Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Kolikapudi Srinivasa Rao Sensational Allegations On Mp Keshineni Chinni1
ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశాడు. ఇప్పుడు ఎంపీ పీఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నాడు’’ అంటూ కొలికపూడి మండిపడ్డారు.తిరువూరులో కిషోర్ ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడు. పార్టీ పదవులను సైతం కిషోర్ అమ్ముకుంటున్నాడు. అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళదాం. ఈ నెల 24న అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదాం. తాడోపేడో తేల్చుకుంటా’’ అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగులకు బాబు దగా

IND vs AUS: Rohit Sharma flops on ODI comeback in Perth2
ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు..? ఎన్నో ఆశలు పెట్టుకున్నాముగా

టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit sharma) తన పునరాగమనంలో తీవ్ర నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.7 నెలల తర్వాత భారత జట్టులోకి హిట్‌మ్యాన్‌పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.కానీ అందరి ఆశలను ఈ మాజీ కెప్టెన్ ఆడియశలు చేశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడానికి రోహిత్ ఇబ్బంది పడ్డాడు. మిచెల్ స్టార్క్‌, జోష్ హేజిల్‌వుడ్‌లు బౌన్సర్లతో రోహిత్‌ను భయపెట్టారు.భారత్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో రోహిత్‌ స్లిప్స్‌లో దొరికిపోయాడు. ఆ ఓవర్‌లో నాలుగో బంతిని హేజిల్‌వుడ్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బౌన్స్ ఎక్కువగా ఉండడంతో ఆ బంతిని రోహిత్ ఆడకుండా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ బంతిని ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్‌లో ఉన్న మాట్ రెన్‌షా చేతికి వెళ్లింది. దీంతో 14 బంతులు ఆడి కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ.. మైదానం వీడాల్సి వచ్చింది. పెర్త్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న రోహిత్ శ‌ర్మ‌.. ఈ విధంగా ఔట్ అవ్వ‌డాన్ని అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు అని సోషల్ మీడియాలో నెటిజ‌న్లు పోస్టులు పెడుతున్నారు. కాగా ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు ముందు రోహిత్ శ‌ర్మ‌ను వ‌న్డే కెప్టెన్సీ నుంచి త‌ప్పించిన సంగ‌తి తెలిసిందే. అత‌డి స్దానంలో శుభ్‌మ‌న్ గిల్‌కు జ‌ట్టు ప‌గ్గాల‌ను అప్ప‌గించారు. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ త‌ర్వాత రోహిత్‌కు భార‌త్ త‌ర‌పున ఇదే తొలి మ్యాచ్ కావ‌డం గ‌మ‌నార్హం. టీ20లు, టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికిన రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్నాడు.తుది జట్లుభారత్‌: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్‌), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్చదవండి: కొంచెం కూడా సిగ్గు లేదు.. జింబాబ్వేను బ్ర‌తిమాలుకున్న పాకిస్తాన్‌

Goods Train Derails Between Taida And Chimidipally Railway Stations3
రైలు ఇంజన్‌పై పడ్డ బండరాయి.. తప్పిన పెను ప్రమాదం

సాక్షి, అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఐరన్‌ లోడ్‌తో వెళ్తున్న రైలు ఇంజన్‌పై బండరాయి పడింది. దీంతో గూడ్స్‌ రైలు ఇంజన్‌ ముందు భాగం దెబ్బతింది. ఇవాళ (అక్టోబర్‌ 19, ఆదివారం) తెల్లవారుజామున తైడా​​​- చిమిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఘటన జరిగింది. కొత్తవలస​‍-కిరండోల్‌ లైన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.విశాఖ- కిరండోల్, కిరండోల్-విశాఖ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఆ మార్గంలో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది తక్షణమే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఇదీ చదవండి: ధనత్రయోదశి ప్రభావం.. బంగారం ఎంత కొన్నారంటే?

Final Destination Bloodlines Movie telugu review4
ఓటీటీలోకి చావును వెంటాడే సినిమా.. ధైర్యం ఉంటేనే చూడండి (రివ్యూ)

ఈ వీకెండ్‌లో మీరు అదిరిపోయే సినిమా చూడాలని అనుకుంటున్నారా..? అయితే, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్(Final Destination Bloodlines) చిత్రాన్ని చూసేయండి. అయితే, ఇందులో హింసాత్మకమైన సీన్స్‌ ఉంటాయి. మిమ్మల్ని కలవరపరిచే ఛాన్స్‌ ఉంది. కాబట్టి సున్నితమైన వారు, చిన్న పిల్లలు దూరంగా ఉండటం మంచిది. ఫైనల్ డెస్టినేషన్ మే 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ, అక్టోబర్‌ 16న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగు వర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ఓటీటీలో అదిరిపోయే సూపర్ థ్రిల్లర్ సినిమా చూడాలనే ఆసక్తి ఉంటే దీనిని వదులుకోకండి. రూ.440 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2700 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ మూవీ రన్‌టైమ్‌ కేవలం 1:50 మాత్రమే.ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంఛైజీలో భాగంగా ఈ ఏడాది పార్ట్‌-6 విడుదలైంది. చివరిగా 2011లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ 5 తర్వాత సుమారు 14 ఏళ్లకు ఈ ఫ్రాంఛైజీ నుంచి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ వచ్చింది. ఈ మూవీని దర్శకులు జాక్ లిపోవ్‌స్కీ, ఆడమ్ స్టీన్ తెరకెక్కించారు. కైట్లిన్ శాంటా జువానా, రిచర్డ్ హార్మన్, టోనీ టాడ్ వంటి స్టార్స్‌ ఈ సినిమాలో నటించారు.మన కుటుంబంలోని వ్యక్తులు ఏ విధంగా మరణిస్తారో ముందే తెలిస్తే ఎలా ఉంటుంది..? ఇదే కాన్సెప్ట్‌తో సినిమా కొనసాగుతుంది. అయితే, నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగానే ఈ మూవీని తీశామని మేకర్స్‌ చెప్పారు. ఇప్పటికే వచ్చిన ఈ ఫ్రాంఛైజీలోని 5 సినిమాలు కూడా ఇదే రేంజ్‌లో ఉంటాయి. తాజాగా విడుదలైన పార్ట్‌-6 కథ విషయానికి వస్తే.. 1968లో ఓ స్కై వ్యూ హోటల్‌లో జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి, వందల మందిని కాపాడుతుంది ఐరిస్ (బ్రెక్ బాసింగర్). జరగబోయే ప్రమాదం గురించి ఆమె పసిగట్టేస్తుంది. అయితే, వారి ఆయుష్షు తీరినా కూడా ఐరిస్‌ తెలివిగా కొందరిని కాపాడుతుంది. ఎంతో ఘోరమైన ప్రమాదంలో చాలామంది దారుణమైన రీతిలో మరణిస్తారు. కానీ ఐరిస్‌ వల్ల కొందరు ప్రాణాలతో బయటపడతారు. చావును ఎదిరించి ప్రాణాలతో ఉన్న వారిని ఒక్కొక్కరిగా చావు తరుముతూ వస్తుంది. అయితే, ఒక ఆర్డర్‌ ప్రకారమే వారు మరణిస్తారు. ఈ క్రమంలోనే వారందరినీ కాపాడిని ఐరిస్‌ వంతు ఒకరోజు వస్తుంది. ఆమె మరణిస్తే తన తర్వాతి కుటుంబ సభ్యులు కూడా చనిపోతారని గ్రహిస్తుంది. ఈ ఆర్డర్‌ను తప్పించేందుకు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? చావును ఎదిరించి ఎలా బతికింది..? తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఐరిస్ చాలా పకడ్బందీగా వేసుకున్న ప్లాన్ ఏంటి..? ఫైనల్‌గా తన కుటుంబ సభ్యులను కాపాడుకుందా..? ఈ క్రమంలోనే ఆమె మనవరాలు స్టేఫినీ (కైట్లిన్ శాంటా జువానా) చేసిన సాహసం ఏంటి..? అనేది తెలియాలంటే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ చూడాల్సిందే. ఇందులో ఎలాంటి అసభ్యకరమైన సీన్లు ఉండవ్‌.. ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ, ఘోరమైన ప్రమాదాలు కలవరపరిచేలా ఉంటాయి.ఫైనల్ డెస్టినేషన్ కథ సింపుల్‌గానే ఉన్నప్పటికీ ప్రేక్షకుడిని థ్రిల​్‌ చేస్తూ.. సస్పెన్స్ తో కూడిన డెత్ సీన్స్ ట్రీట్ ఇస్తాయి. గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న ఆడియెన్స్ ఈ మూవీకి దూరంగా ఉండటం మంచింది. మనిషి జీవితంలో మరణం ఏ రీతిలో పలకరిస్తుంది ముందే తెలుసుకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు.

25000 People Wouldve Died Trump Strikes Drug Carrying Submarine5
‘25 వేల మరణాలను అడ్డుకున్నా’: ట్రంప్‌ సంచలన ప్రకటన

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు సంచలన ప్రకటన చేశారు. ఇటీవల కరేబియన్‌లో అమెరికా జరిపిన సైనిక దాడిలో ఒక భారీ మాదకద్రవ్యాల జలాంతర్గామి ధ్వంసమైందని, ఈ దాడిలో ఇద్దరు నార్కో ఉగ్రవాదులను హతం చేశామని, మరో ఇద్దరిని సజీవంగా పట్టుకున్నామని తెలిపారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్‌ చేశారు. అధ్యక్షుడు ట్రంప్‌ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో.. ‘ఆ జలాంతర్గామిలో అధికంగా ఫెంటానిల్ తదితర మాదకద్రవ్యాలు ఉన్నాయని, అది నార్కోట్రాఫికింగ్ ట్రాన్సిట్ రూట్ ద్వారా అమెరికా వైపు వస్తున్నదని, దానిని అడ్డగించడం ద్వారా 25 వేల అమెరికన్ల మరణాలను నిరోధించగలిగానని’ ట్రంప్‌ పేర్కొన్నారు.తన సోషల్‌ మీడియా పోస్టులో ట్రంప్..‌ ‘ఒక భారీ మాదకద్రవ్యాల జలాంతర్గామిని నాశనం చేయడమనేది నాకు లభించిన గొప్ప గౌరవం. ఓడలో అధికంగా ఫెంటానిల్ ఉందని యూఎస్‌ ఇంటెలిజెన్స్ నిర్ధారించింది. ఆ జలాంతర్గామిలో నలుగురు నార్కోటెర్రరిస్టులు ఉన్నారు. వారిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సజీవంగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను వారి స్వదేశాలైన ఈక్వెడార్, కొలంబియాకు విచారణ కోసం తిరిగి పంపుతున్నారు’ అని పేర్కొన్నారు.ఈ దాడి తర్వాత అమెరికా నావికాదళం ఇద్దరు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకుందని, వారిని ఒక అమెరికన్ యుద్ధనౌకలో ఉంచిందని ఫాక్స్ న్యూస్ ధృవీకరించింది. కాగా గత నెలలో కరేబియన్‌లో యుద్ధ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి అమెరికా అనుమానిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా నౌకలను అడ్డగించడం ఇది ఆరోసారి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ తగిలిందని చెబుతున్న అమెరికా అధికారులు.. ఈ దాడుల్లో హతమైన 27 మంది మాదకద్రవ్యాల స్మగ్లర్లే అని ధృవీకరించే ఎటువంటి ఆధారాలను మీడియాకు అందించలేదు. ఈ రీతిలో అంతమొందించడం చట్టవిరుద్ధమని నిపుణులు వాదిస్తున్నారు. 📹 DESTROYED: Confirmed DRUG-CARRYING SUBMARINE navigating towards the United States on a well-known narcotrafficking transit route."Under my watch, the United States of America will not tolerate narcoterrorists trafficking illegal drugs, by land or by sea." - President Trump pic.twitter.com/N4TAkgPHXN— The White House (@WhiteHouse) October 18, 2025

Chandrababu coalition govt Fraud to Government employees in AP6
ఉద్యోగులకు బాబు దగా

నేను రాగానే మంచి పీఆర్సీ ఇస్తాను.. ఇంటీరియం రిలీఫ్‌ (ఐఆర్‌) ఇస్తాను.. మీకు రావాల్సిన డబ్బులన్నీ వెంటనే ఇచ్చేస్తాను.. తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇస్తాను.. ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ సమస్య లేకుండా చేస్తాను.. ఎర్న్‌డ్‌ లీవ్‌లు, సరెండర్‌ లీవ్‌లు, ఇతరత్రా బకాయిలన్నీ ఇచ్చేస్తాను.. పోలీసులకు కూడా శని, ఆదివారాలు సెలవు ఇస్తాను.. హోం గార్డుల జీతాలు పెంచుతాను. – ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడుఇతర రాష్ట్రాలు ఉద్యోగుల ఖర్చును భారీగా తగ్గించుకుంటున్నాయి.. ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉద్యోగుల జీతాల ఖర్చు ఎక్కువగా ఉంది.. పైగా ఆర్టీసీ ఉద్యోగులను తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపేశారు.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల వల్ల అదనపు ఖర్చు వస్తోంది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే బాగోలేదు.. ఖర్చులు పెరిగిపోతున్నాయి.. సీపీఎస్‌ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.. పీఆర్సీకి మరింత వెసులుబాటు కావాలి.. ఉద్యోగులు రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. అయినా దీపావళి కానుకగా ఒక్క డీఏను ఇస్తున్నాం. – అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాత సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన దీపావళి కానుక తుస్సుమంది. అప్పుడు కాదు ఇప్పుడు అంటూ ఎన్నికలకు ముందు ఊరించి, లెక్కలేనన్ని హామీలు గుప్పించి.. వారితో ఓట్లు వేయించుకుని.. తీరా గద్దెనెక్కాక హామీల సంగతే మరిచారు. నెల కాదు.. రెండు నెలలు కాదు.. ఏకంగా 16 నెలలైనా ఇచ్చిన హామీలకు దిక్కులేదని ఉద్యోగులు రోడ్డెక్కుతుంటే నాలుగు డీఏలకు గాను ఒకే ఒక్క డీఏ ఇస్తామని.. ఇంతకంటే ఎక్కువగా ఆశించవద్దన్నట్లు చెప్పుకొచ్చారు. ఎప్పటిలాగే ఓ వైపు గత ప్రభుత్వంపై నిందలేస్తూ.. మరో వైపు ఉద్యోగుల ఖర్చు తగ్గిస్తానంటూ షాక్‌ ఇస్తున్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలన్నీ వెంటనే తీరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు పూర్తి స్థాయిలో వారిని దగా చేశారు. నమ్మించి ఓట్లు వేయించుకుని నిండా ముంచారు. 16 నెలలుగా ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయకుండా కాలం గడుపుతూ చెవిలో పువ్వు పెట్టారు. రూ.31 వేల కోట్ల బకాయిల మాటే ఎత్తక పోవడం పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీల్లో కొన్నయినా అమలు చేస్తారని ఉద్యోగులు ఎదురు చూస్తుంటే ఒకే ఒక్క డీఏతో సరిపెట్టారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతుంటే ఒక్కటి మాత్రమే ఇస్తానని చెబుతూ ఆ ఖర్చు కూడా దండగేనని ఉద్యోగ సంఘాల సమావేశంలోనే చెప్పడం గమనార్హం. ఇతర రాష్ట్రాలు ఉద్యోగుల ఖర్చును భారీగా తగ్గించుకుంటున్నాయని, తాను కూడా అదే పని చేస్తానని చెప్పడంతో డీఏ ఏమో గానీ, మున్ముందు తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2019లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం 27 శాతం ఐఆర్‌ ప్రకటించారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ తల్లకిందులైనా పీఆర్సీ అమలు చేశారు. కానీ చంద్రబాబు తాను వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తానని చెప్పి ఆ మాటే మరచిపోయారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి గురించి ఆలోచన కూడా చేయలేదు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నిసార్లు అడిగినా వారికి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. వారి ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతుండడం, వేలాది మంది టీచర్లు రోడ్డెక్కి భారీగా ధర్నా చేయడంతో ఉలిక్కిపడ్డారు. ఎలాగోలా వారి ఆందోళనను తగ్గించడానికి తనకు అలవాటైన రీతిలో మభ్యపెట్టే ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే శనివారం ఉద్యోగ సంఘాల నాయకులతో గంటల తరబడి సమావేశం నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నాయకుల్లోనే తమకు అనుకూలంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి చెందిన బాకా నాయకుడితో ఈ సమావేశంలో రెండు డీఏలు ఇస్తే చాలని, ఇంకేమీ వద్దని చెప్పించారు. చివరికి కంటి తుడుపుగా ఒక డీఏ ఇస్తానని, ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదంటూ సూక్తులు చెప్పి తప్పించుకున్నారు. అధికారంలోకి వస్తూనే పీఆర్సీ ఇస్తానన్నారుగా.. నిజానికి ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వచ్చీ రావడంతోనే మంచి పీఆర్సీ ఇస్తానని చెప్పి, ఇప్పుడు దాని గురించి తనకు వదిలేయాలని, ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తానని చెప్ప­డంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. నిజానికి ఉద్యోగులు పీఆర్సీ సంగతి దేవుడెరుగు కనీసం రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్‌ స్థానంలో కొత్త కమిషనర్‌ను నియమించాలని కోరుతుంటే ఆ విషయాన్నే పట్టించుకోలేదు. అధికారంలోకి రాగానే చేస్తానని చెప్పిన మాటను ఆయన నీటి మీద రాతగా మార్చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లిస్తామని చెప్పి దానిపైనా నోరు మెదపలేదు. ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌ను తాను వచ్చిన 6 నెలల్లో పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని 16 నెలలుగా పట్టించుకోకుండా ఇప్పుడు మరో 6 నెలల్లో చేస్తానని చెప్పడంతో అది జరిగేది కాదేమోనని ఉద్యోగులు వాపోతున్నారు. సీపీఎస్‌ ఉద్యోగులకు న్యాయం చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ విషయం సుప్రీంకోర్టులో ఉందని అబద్ధం చెబుతూ తప్పించుకుంటున్నారు. చైల్డ్‌ కేర్‌ లీవులు 180 వాడుకోవచ్చని చంద్రబాబు చెప్పినా, నిజానికి అది జగన్‌ హయాంలోనే అమల్లోకి వచ్చింది. తక్కువ రేటుకు ఇంటి స్థలం ఇస్తామని ఇచ్చిన హామీ ఊసే లేకుండా పోయింది. అన్ని ఉద్యోగాలిస్తే ఎలా! తన ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకపోగా, జగన్‌ హయాంలో 1.26 లక్షల శాశ్వత ఉద్యోగాలివ్వడాన్ని చంద్రబాబు తప్పు పట్టడం గమనార్హం. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా అంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను ఒకేసారి ఇవ్వడాన్ని ఆయన అనవసరమని చెప్పడం చూసి ఉద్యోగులు విస్తుపోతున్నారు. తద్వారా ఉద్యోగుల పట్ల తనకున్న చులకన భావాన్ని సీఎం బయట పెట్టుకున్నారు. సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతగా మేలు జరిగిందో చంద్రబాబు మరచిపోయారని, లేదా ఉద్దేశ పూర్వకంగా ఆ వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని, ప్రైవేటు ఏజెన్సీల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వ్యవస్థ స్థానంలో ఆప్కాస్‌ను ప్రవేశ పెట్టడాన్ని కూడా చంద్రబాబు తప్పు పట్టడం పట్ల ఆయా ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వారి వల్ల వేల కోట్ల రూపాయల వ్యయం పెరిగిపోయిందని చెప్పి వారిని కించపరిచారు. ఇంతా చేసి.. ఇప్పుడు మొక్కుబడిగా ఒక డీఎతో దీపావళి కానుక అంటున్న సీఎం మాటలు, వ్యాఖ్యలను బట్టి తమ పరిస్థితి మున్ముందు మరింత దారుణంగా ఉంటుందనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో..చంద్రబాబు 2018 జూలై నుంచి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవ్వలేదు. ⁠కనీసం ఐఆర్‌ కూడా ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లారు. 2019 మేలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే (10 జూన్‌ 2019) వైఎస్‌ జగన్‌ 27 శాతం ఐఆర్‌ ప్రకటించారు. 2019 జూలై నుంచి వర్తింపచేసి ఆగస్ట్‌ ఒకటిన కొత్త జీతాలు ఇచ్చారు. తద్వారా 2019 జూలై నాటికి 30 ఏళ్లు సర్వీస్‌ ఉన్న ఒక ఉద్యోగికి సుమారుగా రూ.64 వేల బేసిక్‌ ఉంటే 27 శాతం.. అంటే రూ.17,280 అదనంగా జీతంలో కలిసింది. మరో వైపు కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారినా, జగన్‌ ప్రభుత్వం ఉద్యోగులకు 2022లో పీఆర్సీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తరహాలో వెంటనే ఐఆర్‌ ప్రకటించి ఉంటే.. 2024 జూలై నాటికి బేసిక్‌ సుమారు రూ.72 వేలుగా ఉన్న ఉద్యోగికి.. కనీసం 27 శాతం ఐఆర్‌ ఇచ్చినా ప్రతి నెల రూ.19,440 అదనంగా జీతం వచ్చి ఉండేది. అలా చేయకపోవడంతో ఆ ఉద్యోగి రూ.3 లక్షలకు పైగా నష్టపోయారు.16 నెలలుగా మోసం, దగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్‌ ఇస్తామని.. మంచి పీఆర్సీ ఇస్తామని.. పెండింగ్‌ బకాయిలన్నీ ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయింది. ఐఆర్‌ ప్రకటించలేదు.. ఉన్న పీఆర్సీ కమిషన్‌ను రద్దుచేసింది.. కొత్త పీఆర్సీ కమిషన్‌ను ప్రకటించలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రభుత్వం శనివారం చర్చలకు పిలిస్తే.. ఐఆర్‌ ప్రకటిస్తారని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు ఇస్తారని.. కొత్త పీఆర్సీ కమిషన్‌ను ప్రకటిస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఆశించారు. కానీ, ఒక్క డీఏను మాత్రమే ప్రకటించింది. ఇది ఉద్యోగులను మోసం చేయడమే. తక్షణమే ఐఆర్‌ ప్రకటించాలి.. నాలుగు డీఏలు ఇవ్వాలి.. పెండింగ్‌లో ఉన్న బకాయిలు రూ.32 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలి. – కాకర్ల వెంకటరామిరెడ్డి, చైర్మన్, ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ దాటవేత వైఖరి దారుణం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తవుతున్నా ఒక్కరోజు కూడా ఉద్యోగ సంఘాలను పట్టించుకోని ప్రభుత్వం శనివారం రోజంతా వారితో చర్చలు జరిపి ఒక్క డీఏ మాత్రమే ప్రకటించి తీవ్ర నిరాశకు గురిచేసింది. ఒక్క డీఏ ఇవ్వడానికి ఇంత హంగామా ఎందుకు? ఐఆర్‌ ఊసేలేదు. పీఆర్సీపై ప్రభుత్వం దాటవేత వైఖరిని అవలంబించడం దారుణం. – లెక్కల జమాల్రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కో–చైర్మన్, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉసూరుమనిపించారుఉపాధ్యాయ, ఉద్యోగుల్లో ప్రభుత్వం తీవ్ర నిరాశ నింపింది. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినప్పటికీ నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉండగా కేవలం ఒక్క డీఏ మాత్రమే ప్రకటించారు. 30 శాతం ఐఆర్‌ ఊసేలేదు. పీఆర్సీ కమిటీ ప్రస్తావన లేదు. కేవలం రూ.160 కోట్లు మాత్రమే విడుదల చేసి ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి ఉసూరుమనిపించారు. దీనిని ప్రభుత్వం దీపావళి కానుక అని గొప్పలు చెప్పుకుంటోంది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. వైఎస్సార్‌టీఏ పక్షాన తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. – పి.అశోక్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్‌టీఏఉద్యోగవర్గం జీర్ణించుకోలేకపోతోందికొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. ఈరోజు ఉద్యోగ, పెన్షనర్ల సంఘ నాయకులతో గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్, ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశాలు జరిపి ఒక్క విడత డీఏ మాత్రమే ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా మధ్యంతర భృతిని ఇవ్వకపోవడం, నాలుగు విడతల డీఏ పెండింగ్‌ ఉంటే ఒకటి మాత్రమే మంజూరు చేయడం, బకాయిలు ఊసే ఎత్తకపోవడాన్ని ఉద్యోగవర్గం జీర్ణించుకోలేకపోతోంది. దీపావళి పండగకు ఇవి తప్పక ఇస్తారని ఎదురుచూశారు. కానీ, ఒక్క డీఏతో తుస్సుమనిపించారు. – నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఉద్యోగ–పెన్షనర్స్‌ విభాగం అధ్యక్షుడుహామీలిచ్చి అన్యాయం అధికారంలోకి రాగానే డీఏ, ఐఆర్, మంచి పీఆర్పీ ఇస్తామని హామీలిచ్చి ఇప్పుడు ఒక్క డీఏ ఇవ్వడం అన్యాయం. సాధారణంగా అయితే ఆరు నెలలకు ఒకసారి డీఏ ఇవ్వాలి. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉంటే కేవలం ఒక్క డీఏ ఇవ్వడానికి సీఎం స్థాయిలో చర్చలు ఆశ్చర్యం కలిగించాయి. – వి.రెడ్డి శేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి ఎందుకింత మోసం ఉద్యోగ, ఉపాధ్యాయులను ఎందుకింత మోసం చేయడం? పీఆర్‌సీ వేస్తారని ఆశించాం. ప్రభుత్వం దీనిపై నోరు మెదపకపోవడం అన్యాయం. కనీసం రెండు డీఏలైనా ఇస్తారని అనుకున్నాం. కానీ, ఒక్క డీఏ ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఒక్క డీఏ కోసం రెండ్రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో కాలయాపన చేయడం సమంజసం కాదు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేయడం దారుణం. మిగిలిన పెండింగ్‌ ఎరియర్స్‌ వెంటనే విడుదల చేయాలి. – జీవీ రమణ, రాష్ట్ర కార్యదర్శి. యూటీఎఫ్‌పీఆర్సీ, ఐఆర్‌ ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని సమావేశంలో గట్టిగా పట్టుబట్టాం. రెండు డీఏలైనా ఇవ్వాలని అడిగాం. అయితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులవల్ల ఒక్క డీఏ మాత్రమే ఇస్తున్నామని, సర్దుకోవాలని సీఎం చెప్పారు. పీఆర్‌సీ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశాం. అందుకు కాస్త సమయం పడుతుందని, త్వరలో చర్యలు చేపడతామన్నారు. ఒక్క డీఏ వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు చిరు సంతోషమే మిగిలింది. పీఆర్‌సీ, ఐఆర్‌పై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది. – బాలాజీ, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘంబకాయిల గురించీ పట్టదా? 2023 జూలై నుంచి పీఆర్సీ ప్రకటించాల్సి ఉంది. 30 శాతం మధ్యంతర భృతి అందించి ఉద్యోగులను ఆదుకోవాల్సింది పోయి కంటితుడుపు చర్యగా డీఏ ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పెండింగ్‌ బకాయిలు కూడా సత్వరమే చెల్లించాలని ఏడాదిన్నరగా చేస్తున్న డిమాండ్‌ పట్టించుకోకపోవడం బాధాకరం. – పిసిని వసంతరావు, అధ్యక్షుడు, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర నిరాశ దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు తీపికబురు అందిస్తారని అనుకున్నాం. చివరికి ఒక్క డీఏ ప్రకటించి తీవ్ర నిరాశ కలిగించారు. 11వ పీఆర్‌సీ బకాయిలు చెల్లించి 12వ పీఆర్‌సీ కమిషన్‌ వేసి ఐఆర్‌ ప్రకటించి ఉంటే అందరూ ఆనందించే వారు. కానీ ప్రభుత్వం తీవ్రంగా నిరాశపరిచింది. – తమ్మినేని చందనరావు, స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, శ్రీకాకుళంఅందరిలోనూ అసంతృప్తి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ ప్రభుత్వ వాగ్దానాల అమలు కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే, 4 డీఏలకు బదులు కేవలం ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడంపై అందరిలోనూ అసంతృప్తి ఉంది. పండుగకు కనీసం రెండు డీఏలైనా ఇస్తే బాగుండేది. ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పండగ వేళ సర్కారు ఉసూరుమనిపించింది. – ఏ సుందరయ్య, ఫ్యోప్టో ఛైర్మన్, విజయవాడ, ఎన్టీఆర్‌ జిల్లా ప్రభుత్వ వైఖరి దారుణం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలుపర్చడంలో విఫలమైన ప్రభుత్వం నాలుగు డీఏ బకాయిల్లో కేవలం ఒక్కటి మంజూరుచేసి చేతులు దులుపుకోవడం దారుణం. పీఆర్‌సీ కమిషన్‌ను నియమించి, ఐఆర్‌ ప్రకటించాలని చేసిన డిమాండ్లను పట్టించుకోకపోవడం సరికాదు. ఒక్క డీఏ మంజూరు ద్వారా ఒనగూరే ప్రయోజనమేమీ లేదు. – కె. నరసింహారావు, గుంటూరు జిల్లా ఫ్యాప్టో చైర్మన్‌

Dhanteras 2025: Gold Rush and Rs 1 Lakh Crore Business7
ధనత్రయోదశి ప్రభావం.. బంగారం ఎంత కొన్నారంటే?

ఈ ఏడాది ధంతేరస్ (ధనత్రయోదశి) సందర్భంగా భారతీయ వినియోగదారులు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వ్యాపారుల సంఘం శనివారం తెలిపింది. బంగారం, వెండి ధరలు బాగా పెరిగినప్పటికీ.. సుమారు 60,000 కోట్ల రూపాయలు వీటికోసం ఖర్చు చేసినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా. ఈ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే 25% ఎక్కువ.బంగారం ధరలు గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 60 శాతం పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు దాటేసింది. ధరలు పెరిగినప్పటికీ.. సెంటిమెంట్, డిమాండ్ రెండూ కలిసొచ్చాయని సీఏఐటీ ఆభరణాల విభాగం, ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా అన్నారు. ఢిల్లీ బులియన్ మార్కెట్లలో మాత్రమే రూ. 10,000 కోట్లకు పైగా అమ్మకాలు నమోదయ్యాయని ఆయన అన్నారు.ధంతేరస్, దీపావళి సమయంలో బంగారం కొనుగోలు శుభప్రదమని చాలామంది భావిస్తారు. ఈ కారణంగా ప్రతిఏటా ఈ పండుగల సమయంలో బంగారం అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా భారీగా పెరిగి.. కేజీ వెండి రేటు సుమారు రూ. 2 లక్షలు దాటేసింది. ఈ రేటు ఇందుకు ముందు ఏడాదితో పోలిస్తే.. 55 శాతం ఎక్కువ.బంగారం, వెండి అమ్మకాలు కాకుండా.. వంట సామాగ్రి అమ్మకాలు రూ.15,000 కోట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ వస్తువులు రూ.10,000 కోట్లు, అలంకరణ.. మతపరమైన వస్తువుల అమ్మకాలు రూ.3,000 కోట్లుగా ఉన్నాయని వ్యాపారుల సంఘం తెలిపింది.ఇదీ చదవండి: గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్ధన్‌తేరస్ కొనుగోలు పెరుగులపై.. సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, జీఎస్టీ రేట్లలో తగ్గింపులు, స్థానికంగా తయారైన ఉత్పత్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహం అందించడం వల్ల పండుగల సమయంలో వ్యాపారాలు పెరగడానికి దోహదపడ్డాయని అన్నారు. సాంప్రదాయ మార్కెట్లు, స్థానిక ఆభరణాల స్టోర్స్.. రిటైల్ దుకాణాలు రికార్డు స్థాయిలో కస్టమర్ల రద్దీని నమోదు చేశాయని పేర్కొన్నారు.

Bihar NDA candidate Seema Singh Nomination Rejected from Marhaura8
బీహార్‌ ఎన్నికలు.. ఎన్డీయే కూటమికి బిగ్‌ షాక్‌

పట్నా: బీహార్‌ అసెంబ్లీ(Bihar Assembly Election) ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే(NDA Alliance) కూటమికి ఊహించని షాక్‌ తగిలింది. మధుర అసెంబ్లీ స్థానం నుంచి కూటమి తరఫున ఎల్‌జేపీ అభ్యర్థిగా నిలిచిన సీమా సింగ్(Seema Singh) నామినేషన్ రద్దైంది. దీంతో, మధుర అసెంబ్లీ స్థానంలో ఎన్డీయే అభ్యర్థి పోటీలో లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పోటీ ఆర్​జేడీ, జన్​ సురాజ్ పార్టీల మధ్య ఉండనుంది.వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చాప్రా జిల్లాలోని మధుర అసెంబ్లీ స్థానం నుంచి ఎన్​డీఏ కూటమి తరఫున ఎల్‌జేపీ అభ్యర్థిగా సీమా సింగ్ నామినేషన్ వేశారు. మొదటి విడత నామినేషన్ వేయడానికి అక్టోబర్ 17 చివరి తేదీ కావడంతో ఆమె.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అధికారులు శనివారం పరిశీలించగా సీమా సింగ్ నామినేషన్‌లో లోపం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె నామినేషన్ రద్దు చేసినట్లు డిప్యూటీ ప్రొవిన్షియల్​ ఎలక్షన్​ ఆఫీసర్​ (డీపీఆర్వో) ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే, ఈ నియోజకవర్గంలో నామినేషన్‌లో లోపం కారణంగా సీమా సింగ్‌తో పాటు మొత్తం నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారి తెలిపారు.సినిమా నుంచి పాలిటిక్స్‌లోకి.. సీమా సింగ్ పలు భోజ్‌పురి సినిమాల్లో నటించారు. తన మార్క్‌ నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, సినిమా రంగం నుంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చి అందరనీ ఆశ్చర్యపర్చారు. కాగా, చిరాగ్ పాశ్వాన్‌ తనకు మధుర స్థానాన్ని కేటాయించిన తర్వాత ఆమె చాలా నియోజకవర్గంపై ఫోకస్‌ పెట్టి రాజకీయంగా యాక్టివ్‌గా ప్రచారం చేసుకుకున్నారు. మరోవైపు.. ఆమె తన అఫిడవిట్​లో తొమ్మిదో తరగతి చదివినట్లు పేర్కొన్నారు. దీంతో, ఆమెపై ప్రజల్లో మరింత ఫోకస్‌ పెరిగింది. ఇదిలా ఉండగా.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సీమా సింగ్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ అనుమతి లేకుండా షేక్‌పురాలో ఆమె హోలీ నిర్వహించిన కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదిలా ఉండగా.. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈసారి అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి, జన్ సురాజ్‌ పార్టీ మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. బీహార్‌ అసెంబ్లీకి గడువు నవంబర్‌ 22తో ముగియనుంది.

Pakistan And Afghanistan Agree To Ceasefire After Clashes9
పాక్‌-ఆప్ఘన్‌ మధ్య కీలక చర్యలు.. శాంతికి ఓకే

దోహా: కొద్ది రోజులుగా పాకిస్తాన్‌-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఖతార్‌, తుర్కియే మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య శాంతి చర్యలు ఫలించాయి. పాక్‌-ఆప్ఘన్‌ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ మేరకు ఖతార్‌ (Qatar) విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో రెండు దేశాల సరిహద్దులో దాడులు నిలిచిపోనున్నాయి.ఖతార్‌ రాజధాని దోహా వేదికగా పాకిస్తాన్‌, ఆప్ఘనిస్థాన్‌ మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఈ చర్చలకు ఖతార్‌, తుర్కియే (Turkey) మధ్యవర్తిత్వం వహించాయి. చర్చల్లో పాల్గొనేందుకు ఇరుదేశాలకు చెందిన రక్షణ మంత్రులు ఖతార్‌ వచ్చారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణకు సంబంధించి కీలకంగా చర్చించారు. రెండు దఫాలుగా జరిగిన ఈ చర్చల్లో శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో, శాంతి చర్చలు ఫలించాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన స్థిరత్వాన్ని కొనసాగించడంపై రానున్న రోజుల్లో మరిన్ని చర్చలు జరిపేందుకు కూడా వారు అంగీకరించారని ఖతార్‌ వెల్లడించింది. ఈ మేరకు ఖతార్‌ (Qatar) విదేశాంగ మంత్రిత్వశాఖ స్వయంగా ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించింది.ఇక, శుక్రవారం అర్ధరాత్రి ఆఫ్ఘనిస్థాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌పై పాక్‌ వైమానిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాక్‌ చేసిన దాడుల్లో యువ క్రికెటర్లు, మహిళలు, చిన్నారులతో సహా కనీసం 10 మంది మృతి చెందారు. ఈ క్రమంలో పక్క దేశం నుంచి వస్తున్న దురాక్రమణలకు మాత్రమే ప్రతిస్పందిస్తున్నామన్నట్లుగా ఇరువర్గాలు వాదనలు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆప్ఘన్‌ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడంతో పాటు సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం పునరుద్ధరణ చర్యలపై మాత్రమే దృష్టి పెట్టామని పాక్‌ పేర్కొంది. సరిహద్దుల్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలను ఆప్ఘన్‌ ఖండించింది.

Returning For Diwali Stranded In Italy As Air India Cancels Flight10
Italy: ఎయిర్‌ ఇండియా షాక్‌.. దీపావళి ‍ప్రయాణాలు వాయిదా!

న్యూఢిల్లీ: విదేశాల్లో ఉంటున్న పలువురు భారతీయులు దీపావళి పండుగకు స్వదేశానికి వస్తుంటారు. ఇందుకోసం ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. అలాంటి ప్రయాణికులకు ఎయిర్‌ ఇండియా షాకిచ్చింది. కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో పాల్గొందామనే సంతోషంలో ఉన్న ప్రవాస భారతీయుల ఆశలపై ఎయిర్‌ ఇండియా నీళ్లు జల్లింది.దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు ఇటలీ నుండి భారతదేశానికి బయలుదేరిన వందలాది మంది ప్రయాణికులు తాము శుక్రవారం ఎక్కాల్సిన ఎయిర్‌ ఇండియా విమానం రద్దయ్యిందని తెలియడంతో షాక్‌నకు గురయ్యారు. తదుపరి విమానం సోమవారం(దీపావళి) లేదా ఆ మర్నాడు(మంగళవారం) బుక్‌ చేసుకోవచ్చని ఎయిర్‌ ఇండియా చెప్పడంతో వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. Hundreds of passengers returning for Diwali break left stranded after Air India’s flight from Milan to Delhi on Oct 17 (AI 138) is cancelled due to a technical glitch. Return now scheduled for four days later. Some were taken to a hotel, where they were later asked to leave.… pic.twitter.com/8LcmrocBfX— Jagriti Chandra (@jagritichandra) October 18, 2025సాంకేతిక సమస్య కారణంగా మిలన్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 138 విమానం రద్దు అయ్యిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది.‘ఎయిర్‌ ఇండియా.. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తుందని, షెడ్యూల్ చేసిన విమానంలో సాంకేతిక సమస్య కారణంగా కారణంగా.. 2025, అక్టోబర్ 17న మిలన్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 138 విమానం రద్దు అయ్యింది’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ విమానంలో ఎక్కాల్సిన ప్రయాణికులకు హోటల్ వసతి కల్పించామని, విమానాశ్రయం సమీపంలోనే వారికి ఈ ఏర్పాట్లు చేశామని ఎయిర్ ఇండియా తెలిపింది.‘ఎయిర్ ఇండియాతో పాటు ఇతర విమానయాన సంస్థలతో సీట్ల లభ్యత ఆధారంగా 2025, అక్టోబర్ 20 లేదా ఆ తర్వాత ప్రత్యామ్నాయ విమానాలలో ప్రయాణికులు తిరిగి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఇక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులందరికీ భోజనంతో సహా అవసరమైన అన్ని సహాయాలను ఎయిర్‌ ఇండియా అందిస్తుంది. వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతపై ఎయిర్‌ ఇండియా నిబద్ధత కలిగివుంటుందని పునరుద్ఘాటిస్తున్నాం’ అని ప్రతినిధి పేర్కొన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement