ప్రధాన వార్తలు

బాబు గారు... మీది ‘రికార్డు’ పతనం!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితులను ప్రస్తావిస్తూ బాబు సర్కార్పై తన ఎక్స్ ఖాతాలో ధ్వజమెత్తారాయన. చంద్రబాబుగారూ.. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా?. కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా?.... క్వింటా ఉల్లిని రూ.1,200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది?. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? మీ తప్పు కాదా చంద్రబాబుగారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయం. అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. చంద్రబాబు గారూ..తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అంటూ పోస్ట్ చేశారాయన. .@ncbn గారూ… పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ… pic.twitter.com/swvxxr9hse— YS Jagan Mohan Reddy (@ysjagan) September 16, 2025

బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) భారీగా పెరుగుతున్నాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం కూడా బంగారం ధరలు ఊపందుకున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

ఆమె ఇంట నోట్ల కట్టలు.. కేజీల కొద్దీ బంగారం!!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నుపూర్ బోరాను సోమవారం అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె నివాసం నుంచి కిలోల కొద్దీ బంగారం, లక్షల రూపాయల విలువున్న నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అంతేకాదు.. ఆ సమయంలో నోట్ల కట్టలను అధికారులు మెషిన్లతో లెక్కిస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. భారీ అవినీతి ఆరోపణల నడుమ.. చీఫ్మినిస్టర్ స్పెషల్ విజిలెన్స్ సెల్ బృందం సోమవారం గువాహతిలోని నుపూర్ బోరా(28) నివాసంలో తనిఖీలు నిర్వహించింది. అయితే అధికారికంగా రూ.92 లక్షలు విలువ చేసే నగదు, కోటి రూపాయల విలువ చేసే నగలను సీజ్ చేశారు. అలాగే.. బార్పేటలో ఉన్న అద్దె నివాసం నుంచి మరో రూ.10 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆపై ఆమెను అరెస్ట్ చేసి అవినీతి భాగోతం మీద ప్రశ్నిస్తున్నట్లు ప్రకటించింది. గోలాఘట్కు చెందిన నుపుర్ బోరా.. 2019లో అస్సాం సివిల్స్ సర్వీస్కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె గోరోయిమరి జిల్లా కంరూప్లో సర్కిల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. బోరా తన పదవిలో ఉండగా హిందూ భూములను 'సందేహాస్పద వ్యక్తులకు' డబ్బు కోసం బదిలీ చేశారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అంటున్నారు. ఇక.. నుపూర్ సహాయకుడిగా పనిచేసిన లాట్ మండల్ సురజిత్ డేకాని కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. బార్పేట జిల్లాలో అనేక భూములు అక్రమంగా పొందినట్లు ఆరోపణలు ఈయనపై ఉన్నాయి. నుపూర్ కేసులో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. మరోపక్క.. కేఎంఎస్ఎస్(Krishak Mukti Sangram Samiti) అనే స్థానిక ఉద్యమ సంస్థ ఒకటి కూడా ఆమె అవినీతి భాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.ఆమెపై వస్తున్న భూ సంబంధిత ఆరోపణల నేపథ్యంలో గత ఆరు నెలలుగా నిఘా ఉంచినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. బార్పేట రెవెన్యూ సర్కిల్లో ఆమె విధుల్లో ఉన్నప్పుడు లంచం తీసుకుని హిందూ ఆలయాల భూములను ఇతరుల పేరిట బదిలీ చేసినట్లు అబియోగాలు ఉన్నాయి. మైనారిటీల జనాభా అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా అవినీతి కార్యకలాపాలు ఎక్కువగా నమోదవుతున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర దుమారం చెలరేగింది. అస్సాంలో అవినీతి రహిత పాలన పేరిట సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్ను 2021లో హిమంత బిశ్వ శర్మ ప్రారంభించారు.అధికారుల అక్రమ ఆస్తులపై దాడులు, అవినీతి సంబంధిత కేసుల విచారణ, సున్నితమైన భూమి బదిలీ వ్యవహారాలపై నిఘా.. తదితర అంశాలను ఈ విభాగం చూసుకుంటుంది.

ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్.. రెడ్ అలర్ట్ జారీ
ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. సోమవారం అర్ధరాత్రి దాటాక నుంచి కురుస్తున్న కుంభవృష్టితో తమ్సా నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరదల ధాటికి ఇద్దరు గల్లంతు కాగా.. వాళ్ల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. పలు నివాసాలు.. దుకాణ సముదాయాలు నీట మునిగి నాశనం అయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి.రాత్రి కురిసిన వానకు భారీగా వరద చేరడంతో తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం దగ్గర తమ్సా నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో.. నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (DM) కుంకుమ్ జోషి పర్యవేక్షణలో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పీడబ్ల్యూడీ సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంతో ఇవాళ అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు సీఎం పుష్కర్ సింగ్ ధామీ అధికార యంత్రాంగం ద్వారా అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 📍Uttarakhand | #Watch: Torrential rains cause the Tamsa River to overflow, submerging the Tapkeshwar Mahadev Temple in Dehradun📹: ANI/X pic.twitter.com/RPCN37x2k2— Ranveer Singh (@Ranveer6829) September 16, 2025మరోవైపు.. డెహ్రాడూన్ క్లౌడ్బరస్ట్తో రిషికేష్లోని చంద్రభాగా నది ప్రవాహం కూడా పెరుగుతోంది. దీంతో తీర ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. నదిలో చిక్కుకుపోయిన ముగ్గురిని రక్షించే ఎన్డీఆర్ఎఫ్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఇంకోవైపు.. పితోరాఘడ్ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉత్తరకాశీ, చమోలీ, రుద్రప్రయాగ, పౌరీ, భాగగేశ్వర్, నైనిటాల్ జిల్లాల్లో ఈ వర్షాకాలం సీజన్లో క్లౌడ్ బరస్ట్లు సంభవించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ప్రకృతి విపత్తులతో 85 మంది మరణించగా.. 128 మంది గాయపడ్డారు. మరో 94 మంది ఆచూకీ లేకుండా పోయారు. సెప్టెంబర్ 11వ తేదీన ప్రధాని మోదీ డెహ్రాడూన్ను సందర్శించి.. సహాయక చర్యలను సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు 1,200 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు.

రాజ్యాంగం కంచెను రాజకీయం మేసేస్తోంది!
దేశంలో రాజ్యాంగం తరచూ అపహాస్యం పాలవుతోంది అనేందుకు ఇదో తాజా ఉదాహరణ. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదిమంది తాము అదే పార్టీలో ఉన్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఇచ్చిన తీరు చూస్తే విస్తుపోవాల్సిందే. బీఆర్ఎస్ జెండాతో 2023 శాసనసభ ఎన్నికలలో గెలిచిన తరువాత వీరందరూ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన విషయం బహిరంగ రహస్యం. వీరి అనర్హత కోరుతూ బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించడం.. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ అంశం త్వరగా తేల్చాలని కోరడం అందరికీ తెలుసు. అయితే... చట్టాలు చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తాము అసలు పార్టీ మారనేలేదని బుకాయిస్తూండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు కాస్తా దగ్గరపడటంతో పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ఈ తీరున సమాధానమిచ్చారు. వీరు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి.ఆ ఉప ఎన్నికలలో గెలుస్తామో, లేదో అన్న అనుమానం కావచ్చు.. లేక ఎందుకు ఖర్చు అన్న భావన కావచ్చు. వీరు ఇలా కధ నడుపుతున్నారని అనుకోవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరణకు ప్రతిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ సూచన మేరకు మళ్లీ కొత్త సాక్ష్యాధారాలు ఆయన ఆఫీస్లో సమర్పించారు. ఇక్కడ చిత్రం ఏమిటంటే ఎమ్మెల్యేలు ఫిరాయించారా? లేదా అన్నదానిపై స్పీకర్కు, అన్ని పార్టీలకు క్లారిటీ ఉంటుంది. న్యాయ వ్యవస్థకు కూడా ఇందులో ఉన్న వాస్తవాలనండి, మతలబు అనండి తెలియకుండా ఉండదు. అయినా ఈ డ్రామా అంతా నడవాల్సిందే. అదే మన రాజ్యాంగ బలహీనతేమో! ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పక్షాన గెలిచినా, తదుపరి జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 2023 శాసనసభ ఎన్నికలలో పోటీ చేశారు. దీంతో దానం పరిస్థితి కాస్త అగమ్యగోచరమే అని చెప్పాలి. అయితే అనర్హత వేటుకు గురి కావాలి. లేదా రాజీనామా చేయాల్సి రావచ్చు. కాకపోతే స్పీకర్ ఎటూ అధికార పార్టీ వారే కాబట్టి కొంతకాలం జాప్యం చేయడానికి యత్నించవచ్చు. స్పీకర్ మరీ ఎక్కువకాలం పెండింగులో పెట్టడం కూడా సాధ్యపడకపోవచ్చు. అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కావ్య తరపున లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేశారు. వీరిద్దరూ నేరుగా ఆధార సహితంగా ఫిరాయించినట్లు కనిపిస్తుండడంతో ఏమి చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. గతంలో పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో నేరుగా చేరకపోయినా, పలు విచారణల తర్వాత ఆలస్యంగా అయినా అప్పటి స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి వారిపై అనర్హత వేటు వేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఈ స్పీకర్ ఎంతకాలం తీసుకుంటారో, ఏమి చేస్తారో చూడాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో భేటీ అయి మంతనాలు సాగించారు.న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకుని ఎనిమిది మందితో స్పీకర్ నోటీసులకు బదులు ఇప్పించారు. ఆ జవాబులు చూస్తే మన ఎమ్మెల్యేలు ఇలా తమను తాము ఆత్మవంచన చేసుకుంటున్నారా? లేక ప్రజలను మోసం చేస్తున్నారా? లేక న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారా? అన్న ప్రశ్నలు వస్తాయి. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని, కేవలం అభివృద్ది కోసమే సీఎంను కలిశామని, ఆ సందర్భంలో సీఎం మర్యాదపూర్వకంగా కండువా కప్పుతుంటే తిరస్కరించడం సంస్కారం కాదని నిరాకరించ లేదని, పైగా అది కాంగ్రెస్ కండువా కాదని బుకాయించారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి తన ఇంటిలో ఇప్పటికీ కేసీఆర్ ఫోటో ఉందని చెప్పారట. అంతేకాక తాను కేటీఆర్ను కలిసిన ఫోటోలు కూడా తన సమాధానంతోపాటు జతపరిచారట. కొంతమంది తాను కాంగ్రెస్ లో చేరినట్లు ఫ్లెక్సీలు కట్టారని, వాటితో తనకు సంబంధం లేదని, దాని ఆధారంగా తనపై ఫిరాయింపు ఆరోపణ చేశారని ఆయన వివరణ ఇచ్చారట. ఇవన్ని చూస్తుంటే తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకని అన్నట్లుగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పీకర్గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరు కావడం విశేషం. స్పీకర్గా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు, ఇతర పార్టీల వారిని కూడా బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు స్వయంగా పోచారమే పార్టీ ఫిరాయించి, తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతుండడం విశేషం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం టీఆర్ఎస్లో చేరడానికి ముందు పదవికి రాజీనామా చేశారు. కాని ఇప్పుడు మాత్రం వెనుకాడుతున్నారన్న విమర్శ ఎదుర్కొంటున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తప్ప మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ సీనియర్లే. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య గతంలో కాంగ్రెస్ పక్షాన గెలిచి బీఆర్ఎస్లో చేరితే, ఈసారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి అనధికారికంగా మారారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కొద్ది రోజుల క్రితం గండిపేట వద్ద జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తూ వివిధ పత్రికలలో ఫుల్ పేజీ ప్రచార ప్రకటనలు కూడా ఇచ్చారు. అయినా బీఆర్ఎస్ లోనే ఉన్నానని వివరణ ఇచ్చారు. వీరు తమంతట తాముగా రాజీనామా చేసినా, లేదా కాంగ్రెస్ నాయకత్వం రాజీనామా చేయించినా బాగుండేది. కాంగ్రెస్ అధిష్టానం బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఒకపక్క విమర్శలు చేస్తూ, మరో పక్క తెలంగాణలో అదే రకంగా వ్యవహరించడం ఏపాటి విలువలతో కూడినదన్న ప్రశ్న వస్తుంది. మరో సంగతి ఏమిటంటే ఒక ఇంటర్వ్యూలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి పది మంది తమ పార్టీలోకి వచ్చారని చెప్పారట. దానిని సాక్ష్యంగా తీసుకోవాలని, అప్రూవర్ గా ఆయనను పరిగణించాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేస్తూ రాజ్యాంగం పుస్తకం పట్టుకుని టూర్ చేస్తున్నారని, తెలంగాణలో ఎమ్మెల్యేల చోరీని ఎలా సమర్థిస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ ఆధ్వర్యంలోనే ఇలా జరుగుతున్నాయని కాదు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్తో పాటు వివిధ పార్టీల ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ కింద బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. అప్పుడు కూడా కొందరికి ఆయన బీఆర్ఎస్ కండువా కప్పారు.అయినా వారిలో ఎవరిపైన అనర్హత వేటు పడలేదు.అప్పట్లో బీఆర్ఎస్ విలీనం డ్రామా నడిపితే, దానికి ఆనాటి స్పీకర్ పోచారం ఆమోద ముద్రవేశారు. బీజేపీ కేంద్రంలో కాని, కొన్ని రాష్ట్రాలలో కాని పిరాయింపులను ప్రోత్సహించడం లేదా అన్న ప్రశ్న వస్తుంది. 2014 టర్మ్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్శించి వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. దానిపై న్యాయపోరాటం జరిగినా అది ఒక కొలిక్కి రాలేదు. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ వైఎస్ జగన్ ఆనాటి రాజకీయ పరిణామాలలో పార్టీని వీడినప్పుడు రాజీనామా చేసి కడప నుంచి పోటీ చేసి ఎంపీగా తిరిగి గెలిచారు. అలాగే ఆయన పార్టీలోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో పోటీ చేశారు. వారిలో 15 మంది విజయం కూడా సాధించారు. ముగ్గురు ఓటమి చెందారు.అయినా విలువలకు కట్టుబడి ఉన్నట్లు గుర్తింపు పొందారు. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం చివరికి ఏ రూపు దాల్చుతుందో, అది ఎప్పటికి తేలుతుందో చెప్పలేకపోయినప్పటికి, సుప్రీం కోర్టు ఆదేశాల వల్ల ఈ నోటీసుల తతంగం అయినా సాగుతోందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ ఫిరాయింపు రాజకీయాలపై ప్రజలలో వ్యతిరేకత ఉన్నప్పటికీ, వారెవ్వరూ గట్టిగా నిరసన చెప్పలేని స్థితి ఉంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

పాకిస్తాన్తో ఆడితే తప్పు కాదా? షేక్ హ్యాండ్ ఇస్తేనే తప్పా?: మనోజ్ తివారీ
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ జట్టుతో సంప్రదాయ కరచాలనాన్ని టీమిండియా ఆటగాళ్లు తిరష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఖండాంతర టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు మధ్య పోరు జరిగింది. అయితే ఈ మ్యాచ్ టాస్ దగ్గర నుంచి ఆట ముగిసే వరకు భారత జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో అంటిముట్టనట్టు ఉన్నారు.తొలుత టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అనంతరం మ్యాచ్ ముగిశాక కూడా కరచాలనం చేసేందుకు భారత జట్టు ఇష్టపడలేదు. దీంతో భారత జట్టు తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.కానీ భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మాత్రం టీమిండియా మెనెజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. పాకిస్తాన్తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు, షేక్ హ్యాండ్ ఇస్తే తప్పు ఏముందని తివారీ అన్నాడు. అయితే పాకిస్తాన్ మ్యాచ్తో భారత్ బహిష్కరించాలని తివారీ ముందే నుంచే తన వాదన వినిపిస్తూ వస్తున్నాడు."నేను భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్తో ఆసియాకప్ మొత్తాన్ని బాయ్కట్ చేస్తున్నాను. ఎందుకంటే క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే. క్రీడలకు ఇచ్చిన విలువ జీవితాలకు ఇవ్వడం లేదు. ఇది నాకు నచ్చడం లేదు. మనం మానవ జీవితాలను క్రీడలతో పోల్చడం సరి కాదు" అని పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు తివారీ స్టెట్మెంట్ ఇచ్చాడు.ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ను తిరష్కరించడం సరైన నిర్ణయం కాదు. మీరు పాకిస్తాన్తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు.. హ్యాండ్ షేక్ చేస్తే తప్పు ఏముంది. పాక్తో మ్యాచ్ను బహిష్కరించి మీరు ఏది చెప్పినా ప్రజులు నమ్మేవారు.ఈ టోర్నీ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ వీడియోను నేను చూశాను. మరి అప్పుడు ఎలా కరచాలనం చేశారు. ఆ సమయంలో మీకు తప్పు అన్పించలేదా? అంటే ఇప్పుడు విమర్శకుల నుంచి తప్పించుకోవడం కోసం నో హ్యాండ్ షేక్ నిర్ణయం తీసుకున్నారా? ముందే వారి కెప్టెన్, చైర్మెన్కు హ్యాండ్ షేక్ ఇచ్చి ఇప్పుడు మ్యాచ్లో తిరష్కరించి ఏమి సాధించారో నాకు ఆర్ధం కావడం లేదు. విమర్శకుల నుంచి తామును తాము రక్షించుకోవడానికే ఈ విజయాన్ని పహల్గామ్ బాధితులకు, భారత సాయుధ దళాలకు అంకితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు" అని ఇన్సైడ్ స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు.చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్కు ఐసీసీ షాక్?

విదేశీ విద్య: కొత్త కోర్సులు.. సరికొత్త దేశాలు
విదేశాల్లో చదువుకోవాలని ఎవరికి ఉండదు? అక్కడే చదువుకుని, స్థిరపడాలన్నదీ కోట్లాదిమంది భారతీయుల కల. యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియాలోని పేరొందిన యూనివర్సిటీలకు వెళ్లడం అనేది గతం. ఇప్పుడు ట్రెండ్ క్రమంగా మారుతోంది. సంప్రదాయ దేశాలకు బదులుగా భారతీయ విద్యార్థులు నూతన గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు.ఎంబీబీఎస్ విద్య కోసం మధ్య ఆసియాలోని కిర్గిస్తాన్ ఇంజనీరింగ్ కోసం కంబోడియా, సప్లై చైన్ మేనేజ్మెంట్ చదివేందుకు మాల్టా, సాంస్కృతిక అధ్యయనాల కోసం ఉత్తర కొరియాకు చలో అంటున్నారు మన విద్యార్థులు. దేశీయంగా తీవ్రమైన పోటీ, అమెరికాలో రోజుకో రకంగా మారుతున్న విధానాలు; ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో వలసలపై పెరుగుతున్న వ్యతిరేకత, వీసాల లభ్యత కఠినతరం కావడం; పలు ఇతర దేశాల్లో విద్యా వ్యయాలు పెరుగుతుండడం.. వీటన్నింటి కారణంగా నూతన కోర్సుల కోసం కొత్త దేశాల బాట పడుతున్నారు.సరికొత్త గమ్యస్థానాలుమాల్టా, పోలాండ్, లాత్వియా, సైప్రస్ వంటిచిన్న యూరోపియన్ దేశాలు వివిధ ప్రోగ్రామ్స్లో భారతీయులు సహా విదేశీయులకు సులభంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. అలా అక్కడ చదివిన గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు, అధునాతన డిగ్రీల కోసం ఫ్రాన్ ్స, జర్మనీ, యూకే, మధ్యప్రాచ్యాలకు వెళ్తున్నారు. రొమేనియా, బల్గేరియా, హంగేరీలలోని భారతీయ ఇంజనీరింగ్ విద్యార్థులు చౌకైన స్థానిక ప్రోగ్రామ్స్లో చేరుతున్నారు. కానీ చాలామంది అధిక జీతాలు, అంతర్జాతీయ ఎక్స్పోజర్ కోసం జర్మనీ, నెదర్లాండ్స్, స్కాండినేవియాకు మారుతున్నారు. అలాగే బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్లలో ఎంబీబీఎస్ చేసినవాళ్లు.. ఎక్కువ జీతాల కోసం మధ్య ప్రాచ్యదేశాలకు మరలుతున్నారు.లైటింగ్, లైట్ డిజైన్ఆర్కిటెక్చరల్, వేడుకల కోసం వేదికలు, నగరాల్లోని భవంతుల్లో లైటింగ్ కోసం కళాత్మకతను సాంకేతికతతో జోడించేలా శిక్షణ పొందడం. కేంద్రాలు: మిలాన్ (ఇటలీ), బిల్బావ్ (స్పెయిన్ ), స్టాక్హోం (స్వీడన్ ).మ్యూజిక్ థెరపీ భావోద్వేగ,ఆలోచన, శారీరక స్వస్థత కోసంసంగీతాన్ని వైద్యసాధనంగాఉపయోగించడం.కేంద్రాలు: లిమెరిక్(ఐర్లాండ్), నెదర్లాండ్స్.క్రూజ్ లైన్ నిర్వహణ ప్రపంచ క్రూజ్ పరిశ్రమ కోసం రూపొందించినప్రత్యేక ఆతిథ్య, కార్యకలాపాలకు సంబంధించిన విద్యా కార్యక్రమాలు. కేంద్రాలు: స్పెయిన్,స్విట్జర్లాండ్మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ నురగ (ఫోమ్), జెల్స్తదితరాలతో రుచులు, భోజన అనుభవాలను మార్చడానికి శాస్త్రాన్ని ఉపయోగించడం.కేంద్రాలు:స్పెయిన్, జపాన్,నెదర్లాండ్స్గేమ్ డిజైనింగ్గ్రీన్ సప్లై చైన్ పర్యావరణ అనుకూల, సమర్థవంతమైన, తక్కువ కర్బన ఉద్గారాలున్న రవాణా వ్యవస్థల రూపకల్పనకేంద్రాలు: స్వీడన్,డెన్మార్క్, నెదర్లాండ్స్వీడియో గేమ్స్ను సృష్టించడం, అభివృద్ధి, తయారీ; కేంద్రాలు: ఫిన్లాండ్హ్యుమానిటేరియన్ లాజిస్టిక్స్ విపత్తుల నుంచి ఉపశమనం, సహాయం, పంపిణీ, సంక్షోభ సమయంలో ప్రతిస్పందన కోసం సరఫరా వ్యవస్థల నిర్వహణకేంద్రాలు: ఫిన్లాండ్, బెల్జియం,స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికాసరఫరాను మించిన డిమాండ్ఈ ఏడాది 22 లక్షలకు పైగా నీట్ అభ్యర్థులు.. భారత్లో కేవలం 1.18 లక్షల ఎంబీబీఎస్ సీట్ల కోసం పోటీ పడ్డారు. అంటే అంతరం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే విద్యార్థులు సంప్రదాయేతర దేశాలవైపు చూస్తున్నారు.చౌకైన ఎంపికభారత్లోని ప్రైవేట్ కళాశాలలతో పోలిస్తే ‘చాలా తక్కువ ఖర్చు’తో.. ఎంబీబీఎస్విద్యార్థులను తూర్పు యూరప్, మధ్య ఆసియా దేశాలు ఆకర్షిస్తున్నాయి. ఉజ్బెకిస్తాన్ ఒక్కటే 6వేలకుపైగా విద్యార్థులకు ఆతిథ్యం ఇస్తోంది. విజయవాడ, వరంగల్, తిరుపతి వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఇప్పుడు విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఏజెన్సీలు చెబుతున్నాయి.ఖర్చు ఎంతంటే?భారత్ (ప్రైవేట్లో ఎంబీబీఎస్):పూర్తి డిగ్రీకి రూ.1 కోటికిపైగాఉజ్బెకిస్తాన్/రష్యా/ఫిలిప్పీన్పూర్తి ఎంబీబీఎస్కు రూ.15–35 లక్షలుపోలండ్/చెక్ రిపబ్లిక్: ఏడాదికి రూ.9.5–17.5 లక్షలు (ట్యూషన్+జీవన వ్యయం)జర్మనీ (ప్రభుత్వ విశ్వవిద్యాలయం):సంవత్సరానికి రూ.30,000-సాక్షి, స్పెషల్ డెస్క్

అప్పుల్లో మంచు లక్ష్మీ .. ఆ ఇల్లు నా సొంతం కాదంటూ క్లారిటీ
మంచు లక్ష్మీ ప్రసన్న (Lakshmi Manchu) తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటి, నిర్మాత, టీవీ ప్రెజెంటర్గా పేరు పొందారు. చాలారోజుల తర్వాత ఆమె 'దక్ష' అనే యాక్షన్ సినిమాలో నటించారు. శ్రీలక్ష్మిప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటైర్టెన్మెంట్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. తనకు అప్పులు ఉన్నాయనే రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చారు.ఆ ఇంటితో నాకు సంబంధం లేదుమంచు లక్ష్మీ సుమారు రెండేళ్ల క్రితమే హైదరాబాద్ నుంచి ముంబై షిఫ్ట్ అయిపోయారని తెలిసిందే. అయితే, హైదరాబాద్లోని తన ఇల్లు అమ్మకానికి పెట్టారని, చాలా అప్పులు ఉన్నాయని రూమర్స్ వచ్చాయి. ఇదే విషయం గురించి తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'హైదరాబాద్లో నాకు ఇల్లు లేదు. అసలు నేను విక్రయించేందుకు ఇక్కడ ఇల్లు ఉండాలి కదా.. ఫిలిం నగర్లో ఉన్న నివాసం నాది కాదు. అక్కడ కేవలం ఉండేదానిని మాత్రమే.. ఆ ఇంటి గురించి వివరాలు కావాలంటే మా నాన్నను అడగండి చెప్తారు. ఆ ఇంటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఆ ఇంట్లో ఉండేందుకు నాన్న ఇచ్చారు. ఆ ఆస్థి నాది కాదు, నాన్నకు సొంతం. నా ఇష్ట ప్రకారమే ముంబై వెళ్లిపోయాను. అక్కడ ఇంటి అద్దె చెల్లించడానికి ఇబ్బందిగా ఉన్నా సరే ఉన్నంతలో సరిపెట్టుకుంటున్నాను. డబ్బు సాయం చేయమని నాన్నను అడగలేదు. సినిమాలు, షోల ద్వారా వచ్చిన డబ్బుతో ముందుకు వెళ్తున్నాను.' అని లక్ష్మీ ప్రసన్న చెప్పారు.మొదటి నుంచి మంచు లక్ష్మీ తన కష్టంతో వచ్చిన డబ్బుతోనే ముందుకు వెళ్లాలి అనుకునే సంకల్పంతో ఉంటారు. అమెరికాలో ఆమె చదువుతున్నరోజుల్లో కూడా పార్ట్టైమ్ ఉద్యోగం చేసేవారని తెలిసిందే. తన తండ్రి వారసత్వం కంటే తనలోని టాలెంట్తోనే ఆమె గుర్తింపు పొందారు. ఆమె బహుముఖ ప్రతిభ కలిగిన వ్యక్తిగా, భారతీయ సినిమాతో పాటు అమెరికన్ టెలివిజన్లో కూడా తన ప్రతిభను చాటారు. మంచు లక్ష్మీ తన వ్యక్తిత్వం, ధైర్యం, బలమైన అభిప్రాయాలతో తెలుగు సినీ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారనిది వాస్తవం అని చెప్పొచ్చు.

మ్యాథ్స్ విత్ ఏఐ పఢాయి... హాయి
‘సైంటిస్ట్ కావాలి’ ‘ఐపీఎస్ ఆఫీసర్ కావాలి’... ఇలా ఆ పిల్లలకు ఎన్నో కలలు ఉన్నాయి. అయితే ఆ కలలకు అడ్డుగోడ గణితంపై వారికి ఉండే భయం. ‘పఢాయి విత్ ఏఐ’ అనే ఏఐ సాంకేతిక కార్యక్రమంతో పిల్లల్లో గణితంపై ఉండే భయాన్ని పోగొట్టింది ఐఏఎస్ అధికారి సౌమ్య ఝా. ‘పఢాయి విత్ ఏఐ’ పుణ్యమా అని పిల్లలకు ఏఐ అంటే భయం పోయింది. నైపుణ్యం సొంతం అయింది.రాజస్థాన్లోని టోంక్కు చెందిన అమన్ గుజర్ అనే విద్యార్థికి గణితం అంటే వణుకు. చాలా కష్టంగా, ఒత్తిడిగా అనిపించేది. గణితంలో ఎప్పుడూ బొటాబొటీ మార్కులు వచ్చేవి. అయితే అతడి భయానికి ‘పఢాయి విత్ ఏఐ’ ఫుల్స్టాప్ పెట్టింది. గణితం అంటే భయాన్ని పోగొట్టి, ఉత్సాహాన్ని పెంచింది.‘పఢాయి విత్ ఏఐ’ అంటే?అమన్ చదివే స్కూల్లో ‘పఢాయి విత్ ఏఐ’ పేరుతో ఏఐ ఆధారిత విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత క్లిష్టమైన గణిత సమస్యలనైనా సులభంగా అర్థమయ్యేలా విద్యార్థులకు వివరిస్తుంది. ‘గణితం అంటే ఒకప్పుడు ఉండే భయం ఏమాత్రం లేదు. ఇప్పుడు నాకు గణితం అనేది ఒక సబ్జెక్ట్ కాదు. ఆట. గణితంలోనూ మంచి మార్కులు సాధించడం నాకు ఎంతో గర్వంగా ఉంది. నూటికి నూరు మార్కులు తెచ్చుకోవాలనే ఆత్మవిశ్వాసం వచ్చింది’ అంటున్నాడు అమన్.ఐఏఎస్ అధికారి సౌమ్య ఝా ఆలోచన నుంచి పుట్టిందే... పఢాయి విత్ ఏఐ. ఆమె టోంక్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించినప్పుడు చాలామంది విద్యార్థులు గణితం, సైన్స్ సబ్జెక్ట్లలో వెనకబడి ఉన్నారనే విషయాన్ని అర్థం చేసుకుంది. చాలామంది విద్యార్థులు గణితంలో ఎందుకు వెనకబడిపోయారు? అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించింది సౌమ్య. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నికల డ్యూటీ, రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఉపాధ్యాయులు ఎక్కువ రోజులు బడికి దూరంగా ఉంటున్నారు.స్కూలు విద్యార్థులలో చాలామంది వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయం అందించడానికి తరచు బడికి గైర్హాజరు అవుతుంటారు. గ్యాప్ రావడం వల్ల వారికి పాఠాలు అర్థం కావు. ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని సాంకేతికతకు మానవ ప్రయత్నాన్ని జోడిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ‘పఢాయి విత్ ఏఐ’ కార్యక్రమానికి రూపకల్పన చేసింది సౌమ్య.ఐఏఎస్ తొలిరోజులలో కొన్ని సబ్జెక్లకు సంబంధించి తాను ఏఐ (ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్) సహాయం తీసుకునేది. ఆ విషయం గుర్తు తెచ్చుకొని, ఏ సబ్జెక్ట్ గురించి అయితే విద్యార్థులు భయపడుతున్నారో, ఆ భయాన్ని పోగొట్టడానికి ‘ఏఐ’ని అస్త్రంలా వాడాలని నిర్ణయించుకుంది.గత సంవత్సరం పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభమైన ‘పఢాయి విత్ ఏఐ’ని సరికొత్త మార్పులు చేర్పులతో ఈ సంవత్సరం ‘వెర్షన్–2’గా లాంచ్ చేశారు. ఈ అప్గ్రేడెడ్ వెర్షన్లో టీచింగ్ క్యాలెండర్, విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచే అత్యాధునిక సాంకేతిక పరికరాలు, ప్రతి వారం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ‘పఢాయి విత్ ఏఐ’ని టోంక్ జిల్లాలోని 350కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థులలో వచ్చిన మార్పు గురించి చాలా సంతోషంగా ఉన్న సౌమ్య ఝా – ‘ఇదేమీ మాయాజాలం కాదు. మానవ ప్రయత్నానికి తోడైన సాంకేతిక అద్భుతం’ అంటుంది.

ఇదిగో.. ప్రభుత్వ వైద్య కళాశాల..‘మీ కళ్ళకు కనిపిస్తోందా’?
ఏలూరు టౌన్ : ‘ఇదిగో.. చంద్రబాబు గారూ... ఏలూరులో వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనం.. కూటమి నేతలూ... చూశారా’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆ భవనాల వద్ద సెలీ్ఫలు దిగారు. ఏలూరు జిల్లాకే ప్రతిష్టాత్మకంగా.. జిల్లా ప్రజల చిరకాల కోరికను నెరవేర్చుతూ వైఎస్సార్సీపీ హయాంలో ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదంటూ చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తోన్న తరుణంలో వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకా‹Ù, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఆధ్వర్యంలో పార్టీ నేతలు ఏలూరులోని మెడికల్ కాలేజీని సోమవారం సందర్శించారు. అత్యాధునిక సౌకర్యాలతో, కార్పొరేట్ తరహా లుక్తో మెరిసిపోతున్న వైద్య కళాశాల భవనాలను రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. ‘మీ కళ్ళకు కనిపిస్తోందా?’ అంటూ.. వీడియోలు, సెలీ్ఫలు దిగారు. జోహార్ వైఎస్సార్.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. కూటమి నేతలు చేస్తున్నట్లు ఇది గ్రాఫిక్స్ కాదంటూ మెడికల్ కాలేజీ భవనం వద్ద ఫొటోలు తీశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సు«దీర్బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణే‹Ù, అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, ఎస్సీ సెల్ కార్యదర్శి ఇమ్మానుయేల్, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీ‹Ù, బీసీ సెల్ కార్యదర్శి కొల్లిపాక సురేష్, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్జాబ్ తదితరులు పాల్గొన్నారు. 300 మంది విద్యార్థులు చదువుతున్నారు: ప్రిన్సిపాల్ ఏలూరులో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనం ప్రారంభించి రెండేళ్లు పూర్తయ్యింది. 2023 సెప్టెంబర్ 2న ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం క్లాస్లు ప్రారంభించగా.. రెండేళ్లు పూర్తవడంతో వైఎస్సార్సీపీ నేతలు మెడికల్ కాలేజీ వద్ద కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. వైద్య విద్యార్థులకు, కాలేజీ ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కాలేజీలోని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. కళాశాలలో అత్యాధునిక డిజిటల్ క్లాస్రూంలు, ల్యాబ్స్, టీచింగ్ రూమ్స్ పరిశీలించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సావిత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కళాశాల నిర్వహణపై పలు అంశాలు అడిగి తెలుసుకున్నారు. 2023 సెప్టెంబర్ 2న 150 మంది ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులతో క్లాస్లు ప్రారంభించారని, 2024లో మరో 150 మంది చేరారని, ప్రస్తుతం 300 మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. జగన్ చెప్పింది చేసి చూపిస్తారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేబితే చేసి చూపిస్తారు. గ్రాఫిక్స్ చేయడం మాకు చేతకాదు. 2022 నవంబర్లో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ప్రారంభించి 2023 సెపె్టంబర్ 2 నాటికే క్లాస్లు ప్రారంభించేలా పూర్తి చేసి చూపించారు. రూ.60 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించి మెడికల్ కాలేజీని నిర్మించారు. రెండేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నాం. వైద్య విద్యార్థులు, మెడికల్ కాలేజీ స్టాఫ్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాం. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రూ.8500 కోట్లతో ప్రణాళిక రూపొందించి, తొలి దశలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. – మామిళ్ళపల్లి జయప్రకాష్ , ఏలూరు సమన్వయకర్తప్రైవేటు పరం చేయటం న్యాయమా? వైఎస్సార్సీపీ హయాంలో ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్రెడ్డి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను అధికారంలో ఉండగానే ప్రారంభించగా.. ఎన్నికల నాటికి పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఒక్క కొత్త భవనం నిర్మించారా?. జగన్ హయాంలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలు, విలేజ్ క్లీనిక్స్ నిర్మించారని, కూటమి నేతలు ఒక్క కొత్త భవనం నిర్మించారా? ప్రజలకు మంచి చేయటానికి ప్రయత్నం చేయాలి. – కొఠారు అబ్బయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే
సింపతీ కార్డ్ ప్లే చేయొద్దు.. రీతూని ఏడిపించిన మాస్క్ మ్యాన్!
రెబల్ స్టార్ రాజాసాబ్...మిరాయ్ని మరిపిస్తాడా?
ప్రైవేట్ స్కూల్లో దారణం.. విద్యార్థిని తల చిట్లేలే కొట్టిన టీచర్
Dharmasthala case: మృతదేహాల పారవేతపై ‘సిట్’కు 30 ఫిర్యాదులు
పాక్తో క్రికెట్ ఆడితే బీజేపీకి నొప్పి లేదా?: కేటీఆర్
3 కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో తెలీదు: గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్
డెంగీ లక్షణాలతో యువతి మృతి
మా ఐన్స్టీన్ మాత్రం తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు: షోయబ్ అక్తర్
చేతిలో రెండు టమాటోలు పెట్టి దొబ్బేశావ్ కదే.. ప్రేమకు నమస్కారం టైటిల్ వీడియో
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
జియో చౌక ప్లాన్.. ఎక్కువ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాలింగ్
2023లో బ్రేకప్.. తనే నన్ను వదిలేసింది: మెగా హీరో బ్రేకప్ స్టోరీ
తగ్గిన ధరలు.. పసిడి కొనుగోలుకు మంచి తరుణం!
టీమిండియా కెప్టెన్గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన
విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ఆహ్వానం
ఈ గొడవంతా ఎందుకు సార్! ఉగ్రవాదులే మాకు ఆశ్రయమిచ్చారని చెప్పేస్తే సరి!
Telangana: మందుబాబులకు ఇక పండుగే !
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
'మాకు చదువు రాదు.. రామును అలా చూస్తుంటే బాధగా ఉంది'
Hyderabad: ఈ క్యూ రేషన్ కోసం కాదు, బంగారం కోసం!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. పనులలో పురోగతి
రెండోసారి ప్రసవం.. మానసికంగా ఇబ్బందిపడ్డా: ఇలియానా
విరాట్ కోహ్లిపై తాలిబన్ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
'మిరాయ్'తో తేజ సజ్జా ఇండస్ట్రీ రికార్డ్
140 కోట్ల జనాభా ఉన్న దేశం మొక్క జొన్న కంకి కొనలేదా?
బతుకమ్మ చీరెలొస్తున్నాయ్..
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. యత్నకార్యసిద్ధి
... మనం ఇక్కడ ‘ఏఐ’కే తావులేకుండా చేయాలి!
PKL 12: తమిళ్ తలైవాస్ సంచలన నిర్ణయం!.. జన్మలో కబడ్డీ ఆడనంటూ..
సింపతీ కార్డ్ ప్లే చేయొద్దు.. రీతూని ఏడిపించిన మాస్క్ మ్యాన్!
రెబల్ స్టార్ రాజాసాబ్...మిరాయ్ని మరిపిస్తాడా?
ప్రైవేట్ స్కూల్లో దారణం.. విద్యార్థిని తల చిట్లేలే కొట్టిన టీచర్
Dharmasthala case: మృతదేహాల పారవేతపై ‘సిట్’కు 30 ఫిర్యాదులు
పాక్తో క్రికెట్ ఆడితే బీజేపీకి నొప్పి లేదా?: కేటీఆర్
3 కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో తెలీదు: గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్
డెంగీ లక్షణాలతో యువతి మృతి
మా ఐన్స్టీన్ మాత్రం తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు: షోయబ్ అక్తర్
చేతిలో రెండు టమాటోలు పెట్టి దొబ్బేశావ్ కదే.. ప్రేమకు నమస్కారం టైటిల్ వీడియో
బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..
జియో చౌక ప్లాన్.. ఎక్కువ వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాలింగ్
2023లో బ్రేకప్.. తనే నన్ను వదిలేసింది: మెగా హీరో బ్రేకప్ స్టోరీ
తగ్గిన ధరలు.. పసిడి కొనుగోలుకు మంచి తరుణం!
టీమిండియా కెప్టెన్గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన
విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ఆహ్వానం
ఈ గొడవంతా ఎందుకు సార్! ఉగ్రవాదులే మాకు ఆశ్రయమిచ్చారని చెప్పేస్తే సరి!
Telangana: మందుబాబులకు ఇక పండుగే !
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
'మాకు చదువు రాదు.. రామును అలా చూస్తుంటే బాధగా ఉంది'
Hyderabad: ఈ క్యూ రేషన్ కోసం కాదు, బంగారం కోసం!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. పనులలో పురోగతి
రెండోసారి ప్రసవం.. మానసికంగా ఇబ్బందిపడ్డా: ఇలియానా
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
విరాట్ కోహ్లిపై తాలిబన్ అగ్రనేత ఆసక్తికర వ్యాఖ్యలు
'మిరాయ్'తో తేజ సజ్జా ఇండస్ట్రీ రికార్డ్
140 కోట్ల జనాభా ఉన్న దేశం మొక్క జొన్న కంకి కొనలేదా?
బతుకమ్మ చీరెలొస్తున్నాయ్..
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. యత్నకార్యసిద్ధి
... మనం ఇక్కడ ‘ఏఐ’కే తావులేకుండా చేయాలి!
PKL 12: తమిళ్ తలైవాస్ సంచలన నిర్ణయం!.. జన్మలో కబడ్డీ ఆడనంటూ..
సినిమా

మాస్క్ మ్యాన్ కాదు టార్చర్ మ్యాన్.. ఉతికారేసిన తనూజ!
వీకెండ్ అయిపోయిందంటే బిగ్బాస్ హౌసులో నామినేషన్స్ గోల మొదలవుతుంది. ఈసారి కూడా షురూ అయిపోయింది. మాస్క్ మ్యాన్ హరీశ్ తను చెప్పిందే రైట్ అన్నట్లు అందరినీ టార్చర్ పెడుతున్నాడు! ఇన్నిరోజులు ఓపిక పట్టిన తనూజ.. నామినేషన్స్లో ఇతడిని ఉతికారేసింది. సైలెంట్గా నవ్వుతూ కనిపించిన రీతూ కూడా రెచ్చిపోయింది. ఇంతకీ సోమవారం ఏం జరిగింది?(ఇదీ చదవండి: అందరి టార్గెట్ ఒక్కడే.. 2వ వారం నామినేషన్స్లో ఎవరెవరంటే?)ఆదివారం నాగార్జున వచ్చి వెళ్లిపోయిన తర్వాత హౌస్మేట్స్ అంతా ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంటి పని విషయంలో కామనర్స్ శ్రీజ-మనీష్ మధ్య మాటమాట పెరిగింది. దీంతో మూలకెళ్లి కూర్చుకున్న మనీష్.. వరస్ట్ కామనర్స్ వీళ్లు, ఓ గలీజ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు అంటూ తనతో వచ్చిన వాళ్లపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మరోవైపు వీకెండ్ నాగార్జున గట్టిగా వాయించేసరికి మాస్క్ మ్యాన్ డీలా పడిపోయాడు. ఏం చేయాలో తెలీక తినడం మానేశాడు.భరణి వచ్చి అడిగాడు, శ్రీజ అయితే ఏకంగా ప్లేటులో భోజనం తీసుకొచ్చి హరీశ్కి ఇచ్చింది. అయినా సరే మనోడు మంకు పట్టు వదట్లేదు. మీలాంటోళ్ల మధ్యన ఉండటమే దండగ అనేశాడు. నేను తినను, తాగను అని తెగేసి చెప్పాడు. దీంతో కన్ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్బాస్, హరీశ్కి జాగ్రత్తలు చెప్పి ఇతడి బాధ్యతని రాము రాథోడ్కి అప్పగించాడు. సరే ఇవన్నీ పక్కనబెడితే నామినేషన్ ఇద్దరివే జరిగినప్పటికీ మంచి రంజుగా జరిగాయి.తొలివారం అంతా తాను చెప్పిందే రైటు, అందరూ అదే వినాలి అనే రేంజులో ప్రవర్తించిన హరీశ్.. తనూజ తన తప్పులు ఎత్తిచూపుతూ నామినేట్ చేసేసరికి తట్టుకోలేకపోయాడు. గట్టిగా అరుస్తూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ టాపిక్ డైవర్ట్ చేస్తూ అపరిచితుడిలా ప్రవర్తించాడు. తన ప్రవర్తనతో అటు హౌసులోని వాళ్లకు ఇటు చూస్తున్న ప్రేక్షకులకు ఓ రకంగా టార్చర్ చూపిస్తున్నాడు. మరోవైపు మనీష్, రీతూని నామినేట్ చేశాడు.తొలివారం అంతా కాస్త సైలెంట్గానే రీతూ.. మనీష్ చెప్పిన పాయింట్కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది. గిన్నెలు సరిగా తోమడం లేదు, ఇంట్లోకి వచ్చినప్పుడు పర్మిషన్ అడగట్లేదు అంటూ ఏవేవో కారణాలు చెప్పాడు. దీనికి ఏ మాత్రం ఊరుకోని రీతూ.. నీదో షిట్ నామినేషన్ అని రెచ్చిపోయింది. మరోవైపు భరణిని కూడా నామినేట్ చేసిన మనీష్.. మీరు హౌసులో ఉన్న పెద్ద స్నేక్(పాము) అనేశాడు. కావాలనే కామనర్స్ మధ్యలో పుల్లలు పెడుతూ గొడవలకు కారణమవుతున్నారని అన్నాడు. ప్రస్తుతానికైతే తనూజ, మనీష్ మాత్రమే నామినేషన్స్ పూర్తి చేశారు. మిగిలిన వాళ్లంతా మంగళవారం ఎపిసోడ్లో తమ తమ నామినేషన్స్ పూర్తి చేయనున్నారు.(ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో లెస్బియన్ జోడీ.. అవమానించిన మరో లేడీ కంటెస్టెంట్)

పెద్ది 'రామ్ చరణ్' తల్లిగా సీనియర్ నటి
రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా బెంగళూరులో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు హైదరాబాద్లోనే చిత్రీకరణ జరుగుతుంది. అయితే, ఈ మూవలో రామ్ చరణ్ తల్లి పాత్రలో సీనియర్ నటి ఎంపిక అయ్యారని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్మీడియాలో భారీగానే వార్తలు వస్తున్నాయి. దాదాపు ఆమె పేరు ఫైనల్ అయిందని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.పెద్దిలో పవర్ఫుల్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. అంతే రేంజ్లో ఆయన తల్లి పాత్ర కూడా ఉండనుందట. అందుకే ఈ సినిమా కోసం సీనియర్ నటి విజి చంద్రశేఖర్ను తీసుకున్నారట. ఆమె ఇప్పటికే అఖండ సినిమాలో బాలకృష్ణకు తల్లిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎక్కువగా తమిళ, కన్నడ సినిమాలు, సీరియల్స్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో రజనీకాంత్ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె విజయవాడలో జన్మించినప్పటికీ చెన్నైలో పెరిగారు. సీనియర్ నటి సరితకు విజి చంద్రశేఖర్ సోదరి అనే విషయం తెలిసిందే. మరో చరిత్ర, ఇది కథ కాదు, కోకిల వంటి చిత్రాలతో హీరోయిన్గా సరిత నటించారు. ఇప్పుడు పెద్ది సినిమాలో రామ్ చరణ్కు తల్లి పాత్రలో విజి చంద్రశేఖర్ నటిస్తుందని టాక్ రావడంతో సరైన ఎంపిక అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఇందులో రామ్చరణ్ సరసన జాన్వీకపూర్ నటిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్తోపాటు, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి.

చిత్ర పరిశ్రమ కోసం ప్రత్యేక వెబ్సైట్: దిల్ రాజు
సినీ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ విండో ద్వారా ఒక సినిమాకు కావాల్సిన అనుమతులన్నీ ఇచ్చేలా ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ పేరుతో ఒక వెబ్సైట్ రూపొందించనున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సినిమా షూటింగ్ అనుమతులకు, థియేటర్స్ నిర్వహణలకు పొందాల్సిన అనుమతల్ని ఈ వెబ్సైట్ నుంచి పొందవచ్చు. ఈమేరకు హైదరబాద్లో ప్రత్యేక వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజుతో పటాఉ ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్.ప్రియాంక, టూరిజం కార్పొరేషన్ ఎండీ క్రాంతి పాల్గొన్నారు.తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో సానుకూలంగా ఉన్నారని దిల్ రాజు చెప్పారు. సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్తో వచ్చినా సరే వారి సినిమాకు కావాల్సిన షూటింగ్ లొకేషన్లతో పాటు అందుకు కావాల్సిన అనుమతులు సింగిల్ విండో ద్వారా లభిస్తాయన్నారు. సినిమా థియేటర్ల నిర్వహణకు కావాల్సిన బీ-ఫామ్ను చాలా సులువుగా ఆన్లైన్ ద్వారా పొందేలా కొత్త విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ఆయన అన్నారు. థియేటర్ల నిర్వహణ కోసం ఇప్పటి వరకు ఉన్న పద్ధతుల్లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వెబ్సైట్ను రూపొందించేందుకు చిత్ర పరిశ్రమ ప్రతినిధుల నుంచి పలు సలహాలతో పాటు సూచనలు తీసుకుంటామన్నారు. వెబ్సైట్ను పూర్తి స్థాయిలో రూపొందించాక సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో ప్రారంభిస్తామని దిల్ రాజు అన్నారు.

'ఇడ్లీ కొట్టు' టైటిల్ ఎందుకు పెట్టామంటే..: ధనుష్
నటుడు ధనుష్ తాజాగా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు). నటి నిత్యామీనన్ నాయకిగా నటించారు. శాలిని పాండే, సత్యరాజ్, అరుణ్విజయ్, రాజ్కిరణ్, పార్తీపన్, సముద్రఖని తదితరలు ముఖ్య పాత్రలు పోషించారు. డాన్ పిక్చర్స్, వండర్బార్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్కుమార్ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్1వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా నటుడు ధనుష్ మాట్లాడుతూ ఈ చిత్రానికి ఇడ్లీ కొట్టు అని పేరు పెట్టడానికి కారణం గురించి చెబుతూ చిన్నతనంలో తనకు రోజూ ఇడ్లీ తినాలని ఆశగా ఉండేదన్నారు. అయితే చేతిలో డబ్బు ఉండేది కాదన్నారు. దీంతో తోటల్లో పూలు కోసే పనికి వెళితే రోజుకు రూ. 2 లేదా 2.50 రూపాయలు ఇచ్చేవారన్నారు. ఆ డబ్బుతో నాలుగు లేదా ఐదు ఇడ్లీ వస్తే కొనుక్కుని తినేవాడినన్నారు. ఆ ఇడ్లీ రుచి ఇప్పుడు పెద్ద పెద్ద ఫైవ్స్టార్ హోటళ్లలోనూ లభించడం లేదన్నారు. ఆ ఇడ్లీ కొట్టు ఇతి వృత్తంతో చిత్రం చేయాలని అనిపించిందన్నారు. అలా నిజమైన కథ, నిజమైన పాత్రలతో చిత్రం చేసినట్లు ధనుష్ చెప్పారు. అదే విధంగా తన హేటర్స్ గురించి స్పందిస్తూ అసలు హేటర్స్ అనే కాన్సెప్టే పరిశ్రమలో లేదన్నారు. అలాంటి వారు కూడా ఇక్కడ లేరన్నారు. అందరూ అన్ని చిత్రాలు చూస్తుంటారని, అలాంటిది హేటర్స్ ఎవరని చెప్పాలంటూ పేర్కొన్నారు. అయితే ఒక 30 మంది తమ జీవనం కోసమో లేదా మరేదైనా ఆశించో 300 ఐడియాలతో ఏదైనా తప్పుడు ప్రచారం చేయడమే హేట్ అని తెలిపారు. ఆ 30 మంది కూడా చిత్రాలను చూస్తారని ధనుష్ పేర్కొన్నారు. ఇకపోతే ఈ వేదికపై మాట్లాడిన నటుడు పార్తీపన్ నటుడు ధనుష్ను సకలకళావళ్లభుడిగా పేర్కొన్నారు. ఇక ఆయన అభిమానులైతే యువ సూపర్స్టార్ అంటూ పోస్టర్లతో ప్రచారం చేశారు.
న్యూస్ పాడ్కాస్ట్

ఏపీ ప్రజారోగ్య రంగంలో 2023 సెప్టెంబర్ 15 ఒక గొప్ప రోజు. సీఎంగా నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చిన రోజు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్య

పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పేరిట అస్మదీయులకు సంపద సృష్టి... ఏపీలో ప్రైవేట్ పరమయ్యే కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటా ఎంబీబీఎస్ సీటు ఏడాదికి 57 లక్షల రూపాయల పైమాటే

‘ఎమ్మార్’ పేరిట ప్రజలను ఏమార్చే కుట్ర... ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విష ప్రచారం

కర్నూలులో 2 వేల 700 కోట్ల రూపాయల విలువైన స్థలంపై గురి...

ఆంధ్రప్రదేశ్లో వెయ్యి ఎకరాల దేవుడి భూముల స్వాహాపర్వం... అధికార తెలుగుదేశం పార్టీ నేతల కబ్జాకాండ

చంద్రబాబు సర్కార్ సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది, చంద్రబాబు ముఠా ఆదాయం పెరుగుతోంది... వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

నూతన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్... ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డిపై ఘన విజయం

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం...రోడ్డున పడ్డ రైతాంగం

ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా భూదోపిడీ... ఏపీఐఐసీకి చెందిన విలువైన వేలాది ఎకరాలు ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు పందేరం

- మద్యం అక్రమ కేసులో గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలకు బెయిల్. మిథున్రెడ్డికి మధ్యంతర బెయిల్
క్రీడలు

డుప్లాంటిస్... ప్రపంచ రికార్డు నంబర్ 14
ఊహించిన అద్భుతమే జరిగింది. పోల్ వాల్ట్లో మరోసారి ప్రపంచ రికార్డు బద్దలయింది. మారింది వేదిక మాత్రమే... ప్రపంచ రికార్డు సృష్టించిన వ్యక్తి మాత్రం మారలేదు... వరల్డ్ రికార్డు నెలకొల్పడం... మళ్లీ దానిని సవరించడం... తన ఖాతాలో పసిడి పతకం వేసుకోవడం... సమీప ప్రత్యర్థులను రెండో స్థానానికే పరిమితం చేయడం... పోల్ వాల్ట్ క్రీడాంశం పేరు చెబితే తనను తప్పనిసరిగా గుర్తు చేసుకునేలా రోజురోజుకూ రాటుదేలుతూ దూసుకుపోతున్న ఆ అథ్లెట్ ఎవరో కాదు... స్వీడన్ స్టార్ అర్మాండో డుప్లాంటిస్... బరిలో దిగితే ప్రపంచ రికార్డుపైనే గురి పెట్టే ఈ సూపర్ స్టార్ పోల్ వాల్టర్ సోమవారం టోక్యోలో మెరిశాడు. కళ్లు చెదిరే ప్రదర్శనతో తన ఖాతాలో 14వ ప్రపంచ రికార్డు వేసుకోవడంతోపాటు... ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో వరుసగా మూడు స్వర్ణాలు సాధించి... ఈ క్రీడాంశంలో దిగ్గజం సెర్గీ బుబ్కా సరసన డుప్లాంటిస్ చేరాడు. టోక్యో: అథ్లెటిక్స్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూసిన పురుషుల పోల్ వాల్ట్ ఈవెంట్లో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ అర్మాండో డుప్లాంటిస్ అలరించాడు. సోమవారం జరిగిన ఫైనల్లో స్వీడన్కు చెందిన 25 ఏళ్ల డుప్లాంటిస్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 6.30 మీటర్ల ఎత్తుకు ఎగిరిన డుప్లాంటిస్ తన కెరీర్లో 14వ సారి ప్రపంచ రికార్డును లిఖించాడు. గత నెలలో హంగేరి రాజధాని బుడాపెస్ట్లో జరిగిన మీట్లో 6.29 మీటర్లతో తానే నెలకొలి్పన ప్రపంచ రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. విజేతగా నిలిచిన డుప్లాంటిస్కు 70 వేల డాలర్లు (రూ. 61 లక్షల 68 వేలు) ప్రైజ్మనీగా, ప్రపంచ రికార్డు సృష్టించినందుకు లక్ష డాలర్లు (రూ. 88 లక్షల 12 వేలు) బోనస్గా లభించాయి. 12 మంది పోటీపడ్డ ఫైనల్లో డుప్లాంటిస్ తన ఆరో ప్రయత్నంలో 6.15 మీటర్ల ఎత్తును అధిగమించి స్వర్ణ పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. కరాలిస్ (గ్రీస్; 6 మీటర్లు) రజత పతకం నెగ్గగా... కురి్టస్ మార్షల్ (ఆ్రస్టేలియా; 5.95 మీటర్లు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. పసిడి పతకం ఖాయమయ్యాక డుప్లాంటిస్ ప్రపంచ రికార్డుపై గురి పెట్టాడు. తొలి రెండు ప్రయత్నాల్లో 6.30 మీటర్ల ఎత్తును అధిగమించడంలో విఫలమైన డుప్లాంటిస్ మూడో ప్రయత్నంలో సఫలమై ప్రపంచ రికార్డును అందుకున్నాడు. డుప్లాంటిస్ కెరీర్లో ఇది వరుసగా 49వ విజయంకాగా... మేజర్ టోరీ్నల్లో ఐదో టైటిల్. టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు గెలిచిన డుప్లాంటిస్.. 2022 ప్రపంచ చాంపియన్íÙప్లో, 2023 ప్రపంచ చాంపియన్షిప్లో బంగారు పతకాలు సాధించాడు. తాజా విజయంతో డుప్లాంటిస్ ప్రపంచ చాంపియన్íÙప్లో ‘హ్యాట్రిక్’ స్వర్ణాలను సొంతం చేసుకున్నాడు. సెర్గీ బుబ్కా తర్వాత వరుసగా మూడు ప్రపంచ చాంపియన్íÙప్లలో బంగారు పతకాలు గెలిచిన రెండో పోల్ వాల్టర్గా డుప్లాంటిస్ గుర్తింపు పొందాడు. సెర్గీ బుబ్కా (సోవియట్ యూనియన్/ఉక్రెయిన్) వరుసగా ఆరు ప్రపంచ చాంపియన్íÙప్లలో (1983, 1987, 1991, 1993, 1995, 1997) స్వర్ణ పతకాలు సాధించాడు.

ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ ఓటమి..
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో తెలుగు టైటాన్స్కు బెంగళూరు బుల్స్ చేతిలో పరాజయం ఎదురైంది. సోమవారం జరిగిన హోరాహోరీ మ్యాచ్లో బెంగళూరు 34–32 పాయింట్ల తేడాతో టైటాన్స్పై గెలుపొందింది. మ్యాచ్ ముగిసే దశలో అనూహ్యంగా ఆధిక్యాన్ని కోల్పోయిన తెలుగు టైటాన్స్ చివరకు 2 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్ జట్టులో ఆల్రౌండర్లు భరత్, కెపె్టన్ విజయ్ మలిక్ అదరగొట్టారు. 19 సార్లు కూతకెళ్లిన భరత్ 13 పాయింట్లు తెచ్చిపెట్టాడు. 18 సార్లు రెయిడింగ్ చేసిన విజయ్ 9 పాయింట్లు సాధించాడు. బెంగళూరు తరఫున అలీరెజా మిర్జాయిన్ (11) రాణించాడు. కీలక తరుణంలో పాయింట్లు చేసి జట్టును గెలిపించాడు. మిగతా వారిలో డిఫెండర్లు యోగేశ్ 3, దీపక్ శంకర్ 2, రెయిడర్ ఆకాశ్ షిండే 2 పాయింట్లు సాధించారు. ఈ సీజన్లో 6 మ్యాచ్లాడిన తెలుగు జట్టుకిది మూడో పరాజయం.అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 40–37తో గుజరాత్ జెయింట్స్పై గెలుపొందింది. స్టీలర్స్ తరఫున రెయిడర్లు శివమ్ పతారే (12), వినయ్ (8), డిఫెండర్లు జైదీప్ (6), సాహిల్ నర్వాల్ (4), రాహుల్ (3) రాణించారు.గుజరాత్ జట్టులో రెయిడర్ రాకేశ్ (14) చక్కని పోరాటం చేశాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను 14 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. మిగతావారిలో నితిన్ పన్వార్ 3, లక్కీ శర్మ, శుభమ్ కుమార్ చెరో 2 పాయింట్లు చేశారు. నేడు జరిగే మ్యాచ్ల్లో బెంగాల్ వారియర్స్తో యూపీ యోధాస్, తమిళ్ తలైవాస్తో బెంగళూరు బుల్స్ తలపడతాయి.చదవండి: Asia Cup 2025: శ్రమించి గెలిచిన శ్రీలంక

క్వాలిఫయింగ్లోనే...
టోక్యో: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో మూడో రోజు కూడా భారత క్రీడాకారులకు నిరాశే మిగిలింది. పురుషుల లాంగ్జంప్ ఈవెంట్లో శ్రీశంకర్ మురళీ క్వాలిఫయింగ్లోనే ని్రష్కమించాడు. 19మంది అథ్లెట్లు పోటీపడ్డ గ్రూప్ ‘ఎ’లో శ్రీశంకర్ 14వ స్థానంలో నిలిచాడు. మూడు ప్రయత్నాల్లో శ్రీశంకర్ వరుసగా 7.78 మీటర్లు, 7.59 మీటర్లు, 7,70 మీటర్ల దూరం దూకాడు. కనీసం 8.15 మీటర్ల దూరం దూకిన వారికి ఫైనల్ బెర్త్ లభిస్తుంది. ఓవరాల్గా 36 మంది పోటీపడ్డ క్వాలిఫయింగ్లో శ్రీశంకర్ 25వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు మహిళల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో భారత క్రీడాకారిణులు పారుల్, అంకిత హీట్స్లోనే వెనుదిరిగారు. ఓవరాల్గా పారుల్ (9ని:22.24 సెకన్లు) 20వ స్థానంలో, అంకిత (10ని:03.22 సెకన్లు) 35వ స్థానంలో నిలిచారు. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్లో తేజస్ షిర్సే (13.57 సెకన్లు) 29వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

వెల్డన్ వైశాలి
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): ఆద్యంతం నిలకడగా రాణించిన భారత మహిళా గ్రాండ్మాస్టర్ వైశాలి రమేశ్బాబు అనుకున్న ఫలితం సాధించింది. సోమవారం ముగిసిన గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీ మహిళల విభాగంలో చాంపియన్గా నిలిచింది. నిరీ్ణత 11 రౌండ్ల తర్వాత తమిళనాడు అమ్మాయి వైశాలి, కాటరీనా లాగ్నో (రష్యా) 8 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా... 24 ఏళ్ల వైశాలికి టైటిల్ ఖాయమైంది. కాటరీనా లాగ్నో రన్నరప్గా నిలిచింది. వరుసగా రెండోసారి గ్రాండ్ స్విస్ టోరీ్నలో టైటిల్ నెగ్గిన వైశాలితోపాటు కాటరీనా లాగ్నో వచ్చే సంవత్సరం జరిగే క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత పొందారు. వైశాలికి 90 వేల డాలర్లు (రూ. 79 లక్షల 33 వేలు), కాటరీనా లాగ్నోకు 75 వేల డాలర్లు (రూ. 66 లక్షల 10 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. భారత్ నుంచి ముగ్గురు... ఎనిమిది మంది మధ్య జరిగే క్యాండిడేట్స్ టోరీ్నకి ఇప్పటికి ఏడుగురు అర్హత సాధించగా... అందులో ముగ్గురు భారత గ్రాండ్మాస్టర్లు (కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్, వైశాలి) ఉండటం విశేషం. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) 2024–2025 మహిళా ఈవెంట్స్ విజేతకు చివరిదైన ఎనిమిదో బెర్త్ ఖరారు అవుతుంది. క్యాండిడేట్స్ టోర్నీ విజేత ప్రస్తుత మహిళల ప్రపంచ చాంపియన్ జు వెన్జున్తో 2026 వరల్డ్ టైటిల్ కోసం తలపడుతుంది. చివరి రౌండ్ గేమ్లు ‘డ్రా’ గ్రాండ్ స్విస్ టోర్నీ చివరిదైన 11వ రౌండ్లో వైశాలి, కాటరీనా తమ ప్రత్యర్థులతో గేమ్లను ‘డ్రా’ చేసుకున్నారు. ప్రపంచ మాజీ చాంపియన్ టాన్ జోంగి (చైనా)తో జరిగిన గేమ్ను వైశాలి 43 ఎత్తుల్లో... ఉల్వియా (అజర్బైజాన్)తో గేమ్ను కాటరీనా లాగ్నో 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. ఈ టోరీ్నలో వైశాలి ఆరు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్లో ఓడిపోగా... కాటరీనా లాగ్నో ఐదు గేముల్లో నెగ్గి, ఆరు గేమ్లను ‘డ్రా’గా ముగించింది. భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక 6.5 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచింది. మరోవైపు గ్రాండ్ స్విస్ టోర్నీ ఓపెన్ విభాగంలో అనీశ్ గిరి (నెదర్లాండ్స్–8 పాయింట్లు) విజేతగా... మథియాస్ బ్లూబామ్ (జర్మనీ–7.5 పాయింట్లు) రన్నరప్గా నిలిచి వచ్చే ఏడాది క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించారు. చాంపియన్ అనీశ్ గిరికి 90 వేల డాలర్లు (రూ. 79 లక్షల 33 వేలు), రన్నరప్ మథియాస్కు 75 వేల డాలర్లు (రూ. 66 లక్షల 10 వేలు) ప్రైజ్మనీగా లభించాయి.
బిజినెస్

ఆగస్టులో ఎగుమతులు జంప్
ఎగుమతులు ఆగస్ట్లో మెరుగైన వృద్ధిని చూశాయి. 35.1 బిలియన్ డాలర్ల విలువైన (సుమారు రూ.3.09 లక్షల కోట్లు) వస్తు ఎగుమతులు నమోదయ్యాయి. అదే సమయంలో దిగుమతులు 10.12 శాతం తగ్గి 61.59 బిలియన్ డాలర్లు (రూ.5.42 లక్షల కోట్లు)గా ఉన్నాయి. దీంతో ఆగస్ట్ నెలలో వాణిజ్య లోటు 26.49 మిలియన్ డాలర్లకు (రూ.2.33 లక్షల కోట్లు) పరిమితమైంది. క్రితం ఏడాది ఆగస్ట్లో వాణిజ్య లోటు 35.64 బిలియన్ డాలర్లతో పోల్చితే గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా ఈ ఏడాది ఆగస్ట్లో బంగారం దిగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 56 శాతం తగ్గడం అనుకూలించింది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్ట్లో వస్తు, సేవల ఎగుమతులు అన్నీ కలిపి 69.16 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో ఇవి 63.25 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఆగస్ట్లో వస్తు, సేవల దిగుమతులు 79.04 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 9.88 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. భారత ఉత్పత్తులపై అమెరికా రెండు విడతల్లో విధించిన మొత్తం 50 శాతం టారిఫ్లు ఆగస్ట్ నుంచి అమల్లోకి రాగా, ఇదే నెలలో ఆ దేశానికి 6.86 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి. భారత ఎగుమతుల్లో అమెరికాయే మొదటి స్థానంలో నిలిచింది.యూఏఈకి 3.24 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్కు 1.83 బిలియన్ డాలర్లు, చైనాకి 1.21 బిలియన్ డాలర్లు, యూకేకి 1.14 బిలియన్ డాలర్ల చొప్పున ఎగుమతులు వెళ్లాయి.ఇక చైనా నుంచి అత్యధికంగా 10.91 బిలియన్ డాలర్ల వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంది. ఆ తర్వాత రష్యా నుంచి 4.83 బిలియన్ డాలర్లు, యూఏఈ నుంచి 4.66 బిలియన్ డాలర్లు, యూఎస్ నుంచి 3.6 బిలియన్ డాలర్లు, సౌదీ నుంచి 2.5 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు నమోదయ్యాయి. బంగారం దిగుమతులు 56.67 శాతం తగ్గి 5.43 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సేవల ఎగుమతుల వరకే చూస్తే 34.06 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2024 ఆగస్ట్లో సేవల ఎగుమతులు 30.36 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే 13 శాతం పెరిగాయి. ఎల్రక్టానిక్స్ వస్తు ఎగుమతులు 2.93 బిలియన్ డాలర్లు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు 9.9 బిలియన్ డాలర్లు, రత్నాభరణాలు 2.31 బిలియన్ డాలర్లు, పెట్రోలియం ఉత్పత్తులు 4.48 బిలియన్ డాలర్లు, ఫార్మా ఎగుమతులు 2.51 బిలియన్ డాలర్ల చొప్పున ఆగస్ట్లో నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు ఐదు నెలల్లో వస్తు సేవల ఎగుమతులు 349.35 బిలియ్ డాలర్లుగా ఉన్నట్టు వాణిజ్య శాఖ అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న 329 బిలియన్ డాలర్ల కంటే 6.18 శాతం అధికం.ఆగస్ట్ చివరి నాటికి వాణిజ్య మిగులు 80.97 బిలియన్ డాలర్లకు పెరిగింది.ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా?

ఐపీవో బాటలో మెడికవర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్కేర్ సేవల దిగ్గజం మెడికవర్ వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను మౌలిక సదుపాయాల విస్తరణకు, రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించుకోనుంది. ప్రస్తుత రుణభారం సుమారు రూ.1,000 కోట్లుగా ఉంది. సంస్థ సీఎండీ అనిల్ కృష్ణ సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో ఈ విషయాలు తెలిపారు. కొత్తగా రెండు ఆస్పత్రులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. గ్రూప్లో 24వదైన సికింద్రాబాద్ హాస్పిటల్ను మంగళవారం (నేడు) ప్రారంభించనుండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లో మరొకటి (500 బెడ్స్ సామర్థ్యం) అందుబాటులోకి వస్తుందని కృష్ణ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం సుమారు రూ. 1,850 కోట్లుగా ఉండగా, ఈసారి రూ. 2,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఇక కొత్త ఆస్పత్రితో కలిపి నాలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర) పడకల సామర్థ్యం 5,800గా ఉంటుందని కృష్ణ చెప్పారు. హైదరాబాద్ చందానగర్లో 150 పడకల విస్తరణతో మొత్తం బెడ్స్ సంఖ్య 6,400కి చేరుతుందన్నారు. ఐపీవోకి సంబంధించి వంద కోట్ల డాలర్ల దాకా వేల్యుయేషన్ అంచనా వేస్తున్నట్లు కృష్ణ చెప్పారు. చిన్న పట్టణాలపై మరింత ఫోకస్ ... ప్రస్తుతం తమకు కార్యకలాపాలున్న ప్రాంతాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కృష్ణ తెలి పారు. బెంగళూరు, పుణేల్లాంటి నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నట్లు వివరించారు. అవకాశం వస్తే 300 –350 బెడ్స్ సామర్థ్యాలు ఉండే ఇతర ఆస్పత్రుల కొనుగోలు అంశాన్నీ పరిశీలిస్తామని చెప్పారు. సాధా రణంగా లీజు ప్రాతిపదికన ప్రాంగణాలను తీసుకుంటున్న తాము ఇకపై తమ కార్యకలాపాల కోసం పూర్తి స్థాయిలో ప్రాపర్టీని కొనుగోలు చేయడంపై ఫోకస్ పెట్టనున్నట్లు వివరించారు. వైద్య సదుపాయాలు విస్తృతంగా పెరుగుతున్నప్పటికీ, ప్రతిభావంతులైన వైద్యుల కొరత సవాలుగా ఉంటోందని పేర్కొన్నారు. కరెన్సీ హెచ్చుతగ్గులు, అధునాతన టెక్నాలజీ గల పరికరాల దిగుమతి వ్యయాలు పెరిగిపోవడమనేది, చికిత్స వ్యయాల పెరుగుదలకు దారితీస్తున్నట్లు వివరించారు. రాబోయే రోజుల్లో వేగవంతమైన, కచి్చతమైన చికిత్సను అందించడంలో కృత్రిమ మేథ (ఏఐ) కీలకపాత్ర పోషించగలదని కృష్ణ చెప్పారు.

ఐటీఆర్ దాఖలుకు మరొక రోజు గడువు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్లు) దాఖలుకు చివరి రోజు (సెపె్టంబర్ 15) అయిన సోమవారం ఈ–ఫైలింగ్ పోర్టల్పై భారీ రద్దీ కనిపించింది. దీంతో పన్ను చెల్లింపుదారులకు పలు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో ఎకరవు పెడుతూ, గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు. తొలుత ఎలాంటి సమస్యల్లేవన్న ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ).. సెపె్టంబర్ 16వ తేదీ వరకు (మరొక రోజు) గడువు పొడిగిస్తున్నట్టు రాత్రి 11 గంటల తర్వాత ఎక్స్ ప్లాట్ఫామ్పై ప్రకటించింది. ఐటీ పోర్టల్లో సమస్యలు ఎదురవుతున్నట్టు గత కొన్ని రోజులుగా వ్యక్తులు, చార్టర్డ్ అకౌంటెంట్లు సోషల్ మీడియా ద్వారా ఆదాయపన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లారు. పన్ను చెల్లింపులు, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్) డౌన్లోడ్లో సమస్యలు ఎదురవుతున్నట్టు పేర్కొంటూ, గడువు పొడిగించాలని కోరారు. ముఖ్యంగా ఇ–ఫైలింగ్ పోర్టల్పై లాగిన్ కాలేకపోయామంటూ పలువురు అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. పెద్ద సంఖ్యలో రిటర్నులు..7 కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలైనట్టు సీబీడీటీ ప్రకటించింది. 2025–26 అసెస్మెంట్ సంవత్సరానికి (2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి) ఇంకా రిటర్నులు దాఖలు చేయని వారు వెంటనే ఆ పని పూర్తి చేయాలని సూచించింది. గత ఆర్థిక సంవత్సరానికి పెనాల్టీ లేకుండా వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్యూఎఫ్లు) రిటర్నుల సమర్పణకు జూలై 31 గడువు తేదీ కాగా, దీన్ని సెపె్టంబర్ 15 వరకు పొడిగించడం గమనార్హం. గతేడాది జూలై 31 నాటికి మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి.

జీడీపీకి ఏఐ దన్ను!
న్యూఢిల్లీ: పరిశ్రమలవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వేగవంతమవుతున్న నేపథ్యంలో ఉత్పాదకత, సిబ్బంది పని సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనితో 2035 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 500–600 బిలియన్ డాలర్ల మేర విలువ జత కాగలదని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది. వచ్చే దశాబ్దకాలంలో వివిధ రంగాలవ్యాప్తంగా ఏఐ వినియోగంతో గ్లోబల్ ఎకానమీకి 17–26 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల విలువ జతవుతుందని పేర్కొంది. భారీ సంఖ్యలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) నైపుణ్యాలున్న సిబ్బంది లభ్యత, పరిశోధన..అభివృద్ధి వ్యవస్థ విస్తరిస్తుండటం, డిజిటల్..సాంకేతిక సామర్థ్యాలు మెరుగుపడుతుండటం తదితర అంశాలు అంతర్జాతీయ ఎకానమీలో భారత్ కీలకపాత్ర పోషించేందుకు తోడ్పడగలవని నివేదిక తెలిపింది. గ్లోబల్ ఏఐ విలువలో భారత్ 10–15 శాతం వాటాను దక్కించుకోవచ్చని వివరించింది. ఆవిష్కరణలను ప్రోత్సహించాలి: నిర్మల అందరికీ మేలు చేసే టెక్నాలజీ ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా నియంత్రణలు ఉండాలే తప్ప వాటిని అణచివేసే విధంగా ఉండకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఏఐ టెక్నాలజీలను వినియోగించడమే కాకుండా వాటిని వివిధ రంగాలు బాధ్యతాయుతంగా ఉపయోగించుకునేలా చూడటంపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. ఏఐ అనేక మార్పులకు లోనవుతూ, చాలా వేగంగా పురోగమిస్తోందని మంత్రి చెప్పారు. టెక్నాలజీ పరుగుకు అనుగుణంగా నియంత్రణలు కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధి వేగం పుంజుకోవాలంటే ఉత్పాదకత పెరగాలని, ఇందుకోసం పరిశ్రమలు ఏఐని తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు, మన జీవన విధానాన్ని కృత్రిమ మేధ గణనీయంగా మార్చేయనున్న నేపథ్యంలో ఏఐ టెక్నాలజీలో భారత్ ముందుండాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.నివేదికలో మరిన్ని విశేషాలు..→ నిర్ణయాలు తీసుకోవడం, వసూళ్లు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ రూపురేఖలను ఏఐ సిస్టమ్లు మార్చివేయగలవు. ప్రత్యామ్నాయ డేటా వనరులను ఉపయోగించి బ్యాంకులు రుణాలపై మరింత కచి్చతత్వంతో, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా ఏఐ వినియోగం ద్వారా ఉత్పాదకత, సామర్థ్యాలకు సంబంధించిన సవాళ్లు సుమారు మూడో వంతు పరిష్కారం కాగలవు. → టెక్నాలజీ సరీ్వసుల్లో కొత్త ఆవిష్కరణలు.. అంతర్జాతీయ మార్కెట్లో భారత్ పోటీతత్వాన్ని మెరుగుపరుస్తాయి. → ప్రస్తుత 5.7 శాతం వృద్ధి రేటు ప్రకారం 2035 నాటికి భారత జీడీపీ 6.6 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ భారత్ ఆకాంక్షిస్తున్నట్లుగా 8 శాతం వృద్ధి సాధిస్తే మరో 1.7 ట్రిలియన్ డాలర్లు పెరిగి 8.3 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చు. → ఏఐతో పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రానున్నప్పటికీ, దీనితో ప్రస్తుతం ఉన్న అనేక ఉద్యోగాలు తగ్గుతాయి. ప్రధానంగా క్లరికల్, రొటీన్ పనులు, నైపుణ్యాలు అంతగా అవసరంలేని ఉద్యోగాలు ఈ జాబితాలో ఉంటాయి. ఆర్థిక సేవలు, తయారీ రంగాలపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2035 నాటికి ఆయా రంగాల జీడీపీ విలువలో కృత్రిమ మేథ వాటా దాదాపు 20–25 శాతం వరకు ఉండొచ్చని అంచనా. ఏఐ ఆధారిత ఉత్పాదకత, సామర్థ్యాల మెరుగుదలతో ఫైనాన్షియల్ సరీ్వసుల్లో 50–55 బిలియన్ డాలర్ల అవకాశాలు లభిస్తాయని రిపోర్ట్ వివరించింది.
ఫ్యామిలీ

గ్రీన్ ట్రయాంగిల్..! ప్రకృతి చెక్కిన అద్భుతం..
ప్రకృతికి పక్షపాతం కొంచెం ఎక్కువే. దక్షిణాదిన కేరళను అక్కున చేర్చుకుంది. ఉత్తరాన ఉత్తరాఖండ్ను ఒడిలో దాచుకుంది. ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అనే భుజకీర్తి ఒకరిది. ‘దేవభూమి’ అనే అతిశయం మరొకరిది. ఆ రెండు రాష్ట్రాల్లో పుట్టని వాళ్లేం చేయాలి? వీలయినప్పుడు అక్కడికి వెళ్లి చూసి రావాలి? హైదరాబాద్లో రైలెక్కి ఢిల్లీలో రైలు దిగుదాం. ఢిల్లీలో బస్సెక్కి ఉత్తరాఖండ్ టూర్కి చెక్కేద్దాం. ఇది... మూడు వేల అడుగుల ఎత్తు మొదలు... ఏడు వేల అడుగుల ఎత్తుకు సాగే ప్రయాణం.1వ రోజుఉదయం ఆరు గంటలకు ట్రైన్ నంబర్ 12723 తెలంగాణ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. 2వ రోజు ఉదయం 7.40 గంటలకు ఢిల్లీ స్టేషన్కు చేరుతుంది. హోటల్లో రిఫ్రెష్మెంట్, బ్రేక్ఫాస్ట్ తరవాత కార్బెట్కు ప్రయాణం. కార్బెట్కు చేసేటప్పటికి సాయంత్రం అవుతుంది. అక్కడ హోటల్ గదిలో చెక్, రాత్రి భోజనం, బస.3వ రోజుతెల్లవారు జామున లేచి కార్బెట్ సఫారీకి వెళ్లడం, జలపాతాల వీక్షణం తర్వాత హోటల్కి వచ్చి బ్రేక్ఫాస్ట్, రిఫ్రెష్మెంట్ తర్వాత గది చెక్ అవుట్ చేయాలి. నైనితాల్కు ప్రయాణం. నైనితాల్లో హోటల్లో చెక్ ఇన్, రాత్రి భోజనం, బస అక్కడే.వేటగాడి జ్ఞాపకం!చందమామ కథల్లో చెప్పుకున్నట్లు కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి కాదు కానీ ఇది దట్టమైన అటవీప్రదేశం అని చెప్పడంలో సందేహం లేదు. బ్రిటిష్ పాలన కాలంలో ఏర్పాటయిన నేషనల్ పార్క్ ఇది. తొలి తొలి నేషనల్ పార్క్ కూడా. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జిమ్ కార్బెట్ పార్కుగా పేరు మార్చుకుంది. ఇది పులుల సంరక్షణ కేంద్రం. నిజానికి పులులను సంరక్షించడంలో జిమ్ కార్బెట్ పాత్ర ఏమీ లేదు. ఇతడు గొప్ప వేటగాడు. కుమావ్ రీజియన్లో మనుషులకు హాని కలిగిస్తున్న పులులను, చిరుత పులులను హతమార్చిన ఘనత ఇతడిది. తన పులుల వేట కథనాలను రాశాడు కూడా. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సఫారీలో మనకు పులులు, ఏనుగుల గుంపులు, జింకలు, రకరకాల పక్షులు కనువిందు చేస్తాయి. నగరవాసుల ఈ టూర్ ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్గా మిగులుతుంది. ఈ ప్రదేశం హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన శివాలిక్ రీజియన్ ఉంది. అటవీప్రదేశంలో పర్వతసానువులు, జలపాతాలు కూడా ఉన్నాయి. అడవి మధ్యలో ప్రవహిస్తున్న రామ్ గంగ నది, దాహం తీర్చుకోవడానికి నది తీరానికి వచ్చిన జంతువులను చూస్తూ పిల్లలు కేరింతలు కొడతారు. వన్య్రప్రాణుల సంరక్షణ కోసం ఎకో టూరిజమ్ పాలసీ అమలులో ఉంది. కాబట్టి ప్రకృతికి, వన్య్రప్రాణులకు హాని కలిగించే వస్తువులను అనుమతించరు. 4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత నైనితాల్ లోని పర్యాటక ప్రదేశాల సందర్శనం. రాత్రి బస నైనితాల్లో.ప్రకృతి అద్భుతం ఈ నయనం!నైనితాట్ పట్టణానికి పౌరాణిక ప్రాశస్త్యంతోపాటు రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ (వింటర్ క్యాపిటల్, వింటర్ సెషన్స్), నైనితాల్ సమ్మర్ క్యాపిటల్, అలాగే జ్యూడిషియల్ క్యాపిటల్ కూడా, గవర్నర్ బంగ్లా కూడా నైనితాల్లోనే. తాల్ అంటే సరస్సు, నయనం (కన్ను) ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈ తటాకానికి నైనితాల్ అని పేరు. ప్రకృతి దేవత రూపంలో కొలిచే సంస్కృతిలో భాగంగా నెలకొన్న నయనాదేవి (నైనాదేవి) ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఒక పర్వత శిఖరానికి నైనా పీక్ అని పేరు. అది ఎనిమిది వేల అడుగులకు పైగా ఉంటుంది. చర్చ్, ప్రాచీన కాల నిర్మాణశైలి మసీదు నిర్మాణశైలి సునిశితంగా ఉంటుంది. హనుమాన్ ఘరి ఆలయం నైనితాల్లోని మాల్ రోడ్లో ఉంది. ఈ ఆలయం ఉన్న ప్రదేశం మంచి వ్యూ ΄ాయింట్. ఇక్కడి నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయాలు అద్ధుతంగా ఉంటాయి. మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ శిఖరాలను కూడా చూడవచ్చు.5వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత అల్మోరా, ముక్తేశ్వర్ దిశగా ప్రయాణం. దర్శనం తర్వాత తిరిగి నైనితాల్కు చేరాలి. రాత్రి బస నైనితాల్లో.ఇక్కడ ఆది మానవుడు నివసించాడు!అల్మోరాలో చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి అనే ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి జవాబు ఇది ఒక అందమైన ప్రదేశం. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వచ్చిన ప్రముఖుల పాదముద్రలే పర్యాటక ప్రదేశాలు. స్వామి వివేకానందుడు ప్రకృతి సౌందర్యం, ప్రశాంతతల «మధ్య ధ్యానం చేసుకోవడానికి సరైన ప్రదేశంగా ఎంచుకున్నాడు. మహాభారత కాలంలో కూడా ఈ ప్రదేశం ప్రస్తావన ఉంది. అది కేవలం పుక్కిటి పురాణం కాదనడానికి నిదర్శనంగా చంద్ రాజవంశం నివసించిన భవనాలున్నాయి.రాజభవనాలంటే మనకు రాజస్థాన్ కోటలు, ప్యాలెస్లే గుర్తొస్తాయి. కానీ ఇక్కడి రాజభవనాన్ని చూస్తే రాజు అత్యంత నిరాడంబరంగా జీవించాడనిపిస్తుంది. పెద్ద రాతి గోడలు, ఆకు పచ్చ రంగు రేకులతో ఏటవాటు పైకప్పు భవనమే చంద్ రాజవంశపు కోట. కుమావ్ పర్వతశ్రేణుల్లో రాజ్యాన్ని స్థాపించి అల్మోరా రాజధానిగా పాలించారు. ప్రాచీనకాలంలో ఇక్కడ మనుషులు నివసించారని నిరూపించే లఖుదియార్ గుహలున్నాయి. క్రికెట్ క్రీడాకారుడు మహేంద్ర సింగ్ ధోనీ పూర్వికులు అల్మోరా వాసులే.అదిగో మంచుకొండ ముక్తేశ్వర్ శైవ క్షేత్రం. ఇక్కడి శివుడిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని చెబుతారు. ఉత్తరాఖండ్ పర్యటనలో హిమాలయాలు పర్యాటకులతో దోబూచులాడుతూ ఉంటాయి. పర్వత సానువుల మధ్య ప్రయాణం సాగుతున్నప్పుడు కొంత మేర ఆకాశాన్నంటే శిఖరాలతో ప్రపంచంతో సంబంధాలు తెగి΄ోయినట్లయినిపిస్తాయి. ఒక మలుపు తిరగ్గానే సూర్యకిరణాలతో ధగధగలాడుతూ మంచుకొండలు దర్శనమిస్తాయి. కొండవాలులో ప్రయాణిస్తున్నప్పుడు లోయలు వెన్నులో భయాన్ని పుట్టిస్తాయి. గూగుల్ సెర్చ్ చేస్తే ఏడు వేల అడుగుల ఎత్తులో ఉన్నామని చూపిస్తుంది. ఇక భయాన్ని అదిమిపెట్టి లోయవైపు చూడకుండా కొండంత అండగా కనిపిస్తున్న కొండనే చూస్తూ ముందుకు సాగిపోవాలి.6వ రోజుబ్రేక్ ఫాస్ట్ తర్వాత ఉదయం గది చెక్ అవుట్ చేసి ఢిల్లీకి ప్రయాణం. ఢిల్లీ చేరేటప్పటికి సాయంత్రం అవుతుంది. అక్షరధామ్ టెంపుల్ సందర్శనం తర్వాత హోటల్లో చెక్ ఇన్. రాత్రి బస.లోహరహిత నిర్మాణంఅక్షరధామ్ ఆలయం విశాలమైన నిర్మాణం. ఇది స్వామి నారాయణ ఆలయం. ఈ ఆలయాన్ని ్ర΄ాచీన భారత శిల్పశాస్త్రాన్ని అనుసరించి నిర్మించారు. ఇంత భారీ నిర్మాణంలో ఎక్కడా లోహాలను ఉపయోగించలేదు. అందుకే పిల్లర్లు ఎక్కువగా కనిపిస్తాయి. 234 స్తంభాలున్నాయి. ఒక్కొక్క స్తంభం మీద సునిశితమైన శిల్పచాతుర్యమయం. ఉత్తరాది నిర్మాణాలకు పాలరాయి ఒక వరం అనే చె΄్పాలి. పాలరాతితో పూలరెక్కలను కూడా అంతే సున్నితంగా చెక్కగలిగిన నిపుణులు ఉండడం మనదేశ గొప్పదనం. అందుకే పాలరాతి ఆలయాలకు వెళ్లినప్పుడు చుట్టూ చూసి సరిపెట్టుకోకుండా తలెత్తి పైకప్పును కూడా చూడాలి. అక్షరధామ్ ఆలయ సందర్శనంలో వాటర్ ఫౌంటెయిన్లు, లేజర్ షోలను మిస్ కాకూడదు.7వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత కుతుబ్మినార్, లోటస్ టెంపుల్ సందర్శనం, మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. నాలుగు గంటలకు 12724 నంబర్ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతుంది. ఎనిమిదవ రోజు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ స్టేషన్కు చేరుతుంది.ఏనాటిదో ఈ మినార్!కుతుబ్ మినార్ నిర్మాణం గురించి చరిత్ర తవ్వకాల్లో కొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. అప్పటికప్పుడు ఓ చిన్న వివాదం, ఆ తర్వాత సమసి΄ోవడం, కొత్త వాస్తవాలను స్వీకరించడం జరుగుతోంది. ఈ నిర్మాణాన్ని క్రీ.శ పన్నెండవ శతాబ్దంలో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడనే ఆధారాలను కొట్టి పారేస్తూ ఐదవ శతాబ్దంలో రాజా విక్రమాదిత్యుడు నిర్మించాడనే ఆధారాలు వ్యక్తమయ్యాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలను కొనసాగిస్తోంది. ఈ వాస్తవాలెలా ఉన్నప్పటికీ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ ఓ గొప్ప నిర్మాణ విశేషం. అందుకే యునెస్కో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది.ధ్యాన కలువప్రతి ఆర్కిటెక్చర్ స్టూడెంట్ చూడాల్సిన నిర్మాణం. ఎక్కడా పిల్లర్ లేదు. కలువ రెక్కల లోపల లోహపు కడ్డీల ఆధారంగా నిర్మించారు. గొప్ప ఆధ్యాత్మికత అన్వేషణలో భాగంగా ధ్యానం కోసం నిర్మించిన బహాయీ ధ్యానమందిరం ఇది. లోటస్ టెంపుల్ గిన్నిస్ రికార్డు సాధించిన ఆలయం. ఈ ఆలయం, నిర్మాణ వైశిష్ట్యాలను వివరిస్తూ ఐదు వందల వ్యాసాలు, వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి. ఈ ప్రాంగణం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కానీ శబ్దం వినిపించదు. నిర్వహకులు పిన్డ్రాప్ సైలెన్స్ మెయింటెయిన్ చేస్తారు. చక్కటి గార్డెన్ల మధ్య మెల్లగా నడుస్తూ లోపలికి వెళ్లి కొద్ది సేపు ధ్యానం చేసి బయటకు రావడం గొప్ప అనుభూతినిస్తుంది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..)

బొమ్మలాట
ఒక ఊర్లో ఓ మోతుబరి రైతు ఉండేవాడు. బాగా సంపాదించిన అతడికి వయసుపైబడింది. వృద్ధాప్యం సమీపించే కొద్దీ అతడిలో ప్రాణ భయం పట్టుకుంది. ఒక రోజు పొలం పనుల మీద పక్క ఊరికెళ్ళాడు. చిన్నగా మొదలైన వాన చినుకులు కొద్దిసేపటికే పెద్ద వర్షంగా మారింది. అటూ ఇటూ చూశాడు. దూరంగా పెద్ద మర్రిచెట్టు కనిపించింది. గబగబా నడుచుకుంటూ వెళ్ళి చెట్టుకింద నిలబడ్డాడు. ఆ మర్రి చెట్టు కింద మట్టితో బొమ్మలు తయారు చేసే కుమ్మరి ఉన్నాడు. రకరకాల అందమైన బొమ్మలు తయారు చేసి అమ్మకానికి పెట్టి ఉన్నాడు.ఇంతలో వాన ఉధృతమయ్యింది. వానకి మట్టి బొమ్మలు కొన్ని చిన్నచిన్నగా కరిగిపోసాగాయి.దాన్ని కళ్ళారా చూసిన రైతు, ఆ కుమ్మరి దగ్గరకు వెళ్ళి ‘‘నీకు బాధగా లేదా?’’ అని అడిగాడు. ‘‘బాధగా లేదు. ఇది సహజం!’’ అని బదులిచ్చాడు కుమ్మరి. ‘‘ఎందుకు బాధ లేదని చెబుతున్నావు? నీకు నష్టం జరుగుతోంది కదా’’ అని మళ్ళీ ప్రశ్నించాడు రైతు.‘‘ఈ మట్టి బొమ్మలు ఆకాశంలో నుంచి ఊడి పడలేదు. అవి మట్టితో తయారు చేసినవి. మట్టినుంచి వచ్చినవి మట్టిలోకే కదా పోతాయి. దానికెందుకు బాధపడాలి. నాకు దేవుడిచ్చిన శరీరం ఉంది. మరింత కష్టపడి మరిన్ని బొమ్మలు తయారు చేయగలను, ఈ జానెడు పొట్ట నింపుకోగలను.నిజంగా ఈ మట్టిబొమ్మల మీద నాకు ఏ హక్కూ లేదు. కారణమేమిటంటే అవి ప్రకృతిలో ఉచితంగా దొరికిన మట్టితో తయారు చేయబడినవి. అది ప్రకృతి నాకిచ్చిన అవకాశం. ఈ మట్టిని బొమ్మలుగా మార్చి నా పొట్ట గడుపుకుంటున్నానని ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుంటాను. అందుకే నేను లాభాలకు పొంగిపోను, నష్టాలకు క్రుంగి పోను. నిజం చె΄్పాలంటే ఈ కరిగిపోతున్న మట్టిని చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అవి పుట్టింటికి వెళ్తున్నాయన్న స్పృహ నాకుంది’’ అని బదులిచ్చాడు.కుమ్మరి చెప్పిన జీవిత సత్యం విని రైతు ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని తనకి అన్వయించుకున్నాడు. ‘మన జీవితం కూడా మూన్నాళ్ళ ముచ్చటే కదా. దేవుడు ఆడించే బొమ్మలాటే కదా. ఎక్కడినుంచి వచ్చామో, అక్కడికి వెళ్ళడం ఎవ్వరికైనా తప్పదు కదా’ అని గుర్తు తెచ్చుకున్నాడు. ఇంతలో వాన నిలవడంతో అక్కడినుంచి కదిలాడు రైతు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు1

ఈ పక్షం.. పితృపక్షం
ఈ ఏడాది పితృ పక్షాలు గ్రహణంతో ప్రారంభం అయ్యాయి. తిరిగి గ్రహణంతోనే ముగియనున్నాయి. అంటే.. సెప్టెంబర్ 7వ తేదీ చంద్రగ్రహణంతో ప్రారంభమై.. సెప్టెంబర్ 21, ఆదివారం, అమావాస్య నాడు సంభవించబోయే సూర్యగ్రహణం రోజున ముగియనున్నాయి.సుమారు 100 ఏళ్ల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంటున్నట్లు పండితులు, పెద్దలు చెబుతున్నారు. వివేకవంతులు ఈ రోజులను సద్వినియోగం చేసుకుంటారు. అదెలాగంటే...జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పితృదోషాల వల్ల అనేక రకాల సమస్యలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చేపట్టిన పనులలో పదే పదే ఆటంకాలు కలగడం, కీర్తి, గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లడం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించడం, ఎవరో ఒకరికి మానసిక స్థితి సరిగా లేకుండా ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, ఒకవేళ సంతానం కలిగినా ఆ పుట్టిన సంతానం జీవించకపోవడం వంటి సమస్యలు సంభవించే అవకాశం ఉంది. ఇవన్నీ పితృ శాపాల వల్ల లేదా పితృదేవతలు అసంతృప్తికి గురవడం వల్ల కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల పితృ పక్షాల సమయం పూర్వీకుల ఆశీస్సుల కోసం అలాగే పితృదేవతలను సంతృప్తి పరిచేందుకు అనుకూలమైన సమయం. అలాగే.. మహాలయ పక్షంలో ఆచరించే శ్రాద్ధ కర్మలు, దానాలు, పుణ్య కార్యాల వల్ల సంతానం లేని వారికి సంతానం కలిగి, వంశాభివృద్ధి అవుతుంది. పితృదోషాల వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలు, అడ్డంకులు, ఆటంకాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. పితృపక్షంలో రోజూ సాయంత్రం పితృదేవతా నిలయమైన నైరుతి మూలన దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని, అలాగే.. పితృదేవతలను స్మరించుకుంటూ వారి కోసం ధ్యానం చేస్తే ఆ ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయని కూడా బలమైన నమ్మకం.అలాగే.. పితృదేవతలకు రోజూ అపరాహ్న వేళ అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జల తర్పణాలు వదలాలి. ఒకవేళ జల తర్పణాలు 15 రోజులు వదలడం వీలు కాని వాళ్లు మహాలయ అమావాస్య రోజునైనా తర్పణం వదలాలి. కాకులకు, జంతువులకు ఆహారం పెట్టాలి. పేదవారికి అన్నదానం, వస్త్ర దానం చేయడం, పండితులకు, గురువులకు భోజనం పెట్టి తాంబూలం ఇవ్వడం వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి.పితృ పక్షం సమయంలో ఇంట్లో పూజలు, హోమాలు ఆచరించడం పుణ్యప్రదం. పితృపక్షంలో ఇప్పటికే వారం రోజులకు పైగా గడిచిపోయింది. ఇంకా వారం కూడా పూర్తిగా లేదు. అందువల్ల చివరి రోజైన మహాలయ అమావాస్య వరకు వాయిదా వేయకుండా వీలయినప్పుడల్లా పేదలకు అన్నదానం చేయడం మంచిది. ఇక మహాలయ అమావాస్య రోజున తర్పణాలు వదిలే కార్యక్రమం పూర్తి చేశాక.. దసరా శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాక మాత్రమే తిరిగి శుభకార్యాలు ప్రారంభించాలి.– డి.వి.ఆర్.

తుఫానులోనూ చెదరని ప్రశాంతత
మన జీవితంలో సవాళ్లు మనల్ని ముంచెత్తే తుఫానులా వస్తాయి. ఆ అలల తాకిడికి మన మనసు అలజడి చెందుతుంది. కానీ, ఆ తుఫాను మధ్యలో నిశ్చలంగా నిలబడిన కొండలా మనల్ని నిలబెట్టేదే ఓర్పు. బయటి ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా, మన అంతరంగంలో తుఫానులోనూ చెదరని ప్రశాంతతను నింపుకునే శక్తి ఇది. ఓర్పు కేవలం నిరీక్షించడం కాదు, అది ఆత్మబలానికి అసలైన నిర్వచనం.ఓర్పు అనేది మనసును నియంత్రించే ఒక శక్తి. సనాతన ధర్మంలో ఇది ఒక అత్యున్నత విలువగా పరిగణించబడింది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు కష్టాలను, సుఖాలను సమంగా చూడమని అర్జునుడికి ఉపదేశిస్తాడు. అదే నిజమైన జ్ఞానానికి, స్థిరత్వానికి పునాది అని వివరిస్తాడు. క్షమా వీరస్య భూషణం శక్తిమతాం క్షమా శ్రేయః ఓర్పు అనేది వీరులకు ఆభరణం. శక్తిమంతులకు ఓర్పు ఒక గొప్ప ధర్మం. ఈ సూక్తి ఓర్పును బలహీనతగా కాకుండా, అత్యంత ఉన్నతమైన ధైర్యంగా, శక్తిగా గుర్తిస్తుంది. నిజమైన బలం శారీరక శక్తిలో కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా శాంతంగా, స్థిరంగా ఉండగల మానసిక శక్తిలో ఉందని ఇది నొక్కి చెబుతుంది.శానైర్గచ్ఛన్ శనైర్గచ్ఛన్ పంథాః సంపూర్ణో భవతినెమ్మదిగా, ఓర్పుతో అడుగులు వేసేవాడు దారిని పూర్తిగా చేరుకుంటాడు. అంటే, ఓర్పుతో, నిలకడగా కృషి చేసేవారు ఖచ్చితంగా తమ గమ్యాన్ని చేరుకుంటారు. ఇది ఆధునిక జీవితంలో కూడా అంతే సత్యం. పరీక్షల్లో విజయం సాధించడానికి రోజూ కొంతసేపు చదవాలి, ఒక్కరోజులో కాదు. ఒక వ్యాపారం విజయవంతం కావడానికి ఎన్నో ఏళ్ల నిరంతర కృషి, ఓర్పు అవసరం. ఓర్పు అనేది మన లక్ష్యంపై మనకున్న నమ్మకాన్ని, నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.క్షమా బలం అశక్తానాం, శక్తానాం భూషణం క్షమా ఓర్పు అనేది బలహీనులకు బలం, శక్తిమంతులకు ఆభరణం. ఓర్పును అలవరచుకోవడం ద్వారా బలహీనులు కూడా శక్తివంతులుగా మారగలరు. అది ఒక శక్తిమంతుని కీర్తిని, గౌరవాన్ని పెంచుతుంది. ఈ సూక్తి ఓర్పు సార్వత్రిక శక్తిని, అది అందరికీ ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో స్పష్టం చేస్తుంది.ఓర్పు అనేది కేవలం నిరీక్షించడం కాదు, అది జీవితాన్ని అర్థవంతంగా, ప్రశాంతంగా జీవించే ఒక గొప్ప కళ. ఓర్పును అలవరచుకోవడం ద్వారా మనం అనవసరమైన ఆందోళనల నుండి విముక్తి పొందవచ్చు, ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కష్టాల పర్వతాలను చిన్న మెట్లుగా మార్చగల శక్తి ఓర్పుకు మాత్రమే ఉంది. ఓర్పు అనే బలం మనకు జీవితంలో ఎలాంటి తుఫానులనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఈ గొప్ప గుణాన్ని మన జీవితంలో నిత్యం సాధన చేయడం ద్వారా విజయం, ప్రశాంతత, ఆనందం తప్పక లభిస్తాయి.భారతంలో సత్యవంతుడి భార్య సావిత్రి, తన భర్త జీవితం ముగిసే రోజున యమధర్మరాజు వెంట వెళ్లి, తన పట్టుదల, వాదన, అపారమైన ఓర్పుతో తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది. ఈ కథ ఓర్పు దృఢ సంకల్పానికి ఉండే అద్భుత శక్తికి నిదర్శనం. అలాగే, హరిశ్చంద్రుడు తన సర్వస్వాన్ని కోల్పోయినా, చివరి క్షణం వరకు సత్యానికే కట్టుబడి ఉన్నాడు. ఆయన సత్యనిష్ఠకు, ఓర్పుకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి.ప్రఖ్యాత శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనిపెట్టే క్రమంలో వేలసార్లు విఫలమయ్యారు. ప్రతి వైఫల్యం తర్వాత, ఆయన ‘ఈసారి పని చేయని ఇంకో మార్గాన్ని కనుగొన్నాను‘ అని ఓర్పుతో, పట్టుదలతో కృషి చేశారు. ఆయన ఓర్పు కారణంగానే ప్రపంచం చీకటి నుంచి వెలుగులోకి వచ్చింది. అలాగే, మహాత్మాగాంధీ తన జీవితంలో ఎదురైన ఎన్నో అవమానాలను, కఠిన పరిస్థితులను ఓర్పుతో ఎదుర్కొని, అహింసను, సత్యాగ్రహాన్ని తన ఆయుధాలుగా మలచుకున్నారు. ఆయన ఓర్పు, శాంతం, అకుంఠిత విశ్వాసంతో ప్రపంచంలోనే అతిపెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఓడించి, భారతదేశానికి స్వాతంత్య్రం సాధించారు. ఇది ఓర్పుకు, దాని శక్తికి ఉన్నతమైన ఉదాహరణ.– కె. భాస్కర్ గుప్తా(వ్యక్తిత్వ వికాస నిపుణులు)
ఫొటోలు


కిక్ ఇచ్చేలా 'దిశా పటాని' ఫోజులు.. ట్రెండింగ్లో (ఫోటోలు)


తలలేని భైరవ కొండన్న విగ్రహం.. మొండి భైరవకోన ఆలయం (ఫొటోలు)


సూర్య బర్త్డే గిఫ్ట్ అదిరిపోయిందిగా.. దేవిషాతో కలిసి సెలబ్రేషన్స్ (ఫోటోలు)


'సన్నీ సంస్కారి కి తులసి కుమారి' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)


ప్రమాదకరంగా మూసాపేట్ మైసమ్మ చెరువు (ఫొటోలు)


గోల్డ్ మెడల్స్ వచ్చిన వేళ ‘మహా’నందం (ఫొటోలు)


రెడ్ కలర్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ రితికా నాయక్ (ఫొటోలు)


ఖైరతాబాద్ : దాండియా వేడుక..నవరాత్రి ఉత్సవ్–2025 (ఫొటోలు)


విశాఖపట్నంలో నేషనల్ డాగ్ షో అదరహో (ఫొటోలు)


విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
అంతర్జాతీయం

నేపాల్ తాత్కాలిక ప్రధాని కర్కీ సంచలన ప్రకటన
ఖాట్మాండ్: నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కర్కీ ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, ప్రధాని సుశీలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆందోళనల్లో భాగంగా ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కర్కీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా.. నేపాల్లో నిరసనలు, ఆందోళనల వేళ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఘటనపై దర్యాప్తు చేపడతామని స్పష్టం చేశారు. తాను అధికారాన్ని అనుభవించేందుకు రాలేదని తెలిపారు. ఆరు నెలలకు మించి ఈ పదవిలో ఉండబోమని, ఆ తర్వాత కొత్త పార్లమెంట్కు బాధ్యతలను అందిస్తామని చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికే బాధ్యతలు చేపట్టాం. దేశ పునర్నిర్మాణానికి ప్రజలందరి సహకారం అవసరమని, వారి మద్దతు లేకుండా తాము విజయం సాధించలేమని అన్నారు. ఇక, ఈరోజు తాత్కాలిక ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది.Kathmandu: Days after taking charge as the interim Nepal Prime Minister, Sushila Karki says, "Those involved in the incident of vandalism will be investigated.'' she said, "My team and I are not here to taste the power. We won't stay for more than 6 months. We will hand over… pic.twitter.com/dg1WhdniyJ— The Truth India (@thetruthin) September 14, 2025ఇదే సమయంలో ప్రధాని కీలక ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా ‘అమరవీరులు’గా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. ఇది ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నారు. అధికారం కోసం కాకుండా దేశాన్ని తిరిగి గాడిన పెట్టడానికే తాము వచ్చినట్టు వెల్లడించారు. దీంతో, ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నేపాల్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

బ్రిటన్లో ఉద్రిక్తత.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
లండన్: బ్రిటన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. లక్షల మంది పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో టెస్లా సీఈవో, ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలసలతో బ్రిటన్ నాశనం అవుతోంది అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.బ్రిటన్లో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ సందర్బంగా వీడియోలో మాట్లాడుతూ.. ‘భారీగా, అనియంత్రితంగా వస్తున్న వలసలతో బ్రిటన్ నాశనమవుతోంది. వలసల కారణంగా హింస పెరిగిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే హింస ప్రజలందరి వద్దకు వస్తుంది. ఇప్పటికైనా ప్రతిఘటించాల్సిందే.. పోరాడాల్సిందే. మన హక్కులు కాపాడుకోవాల్సిందే. పోరాడండి.. లేదంటే చనిపోతారు.. అని వారికి మద్దతు ఇచ్చారు. చివరగా.. బ్రిటన్లో ప్రభుత్వ మార్పు జరగాలని నేను అనుకుంటున్నాను’ అని కామెంట్స్ చేశారు.📢 Massive protests in London today! Tens of thousands at "Unite the Kingdom" rally for free speech & anti-immigration, with reports of hundreds of thousands or even 1M+ attendees. 🇬🇧 #LondonProtests #UKNews pic.twitter.com/AD0OjUZjuy— Socially Trendy (@SociallyTrendyX) September 13, 2025 ఇదిలా ఉండగా.. శనివారం సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దది. ఈ సందర్భంగా ప్రజలందరూ..‘మా దేశాన్ని మాకు తిరిగి ఇవ్వండి, పడవలను ఆపండి వంటి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఇక, ఈ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్-రైట్ కార్యకర్త టామీ రాబిన్సన్ నిర్వహించిన 'యునైట్ ది కింగ్డమ్' ర్యాలీ హింసాత్మకంగా మారింది. వలస విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ప్రదర్శనలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనల్లో 26 మంది పోలీసు అధికారులు గాయపడగా, 25 మందిని అరెస్ట్ చేశారు.#BREAKING: Anti-immigration protesters clash with "Stand Up To Racism" counter-demonstrators in London, marching toward Westminster. Heavy police presence deployed to keep groups apart amid tense standoff in Whitehall. #LondonProtests #UKNews pic.twitter.com/ibaKsRxVF5— Uma Shankar✍️ (@umashankermedia) September 13, 2025మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ర్యాలీకి ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో, సుమారు 1,10,000 నుంచి 1,50,000 మంది ప్రజలు హాజరయ్యారు. ప్రదర్శన చివరి దశలో కొంతమంది నిరసనకారులు అదుపుతప్పి పోలీసులపై బాటిళ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. ప్రత్యర్థి వర్గాల నిరసనకారులను వేరుచేయడానికి ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించడానికి ప్రయత్నించారు. ఈ దాడుల్లో నలుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో 'స్టాండ్ అప్ టు రేసిజం' సంస్థ ఆధ్వర్యంలో సుమారు 5,000 మందితో వలసదారులకు మద్దతుగా మరో ప్రదర్శన కూడా జరిగింది. Police try to stop #UniteTheKingdom protesters going the route the police GAVE them to walk but the British heavily outnumbering the police push through the line. British men are waking up, they don't fear police. #TommyRobinson #london #reform pic.twitter.com/JEMP5pDX4K— Jamie (@Jamie69660989) September 13, 2025

‘లాడెన్ను మట్టుబెట్టాక..’ రహస్యాలు వెల్లడించిన పాక్ మాజీ అధికారి
న్యూఢిల్లీ: 2011, మే 2.. తెల్లవారుజామున యునైటెడ్ స్టేట్స్ అత్యంత సాహసోపేతమైన సైనిక కార్యకలాపాలను అమలు చేసింది. పాకిస్తాన్లోని అబోటాబాద్లో 40 నిమిషాల పాటు జరిపిన దాడిలో యూఎస్ నేవీ సీల్స్(US Navy SEALs) 9/11 దాడుల సూత్రధారి, అల్-ఖైదా అధిపతి ఒసామా బిన్ లాడెన్ను మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్ ప్రపంచాన్ని షాక్నకు గురిచేయడమే కాకుండా, పాకిస్తాన్ విశ్వసనీయత అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతింది. అయితే ఈ సమయంలో చోటుచేసుకున్న పలు పరిణామాలను పాక్ దాస్తూ వచ్చింది. లాడెన్ భార్యలను అమెరికా విచారించిన సంగతిని కూడా ఏనాడూ బహిర్గతం చేయలేదు.తాజాగా పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ మాజీ ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ రచించిన ‘ది జర్దారీ ప్రెసిడెన్సీ: నౌ ఇట్ మస్ట్ బీ టోల్డ్’ అనే పుస్తకం.. పాక్ ఇంతకాలం దాచుతూ వచ్చిన రహస్యాలను బహిరంగపరచింది. బిన్ లాడెన్ హత్య తర్వాత అతని భార్యలను పాకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజన్సీ (సీఐఎ) బృందం అబోటాబాద్ కంటోన్మెంట్లో ప్రత్యక్షమై లాడెన్ భార్యలను విచారించింది. అయితే ఇది పాకిస్తాన్ సార్వభౌమాధికారంపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది. ఈ ఎపిసోడ్ దేశానికి జాతీయ అవమానంగా బాబర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ గడ్డపై అమెరికన్ ఏజెంట్లు స్వేచ్ఛగా తిరుగుతుండటంతో పాక్ ప్రభుత్వం, సైన్యం ఒత్తిడికి లోనవుతున్నట్లు కనిపించిందని ఆయన రాశారు. ఈ సంఘటన పాకిస్తాన్కు తీవ్ర ఇబ్బందిని కలిగించిందని బాబర్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.నాటి అమెరికా విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్, సెనేటర్ జాన్ కెర్రీతో సహా సీనియర్ అమెరికన్ అధికారులు పాకిస్తాన్కు ఎలా వచ్చారో ఈ పుస్తకంలో వివరించారు. ఆ సమయంలో ఇస్లామాబాద్.. భవిష్యత్తులో అమెరికా ఏకపక్ష దాడులకు దూరంగా ఉంటుందని హామీ పొందేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయినప్పటికీ, యునైటెడ్ స్టేట్స్ ఎటువంటి హామీలు ఇవ్వలేదని బాబర్ వివరించారు. ఈ దాడికి చాలా కాలం ముందు నుంచే బిన్ లాడెన్.. అబోటాబాద్ రహస్య స్థావరంపై సీఐఎ నిఘాను సారించడం పాకిస్తాన్కు అత్యంత బాధాకరమైన విషయగా మారిందని బాబార్ పేర్కొన్నారు.

పాక్ సైన్యం, టీటీపీ మధ్య భీకరపోరు.. 19 మంది జవాన్లు మృతి
పెషావర్: పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో సైన్యానికి, నిషేధిత తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) ఉగ్రవాదులకు మధ్య భీకరపోరు కొనసాగుతోంది. నాలుగు రోజులుగా జరుగుతున్న పోరాటంలో కనీసం 19 మంది సైనికులు, 45 మంది ఉగ్రవాదులు చనిపోయారని ఆర్మీ తెలిపింది. బజౌర్ జిల్లాలో ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో 22 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.దక్షిణ వజీరిస్తాన్లో జరిగిన మరో ఎన్కౌంటర్లో 13 మంది టెర్రరిస్టులు మృతి చెందారు. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 12 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం లాల్ ఖిల్లా మైదాన్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు సైనికులు, 10 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. ఎన్కౌంటర్ల అనంతరం ఆయా ప్రాంతాల్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
జాతీయం

చట్టవిరుద్ధం అని తేలితే పక్కన పడేస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ: బిహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ ఏమాత్రం చట్టవిరుద్ధంగా అనిపించినా మొత్తం ప్రక్రియను పక్కన పడేస్తామని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఎస్ఐఆర్ చట్టవిరుద్ధంగా చేపడుతున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని హెచ్చరించింది. ‘‘ రాజ్యాంగబద్ధ సంస్థగా ఎలక్షన్ కమిషన్ ప్రతి పనినీ చట్టప్రకారమే నిర్వర్తిస్తుందని మేం మొదట్నుంచీ భావిస్తున్నాం. అయితే కొత్తగా చేపట్టిన ఎస్ఐఆర్ ఏ దశలోనైనా చట్టవిరుద్ధమని తేలితే మొత్తం విధానాన్ని రద్దుచేస్తాం. ఇప్పటికిప్పుడే ఎస్ఐఆర్పై తుది నిర్ణయానికి రాబోం. కేసులో చివరి వాదోపవాదనలను అక్టోబర్ ఏడోతేదీన ఆలకిస్తాం. ఈ కేసులో మేం ఇచ్చే తుది తీర్పు బిహార్కు మాత్రమేకాదు యావత్భారతదేశానికి వర్తిస్తుంది. ప్రస్తుతానికి ఎస్ఐఆర్లాంటి ప్రక్రియను ఇతర రాష్ట్రాల్లో ఈసీ చేపట్టినా మేం అడ్డుచెప్పబోం. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుపై అభ్యంతరాలు ఉంటే పిటిషనర్లు తమ వాదనలను అక్టోబర్ ఏడో తేదీన వినిపించుకోవచ్చు. అక్టోబర్ ఏడున కేసు విచారణ ఉండబోతోంది ఆలోపే అంటే సెప్టెంబర్ 30వ తేదీన బిహార్ ఓటర్ల తుది జాబితా ముద్రణ ఉండబోతోంది. ఈ తేదీకి కేసు విచారణకు ఎలాంటి సంబంధం లేదు. ఆ తుది జాబితాలో ఏవైనా చట్టవిరుద్ధత కనిపిస్తే ఎస్ఐఆర్ ప్రక్రియను అప్పడైనా రద్దుచేస్తాం’’ అని కోర్టు స్పష్టంచేసింది. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది, పిటిషన్ వేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ చేపట్టేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోందని, ఈ విషయంలో ఈసీని అడ్డుకోవాలని న్యాయవాది గోపాల్ వాదించారు. ‘‘ అసలు ఈ విధానంలో చట్టబద్ధతను ఇంకా తేల్చాల్సి ఉంది. రాజ్యాంగంలో ఇలాంటి విధానం నియమనిబంధనలను పరిశీలించాల్సి ఉంది. ఆలోపే ఇతర రాష్ట్రాల్లో ప్రక్రియను ఆపాలని ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. దేశవ్యాప్త ఎస్ఐఆర్పై ఈసీ మరింత ముందుకు వెళ్లేలోపే ఈసీని నిలువరించాలని కాంగ్రెస్సహా పలు విపక్ష పార్టీల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్సిబల్ కోర్టును కోరారు. చట్టాన్ని తుంగలోతొక్కి ఈసీ తన సొంత నిర్ణయాలను అమలుచేస్తోందని రాష్ట్రీయ జనతాదళ్ తరఫున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. ‘‘జాబితాలో తప్పులుంటే 24 గంటల్లోపు వెబ్సైట్లో అభ్యంతరాలను అప్లోడ్చేయాలని ఈసీ చెబుతోంది. ఇది చాలా కష్టమైన పని’’ అని ఆయన వాదించారు.

బిహార్ను బీడీతో పోలుస్తారా!
పుర్నియా: బిహార్ అభివృద్ధిబాటన సాగుతుండగా ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీలు ఓర్వలేని తనంతో చులకనగా మాట్లాడుతున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. అవమానించడమే ప్రతిపక్ష నాయకులు పనిగా పెట్టుకున్నారని ధ్వజమె త్తారు. మోదీ సోమవారం బిహార్లోని పుర్నియా లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బిహార్ అంటే బీడీ అంటూ ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బిహార్లో తయారైన రైలింజిన్లు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ విషయం కాంగ్రెస్, ఆర్జేడీ నేతలకు నచ్చడం లేదు. బిహార్లో అభివృద్ధి ఛాయలు కనిపించినప్పుడల్లా ఈ నేతలు చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ఏకమై బిహార్ను బీడీతో పోలుస్తూ సోషల్ మీడియా వేదికలపై చెలరేగిపోతున్నారు’అని ఆయన అన్నారు. ‘ఈ రెండు పార్టీల నేతలు సొంత కుటుంబసభ్యుల గురించే ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. మీ కుటుంబం సంక్షేమం వారికి పట్టదు. కానీ, మోదీకి మీరందరూ కుటుంబ సభ్యులే. అందుకే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అని మోదీ అంటున్నారు. మీ కుటుంబం, సంక్షేమం, మీ బాగోగుల గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు’అని తెలిపారు. బిహార్, పశ్చిమబెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు ప్రతిపక్షాలు అండగా నిలుస్తున్నా యని, వీటి తీరుతో ఆయా రా ష్ట్రాల జనాభాలో తీరుతెన్నుల్లో తీ వ్రమైన మార్పులు సంభవిస్తున్నా యని ఆయన హెచ్చరించారు. ఆయా రాష్ట్రాల్లోని వారు తమ తోబుట్టువులు, కుమార్తెల ఆత్మ గౌరవం గురించి ఆందోళన చెందుతున్నారని తెలిపారు.దేశ భద్రత, వనరులను ప్రతిపక్షాలు ఫణంగా పెడుతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. విదేశాల నుంచి అందుతున్న మద్దతుతో వలసదారులకు మద్దతుగా యాత్రలు నిర్వహిస్తూ నినాదాలు చేస్తూ నిస్సిగ్గుగా వ్యవహ రిస్తున్నారంటూ కాంగ్రెస్ చేపట్టిన ఓటర్ అధికార యాత్రనుద్దేశిస్తూ నిప్పులు చెరిగారు. ప్రతి చొరబాటుదారునూ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు ఎన్డీఏ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.40 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. పుర్నియా ఎయిర్పోర్టులో కొత్తగా అభివృద్ధి పర్చిన టెర్మినల్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. పుర్నియా–కోల్కతా మార్గంలో మొదటి విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మఖానా రంగం అభివృద్ధికి నేషనల్ మఖానా బోర్డు ద్వారా రూ.475 కోట్లు వెచ్చిస్తా మని ప్రకటించారు. భాగల్పూర్లో రూ.25 వేల కోట్లతో నిర్మించే ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు, రూ.2,680 కోట్ల కోసి–మెచి ఇంట్రా స్టేట్ రివర్ లింకు ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేశారు.

వక్ఫ్ సవరణ చట్టం: ఐదేళ్ల నిబంధన కుదరదు
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదంగా తయారైన వక్ఫ్(సవరణ) చట్టం–2025 విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సోమవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. చట్టంలోని ఒక ముఖ్యమైన నిబంధనపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల ధర్మాసనం 128 పేజీల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఒక వ్యక్తి తన ఆస్తిని వక్ఫ్ కోసం దానంగా ఇవ్వడం వంటికి చేయాలంటే కనీసం గత ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తూ ఉండాలన్న నిబంధనపై అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ మేరకు వక్ఫ్(సవరణ) చట్టంలోని సంబంధిత నిబంధనపై స్టే విధించింది. ‘‘ ఐదేళ్లుగా ఇస్లామ్ను పాటించాలి అనే నిబంధనలో స్పష్టత కరువైంది. సంపూర్ణ నిర్వచనంతో, సమగ్రస్థాయిలో ఈ అంశంపై స్పష్టత వచ్చేలా నిబంధనలు తయారుచేసేవరకు ఈ ప్రొవిజన్ అమలును నిలిపేస్తున్నాం. ఏదైనా చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందనే భావిస్తాం. కేవలం అరుదైన కేసుల్లో అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే జోక్యం చేసుకోవడం సబబు. వక్ఫ్ చట్టంలోని అన్ని నిబంధనల అమలుపై స్టే విధించాలన్న వాదనల్లో పసలేదు. అందుకే మొత్తం చట్టంపై స్టే విధించట్లేము. అయితే ఇరుపక్షాల వాదనలు విన్నాక రెండువైపులా సమతుల న్యాయం దక్కాలని చూస్తున్నాం. అందుకే వక్ఫ్ ఆస్తుల స్థితిని కలెక్టర్ మార్చే అధికారం అమలుకాకుండా స్టే విధిస్తున్నాం. అలాగే వక్ఫ్ బోర్డ్లలో ముస్లిమేతర సభ్యుల అంశంపై కలెక్టర్ నిర్ణయాలు తీసుకోకుండా స్టే విధిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు, ‘‘చాన్నాళ్లుగా వక్ఫ్ భూమిగా చెలామణి అయినంతమాత్రాన అది వక్ఫ్ భూమి కాబోదు. ప్రభుత్వ భూమి అయినాకూడా వక్ఫ్ ఆస్తిగా చెలామణిలో ఉన్నంత మాత్రాన అది వక్ఫ్ ఆస్తికాబోదు. వక్ఫ్ బై యూజర్ నిబంధన తొలగింపు సబబే’’ అని ధర్మాసనం మోదీ సర్కార్ చర్యను సమరి్థంచడం గమనార్హం. నాలుగు.. మూడుకు మించకూడదు ‘‘ కేంద్ర వక్ఫ్ మండలిలో ముస్లిమేతర సభ్యుల సంఖ్య నాలుగుకు మించకూడదు. మొత్తం సభ్యుల సంఖ్య 20 దాటకూడదు. అలాగే రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డ్లలో ముస్లిమేతర సభ్యుల సంఖ్య మూడుకు మించకూడదు. మొత్తం సభ్యుల సంఖ్య 11 దాటకూడదు. కనీసం ఐదేళ్లుగా ఒక వ్యక్తి ఇస్లాంను ఆచరిస్తున్నట్లు నిర్ధారించే కచ్చితమైన నిబంధనావళిని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించేదాకా ‘వక్ఫ్కు ఆస్తి ఇవ్వాలంటే ఐదేళ్లుగా ఇస్లాంను పాటించాలి’ అనే సెక్షన్3 లోని (ట) క్లాజుపై స్టే విధిస్తున్నాం. సంబంధిత అధికారి తన నివేదికను సమరి్పంచేదాకా ఏదైనా ఆస్తి ‘వక్ఫ్ ఆస్తి’ అని కొత్తగా ప్రకటించడానికి వీల్లేదు. ఏదైనా ఆస్తి ఒకవేళ ప్రభుత్వ ఆస్తి అయి ఉండవచ్చని ఆ అధికారి భావిస్తే ఆ మేరకు రెవిన్యూ రికార్డుల్లో సవరణ చేయొచ్చు, ఈ అంశాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలి అనే నిబంధనలపైనా స్టే విధిస్తున్నాం’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 3సీ కింద వక్ఫ్ ఆస్తిగా ప్రకటించని సందర్భంలో, ట్రిబ్యునల్ ఆదేశంతో సవరణ చట్టంలోని సెక్షన్ 83ని అమలుచేసి సందర్భంలో, హైకోర్టు తదుపరి ఆదేశం కోసం వేచి ఉన్న సందర్భాల్లో అలాంటి ఆస్తులను ఇక వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించకూడదు, రెవెన్యూ రికార్డుల్లో నమోదుచేయకూడదు’’ అని నిబంధనలపైనా స్టే విధిస్తున్నాం’’అని కోర్టు స్పష్టంచేసింది. వివాదాస్పద ఆస్తి ఎవరికి చెందుతుంది అనేది ట్రిబ్యునళ్లు, హైకోర్టుల్లో తేలేదాకా ఆ ఆస్తులపై మూడో పక్షానికి హక్కులు దఖలుపర్చకూడదు అని కోర్టు ఆదేశించింది. ముస్లింల వర్గానికి ఎక్స్–అఫీషియో కార్యదర్శిగా సేవలందించే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామానికి బాటలు వేసే సెక్షన్ 23పై కోర్టు ఎలాంటి స్టే విధించలేదు. చట్టంలో పేర్కొన్న ప్రకారం వక్ఫ్ అనేది ముస్లింలు ఇచ్చే విరాళం, దానం. తమ భూములు, స్థిరాస్థులను దాతృత్వ, మత సంబంధ కార్యక్రమాల కోసం దానం(వక్ఫ్)గా ఇవ్వొచ్చు. ఈ భూముల్లో మసీదులు, పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రజాసంస్థలు ఏర్పాటుచేసుకోవచ్చు. వక్ఫ్గా మారిన ఆస్తిని ఇతరులకు విక్రయించకూడదు, ఇంకొకరికి బహుమతిగా ఇవ్వకూడదు, వారసత్వంగా పొందకూడదు, ఆక్రమించకూడదు. వక్ఫ్ బై యూజర్ తొలగింపులో వివాదం లేదు ‘‘ పెద్ద మొత్తంలో ప్రభుత్వభూములు ఆక్రమణకు గురై చాన్నాళ్లుగా వక్ఫ్ వినియోగంలో ఉన్నాయి. నిరాటంకంగా వక్ఫ్ అ«దీనంలో ఉంటే అవి వక్ఫ్ బై యూజర్ నిబంధన ప్రకారం వక్ఫ్ ఆస్తులుగా మారుతున్నాయి. ఇది తప్పు అని భావించి ఈ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఈ తొలగింపులో ఎలాంటి వివాదం లేదు’’ అని సీజేఐ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.స్వాగతించిన కాంగ్రెస్ ‘‘కీలక సెక్షన్లను నిలుపుదల చేస్తూ కోర్టు ఇచి్చన తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ ఉత్తర్వు రాజ్యాంగ విలువలైన న్యాయం, సమానత్వ, సౌభ్రాతృత్వం గెలుపునకు నిదర్శనం. వాస్తవిక వక్ఫ్ చట్టాన్ని కాలరాస్తూ మోదీ సర్కార్ తీసుకొచి్చన తప్పుడు సవరణలను తొలగించేలా తుది తీర్పు వెలువడుతుందని ఆశిస్తున్నాం’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు. ‘‘ భారత్లో ఎప్పుడూ సద్దుమణిగిన అంశాలను మోదీ సర్కార్ ఎగదోస్తోంది. విద్వేషాలను పెంచేందుకు ఈ విభజన చట్టాన్ని బుల్డోజర్లా తీసుకొచి్చంది’’ అని అన్నారు. చాలావరకు ఆమోదించినట్లే: బీజేపీ‘‘మేం తెచి్చన సవరణలను కోర్టు ఆమోదించింది. మొత్తం చట్టంపై స్టే విధించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టంచేసింది. అంటే మెజారిటీ చట్టం చట్టబద్ధంగా ఉందని కోర్టే స్పష్టంచేసినట్లయింది. వక్ఫ్ బై యూజర్ మాటున ఇకపై వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణ అనేది ఇకపై ఆగుతుంది. కోర్టు నిర్ణయాలను మేం కూడా స్వాగతిస్తున్నాం’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులోని కీలకాంశాలు → ఐదేళ్లుగా ఇస్లాంను పాటిస్తున్న వ్యక్తి మాత్రమే వక్ఫ్(దానం) ఇవ్వాలన్న సెక్షన్ 3(1)(ట)ను నిలుపుదల చేసింది→ ఐదేళ్లుగా ఇస్లాంలో కొనసాగుతున్నారో లేదో తేల్చే నిబంధనలు రూపొందేదాకా సెక్షన్ 3(1)(ట)పై స్టే అమలు→ సంబంధిత ఆఫీసర్ నివేదించాడన్న ఒకే ఒక్క కారణంగా వక్ఫ్ ఆస్తిని వక్ఫ్కాని ఆస్తిగా పనిగణించకూడదు→ అలాంటి నివేదికలను ఆధారంగా చేసుకుని వక్ఫ్ రికార్డులతోపాటు ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో సవరణలు చేయకూడదు→ హైకోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద ఆస్తులపై సెక్షన్ 83 కింద వక్ఫ్ ట్రిబ్యునళ్లు ఇచ్చే నిర్ణయాలు అమలయ్యేలోపు వక్ఫ్ బోర్డ్లు ఎలాంటి ఆస్తులను తమ ఆస్తులుగా, తమవికాని ఆస్తులుగా ప్రకటించకూడదు→ సీఈవోగా నియమించబోయే వ్యక్తిని వీలైనంత వరకు ముస్లిం వర్గం నుంచే ఎంపికచేయాలి→ ఇవన్నీ మధ్యంతర ఉత్తర్వులే. ఈ ఉత్తర్వులు ఇచి్చనంత మాత్రాన సవరణ చట్టం చట్టబద్ధతపై తమ తమ వాదనలను ఇరుపక్షాలు వాదించే అవకాశం లేదని భావించకూడదు.ముస్లిం సంస్థల హర్షం వక్ఫ్ సవరణచట్టంలో ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న కీలక నిబంధనల అమలుపై కోర్టు స్టే విధంచడంతో ముస్లిం సంఘాలు ఆనందం వ్యక్తంచేశాయి. తుది తీర్పు సైతం ముస్లింలకు అనుకూలంగా రావాలని ఆశాభావం వ్యక్తంచేశాయి. ‘‘ ఈ మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం’’ అని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) ఒక ప్రకటనలో పేర్కొంది. కొన్ని నిబంధనలకు బదులు మొత్తం సవరణ చట్టాన్నే రద్దుచేయాలని ఆలిండియా షియా పర్సనల్ లా బోర్డ్(ఏఐఎస్పీఎల్బీ) ఆశాభావం వ్యక్తంచేసింది. ‘‘ఐదేళ్లుగా ఇస్లాంను పాటిస్తేనే వక్ఫ్ అనే నిబంధనపై స్టే విధించడం పెద్ద ఊరట. ఇక వక్ఫ్ బోర్డ్లో ముస్లిమేతర సభ్యుని అంశం అలాగే ఉండిపోయింది’’అని ఏఐఎంపీఎల్బీ కార్యనిర్వాహక సభ్యుడు ఖలీద్ రషీద్ ఫరాంగీ మహాలీ అన్నారు.

పెన్షన్కు సర్వీస్ బ్రేక్ అడ్డంకి కాదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో పాక్షిక ఊరట లభించింది. ఉద్యోగంలో చేరడంలో పరిపాలన పరంగా జరిగిన జాప్యం వల్ల ఏర్పడిన సర్వీస్ అంతరాయాన్ని(సర్వీస్ బ్రేక్) పెన్షన్ ప్రయోజనాల కోసం పరిగణనలోకి తీసుకోవాలని, వారి సర్వీసును నిరంతరంగానే భావించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, పనిచేయని ఆ కాలానికి కూడా పూర్తి జీతం చెల్లించాలన్న ఉద్యోగుల అభ్యర్థనను మాత్రం తోసిపుచ్చింది. ‘నో వర్క్–నో పే’ అనే సూత్రం వర్తిస్తుందని తేల్చిచెబుతూ వారి పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. పనిచేయని కాలానికి జీతం ఇవ్వాలనే నిబంధన లేదు..2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 58 ఏళ్లకు పదవీ విరమణ చేసిన కొందరు ఉద్యోగులను.. ఏపీలో 60 ఏళ్ల పదవీ విరమణ వయసు ఉన్నందున తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయితే, తెలంగాణ నుంచి రిలీవ్ అవ్వడానికి, ఏపీలో పోస్టింగ్ ఇవ్వడానికి మధ్య.. కొన్ని నెలల నుంచి ఏడాదికి పైగా సమయం పట్టింది. ఈ కాలాన్ని సర్వీసుగా పరిగణించి పూర్తి జీతం చెల్లించాలని ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.పనిచేయని కాలానికి కూడా జీతం చెల్లించడానికి చట్టంలో ఎలాంటి నిబంధన లేదని.. అందువల్ల ఆ డిమాండ్కు చట్టపరమైన బలం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉద్యోగుల తప్పు లేకుండా జరిగిన పరిపాలన జాప్యం వల్ల.. వారి పెన్షన్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకూడదని అభిప్రాయపడింది. ఆ ఖాళీ సమయాన్ని కూడా పెన్షన్ లెక్కింపు కోసం పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. తద్వారా వారి 60 ఏళ్ల సర్వీస్కు గాను పూర్తి పెన్షన్ ప్రయోజనాలు పొందుతారని పేర్కొంది. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే.. తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ ఖాళీ సమయంలో ఉద్యోగులు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది.
ఎన్ఆర్ఐ

ఖతర్లో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం
ఖతర్లో తెలుగు వారంతా తెలుగు భాషా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. దోహాలోని భారత రాయబారి కార్యాలయం ఆధ్వర్యంలోని ఇండియన్ కల్చరల్ సెంటర్ తెలుగు లిటరేచర్ క్లబ్ అనుబంధ సంస్థలైన తెలుగు కళా సమితి, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ జాగృతి, ఆంధ్ర కళా వేదిక ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఎంతో అద్భుతమైన ఈ కార్యక్రమం తెలుగు సంఘాల ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన, గొప్ప భాషలలో ఒకటైన "తెలుగు" భాషను గౌరవిస్తూ, గొప్ప తెలుగు కవి, వ్యవహారిక భాష శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజునాడు నాలుగు తెలుగు సంస్థలు - హరీష్ రెడ్డి (అధ్యక్షులు - TKS), శ్రీనివాస్ గద్దె (అధ్యక్షులు - TPS), నాగ లక్ష్మి (ఉపాధ్యక్షులు - TJQ), విక్రమ్ సుఖవాసి (ఆపద్ధర్మ అధ్యక్షులు - AKV) నాయకత్వంలో ఈ వేడుకను దిగ్విజయముగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలుగు సంస్థల కార్యవర్గ సభ్యులతో పాటు, ఐసీసీ కార్యవర్గ సభ్యులు, తెలుగు భాషాభిమానులు, వర్ధమాన కవులు, తెలుగు పండితులు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో, వివిధ కూరగాయలు, పండ్ల పేర్లను ఉపయోగించి అందమైన తెలుగు కథా కథనాలతో, వేమన పద్యాలు, తెలుగు పొడుపు కథలు/మెదడును చురుకుగా ఉంచే ఆటలతో, ఆశక్తికరమైన సంభాషణలతో తెలుగు భాషలో వారి సృజనాత్మకతను ప్రదర్శించారు. అంతేగాక, ప్రపంచ వేదికపై వివిధ రంగాలలో తెలుగు ప్రజల విజయాలు,వారి కృషిని గురించి కొనియాడారు. తెలుగు భాష పై నిర్వహించిన క్విజ్ అందరినీ అలరించింది.గిడుగు వెంకట రామమూర్తి గారి కవిత్వాన్ని, ఇంకా వారి గ్రామంలో కొనసాగుతున్న సంస్కృతిని వివరిస్తూ.. తాము ఆ గ్రామానికి చెందినవారమని ఒక ప్రేక్షకురాలు గర్వంగా చెప్పినప్పుడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఆనందించారు. ఈ కార్యక్రమం తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా పేర్కొనవచ్చు. ఈ కార్యక్రమంలో అత్యధిక యువత భాగస్వామ్యం కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే మన సంస్కృతి ప్రస్తుత తరానికి వారసత్వంగా అందుతోందని ఆశించటం అతిశయోక్తి కాదనిపించింది. ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం మాతృదేశానికి దూరంగా ఉంటున్న యువత తమ మూలాలను గుర్తించి గౌరవించడం అని తెలియ చేశారు.ఈ కార్యక్రమం ఐసిసి తెలుగు లిటరేచర్ క్లబ్, హెచ్ఆర్, అడ్మిన్ అండ్ కాన్సులర్ హెడ్ రాకేష్ వాఘ్ హృదయపూర్వక స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. ఖతర్లో తెలుగు సమాజం తమ సంస్కృతిని నిరంతరం సజీవంగా ఉంచడంలో చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఐసిసి జనరల్ సెక్రటరీ అబ్రహం కె జోసెఫ్ తన అధ్యక్ష ప్రసంగంలో వివిధ వర్గాలు ఐక్యతను పెంపొందించడంలో భాష ప్రముఖమైన పాత్ర వహిస్తుందని నొక్కి చెప్పారు. ప్రపంచ స్థాయి కవులు, తత్వవేత్తలు, కళాకారులను తయారుచేసే తెలుగు వారసత్వాన్ని ఆయన ప్రశంసించారు. అలాగే వారి రచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు.ఐసిసి అనుబంధ విభాగాధిపతి రవీంద్ర ప్రసాద్, ఐసిసి అంతర్గత కార్యకలాపాల విభాగాధిపతి వెంకప్ప భాగవతుల ప్రత్యేక అభినందన ప్రసంగాలు చేశారు. సాహిత్యంలో మాట్లాడే మాండలికాన్ని ఉపయోగించడం కోసం ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన ప్రముఖ తెలుగు రచయిత, సామాజిక సంస్కర్త గిడుగు వెంకట రామమూర్తి జన్మదినాన్ని స్మరించుకునే తెలుగు భాషా దినోత్సవం శాశ్వత వారసత్వాన్ని, తెలుగు సాహిత్య సాంస్కృతిక సంపదను ప్రవాసులలోని పిల్లలు, యువతకు అందించాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు నడిపించిన సౌమ్య, శిరీష, హారిక, నాగలక్ష్మి గార్లకు ఐ సి సి నాలుగు తెలుగు సంస్థల తరపున అభినందనలు తెలియజేశారు.(చదవండి: వర్జీనియాలో అంగరంగ వైభవంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభ)

షార్జా, సౌదీలో వైఎస్సార్కు ఘన నివాళి
సింహాద్రిపురం/కడప కార్పొరేషన్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా యూఏఈలోని షార్జాలో మహమ్మద్ జిలాన్ బాషా ఆధ్వర్యంలో ప్రసన్న సోమిరెడ్డి, కోటేశ్వరరెడ్డి నేతృత్వంలో తెలుగు ప్రజలు మంగళవారం వైఎస్సార్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు.అనంతరం వైఎస్సార్ అభిమాని జిలాన్ బాషా మాట్లాడుతూ వైఎస్సార్ (YSR) ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరిందన్నారు. ఆయన చూపిన దారి ఎప్పటికీ తమకు ప్రేరణ అని పేర్కొన్నారు. అనంతరం అభిమానులు వైఎస్సార్ స్మృతులను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు శ్రీనివాస్ చౌదరి, అక్రమ్ బాషా, బ్రహ్మానంద రెడ్డి, నాగ ప్రతాప్ రెడ్డి, కర్ణ, పవన్, గంగిరెడ్డి, క్రాంతికుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శివలింగా రెడ్డి, హనుమంత్ రెడ్డి, తాజుద్దీన్, సత్య, అంజాద్, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.సౌదీ అరేబియాలో...డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 16వ వర్ధంతిని సౌదీ అరేబియాలో ఘనంగా నిర్వహించారు. జుబైల్ ప్రాంతంలో అనుయాకినో కంపెనీ క్యాంపులో కడప పట్టణానికి చెందిన షేక్ ఇలాహి ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అనుయాకినో కంపెనీలో పని చేసే సుమారు 50 మంది కార్మికులకు అన్నదానం చేశారు.చదవండి: విదేశాల్లో వైఎస్సార్కు ఘన నివాళులు ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు తాజుద్దీన్, అబ్రార్, ఖ్వాజా, బాషా, సలాం బాషా, మతివ్, అఫ్జల్, ఆతిఫ్, ముహమ్మద్, జాఫర్, ఫర్ ఖాన్, ఫైరోజ్, అసిమ్, ఫైసల్ తదితరులతో పాటు కిషోర్, సంతోష్, శ్రీను పాల్గొన్నారు.

ఏడాదికి రూ. 1.2 కోట్లు సరిపోతుందా..?
విలాసవంతమైన జీవితం కంటే తల్లిదండ్రుల బాగోగులే ముఖ్యం అంటూ భారత సంతతి మహిళ భారత్కి తిరిగి వచ్చేయాలనకుంటున్నా అంటూ తన మనసులో మాటను నెట్టింట షేర్ చేసుకుంది. అయితే ఇక్కడ అంత జీతంతో తాను లైఫ్ని లీడ్ చేయగలనా అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చింది. అయితే నెటిజన్లు ఆమె ఆలోచన విధానానికి ఇంప్రెస్ అవ్వగా మరికొందరూ వాళ్లు ఎన్నోత్యాగాలు చేసి పంపితే ఆ కష్టమంతా మట్టిలో కలిపేస్తారా అనే ప్రశ్నను లేవనెత్తడం విశేషం. అసలేం జరిగిందంటే..యూఎస్లోని డెన్వర్లో తన జీవిత భాగస్వామితో విలాసవంతమైన జీవితాన్న గడుపుతున్న భారత సంతతి మహిళ రెడ్డిట్ వేదికగా తన గోడుని వెల్లబోసుకుంది. తాను భారత్కి తిరిగి వచ్చేయాలని చూస్తున్నట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చేశారని, వారి బాగోగులు చూసుకునేందుకు తిరిగి ఇండియాకు వచ్చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ భారత్లో ప్రజలు కొందరు చాలా దురుసుగా, కోపంగా ప్రవర్తించడం చూసి చాలా అసహనానికి గురయ్యానని చెప్పుకొచ్చింది. తాను మాస్టర్స్ పూర్తి చేశానని ఏడాదికి రూ. 3 కోట్లు పైనే సంపాదిస్తానని, తన భర్త ఏడాదికి దాదాపు రూ. 2 కోట్లు వరకు సంపాదిస్తారని అన్నారు. తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చేయాలని భావిస్తున్నా..బెంగళూరులో ఉండే అవకాశం లభిస్తోంది. అక్కడ ఏడాదికి సుమారు రూ. 1.2 కోట్లు వేతనం అని, అక్కడ లైఫ్ లీడ్ చేయడానికి ఆ మాత్రం సంపాదన సరిపోతుందా అని సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే తనకు యూఎస్లో మంచి స్నేహితులు ఉన్నారని, సౌకర్యవంతంగా జీవించేదాన్ని అని చెప్పుకొచ్చింది. అదీగాక అమెరికాలో తన జీతం పెద్ద మొత్తం కావడంతో చాలా లగ్జరీ లైఫ్ని లీడ్ చేయగలిగానని, అందువల్లే భారత్తో సహా వివిధ దేశాలకు సులభంగా వెళ్లగలిగేదాన్ని అని చెప్పుకొచ్చింది. అలాగే వర్క్ పరంగా ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదంటూ అమెరికాలోని తన లైఫ్స్టైల్ గురించి తెలిపింది. పైగా తన తల్లిదండ్రులు అమెరికాకు వచ్చేందుకు సిద్ధంగా లేరంటోంది. అదీగాక వాళ్లు ఇక్కడ సంస్కృతికి, స్నేహితులకు అలవాటుపడ్డ మనుషులకు అలా నాలుగు గోడల మధ్య బతకడం అంటే అత్యంత దుర్భరంగా అనిపిస్తుందని వాపోయింది. అందుకే వారి బాగోగులును తాను స్వయంగా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.,అయితే తన సొంతూరిలో ఉద్యోగం చేయడం సాధ్యపడదని ఇలా బెంగళూరులో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే మరి బెంగళూరులో బతికేందుకు ఏడాదికి రూ. 1.2 కోట్లు సరిపోతుందంటారా అని సందేహ్నాన్ని లేవనెత్తతూ పోస్ట్ ముగించింది. (చదవండి: నాన్న చెప్పిన కథలే.. స్ఫూర్తి..)

వర్జీనియాలో అంగరంగ వైభవంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మొట్టమొదటి మహాసభలు అమెరికా, వర్జీనియాలోని లీస్బర్గ్లో ఉత్సాహంగా జరిగాయి. ఆగస్టు 30 నుంచి 31 వరకు రెండురోజుల పాటు భారీ ఎత్తున వీటిని నిర్వహించారు. GMA ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది సారథ్యంలో కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, GMA వ్యవస్థాపక సభ్యులు ప్రవీణ్ అండపల్లి, డాక్టర్ జనార్ధన్ , డాక్టర్ గణేష్ తోట, సతీష్ పసుపులేట్, దేవేష్ కుమార్, విజయ్ దండ్యాల, మురళీధర్ రావు , మహాసభ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ కమలాకర్ నల్లాల, ట్రెజరర్ వినయ్ పటేలోల్ల, జాయింట్ సెక్రటరీ సురేష్ చెంచల, జాయింట్ ట్రెజరర్ చంద్ర మోహన్ ఆవుల, మహాసభ కోర్ టీమ్ జనార్ధన్ పన్నెల , కృష్ణశ్రీ గంధం , అన్వేష్ బొల్లం, రంజిత్ భూముల, ఫౌండర్స్ కమిటీ, మహాసభ ఎగ్జిక్యూటివ్ కమిటీ, మహాసభ కోర్ కమిటీ, మహాసభ ఛైర్స్, GMA గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో పాటు వందల సంఖ్యలో వాలంటీర్లు అలుపెరుగకుండా కృషి చేసి ఈ మహాసభను గ్రాండ్ సక్సెస్ చేశారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు.ఈ వేడుకలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, ప్రముఖ సినీ గేయ రచయిత,ఆస్కార్ విన్నర్ చంద్రబోస్, ప్రముఖ మ్యూజిక్ డైర్టకర్ కోటి, ప్రముఖ ఇంద్రజాలకులు సామల వేణు, మిమిక్రీ ఆర్టిస్ట్ మహేష్ రేగుల , గంగవ్వ, జయశ్రీ, తదితర సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.GMA మహాసభలను ఆగస్టు 30 న బ్యాంక్వెట్ విందు కార్యక్రమంతో ఘనంగా ప్రారంభించారు. GMA ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, GMA టీమ్ పూజ నిర్వహించి మహాసభలకు శ్రీకారం చుట్టారు. ఇక తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ, బోనాలతో.. డప్పు చప్పుళ్ల మధ్య అందరూ నృత్యాలు చేస్తూ.. ఊరేగింపుగా వేదక వద్దకు తరలివచ్చారు.అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కన్వెన్షన్ సావనీర్ ఆవిష్కరించారు. అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలు, ఇతర వివరాలతో పొందుపరిచిన ఈ సావనీర్ ను అతిథులు ఆవిష్కరించారు. ఇక మహిళల కోసం ప్రత్యేకంగా అందాల పోటీలు, ముగ్గుల పోటీలతో పాటు సంగీత పోటీలు, చిన్నారుల కోసం మ్యాజిక్ షో నిర్వహించారు. ఇక కార్యకర్తలలో ప్రత్యక ఆకర్షణగా భారతీయతను ఇనుమడింపజేసేలా వేదిక్ మ్యాథ్య్ నిలిచింది. గాయత్రి రజినీకాంత్ ఆధ్వర్యంలో బోధించబడిన క్లిష్టమైన గణిత సమస్యలకు వేదిక్ మ్యాథ్స్ చక్కని పరిష్కారంగా నిలుస్తుంది, గతకొంత కాలంగా అమెరికా వ్యాప్తంగా వేదిక్ మ్యాథ్స్ ఆదరణ పొందుతున్న విషయం విధితమే.! ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యువత క్రూజ్ ట్రిప్ ఎంతగానో అలరించింది. ఇక బ్యూటీ పేజెంట్, మ్యాట్రిమోనియల్, GMA సరిగమ సంగీత పోటీలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి.ఇక వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ GMA అవార్డ్సుఅందజేశారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. డోనార్స్ ని, పలువురు నేతలను శాలువా, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఈ సందర్భంగా GMA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి సభ్యులు వివరించారు.ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ తన ప్రసంగంతో అందరినీ అలరించారు. సామాన్యుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. ఆస్కార్ అవార్డు వరకు సాగిన ఆయన జర్నీ గురించి వివరించారు. ఇక చంద్రబోస్ మాటలకు హర్షాతిరేకాల ప్రతిస్పందనలతో మార్మోగిపోయింది. ఆయన సందేశాత్మక ప్రసంగం ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను విశేషంగా ఆకర్షించింది. GMA ఆధ్వర్యంలో తనకు సన్మానం జరగటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఇక ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ పోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. ఇక కార్యక్రమంలో మిమిక్రీ ఆర్టిస్ట్ మహేష్ రేగుల హాస్యం పండించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఇమిటేట్ చేసి నవ్వులు పూయించారు. ఫైనల్గా తెలంగాణ జానపద లైవ్ బ్యాండ్ షో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్రముఖ గాయనీగాయకులు జానపద పాటలు పాడి అందరినీ మెప్పించారు. సూపర్హిట్ తెలంగాణ జానపద పాటలు, సినీ పాటలతో అలరించారు.ఈ మహాసభల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేదపండితులచే సంప్రదాయ బద్ధంగా స్వామి వారి కళ్యాణం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా స్వామి వారి వేడుకల్ని నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని.. స్వామివారి ఆశీస్సులు, తీర్ధప్రసాదాలు అందుకున్నారు. ఈ మహాసభల్లో భాగంగా రెండు రోజు నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక వేదికపై స్టూడెంట్స్ కెరీర్ పాత్, పొలిటికల్ ఫోరం, బిజినెస్ ఫోరం, ఇమ్మిగ్రేషన్ అండ్ వాల్ స్ట్రీట్ నిర్వహించారు. ఇక బ్రేకౌట్ సెషన్స్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ సెషన్స్, ఉమెన్ ఫోరం, హెల్త్ సెమినార్, మాట్రిమోనీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను వేదిపై ఆహ్వానించి, ప్రసంగాల అనంతరం సత్కరించారు.మున్నూరుకాపులతో పాటు బీసీలను మరింత చైతన్య పర్చేందుకు,సంఘటితం చేసేందుకు ఈ మహాసభను ఏర్పాటు చేసిన రజనీకాంత్, వెంకట్, వారి మిత్ర బృందాన్ని పలువురు అభినందించారు. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలో స్థిరపడిన వీరంతా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా మొత్తానికి ఉపయోగపడాలని, బహుజనుల అభ్యున్నతి కోసం సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని పేర్కొన్నారు.ఈ సందర్బంగా పలువురికి GMA అవార్డులు అందజేశారు. ఇక అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాల నేతలను వేదికపైకి పిలిచి నిర్వాహకులు సత్కరించారు. ఇక ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఈవెంట్స్, హాస్యవల్లరులు జరిగాయి. ఈ మహాసభ సందర్భంగా వేసిన రంగవల్లులు అందరిని ఆకర్షించాయి. ఇక ప్రముఖ ఇంద్రజాలికుడు సామల వేణు.. చిత్ర విచిత్ర జిమ్మిక్కులతో మాయా ప్రపంచాన్ని కళ్ళముందు ఆష్కరించారు. దేశ విదేశాల నుంచి విచ్చేసిన వందలాది మందిని సామల వేణు తన మ్యాజిక్ తో అద్భుత ప్రదర్శన ఇచ్చి అబ్బురపరిచారు.ఆహుతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లు కనువిందు చేశాయి. బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలను మరిపించే విధంగా ఉల్లాసభరిత వాతావరణంలో ఈ మహాసభ జరిగింది. రుచికరమైన తెలంగాణ వంటకాలతో పసందైనా విందు భోజనం అందిచారు. GMA వేడుకలు ఘనంగా జరగడానికి తమకు సహకరించిన కమిటీ సభ్యులకు, EC, BOD, RVPS, సహాయ సహాకారాలు అందించిన దాతలకు, వేడుకల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ అధ్యక్షులు వెంకట్ పెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ను విజయవంతంగా నడిపిస్తున్న డోనర్లను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించి.. వారి సేవలను కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభలకు విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అసోసియేషన్ తరపున పలు ప్రాంతాల్లో సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించారు. ఈ సందర్భంగా 2026కు సంబంధించి అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గ సభ్యులు.. సంఘం అభివృద్ధికి కృషిచేస్తామని చెప్పారు.ఈ సందర్భంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, మహాసభల కన్వీనర్ రజనీకాంత్ సంఘని సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులందరినీ ఐక్యం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా ఐకమత్యంతో ఉండాలని కోరారు. వివిధ ప్రాంతాల సభ్యులను ఒకచోట చేర్చి సహకార స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యమన్నారు. మున్నూరుకాపు కుటుంబాలను అనుసంధానించి, వారి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ,ప్రోత్సహించడమే సంఘం ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ మహాసభలకు విచ్చేసిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, అధ్యక్షుడు వెంకట్ పెద్ది ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.కన్వెన్షన్ ముగింపు వేడుకలలో భాగంగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి మ్యూజిక్ కన్సర్ట్ అందరిని మైమరిపించి మధురానుభూతులను అందించింది. కోటి ఆధ్వర్యంలో పలువురు సింగర్స్ సూపర్ హిట్ సాంగ్స్ పాడి ఆడియన్స్ ను మంత్రముగ్థులను చేశారు. సింగర్స్ అద్భుత పాటలతో సంగీతాల ఝురిలో వోలాలడిస్తు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. GMA కన్వెన్షన్లో పాల్గొన్న అతిథులకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఈ మహాసభలు అందించాయి. భవిష్యత్తులో జరిగే మహాసభలకు GMA కన్వెన్షన్ సరి కొత్త మార్గాన్ని చూపించింది.(చదవండి: మెల్బోర్న్లో అద్భుతంగా అష్టావధాన కార్యక్రమం)
క్రైమ్

‘అయ్యో పాపం.. ప్రాణం పోగొట్టుకునేందుకేనా 600కిలోమీటర్లు ప్రయాణించింది’
జైపూర్: ప్రియుడిని పెళ్లికి ఒప్పించేందుకు 600 కిలోమీటర్లు ప్రయాణించిన ఓ మహిళ… చివరికి శవమై కనిపించింది. ఈ విషాద కథపై నెటిజన్లు ‘అయ్యో పాపం..ప్రేమ కోసం అంత దూరం ప్రయాణించి చివరికి ప్రాణం పోగొట్టుకుందా?’ అంటూ నిట్టూరుస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం..రాజస్థాన్లోని ఝుంఝునుకు చెందిన ముఖేష్ కుమారి అంగన్వాడీ సూపర్వైజర్గా విధులు నిర్వహించేది. పదేళ్ల క్రితం తన భర్తతో మనస్పర్ధలు రావడంతో కుమారి ఆమె భర్త నుంచి విడిపోయింది. ఈ క్రమంలో గతేడాది నవంబర్లో అదే రాష్ట్రంలోని బర్మార్లో టీచర్గా విధులు నిర్వహించే మనారామ్తో మెటాలో పరిచయం పెంచుకుంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. సోషల్ మీడియాలో చాటింగ్, వాట్సాప్లో వీడియో కాలింగ్లతో ఏడాదిపాటు మునిగిపోయారు. చివరికి ఆ ప్రేమను పెళ్లిగా మారుద్దామని అనుకున్నారు.ఈ నేపథ్యంలో పెళ్లికి ఒప్పించేందుకు ఝుంఝును నుంచి 600కిలోమీటర్ల దూరంలో ఉన్న మనారామ్ను కలిసేందుకు కుమారి కారులో బయలుదేరింది. మనారామ్ ఇంటికి చేరుకుని, అతని కుటుంబ సభ్యులకు వారి సంబంధం గురించి వివరించింది. దీంతో కుమారిపై మనారామ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ సమస్యను పరిష్కరించమని కోరుతూ స్థానిక పోలీసుల సాయం తీసుకున్నాడు. ఆ తర్వాత సాయంత్ర రోజు అలా మాట్లాడుకుందాం పదా అంటూ కుమారిని బయటకు తీసుకుకెళ్లాడు మనారామ్. ఇద్దరు ఏకాంతంగా ఉండగా.. మనరామ్ ఓ రాడ్డుతో కుమారి తలపై మోదీ ప్రాణాలు తీశాడు. ఆనవాళ్లన్నీ ధ్వంసం చేశాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. కుమారిని కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ప్రమాదం జరిగిందని నమ్మేలా కారును సైడ్ కాలువలోకి పోనిచ్చాడు. ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయాడు(ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తెలిపాడు). మరుసటి రోజు ఉదయం కుమారి రోడ్డు ప్రమాదానికి గురైందని పోలీసులకు సమాచారం ఇవ్వాలని తన తరుఫు లాయర్ను పురమాయించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. తొలుత బాధితురాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుందని పోలీసులు భావించారు.అన్నీ కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కుమారి ప్రాణం తీసింది మనారామ్ అని నిర్ధారించుకున్నారు. కుమారి హత్య జరిగే సమయంలో నిందితుడు మనరామ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటం అనుమానం పోలీసులకు అతనిపై అనుమానం మొదలైంది. ఆ అనుమానంతో మనారామ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. అసలు విషయం భయట పడింది. కుమారిని హత్య చేసింది మనారామ్నేనని తేల్చారు. కుమారి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు.

పట్టపగలు వివాహిత దారుణ హత్య
రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ప్లాట్స్లో ఆదివారం పూసల రమాదేవి(35) దారుణ హత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా రెడ్డికాలనీకి చెందిన రమాదేవిని .. పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ప్లాట్స్కాలనీలో నివాసం ఉండే పూసల కృపాకర్ సుమారు 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకన్నారు. వీరికి ఒక కుమారుడు జాన్సన్, కుమార్తెలు జోషిత(9), జ్యోత్స్న ఉన్నారు. ఏడాదిగా వీరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. అప్పటినుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. రమాదేవి ఆదివారం కృపాకర్ ఇంటికి చేరుకుంది. ఈక్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో కత్తితో రమాదేవిపై కృపాకర్ దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఎస్సై శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య అనంతరం కృపాకర్, అతడి తల్లిదండ్రులు పరారయ్యారు. అయితే, తల్లిదండ్రులు మంథని పోలీసుస్టేషన్లో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కృపాకర్ కోసం ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణామని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్సై వివరించారు. పంచాయితీయే ప్రాణం తీసిందా? ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్న రమాదేవి ఆదివారం అత్తగారింటికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. సెంటినరికాలనీకి చెందిన ఒకమతపెద్ద ద్వారా కృపాకర్ రాయబరం చేయడంతో రమాదేవిని అక్కడకు వచి్చందని, మతపెద్ద సమక్షంలో పంచాయితీ జరిగిందని తెలిసింది. ఆ తర్వాత రమాదేవి వకీల్పల్లి ప్లాట్స్కాలనీకి చేరుగా.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, ఈక్రమంలోన అత్తగారింటి ఎదుట రోడ్డుపై విగతజీవిగా పడిపోయిందని స్థానికులు కంటతడి పెట్టారు. క్షణికావేశంలో భార్యను చంపండంతో ముగ్గురు పిల్లలు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. కుటుంబ కలహాలు పచ్చనికాపురంలో చిచ్చుపెట్టడంతో పిల్లలు దిక్కులేనివారయ్యారు.

అడవి మధ్యలో నాలుగు మృతదేహాలు.?
వీళ్లేవరు?..నట్టడివిలోకి ఎలా వచ్చారు..?. ప్రధాన రహదారి నుంచి అరణ్యంలోకి ఎలా చేరుకున్నారు..? పురుషుడికి చెట్టుకు ఉరివేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది...? ఆ పక్కనే ఉన్న మహిళ మృతదేహం ఎవరిది..?. వారికి సమీపంలోనే రెండు మృతదేహాలను పూడ్చిపెట్టిన స్థితిలో ఉన్న గుంతలేంటి..? వీళ్లంతా ఒకే కుటుంబం వారా..?. ఎవరైనా వీళ్లను ఇక్కడకు తీసుకొచ్చి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా..?. లేక ఏదైనా కష్టమొచ్చి బలవన్మరణానికి పాల్పడ్డారా..? పాకాల మండల శివారు.. జాతీయ ప్రధాన రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలోని చిట్టడవిలో బయటపడిన మృతదేహాలు ఆదివారం కలకలం రేపాయి..తిరుపతి జిల్లా: ఘటనా స్థలంలో మృతదేహాలు ఉన్న తీరు, పక్కనే రెండు గుంతల్లో మరో రెండు మృతదేహాలను పూడ్చి పెట్టినట్టు ఉన్న గుంతలు.. వాటిపై గుర్తుగా పెట్టిన రాళ్లు.. వీళ్లు ఒకే కుటుంబమా..? అనే అనుమానం కలుగుతోంది. వీరు నట్టడివిలోకి ఎలా వచ్చారు.. ఎలా మృతిచెందారు అనేదానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడ చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా.. లేక ఏదైనా కష్టమొచ్చి కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిందో తెలియడం లేదు. పాకాల మండలంలో బయటపడిన ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల కథనం.. పాకాల మండల పరిధిలోని పవిత్ర హోటల్ వెనుక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన రెండు మృతదేహాలను అటవీశాఖ సిబ్బంది గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పవిత్ర హోటల్ నుంచి సుమారు 3కిలో మీటర్ల దూరంలో ఉన్న ఘటనా స్థలానికి సీఐ సుదర్శన్ప్రసాద్ తన సిబ్బందితో చేరుకుని పరిశీలించారు. అక్కడ ఒక పురుషుడి మృతదేహం చెట్టుకు వేలాడుతోంది. సమీపంలోనే మహిళ మృతదేహం కింద పడి ఉంది. అక్కడే మరో ఇద్దరిని పూడ్చి పెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. ఆ గుంతలపై గుర్తుగా బండరాళ్లు పెట్టి ఉన్నారు. గుంతలను తవ్వేందుకు ఉపయోగించిన పారను చెట్ల పొదల్లో పడేసి ఉన్నారు. అడవిలో ఏం జరిగింది? పాకాల మండలం శివారు ప్రాంతం అడవిలోని నామాల బండ సమీపం, మూలకుంట వద్ద ఇద్దరి మృతదేహాలతోపాటు చిన్న పిల్లలను గుంతలో పూడ్చి పెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. ఘటనా స్థలంలో పిల్లల దుస్తులు కనిపించాయి.తమిళనాడు వాసులేనా? మృతదేహాల వద్ద ఓ నోకియో ఫోన్ లభించింది. అలాగే కళై సెల్వన్ పేరు మీదున్న తంజావూరు క్రిస్ ఆస్పత్రి ప్రి్రస్కిప్షన్ లభ్యమైంది. మృతులు తమిళనాడు వాసులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నయం కాని జబ్బు ఏదైనా బయటపడిందా..? పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఇదిలావుండగా మృతదేహాలు దొరికిన ప్రాంతం పాకాల మండల పరిధిలో లేకపోవడంతో కేసును చంద్రగిరి పోలీసులకు అప్పగించినట్టు సమాచారం.

కన్న తల్లినే చెరపట్టే యత్నం
జడ్చర్ల: మద్యం మత్తులో సభ్య సమాజం తలదించుకునే విధంగా కన్నతల్లినే చెరపట్టే ప్రయత్నం చేశాడో యువకుడు. దీంతో భార్యను కాపాడే ప్రయత్నంలో తండ్రి చేసిన దాడిలో కుమారుడు మృత్యువాత పడ్డాడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని డీటీసీ (జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం ప్రకారం.. పోలేపల్లి గ్రామానికి చెందిన దంపతులు జడ్చర్ల డీటీసీ సమీపంలో నివసిస్తూ.. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు శ్రీధర్కు మినహా అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. తల్లిదండ్రుల వద్దే ఉంటున్న శ్రీధర్ (28) కొన్ని రోజులుగా తాగుడుకు బానిసగా మారి జులాయిగా తిరుగుతున్నాడు. జల్సాలకు అలవాటు పడి తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ సంపాదించిన డబ్బును బలవంతంగా తీసుకుని తాగుడుకు వెచ్చించేవాడు. అనేకసార్లు మద్యం మత్తులో కన్నతల్లి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. కుమారుడి వేధింపులు భరించలేక విషయాన్ని ఆమె భర్తకు చెప్పింది. దీంతో ఆయన కొడుకును పలుసార్లు మందలించి.. ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా శ్రీధర్లో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి మద్యం సేవించిన కుమారుడు శ్రీధర్ మధ్యరాత్రి సమయంలో తల్లి దగ్గరకు వచ్చి అత్యాచారం చేయబోయాడు. ఆమె కొడుకు నుంచి తప్పించుకుని ఇంటి బయటకు పరుగెత్తే ప్రయత్నం చేయగా, చేయి పట్టుకుని గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి యతి్నంచాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో పక్క గదిలో నిద్రిస్తున్న భర్త మేల్కొని.. భార్యను కాపాడే ప్రయత్నం చేశాడు. దీంతో కొడుకు ఆగ్రహంతో తండ్రిని నెట్టి వేయడంతో అతను కింద పడిపోయాడు. ఈ క్రమంలో తండ్రి పక్కనే ఉన్న కర్రతో కుమారుడి తలపై బాదడంతో ఒక్కసారిగా కిందపడిపోయాడు. తర్వాత చలనం లేకపోవడంతో తమ కుమారుడు మృతి చెందాడని నిర్ధారించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వీడియోలు


Bhumana Karunakar Reddy: తిరుమలలో దారుణం.. మలమూత్రాల మధ్య శ్రీమహా విష్ణువు విగ్రహం


ఏపీలో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు


మాస్క్ మ్యాన్ చాలా సాఫ్ట్ ..! నన్ను నిజంగానే కొట్టాడు కానీ..! మాస్క్ వెనుక అసలు కథ!


తిరుపతిలో వీడని మరణాల మిస్టరీ


మాజీ వరల్డ్ ఛాంపియన్ ఆన్ జొంగ్యీకి ముచ్చెమటలు పట్టించిన వైశాలి


KSR Live Show: ఏపీలో ఆరోగ్యశ్రీ అవుట్! బాబు విజన్ అమ్మేస్తా.. ఆపేస్తా..!!


రైతుల కష్టాలపై జగన్ ఎమోషనల్ ట్వీట్


వంగలపూడి అనిత, సవితకు వైఎస్ఆర్ సీపీ నేతలు కౌంటర్


ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో క్లౌడ్ బరస్ట్


తప్పును కలెక్టర్లపై తోసి చేతులెత్తేసిన బాబు