విద్యార్థి విభాగం నేతలతో వైఎస్ జగన్ భేటీ నేడు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. విద్యార్థుల సమస్యలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు.
‘గ్యారంటీ’ల బండ!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ‘గ్యారంటీ’ల గండం పట్టుకుంది. ప్రభుత్వరంగ సంస్థలు చేస్తున్న అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా గ్యారంటీలు ఇవ్వటంతో పరిస్థితి విషమించింది. అధికారిక అప్పులకు తోడు లెక్కల్లోకి రాని ఈ ‘గ్యారంటీ’ అప్పులు కొండలా పేరుకుపోయాయి. గ్యారంటీ అప్పుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ తాజా నివేదికలో ప్రకటించింది. ఇది చాలా ప్రమాదకరమైన ఆర్థిక నిర్వహణ అని హెచ్చరించింది. గ్యారంటీ అప్పులు జీఎస్డీపీలో ఏకంగా 15.1 శాతానికి చేరాయని వెల్లడించింది. నిధులన్నీ సంక్షేమం, సబ్సిడీలకే పోతున్నాయని.. భవిష్యత్తుకు కీలకమైన విద్య, వైద్య రంగాలను గాలికి వదిలేశారని తూర్పారబట్టింది. బడ్జెట్ అంచనాలు ఏకంగా 21 శాతం గల్లంతవుతుండటం ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి అద్దం పడుతోందని నివేదిక పేర్కొంది. అప్పుల ఊబిలోకి రాష్ట్రం.. ‘స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్’నివేదిక తెలంగాణ రాష్ట్ర ఖజానా డొల్లతనాన్ని బయటపెట్టింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని హెచ్చరించింది. ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఇచ్చిన గ్యారెంటీలు జీఎస్డీపీలో 15.1 శాతానికి చేరగా, ఇందులో సింహభాగం (37%) నీటిపారుదల రంగానికే ఉండటం గమనార్హం. దేశంలో మరే రాష్ట్రం ఇంతటి భారీ గ్యారెంటీలను ఇవ్వలేదని నివేదిక పేర్కొంది. ఈ గ్యారెంటీలకు తోడు, 2025 మార్చి నాటికి అధికారిక అప్పులు సైతం జీఎస్డీపీలో 26 శాతానికి చేరాయి. ఇది ఎఫ్ఆర్బీఎం కమిటీ నిర్దేశించిన 20% పరిమితి కంటే చాలా ఎక్కువ. రాష్ట్రం బడ్జెట్ వెలుపల చేసే అప్పులు కూడా కొనసాగుతున్నాయి. 2024–25లో ఇవి రూ.2,697 కోట్లుగా ఉన్నాయి. కాగితాలపై కోటలు.. వాస్తవాలకు బీటలు పీఆర్ఎస్ నివేదిక ప్రకారం రాష్ట్ర బడ్జెట్ అంచనాలకు, వాస్తవ రాబడులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. 2015–23 మధ్య కాలంలో బడ్జెట్లో వేసిన అంచనాలకు, వాస్తవంగా వచ్చిన ఆదాయానికి మధ్య ఏకంగా 21% వ్యత్యాసం (లోటు) కనిపించింది. దేశంలో అత్యంత దారుణమైన పనితీరులో ఇది ఒకటి అని నివేదిక పేర్కొంది. కాగితాలపై కోటలు కట్టడం, తీరా ఆదాయం రాకపోవడంతో.. చివరకు అభివృద్ధి పనులకు భారీగా కోత పెట్టాల్సి వస్తోంది. ఇదే కాలంలో రాష్ట్రం తన మూలధన వ్యయంలో 12% కోత విధించింది. రాష్ట్రం సొంత ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో బలంగా ఉంది. మొత్తం ఆదాయంలో 77% సొంత వనరుల (63% సొంత పన్నులు, 14% పన్నేతర ఆదాయం) నుంచే వస్తోంది. జీఎస్డీపీలో సొంత పన్నుల వాటా 8.1%గా ఉంది. ఆదాయం ఇలా బలంగా ఉన్నప్పటికీ, బడ్జెట్ ప్రణాళిక మాత్రం దారుణంగా విఫలమవుతోంది. విద్య, వైద్యానికి మంగళం: రాష్ట్ర ఖజానాలో సంక్షేమం, సబ్సిడీలకు పెద్ద పీట వేస్తున్న క్రమంలో కీలకమైన మౌలిక రంగాలకు తీరని అన్యాయం జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. రెవెన్యూ ఆదాయంలో 14% సబ్సిడీలకే పోతోంది. ఇందులో సింహభాగం 76% కరెంట్ సబ్సిడీలకే వెళ్తుండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంక్షేమానికి బడ్జెట్లో 12.4% వాటా ఇచ్చి దేశంలో రెండో స్థానంలో నిలిచారు. కానీ, భవిష్యత్ తరాలను నిర్మించే కీలక రంగాలను పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రజారోగ్యంపై తెలంగాణ తన బడ్జెట్లో 4.8% మాత్రమే ఖర్చు చేస్తోంది. ఇది దేశంలోనే అత్యల్పం. విద్యారంగానికి చేసిన కేటాయింపులు 9.0% మాత్రమే. ఇది కూడా దేశంలోనే అత్యంత తక్కువ కావడం గమనార్హం. మౌలిక వసతులైన రోడ్లు, వంతెనల కోసం ఖర్చు చేస్తున్నది 1.9% మాత్రమే. సొంత ఆదాయం బలంగా ఉన్నా ఆ డబ్బంతా సబ్సిడీలకే పోతుండటం, మరోవైపు గ్యారెంటీల పేరుతో అప్పుల ఊబిలో కూరుకుపోవడం రాష్ట్రాన్ని ప్రమాదపు అంచున నిలబెట్టిందని నివేదిక హెచ్చరించింది. కీలకమైన విద్య, వైద్యం కుంటుపడటంతో రాబోయే తరాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని నివేదిక పేర్కొంది.
చినబాబు గ్యాంగ్కు ‘స్పాట్’ రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, సబ్ స్టేషన్ల నిర్మాణం, లైన్ల ఏర్పాటు, బూడిద, బొగ్గు టెండర్లన్నీ అక్రమాలే. వీటికితోడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత విద్యుత్ సంస్థల్లో ఈ దారుణాల పరంపరలో మరో అధ్యాయం ఇది..! అన్నిటినీ చెరబట్టిన అధికార పార్టీ వారు ఇప్పుడు ‘‘స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టు’’లపై పడ్డారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్)ల్లో పాత కాంట్రాక్టర్ల కాల పరిమితి ముగియడంతో కొత్త టెండర్లు పిలవడం కూటమి నేతలకు వరంగా మారింది. ముఖ్యంగా చినబాబు, మరో మంత్రి కనుసన్నల్లో టెండర్ల ప్రక్రియ మొత్తం నడుస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ‘చినబాబు చెబితే అర్హత ఉండక్కర్లేదు’ శీర్షికన ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కంగుతిన్న అక్రమార్కులు వెనకడుగు వేశారు. కానీ, ఆశను వదులుకోలేక కొత్త ఎత్తులు వేస్తున్నారు. ‘సాక్షి’ కథనంలో బట్టబయలు రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో అన్ని జిల్లాల్లో కలిపి 1.95 కోట్ల విద్యుత్ సర్వీసులున్నాయి. వీటిలో 30 శాతం వరకు పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ సర్వీసులు. మిగతావాటికి ప్రతి నెల బిల్లులను స్పాట్ బిల్లింగ్ రీడర్ల ద్వారా ఇస్తున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టులను ఇస్తుంటాయి. గ్రామీణ, ఏజెన్సీ, పట్టణ కేటగిరీల వారీగా తీసిన బిల్లులకు కమీషన్ నిర్ణయిస్తారు. 2023–25 నాటి రేట్లతోనే తాజాగా టెండర్లు పిలిచారు. ఒక్కో సర్వీసుకు పట్టణాల్లో రూ.6.16, గ్రామాల్లో రూ.6.36 చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల పాటు ఇవే ధరలతో కాంట్రాక్టు కొనసాగనుంది. ఈ కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం చినబాబు గ్యాంగ్తో పాటు మరో మంత్రి అనుచరులు రంగంలోకి దిగారు. పాతవారు కాదు... మావాళ్లకే ఇవ్వాలి ఎన్నో ఏళ్లుగా స్పాట్ బిల్లింగ్ చేస్తున్నవారిని కాదని, తాము సిఫారసు చేసినవారికే టెండర్లు ఇవ్వాలంటూ విద్యుత్ శాఖ అధికారులపై ప్రభుత్వ ముఖ్యుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం క్లాస్–1 కాంట్రాక్టర్కు మాత్రమే టెండర్లలో పాల్గొనాలి. ఈ అర్హత లేనివారూ టెండర్లు దక్కించుకోవడానికి ప్రయత్నించారు. దీన్ని ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో కొన్ని టెండర్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్నిటిని గడువు ముగిశాక కూడా తెరవకుండా పెండింగ్లోనే ఉంచారు. కొత్తగా పుట్టుకొచ్చిన క్లాస్ 1 కాంట్రాక్టర్లు టెండర్లు రద్దు చేసినప్పటికీ... క్లాస్–1 కాంట్రాక్టర్ గుర్తింపు విషయంలో చినబాబు, మరో మంత్రి సూచించిన వారి కోసం అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు. టెండర్లు రద్దయిన తరువాత కొందరికి క్లాస్–1 కాంట్రాక్టరు రిజి్రస్టేషన్ చేశారు. నిజానికి డిస్కం పరిధిలో పనులు చేసిన వారికే ఈ గుర్తింపు పత్రం ఇవ్వాలి. కానీ, ఇతర డిస్కంలలో చేసినవారికి కూడా ఇచ్చేస్తున్నారు. గతంలో ఎక్కడా ఏ పనీ చేయనివారికి చినబాబు, మంత్రి పేషీల నుంచి ఫోన్లు చేసి ‘వాళ్లు మనవాళ్లే, ఏ సరి్టఫికెట్ అవసరం లేదు. కాంట్రాక్టు ఇచ్చేయండి. లేకపోతే ట్రాన్స్ఫర్ ఖాయం’ అంటూ అధికారులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ఉన్నతాధికారులు ఈ ఒత్తిళ్లు భరించలేక పలు జిల్లాల్లో వారు చెప్పినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టారు. మిగతా జిల్లాల్లో ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ‘సాక్షి’ని దూరం పెట్టండి విద్యుత్ శాఖలో అక్రమాలు, అవినీతిని వెలుగులోకి తెస్తూ నిజాలు నిర్భయంగా రాస్తున్న ‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోంది. సాక్షాత్తు ఇంధన శాఖ మంత్రి అధికారికంగా నిర్వహించే విలేకరుల సమావేశాలకు ‘సాక్షి’ని పిలవద్దని పేషీ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అలాగే మంత్రి కార్యక్రమాలను తెలియజేసేందుకు మీడియా సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూప్ల్లోనూ ‘సాక్షి’ ప్రతినిధులు ఉండకూడదని మంత్రి హుకుం జారీ చేశారు.
కామారెడ్డిలో నకిలీ ఐఏఎస్
కామారెడ్డి క్రైం: నకిలీ నియామక పత్రంతో వచ్చిన ఓ మహిళ పోస్టింగ్ ఇవ్వాలని జిల్లా అధికారులను కలవడం కామారెడ్డి కలెక్టరేట్లో కలకలం సృష్టించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తాను ఐఏఎస్ సాధించాననీ, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తనను భూ రికార్డులు, కొలతల విభా గం అదనపు కలెక్టర్గా విధుల్లో చేర్చుకోవాలని మంగళవారం ఓ మహిళ తప్పుడు నియామక పత్రంతో కుటుంబ సభ్యులతో కలసి వచ్చి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్ను కలిసింది. నకిలీ నియామక పత్రం అని గుర్తించిన జిల్లా అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవునిపల్లి పోలీసులు సదరు మహిళను పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ జరిపారు. ఆమెను హైదరాబాద్ కు చెందిన నుస్రత్ జహాన్గా గుర్తించారు. రెవెన్యూశాఖ రాష్ట్ర కమిషనరేట్ నుంచి నియామకపత్రం వచ్చిందని ఆమె చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళపై చీటింగ్, ఫోర్జరీ కేసులను నమోదు చేసి నోటీసులు జారీ చేశామని కామారెడ్డి రూరల్ సీఐ రామన్ తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆమె గతంలో సివిల్స్కు ప్రిపేర్ అయినట్టు తెలిసింది. ఆమె ఎందుకు ఇలా చేసిందో ఇంకా స్పష్టత రాలేదు. కుటుంబ సభ్యుల ఆనందం కోసం ఇలా చేసిందని సమాచారం. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని సీఐ అన్నారు.
ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా పటేలా..
సింగారాల సీతాకోక.. సాంగ్ ప్రోమో రిలీజ్
సినీ కార్మికులు ఎటు వైపు..?
డ్రైవింగ్ పరీక్షలే లేకుండా లైసెన్సులు!
కార్పొరేట్ కంపెనీల ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
టీమిండియాకు ఎంపిక కావాలంటే ఇంకా "ఏం చేయాలి"..?
‘ఇక మొదలెడదాం’.. తొలి పోస్టులో మమ్దానీ
హిందూ భక్తులను అనుమతించని పాక్.. ఎంట్రీకి నిరాకరణ
శ్మశానంలో దొంగలు!. మాయమవుతున్న పుర్రెలు, ఎముకలు
మొదటి భార్య ఓకే అంటేనే రిజిస్ట్రేషన్: హైకోర్టు
మంత్రి అజారుద్దీన్కు కేటాయించిన శాఖలు ఇవే
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..
కావ్య మారన్ సంచలన నిర్ణయం..
బిగ్రిలీఫ్: ఈరోజు బంగారం ధరలు ఎంతంటే..
జక్కన్న ప్లాన్ అదుర్స్.. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి!
ఈ రాశి వారు ఆభరణాలు, వాహనాలు కొంటారు
సాక్షి కార్టూన్ 05-11-2025
ఐసీసీ మహిళల ప్రపంచకప్ విజేత భారత్
ఈ రాశి వారికి భూ, వాహనలాభాలు
టీవీ5 మూర్తి, గౌతమి చౌదరికి షాక్!
స్మృతి మంధనకు భారీ షాక్
ఆల్రెడీ సీఎం అయ్యారుగా! ఇక నా ఓటు నీకెందుకని వెళ్లిపోతున్నాడ్నార్!
భవిష్యత్తు బంగారు లోహం!
భరణితో ట్రోల్స్.. ఫైర్ అయిన మాధురి
ధరలు పెరుగుతాయ్.. వెండికి ఫుల్ డిమాండ్!
అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. వైస్ కెప్టెన్గా అతడే
భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ
జైస్వాల్ సూపర్ సెంచరీ
భారత్ మాట వినడం లేదని బెదిరించడానికి -వ్యాఖ్యలు చేసినట్లున్నారు
ముగ్గురు కూతుళ్లు పంపిన జీతమా పటేలా..
సింగారాల సీతాకోక.. సాంగ్ ప్రోమో రిలీజ్
సినీ కార్మికులు ఎటు వైపు..?
డ్రైవింగ్ పరీక్షలే లేకుండా లైసెన్సులు!
కార్పొరేట్ కంపెనీల ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
టీమిండియాకు ఎంపిక కావాలంటే ఇంకా "ఏం చేయాలి"..?
‘ఇక మొదలెడదాం’.. తొలి పోస్టులో మమ్దానీ
హిందూ భక్తులను అనుమతించని పాక్.. ఎంట్రీకి నిరాకరణ
శ్మశానంలో దొంగలు!. మాయమవుతున్న పుర్రెలు, ఎముకలు
మొదటి భార్య ఓకే అంటేనే రిజిస్ట్రేషన్: హైకోర్టు
మంత్రి అజారుద్దీన్కు కేటాయించిన శాఖలు ఇవే
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..
కావ్య మారన్ సంచలన నిర్ణయం..
బిగ్రిలీఫ్: ఈరోజు బంగారం ధరలు ఎంతంటే..
జక్కన్న ప్లాన్ అదుర్స్.. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి!
ఈ రాశి వారు ఆభరణాలు, వాహనాలు కొంటారు
సాక్షి కార్టూన్ 05-11-2025
ఐసీసీ మహిళల ప్రపంచకప్ విజేత భారత్
టీవీ5 మూర్తి, గౌతమి చౌదరికి షాక్!
స్మృతి మంధనకు భారీ షాక్
ఈ రాశి వారికి భూ, వాహనలాభాలు
భవిష్యత్తు బంగారు లోహం!
ఆల్రెడీ సీఎం అయ్యారుగా! ఇక నా ఓటు నీకెందుకని వెళ్లిపోతున్నాడ్నార్!
భరణితో ట్రోల్స్.. ఫైర్ అయిన మాధురి
అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. వైస్ కెప్టెన్గా అతడే
అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై మండిపాటు
ధరలు పెరుగుతాయ్.. వెండికి ఫుల్ డిమాండ్!
భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ
భారత్ మాట వినడం లేదని బెదిరించడానికి -వ్యాఖ్యలు చేసినట్లున్నారు
సినిమా
శివ తాండవం కోసం పది రోజులు ప్రాక్టీస్ చేశాను
‘‘దెయ్యం వేట, ఫ్యామిలీ ఎమోషన్, భక్తి, శివుడు గురించి కథలు... ఇలా చాలా లేయర్స్ ఉన్న చిత్రం ‘జటాధర’. అరుణాచల ప్రస్తావన కూడా ఉంది. మన పురాణాల్లో ఉన్న కొన్ని కథలకి సొల్యూషన్గా ఈ మూవీ చేశాం. ఈ సినిమా చేయడానికి ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ నన్ను చాలా ఎగ్జయిట్ చేసింది. యాక్షన్, ఫ్యామిలీ, మైథాలజీ... ఇలా అన్ని భావోద్వేగాలు కుదిరిన సినిమా ‘జటా ధర’’ అని సుధీర్ బాబు తెలిపారు. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో సుధీర్బాబు హీరోగా నటించిన చిత్రం ‘జటాధర’. సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ తదితరులు కీలక పాత్రధారులు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ బన్సల్, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ, శిల్పా సింఘాల్, నిఖిల్ నంద నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సుధీర్బాబు పంచుకున్న విశేషాలు... → చిన్నప్పుడు మనం జానపద, చందమామ కథలు విని ఉంటాం. గతంలో బ్యాంకులు లేని సమయంలో ధనాన్ని భూమిలో పాతి, ఒక బంధనం వేసేవారని, దానికి ఒక పిశాచి కాపలాగా ఉండేదని ఓ కథ ప్రచారంలో ఉండేది. అలాంటి కథని ప్రజెంట్ టైమ్లోకి తీసుకొచ్చి మా ‘జటాధర’లో చాలా ఆసక్తిగా చూపించాం. ఈ చిత్రకథ విన్నప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూడదగ్గ కథలా అనిపించింది. ఈ సినిమాలో దెయ్యాల వేటగాడిలా కనిపిస్తాను. అయితే తనకి మాత్రం దెయ్యాలున్నాయంటే నమ్మకం ఉండదు. దేవునిపై నమ్మకం ఉంటుంది. సైన్స్ని నమ్ముతాడు. అలా ఎందుకు? అనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏ, బీ, సీ సెంటర్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చే సినిమా ఇది. ధన పిశాచి పాత్రలో సోనాక్షీ సిన్హా నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. శిల్పా శిరోద్కర్గారు శోభ అనే బలమైన పాత్రలో అద్భుతంగా నటించారు. → రాజీవ్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం ఇచ్చారు. ఈ మూవీలో శివతాండవం ఎపిసోడ్ ఉంటుంది. నేనెప్పుడూ క్లాసికల్ డ్యాన్స్ చేయలేదు. ఆ సీక్వెన్స్ కోసం దాదాపు పది రోజులు ప్రాక్టీస్ చేసి, చేశాను. చిత్ర పరిశ్రమలో బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లకి అవకాశాలు సులభం అని... కొత్తవాళ్లకి, ఇండస్ట్రీ నేపథ్యం లేనివారికి కష్టం అనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. నిజానికి బయటవాళ్లకే కాదు.. నాకు కూడా కష్టమే. → మా సినిమాలో శివుడు కనిపించే ఒక ఎపిసోడ్ ఉంది. అక్కడ సూపర్స్టార్ కృష్ణ గారిని చూపించాలనుకున్నాం. కానీ వీఎఫ్ఎక్స్కి ఎక్కువ సమయం కుదరలేదు. ఈ మూవీలో కృష్ణగారు కానీ, మహేశ్ బాబుగారు కానీ కనిపించరు. ఇక నా తర్వాతి చిత్రం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఉంటుంది. కాన్సెప్ట్ పరంగా అది ఒక ‘బాహుబలి’ లాంటి సినిమా. అలాగే బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ కూడా చేయాల్సి ఉంది.
మంచి సినిమా నిర్మించానని సంతృప్తిగా ఉంది
‘‘నిర్మాతగా ఎన్నో సినిమాలు చేశాను, చేస్తున్నాను. సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాను. అయితే ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ద్వారా నేను సంపాదించాలనుకున్నది డబ్బు కాదు... సంతృప్తి. ఒక నిర్మాతగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమా నిర్మించానని సంతృప్తిగా ఉంది’’ అని అల్లు అరవింద్ తెలిపారు. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 7న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘రాహుల్లాంటి సున్నితమైన మనసు, కమిటెడ్ పర్సన్ మాత్రమే ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమా రూపొందించగలరు. మన అక్క, చెల్లి, పిన్నిల మనసుల్లో ఏముంటుంది? ఎలాంటి ఆశలు ఉంటాయి? అనుకుని ఈ మూవీ చూడాలి. రష్మిక ఈ సినిమాలో జీవించేసింది. దీక్షిత్ నటన నచ్చి, మరో సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చాను’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో రష్మిక నటన ఈ దశాబ్దంలో ఒక మహిళా నటి తెలుగులో చేసిన బెస్ట్ పర్ఫార్మెన్స్గా నిలుస్తుంది’’ అని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఈ సమావేశంలో దీక్షిత్, ధీరజ్, విద్య కొప్పినీడి తదితరులు పాల్గొన్నారు.
రామ్ చరణ్,ఎన్టీఆర్ బాటలోనే రామ్.. మిగిలిన వాళ్ళు?
అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్టు మన తెలుగు హీరోలకు మొదటి నుంచీ తమ పేర్ల కన్నా వాటి ముందు తగిలించుకునే ట్యాగ్స్ పిచ్చి ఎక్కువ. తాజాగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అంటూ తాను తగిలించుకున్న ట్యాగ్ను స్వఛ్చందంగా వదిలేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటు సినిమా సర్కిల్లోనూ అటు సోషల్ మీడియాలోను రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ గా పిలుచుకుంటారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు రాబోతున్న పెద్ది సినిమాకు గ్లోబల్ స్టార్ ట్యాగ్ ను తొలగించారని సమాచారం. లేటెస్ట్ గా వస్తున్న పోస్టర్ లోను గ్లోబల్ స్టార్ తొలగించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో తెలుగు హీరోల ట్యాగ్ పిచ్చి మరోసారి చర్చనీయాంశంగా మారింది.టాలీవుడ్ హీరోలు అదనపు స్టార్ ట్యాగ్ లను తగిలించుకోవడం ఎలాగైతే మొదటి సారి కాదో అలాగే వదిలించుకోవడం కూడా ఇదే ప్రధమం కాదు. గతంలో ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్ లో వచ్చిన శక్తి సినిమా టైమ్ లో ఏ1 స్టార్ అనే ట్యాగ్ ను ఎన్టీయార్ తగిలించుకున్నారు. అయితే ఆ సినిమా దారుణంగా ప్లాప్ అవడంతో మేల్కొన్న తారక్ మరోసారి ఆ ట్యాగ్ ను యూజ్ చేయలేదు. ఆ తర్వాత ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ను జత చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆచార్య, గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్ టైమ్ లో ఈ ట్యాగ్ను స్క్రీన్ నేమ్ గా వేశారు. కానీ ఆ సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇక ఇదే దారిలో మరో యంగ్ హీరో రామ్ పోతినేని కూడా ట్యాగ్ త్యాగం చేస్తున్నాడు. చాలా ల్యాంగ్ గ్యాప్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో రామ్ పోతినేని కి ముందు ఉస్తాద్ అని ట్యాగ్ను తగిలించుకున్నాడు రామ్. ఆ తర్వాత చేసిన ఇస్మార్ట్ శంకర్ 2 సహా పలు సినిమాలు డిజాస్టర్స్ కావడంతో ఉస్తాద్ ట్యాగ్ కు గుడ్ బై చెప్పేస్తున్నాడట రామ్. తన పాత ఎనర్జిటిక్ స్టార్ ట్యాగ్ తో సరిపెట్టుకుంటున్నాడు. రాబోతున్న ఆంధ్ర కింగ్ సినిమా పోస్టర్ లోను ఆ పాత ట్యాగ్తోనే వస్తున్నాడు. వేలం వెర్రి కాకూడదుమరే భాషా చిత్ర పరిశ్రమలోనూ లేనంతగా టాలీవుడ్లో ఈ స్టార్ టైటిల్స్ చాలా కాలం పాటు హీరోలను ఎలివేట్ చేసే మార్కెటింగ్ సాధనాలుగా పనిచేశాయి. ఎన్టీయార్ తరంలో నట రత్న, నట సామ్రాట్, సూపర్స్టార్, రెబల్ స్టార్...ఆ తర్వాత అవి వారసత్వ సంపద తరహాలో అనివార్యంగా వారసులకు అంటగట్టేశారు. చిరంజీవి తరం వరకూ కూడా ఈ తరహా ట్యాగ్స్ బాగానే అనిపించాయి. ఎందుకంటే అప్పట్లో తెలుగు సినిమా ప్రేక్షకుల వరకూ మాత్రమే అవి పరిమితం కాబట్టి వారు తమ హీరోలను దేవుళ్ల తరహాలో ఆరాధించడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఓకే అనిపించాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తర్వాత ఇలాంటి ట్యాగ్స్ అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. తగిలించుకున్న ట్యాగ్కు తగ్గ స్ఠాయి లేకపోతే అన్య భాషా ప్రేక్షకుల దగ్గర నవ్వుల పాలు కామా?ఉదాహరణకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను ఎప్పటి నుంచో గ్లోబల్ స్టార్గా మీడియా పేర్కొంటోంది. ఆమె అటు హాలీవుడ్, ఇటు ఇండియన్ సినిమా రెండింటిలోనూ రాణిస్తోంది కాబట్టి అభ్యంతర పెట్టడానికి ఏమీ లేదు. కానీ ఒకే ఒక్క సినిమా ఫలితం చూసి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ను రామ్ చరణ్ జత చేసుకోవడం ఒక తొందరపాటే అని చెప్పాలి. వదులుకోవడం మంచి పరిణామమే అని కూడా చెప్పాలి. ఈ ఉదంతం నుంచి ఇకనైనా యువ హీరోలు పాఠం నేర్చుకోవాలి. తాము తగిలించుకునే ట్యాగ్ అర్ధవంతంగా ఉన్నంతవరకూ ఓకే కానీ అతిశయోక్తిగా ఉండకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు చేరువవుతున్న తెలుగు సినిమా స్థాయిని తెలుగు స్టార్స్ తమ కీర్తి కండూతితో దిగజార్చినట్టే అవుతుంది.
మెడలో నెక్లెస్తో అల్లు శిరీష్.. కాబోయే భార్యతో..
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ తమ్ముడు, హీరో శిరీష్ (Allu Sirish) ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలు నయనిక వేలికి ఉంగరం తొడిగాడు. అక్టోబర్ 31న ఈ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో అతడు వైట్ డ్రెస్సులో మెడకు నెక్లెస్తో కనిపించాడు. అటు నయనిక ఎరుపు రంగు లెహంగాలో, ముత్యాల దండతో మెరిసిపోయింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.శిరీష్ లవ్స్టోరీఅల్లు శిరీష్కు పెళ్లి చేయాలని అరవింద్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. కానీ, శిరీష్ ఓకే చెప్పాలిగా! అలాంటి సమయంలో (2023లో) వరుణ్తేజ్- లావణ్యల పెళ్లి జరిగింది. ఈ జంట కోసం హీరో నితిన్- షాలిని దంపతులు ఓ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక కూడా వచ్చింది. ఇటు వరుణ్ తరపున శిరీష్ పార్టీకి హాజరయ్యాడు. అక్కడే శిరీష్- నయనిక చూపులు కలిశాయి, మనసులు కూడా కలుసుకున్నాయి. పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండేళ్ల ప్రేమ ఇప్పుడు మూడుముళ్ల బంధంగా మారనుంది.శిరీష్ జర్నీ'గౌరవం' (2013) సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శిరీష్. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. హిట్ల కన్నా ఎక్కువ ఫ్లాపులే అందుకోవడంతో సినిమాలు తగ్గించేశాడు. ఏడాదిన్నరకాలంగా అతడి నుంచి ఏ సినిమా రాలేదు. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి: నీళ్ల బాటిల్ రూ.100.. కాఫీ రూ.700.. సుప్రీంకోర్టు సీరియస్
న్యూస్ పాడ్కాస్ట్
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
ఏపీ సీఎం చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి... ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున పోరాటం సాగిస్తాం... మోంథా తుపాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 19 మంది మృతి.
కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం
Chevella Bus Incident: రెప్పపాటులో ప్రమాదం అతివేగం వల్లే జరిగింది
మహిళల వరల్డ్కప్-2025 విజేతగా భారత్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట... తొమ్మిది మంది భక్తులు మృతి... 20 మందికి పైగా గాయాలు
ఆంధ్రప్రదేశ్లో ఉపాధి హామీ పథకంలో భారీ కోత... ఈ ఏడాది 13 శాతానికిపైగా తగ్గిన పనుల కల్పన
ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్లో ఫైనల్కు దూసుకెళ్లిన టీమిండియా
తెలంగాణలో విధ్వంసం సృష్టించిన ‘మోంథా’... ఉమ్మడి వరంగల్పై తీవ్ర ప్రభావం
క్రీడలు
అమ్మకానికి ఆర్సీబీ... త్వరలోనే కొత్త యాజమాన్యం చేతుల్లోకి!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ సీజన్లో విజేతగా నిలిచింది. ఇన్నేళ్లలో ఈ జట్టులో కోహ్లి తప్ప అందరు మారారు. ఎంతో మంది కొత్త ఆటగాళ్లు వచ్చారు. ఇప్పుడేమో కొత్త యాజమాన్యం రాబోతోంది. ఎందుకంటే ఈ చాంపియన్ ఫ్రాంచైజీని తాజాగా అమ్మకానికి పెట్టారు. అన్నట్లు ఆర్సీబీ అంటే ఒక జట్టే కాదు... భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహిస్తున్న ఐపీఎల్, మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టోర్నీల్లో ఆర్సీబీ జట్లు పోటీపడుతున్నాయి. గతేడాది మహిళల ఆర్సీబీ జట్టు కూడా డబ్ల్యూపీఎల్ విజేతగా నిలిచింది. కొన్ని రోజులుగా అమ్మకంపై ఊహగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం డియాజియో కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్సే్చంజ్కు సైతం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తమ ఫ్రాంచైజీలో పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పింది. కొత్త యజమానులను ఆహా్వనిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆరి్థక సంవత్సం ముగిసే నాటికి... అంటే వచ్చే మార్చి 31 తేదీకల్లా విక్రయ ప్రక్రియ పూర్తిచేయనుంది.
ఛ!.. నేను అలాంటి వాడిని కాదు: యువరాజ్ సింగ్
టీమిండియా దిగ్గజ ఆల్రౌండర్లలో యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఒకడు. భారత్ టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011 గెలవడంలో ఈ ఎడమచేతి వాటం ఆటగాడు కీలక పాత్ర పోషించాడు. క్యాన్సర్తో పోరాడి తిరిగి మైదానంలో అడుగుపెట్టి పరుగులు రాబట్టిన ఘనుడు.ఇక అన్ని ఫార్మాట్ల నుంచి చాలా ఏళ్ల క్రితమే వైదొలిగిన యువీ.. ఆ తర్వాత మెంటార్గా కొత్త అవతారం ఎత్తాడు. పంజాబీ స్టార్లు.. టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill), అభిషేక్ శర్మ (Abhishek Sharma)లకు చాన్నాళ్లుగా యువీ మార్గనిర్దేశకుడిగా ఉన్నాడు. ముఖ్యంగా అతడి గైడెన్స్లోనే అభిషేక్ టీ20 విధ్వంసకరవీరుడిగా రాటుదేలాడు.అస్సలు పోలికలు లేవుఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ తాజాగా PTIతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచింగ్ విషయంలో తన తండ్రి యోగ్రాజ్ సింగ్తో తనకు అస్సలు పోలికలు లేవన్నాడు. మనకు నచ్చినది ఎదుటివాళ్లపై రుద్దడం కోచింగ్ కాదని.. ఆటగాళ్ల మైండ్సెట్ను బట్టి తీర్చిదిద్దడమే అసలైన కోచింగ్ అంటూ పరోక్షంగా తండ్రికి కౌంటర్ ఇచ్చాడు.యోగ్రాజ్ సింగ్ లాంటివాడిని కానే కాదుఈ మేరకు.. ‘‘నేను కచ్చితంగా యోగ్రాజ్ సింగ్ లాంటివాడిని కానే కాదు. వ్యక్తిగా, వ్యక్తిత్వం పరంగా ఆయనతో నాకు పోలిక లేదు. మేమిద్దరం భిన్న ధృవాలము. నా కోచింగ్ శైలి కూడా వేరుగా ఉంటుంది.ఒక ఆటగాడికి కోచ్గా ఉన్నపుడు.. అతడి స్థానంలో ఉండి ఆలోచించాలి. అతడికి ఆలోచనా విధానం, శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా వ్యవహరించాలి. వారి గురించి పూర్తిగా తెలుసుకుని మార్గనిర్దేశనం చేయాలి.అభిషేక్ శర్మకు చాలా ఏళ్లుగా మెంటార్గా ఉన్నాను. తద్వారా ఓ వ్యక్తికి ఎలా మార్గదర్శనం చేయాలో నేను పరిపూర్ణంగా నేర్చుకున్నా. ప్రతిభావంతులను ఎలా గుర్తించాలో తెలుసుకున్నా. కఠిన శ్రమకు ఓరుస్తూ.. ఒక్కో మెట్టు ఎక్కి మేము అనుకున్న ఫలితాలు రాబడుతున్నాం.అభిషేక్ శర్మ అదే చేస్తున్నాడుసహజమైన శైలిలో ఆడితేనే ఏ ఆటగాడైనా తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలడు. 2011 వరల్డ్కప్ విన్నింగ్ జట్టు కెప్టెన్ గ్యారీ కిర్స్టెన్ నాకు ఈ మాట చెప్పాడు. ఇదే నేను ఫాలో అయ్యాను. నా శిష్యులకు కూడా ఇదే చెబుతున్నా. కోచ్, కెప్టెన్ స్వేచ్ఛను ఇస్తే ఆటగాడు అద్భుతాలు చేయగలడు. ఇప్పుడు అభిషేక్ శర్మ అదే చేస్తున్నాడు’’ అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.కాగా అభిషేక్ శర్మ ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాలో అడుగుపెట్టాడు. అనతికాలంలోనే ఐసీసీ నంబర్వన్ టీ20 బ్యాటర్గా ఎదిగాడు. ఇదిలా ఉంటే.. యువీని చిన్ననాటి నుంచే క్రికెటర్గా తీర్చిదిద్దే క్రమంలో యోగ్రాజ్ సింగ్ చాలా కఠినంగా వ్యవహరించాడు.ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు కూడా!.. ఒకానొక సందర్భంగా తన శిక్షణలో యువీ చచ్చిపోతాడంటూ అతడి తన తల్లి గొడవపెట్టినా పట్టించుకోలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో యువీ తన తండ్రి గురించి పైవిధంగా స్పందించడం గమనార్హం.చదవండి: BCCI: భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. రోహిత్- కోహ్లి లేరు
వరల్డ్కప్ విజేతలకు ప్రధాని మోదీ ఆతిథ్యం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుని అభినందించారు. తన నివాసంలో హర్మన్ సేనతో ప్రధాని సమావేశమై.. వరల్డ్కప్ విశేషాలను చర్చించారు. కాగా నలభై ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ భారత మహిళా జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.సొంతగడ్డపై ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 టైటిల్ను మన అమ్మాయిలు గెలుచుకున్నారు. నవీ ముంబై వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసి విశ్వ విజేతగా అవతరించారు. ఈ క్రమంలో హర్మన్ సేనపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. తన కార్యాలయంలో వారితో సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని తెలుపుతూ ప్రధాని కార్యాలయం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి ఆహ్వానం పంపింది. ఈ నేపథ్యంలో భారత మహిళా జట్టు బుధవారం ఢిల్లీలోని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసానికి చేరుకుంది. అనంతరం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వరల్డ్కప్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ తర్వాత ప్రధాని మోదీ జగజ్జేతలతో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా వన్డే వరల్డ్కప్ విజేతలు.. తమ సంతకాలతో కూడిన ‘నమో’ జెర్సీని ప్రధానికి కానుకగా ఇచ్చారు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. వరుసగా మూడు మ్యాచ్లు ఓడిన తర్వాత పుంజుకున్న తీరు అద్భుతమని కొనియాడారు.హ్యాట్రిక్ ఓటముల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చినా.. ఒత్తిడిని అధిగమించారంటూ భారత జట్టును ప్రధాని మోదీ ప్రశంసించారు. ‘ఫిట్ ఇండియా’ సందేశాన్ని దేశమంతా వ్యాప్తి చేయాలని.. ఈ సందర్భంగా మోదీ హర్మన్ సేనకు పిలుపునిచ్చారు.ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు, ఫిట్గా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రచారం చేయాలని.. పాఠశాలకు వెళ్లి మరీ పిల్లలకు ఇవన్నీ బోధించాలని మోదీ.. భారత జట్టుకు సూచించారు. ఇక ప్రధాని మోదీతో మాట్లాడుతున్న క్రమంలో కెప్టెన్ హర్మన్ప్రీత్.. 2017 ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమిని గుర్తు చేసుకోగా.. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన .. ఆ సమయంలో ప్రధాని మోదీ తమలో స్ఫూర్తి నింపారని తెలిపింది.చదవండి: BCCI: భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. రోహిత్- కోహ్లి లేరు
అతడి కెరీర్ ముగించేశారు కదా!: అగార్కర్పై మండిపాటు
టీమిండియా తరఫున టెస్టుల్లో పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్న వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammad Shami) ఆశలపై సెలక్టర్లు నీళ్లు పోశారు. దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్నా అతడిపై శీతకన్నేశారు. సౌతాఫ్రికాతో టెస్టుల (IND vs SA Tests)కు ఎంపిక చేసిన జట్టులో షమీకి సెలక్టర్లు చోటివ్వలేదు.ఫలితంగా టీమిండియా యాజమాన్యంపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar), హెడ్కోచ్ గౌతం గంభీర్ కావాలనే షమీ కెరీర్ను ప్రశ్నార్థకం చేశారంటూ అతడి అభిమానులు మండిపడుతున్నారు. కాగా రెండేళ్ల క్రితం షమీ చివరగా టీమిండియా తరఫున టెస్టులు ఆడాడు.ఆ తర్వాత చీలమండ గాయంతో చాన్నాళ్లు జట్టుకు దూరమైన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 వన్డే టోర్నీలో భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ.. ఇంగ్లండ్తో టెస్టులు, ఆస్ట్రేలియాతో వన్డేలకు ఈ రైటార్మ్ పేసర్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు.అప్డేట్ లేదని.. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీ ఫిట్నెస్ గురించి తమకు అప్డేట్ లేదని.. అందుకే పక్కనపెట్టామని చెప్పాడు. అయితే, అగార్కర్ వ్యాఖ్యలకు షమీ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. రంజీలు ఆడేందుకు ఫిట్గా ఉన్న తాను.. వన్డేలు కూడా ఆడలేనా? అని ప్రశ్నించాడు.ఆటతోనే సమాధానంఈ క్రమంలో అగార్కర్ బదులిస్తూ.. షమీ ఫిట్గా లేనందు వల్లే తాము అతడిని ఇంగ్లండ్ పర్యటన, ఆసీస్ టూర్కు ఎంపిక చేయలేదని మరోసారి పునరుద్ఘాటించాడు. ఈ నేపథ్యంలో రంజీ సీజన్లో బెంగాల్ తరఫున చివరగా గుజరాత్తో మ్యాచ్ ఆడిన షమీ.. ఆటతోనే అగార్కర్కు సమాధానమిచ్చాడు.గుజరాత్తో మ్యాచ్లో మొత్తంగా ఎనిమిది వికెట్ల (3/44, 5/38)తో చెలరేగి.. సెలక్టర్లకు సవాల్ విసిరాడు. బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాడు. ఈ క్రమంలో మీడియా షమీని పలకరించగా.. తాను ఇప్పుడు ఏం మాట్లాడినా.. అందుకు అపార్థాలు తీస్తారని పేర్కొన్నాడు.సీన్ రివర్స్ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త సెలక్టర్ ఆర్పీ సింగ్ సూచన మేర, అతడి నుంచి అందిన హామీ మేరకే షమీ ఇలా మాట మార్చాడని నెటిజన్లు చర్చించుకున్నారు. అగార్కర్- షమీ మాటల యుద్ధానికి తెరపడినట్లేనని.. సౌతాఫ్రికాతో టెస్టులకు అతడిని ఎంపిక చేస్తారని అభిప్రాయపడ్డారు. కానీ సీన్ రివర్స్ అయింది.బెంగాల్ జట్టుకే ప్రాతినిథ్యం వహిస్తున్న మరో పేసర్ ఆకాశ్ దీప్ను ఎంపిక చేసిన సెలక్టర్లు.. షమీకి మాత్రం మరోసారి మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో 35 ఏళ్ల షమీ టెస్టు రీఎంట్రీ కల ముగిసినట్లేనని.. ఇకపై షమీని టీమిండియా టెస్టు జెర్సీలో చూడలేమంటూ అభిమానులు ఉసూరుమంటున్నారు. మీకు ఎందుకింత పగ‘ఇగో’ కారణంగానే అతడి కెరీర్ను నాశనం చేస్తున్నారంటూ.. మీకు ఎందుకింత పగ? అంటూ అగార్కర్పై మండిపడుతున్నారు. కాగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. ఇందుకోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బుధవారం ప్రకటించింది.చదవండి: IND vs SA Tests: సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన
బిజినెస్
రూ.31 లక్షల నంబర్ ప్లేట్ కొన్న ఒకప్పటి ఆటోడ్రైవర్..
జైపూర్కు చెందిన రాహుల్ తనేజా అనే వ్యాపారవేత్త తన కొడుకు కొత్త లగ్జరీ కారు కోసం ప్రత్యేక వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్ కొనుగోలు చేసి సంచలనం సృష్టించారు. ఆయన ఆడి ఆర్ఎస్క్యూ8 కారుకు RJ 60 CM 0001 అనే నంబర్ ప్లేట్ కోసం సుమారు రూ.31 లక్షలు వెచ్చించారు. జైపూర్ రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నిర్వహించిన పోటీ వేలంలో ఈ నంబర్ను గెలుచుకున్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇది రాజస్థాన్లో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్గా నిలిచింది.వ్యాపారవేత్తలు ఖరీదైన వీఐపీ నంబర్లు కొనుగోలు చేయడం కొత్త విషయమేమీ కాదు. కానీ రాహుల్ తనేజా కథ నిజంగా స్ఫూర్తిదాయకం. మధ్యప్రదేశ్లోని మండ్లా జిల్లాలోని కత్రా గ్రామంలో జన్మించిన ఆయన చిన్ననాటి జీవితం చాలా కష్టాల మధ్య సాగింది. తండ్రి సైకిళ్లకు పంక్చర్లు వేసేవారు. తల్లి పొలాల్లో పని చేసేది. 11 ఏళ్ల వయసులోనే రాహుల్ జైపూర్లోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న ఓ ధాబాలో వెయిటర్గా పని చేశాడు.తర్వాత రెండేళ్ల పాటు టీ, స్నాక్స్ వడ్డిస్తూ కుటుంబాన్ని పోషించాడు. అనంతరం వీధి వ్యాపారిగా మారి, దీపావళి సమయంలో బాణసంచా, హోలీకి రంగులు, సంక్రాంతికి గాలిపటాలు అమ్మేవాడు. వేసవి సెలవుల సమయంలో ఇంటింటికీ తిరిగి న్యూస్ పేపర్లు వేయడం, గోడలపై పోస్టర్లు అంటించడం వంటి చిన్నచిన్న పనులు ఎన్నో చేసాడు. 16 ఏళ్ల వయసులో రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి వరకు దుర్గాపురా రైల్వే స్టేషన్ వద్ద ఆటో నడిపేవాడు.ఇలా పొదుపు చేసుకున్న డబ్బుతో 19 సంవత్సరాల వయసులోనే జైపూర్లోని సింధీ కాలనీలో ‘కార్ ప్యాలెస్’ అనే చిన్న కార్ డీలర్షిప్ ప్రారంభించాడు. అదే సమయంలో ఆయన మోడలింగ్లో అడుగుపెట్టి, మిస్టర్ జైపూర్, మిస్టర్ రాజస్థాన్, మేల్ ఆఫ్ ది ఇయర్ 1999 వంటి టైటిల్స్ గెలుచుకున్నాడు. అయితే ఎప్పుడూ వ్యాపార దృష్టి ఉండే రాహుల్, 2000లో లైవ్ క్రియేషన్స్ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించాడు. 2005లో ఇండియన్ ఆర్టిస్ట్ డాట్కామ్ అనే ఆర్టిస్ట్ మేనేజ్మెంట్ సంస్థను ప్రారంభించి, తరువాత రాహుల్ తనేజా ప్రీమియం వెడ్డింగ్స్ పేరుతో లగ్జరీ వెడ్డింగ్ ప్లానింగ్లోకి ప్రవేశించాడు.రాహుల్ తనేజా ఖరీదైన వీఐపీ నంబర్ ప్లేట్లు కొనుగోలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా రూ.10 లక్షలు, రూ.16 లక్షలు పెట్టి నంబర్ ప్లేట్లు కొనుగోలు చేశారు. ఇప్పుడు, తన కుమారుడు రెహాన్ 18వ పుట్టినరోజు సందర్భంగా ఆడి ఆర్ఎస్క్యూ8 కారును బహుమతిగా కొనిచ్చారు. అలాగే దానికి రూ.31 లక్షలు పెట్టి నంబర్ ప్లేట్ కొనిచ్చారు. ఎందుకింత ఖరీదైన నంబర్ కొనడం అంటే తన కొడుక్కి కార్లు, నంబర్లంటే ఇష్టమని, తన కొడుకు ఆనందమే తన ఆనందమని బదులిస్తున్నారు.
ఎన్సీఎల్ఏటీలో వాట్సప్కి పాక్షిక ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్లో (ఎన్సీఎల్ఏటీ) మెసేజింగ్ యాప్ వాట్సాప్నకు పాక్షిక ఊరట లభించింది. అడ్వర్టైజింగ్ అవసరాల కోసం మాతృ సంస్థ మెటా ప్లాట్ఫాంనకు అయిదేళ్ల పాటు డేటా పంచుకోరాదంటూ సీసీఐ ఇచ్చిన ఆదేశాలను ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టింది. అయితే, కంపెనీపై విధించిన రూ. 213 కోట్ల పెనాల్టీని సమర్థించింది.వైదొలిగేందుకు సరైన ఆప్షన్ ఇవ్వకుండా వాట్సాప్ను వాడాలంటే విస్తృతమైన డేటాను చేసుకోవాల్సి ఉంటుందంటూ యూజర్లపై ఒత్తిడి తేవడం సరి కాదని ఎన్సీఎల్ఏటీ వివరించింది. ఎన్సీఎల్ఏటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వాట్సప్ మాతృ సంస్థ మెటా తెలిపింది. వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీ అప్డేట్ వల్ల ప్రజల వ్యక్తిగత మెసేజీల గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని పేర్కొంది.
జనవరి 1 నుంచి ఆ పాన్ కార్డులు చెల్లవు..!
ఆధార్తో లింక్ చేసుకోని పాన్ కార్డులు వచ్చే జనవరి 1 నుంచి చెల్లుబాటు కావు. అంటే తమ ఆధార్తో పాన్ కార్డులు లింక్ చేసుకోనివారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ను ఫైల్ చేయలేరు. ట్యాక్స్ రిఫండ్ను అందుకోలేరు. అలాగే ఇతర బ్యాంకింగ్, షేర్ మార్కెట్ ట్రేడింగ్, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లోనూ ఇబ్బందులు తప్పవు.ఆధార్, పాన్ కార్డులు.. రెండూ దేశంలో అత్యంత ముఖ్యమైన ధ్రువ పత్రాలు. ఒకటి దేశ పౌరుడిగా విశిష్ట గుర్తింపును తెలియజేసేదైతే మరొకటి ఆర్థిక కార్యకలాపాలకు అత్యంత కీలకమైన డాక్యుమెంట్. పన్ను ఎగవేతలను అక్రమాలను అరికట్టడానికి ఆధార్, పాన్ కార్డులను లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పుడో నిబంధన తెచ్చింది. దీనికి గడువును మాత్రం ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తోంది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) 2024 అక్టోబర్ 1వ తేదీకి ముందు జారీ చేసిన పాన్ కార్డులను 2025 డిసెంబర్ 31వ తేదీ లోపు తప్పనిసరిగా ఆధార్తో లింక్ చేసుకోవాలని గడువు విధించింది. ఆ లోపు లింకింగ్ పూర్తి కాకపోతే అలాంటి పాన్కార్డులు చెల్లుబాటు కావని సీబీడీటీ గతంలో వెల్లడించింది. ఇప్పుడా గడువు సమీపిస్తోంది. ఇంకా ఈ ప్రక్రియను పూర్తి చేయనివారు వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.ఆన్లైన్లో పాన్-ఆధార్ లింక్ చేసుకోండిలా..ఆదాయపు పన్ను శాఖ ఆన్లైన్ పోర్టల్లో మీ పాన్, ఆధార్ ను సులభంగా లింక్ చేసుకోవచ్చు. ఈ దశలను అనుసరించండి..అధికారిక ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ కు వెళ్లండి."లింక్ ఆధార్" పై క్లిక్ చేసి మీ పాన్, ఆధార్ నంబర్, మొబైల్ నంబరును నమోదు చేయండి.ఇప్పుడు మీ ఫోన్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వివరాలను వెరిఫై చేయండి.ఒకవేళ మీ పాన్ ఇప్పటికే ఇనాక్టివ్గా ఉంటే, మొదట రూ .1,000 లింకింగ్ ఫీజు చెల్లించాలి.లింకింగ్ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి, వెబ్సైట్లో ‘క్విక్ లింక్స్’కు వెళ్లి ఆధార్ స్టేటస్ లింక్పై క్లిక్ చేయండి.
వైట్ కాలర్ జాబ్స్ తగ్గాయ్.. ఐటీ ఉద్యోగాలైతే..
కార్యాలయ ఉద్యోగ నియామకాలు (వైట్ కాలర్) అక్టోబర్ నెలలో తగ్గుముఖం పట్టాయి. క్రితం ఏడాది ఇదే నెలలో నియామకాలతో పోల్చి చూస్తే 9 శాతం తగ్గినట్టు నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. దసరా – దీపావళి పండుగ సెలవులు నియామకాలపై ప్రభావం చూపించినట్టు తెలిపింది. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు, నియామక సంస్థల శోధన ఫలితాల ఆధారంగా ‘నౌకరీ డాట్ కామ్’ ప్రతి నెలా జాబ్స్పీక్ ఇండెక్స్ నివేదికను విడుదల చేస్తుంటుంది.అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, విద్య, బీపీవో/ఐటీఈఎస్ రంగాల్లో నియామకాలు సానుకూల వృద్ధిని చూశాయి. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్లో 15 శాతం పెరగ్గా.. విద్యా రంగంలో 13 శాతం, బీపీవో/ఐటీఈఎస్లో 6 శాతం చొప్పున అధికంగా నియామకాలు జరిగాయి.విద్యా నియామకాల పరంగా హైదరాబాద్లో అత్యధికంగా 47 శాతం వృద్ధి కనిపించింది. ఆ తర్వాత చైన్నైలో 34 శాతం, బెంగళూరులో 31 శాతం చొప్పున పెరిగాయి.కృత్రిమ మేథ(ఏఐ) మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) నిపుణులకు డిమాండ్ క్రమంగా పెరుగుతూనే ఉంది. అక్టోబర్లో వీటికి సంబంధించి నియామకాలు 33 శాతం పెరిగాయి. ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్ నియామకాలు వరకే చూస్తే 139 శాతం వృద్ధి కనిపించింది. వివిధ రంగాల్లో పెరుగుతున్న ఏఐ నిపుణుల అవసరాలను ఇది తెలియజేస్తోంది.ఐటీ రంగంలో 15 శాతం, బ్యాంకింగ్లో 24 శాతం చొప్పున అక్టోబర్లో నియామకాలు తగ్గాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో బ్లాక్చైన్, క్రిప్టోకరెన్సీ వంటి టెక్నాలజీలపై పనిచేసే కంపెనీల్లో నియామకాలు 60 శాతం అధికంగా నమోదయ్యాయి.సెర్చ్ ఇంజనీర్లకు 62 శాతం డిమాండ్ అధికంగా కనిపించింది. మెడికల్ బిల్లర్/కోడర్కు 41 శాతం, ట్రాన్సిషన్ మేనేజర్లకు 35 శాతం, తయారీ ఇంజీనర్లకు 32 శాతం చొప్పున డిమాండ్ నెలకొంది.👉 ఇది చదివారా? ‘నెల జీతాల ఉద్యోగాలు ఉండవ్..’
ఫ్యామిలీ
అమ్మానాన్నలూ గెలిచారు
పిల్లల ప్రతిభను ప్రపంచం కంటే ముందు తల్లిదండ్రులే గుర్తించాలి. గోరుముద్దల్లో ఉత్సాహం.. వేలు పట్టి నడిపే నడకలో ప్రోత్సాహం అందించినప్పుడే పిల్లలు పులుల్లా మారతారు... చిరుతల్లా కదలాడతారు. తల్లిదండ్రులు అమ్మాయిలను చదివించి... ఉద్యోగాలు చేయించడం వరకు ఆలోచిస్తారు. కానీ, క్రీడల్లో కొనసాగమని చెప్పడం తక్కువ. మన మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించడం చూసి ఇకపై పెద్ద మార్పు రావచ్చు. ఈ జట్టులోని అమ్మాయిలను తల్లిదండ్రులు ప్రోత్సహించిన తీరు చూస్తే ‘క్రీడాకారిణి కావాలని ఉంది’ అని ఏ అమ్మాయి కోరినా తల్లిదండ్రులు తప్పక ‘మేమున్నాం’ అనే రోజులు వచ్చేశాయి.ఇంట్లో నాతోనే క్రికెట్ ఆడేది!చిన్నప్పటినుంచి అథ్లెటిక్స్ అంటే శ్రీచరణికిప్రాణం. జాతీయ స్థాయిలో ఖోఖో అడింది. కానీ, క్రికెట్ అంటేనే చాలా ఇష్టం. ఇంట్లో క్రికెట్ ఆడతానని అలిగేది. తన తండ్రి కూడా అథ్లెటిక్స్ ఆడమని చెప్పారు. కానీ, నేను మాత్రం శ్రీచరణీకి తోడుగా నిలిచి క్రికెట్ను ప్రోత్సహించాను. నాతోనే ఇంట్లో క్రికెట్ ఆడేది. ఇప్పుడు ఏకంగా వరల్డ్ కప్ గెలుపులో కీలకంగా నిలవడం మాకెంతో గర్వకారణం. ఇక మా సంతోషానికి హద్దులు లేవు. – నల్లపురెడ్డి రేణుక (శ్రీచరణి తల్లి)తండ్రిగా చెప్పుకోవడానికిగర్వంగా ఉంది..ఉమెన్స్ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి తండ్రిగా చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నా కూతురు వరల్డ్ కప్లో క్రికెట్ ఆడుతుంటే చాలా సంతోషంగా ఉంది. – నల్లపురెడ్డి చంద్రశేఖర్రెడ్డి, శ్రీచరణి తండ్రిమహిళల ప్రపంచ కప్ పోటీల్లో సాటిలేని ప్రతిభ కనబర్చి వైఎస్సార్ కడప జిల్లా పేరును ప్రపంచ పటంలో నిలిపిన శ్రీచరణి వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం యర్రంపల్లె గ్రామానికి చెందిన నల్లపురెడ్డి చంద్రశేఖరరెడ్డి, రేణుక దంపతుల కుమార్తె. తండ్రి ఆర్టీపీపీలో ఎలక్ట్రికల్ ఫోర్మన్ . ఒకటి నుంచి 10వ తరగతి వరకూ ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్లో చదివింది. హైదరాబాద్ లేపాక్షి జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ పూర్తిచేసింది. ప్రస్తుతం వీఎన్ పల్లె వీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో బీఎస్పీ కంప్యూటర్స్ చదువుతూ క్రికెట్లో విశేష ప్రతిభ కనబరుస్తోంది.ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?అండర్–19 నుంచి భారత జట్టు స్థాయికి..తొలుత శ్రీచరణి 2017–18లో జిల్లా అండర్–19 జట్టుకు ఎంపికైంది. అప్పటినుంచి ఇంక వెనక్కి తిరిగి చూడలేదు. అదే ఏడాది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. జిల్లాకు చెందిన క్రికెట్ శిక్షకులు ఖాజా మొయినుద్దీన్, మధుసూదన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఎన్నో మెళకువలు నేర్చుకుంది. ఆ తర్వాత..⇒ 2021లో అండర్–19 చాలెంజర్స్ ట్రోఫీలో ఇండియా–సి జట్టుకుప్రాతినిధ్యం వహించి నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ⇒ శ్రీచరణి ఆట నైపుణ్యం గుర్తించిన డబ్ల్యూపీఎల్ ప్రతినిధులు ఢిల్లీ క్యాపిటల్స్కు రూ.55 లక్షలతో ఎంపిక చేసుకున్నారు. ⇒ ఏప్రిల్ 27 నుంచి మే 11 వరకు జరిగిన శ్రీలంక ముక్కోణపు వన్డే సీరీస్ క్రికెట్ టోర్నీకి నల్లపురెడ్డి శ్రీచరణి తొలిసారి భారత జట్టుకుప్రాతినిధ్యం వహించింది. ⇒లండన్ లో జరిగిన టీ–20 టూర్కు భారత జట్టు తరఫున ఎంపికైంది. ⇒ ప్రస్తుతం ఐసీసీ మహిళ విభాగంలో భారత జట్టు తరఫున ప్రపంచకప్లో నిలకడగా రాణించింది. ఈ టోర్నీలో 14 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రెండో బౌలర్గా ఘనత సాధించింది.కుటుంబ సభ్యుల ప్రోత్సాహం..చిన్నప్పటి నుంచి ఆటలపై మక్కువ చూపే శ్రీచరణి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. మొదట్లో అథ్లెటిక్స్లో రాణిస్తున్న శ్రీచరణి ఆ తర్వాత క్రికెట్పై ఆసక్తి చూపుతుండడంపై అమ్మానాన్నలు సందేహించారు. కానీ, క్రికెట్పై ఉన్న ఆసక్తిని గమనించిన మామ కిశోర్కుమార్రెడ్డి శ్రీచరణిని ప్రోత్సహించారు. సరదాగా మొదలుపెట్టిన క్రికెట్ ఇప్పుడు శ్రీచరణికి సర్వస్వం అయింది. ప్రోత్సాహం ఉంటే అమ్మాయిలు ఎందులోనైనా రాణించగలరని శ్రీచరణి రుజువు చేసింది. – మోపూరు బాలకృష్ణారెడ్డి. సాక్షి ప్రతినిధి, కడపదిసీజ్ ఫర్ యూ..!‘పిల్లల ఇష్టాలు కనిపెట్టి, వారు ఎంచుకున్న మార్గంలో వెళ్లేలా ప్రోత్సహించడం, తగిన స్వేచ్ఛను ఇస్తూ, సపోర్ట్గా ఉండటం పేరెంట్స్ నిర్వర్తించాల్సిన పనులు’ అంటారు ఇండియన్ విమెన్ క్రికెటర్ అరుంధతీరెడ్డి తల్లి భాగ్యరెడ్డి. మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ కైవసం చేసుకున్న మన భారత జట్టులో భాగమైన ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డి హైదరాబాద్ వాసి. ఈ విజయోత్సవ ఆనందంలో కూతురి కల గురించి అమ్మగా భాగ్య రెడ్డి పంచుకున్న విషయాలు..‘‘ఫైనల్స్ చూడటానికి ముంబయ్ వెళ్లి, ఈ రోజే వచ్చాను. మ్యాచ్ గెలవగానే ‘అమ్మా.. దిస్ ఈజ్ ఫర్ యు’ అని చెప్పింది నా బిడ్డ. ఆ క్షణంలో పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ గెలుపును ఇప్పుడు మా కుటుంబం అంతా ఎంజాయ్ చేస్తున్నాం. చిన్నప్పుడు తన అన్న రోహిత్, ఇతర కజిన్స్తో కలిసి గల్లీలో క్రికెట్ ఆడేది. టీవీలో క్రికెట్ చూసేది. సోర్ట్స్లో చాలా చురుకుగా ఉండేది. నేను వాలీబాల్ స్టేట్ ప్లేయర్ని. స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నా కుటుంబ పరిస్థితుల కారణంగా నా కలలను నెరవేర్చుకోలేకపోయాను. నా కూతురుకి ఉన్న ఇష్టాన్ని కాదనకూడదు అనుకున్నాను. క్రికెట్ ఫస్ట్..మేముండేది సైనిక్పురిలో. ప్రైవేట్ స్కూల్ టీచర్ని. మధ్యతరగతి కుటుంబం. సోర్ట్స్లో అరుంధతికి ఉన్న ఇష్టాన్ని చూసి, పన్నెండేళ్ల వయసులో స్పోర్ట్స్ సెంటర్లో చేర్పించాను. ఉదయం నాలుగు గంటలకే స్పోర్ట్స్ సెంటర్కి వెళ్లిపోయేవాళ్లం. అక్కణ్ణుంచి స్కూల్. మళ్లీ సాయంత్రం ఇద్దరం గ్రౌండ్కి వెళ్లిపోయేవాళ్లం. క్రికెట్ప్రాక్టీస్ చేస్తూనే ఓపెన్ లో టెన్త్ ఎగ్జామ్స్ రాసింది. 15 ఏళ్లకే అండర్ –19 హైదరాబాద్ జట్టుకు ఎంపికయ్యింది. ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకుంది. పెద్ద కల ఉంటే త్యాగాలు ఎన్నో...2017లో రైల్వేలో చేరింది. అక్కడ ఉంటూనే చాలా విషయాల పట్ల అవగాహన ఏర్పరుచుకుంది. అండర్ 23 జోనల్ టోర్నమెంట్ లో రాణించింది. మళ్లీ ఒక దశలో క్రికెట్– జాబ్ .. దేనిని ఎంచుకోవాలనే నిర్ణయం వచ్చింది. ఓ రోజు తన నిర్ణయం క్రికెట్ మాత్రమే అని చెప్పింది. నేనూ ‘సరే’ అన్నాను. రెండేళ్ల కిందట జాబ్ మానేసి పూర్తి సమయాన్నిప్రాక్టీస్కే కేటాయించింది.ప్రాక్టీస్లో భాగంగా కుటుంబంలో ఎన్నో సంతోష సమయాలలో తను దూరంగా ఉండాల్సి వచ్చేది. ఈ రోజు దేశాన్ని గెలిపించిన జట్టులో నా బిడ్డ ఉందంటే... చాలా ఆనందంగా ఉంది. ధైర్యమే పెద్ద సపోర్ట్అరుంధతికి క్రికెట్తో పాటు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. సమయం దొరికితే మెలోడీస్ ను చాలా ఇష్టంగా పాడుతుంది. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా వారి జీవితాన్ని వారు ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇవ్వాలి. పెద్దలుగా మనం కనిపెడుతూ ఉండాలి. పిల్లల ఆసక్తితో ఎంచుకున్న మార్గంవైపు మనకు తెలిస్తే ఏవైనా సూచనలు ఇవ్వాలి. లేదంటే, ధైర్యంగా వెళ్లు అని చెప్పాలి. ఈ ఏడాది పిల్లలను సోర్ట్స్ అకాడమీలో చేర్చాం. వచ్చే ఏడాదికి పెద్ద ప్లేయర్ అయిపోవాలని వారిపై ఒత్తిడి తీసుకురావద్దు. అది సాధ్యం కాదు కూడా.ఎంచుకున్న దానిపైన అంకితభావం, క్రమశిక్షణ, సాధన ఉండాలి. మా అమ్మాయి ఆలోచన ఎప్పుడూ క్రికెట్ వైపు ఉండేది. మా కుటుంబం అంతా ఆమె వైపు ఉన్నాం. నా కలలను పిల్లల ద్వారా తీర్చుకోవాలి అనుకోలేదు. నా జీవితంలో ఎదురైన స్ట్రగుల్స్ని ఎప్పుడూ పిల్లల ముందు చెప్పలేదు. నా జర్నీలో మా అమ్మ నాకు పెద్ద మోరల్ సపోర్ట్. నా కూతురు ఎదుగుదలలో నేను కూడా అంతే. ఎంచుకున్న మార్గం వైపు ధైర్యంగా వెళ్లమనే చెబుతుంటాను. ఈ రోజు ఆ సక్సెస్ను చూస్తున్నాం’’ అంటూ ఆనందంగా వివరించారు. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఆ పేపర్ బాయ్ స్కిల్కి మాటల్లేవ్ అంతే..!
ప్రతి ఒక్కరి ఏదో ఒక దాంట్లో అపారమైన నైపుణ్యం ఉంటుంది. అయితే దాన్ని ఎవరో గుర్తించి అంటే గానీ వాళ్లకూడా అంతగా పట్టించుకోరు. అలాంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది. దీప్ అనే పేపర్ బాయ్ న్యూస్పేపర్ డెలివరీ చేయు విధానం చూస్తే మతిపోతుంది. అబ్బా ఏం స్కిల్ ఇది..అని అనుకుండా ఉండలేరు. అతడు పేపర్ విసిరే విధానం..అవి నేరుగా వాళ్ల వాకిళ్లు లేదా గుమ్మాల్లోనూ, అక్కడ మనుషుల చేతుల్లోకి సరాసరి వెళ్లిపోతుండటం ఓ మ్యాజిక్లా జరిగిపోతుంది. ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ లేదన్నట్లుగా వెళ్లిపోతున్నాయి. అరే ఏం టెక్నిక్ ఇది అనిపిస్తుంది. అతడు అలా న్యూస్ పేపర్లను డెలివరి చేస్తున్నంత సేపు కళ్లు తిప్పుకోలేం కూడా. అంతలా చాకచక్యంగా స్కూటర్పై స్పీడ్గా వెళ్లిపోతూ వేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. ఎక్కడ పొరబాటు, తడబాటు జరగకపోవడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Paper boy (@paper_boy_deep) (చదవండి: ఎయిర్ ఇండియా ప్రమాద మృత్యుంజయడు: ఆ రోజు అతను బతకడం ఓ అద్భుతం..కానీ ఇప్పుడు ప్రతిక్షణం..)
Air India survivor: ఆ రోజు అతను బతకడం ఓ అద్భుతం..కానీ ఇప్పుడు ప్రతిక్షణం..
జూన్ 12న అహ్మదాబాద్లో టేకాప్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేశ్..ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఆ రోజు తానెలా బతకాననేది ఒక అద్భుతం కానీ ఇవాళ అదొక పీడకలలా వెంటాడుతోందని ఆవేదనగా చెబుతున్నాడు. ప్రమాద ఘటన అనంతరం బ్రిటన్లో నివాసం ఉంటున్న ఆయన.. స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో అతడి హృదయ విదారక పరిస్థితి వెలుగులోకి వచ్చింది. లక్కీమ్యాన్ కాదు..అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ఇండియా ప్రమాదంలో మొత్తం 241 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో బయటపడ్డ ఒకే ఒక్క మృత్యుంజయుడిగా రమేశ్ వార్తల్లో నిలిచారు. బ్రిటన్లో నివాసముంటున్న విశ్వాస్ కుమార్.. గుజరాత్లోని తన కుటుంబానికి కలిసేందుకు వచ్చి తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ రోజు విమానంలో 11-ఏ సీటులో విశ్వాస్ కుమార్ కూర్చున్నారు. ప్రమాదం అనంతరం రక్తపుమరకలతో నడుచుకుంటూ వచ్చి అంబులెన్సు ఎక్కిన దృశ్యాలు ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. అంత పెద్ద ప్రమాదంలో బయటపడ్డ లక్కీమ్యాన్గా అందరూ అతన్నిచూస్తుంటే..ఆయన మాత్రం రోజు రోజుకి కుంగిపోతున్నాడు. నిత్య నరకం అనుభవిస్తున్నా అంటూ కన్నీటిపర్యంతమవుతున్నాడు. ఆ ప్రమాదం కారణంగా తన ప్రాణానికి ప్రాణమైన తమ్ముడిని కోల్పోయా..అని బోరుమన్నాడు. ఆ తర్వాత తన జీవితమే తలకిందులైపోయిందని, తన సోదరుడితో కలిసే చేసిన వ్యాపారం కూడా మూతపడిందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. తాను తిరిగి నార్మల్గా అవ్వడం అంత సులభం కాదని అంటున్నాడు. ఆ ఘటన తర్వాత నెలలతరబడి మౌనంగా ఉన్నట్లు తెలిపాడు. తానెప్పుడు ఇంటిని వదలి బయటకు వెళ్లడం లేదని, బెడ్రూంలోనే ఒంటిరిగా కూర్చొని ఉంటానని. తనకోసం తలుపు బయట అమ్మ కూర్చొని ఉంటుందని చెబుతున్నాడు. కనీసం తన కొడుకుతో కూడా సరిగా మాట్లాడలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. భరించలేని మానసిక గాయంతో బాధపడుతున్నాని చెబుతున్నాడు. ఇంకా శారీరక అసౌక్యర్యాన్ని ఎదుర్కొటున్నట్లు వివరించాడు. భార్య సాయం లేనిదే కనీసం..తన మోకాలు, భుజం, వెన్ను నొప్పి తోపాటు చేతికి అయ్యిన కాలిన గాయాలతో బాధపడుతున్నానని, భార్య సాయం లేనిదే స్నానం కూడా చేయలేకపోతున్నట్లు బాధగా వెల్లడించాడు. ఇదిలా ఉండగా, లండన్ లీసెస్టర్ కమ్యునిటీ నాయకుడు, సంజీవ్ పటేల్, అతని సలమాదారు, ప్రతినిధి రాడర్ సీగర్లు కూడా తమ వంతుగా రమేష్కి మద్దతు అందిస్తున్నామని అన్నారు. అలాగే ఎయిర్ ఇండియా కూడా రమేష్కు సుమారు రూ. 21 లక్షల పరిహారం అందించిందని తెలిపారు. అతనికి ఇప్పుడు ఆర్థిక సాయంతోపాటు మానసిక స్థైర్యం, భరోసా అందించాలని అన్నారు. అదే అతడిని తిరిగి కోలుకునేలా చేయగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా సైతం రమేష్కు అవసరమైన సహాయాన్ని అందించడం తమ బాధ్యత అని పేర్కొనడం విశేషం.#WATCH | New video shows miracle survivor from seat 11A walking away from Ahmedabad plane crash site.More news & updates ▶️https://t.co/cetvZaId2H#AirIndiaPlaneCrash #AhmedabadPlaneCrash pic.twitter.com/QdcZJNqef6— Hindustan Times (@htTweets) June 16, 2025 (చదవండి: భారత్పై జర్మన్ పర్యాటకుడి ప్రశంసల జల్లు...!)
స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?
భారత మహిళా క్రికెట్ జట్టు సారధిగా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) తొలిసారి ఐసీసీ మహిళల ప్రపంచకప్ ట్రోఫీ అందుకొని చరిత్ర సృష్టించారు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్గా ప్రతిభ కనబర్చి ప్రపంచ అత్యుత్తమ మహిళ క్రికెటర్లలో నిలవడమే కాదు, ప్రపంచకప్ను సాధించిన కెప్టెన్గా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ మ్యాచ్ తరువాత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రోలెక్స్ వాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.ఇటీవలి లెక్కల ప్రకారం భారత రిచెస్ట్ మహిళా క్రికెటర్గా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ నికర విలువ రూ. 25 కోట్లు. ఆమె ధరించి లిమిటెడ్ ఎడిషన్ వాచ్లను కూడా ఇష్టపడుతుంది. ది ఇండియన్ హోరాలజీ అందించిన వివరాల ప్రకారం తాజా వీడియోలో ఆమె ధరించిన వాచ్ ఐకానిక్ రోలెక్స్ డేట్జస్ట్గా గుర్తించారు. చదవండి: జుకర్బర్గ్కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకిహర్మన్ ప్రీత్కు క్లాసీ టచ్ ఇచ్చిన ఈ రోలెక్స్ డేట్జస్ట్ విలువ భారతదేశంలో సుమారు రూ. 8.7 లక్షలు. 36 mm ఓస్టర్స్టీల్ కేసు, స్క్రూ-డౌన్ స్టీల్ క్రౌన్, రోమన్ సంఖ్యలతో కూడిన తెల్లటి డయల్ స్పెషల్ లుక్లో కనిపిస్తోంది. అంతేకాదు విజయానికి చిహ్నంగా, ఐకానిక్గా రాయల్ లుక్లో ప్రీమియం అనుభవాన్నిస్తుంది.చదవండి: బెంగళూరు డాక్టర్ కేసులో ట్విస్ట్ : ప్రియురాలికి షాకింగ్ మెసేజ్అలాగే ప్రపంచ కప్ ట్రోఫీతో ఆమె పంచుకున్న ఫోటోకూడా వైరల్గా మారింది. క్రికెట్ అనేది జెంటిల్ మేన్ గేమ్కాదు ప్రతీ ఒక్కరిదీ అని అర్థం వచ్చేలా ఉన్న టీ షర్ట్ ట్రెండింగ్లో ఉంది. క్రికెట్ అందరి ఆట అనేది సందేశాన్ని హర్మన్ప్రీత్ గట్టిగానే ఇచ్చినట్టైంది. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology)కాగా పంజాబ్కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ క్రికెట్ ప్రయాణం పంజాబ్ నుంచే ప్రారంభమైంది.2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేసింది మొదలు క్రికెట్ లో అద్భుతమైన క్రీడాకారిణిగా రాణిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. మహిళల క్రికెట్లో అత్యంత ప్రభావ వంతమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరకు ప్రతీ ఫార్మాట్లోనూ ఆమెది ప్రత్యేకమైన ముద్ర. తాజాగా మహిళల ప్రపంచకప్ 2025 (Women's World Cup 2025) ట్రోఫిని దక్కించుకుని సూపర్ స్టార్గా నిలిచింది హర్మన్ ప్రీత్ కౌర్. కోట్లాది మంది క్రికెట్ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది.
ఫొటోలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)
విష్ణు విశాల్ ’ఆర్యన్‘ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)
రష్మికా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ (ఫొటోలు)
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)
తిరుమలలో బుల్లితెర నటుడు ప్రభాకర్ (ఫోటోలు)
వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫోటోలు)
జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. సింగర్ ఎమోషనల్ (ఫోటోలు)
గ్రీన్ లెహంగాలో మెరిసిపోతున్న అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత.. ఫోటోలు
కన్నడ నటికి అవార్డు.. సీఎం చేతుల మీదుగా సన్మానం (ఫోటోలు)
అంతర్జాతీయం
Indonesia: 6.2 తీవ్రతతో భూకంపం.. సునామీ ముప్పు?
జకార్తా: ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో బుధవారం (నవంబర్ 5) శక్తివంతమైన భూకంపం సంభవించింది. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దేశ జియోఫిజికల్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదైంది. ఈ భూకంపం తర్వాత సునామీ ప్రమాదం పొంచి ఉందని తొలుత భయపడినప్పటికీ, అటువంటిదేమీ లేదని ఏజెన్సీ నిర్ధారించింది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపింది.సులవేసిలోని కొన్ని ప్రాంతాలను భూకంపం కుదిపేసింది. ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రకంపనలు తీవ్రంగా ఉండి, కొన్ని సెకన్ల పాటు కొనసాగాయి. పరిస్థితిని అంచనా వేయడానికి అత్యవసర ప్రతిస్పందన బృందాలు ఉపక్రమించాయి. ఆసియా, ఆస్ట్రేలియన్ ఖండాల మధ్య, పసిఫిక్ మహాసముద్రం అంచున ఇండోనేషియా ఉంది. ఇది ప్రపంచంలోని 90 శాతం భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలలో 75 శాతం సంభవించే ప్రాంతంగా నిలిచింది. దేశ ప్రజలు తరచూ భూకంపాలు, సునామీల ప్రభావాలకు గురవుతుంటారు.
ట్రంప్కు భారీ షాక్.. మమ్దానీ గెలుపు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్ తగిలింది. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ(34) విజయం సాధించారు. ఎన్నికల్లో ముందు నుంచి మెరుగైన ఆధిక్యంలో కొనసాగిన మమ్దానీ ఘన విజయం అందుకున్నారు. మమ్దానీ విజయం నేపథ్యంలో ఆయనకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. మేయర్ ఎన్నికల్లో మమ్దానీకి 49.6 శాతం ఓట్లు(6,77,615) పోల్ అయ్యాయి. ప్రత్యర్థి క్యూమోకు 41.6 శాతం ఓట్లు(5,68,488) వచ్చాయి. దీంతో, దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో మమ్దానీ విజయం సాధించారు. కాగా, ఒక ఉన్నత కుటుంబం నుంచి స్వయం ప్రకటిత ప్రజాస్వామ్య సోషలిస్ట్ అయిన మమ్దానీ భారత సంతతికి చెందిన తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించాడు. ఏడేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు. 2018లో సహజ పౌరసత్వం పొందారు. 2021 నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇక.. ఎన్నికల సందర్భంగా మంగళవారం ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చారు. నగర ఎన్నికల బోర్డు తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు రెండు మిలియన్లకు పైగా ఓటర్లు ఓటు వేశారు. 1969 తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో ఓటు వేయడం ఇదే మొదటిసారి. కాగా, అక్టోబర్ 24, 28 మధ్య నిర్వహించిన మారిస్ట్ పోల్లో మమ్దానీ.. క్యూమో కంటే 16 పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారని తెలిపింది. రిపబ్లిక్న్ కర్టిస్ సైవా అనే సంస్థ కూడా అతనికి 16 శాతం ఆధిక్యాన్ని అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. వామపక్ష నేత అయిన జోహ్రన్ మమ్దానీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల విరుచుకుపడ్డారు. ఆయన గెలిస్తే న్యూయార్క్ నగరం ఆర్థిక, సామాజిక విధ్వంసానికి గురవుతుందని, నగర మనుగడకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. మమ్దానీ వంద శాతం కమ్యూనిస్టు పిచ్చొడని ట్రంప్ దుయ్యబట్టడం తెలిసిందే. అయినప్పటికీ మమ్దానీ విజయం సాధించడం విశేషం. BREAKING: Democratic Socialist Zohran Mamdani wins the New York City mayoral election, Decision Desk HQ projects pic.twitter.com/iphko44pmF— Republicans against Trump (@RpsAgainstTrump) November 5, 2025మమ్దానీ హామీ..జోహ్రాన్ మమ్దానీ సామాజిక కార్యకర్త. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య రమా దువాజీ(rama duwaji). ఓ డేటింగ్ యాప్తో పరిచయమై.. ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఎన్నికల సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో దూసుకెళ్లారు. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు.‘గుజరాత్’పై మమ్దానీ వీడియో వైరల్ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన 2002లో గుజరాత్లో జరిగిన ఘర్షణలపై మమ్దానీ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కడ ముస్లింలను అంతం చేసేందుకు కుట్ర జరిగిందని, చాలామందిని హత్య చేశారని మమ్దానీ ఆరోపించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులా మోదీ కూడా యుద్ధ నేరస్తుడేనంటూ మండిపడ్డాడు. మమ్దానీ వ్యాఖ్యలపై పలువురు భారతీయులతో పాటు అమెరికాలోని ప్రవాస భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్జీనియా గవర్నర్గా అబిగైల్ స్పాన్బెర్గర్
వర్జీనియా: అమెరికాలోని వర్జీనియా మేయర్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదయ్యింది. డెమొక్రాట్ అబిగైల్ స్పాన్బెర్గర్ మంగళవారం జరిగిన వర్జీనియా గవర్నర్ ఎన్నికల్లో గెలిచారు. రిపబ్లికన్ లెఫ్టినెంట్ గవర్నర్ విన్సమ్ ఎర్లే-సియర్స్ను ఓడించిన ఆమె 2026 మధ్యంతర ఎన్నికలకు వెళ్లే డెమొక్రాట్లకు కీలక విజయాన్ని అందించి, సరికొత్త చరిత్ర సృష్టించారు.కామన్వెల్త్కు నాయకత్వం వహించిన తొలి మహిళగా నిలిచిన అబిగైల్ స్పాన్బెర్గర్ ఇటీవలే పదవీ విరమణ చేసిన రిపబ్లికన్ గవర్నర్ గ్లెన్ యంగ్కిన్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఈ విజయంతో తాము కామన్వెల్త్లోని ప్రతి మూలకు ఒక సందేశాన్ని పంపామని, దేశవ్యాప్తంగా ఉన్న మా తోటి అమెరికన్లకు తమ సత్తా చూపామని స్పాన్బెర్గర్ రిచ్మండ్ తన ఉత్సాహభరిత ప్రసంగంలో పేర్కొన్నారు.మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ గజాలా ఎఫ్. హష్మీ లెఫ్టినెంట్ గవర్నర్ రేసులో గెలిచారు. ఈ పదవిని దక్కించకున్న తొలిమహిళగా హష్మీ నిలిచారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ(సీఐఏ) అధికారి అయిన స్పాన్బెర్గర్ ప్రచార సమయంలో దేశంలోని ఆర్థిక సమస్యలను ఎత్తిచూపారు. ఆమె అనుసరించిన వ్యూహం వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో ఇతర డెమొక్రాట్లకు ఒక నమూనాగా ఉపయోగపడనుంది.తన ప్రచారంలో స్పాన్బెర్గర్ .. అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా, ఆయన రూపొందించిన ఆర్థిక ప్రణాళికలను ఎండగట్టారు. ఆమె రిపబ్లికన్ మద్దతు కలిగిన ప్రాంతాలతో సహా వర్జీనియా అంతటా ప్రచారం సాగించారు. యూఎస్ ప్రభుత్వ షట్డౌన్, సమాఖ్య ఉద్యోగులున్న వర్జీనియాపై దాని ప్రతికూల ప్రభావాన్ని స్పాన్బెర్గర్ సమర్థవంతంగా వివరించారు. ఆమె అనుసరించిన ప్రచార విధానం డెమొక్రాట్లను ఏకం చేయడంలో సహాయపడింది.
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..
వాషింగ్టన్: అమెరికా (USA)లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కెంటకీ విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో కార్గో విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అమెరికాలోని లూయిస్విల్లేలో టేకాఫ్ సమయంలో యూపీఎస్ కార్గో విమానం కుప్పకూలింది. యూపీఎస్ ఫ్లైట్ నంబర్ 2976 విమానం హోనులులుకు మంగళవారం సాయంత్రం (అమెరికా కాలమానం) 5.15కు బయల్దేరగా ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధ్రువీకరించింది. ప్రమాదం కారణంగా ముగ్గురు మరణించినట్టు వెల్లడించింది. Please pray for my hometown of Louisville, KentuckyA plane crashed near the airport there pic.twitter.com/q2QaNOmfFH— Tim Jones (@TimothyJones92) November 4, 2025ఇక, విమానం గాల్లోకి ఎగురుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి కుప్పకూలిపోయింది. విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. కాగా, ఈ విమానం మెక్డోనెల్ డగ్లస్ ఎండీ-11 రకానికి చెందినది. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. WATCH: UPS plane (UPS2976) crashes after takeoff from Louisville Muhammad Ali International Airport.Video validated by the Network pic.twitter.com/h9FtsLRumc— Faytuks Network (@FaytuksNetwork) November 4, 2025
జాతీయం
బాలిక అబద్ధం.. ‘పోక్సో’కు అమాయకుడు బలి
ప్రేమ, నమ్మకం, ద్రోహం... ఈ మూడింటి మధ్య నలిగిపోయిన ఒక యువకుని దీనగాథ ఇది. అబద్ధపు ఆరోపణల కారణంగా ఏడాదిపాటు జైలు జీవితం గడిపిన ఆ యువకుడి కేసు.. 'పోక్సో (POCSO) చట్టం' దుర్వినియోగానికి ఒక ఉదాహరణగా నిలిచింది. తన స్నేహితురాలిని ఆమె ప్రియుడు తప్పుదారి పట్టిస్తున్నాడని భావించి, అతనితో స్నేహం మానుకోవాలని చెప్పినందుకు ఆ యువకుడు ఏకంగా లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు.ఈ కేసులో బాధితుడు అయిన యువకుడు తన స్నేహితురాలి ప్రియుడి ప్రవర్తన సరిగా లేదని గుర్తించాడు. అతనితో తిరగడం ప్రమాదకరమని భావించి, ఆ మైనర్ బాలికను పలుమార్లు హెచ్చరించాడు. అతనికి దూరంగా ఉండమని సలహా ఇచ్చాడు. అయితే అప్పటికే అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకున్న ఆ బాలికకు ఈ సలహా నచ్చలేదు. సరిగ్గా ఇదే సమయంలో, ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులకు ఆమె ప్రేమ వ్యవహారం తెలిసింది. దీంతో ఆమె తన ప్రియుడిని రక్షించేందుకు, చట్టపరమైన సమస్యల నుంచి తన ప్రియుడిని తప్పించేందుకు అతి దారుణమైన నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడి స్థానంలో తనకు సలహా ఇచ్చిన నిర్దోషి అయిన స్నేహితుడిపైనే తప్పుడు పాక్సో(POCSO) కేసు పెట్టింది. ఆ బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. అబద్ధపు సాక్ష్యం కారణంగా ఆ యువకుడు ఏకంగా ఒక సంవత్సరం పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆరోపణల తీవ్రత దృష్ట్యా బెయిల్ లభించడం కూడా కష్టమైంది.ఏడాది తర్వాత నిర్దోషిగా విడుదలఒక ఏడాది పాటు చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, ఈ కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. కోర్టు విచారణలో, సాక్ష్యాధారాలు, బాలిక వాంగ్మూలంలోని పరస్పర విరుద్ధ అంశాలను న్యాయవాది నిరూపించగలిగారు. చివరకు నిజం బట్టబయలైంది: బాలిక తన ప్రియుడిని రక్షించేందుకు, తనపై వచ్చిన ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు కుట్రకు పాల్పడిందని రుజువైంది. దాంతో కోర్టు ఆ నిర్దోషి అయిన యువకుడిని తక్షణమే విడుదల చేసింది. అయితే ఆ యువకుడు అంతవరకూ కోల్పోయిన కాలాన్ని, సామాజిక గౌరవాన్ని తిరిగి ఎవరూ ఇవ్వలేరు. మరోవైను ఈ ఘటన అతని భవిష్యత్తుకు అడ్డుగోడగా మారింది.న్యాయవ్యవస్థ ముందు ప్రశ్నలు Innocent Minor boy spent 1 YEAR in Jail in false POCSO case filed by his friend because he used to ask her to avoid her boyfriend who was of wrong behaviour Minor girl had sex with BF but implicated friend when family came to know of her affairpic.twitter.com/I6Yj3xbfN0— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) November 4, 2025 ప్రేమ కోసం అబద్ధపు సాక్ష్యం చెప్పి, ఒక నిర్దోషి జీవితాన్ని నాశనం చేసిన ఆ బాలికకు ఎందుకు శిక్ష పడలేదు? అలాగే ఆ బాలిక ఇటువంటి కుట్రకు పాల్పడేందుకు ఆమె ప్రియుడు సహకరించివుంటే అతనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అమాయక యువకుడిపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు, చట్టం రక్షణగా ఉండాల్సింది పోయి, ఏడాదిపాటు శిక్షకు కారణంగా నిలిచింది. ఈ ఘటన పాక్సో(POCSO) లాంటి కఠిన చట్టాల దుర్వినియోగం ఎలా జరుగుతుందో తెలియజేస్తుంది. మైనర్ల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలు, ఈ విధంగా దుర్వినియోగం కావడం సమాజానికి మంచిది కాదని పలువురు అంటున్నారు. ఈ తరహా తప్పుడు కేసుల వల్ల నిజమైన బాధితులు అవమానానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా తప్పుడు ఫిర్యాదులు చేసే మైనర్లను, వారి వెనుక ఉన్నవారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పాక్సో (POCSO) చట్టంలో తగిన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. హర్యానాలోని పానిపత్లో జరిగిన ఒక ఉదంతం ఆధారంగా ఈ కథనం రాయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ట్విట్టర్లో దీపికా నారాయణ్ భరద్వాజ్ పేరుతో షేర్ అయిన సోస్టు జత చేయడం జరిగింది. దీనిలో న్యాయవాది తమన్నా కాదియాన్ ఈ అంశంపై మాట్లాడటాన్ని చూడవచ్చు.ఇది కూడా చదవండి: భారత్ అణు పరీక్షలు?.. పాక్కు దబిడి దిబిడే!
హర్యానాలో 25 లక్షల ఓట్లు చోరీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓటు చోరీ ఆరోపణలతో పాటు ‘హెచ్’ ఫైల్స్ను బహిర్గతం చేశారు. హర్యానాలో 25,41,144 లక్షల ఓటు చోరీ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ‘మా దగ్గర ‘హెచ్’ ఫైల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఓటు చోరీ ఎలా జరిగిందో దానిలో ఉంది. ఇది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరుగుతోందని అనుమానిస్తున్నాం. హర్యానాలోని మా అభ్యర్థులు.. ఏదో తప్పు జరిగిందంటూ ఫిర్యాదులు విరివిగా చేశారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు.హర్యానా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించిన రాహుల్ .. కాంగ్రెస్ విజయాన్ని బీజేపీ విజయంగా మార్చేందుకు ఒక ప్రణాళికను అమలు చేశారని ఆరోపించారు. హర్యానాలో 25 లక్షల ఓట్లు చోరీ అయ్యాయని, ఇందులో 5.21 లక్షల నకిలీ ఓటర్లు, 93,174 చెల్లని ఓటర్లు, 19.26 లక్షల బల్క్ ఓటర్లు ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు. తాను చెబుతున్న దానికి 100 శాతం రుజువు ఉందని, వారు కాంగ్రెస్ విజయాన్ని ఓటమిగా మార్చడానికి వ్యవస్థాగత తారుమారుకు పాల్పడ్డారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.హర్యానాలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 25 లక్షల మంది నకిలీ ఓటర్లు అని విలేకరుల సమావేశంలో రాహుల్ తెలిపారు. తన బృందం 5.21 లక్షల నకిలీ ఓటరు నమోదులను బయటపెట్టిందని, హర్యానాలో ప్రతి ఎనిమిది మంది ఓటర్లలో ఒకరు నకిలీవారున్నారు. ఓటరు జాబితాలో వ్యత్యాసాలను చూపించే స్లయిడ్లను రాహుల్ ప్రదర్శించారు. ఓటు చోరీ కోసం బ్రెజిలియన్ మోడల్ వాడారని ఆరోపించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను అణిచివేసేందుకు బీజేపీ ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్ను నిర్వహిస్తోందని రాహుల్ ఆరోపించారు.అన్ని ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ విజయాన్ని సూచించాయని గుర్తుచేశారు. హర్యానా చరిత్రలో తొలిసారిగా, పోస్టల్ బ్యాలెట్లు వాస్తవ ఓట్లతో సరిపోలలేదని, ఇది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని, కాంగ్రెస్ అఖండ విజయాన్ని ఓటమిగా మార్చడానికి ఒక ప్రణాళికను అమలు చేశారని రాహుల్ ఆరోపించారు. అయితే ఎన్నికల కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ వాదనలను తోసిపుచ్చాయి. రాష్ట్ర ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా “సున్నా అప్పీళ్లు” దాఖలు అయ్యాయన్నారు.ఇది కూడా చదవండి: నెహ్రూను గుర్తు చేసుకున్న మమ్దానీ
యూపీలో రైలు ప్రమాదం.. భక్తులు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లో విషాదకర ఘటన వెలుగుచూసింది. రైలు పట్టాలు దాటుతున్న యాత్రికులను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు మృతి చెందినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. వివరాల ప్రకారం..మీర్జాపూర్లోని చునర్ రైలు స్టేషన్లో ప్రయాణీకులను రైలు ఢీకొట్టింది. ప్రయాగ్రాజ్ నుంచి వచ్చిన భక్తులు రైలు ఆగిన వెంటనే ప్లాట్ఫామ్ ఉన్న వైపు కాకుండా పట్టాలు ఉన్న వైపునకు దిగారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న రైలు.. పట్టాలు దాటుతున్న భక్తులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్టు తెలిసింది. ప్రమాద కారణంగా రైల్వేస్టేషన్లో పట్టాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించి సహాయక చర్యలకు ఆదేశించారు. Aleast six killed at Chunar Railway Station in Mirzapur on Wednesday morning, when several pilgrims were run over by the Kalka Express while crossing the railway tracks. The victims were on their way to Varanasi to take part in Kartik Purnima festivities. pic.twitter.com/df6PZSCmw5— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) November 5, 2025ఇదిలా ఉండగా.. వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. నిన్న ఛత్తీస్గఢ్లోని బిలాస్పుర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ గూడ్సు రైలును ప్రయాణికుల రైలు వెనుకనుంచి ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. ఇద్దరు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రైలు కోర్బా జిల్లాలోని గెవరా నుంచి బిలాస్పుర్కు వెళ్తుండగా.. గటోరా- బిలాస్పుర్ స్టేషన్ మార్గమధ్యంలో ప్రమాదం చోటుచేసుకుంది.🚨 Mirzapur Accident | Tragic Incident in Chunar on Kartik Purnima — 4 Devotees Killed After Being Hit by Train While Crossing Railway Tracks Tribute 📷 #Mirzapur #Chunar #KartikPurnima #UttarPradesh #TrainAccident #BreakingNews #IndiaNews https://t.co/SKsHmX4r07 pic.twitter.com/i3crPQq0Hz— Indian Observer (@ag_Journalist) November 5, 2025ఘటనా స్థలంలో రైల్వేశాఖ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రయాణికుల రైలు రెడ్ సిగ్నల్ను దాటి ముందుకు వెళ్లడంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే బోర్డు ప్రాథమికంగా అంచనా వేసింది. మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.లక్ష సాయం అందించనున్నట్లు తెలిపింది.
కుల రాజకీయాలే.. పొలిటికల్ పార్టీలకు ఇంధనం..!
కుల వ్యవస్థ..! ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని ట్యాగ్ భారత్కు మాత్రమే సొంతం..! ఇంకా చెప్పాలంటే.. భారత్లో ఓ వ్యక్తి పుట్టగానే.. అతనికి కులం అనే ట్యాగ్ని తగిలించేస్తారు..! కన్ను తెరిస్తే కులం.. కన్ను మూస్తే కులం.. జీవితమంతా కులం కులం కులం..! ఆ కులమే ఇప్పుడు రాజకీయాలకు మూలాధారమైంది. ముఖ్యంగా బిహార్ లాంటి కడు పేద రాష్ట్రాల్లో రాజకీయాలను సైతం కులం మాత్రమే శాసిస్తోంది. బిహార్ వెనకబాటుకు కారణం నిరుద్యోగితో.. పరిశ్రమల లేమి కారణం కాదు..! కేవలం కుల రాజకీయాలే ఆ రాష్ట్ర పరిస్థితికి కారణమనేది నిర్వివాదాంశం..! ప్రజలు కులాల వారీగా చీలిపోవడమే ఆ రాష్ట్ర ఆర్థిక దుస్థితికి కారణం..! ‘ధనమేరా అన్నిటికీ మూలం’ అని ఓ సినీ కవి అన్నాడు.. బిహార్లో మాత్రం ‘కులమేరా అన్నిటికీ మూలం’ అనే పరిస్థితులు ఉన్నాయి. కులగణన పేరుతో సర్వే నిర్వహించి చూపించిన తొట్టతొలి రాష్ట్రం కూడా బిహారే..! ఇక్కడ ప్రజలు కులం పేరుతో విడిపోతారు. రాజకీయనాయకులు కులం అనే అంశాన్ని ఓటు బ్యాంకుగా మలచుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. బిహార్లో కులం అనేది ఒక పదం కాదు.. ప్రజల మధ్య ఒక గోడ. ఈ కులం ట్యాగ్ కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడతే.. మరికొందరికి అవకాశాలను మూసివేస్తోంది. భారతదేశంలోనే కుల రాజకీయాలు అత్యంత ప్రభావం చూపే రాష్ట్రం బిహార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.2023లో బిహార్ కులగణన తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ రాష్ట్ర జనాభా 13 కోట్లు అయితే.. వీరిలో అత్యంత వెనుకబడిన వర్గాలు(EBC) 36%, ఇతర వెనుకబడిన వర్గాలు(OBC) 27%, ఎస్సీ ఎస్టీలు 19%, ముస్లింలు 17%, అగ్రవర్ణాలుగా ఉన్న బ్రాహ్మణులు, రాజ్పూత్లు, భూమిహార్లు, బనియాలు 15% ఉన్నట్లు తేలింది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే.. బిహార్లో ప్రతీ 10 మంది ఓటర్లలో 8 మంది వెనకబడిన వర్గాలకు చెందినవారే..! ఇప్పుడు ఊహించండి.. కులం ఓ బలమైన గోడగా ఉన్న బిహార్లో ఎన్నికలు ఎలా ఉంటాయో..? అక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా.. నాయకుడు అయినా.. కులం అనే పజిల్ని అర్థం చేసుకోకపోతే.. విజయం కాదు కదా.. విజయపుటంచులను చేరడం కూడా అసాధ్యమే..! అందుకే.. బిహార్లో ప్రతి రాజకీయ నాయకుడి ప్రసంగం, ప్రతి కూటమి, అభ్యర్థులకు ఇచ్చే ప్రతి టికెట్ కుల సమీకరణల చుట్టే తిరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..!కలసికట్టుగా ఉన్నారా??బిహార్లో ఓబీసీలంతా కలసి కట్టుగా ఉన్నారా? ఈ ప్రశ్నకు ఇదమిత్థంగా కూడా అవుననే సమాధానం చెప్పలేం. ఈబీసీల్లోనే 125 వేర్వేరు సమూహాలున్నాయి. దళితులు పాస్వాన్, ముసహార్, చమార్లుగా చీలిపోయారు. ఓబీసీలు కూడా యాదవ, కుర్మీ, కోయిరీ, ఈబీసీలుగా విడిపోయారు. వీరంతా వేర్వేరు రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారిపోయారు. బిహార్లో కులాలంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాదిరిగా సామాజిక గుర్తింపు కాదు..! రాజకీయ ఆయుధం మాత్రమే!. ఎన్నికల్లో అభ్యర్థి ఎవరు? ఎవరు గెలవాలి? ఎవరిని ఓడించాలి? అన్నదాన్ని కూడా ఇక్కడ కులమే నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రతి ఎన్నిక.. ప్రతి కూటమి.. ప్రతి నినాదం కుల గణాంకాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ‘ఈ ప్రభుత్వం ఏం చేసింది?’ అనే ప్రశ్న ఉత్పన్నమైతే.. బిహార్లో మాత్రం.. ‘ఈ ప్రభుత్వం ఏ కులానికి చెందినది?’ అనే ప్రశ్న వినిపిస్తుంది. భారత్లో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతున్నా.. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యానికి మన దేశం కేంద్ర బిందువు అయినా.. బిహార్లో మాత్రం కులమే అత్యంత శక్తిమంతమైన రాజకీయ పార్టీగా ఉంది.90వ దశకం నుంచి..బిహార్ కుల వ్యవస్థను.. కులాధిపత్యాన్ని అర్థం చేసుకోవాలంటే.. 90వ దశకానికి, అంటే.. మండల్ కమిషన్ యుగానికి వెళ్లాల్సిందే..! అప్పటి ప్రధాని వీపీ సింగ్ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ఒక్క నిర్ణయంతో భారత రాజకీయాల డీఎన్ఏ మారిపోయినట్లయింది. వెనకబడిన వర్గాల కోసం ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించగానే.. ఓ విప్లవానికి కేంద్ర బిందువుగా బిహార్ మారింది. లాలూ ప్రసాద్ యాదవ్ అణగారిన వర్గాల స్వరంగా ఎదిగారు. ఆయన తన రాజకీయ సామ్రాజ్యాన్ని ‘ఎం-వై సమీకరణం’.. అంటే ముస్లింలు, యాదవులతో నిర్మించారు. ఆ తర్వాత నితీశ్ కుమార్ వచ్చారు. ఆయన కుర్మీలు, ఇతర అత్యంత వెనకబడిన వర్గాల తరఫున మాట్లాడారు. 2023లో కులగణన చేయించింది కూడా ఆయన సర్కారే. కేంద్రం కులగణనను వ్యతిరేకిస్తే.. ఆయన స్వతంత్రంగా సర్వే నిర్వహించారు. దాంతో.. బిహార్లో ‘కుల గుర్తింపుల యుద్ధం’ మరింత ముదిరింది.కులాల వారీగా పార్టీలుబిహార్లో రాజకీయ పార్టీలు కులాల వారీగా ఉన్నాయి. కులగణనతో వచ్చిన లెక్కల ప్రకారం బిహార్ ఎన్నికల్లో ఎవరూ.. ఏ పార్టీ ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కూడా కుల సమీకరణాలతో ముడిపడి ఉంటుంది. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ యాదవులు, ముస్లిం ఓటు బ్యాంకుతో ముందుకు వెళ్తోంది. జనతాదళ్ (యూ) కుర్మీలు, ఈబీసీలపై ఆధారపడుతోంది. బీజేపీ అయితే.. అగ్రవర్ణాలు, పట్టణ ప్రాంతాల్లోని హిందువులపై ఆధారపడి ఉంది. అంటే.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా.. బిహార్లో మాత్రం రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను కాకుండా.. కులాలను నమ్ముకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల విశ్లేషకులు కూడా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థి కులాన్ని బట్టి గెలుపోటములను విశ్లేషిస్తారు. అంటే.. ఓటర్లు కూడా కులం ఆధారంగానే ఓట్లు వేస్తారే తప్ప.. పార్టీల సిద్ధాంతాలను బట్టి కాదని స్పష్టమవుతోంది. అంటే.. గ్రామంలో పరిస్థితులు.. బడుల్లో టీచర్ల నియామకాలు, భూవివాదాల పరిష్కారం వంటి అంశాలు కాకుండా.. తమ కులస్థుడు ఎమ్మెల్యే అయితే.. తమ మాట వింటాడనే భావన ఓటర్లలో బలంగా నాటుకుపోయింది. బిహార్లో రాజకీయ నాయకులు, పార్టీలు నియోజకవర్గాల వారీగా కులాల మ్యాప్ను అధ్యయనం చేయడం పరిపాటిగా మారింది. ఏ కులం వారు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటారు? ఏ అభ్యర్థి అయితే ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలడు? అనే లెక్కలను సమతుల్యంగా ఉండేలా చూసుకుంటూ.. కూటములు కట్టడం ఆనవాయితీగా మారింది. ఈ విషయంలో కాస్త తెలివిగా ఆలోచించే నితీశ్కుమార్ తరచూ కూటములను మార్చడం వెనక కుల సమీకరణాలే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన అయితే ఆర్జేడీ.. లేదే బీజేపీ అన్నట్లుగా మిత్రపక్షాలను మార్చేస్తుంటారు. అంటే.. బిహార్లో సిద్ధాంతాలను కాకుండా.. కుల సమీకరణాలను నమ్ముకోవాలనే విషయాన్ని ఆయన చక్కగా ఒంటబట్టించుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ప్రతీ నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక కుల గణాంకాల చుట్టే తిరుగుతుండడం గమనార్హం..! అంటే.. అభ్యర్థి ప్రజాసేవకుడా? ప్రజలకు మంచి సేవ చేస్తూ.. పాలనను అందిస్తాడా? అనే విషయాన్ని పక్కనబెట్టి.. అతని కులం ఏది అనేదే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తోంది.ఆ నియోజకవర్గాల్లో మార్పు..!కుల రాజకీయాల వ్యవహారం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం తగ్గుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పట్నా, గయా, ముజఫర్పూర్ వంటి పట్టణాల్లో కొత్త ఓటర్లు తమ పంథాను మార్చుకున్నట్లు వివరిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో అక్షరాస్యత పెరగడం, యువ ఓటర్లు బిహార్ వెలుపల చదువుకున్న వారు కావడం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో 40% యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెల్లడం కూడా ఈ మార్పునకు కారణమంటున్నారు. ఢిల్లీలో, తమిళనాడులో రోజుకూలీలుగా.. ముంబైలో రిక్షావాలాలా.. సూరత్లోని కర్మాగారాల్లో కార్మికులుగా పనిచేస్తున్న యువత.. మార్పును కోరుకుంటోందని స్పష్టమవుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. బిహార్ వెలుపల ఉన్నంత కాలం వారు కుల ఛట్రం నుంచి బయట ఉన్నా.. తిరిగి రాష్ట్రానికి వచ్చేసరికి వెనక్కి వెళ్లే ప్రమాదం కూడా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే.. కులం అనేది బిహార్ వెలుపల అదృశ్యమైనా.. రాష్ట్రంలోకి వచ్చేసరికి తిరిగి పుంజుకుంటుందన్నట్లే..! అయితే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ వర్గం.. ఇప్పుడు కులాలుగా విడిపోతుందా? సిద్ధాంతాలకు లోబడి ఓట్లు వేస్తుందా? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి.మార్పునకు నాంది పలుకుతున్న మహిళలు.. బిహార్ మహిళలు మాత్రం కులం విషయంలో వ్యతిరేకంగా ఉన్నట్లు తాజా పరిణామాలు, గత ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. నితీశ్ కుమార్ సర్కారు పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది. మద్య నిషేధాన్ని అమలు చేసింది. దీని ఫలితంగా మహిళలు మాత్రం స్వతంత్రంగా ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది. పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడంతో ఈ సారి మార్పు కనిపించే అవకాశాలుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2020 ఎన్నికల్లోనూ మహిళల ఓటింగ్ 60 శాతాన్ని దాటింది. ముఖ్యంగా మహిళా ఓటర్లు కులం కోసం కాకుండా.. భద్రత, విద్య, సమాజంలో గౌరవం కల్పించే అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా బిహార్ ఓటర్లు కులాల వలయంలో చిక్కుకుని, ఓటుహక్కును వినియోగించుకుంటారా? అభివృద్ధి గురించి ఆలోచిస్తారా? విద్యావంతులు, యువత, మహిళలు, వలస కార్మికులు మార్పును తీసుకొస్తారా? ఈవీఎం బటన్ నొక్కడానికి ముందు ఒక ఆలోచన.. నొక్కేప్పుడు కులం ఆలోచనతో మళ్లీ వెనక్కి వెళ్తారా? కుల రాజకీయాలకు కేంద్ర బిందువు అని బిహార్కు ఉన్న అపవాదును తొలగిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే..! దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో రాయండి. - హెచ్.కమలాపతిరావు
ఎన్ఆర్ఐ
అమెరికాలో భార్యకు వేధింపులు ఎన్నారై భర్త అరెస్టు
భార్యపై గృహ హింసకు పాల్పడిన ఆరోపణలతో తిరుపతికి చెందిన NRI . జెస్వంత్ మనికొండ (36) ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ హింస మరియు కోర్టు రక్షణ ఉత్తర్వు ఉల్లంఘన ఆరోపణలపై కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ పోలీస్ డిపార్ట్మెంట్ (Milpitas Police Department–MPD) సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం అతణ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం ఎల్మ్వుడ్ కరెక్షనల్ ఫెసిలిటీకి తరలించారు. తరువాత బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది.గృహ హింస కేసుల్లో పోలీసులు, కోర్టులు వేగంగా స్పందిస్తేనే సత్వర న్యాయం జరుగుతుందని ఎన్జీవో ప్రతినిధి తరుణి పేర్కొన్నారు. ఇటువంటి కేసుల్లో బాధితులు ఆలస్యం చేయకుండా ధృవీకరించబడిన సహాయ సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఎన్ఆర్ఐ కుటుంబాలలో గృహ హింస బాధితులకు చట్టపరమైన సహాయం, రక్షణ వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గోల్డెన్ వీసా యువకుడి హఠాన్మరణం
చిన్న వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్లో భారతీయ విద్యార్థి (Indian Student) ఒకరు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. దీపావళి వేడుకల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అతడు మరణించినట్టు స్థానిక మీడియా 'గల్ఫ్ న్యూస్' వెల్లడించింది. మృతుడు కేరళకు చెందిన వైష్ణవ్ కృష్ణకుమార్ (18)గా గుర్తించారు. దుబాయ్లోని మిడిల్సెక్స్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం బీబీఏ మార్కెటింగ్ చదువుతున్నాడు. అతడికి యూఏఈ గోల్డెన్ వీసా (Golden Visa) ఉందని సమాచారం.దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీలో మంగళవారం జరిగిన దీపావళి వేడుకల్లో వైష్ణవ్ పాల్గొన్నాడు. సంబరాల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటు కారణంగా మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే వైష్ణవ్కు ఎటువంటి గుండె సమస్యలు లేవని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తదుపరి దర్యాప్తు జరుపుతోందని చెప్పారు.వైష్ణవ్ మృతదేహాన్ని కేరళకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని అతడి తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు తాను చూసుకుంటున్నట్టు దుబాయ్లోని వైష్ణవ్ బంధువు నితీశ్ 'ఖలీజ్ టైమ్స్'తో చెప్పారు. శుక్రవారం నాటికి వైష్ణవ్ మృతదేహం కేరళకు చేరుకుంటుందని భావిస్తున్నారు.రెండేళ్ల క్రితం స్వస్థలానికి..అలప్పుజ జిల్లా చెన్నితల పంచాయతిలోని కరాజ్మా ప్రాంతానికి చెందిన వైష్ణవ్ కుటుంబంలో దుబాయ్లో సెటిలయింది. వైష్ణవ్ తండ్రి కృష్ణకుమార్ 20 ఏళ్లుపైగా దుబాయ్లోని ఉద్యోగం చేస్తున్నారు. వైష్ణవ్, అతడి చెల్లెలు దుబాయ్లోనే పుట్టిపెరిగారని వారి బంధువు గోపి కర్ణవర్ తెలిపారు. అలప్పుజలో ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. వైష్ణవ్ చాలా తెలివైన కుర్రాడని చెప్పారు. వైష్ణవ్ కుటుంబం చాలా అరుదుగా స్వస్థలానికి వస్తుందని, రెండేళ్ల క్రితం వారు కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుక కోసం చివరిసారిగా ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు!సంతాప ప్రకటనవైష్ణవ్ కృష్ణకుమార్ మరణం పట్ల మిడిల్సెక్స్ యూనివర్సిటీ సంతాపం తెలిపింది. చిన్న వయసులోనే అతడు చనిపోవడం ఎంతో కలచివేసిందని సంతాప ప్రకటనలో పేర్కొంది. వైష్ణవ్ చదువుకున్న జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ కూడా సంతాపం ప్రకటించింది. వైష్ణవ్ ప్రతిభావంతుడైన విద్యార్థి అని కొనియాడింది. వైష్ణవ్ మరణంతో అతడి తండ్రి కృష్ణకుమార్, తల్లి విధు, చెల్లెలు వృష్టి విషాదంలో మునిగిపోయారు.
జార్జియాలో అద్భుతంగా 'చెంచు లక్ష్మి' నృత్య నాటిక
విద్యా సేవ కోసం సంస్కృతి పండుగ, హృదయాలను తాకిన “చెంచు లక్ష్మి” 2025 అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం, జార్జియాలోని కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్ ఒక అద్భుతమైన సాంస్కృతిక వేదికగా మారింది. నటరాజ నాట్యాంజలి కూచిపూడి డాన్స్ అకాడమీ నిర్వహించిన “చెంచు లక్ష్మి” నృత్య నాటిక, కళా పరిమళాలను విరజిమ్ముతూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ సౌత్ ఫోర్సిత్ కౌంటీ తోడ్పాటు అందించింది. కళను విద్యా సేవతో మిళితం చేస్తూ, సమీకరించిన నిధులను ఫోర్సిత్ కౌంటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (FCEF) కు అందజేశారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు కాంతివంతమైన మార్గం వేస్తుందనే సంకేతంగా నిలిచింది. వేదికపై దీపాల కాంతి, పూజా మంత్రాల నినాదం మధ్య వేడుక ప్రారంభమైంది. మంచినీటి వంటి స్వరంతో హర్షిణి చుండి మరియు శ్రీలేఖ ఆదుసుమిల్లి సమన్వయకర్తలుగా ప్రవేశించి కార్యక్రమాన్ని నడిపారు.మాలతి నాగభైరవ ఒక అందమైన వీడియో ద్వారా ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రేరణను వివరించారు — “కళ మనసును మేల్కొలుపుతుంది, విద్య భవిష్యత్తును వెలిగిస్తుంది” అనే మంత్రాన్ని ప్రతిధ్వనిస్తూ. తర్వాత దీపప్రజ్వలన కార్యక్రమంలో, ఫోర్సిత్ కౌంటీకి చెందిన ఎన్నో ప్రముఖులు ఒకచోట చేరారు రాన్ ఫ్రీమన్ (షెరీఫ్), విలియం ఫించ్ (సొలిసిటర్ జనరల్), ఆల్ఫ్రెడ్ జాన్ (బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ చైర్మన్),మైఖేల్ బారన్ (ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్), రినీ వెల్చ్ (రోటరీ క్లబ్ డైరెక్టర్), కళ్యాణి చుండి (HC Robotics – డైమండ్ స్పాన్సర్), భారత్ గోవింద (Assure Guru CEO), నీలిమ గడ్డమనుగు (నటరాజ నట్యాంజలి), శ్రీరామ్ రొయ్యాల (Zoning Board చైర్మన్).దీప కాంతుల జ్యోతి విరజిమ్మగా, వేదిక ఒక ఆధ్యాత్మిక చైతన్యంతో నిండిపోయింది. “చెంచు లక్ష్మి” — ప్రేమ, పరమాత్మకత, ప్రకృతి గాథకథ — దేవుడు నరసింహ స్వామి, భక్తి రూపిణి లక్ష్మి, మరియు అరణ్యాల గుండెల్లో పుట్టిన చెంచు లక్ష్మి మధ్య ఆధ్యాత్మిక ప్రేమగాథ.నల్లమల అడవుల సౌందర్యం, మనసుని తాకే సంగీతం, భక్తి పుష్టి తో నిండిన నాట్యరూపాలు — అన్నీ కలగలసిన ఆ అద్భుత నాటిక.నీలిమ గడ్డమనుగు దర్శకత్వంలో కళాకారులు నృత్యం, భావం, సంగీతం, కవిత్వం అన్నింటినీ మేళవించారు. తాళం, లయ, అభినయం — ప్రతి క్షణం కళా కాంతుల విరిసిన పుష్పంలా అనిపించింది.ఈ వేడుకకు 500 మందికి పైగా కళాభిమానులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.రాష్ట్ర ప్రతినిధులు టాడ్ జోన్స్ (District 25) మరియు కార్టర్ బారెట్ (District 24) ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. HC Robotics, Assure Guru వంటి సంస్థలు ప్రధాన స్పాన్సర్లుగా నిలిచి, విద్యా సేవకు తోడ్పాటును అందించాయి.వేదికపై సత్కారాలు, పుష్పగుచ్ఛాలు, ప్రశంసా ఫలకాలు అందజేయబడ్డాయి. ByteGraph వంటి సాంకేతిక బృందాలు కార్యక్రమాన్ని మల్టీమీడియా అద్భుతంగా మలిచాయి. నిర్వాహకుడు శ్రీరామ్ రొయ్యాల ,టాడ్ జోన్స్ ఈకార్యక్రమం విజయవంతంపై సంతోషం వ్యక్తం చేశారు.
Russia: హైదరాబాదీని రక్షించే ప్రయత్నాల్లో కేంద్రం
ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం రష్యా వెళ్లిన భారతీయులు.. బలవంతంగా సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అలా హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన ఓ వ్యక్తి చిక్కుకుపోగా.. అతన్ని రక్షించాలంటూ భాదిత కుటుంబం కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అహ్మద్(37) ఈ ఏడాది ఏప్రిల్లో రష్యాకు వెళ్లాడు. ఓ నిర్మాణ సంస్థలో భాగంగా పని ఉందంటూ ఏజెంట్ నమ్మబలికి అతన్ని అక్కడికి పంపించాడు. అయితే నెలపాటు అహ్మద్ ఏపని లేకుండా ఖాళీగా ఉన్నాడు. అడిగితే.. రేపో మాపో పని చెబుతామంటూ నిర్వాహకులు చెప్పసాగారు. ఈలోపు.. అహ్మద్లా ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం 30 మందిని జమ చేసి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ బలవంతంగా వాళ్లకు ఆయుధ శిక్షణ ఇప్పించి.. యుద్ధంలోకి దింపారు. వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఇదే అదనుగా అహ్మద్ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతని కాలికి గాయం కావడంతో రష్యా సైన్యానికి చిక్కాడు. యుద్ధం చేయాల్సిందేనని, లేకుంటే తామే చంపేసి డ్రోన్ దాడుల్లో చనిపోయినట్లు చిత్రీకరిస్తామని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక రష్యా తరఫున ఉక్రెయిన్ యుద్ధంలో అహ్మద్ పాల్గొంటున్నాడు. అయితే తన దగ్గర ఉన్న ఫోన్తో జరిగిందంతా ఓ సెల్ఫీ వీడియోగా తీసి భార్య అఫ్షా బేగంకు పంపాడు. అందులో.. తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ వివరించాడు. Russia mein phanse Hyderabad ke Mohammad Ahmad aur Haryana wa Rajasthan ke Anoop Kumar, Manoj Kumar aur Sumit Kumar ko jald se jald Bharat wapas laane ke liye AIMIM Party ki musalsal koshish. pic.twitter.com/U2dg1OJuez— Asaduddin Owaisi (@asadowaisi) October 22, 2025నాతో పాటు ఉన్న 26 మంది మేం యుద్ధంలో పాల్గొనమని చెప్పాం. అందులో నలుగురు భారతీయులు ఉన్నారు. వాళ్లు నా మెడపై తుపాకీ పెట్టి.. యుద్ధం చేస్తావా? చస్తావా? అని బెదిరించారు. నా కాలికి గాయమైనా కనికరించకుండా హింసించారు. ఇప్పటికే 17 మంది మరణించారు. అందులో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. ఉద్యోగాల పేరిట బలవంతంగా ఈ నరకంలోకి మమ్మల్ని లాగారు. ఎట్టిపరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడకు పంపిన ఏజెంట్ను(ముంబైకి చెందిన కన్సల్టెన్సీ) వదలొద్దు అని అహ్మద్ ఆ వీడియోలో చెప్పాడు.ఈ వీడియో ఆధారంగా అహ్మద్ భార్య అఫ్షా బేగం కేంద్ర విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. తన భర్త తమ కుటుంబానికి ఆధారమని, ఆయన్ని రక్షించాలని విదేశాంగ మంత్రి జై శంకర్ను ఉద్దేశిస్తూ వేడుకుంది. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సైతం కలిసి సాయం చేయాలని కోరింది. దీంతో.. ఆయన అహ్మద్ను వెనక్కి రప్పించాలంటూ కేంద్రానికి, రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. అహ్మద్ భార్య, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ విజ్ఞప్తులతో కేంద్రం కదిలింది. అహ్మద్ గురించి వివరాలు సేకరించి విడిపించే ప్రయత్నం చేస్తామని మాస్కోలోని భారత రాయబార సిబ్బంది తడు మాము(Tadu Mamu) హామీ ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని, వాళ్ల కుటుంబాలతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతోంది.
క్రైమ్
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
వనపర్తి: తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిందో భార్య. ఆపై మృతదేహాన్ని మాయం చేసేందుకు సినీ ఫక్కీలో పథకం రచించింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. వనపర్తి పట్టణంలోని గణేశ్నగర్ కాలనీకి చెందిన కురుమూర్తి, కె.నాగమణి భార్యాభర్తలు. కొన్నాళ్లుగా నాగమణి ఎన్.శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే తమ బంధానికి కురుమూర్తి అడ్డొస్తున్నాడని.. ఎలాగైనా హతమార్చాలని పథకం రచించారు. అందులో భాగంగా గతనెల 25న ఇంట్లోనే అతడికి మద్యం తాగించారు. ఆ తర్వాత తాడును గొంతుకు బిగించి హతమార్చారు. మృతదేహాన్ని మాయం చేసేందుకు ఓ కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నారు. ఇక్కడి నుంచి శ్రీశైలం సమీపంలోని కృష్ణానది వద్దకు చేరుకొని మృతదేహాన్ని నీటిలో పడేశారు. ఈ క్రమంలో కురుమూర్తి కనిపించడం లేదని అతడి సోదరుడు గతనెల 28న పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టగా, ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. కృష్ణానదిలో మూడు రోజులపాటు గాలించి శవాన్ని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక ఆధారాలతో హత్య కేసును ఛేదించి.. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. 72 గంటల్లో హత్య కేసును ఛేదించిన సీఐ కృష్ణతో పాటు ఎస్ఐలు, కానిస్టేబుల్స్ను ఎస్పీ అభినందించారు.
అమలాపురంలో మళ్లీ గ్యాంగ్వార్?
అమలాపురం టౌన్: ప్రశాంతంగా ఉండే అమలాపురం పట్టణంలో దాదాపు పదేళ్ల తర్వాత రౌడీల మధ్య గ్యాంగ్ వార్ మళ్లీ మొదలవుతోందా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. పట్టణంలోని కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీనివాస్ కిరాతక హత్యతో ఈ సందేహాలకు బలం చేకూరుతోంది. గతంలో పట్టణంలో రౌడీ షీటర్ల మధ్య కోల్డ్ వార్ నడిచేది. ఈ క్రమంలో ఘర్షణలు, గొడవలు జరిగేవి. వాటిన్నటికీ స్వస్తి చెప్పి ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న పట్టణంలో శ్రీనివాస్ హత్య కొత్త కలకలం సృష్టిస్తోంది. శ్రీనివాస్ తొలుత అదృశ్యమై ఆ తర్వాత కిడ్నాప్, కిరాతకంగా హత్యకు గురైన ఘటనతో రౌడీల గ్యాంగ్వార్ సంకేతాలు కనిపిస్తున్నాయి. పదేళ్ల కిందట అప్పటి సీఐ పట్టణంలో ఆరుగురు రౌడీలను గుర్తించి వారే గ్యాంగ్లు నిర్వహిస్తున్నారని నిర్ధారించారు. ఆ ఆరు గ్యాంగ్లపై కేసులు నమోదు చేసి అరెస్ట్లు చేశారు. శ్రీనివాస్ దారుణ హత్య నేపథ్యంలో ఇప్పుడు పట్టణంలో మళ్లీ ఘర్షణ వాతావరణం ఉత్పన్నమవుతుందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితులైన పట్టణానికి చెందిన మాజీ రౌడీ షీటర్ గంగుమళ్ల కాసుబాబు, అడబాల శంకర్, సలాది రాంబాబు (అప్పన్న), భాస్కర్ల ప్రసాద్ (డ్రైవర్), అనిల్ (రావులపాలెం)లు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని ఐదు పోలీసు బృందాలు నాలుగు రాష్ట్రాల్లో గాలించి పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో మరికొంత మందిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు పోలీసుల విచారణ, దర్యాప్తు తీరును బట్టి తెలుస్తోంది.ఆడియోను వైరల్ చేసిన ఆ ఇద్దరి పాత్ర ఏమిటి? హత్యకు ముందు కాసుబాబు, మృతుడు శ్రీనివాస్ మధ్య ఫోన్లో జరిగిన సంభాషణ ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ అయింది. వారి వాగ్వాదంలో బండ బూతులు దొర్లడంతో ఆ మాటలే కక్షకు దారి తీసి హత్యకు పురిగొల్పాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేయడానికి మరో మాజీ రౌడీïÙటర్తోపాటు ప్రధాన నిందితుల్లో ఒకరు ప్రధాన కారణమని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఎందుకు ఆడియోను వైరల్ చేశారు?, ఈ హత్యకు ఎందుకు వీరు ప్రేరేపించారనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
భార్య పీక నొక్కి హత్య
తూర్పు గోదావరి జిల్లా: భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. మద్యంకు బానిసైన భర్త వేధింపులు ఆఖరికి అతనే యముడై భార్య ప్రాణాలు తీసిన విషాద ఘటన యానాంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం స్ధానిక బళ్లావారివీధిలో నివాసం ఉంటున్న పెమ్మాడి దీనా(26)ను ఆమె భర్త పెమ్మాడి నాని సోమవారం రాత్రి పీక నొక్కి హత్య చేశాడని ఎస్సైలు పునీత్రాజ్, శేరు నూకరాజు తెలిపారు. గుత్తెనదీవికి చెందిన పెమ్మాడి నానితో దీనాకు వివాహం అయ్యింది. వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. అయితే కొన్నాళ్లు కాపురం సజావుగా సాగిన అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. యానాం సబ్కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. భర్త నాని సరిగా పనికి వెళ్లకుండా, మద్యం తాగుతూ తిరుగుతుండేవాడని దీంతో విరక్తి చెందిన భార్య దీనా నాలుగు నెలల క్రితం యానాంలో బల్లావారివీధిలో గృహం అద్దెకు తీసుకుని విడిగా ఉంటోందన్నారు. ఇంటర్ వరకు చదువుకున్న ఆమె కుటుంబ పోషణకు టైలరింగ్ చేసేంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త నాని కొద్ది రోజుల క్రితం దీనా ఉంటున్న ఇంటికి వచ్చి తాను బాగా చూసుకుంటానని, నీవు లేకుండా ఉండలేనని ఆమెను నమ్మించాడు. మళ్లీ మద్యం తాగి వచ్చి భార్యను కొట్టడమే కాక ఆమె పట్ల అనుమానం వ్యక్తం చేసి వేధింపులకు గురి చేసేవాడు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి భోజనం చేశాడు. అనంతరం తీవ్రంగా కొట్టి పీకనొక్కి చంపేసి అనంతరం ఆమె మృతదేహాన్ని నిద్రపోతున్న ఆరేళ్ల పాప వద్ద ఉంచి అతను పరారయ్యాడు. మంగళవారం ఉదయాన్నే నిద్ర లేచిన పాప పక్కనే ఉన్న తల్లి మృతదేహాన్ని చూసి స్థానికులకు తెలపగా వారు యానాం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ వరదరాజన్ ఆదేశాల మేరకు ఎస్సై పుష్పరాజ్ ఆధ్వర్యంలో రెండు బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ మేజి్రస్టేట్కు సమాచారం అందించినట్లు తెలిపారు.
జగిత్యాల జిల్లాలో కిడ్నాప్ కలకలం
జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాంపల్లి వద్ద కిడ్నాప్ కలకలం రేపుతుంది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ ఘటనపై కూతురు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక.. వెల్గటూర్ మండలం రాజక్క పల్లె గ్రామానికి చెందిన మర్రి రాకేష్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇక, పెద్దలను ఎదిరించి ఈ ఏడాది జూలై 27న ప్రియాంకా, రాకేష్ వివాహం చేసుకున్నారు.అయితే, రాకేష్ దళితుడైన కారణంగా ప్రియాంకా తల్లిదండ్రులు ఈ సంబంధాన్ని వ్యతిరేకించారు.. అలాగే, ప్రియాంక కడుపుతో ఉండగా హాస్పిటల్లో చూపిస్తామని నమ్మించిన తల్లిదండ్రులు.. హాస్పిటల్కి చూపించి తిరుగు ప్రయాణంలో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానికుల సహాయంతో ప్రియాంక తప్పించుకుంది. ఈ విషయంపై తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ తల్లిదండ్రులతో తనకు తన భర్త రాకేష్కు ప్రాణహాని ఉందని కంప్లైంట్లో తెలిపింది. ఈ ఘటనపై ప్రియాంకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వీడియోలు
అంతుచిక్కని రహస్యం.. విశ్వంలో ఓ భారీ ఆకారం కదలిక
పులివెందులలో మెడికల్ కాలేజీ లేకుండా చేయాలి..!
అంబేద్కర్ విగ్రహంపై రెడ్ బుక్ రాజ్యాంగం
బీహార్ తొలి విడత పోలింగ్ ప్రారంభం
రోడ్డు ప్రమాదాల్లో భారత్ రెండో స్థానం!
నేడు YSRCP విద్యార్ధి విభాగం నేతలతో YS జగన్ భేటీ
చంద్రబాబుకి బిగ్ షాక్.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
జూబ్లీహిల్స్ మాదే.. కేటీఆర్ స్పెషల్ ఇంటర్వ్యూ
ఇదెక్కడి న్యాయం బాబు.. శ్రీచరణిపై ఎందుకు చిన్న చూపు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కు సర్వం సిద్ధం

