈ రోజు మాత్రమే సిల్వర్ రేటు రూ. 20వేలు పెరిగి.. ఒక్కసారిగా షాకిచ్చింది.ఈ రోజు (డిసెంబర్ 27) వెండి రేటు రూ. 20000 పెరగడంతో.. కేజీ సిల్వర్ ధర రూ. 2.74 లక్షలకు చేరింది. ఢిల్లీలో మాత్రం కేజీ రేటు రూ. 11వేలు పెరిగి.. రూ. 2.51 లక్షల వద్ద ఉంది.వెండి రేటు పెరగడానికి ప్రధాన కారణాలువెండిని కేవలం.. ఆభరణాల రూపంలో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది.ఇదీ చదవండి: బంగారం, వెండితోపాటు భారీగా పెరుగుతోన్న మరో మెటల్
లక్ష మంది కొన్న టాటా ఎలక్ట్రిక్ కారు.. ఇదే!
టాటా మోటార్స్ భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. నెక్సాన్ EV దేశంలో 1 లక్ష అమ్మకాలను దాటిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.2020లో తన మొట్టమొదటి నెక్సాన్ ఈవీని లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ప్రారంభంలో నెలకు 300 నెక్సాన్ కార్లను విక్రయించిన టాటా మోటార్స్.. ఆ తరువాత నెలకు 3000 యూనిట్లను విక్రయించగలిగింది. ఇప్పుడు భారతీయ రోడ్లపై 2.5 లక్షలకు పైగా టాటా ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్లు సమాచారం. ఈ బ్రాండ్ భారతదేశ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్లో 66 శాతం వాటాను కలిగి ఉంది.ఇదీ చదవండి: 2025లో లాంచ్ అయిన టాప్ 5 బైక్స్: వివరాలుటాటా మోటార్స్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ, ఫ్లీట్ ఆపరేటర్ల కోసం XPRES-T ఈవీలను విక్రయిస్తోంది. కాగా కంపెనీ రానున్న రోజుల్లో.. సియెర్రా EV, అప్డేటెడ్ పంచ్ EV, అవిన్యా వంటి కార్లు లాంచ్ అవుతాయి.
క్విక్ కామర్స్.. గిగ్ వర్కర్ల సమస్యలివే..
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో గిగ్ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తోంది. ఆహార పంపిణీ (Swiggy, Zomato), రవాణా (Ola, Uber), నిత్యావసరాల డెలివరీ (Blinkit, Zepto) వంటి సర్వీసులు మన జీవనశైలిలో భాగమయ్యాయి. అయితే, ఈ సౌకర్యాల డెలివరీలో భాగంగా ఉన్న లక్షలాది మంది గిగ్ వర్కర్ల జీవితాలు మాత్రం అనేక సవాళ్లతో, అభద్రతతో నిండి ఉన్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు చేపట్టిన నిరసనలు ఈ సమస్యల తీవ్రతను బహిర్గతం చేస్తున్నాయి.గిగ్ వర్కర్ల సమస్యలుసాంప్రదాయ ఉద్యోగులకు ఉండే హక్కులు ఏవీ గిగ్ వర్కర్లకు వర్తించవు. వారిని ఉద్యోగులు అని పిలవకుండా పార్టనర్లు(Partners) అని కంపెనీలు సంబోధిస్తాయి. దీనివల్ల వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఇవే..ఆదాయ అస్థిరత.. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. కానీ ప్లాట్ఫామ్లు ఇచ్చే కమీషన్లు తగ్గుతున్నాయనే వాదనలున్నాయి. దీనివల్ల వారి నికర ఆదాయం పడిపోతోంది. కనీస వేతన గ్యారంటీ లేకపోవడం అతిపెద్ద లోపం.అల్గారిథమ్ నియంత్రణ.. డెలివరీ భాగస్వాములకు ఆర్డర్లు కేటాయించేది ఒక సాఫ్ట్వేర్ అల్గారిథమ్. ఏ కారణం చెప్పకుండానే సడన్గా ఐడీ(ID) బ్లాక్ చేయడం వల్ల ఒక్కసారిగా వారి ఉపాధి కోల్పోతున్నారు.పని వేళలు.. రోజుకు 12 నుంచి 15 గంటలు పనిచేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి నెలకొంది. దీనివల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది.క్విక్ కామర్స్ రంగంలో గిగ్వర్కర్ల కష్టాలుప్రస్తుత రోజుల్లో ‘10 నిమిషాల డెలివరీ’(Quick Commerce) పోటీ పెరిగింది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ గిగ్ వర్కర్లకు మాత్రం శాపంగా మారింది. పది నిమిషాల్లో డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతో త్వరగా చేరుకోవాలనే ఒత్తిడి వల్ల డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, అతివేగంగా వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. డెలివరీ ఆలస్యమైతే కంపెనీలు వేసే జరిమానాలు, కస్టమర్ల నుంచి వచ్చే తక్కువ రేటింగ్ వారి జీతాలపై ప్రభావం చూపుతున్నాయి.డిమాండ్లుక్రిస్మస్ (డిసెంబర్ 25) నుంచి న్యూ ఇయర్ (డిసెంబర్ 31) వరకు దేశవ్యాప్తంగా క్విక్ కామర్స్ విభాగంలో పని చేస్తున్న గిగ్ వర్కర్లు అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రధానంగా కింది డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.కనీస ఆదాయ భద్రత.. పెట్రోల్ అలవెన్స్తో కలిపి కిలోమీటరుకు కనీసం రూ.20 చెల్లించాలి.10-మినిట్స్ డెలివరీ రద్దు.. కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టే ఈ మోడల్ను ఉపసంహరించుకోవాలి.సామాజిక భద్రత.. ప్రమాద బీమా (Accident Insurance), ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాలి.న్యాయబద్ధమైన ఐడీ బ్లాకింగ్.. సరైన కారణం లేకుండా, వివరణ తీసుకునే అవకాశం ఇవ్వకుండా ఐడీలను బ్లాక్ చేయకూడదు.గిగ్ వర్కర్లు ఆధునిక ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివారు. కేవలం లాభాలే ధ్యేయంగా కాకుండా వారి కష్టానికి తగిన ప్రతిఫలం, సామాజిక గౌరవం, భద్రత కల్పించినప్పుడే ఈ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. గిగ్ వర్కర్ల సమస్యలపై ప్రభుత్వం మరింత చర్చించి ఇటు కంపెనీలు, అటు వర్కర్లకు అనువైన నియమాలు అమోదించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి.ఇదీ చదవండి: రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
ఫ్యామిలీ
పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..! హాట్టాపిక్గా భారత సంతతి వ్యక్తి పోస్ట్
భారత ఆరోగ్య రక్షణ వ్యవస్థపై ఓ ఎన్నారై ప్రశంసల జల్లు కురింపించాడు. తాను అమెరికాలో ఆ వ్యాధి కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టానని, కానీ నయం కాలేదని వాపోయాడు. పదేళ్లుకు పైగా ఆ వ్యాధితో నరకం చూశానని..కానీ తన మాతృభూమిలో సులభంగా నయమైపోయిందంటూ భారత చికిత్స విధానాన్ని మెచ్చుకుంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారడమే గాకా ఆ అంశం హాట్టాపిక్గా మారింది. అంతేగాదు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక వైద్య విధానంపై చర్చలకు తెరలేపింది కూడా. ఎవరా ఆ ఎన్నారై?, ఏమా కథ చూద్దామా..అమెరికాలో స్టాప్ డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్న ఓ ఎన్నారై ఓ వ్యాధి విషయంలో అమెరికాలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రెడ్డిట్లో షేర్ చేసుకున్నాడు. ఆ పోస్ట్లో ఆ ఎన్నారై ఇలా రాసుకొచ్చాడు. "నేను అమెరికాలో పదేళ్లకు పైగా ఉన్నాను. అక్కడే తన చదువు, కెరీర్ అద్భుతం సాగింది. కానీ ఇంటిని, ఫ్యామిలీని బాగా మిస్ అయ్యా. అయితే అక్కడ సైంటిస్ట్గా పనిచేస్తున్నప్పుడు 2017లో స్కిజోఆఫెక్టివ్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడ్డాను. దీనివల్ల రోగులు నమ్మశక్యం కానీ బ్రాంతులకు గురై ఉద్యోగ కెరీర్, వ్యక్తిగత సంబంధాలు ఇబ్బందిగా మారపోతుంటాయి. ఈ మానసిక రోగంతో చాలా ఇబ్బంది పడ్డ. అందుకోసం అమెరికాలో చికిత్స కూడా తీసుకున్నా. అయితే అక్కడ అమెరికా డాక్టర్లు తనను డబ్బులు ఇచ్చే యంత్రంలా చూశారే గానీ, సరైన విధంగా చికిత్స చేయడంలో విఫలమయ్యారు. చాలా డబ్బు ఖర్చే చేశాను, ఏకంగా పదేళ్లకుపైగా బాధపడ్డను. కానీ, ఆ సమస్య నుంచి భయటపడింది కూడా లేదు. అయితే తనకు అక్కడ వైద్యులు ఆందోళన వల్ల ఈ సమస్య వస్తుందని, దాన్నితగ్గించుకునే ప్రయత్నంచేయమని సూచించేవారు, అందుకు సంబంధించి మందులే ఇచ్చారు. అంతేగాదు దీన్ని అధిగమించగలమే కానీ, నయం కాదని కూడా తేల్చి చెప్పారు. అయితే తాను మరో డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చి బెంగళూరులోని నిమ్హాన్స్లోని ప్రముఖ మానసిక వైద్యుడిని సంప్రదించాను. అక్కడ ఆ వైద్యలు ఆధ్వర్యంలో తీసుకున్న చికిత్స కారణంగా కాస్త రీలిఫ్ లభించడమే కాకుండా..చాలమటుకు క్యూర్ అయ్యింది. అంతేగాదు..ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడ్డానని, కానీ ఆందోళన మాత్రం దరిచేరకుండా చూసుకోమని వైద్యులు సూచించారు అని "రాసుకొచ్చాడు". అందువల్లే తాను సాధ్యమైనంత తొందరలో భారత్కు వచ్చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు కూడా ఆ పోస్ట్లో పేర్కొన్నాడు. కాగా, నెటిజన్లు కూడా అతడి పోస్ట్తో ఏకభవిస్తూ..తాము కూడా అక్కడ ఉన్నప్పుడూ ఎదుర్కొన్న మానసిక సమస్యలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు అక్కడ వాతావరణం కారణంగా రోగనిరోధక వ్యవస్థ సన్నగిల్లి మానసిక రుగ్మతలు బారినపడతామని అక్కడ వైద్యులు చెప్పారని మరికొందరూ పోస్ట్లు పెట్టడం గమనార్హం.(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్గా ఎన్నారై పోస్ట్)
అరుదైన హిమాలయ 'సిక్కిం సుందరి'..! ప్రకృతి నేర్పే జీవిత పాఠం
వ్యాపార దిగ్గజం ఆనంద్మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలను, ప్రేరణ కలిగించే సంఘటనలను షేర్ చేసుకుంటుంటారు. తాజాగా ఓ ట్రావెల్లో చూడదగ్గ విషయలతోపాటు అక్కడ మానవులకు ప్రేరణ కలిగించే ఓ అరుదైన హిమాలయ పర్వత మొక్క గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. అది పుష్పించే విధానం ప్రతి ఒక్కరిని మంత్రముగ్దుల్ని చేయడమే కాదు..ఆ కఠినమైన పర్వత ప్రాంతంలో తన మనుగడ కోసం అది చేఏ పోరాటం స్ఫూర్తిని రగిలిస్తుంది. మరి ఆ మొక్క ఎక్కడ ఉంది, దాని కథాకమామీషు ఏంటో చూసేద్దామా..!ఆనంద్ మహింద్రా సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో "సిక్కిం సుందరి" మొక్క గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఇది అరుదైన పర్వత మొక్క అని పుష్పించేందుకు దశాబ్దాలుగా శక్తిని నిల్వచేసుకుని ఆకాశాన్నేతాకేలా పుష్పించిన విధానం చూస్తే పోతుందన్నారు. ఇది సముద్ర మట్టానికి 4,000–4,800 మీటర్ల ఎత్తులో చూసే మొక్క అట. ఈ అసాధారణ అధ్భుతాన్ని ఇంతవరకు చూడలేదని పేర్కొన్నారు మహీంద్రా. దీన్ని"గ్లాస్హౌస్ ప్లాంట్"గా పేర్కొన్నారు. పర్వతాలుకు వ్యతిరేకంగా మెరస్తున్న ఓ టవర్లా పుష్పిస్తుందని రాశారు పోస్ట్లో. తనకు సిక్కిం పర్యటనలో ఈ మొక్క గొప్ప ప్రేరణగా నలిచిందని అన్నారు. దీనిని శాస్త్రీయంగా రుమ్ నోబెల్ అని పిలుస్తారని చెప్పారు. ఈ మొక్క అపారదర్శక, పగోడా లాంటి పువ్వులను కలిగి ఉంటుంది. ఆ ప్పువులు కూడా సుమారు ఏడు నుంచి 30 ఏళ్ల పెరుగుదల అనంతరం వస్తాయట. వీటి పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుందట.శాస్త్రవేత్తలకు, పర్యాటకులకు ఇవి ఆకర్షణగానూ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మైనస్ సున్నా డిగ్రీ ఉష్ణోగ్రతలు ఉండే కఠిన వాతావరణంలో పెరిగే మొక్క. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్తక్కువగా, బలమైన గాలుల మధ్య పర్వాతానికి వ్యతిరేకంగా ఎత్తుగాపెరుగుతుంది. 'ఓర్పు'కి నిర్వచనం.ఈ మొక్క పుష్పించేందుకు ఏడు నుంచి 30 ఏళ్ల వరకు చాలా నిశబ్దంగా ఆక్కుల్లో శక్తిని నిల్వ చేసుకుంటూ చిన్న రోసెట్(ఆకకుల సముహంలా) పెరుగుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా అన్నే ఏళ్ల అనంతరం ఏకంగా రెండు మీటర్లు ఎత్తుకు అమాంతం దూసుకుపోయి ఆలయాల్లో ఉండే ఎత్తైన గోపురం మాదిగా నిలబడుతుంది. ఆ తర్వాత విత్తనాలను విడుదల చేసి చనిపోతుందని మహీంద్రా పోస్ట్లో రాసుకొచ్చారు. అయితే పర్యాటకులు దీన్ని చూడటం కష్టమని అన్నారు. ఎందుకంటే ఎత్తైన పర్వతాల్లో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రదేశంలో ఉండటం వల్ల చూడటం కష్టమని చెప్పుకొచ్చారు. అంతేగాదు సిక్కిం టూర్లో ఇలాంటి ఎన్నో ప్రకృతి కమనీయ దృశ్యాలను తిలకిస్తామని అన్నారు. మంచుతో కప్పబడి ఉండే ఎత్తైన కాంచన్జంగా పర్వతం దృశ్యాలు మనసుకు హత్తుకుంటాయన్నారు. అంతేగాదు ఈ సిక్కిం అద్భుతైన మంచు సరస్సులకు నిలయం అని, ఇక్కడ రుంటెక్, పెమాయాంగ్ట్సే, లాబ్రాంగ్ వంటివి పురాతన బౌద్ధానికి నిలయంగా ఉంటాయన్నారు. సిక్కిం పర్యటనకు అనుకూలమైన సమయం..మార్చి–జూన్: ఈ సమయంలో, సిక్కిం ఆహ్లాదకరమైన వాతావరణం, స్పష్టమైన ఆకాశం, రంగురంగుల పుష్పాలను ఆస్వాదించొచ్చు. ఇది ప్రకృతి నడకలకు సరైన సమయం.సెప్టెంబర్–డిసెంబర్: ఈ సమయంలో, సిక్కిం చల్లని, పొడి పరిస్థితుల వాతావరణం ఉంటుంది. ఇక కాంచన్జంగా శ్రేణి అతీంద్రియ దృశ్యాలను అందిస్తుంది.డిసెంబర్–ఫిబ్రవరి: ఇసిక్కిం మంచుతో కూడిన అద్భుత భూమిగా మారే సమయం ఇది.I knew nothing about this extraordinary marvel: the ‘Sikkim Sundari’Thriving at staggering altitudes of 4,000–4,800 meters, this "Glasshouse Plant" stands like a glowing tower against the mountains. Its life is a masterclass in patience. It is monocarpic, which means that… pic.twitter.com/keoMSmGcUl— anand mahindra (@anandmahindra) December 21, 2025 (చదవండి: పిల్లలు విలువలు నేర్చుకోవాలంటే భారత్ బెస్ట్..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్)
లైఫ్ ఎప్పుడూ కొత్త ట్యూన్లోనే
‘కొత్త వ్యక్తులతో కలిసి పని చేయడం, మనల్ని మనం కొత్తగా పరిచయం చేసుకోవడం ఎప్పుడూ ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒక మహిళగా నన్ను ఒక మూసలోనే ఉండమని చెప్పడానికి ఎవరికేం హక్కుంది? మీకు ఇబ్బందిగా ఉంటే దూరంగా ఉండండి..’ అని ఘాటుగా చెబుతూనే ఈ యేడాది తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులు, హెల్తీగా, ఫిట్గా ఉండటానికి చేసిన ప్రయత్నాలు, రాబోయే కొత్త సంవత్సరంలో చేసుకోదగిన ప్లాన్స్ గురించి సింగర్ శ్రావణ భార్గవి ‘సాక్షి’తో పంచుకున్నారు.కొలంబియన్ యాసలో హిప్ హాప్ రాక్ మ్యూజిక్తో సింగర్ శ్రావణ భార్గవి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘కొలంబియన్ యాసలో ఉన్న ఒక పూర్తి ఆంగ్ల హిప్ హాప్ ర్యాప్ ట్రాక్ని సోషల్మీడియా ద్వారా తీసుకురావడానికి చాలా ఉత్సాహంగా పనిచేశాను. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు దగ్గరగా ఉన్న ఊరిలో ఈ పాటను రెండు రోజుల పాటు షూట్ చేశాం. పాట మొత్తం ఇంగ్లిష్లో ఉంటుంది కాబట్టి బ్యాక్ డ్రాప్లో మన సంస్కృతి ఉండాలనుకున్నాం.భయాన్ని వదిలేయాల్సిందే! ఈ సాంగ్ థీమ్లో టాక్సిక్ ఫెమినిజం గురించి ఉంటుంది. ఇదో తరహా విషపూరిత సంస్కృతి. అంటే, ఆడవాళ్లు తోటి ఆడవారి గురించి నెగిటివ్గా మాట్లాడటం. దీనిని వ్యంగ్య ధోరణిలో పాట ద్వారా చూపాను. ఉదాహరణకు.. ఒక లైంగిక దోపిడికి గురైన బాధితురాలు ఉంటే సానుభూతి చూపించకుండా ఆ అమ్మాయి గురించే తొందరపడి ఏదో ఒక మాట అనేస్తారు. ఇటీవల అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడేవాళ్లను ఎక్కువగా చూస్తున్నాం. ఆడవాళ్లు డ్రెస్సింగ్ మార్చుకోవాలి సరే.. ముందు మగవాళ్లు తమ సెన్స్ మార్చుకోవాలి కదా! .. ఇలాంటి ఒక కాన్సెప్ట్లో రాసిన పాట ఇది. ఎవరైనా ఒక మహిళ ఇండిపెండెంట్గా ఎదగడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేవారు అధికంగా ఉంటుంటారు. నా విషయంలోనూ అలాగే జరుగుతుంటుంది. ‘వాళ్ల మాటలు వాళ్లను మాట్లాడుకోనిద్దాం. నేను ఎందుకు వాటిని పట్టించుకోవాలి’ అనే ఆలోచనకు వచ్చాను. దీనివల్ల మరింత బాగా వర్క్ చేయగలుగుతున్నాను.నేను అనుకున్న థీమ్లో పాట రాయడం, కంపోజ్ చేయడం, పాడటం నా మెయిన్ వర్క్ అయితే నాతో పాటు కొత్త గ్రూప్ కలిశారు. దీంతో మరింత ఉత్సాహంగా పనిచేశాను. మన ఎదుగుదలకు దోహదం చేసే స్నేహితులను పెంచుకోవడం చాలా అవసరం. అది నేను ఈ యేడాది నేర్చుకున్నాను. అంతేకాదు, ఈ పాట ద్వారా నాలో ఉన్న అన్ని భయాలు పోయాయి. నా మ్యూజిక్, వర్క్ ద్వారా ఈ యేడాది ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసుకున్నాను.వారి నుంచి అది నేర్చుకున్నానుసోషల్ మీడియాను సరిగ్గా వినియోగించుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది. లేదంటే అదే మనకు థ్రెట్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాను. ఆఫ్లైన్లో ఎలా హద్దుల్లో ఉంటామో ఆన్లైన్లో కూడా అలాగే ఉండాలి. నేటి యువత ముఖ్యంగా జెన్జి గురించి మనం ఏదో అనుకొని ఆందోళన చెందుతుంటాం. కానీ, వాళ్లు చాలా క్లియర్గా ఉంటున్నారు. ‘నాకు నచ్చింది చేస్తున్నాను’ అనే క్లారిటీ వారికి ఉంది. ‘నో అంటే నో’ అనే చెబుతున్నారు. ఇది వారి నుంచి నేర్చుకున్నాను. ఇన్నాళ్లూ ఇలాంటి ఆలోచనను మిస్ అయ్యానే అనిపించింది.బలంగా ఎదగాలని...నా కూతురు పెద్దయ్యాక నన్ను చూసి గర్వంగా ఫీలయ్యేలా నా ఎదుగుదల ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మాయిల్లో స్ట్రాంగ్ పర్సనాలిటీని పెంచడం అనేది చాలా ముఖ్యం. అది చెబితే రాదు. నన్ను చూసే నా కూతురు నేర్చుకుంటుంది కాబట్టి, నేను స్ట్రాంగ్గా ఉండాలనుకుంటాను. మేమిద్దరమే సినిమాలకు వెళతాం, ఇద్దరం ఒకేసారి బుక్స్ చదువుకుంటాం, పాటలు పాడుతుంటాం. ఒక నెల రోజులపాటు ఇద్దరం కలిసి యూరప్ దేశాలు తిరిగి వచ్చాం. మా ఇద్దరి ఆసక్తులు ఒకేలా అనిపిస్తాయి. మా అమ్మ నాన్నలు కూడా ‘నచ్చిన పని చేయ్’ అని ప్రోత్సాహాన్నిస్తారు. అదే పెద్ద బలం. అలాగే, అమ్మానాన్నలు మనల్ని చూసి ధైర్యం తెచ్చుకునేలా అమ్మాయిలు స్ట్రాంగ్గా ఎదగాలి.ఈ ఏడాది చాలా హెల్దీగా...నాకు నచ్చిన డ్రెస్సులతో రెడీ అవడం చాలా ఇష్టం. అలా ఉండటంలో నేను సంతోషంగా, కాన్ఫిడెంట్గా, మరింత క్రియేటివ్గా ఉంటాను. ఎవరో మాట్లాడుకుంటారు అని నాకు అసౌకర్యంగా ఉన్న డ్రెస్సులో ఉండలేను. ఫిట్గా ఉండటానికి వారంలో నాలుగు రోజులైనా జిమ్కు వెళతాను. స్ట్రెంత్ ట్రెయినింగ్ వర్కౌట్స్ చేస్తాను. పోషకాహారం పట్ల జాగ్రత్త తీసుకుంటాను. దీనివల్ల కిందటేడాదితో పోల్చితే ఈ యేడాది చాలా హెల్దీగా ఉన్నాను. ఆర్థిక విషయాల్లో నేనెప్పుడూ జాగ్రత్తగా ఉంటాను. అమ్మాయిలు డబ్బు సంపాదించడంలోనే కాదు పొదుపు చేయడంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. అలాగని, డబ్బు వెంట కాకుండా నచ్చిన పని చేయడంలో ముందుండాలన్నది నా ఒపీనియన్. రాబోయే కొత్త సంవత్సరంలో మరింత క్రియేటివ్గా, మరింత ఉత్సాహంగా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను’’ అని నవ్వుతూ వివరించారు ఈ న్యూ హిప్ హాప్ ర్యాపర్.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటో: గడిగె బాలస్వామి
ఏఐ.. 2025..ఉమెన్ రైజింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో భారతీయ మహిళలకు సంబంధించి 2025 కీలక సంవత్సరంగా నిలిచింది. జాతీయ మహిళా కమిషన్ (ఎన్డబ్ల్యూసీ) యశోద ఏఐ అభియాన్ కార్యక్రమం వల్ల క్షేత్రస్థాయిలో ఏఐ కోర్సులు చదివే మహిళల సంఖ్య బాగా పెరిగింది. టెక్నాలజీలో మహిళలకు సంబంధించిన ట్రెండ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) కోర్సులు కీలకంగా మారాయి.మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులలో మహిళల పెరుగుదల నాలుగు రెట్లు పెరిగింది. ఈ సంవత్సరం ప్రారంభమైన జాతీయ మహిళా కమిషన్ (ఎన్డబ్ల్యూసీ) యశోద ఏఐ అభియాన్లాంటి ప్రభుత్వ కార్యక్రమాలు, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, రైజింగ్ 2025 సమ్మిట్లాంటి సదస్సుల ప్రభావం వల్ల ఏఐ కోర్సులు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు మహిళల నేతృత్వంలోని ఏఐ స్టార్టప్ల సంఖ్య పెరగడం శుభసూచకం.డీప్–టెక్ డొమైన్లలో...2024తో పోల్చితే 2025లో ఏఐ/ఎంఎల్ మాస్టర్ ప్రోగ్రామ్స్లో మహిళల సంఖ్య 20 శాతం పెరిగింది. ‘ఏఐ, ఎంఎల్లలో మాస్టర్స్ చదువుతున్న ప్రతి ఐదుగురు విద్యార్థులలో ఒకరు మహిళ. సంవత్సరం క్రితం వరకు ఇరవైమందిలో ఒకరు ఉండేవారు’ అని తెలియజేసింది యూజీసీకి సంబంధించిన ‘కాలేజి విద్య’ ప్లాట్ఫామ్ రిపోర్ట్.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, సైబర్ సెక్యురిటీ, రోబోటిక్స్, డాటా సైన్స్లాంటి డీప్–టెక్ డొమైన్లలో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని రిపోర్ట్ తెలియజేసింది. ఈ సంవత్సరం ఏఐ ప్రోగ్రామ్లకు సంబంధించి మహిళల ఆసక్తి గణనీయంగా పెరిగిందని, ఎంసిఏ సైబర్ సెక్యూరిటీ ఎన్రోల్మెంట్స్లో మహిళలు 25 శాతం, జనరేటివ్ ఏఐలో డాక్టోరల్ క్యాండిడేట్స్ 15 శాతం మంది ఉన్నారని నివేదిక వెల్లడించింది.మార్పు మంచిదే కదా!‘మనలో వచ్చిన మార్పుకు ఈ అభివృద్ధి రేటు అద్దం పడుతుంది. ఫ్లెక్సిబుల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ రోల్ మోడల్స్ విజయగాథలు తెలుసుకునే అవకాశం ఈ పెరుగుదలకు కారణం. భారతదేశ సాంకేతిక భవిష్యత్తుకు సంబంధించి మహిళలు కీలకపాత్ర పోషించబోతున్నారని ఈ మార్పును చెబుతుంది’ అంటున్నారు ‘కాలేజి విద్య’ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోహిత్ గుప్తా.పెద్ద పెద్ద నగరాలలో మాత్రమే కాదు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాలలో కూడా మహిళలు ఏఐ కోర్సులపై అమిత ఆసక్తి చూపిస్తున్నారు. సైబర్ భద్రతా నైపుణ్యాలపై మహిళలు దృష్టి సారించేలా యశోద ఏఐ అభియాన్ కార్యక్రమాలు చేపట్టింది.స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025స్టాన్ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఏఐ నైపుణ్యం కలిగిన వారిలో భారతీయ మహిళలు ఉన్నారు.‘ఎనాలటిక్స్’ ఇండియా మ్యాగజైన్ సమ్మిట్ ఏఐలో మహిళల భాగస్వామ్యంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మొత్తంమీద, ఏఐకి సంబంధించి 2025 సంవత్సరం మహిళలకు కీలకమైన సంవత్సరం నిలుస్తుంది.యశోద ఏఐ అంటే?డిజిటల్ రంగంలో లింగ అంతరాన్ని తగ్గించడానికి ఈ సంవత్సరం మే 22న యశోద ఏఐ అభియాన్ ముందుకు వచ్చింది.యువర్ ఏఐ సాక్షి ఫర్ షేపింగ్ హారిజన్స్ విత్ డిజిటల్ అవేర్నెస్కు సంక్షిప్తరూపం... యశోద ఏఐ.ఎన్సీడబ్ల్యూ, ఫ్యూచర్ షిఫ్ట్ ల్యాబ్స్ (ఎఫ్ఎస్ఎల్) సహకారంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమం బరేలీలోని మహత్మా జ్యోతిబా పూలే రోహిల్ఖండ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. ‘భారతదేశం అంతటా ఒక కోటిమంది మహిళలకు డిజిటల్ నైపుణ్యం’ అనే దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రయాణం మొదలు పెట్టింది యశోద ఏఐ అభియాన్. మొదటి దశలో రెండు లక్షల మందికి పైగా మహిళలకు శిక్షణ ఇవ్వడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంది. మొబైల్ యాప్, శిక్షణ కార్యక్రమాల ద్వారా మహిళలకు ఏఐ సాధనాలు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అక్షరాస్యతలో ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తోంది. ఏఐ సాంకేతికతను సులభతరం చేయడానికి స్థానిక భాషలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.మహిళలకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఎందుకు కీలకం?హ్యాకింగ్, ఆన్లైన్ వేధింపులలాంటి సైబర్ నేరాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి, ఏఐ రంగంలో అద్భుతమైన ఉద్యోగాలు సాధించడానికి, సాధికారతకు, డిజిటల్ ప్లాట్ఫామ్లను సురక్షితంగా నావిగేట్ చేయడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, లింగ వివక్ష లేకుండా ఉండడానికి మహిళలకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ ముఖ్యం అని యూఎన్ నివేదిక తెలియచేసింది. కాలేజీ స్టూడెంట్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ (ఎస్హెచ్జీ), ఆశావర్కర్, టీచర్, పంచాయతీ వార్డు మెంబర్ ఇలా ఎవరైనా కావచ్చు... యశోద ఏఐ అభియాన్లో చేరవచ్చు.‘ఇది కేవలం శిక్షణా కార్యక్రమం మాత్రమే కాదు. ఏఐ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మహిళా సాధికారతను ఉన్నతస్థాయిలో తీసుకువెళ్లే ఉద్యమం’ అనే ప్రశంసలు అందుకుంటోంది యశోద ఏఐ అభియాన్. ఏఐ బై హర్...గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్గ్లోబ్ ఇంపాక్ట్ ఛాలెంజెస్...‘ఏఐ బై హర్’ ‘ఏఐ ఫర్ ఆల్’ ‘యువ్ ఏఐ’ల కోసం భారత ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి సంబంధించి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మహిళా సాంకేతిక నిపుణులను ఆహ్వానిస్తుంది. మహిళల నేతృత్వంలో ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడానికి, వ్యవసాయం. సైబర్సెక్యూరిటీ, విద్య, డిజిటల్ వెల్బీయింగ్, ఆరోగ్యసంరక్షణ, ఎనర్జీ అండ్ క్లైమేట్ రంగాలలో, ఏఐకి సంబంధించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్, నీతి అయోగ్, ఇతర సంస్థల భాగస్వామ్యంతో గ్లోబల్ ఇంపాక్ట్ చాలెంజ్ ‘ఏఐ బై హర్’కు శ్రీకారం చుట్టారు. ‘ఏఐ–ఫర్–గుడ్ అప్లికేషన్స్’ లక్ష్యంతో ఫిబ్రవరి 2026లో న్యూ దిల్లీలో ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సదస్సు జరగనుంది.ఎన్ని స్టార్టప్లో!ఈ సంవత్సరం మహిళల నేతృత్వంలోని స్టార్టప్ల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ట్రాక్షన్ డేటా ప్రకారం...అక్టోబర్ 2025 నాటికి దేశవ్యాప్తంగా మహిళల నేతృత్వంలో 7,000 కంటే ఎక్కువ స్టార్టప్లు పనిచేస్తున్నాయి. ఫండింగ్కు సంబంధించి వీటికి మంచి స్పందన వచ్చింది. మహిళల నేతృత్వంలోని ఏఐ వెంచర్లలో కొన్ని... డా.గీతా మంజునాథ్–నిరామయి హెల్త్ ఎనాలిటిక్స్, అశ్వినీ అశోకన్–మ్యాడ్ స్ట్రీట్ డెన్, చంద్రాలిక హజారిక–బిగ్ థింక్స్, ప్రాంజలీ అవస్థీ–డెల్వ్.ఏఐ, కృష్ణప్రియ ఆకెళ్ల–స్టార్బజ్.ఏఐ, నిధి–నెమా ఏఐ, రిత్వికా చౌదురి–అన్స్క్రిప్ట్.ఏఐ, లైనా ఇమ్మాన్యుయేల్, రింజిమ్ అగర్వాల్–బ్రెయిన్సైట్.ఏఐ.
అంతర్జాతీయం
బంగ్లాదేశ్లో మరో దారుణం.. సింగర్ షోపై మూక దాడి
ఢాకా: బంగ్లాదేశ్లో పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. వరుస దాడి ఘటనల కారణంగా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లో ప్రముఖ రాక్స్టార్ కాన్సర్ట్పై మూక దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 20 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇంతకీ ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్లోని ఫరీదాపూర్లో ఓ పాఠశాల 185వ వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ గాయకుడు జేమ్స్ కాన్సర్ట్ను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాఠశాల పూర్వ విద్యార్థులతో సహా వేలాది మంది అక్కడికి వచ్చారు. అయితే, ఈ కాన్సర్ట్ ప్రారంభానికి ముందు(రాత్రి తొమ్మిది గంటల సమయంలో).. ఉన్నట్టుండి ఆందోళనకారులు వేదిక వద్దకు దూసుకొచ్చారు. దీంతో, వారిని భద్రతా సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదు. కాన్సర్ట్కు వచ్చిన వారిపై ఆందోళనకారులు రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు.Once again, a concert by Bangladesh’s leading band music artist James has been shut down.In Faridpur, just before the concert was set to begin, extremist groups stormed the stage and carried out an attack. Following intervention by law enforcement agencies, the organizers were… pic.twitter.com/NfmLRjL2OF— Sahidul Hasan Khokon (@SahidulKhokonbd) December 26, 2025కాగా, ఆందోళనకారుల దాడి నుంచి గాయకుడు జేమ్స్ తృటిలో తప్పించుకున్నారు. ఉద్రిక్తతలు మొదలవగానే భద్రతా సిబ్బంది ఆయన్ను అక్కడినుంచి తరలించారు. కానీ, మూక దాడిలో పలువురు పాఠశాల విద్యార్థులు గాయపడ్డారు. దీంతో ఈ కార్యక్రమం రణరంగాన్ని తలపించింది. దాడి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అనంతరం, భద్రతా కారణాల రీత్యా కాన్సర్ట్ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ దాడిలో 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
భారత్తో వాణిజ్య ఒప్పందం.. న్యూజిలాండ్ ప్రధాని ‘ముందడుగు’
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్య రంగంలో న్యూజిలాండ్ మద్దతుతో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. సుదీర్ఘ చర్చల అనంతరం న్యూజిలాండ్తో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ శనివారం అధికారికంగా ప్రకటించారు. ఇది తమ ప్రభుత్వ విజయమని, భవిష్యత్ అభివృద్ధికి ఇది పునాది వేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఈ ఒప్పందంపై న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ప్రధాని లక్సన్ భారత్తో ఒప్పందం కుదుర్చుకున్నారు.‘హిందుస్థాన్ టైమ్స్’ తెలిపిన వివరాల ఈ ఒప్పందం కేవలం రెండు దేశాల మధ్య వ్యాపార లావాదేవీలను మరింతగా పెంపొందించనుంది. భారత్లోని 140 కోట్ల మంది వినియోగదారుల మార్కెట్ను న్యూజిలాండ్కు చేరువ చేయనుంది. ప్రధాని మోదీ- లక్సన్ మధ్య జరిగిన చర్చల సారాంశం ప్రకారం.. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావడమే కాకుండా, వచ్చే 15 ఏళ్లలో భారత్లో సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఏర్పడనుంది. భారత్ నుండి ఔషధ ఉత్పత్తులు, న్యూజిలాండ్ నుండి అటవీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ప్రధానంగా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. తద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఇరు దేశాలు భావిస్తున్నాయి.కాగా న్యూజిలాండ్ అధికార సంకీర్ణ ప్రభుత్వంలో ఈ భారత్తో ఒప్పందం చిచ్చు రేపింది. ఆ దేశ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ ఈ డీల్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇది అశాస్త్రీయమైనదని విమర్శించారు. ముఖ్యంగా న్యూజిలాండ్ పాడి పరిశ్రమ (డైరీ సెక్టార్) ప్రయోజనాలను ఈ ఒప్పందంలో తాకట్టు పెట్టారన్నారు. పాల ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించలేదని పీటర్స్ ఆరోపిస్తున్నారు. అలాగే భారతీయులకు ఉపాధి వీసాల విషయంలో సులభతర నిబంధనలు తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు. దీని కారణంగా స్థానిక న్యూజిలాండ్ ప్రజల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై తమ దేశంలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నప్పటికీ ప్రధాని లక్సన్ దీని అమలుకు మొగ్గుచూపారు. కాగా 2024 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం 2.07 బిలియన్ డాలర్లుగా ఉండగా, అందులో భారత్ ఎగుమతులే అధికంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో భారత్కు న్యూజిలాండ్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది.ఇది కూడా చదవండి: Myanmar Elections: ప్రజాస్వామ్యంపై ‘జుంటా’ బరితెగింపు..
Myanmar Elections: ప్రజాస్వామ్యంపై ‘జుంటా’ బరితెగింపు..
మయన్మార్.. ఒకనాడు శాంతికి, ఆధ్యాత్మికతకు నిలయం. అయితే ఇప్పుడు ఈ దేశం హింసాయుత ఘటనల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడి అందమైన పగోడాల(బౌద్ధ ఆరామాలు) నీడన అమాయక ప్రజల ఆర్తనాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. దశాబ్దాలుగా సాగుతున్న సైనిక అణచివేత, ఇప్పుడు ఎన్నికల పేరుతో మరింత శక్తిని పొందేందుకు సిద్ధమవుతోంది. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ పేరుతో జరుగుతున్న ఈ తతంగం వెనుక దాగిన వాస్తవాలను తెలియజెప్పడమే ఈ కథనం ఉద్దేశం.అంతులేని ‘జుంటా’ అరాచకాలుమయన్మార్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికీ సైనిక నియంతృత్వానికీ మధ్య యుద్ధం కొన్ని తరాలుగా సాగుతూ వస్తోంది. 2021 ఫిబ్రవరిలో జరిగిన సైనిక తిరుగుబాటు ఆ దేశ ప్రజల ప్రజాస్వామ్య ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లింది. నాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ ‘జుంటా’ దేశంలో నిరంతరం తన ప్రతాపాన్ని చూపుతూ వస్తోంది. ‘జుంటా’ అరాచకాలకు వేలాది మంది ప్రజలు మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే స్వేచ్ఛ కోసం వారి పోరాటం కొనసాగుతూనే ఉంది.40కి పైగా పార్టీలను నిషేధించి..ఇప్పుడు జరగబోతున్న ఈ ఎన్నికలు, క్రూరమైన ‘జుంటా’ సైనిక పాలనకు చట్టబద్ధత కల్పించే ఒక ప్రయత్నంగా కనిపిస్తున్నాయని ‘ది గార్డియన్’ తన కథనంలో పేర్కొంది. మయన్మార్లో ప్రస్తుతం మూడు దశలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్ 2025, డిసెంబర్ 28న, రెండవ దశ 2026, జనవరి 11న, చివరి దశ పోలింగ్ జనవరి 25న జరగనుంది. అంగ్ సాన్ సూకీ తదితర నేతలు ఇంకా జైలులోనే మగ్గుతుండగా, ‘జుంటా’ 40కి పైగా రాజకీయ పార్టీలను నిషేధించి, కేవలం తమకు అనుకూలంగా ఉండే వారితోనే ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేననే వాదన వినిపిస్తోంది. ఇది కేవలం ప్రపంచ దేశాల కళ్లకు గంతలు కట్టడానికి వేస్తున్న ఒక నాటకం తప్ప, ప్రజల అభీష్టాన్ని గౌరవించే ప్రక్రియ కాదని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.‘జుంటా’ సైన్యానికి ఎదురు దెబ్బలుఈ ఎన్నికల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటినే విషయానికొస్తే.. దేశంలోని సగం కంటే ఎక్కువ భూభాగం ప్రస్తుతం సైనిక నియంతృత్వం చేతుల్లో లేదు. వివిధ జాతుల సాయుధ బలగాలు, పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్.. జుంటా సైన్యాన్ని ముప్పు తిప్పులు పెడుతున్నాయి. దేశం అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. ఇటువంటి సమయంలో పోలింగ్ పూర్తయ్యాక ఓట్ల లెక్కింపు సవ్యంగా సానేగా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో సగానికిపైగా ప్రాంతాల్లో ఓటర్ల జాబితా కూడా సిద్ధం కాకుండానే సైన్యం అన్నీ బాగున్నాయని చెబుతూ ప్రపంచాన్ని భ్రమ పరుస్తూ, ఎన్నికల దిశగా ముందుకు వెళుతోందనే మాట వినిపిస్తోంది. మయన్మార్ సైన్యాన్ని జుంటా అని పిలవడానికి ప్రత్యేక కారణముంది. దేశాన్ని సైనిక నేతల కమిటీ పాలిస్తున్నందున దీనికి ‘జుంటా’ అనే పేరు వచ్చింది. జుంటా అంటే ‘కమిటీ’ లేదా ‘సమావేశం’ అని అర్థం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు ‘జుంటా’ అనే పదాన్ని ఉపయోగిస్తారు. 2021లో మయన్మార్ సైన్యం.. అంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని తప్పించి, అధికారం చేపట్టినప్పటి నుండి ‘జుంటా’ సైన్యం పాలన అని అంటున్నారు.కత్తి పెట్టి ఓటు అడుగుతారా?ఇటువంటి తరుణంలో సైన్యం విడుదల చేసిన కొత్త ఎన్నికల నిబంధనలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఏదైనా పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీ మొత్తంలో నగదు డిపాజిట్ చేయాలి. వేల సంఖ్యలో సభ్యులను కలిగి ఉండాలి. ఈ నిబంధన చిన్న రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులపై నీళ్లు చల్లేదిగా మారింది. దీనివల్ల రేపు ఎన్నికల్లో గెలిచేది ఎవరో ముందే అంచనా వేయవచ్చంటున్నారు. ఈ పరిస్థితుల్లో మయన్మార్ సామాన్య ప్రజల వేదన వర్ణనాతీతంగా ఉంది. ‘మాకు ఓటు వేసే హక్కు కావాలి.. అయితే అది మా గొంతు మీద కత్తి పెట్టి అడిగేదిగా కాకూడదు’ అని వారంటున్నారు. భయం నీడన జరిగే ఏ ఎన్నికలైనా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించలేవు. ఈ ఎన్నికల తంతు పూర్తయ్యాక దేశంలో హింస మరింతగా పెరుగుతుందని, సాయుధ తిరుగుబాటుదారుల పోరాటం ఉధృతం అవుతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు.చైనా మద్దతు వెనుక ఏముంది?మయన్మార్ ‘జుంటా’ నిర్వహించిన జనాభా గణన ప్రకారం దేశంలోని 5.1 కోట్ల జనాభాలో దాదాపు 1.9 కోట్ల మంది వివరాలు సేకరించడం సాధ్యపడలేదు. భద్రతా కారణాల రీత్యా దేశంలోని పలు ప్రాంతాలకు అధికారులు వెళ్లలేకపోయారు. దీంతో ఏ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే చైనా వంటి దేశాలు ఈ ఎన్నికలకు మద్దతు ఇవ్వడం వెనుక వారి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే మయన్మార్ ప్రజలు ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామ్య ముసుగులో నిరంకుశ సైనిక పాలన కొనసాగుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం వారు ప్రపంచదేశాల సాయం వైపు చూస్తున్నారు. ఇది కూడా చదవండి: విష్ణు విగ్రహం కూల్చివేత.. థాయ్ వివరణ
ట్రంప్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. జెలెన్స్కీకి కొత్త టెన్షన్?
వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. అమెరికా మద్దతు లేకుండా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఉపయోగమేమీ ఉండదు అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, ప్రతిపాదనల విషయమై తాను.. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా మాట్లాడనున్నట్టు తెలిపారుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జెలెన్ స్కీ ఫ్లోరిడాలో చర్చలు జరుపనున్నారు. ఈ నేపథ్యంలో చర్చలపై ట్రంప్ స్పందిస్తూ.. రెండు దేశాల మధ్య శాంతి ప్రతిపాదనలను నేను ఆమోదించే వరకు ఏమీ ఉండదు. జెలెన్ స్కీ వద్ద ఎలాంటి సమాచారం ఉందో చూద్దాం. చర్చలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. త్వరలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కూడా చర్చలు జరుపుతాం. సమావేశం అంతా బాగానే జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్తో ఆదివారం ఫ్లోరిడాలో సమావేశమయ్యే అవకాశముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శుక్రవారం తెలిపారు. ‘మేం ఒక్క రోజు కూడా వృథాగా పోనివ్వడం లేదు. అధ్యక్షుడు ట్రంప్తో అతి త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. నూతన సంవత్సరం ప్రవేశించే లోగానే కీలక పరిణామాలు సంభవించొచ్చు’అని ఆయన మీడియాకు తెలిపారు. ట్రంప్ ప్రతిపాదిత 20–సూత్రాల ప్రణాళికలో 90 శాతం మేర ఏకాభిప్రాయం కుదిరిందన్నారు.ఆదివారం జరిగే సమావేశం సందర్భంగా ఉక్రెయిన్కు అమెరికా ఇచ్చే భద్రతా హామీలపై చర్చించనున్నామన్నారు. జెలెన్స్కీ వ్యాఖ్యలతో చర్చలు పురోగతిలో ఉన్నట్లు భావించవచ్చని పరిశీలకులు అంటున్నారు. అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుషె్నర్తో ఫలవంతమైన చర్చలు జరిగినట్లు జెలెన్స్కీ అంతకుముందు గురువారం ప్రకటించారు. పారిశ్రామికంగా కీలకమైన తూ ర్పు ప్రాంతం తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు సిద్ధమని జెలెన్స్కీ తెలిపారు. అయితే, రష్యా కూడా ఆ ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకుని, నిస్సైనిక ప్రాంతంగా ప్రకటించేందుకు సిద్ధం కావాలన్నారు.
జాతీయం
డిజిటల్ సంస్కరణలకు జగన్ మోడల్ను అప్లై చేస్తే..
సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసే రూపాయిలో.. ప్రజలకు చేరేది కేవలం 15 పైసలు మాత్రమే. మధ్యలో అవినీతి, పరిపాలనా ఖర్చులే అందుకు కారణాలుగా ఉన్నాయ్.. ఈ మాట ఒకప్పడు ప్రధాని హోదాలో రాజీవ్ గాంధీ చేసింది. తరువాతి దశాబ్దాల్లో, సంక్షేమ పథకాలలో లీకేజీలను తగ్గించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇన్నేళ్లు గడిచాక డిజిటల్ విప్లవం కారణంలో ఆ పరిస్థితిలో క్రమక్రమంగా మార్పు కనిపిస్తోంది.తప్పుడు క్లెయిమ్స్, ప్రజా సంక్షేమ పథకాలలో అవినీతి.. అర్హత లేని లబ్ధిదారులు అనేవి ఇందులో ప్రదానంగా సమస్యలు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1–3 ట్రిలియన్ డాలర్ల వరకు ఆ నష్టం జరుగుతోంది. అయితే.. దీనిని తగ్గించడానికి భారత్ సహా అనే దేశాలు ఏఐ, డిజిటల్ ఐడెంటిటీ, ప్రాసెస్ రీడిజైన్ వంటి పద్ధతులను పాటిస్తూ మెరుగైన ఫలితాలు రాబట్టుకోలుగుతున్నాయి.ఆయా దేశాల్లో..ఈ ఏడాది బీసీజీ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. యూఎస్ మెడికెయిడ్(అమెరికా ఫెడరల్ ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం) ఏఐని ఉపయోగించి తప్పుడు క్లెయిమ్స్ను తప్పించుకుని 1 శాతం ఖర్చు.. అంటే దాదాపు 9 బిలియన్ డాలర్ల దాకా ఆదా చేసుకోగలిగింది. ఆసియా-ఫసిఫిక్ రీజియన్లలో డాక్టర్లు పేషెంట్లకు అత్యధికంగా యాంటీబయటిక్స్ను సూచించిన విషయాన్ని డాటా బేస్ ఆధారంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించింది. ఆ వెంటనే వైద్యులను కంపేరిజన్ లేఖల ద్వారా అప్రమత్తం చేసింది. దీంతో ఒక ఏడాదిలోనే అలాంటి ప్రిస్క్రిప్షన్లలో 12 శాతం తగ్గుదల కనిపించింది.సింగపూర్లో ప్రజా సంక్షేమ పథకాల కోసం ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ (చాట్బాట్/డిజిటల్ సహాయకుడు) ప్రవేశపెట్టారు. దీంతో కాల్ సెంటర్లకు కాకుండా.. ప్రజలు ఏఐ అసిస్టెంట్ ద్వారా నేరుగా సమాధానాలు పొందగలిగారు. ఈ ప్రభావంతో ఫోన్ కాల్స్ సంఖ్య 50 శాతానికి తగ్గింది. ప్రభుత్వానికి ఖర్చు తగ్గడంతో పాటు ప్రజలకు సమాచారం అందడం సులభతరం అయింది.కెనడా రెవెన్యూ ఏజెన్సీ.. ఏఐను ఉపయోగిస్తూ ట్యాక్స్ మోసాలకు చెక్ పెడుతోంది. యునైటెడ్ కింగ్డమ్లో డిపార్ట్మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్(DWP) డేటా ఆధారిత ప్లాట్ఫారమ్ను అందుబాటులోకి తెచ్చుకుంది. ఈ డాటా ద్వారా తప్పుగా జరిగే చెల్లింపులను (overpayments) తగ్గించుకుని.. ఈ ఒక్క ఏడాదిలోనే 500 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.5,000 కోట్లకు పైగా) నష్టం జరగకుండా చూసుకుంది.మరి భారత్ విషయానికొస్తే..భారత్లో సంక్షేమ పథకాల లభ్ధిదారుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదు. అయితే వీటిల్లో లీకేజీలని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సత్పలితాలనే ఇస్తున్నాయి. భారత్లో బయోమెట్రిక్, ఆధార్ తరహా డిజిటల్ ఫస్ట్ ఐడీ.. వాటి అనుసంధానాలతో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ డిజిటల్ చెల్లింపుల సంస్కరణలతో ఈ ఏడాది సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తున్న ధనంలో దాదాపు 13% లీకేజీలు తగ్గాయని బీసీజీ నివేదిక ఇచ్చింది. అంటే.. అప్పటిదాకా వెళ్ళిన నిధుల్లో కొంత అర్హత లేని/నకిలీ లబ్ధిదారులకు వెళ్ళిందని సూచించినట్లే కదా.జగన్ మోడల్ కలిస్తే..ప్రజా సంక్షేమంలో భారత్ పూర్తిస్తాయి లీకేజీలను అరికట్టాలంటే .. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించిన డీబీటీ వ్యవస్థ(Direct Benefit Transfer) కచ్చితంగా అవసరమనే చర్చ నడుస్తోంది. అందుకు సహేతుకమైన కారణాలను వివరిస్తున్నారు. డీబీటీ మన దేశానికి కొత్తది కాదు. ఇది 2013లోనే ప్రారంభమైంది. అయితే ఇన్నేళ్ల కాలంలో సంపూర్ణంగా.. అదీ సమర్థవంతంగా అమలు చేసింది మాత్రం ఒక్క జగన్ ప్రభుత్వమే!.2019లో వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని అన్ని సంక్షేమ పథకాలను (అమ్మ ఒడి, రైతు భరోసా.. ఇలా పథకాలెన్నో) వంద శాతం డీబీటీ ఆధారంగా మార్చింది. ఆధార్ అనుసంధానం(తప్పనిసరి), బయోమెట్రిక్ ధృవీకరణలకు బ్యాంక్ ఖాతా లింక్ తప్పనిసరి చేసింది. తద్వారా నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరేలా చేసింది. అలా.. జగన్ స్వయంగా బటన్ నొక్కడం ద్వారా ఐదేళ్ల కాలంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేసిన నగదు.. అక్షరాల రూ.2.70 లక్షల కోట్లు.వైఎస్సార్సీపీ హయాంలో మధ్యవర్తుల అవసరం లేకుండా పోయింది. లంచాల రూపంలో అవినీతికి ఆస్కారం కనిపించలేదు. నేరుగా అర్హత ఉన్నవాళ్ల ఖాతాల్లోకే వెళ్తున్నందునా.. ఒక్క పైసా కోత పడేది కాదు. ఆఖరికి కరోనా టైంలోనూ డీబీటీ ద్వారానే సంక్షేమం అందించడం ఇక్కడ మరో రికార్డు. కాబట్టి.. జగన్ డీబీటీ మోడల్ను అనుసరిస్తూనే ఏఐ, బయోమెట్రిక్ ఆధారిత వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తే ప్రజా సంక్షేమంలో లీకేజీలను తగ్గించి ప్రతీ రూపాయి కూడా అర్హులైన వారికి చేరగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
యశవంతపుర (బెంగళూరు): ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో మహిళలు బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలను మొబైల్ఫోన్ రికార్డ్ చేయడానికి యత్నించాడో జూనియర్ టెక్నిషియన్. నాగరబావి సెకండ్ స్టేజ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సువెందు మెహతా (23) అనే కామోన్మాదిని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన నిందితుడు ఏడాదిగా ఈ ఆస్పత్రిలో టెక్నిషియన్గా పని చేస్తూ పీజీ హాస్టల్లో ఉండేవాడు. 20న ఉదయం 8:30 గంటలకు శస్త్రచికిత్స విభాగం గదిలో మహిళా సిబ్బంది బట్టలు మార్చుకొనే దృశ్యాలను రికార్డ్ చేయడానికి రహస్యంగా మొబైల్ఫోన్ని పెట్టాడు. ఫోన్ చూసిన నర్సులు కేకలు వేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. చదవండి: ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది!
బులెట్ బైక్ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు..
యశవంతపుర: అచ్చం సినిమా స్టైల్లో ఈ ఘటన జరిగింది. కారు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళుతున్న కారు.. ముందు వెళుతున్న బులెట్ బైక్ను ఢీకొని అర్ధ కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. సుమనహళ్లి వంతెనపై బుధవారం రాత్రి జరిగిన ఘటన వీడియో ఆలస్యంగా వైరల్ అయ్యింది. కారులోని వ్యక్తి ఇస్టానుసారం నడుపుతూ బులెట్ బైకును లాక్కొని వెళ్లాడు. నీ కారుకు బైక్ చిక్కుకుందని పక్కలో వెళ్లతున్న మరో కారు డ్రైవర్ హెచ్చరించినా పట్టించుకోలేదు. బుల్లెట్వాహనదారు రోహిత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ రభసకు కారు కింద నిప్పురవ్వుల ఎగజిమ్మాయి, మంటలు వ్యాపించటంతో ఇతర వాహనదారులు భయపడ్డారు. నాయండహళ్లి జంక్షన్ వద్ద కొందరు ఆ కారును అడ్డుకొని పోలీసులకు పట్టించారు. డ్రైవర్ తుమకూరు జిల్లా కుణిగల్కు చెందిన శ్రీనివాస్గా గుర్తించారు. తాగిన మత్తులో ఉన్నాడని తెలిసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలుదొడ్డబళ్లాపురం: గత నాలుగు రోజుల్లో బెంగళూరులో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు 1,784 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసారు. 1,27,938 వాహనాలు తనిఖీ చేయగా మద్యం తాగి నడుపుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. नशे में धुत कार ड्राइवर ने बुलेट को मारी टक्कर, 500 मीटर तक घसीटा #BhrashtMahayutiBMC pic.twitter.com/CfJD2pD7NX— HASHTAG BHARAT NEWS (@HTB_tweets) December 26, 2025
ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది!
ఆఫీస్ అయ్యాక మెట్రో రైలులో ఆ యువతి తాను ఉంటున్న ప్లేస్కు బయల్దేరింది. రద్దీలో ఎలాగోలా సీటు సంపాదించుకుని ఇద్దరు మగాళ్ల మధ్య కూర్చోగలిగింది. ఈలోపు.. తన పక్కన కూర్చన్న వ్యక్తి దిగిపోయి.. మరొకతను ఎక్కాడు. నెమ్మదిగా అతనిలోని కామోన్మాది బయటపడ్డాడు. ఒక్క నిమిషం ఆమెకు గుండె ఆగినంత పనైంది. అయితే ఆ వెంటనే ధైర్యం తెచ్చుకున్న యువతి ఆ మృగాడి చెంపలు చెడామడా వాయించింది.డిసెంబర్ 23 సాయంత్రం నమ్మా మెట్రో(బెంగళూరు) ప్రయాణిస్తున్న ఒక యువతి, తనకు ఎదురైన లైంగిక వేధింపుల ఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘నా ప్రయాణం అప్పటిదాకా సాఫీగా సాగింది. మధ్యలో పక్కన కూర్చున్న ప్రయాణికుడు దిగిపోవడంతో, మరో వ్యక్తి వచ్చి పక్కన కూర్చున్నాడు. నా మీద పడడం, శరీర భాగాలకు తాకడంతో ఇబ్బంది పడ్డా. అయితే రద్దీ కాబట్టి యాదృచ్ఛికమని భావించా. ఈలోపు.. అతని తీరు మారింది. కావాలనే చేస్తున్నాడని అర్థమైంది. ఇదేమిటన్నట్లు చూస్తే వెకిలినవ్వులు నవ్వాడు. ఇంతలో.. నేను దిగాల్సిన స్టేజ్ వచ్చింది. అతను మరికొందరిని కూడా ఇలాగే వేధించే అవకాశం ఉందని భావించా. అతని చెంప పగలకొట్టి లేవమన్నా. స్టేషన్ బయటకు వచ్చాక మరోసారి చెంప పగలకొట్టా. కెంపగౌడ మెట్రో స్టేషన్ సెక్యూరిటీ సిబ్బంది అది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు సర్దుకుపోవాల్సిన అవసరం ఏ అమ్మాయికీ లేదు’’ అంటూ ఆమె వీడియో ఉంచింది. ఈ ఘటనపై ఆ యువతి ఉప్పారపేట పీఎస్లో ఫిర్యాదు చేసింది. అతని పేరు ముత్తప్ప (48) అని తెలిసింది. తర్వాత తప్పయిపోయిందంటూ అతడు యువతి పాదాలపై పడి క్షమాపణలు చెప్పాడు. యువతి అంగీకరించడంతో అతనిని మందలించి పంపించివేశారు. లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్న యువతిపై ప్రశంసలు కురుస్తున్నాయి. Namma Metro Harassment Case | ನಮ್ಮ ಮೆಟ್ರೋದಲ್ಲಿ ಕಾಮುಕ ಅಂಕಲ್ ಕಾಟ | Bengaluru....#NammaMetro #MetroHarassment #BengaluruNews #WomenSafety #MajesticMetro #PublicSafety #HarassmentCase #bengaluru pic.twitter.com/YaNsNgACW4— Sanjevani News (@sanjevaniNews) December 26, 2025
ఎన్ఆర్ఐ
బ్రిటన్, కువైట్లో వైఎస్ జగన్ ముందస్తు పుట్టినరోజు
వేంపల్లె/కడప కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ముందస్తు పుట్టినరోజును యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్లో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించినట్లు వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో–ఆర్డినేటర్లు ఆలూరి సాంబశివారెడ్డి, డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, ఎల్.ఎన్.జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనం మెచ్చిన నాయకుడిగా, జననేతగా మాజీ సీఎం వైఎస్ ప్రఖ్యాతి పొందారన్నారు. ఆయన పుట్టినరోజును బ్రిటన్లో నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ యూకే కన్వీనర్లు సహాయ కన్వీనర్లు, కోర్ కమిటీ సభ్యులు, మహిళా విభాగం సభ్యులు, పెద్ద ఎత్తున యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కువైట్లో మెగా రక్తదానం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు పుట్టినరోజు వేడుకలు కువైట్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో కువైట్లోని జాబ్రియా బ్లడ్ బ్యాంకులో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ ఎ.సాంబశివారెడ్డి, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్. ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కువైట్లో ఉన్న జగనన్న అభిమానులు భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చారని, కువైటీల ఇళ్లలో పని చేస్తున్న మహిళలు, డ్రైవర్లు అనుమతి తీసుకొని వచ్చి 82 మంది రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. రక్తదానం చేసిన వారికి జగనన్న సంతకంతో కూడిన సరి్టఫికెట్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కో–కన్వీనర్ గోవిందు నాగరాజు, కువైట్ కో కన్వీనర్లు కె. రమణయాదవ్, మర్రి కళ్యాణ్, షా హుసేన్, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు పులపత్తూరు సురేష్ రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్. లక్ష్మీ ప్రసాద్ యాదవ్, షేక్ రహమతుల్లా, షేక్ అఫ్సర్ అలీ, కార్యవర్గ సభ్యులు షేక్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
మరోసారి అందరి మనసులు దోచేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యుఏఈ ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ రెస్టారెంట్లో అందరి బిల్లులు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్న ఆయన.. తాజాగా తన సింప్లిసిటీతో మరోసారి అందరి మనసులు దోచేశారు.సామాజిక సంబంధాలను బలపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ‘దుబాయ్ లంచ్’ ప్రాజెక్ట్లో భాగంగా షేక్ హమ్దాన్ బిన్, దెయ్రా ప్రాంతంలోని 200 కుటుంబాలను కలిశారు. అల్ ఖవానీజ్ మజ్లిస్ వద్ద జరిగిన సమావేశంలో వారితో చాలాసేపు గడిపారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అయినా ఏమాత్రం ఆడంబరాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా ప్రజలతో మమేకమైపోయారు. లంచ్ చేస్తూ వారిలో ఒకరయ్యారు. అందరిని పలకరిస్తూ విశేషాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ఓ చిన్నారిని కౌగిలించుకున్న హృద్యమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది. షేక్ హమ్దాన్ సింప్లిసిటీకి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. షేక్ హమ్దాన్ను అతని తండ్రి, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్తో పోలుస్తున్నారు. రాజకుటుంబం మంచితనాన్ని, సింప్లిసిటీని కొనియాడుతున్నారు. షేక్ హమ్దాన్ తండ్రి షేక్ మహమ్మద్ కూడా దుబాయ్ వాసులందరితో సాధారణ వ్యక్తిలా కలిపోతారు. తాను రాజునన్న అహంకారాన్ని ఎక్కడా ప్రదర్శించరు.దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం ఏంటంటే..?దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం స్థానిక కమ్యూనిటీ మజ్లిస్ల ద్వారా సామాజిక ఐక్యతను పెంపొందించడం. పరస్పర సహకారం, స్నేహాన్ని బలపరచడం. మజ్లిస్ల పూర్వపు సంప్రదాయ ప్రాధాన్యాన్ని తిరిగి తీసుకురావడం. ప్రజలతో నేరుగా సంభాషణకు వేదిక కల్పించడం.దుబాయ్ లంచ్ సందర్భంగా షేక్ హమ్దాన్ వ్యాఖ్యలు..దుబాయ్ లంచ్ కార్యక్రమ సందర్భంగా షేక్ హమ్దాన్ ఇలా అన్నారు. దుబాయ్ శక్తిని భవనాలతో కాదు, ప్రజల మధ్య ఐక్యతతో కొలవాలి. దుబాయ్ చరిత్రను కారుణ్యం, అతిథి సత్కారం, బాధ్యతా భావం నిర్మించాయి. ఈ విలువలను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి సమావేశాలు అవసరం.2026.. కుటుంబ సంవత్సరంకమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హెస్సా బింత్ ఈసా బుహుమైద్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ 2026ను కుటుంబ సంవత్సరంగా జరుపుకోడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో దుబాయ్లోని వివిధ ప్రాంతాల్లో ‘దుబాయ్ లంచ్’ కార్యక్రమాలు జరుగుతాయి.
ప్రవాస భారతీయులకు ప్రాణ గండం.. అసలేం జరుగుతోంది?
విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సిడ్నీ నుండి టొరంటో వరకు.. అక్కడి ప్రవాస భారతీయులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. విదేశాలకు వెళ్లడమంటే ప్రాణాలను పణంగా పెట్టడమేనా? అనే విధంగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా సిడ్నీలోని బోండి బీచ్లో భారతీయ విద్యార్థులపై జరిగిన దాడి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇటువంటి ఘటనల నేపధ్యంలో విదేశాల్లో ఉంటున్న తమవారు ఎలా ఉన్నారోనని భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులు అనునిత్యం ఆవేదన అనుభవిస్తున్నారు.జాత్యహంకార కోరలుకొన్ని పాశ్చాత్య దేశాల్లో జాత్యహంకారం అధికంగా కనిపిస్తుంది. ఈ జాబితాలోని దేశాలలో అమెరికా, కెనడా పేర్లు ముందుగా వినిపిస్తాయి. ఈ దేశాల్లో ఇటీవలి కాలంలో భారతీయులపై ద్వేషపూరిత నేరాలు (Hate Crimes) మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. కెనడాలో భారతీయుల పట్ల విద్వేషం మరింతగా పెరగడం వెనుక సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం ప్రధాన పాత్ర పోషిస్తోంది. అమెరికాలో 2024 నుంచి ఇప్పటివరకు 11 మందికి పైగా భారతీయ విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది స్థానిక భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. డబ్లిన్లో ఒక భారత సంతతి వ్యక్తిపై జరిగిన పాశవిక దాడి, సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.అభద్రతా భావంవిద్యా కేంద్రాల్లో అభద్రతా భావం మరింతగా పెరిగిపోయింది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో ఇది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆయా దేశాల్లో భారతీయ విద్యార్థులకు క్యాంపస్ భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల టెహ్రాన్లోని భారతీయ వైద్య విద్యార్థులు తమపై దాడులు జరుగుతున్నాయని మొరపెట్టుకున్నా, స్థానిక అధికార యంత్రాంగం స్పందించలేదనే వార్తలు వచ్చాయి. ఈ ఘటన దౌత్యపరమైన వైఫల్యంగా కనిపిస్తోంది. విద్యాభ్యాసం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి, వెళ్తున్న విద్యార్థులు, అక్కడ కనీస రక్షణ లేక జాత్యహంకార దాడులకు బలవుతుండటం గమనార్హం.సైద్ధాంతిక విద్వేషంవిదేశాల్లో భారతీయులపై దాడులకు జాత్యహంకారం ఒక్కటే కాదు.. రాజకీయం, మతం లేదా సామాజిక పరమైన అసహనం కూడా కారణంగా నిలుస్తోంది. ఈ తరహా దాడులు కేవలం దొంగతనాలు లేదా స్థానిక గొడవలకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆన్లైన్ వేదికలపై భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలు పలుచోట్ల హింసకు దారితీస్తున్నాయి. దీనికి తోడు నేరస్తులకు సరిహద్దులు దాటి ఉన్న సంబంధాలు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారాయి. సిడ్నీ ఘటనలో హైదరాబాద్ లింకులు బయటపడటం దీనికి ఉదాహరణగా నిలిచింది. విదేశాంగ శాఖ అప్రమత్తం విదేశాలలో పెరుగుతున్న ఈ హింసాత్మక ధోరణిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తీవ్రంగా పరిగణిస్తోంది. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే భారతీయులపై దాడులు క్రమంగా పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరించింది. ఇటువంటి సందర్భాల్లో విదేశీ ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మార్పు అనుకున్నంతగా కనిపించడం లేదు. భారతీయ రాయబార కార్యాలయాలు విద్యార్థులకు, వలసదారులకు రక్షణ కల్పించడంలో మరింత చురుకైన పాత్ర పోషించాలని పలువురు అంటున్నారు.భద్రతా సంక్షోభం?ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఆయా దేశాలు తక్షణ చర్యలు తీసుకోకుంటే ఇవి పునరావృతం అవుతాయని పలువురు అంటున్నారు. ప్రవాస భారతీయులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా నిలుస్తున్నారనడంలో సందేహం లేదు. దీనిని గుర్తించి అయినా అక్కడి ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించాలనే వాదన వినిపిస్తుంటుంది. ప్రవాస మేధావులు, విద్యార్థులపై దాడులు కొనసాగితే, అది ప్రపంచ భద్రతా సంక్షోభానికి దారితీస్తుందనేవారూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో కేవలం నిరసనలు తెలపడమే కాకుండా, అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించవచ్చని పలువురు సూచిస్తున్నారు. లేనిపక్షంలో విదేశీ కలలు కనే వేలాది మంది భారతీయుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: బోండి బీచ్ ఘటన: వృద్ధ దంపతుల త్యాగం.. వీడియో వైరల్
గేదెల దాముకు సేవారత్న అవార్డు
అమెరికాలో నివసిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రవాసాంధ్ర వాసి, మన అమెరికా తెలుగు అసోసియేషన్- మాట కో కన్వీనర్ దాము గేదెలను సేవారత్న అవార్డుతో సత్కరించారు. విజయనగరం జిల్లాలోని రాజాంకు చెందిన పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు... శ్రీకాకుళం జిల్లా కత్తులకవిటికి చెందిన ఎన్నారై, సామాజిక సేవా కార్యకర్త గేదెల దాము దంపతులను సేవారత్న అవార్డుతో సత్కరించారు.అవార్డు అందుకున్న దాము మాట్లాడుతూ… తనకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబీకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, సేవా కార్యక్రమాలు బాధ్యతను, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దామును పలువురు కళాకారులు సత్కరించారు.అంతకు ముందు జగన్మోహిని పద్య నాటక ప్రదర్శన, కేవీ పద్మావతి శిష్య బృందంతో భరత నాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం కమిటీ సభ్యులు, రాజాంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(చదవండి: ఘనంగా శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి)
క్రైమ్
అడవి పందుల బీభత్సం..!
పెంచికల్పేట్(సిర్పూర్): అడవుల జిల్లా కుమురంభీం ఆసిఫాబాద్లో అడవి పందులు బెంబేలెత్తిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పంటలను ధ్వంసం చేయడంతోపాటు మనుషులపైనా దాడులకు తెగపడుతున్నాయి. రైతులు తమ విలువైన పంటలు కోల్పోతున్నారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. అటవీశాఖ పరిహారం అందిస్తున్నామని చెబుతున్నా.. బాధితులకు ఎదురుచూపులు తప్పడం లేదు.పంటలు ధ్వంసంజిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, వరి పంటలు సాగు చేస్తారు. పత్తి చేలు అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్నాయి. దీంతో పందులు సీజన్ ముగిసే వరకు దాడులు చేస్తూ పత్తి చేలను ధ్వంసం చేశాయి. పలు మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అడవి జంతువుల స్వైర విహారంతో చేతికందిన పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వానాకాలం సీజన్లో సాగు చేసిన వరి కోతలు పూర్తయ్యాయి. దీంతో అడవి పందులు పత్తి, కంది పంటలపై పడ్డాయి. ఈ క్రమంలో పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కాపలా కాస్తున్న సమయంలో రైతులపైనా దాడులు చేస్తున్నాయి.పరిహారం కోసం ఎదురుచూపులుపంటలకు కాపలా వెళ్లే సమయంలో అన్నదాతలు ఎక్కువగా అడవి పందుల దాడుల్లో గాయపడుతున్నారు. రెండు నెలల క్రితం పెంచికల్పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన రైతు దూగుంట నారాయణ వరిపొలానికి వెళ్లిన సమయంలో అడవి పంది దాడిచేసింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా తిర్యాణి మండలం గోయోగం గ్రామానికి చెందిన మేక భీమేశ్పైనా పందుల గుంపు దాడిచేసింది. వీటి భయంతో అన్నదాతలు, కూలీలు పంట చేలకు వెళ్లడానికి జంకుతున్నారు. నష్టపోయిన పంటలు, గాయపడిన వారికి అటవీశాఖ ఆధ్వర్యంలో నష్టపరిహారం అందిస్తామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. క్షతగాత్రులకు గాయాల తీవ్రత ఆధారంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పంట నష్టాన్ని వ్యవసాయాధికారులు అంచనా వేస్తే బాధితులకు సాయం అందించాలి. కానీ చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో బాధితులకు ఎదురుచూపులు తప్పడం లేదు.దరఖాస్తు ఇవ్వాలిఅడవి పందుల దాడిలో పంటనష్టపోయిన రైతులు అటవీశాఖ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలి. వాటిని పరిశీలించి ఉన్నతాధికారులకు పరిహారం కోసం నివేదిస్తాం. గాయపడిన వారికి పరిహారం అందించాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు వివరాలు అందించాం. నిధులు మంజూరు కాగానే బాధితులకు అందిస్తాం.– అనిల్కుమార్, ఎఫ్ఆర్వో, పెంచికల్పేట్పంట కాపలాకు వెళ్లిన రైతుపై దాడితిర్యాణి: అడవి పందుల దాడిలో ఒకరికి గాయాలైన ఘటన తిర్యాణి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోయోగం గ్రామానికి చెందిన మేక భీమేశ్ గురువారం గ్రామ సమీపంలోని పంట చేనుకు కాపలా వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఇంటికి తిరిగి వస్తుండగా అడవి పందుల గుంపు ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన భీమేశ్ అరవడంతో పక్క చేనులో ఉన్న రైతులు గమనించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
యశవంతపుర (బెంగళూరు): ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో మహిళలు బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలను మొబైల్ఫోన్ రికార్డ్ చేయడానికి యత్నించాడో జూనియర్ టెక్నిషియన్. నాగరబావి సెకండ్ స్టేజ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సువెందు మెహతా (23) అనే కామోన్మాదిని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన నిందితుడు ఏడాదిగా ఈ ఆస్పత్రిలో టెక్నిషియన్గా పని చేస్తూ పీజీ హాస్టల్లో ఉండేవాడు. 20న ఉదయం 8:30 గంటలకు శస్త్రచికిత్స విభాగం గదిలో మహిళా సిబ్బంది బట్టలు మార్చుకొనే దృశ్యాలను రికార్డ్ చేయడానికి రహస్యంగా మొబైల్ఫోన్ని పెట్టాడు. ఫోన్ చూసిన నర్సులు కేకలు వేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. చదవండి: ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది!
డబ్బులు పంపుతావా.. జైలుకు వెళ్తావా
వికారాబాద్ జిల్లా: ‘డబ్బులు పంపు. లేదంటే జైలుకు పంపిస్తాను. చంపేస్తా’ అని గుర్తు తెలియని వ్యక్తి బెధిరింపు ఫోన్కాల్స్తో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి రాకంచర్ల గ్రామానికి చెందిన వడ్త్యా రాఘవన్ అలియాస్ పవన్(26) స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా రెండు సెల్ఫోన్ నంబర్లతో.. ఓ వ్యక్తి క్రైమ్ కానిస్టేబుల్ అని, కంట్రోల్ రూం నుంచి మాట్లాడుతున్నానని వివిధ రకాలుగా బెధిరించి డబ్బులు వేయమని వేధించసాగాడు. డబ్బులు పంపకుంటే జైలుకు పంపిస్తానని, చంపేస్తానని బెధిరించాడు. దీంతో మనస్తాపంచెందిన పవన్.. ఈ నెల 23న రాకంచర్ల ఇండస్ట్రీయల్ పార్కు ప్రాంతంలో పురుగు మందు తాగి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. వికారాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కాల్డేటా ఆధారంగా హైదరాబాద్కు చెందిన వ్యక్తిపై అనుమానం ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడిని డబ్బుల కోసం ఫోన్లో వేధించినట్లు గుర్తించారు. మృతుడి అన్న విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
శివాజీకి మహిళా కమిషన్ సూటి ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్లో నటుడు శివాజీ విచారణ కొనసాగుతోంది. దండోరా సినిమా ప్రమోషన్లో భాగంగా వేదికపై శివాజీ అనుచిత వాఖ్యలు(misogynistic remark) చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మహిళల వస్త్రధారణపై ఆయన అలా ఎందుకు మాట్లాడారో తెలుసుకునేందుకు కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ళ శారద విచారణ జరిపారు.శివాజీకి మహిళా కమిషన్ సంధించిన ప్రశ్నలు.. 1.మహిళల పై మీరు చేసిన వాఖ్యలు మహిళల గౌరవం, వ్యక్తిగత జీవితం ప్రభావితం చూపుతుందని కమిషన్ భావిస్తోంది.. మీరేమంటారు?2. ఒక నటుడిగా మీ వాఖ్యలు సమాజం పై ప్రభావం చూపుతాయి.. ఇది మీకు తెలిసే ఇలాంటి వాఖ్యలు చేశారని కమిషన్ భావిస్తోంది..3. మహిళల వస్త్రాధారణ ఆధారంగా వాళ్ల వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం.. చదువుకున్న వ్యక్తిగా ఇది మీకు తెలియదా?4. మీ వాఖ్యలు మహిళలను కించపరిచినట్లు కానట్లయితే వాటికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి!5. మీ వాఖ్యలు మహిళలపై దాడులు పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులొచ్చాయి.. వీటికి మీ సమాధానం?.. పై పశ్నలకు శివాజీ ఇచ్చిన వివరణలను తెలంగాణ మహిళా కమిషన్ రికార్డు చేసింది. దండోరా సినిమా ఈవెంట్లో శివాజీ చేసిన ఆ అసంబద్ధ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. చిన్మయి, అనసూయ, నిధి అగర్వాల్, పాయల్ రాజ్పుత్ లాంటి సెలబ్రిటీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరోవైపు.. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా స్వీకరించి.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ శివాజీకి నోటీసులు జారీ చేసింది. అంతకు ముంద.. తాను చేసిన వ్యాఖ్యలకు శివాజీ షరతులతో కూడిన క్షమాపణలు చెప్పారు. తన కెరీర్లో ఎప్పుడూ ఇలా జరగలేదన్న ఈ సీనియర్ నటుడు.. తన వ్యాఖ్యలను గానూ మహిళా లోకానికి మనస్ఫూర్తిగా క్షమాపణలంటూ మాట్లాడారు. అయితే తన వ్యాఖ్యల్లో దొర్లిన రెండు అసభ్య పదాలకు మాత్రమే సారీ చెబుతూనే.. తన స్టేట్మెంట్కు మాత్రం కట్టుబడి ఉన్నానంటూ చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ ఘటనలో శివాజీ మీద తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఫిర్యాదులు, కేసులు నమోదు కాకపోవడం మరో కొసమెరుపు.
వీడియోలు
విజయవాడ దుర్గమ్మ గుడికి కరెంటు బంద్.. ఆలయ చరిత్రలో తొలిసారి..
మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు? పెమ్మసానికి బిగ్ షాక్
పుష్ప-2 తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలు.. A11గా అల్లు అర్జున్
గొంతు కోసిన మాంజా.. యువకుడికి 19 కుట్లు!
నారాయణ మోసం వల్లే అమరావతి రైతు మృతి.. రామారావుకు YSRCP నివాళి
ఇటువంటి మోసగాళ్లను ఏపీ ప్రజలు ఎలా నమ్ముతున్నారు
ఒళ్ళు దగ్గర పెట్టుకో.. శివాజీ పై ప్రకాష్ రాజ్ ఫైర్
మాటలు జాగ్రత్త శివాజీ.. లైవ్ లో మహిళా కమిషన్ వార్నింగ్
ఈసారి ఇక కష్టమే.. పవన్ లో మొదలైన భయం
బాక్సాఫీస్ వార్ స్టార్ట్! 1000 కోట్ల బ్లాక్ బస్టర్ పై ఫోకస్

