న్యూజిలాండ్తో తొలి టీ20.. టీమిండియా కెప్టెన్ కీలక ప్రకటన
భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రేపు (జనవరి 21) నాగ్పూర్ వేదికగా తొలి టీ20 జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో టీమిండియాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ అందుతుంది. ఈ మ్యాచ్లో పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ వన్డౌన్లో బరిలోకి దిగుతాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రకటించాడు.ISHAN KISHAN LOCKED 🔐 - Ishan will bat at 3 tomorrow for India. 🇮🇳pic.twitter.com/rHXco5dmLN— Johns. (@CricCrazyJohns) January 20, 2026రెండు సంవత్సరాల తర్వాత జాతీయ జట్టులోకి తిరిగి వచ్చిన ఇషాన్పై మేనేజ్మెంట్ పూర్తి నమ్మకంతో ఉందని పేర్కొన్నాడు. స్కై చేసిన ఈ ప్రకటనలో తొలి టీ20లో భారత తుది జట్టుపై క్లారిటీ వచ్చేసింది. ఇషాన్ జట్టులోకి వస్తే, శ్రేయస్ అయ్యర్ బెంచ్కు పరిమితం కాక తప్పదు. తిలక్ వర్మ స్థానాన్ని అతనిలాగే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఇషాన్ భర్తీ చేయగలడని మేనేజ్మెంట్ నమ్ముతున్నట్లుంది. అందుకే శ్రేయస్ కంటే ఇషాన్కే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సూర్యకుమార్ మాటల ద్వారా స్పష్టమవుతుంది.ఇషాన్ చివరిగా 2023లో భారత్ తరఫున ఆడాడు. ఆతర్వాత స్వతాహాగా విరామం తీసుకొని బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. గత కొంతకాలంగా దేశవాలీ క్రికెట్లో నిలకడగా రాణిస్తుండటంతో తిరిగి టీమిండియా తలుపులు తట్టాడు. ప్రపంచకప్కు ఇషాన్ ఎంపిక అనూహ్యంగా జరిగింది. ఇషాన్ను జట్టులోకి తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ప్రపంచకప్కు ఎంపిక చేసిన జట్టే న్యూజిలాండ్ సిరీస్కు కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే.జట్టులోకి వచ్చినా తిలక్ గాయపడకుంటే, ఇషాన్కు అవకాశం వచ్చేది కాదు. తిలక్ గాయం ఇషాన్కు కొత్త లైఫ్ ఇచ్చినట్లైంది.వరల్డ్ కప్కు ముందు కీలక సిరీస్ స్వదేశంలో న్యూజిలాండ్తో రేపటి నుంచి ప్రారంభమయ్యే సిరీస్ ప్రపంచకప్కు ముందు టీమిండియాకు చాలా కీలకమైంది. అందుకోసమే ప్రపంచకప్ జట్టునే ఈ సిరీస్కు కూడా కొనసాగించారు. ఈ సిరీస్కు ముందు భారత్ న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది (1-2). టీ20 సిరీస్కు ఎంపిక చేసిన వారిలో తిలక్ వర్మతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడ్డాడు. తిలక్ స్థానాన్ని శ్రేయస్ అయ్యర్, సుందర్ స్థానాన్ని రవి బిష్ణోయ్ భర్తీ చేశారు. అయితే వీరిద్దరికి తుది జట్టులో అవకాశం రాకపోవచ్చు.తొలి టీ20లో భారత తుది జట్టు కూర్పు ఇలా ఉండవచ్చు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వన్డౌన్లో ఇషాన్ కిషన్, ఆతర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి రావచ్చు.షెడ్యూల్..తొలి టీ20- నాగ్పూర్రెండో టీ20- రాయ్పూర్మూడో టీ20- గౌహతినాలుగో టీ20- విశాఖపట్నంఐదో టీ20- తిరువనంతపురం
H-1B వీసా ఫీజు : లక్షలాది అమెరికన్ల ఆరోగ్యం సంక్షోభంలో!
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజుల విషయంలో తీసుకున్న నిర్ణయం గ్రామీణ అమెరికాను తీవ్రంగా ప్రభావితం చేయనుందా? అక్కడి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత సంక్షోభంలోకి కూరుకుపోనుందా. లక్షలాదిమంది అమెరికన్ల ఆరోగ్యం ప్రమాదంలో ఉందా? తాజా అంచనాలు ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. హెచ్1 బీ వీసాల ఫీజు భారీ పెంపు అమెరికాలోని అత్యంత అవసరమైన ప్రాంతాలకు విదేశీ శిక్షణ పొందిన వైద్య నిపుణుల రాకకుఅంతరాయం ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విధానం వల్ల సామాన్య అమెరికన్లకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం లక్షలాది మందికి వైద్యం అందకుండా పోయే ప్రమాదం ఉందని వైద్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి.గ్రామీణ అమెరికా వైద్య సంక్షోభం సమస్యను అధిగమించడానికి గ్రామీణ ఆసుపత్రులు గతంలో H-1B వీసా ద్వారా విదేశీ నిపుణులను నియమించుకునేవి. తక్కువ ఖర్చుతో నైపుణ్యం కలిగిన సిబ్బందిని పొందేందుకు ఇదొక గొప్ప మార్గంగా ఉండేది. అయితే, ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఈ ఆసుపత్రులపై కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న చిన్న ఆసుపత్రులు అంత భారీ మొత్తాన్ని చెల్లించి విదేశీ వైద్యులను నియమించుకోవడం అసాధ్యంగా మారింది.ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్' (One Big Beautiful Bill Act) వల్ల మెడికెయిడ్ నిధులు తగ్గిపోవడం, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల నుండి తక్కువ రీయింబర్స్మెంట్ రావడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తోంది. ఒకవైపు నిధుల కొరత, మరోవైపు పెరిగిన వీసా ఖర్చుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా సామాన్యులకు ప్రాథమిక చికిత్స అందడం గగనంగా మారుతోంది.మెడికెయిడ్ (Medicaid) నిధులలో కోతలు విధించడం వల్ల 2034 నాటికి సుమారు 1.7 కోట్ల మంది అమెరికన్లు ఆరోగ్య బీమాను కోల్పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఖర్చులకు భయపడి ప్రజలు ఆసుపత్రులకు వెళ్లడం తగ్గించేస్తున్నారు, ఫలితంగా తక్కువ రోగులు ఉండటంతో ఆసుపత్రుల ఆదాయం తగ్గి అవి మూతపడుతున్నాయి. అమెరికాలో 2026 నాటికి దాదాపు 32 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ కార్మికుల కొరత ఏర్పడవచ్చని అంచనా, ఇది ఇప్పటికే ఉన్న సంక్షోభాన్ని మరింత పెంచుతోంది. పెరుగుతున్న మెడికల్ డెసర్ట్స్ఈ పరిస్థితుల వల్ల గ్రామీణ ప్రాంతాలు "మెడికల్ డెసర్ట్స్" (వైద్య ఎడారులు) గా మారుతున్నాయి. అమెరికాలోని 80శాతం గ్రామీణ కౌంటీలు ఈ జాబితాలోకి వస్తున్నాయి. అత్యవసర చికిత్స లేదా తీవ్రమైన గాయాల కోసం ప్రజలు గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రజల్లో ఊబకాయం మరియు అకాల మరణాల రేటు 20% ఎక్కువగా ఉంది. ఆసుపత్రుల మూత వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ జరగక, చికిత్స అందక అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను తీర్చడానికి విదేశీ నిపుణులు, ముఖ్యంగా H-1B వీసాదారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికాలోని ప్రతి నలుగురు వైద్యులలో ఒకరు విదేశీయులే. అయితే తాజా వీసా రుసుమును భారీగా పెంచడం వల్ల ఈ ఆసుపత్రులు కొత్తవారిని నియమించుకోలేక పోతున్నాయి.జామా ఆందోళనది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA)లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11,080 మంది వైద్యులకు H-1B వీసాలను స్పాన్సర్ చేశారు, ఇది అమెరికాలోని మొత్తం వైద్య సిబ్బందిలో 0.97 శాతానికి సమానం. గ్రామీణ ప్రాంతాలలో ఈ ఆధారపడటం దాదాపు రెట్టింపు ఎక్కువగా ఉంది, అక్కడ 1.6 శాతం మంది వైద్యులు H-1B వీసాలపై ఉండగా, పట్టణ ప్రాంతాలలో ఈ సంఖ్య 0.95 శాతంగా ఉంది. మొత్తంగా, వైద్య మరియు ఆరోగ్య వృత్తులలో H-1B ఆమోదాల సంఖ్య 16,937గా ఉంది, ఇది మొత్తం ఆమోదాలలో 4.2 శాతం. ఇందులో వైద్యులు ,సర్జన్లు సుమారు సగం మంది (8,557) ఉన్నారు.దీని వల్ల సామాజిక-ఆర్థికంగా అత్యంత బలహీనమైన సమాజాలు తీవ్రంగా దెబ్బతింటామని మాస్ జనరల్ బ్రిగమ్లో నివాసి వైద్యుడు , JAMA అధ్యయనం సహ రచయిత డాక్టర్ మైఖేల్ లియు పేర్కొన్నారు. హై క్వాలిటీ హెల్త్ కేర్ కోసం "మిలియన్ల మంది అమెరికన్లు విదేశీ ఆరోగ్య సంరక్షణ కార్మికులపై ఆధారపడతారు" అని ఆయన హెచ్చరించారు.గ్రామీణ అమెరికా ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తగినంత మంది వైద్యులు, నర్సులు లేకపోవడం , ప్రభుత్వ నిధుల కొరత కారణంగా వందలాది ఆసుపత్రులు మూతపడుతున్నాయి లేదా సేవలను నిలిపివేస్తున్నాయి. ముఖ్యంగా 2005 నుండి సుమారు 195 గ్రామీణ ఆసుపత్రులు మూతపడగా, ప్రస్తుతం మరో 700 ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందుల వల్ల మూతపడే దిశలో ఉన్నాయి. దీనివల్ల కొన్ని లక్షల మంది ప్రజలు అత్యవసర వైద్య సేవలకు మరియు ప్రసూతి వంటి కీలక చికిత్సలకు దూరమవుతున్నారు.
మార్కెట్లో నకిలీ పోషక సప్లిమెంట్లు తయారీ
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియు నిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించిహెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి.
ఢిల్లీ ప్రజలకు గుడ్న్యూస్
సాక్షి,ఢిల్లీ : దేశ రాజధాని వాసులకు వాసులకు ఎయిర్ క్వాలిటీ మెనేజ్మెంట్ శుభవార్త తెలిపింది. అక్కడి వాయికాలుష్య తీవ్రత గతంతో పోలిస్తే కొంతమేర తగ్గినట్లు పేర్కొంది. దీంతో గ్రేడ్-4 నేపథ్యంలో విధించే కఠిన ఆంక్షలకు తాత్కాలిక సడలింపు ఇస్తున్నట్లు పేర్కొంది.ఢిల్లీ నగరం తీవ్రమైన గాలికాలుష్య సమస్యతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గాలి నాణ్యత గత ఆదివారం 440కి చేరుకొని అత్యంతప్రమాదర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో గ్రేడ్-4కు విధించే కఠిన ఆంక్షలు విధిస్తూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు ఉదయం గాలినాణ్యత 378గా నమోదైంది. దీంతో ఆంక్షలకు తాత్కాలిక సడలింపు ఇచ్చింది.అయితే గ్రేడ్-4 ఆంక్షల సమయంలో నగరంలో కఠిన ఆంక్షలు ఉంటాయి. నిర్మాణ రంగ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయి. అత్యవసరమైతే తప్ప డీజిల్ ట్రక్కులను నగరంలోకి అనుమతించరు. జనరేటర్లతో నడిచే పరిశ్రమలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సిపారసు చేస్తారు. కాగా సాధారణ సమయంలోనే వాయు కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీలో శీతాకాలంలో దాని ప్రభావం మరింత అధికంగా ఉంటుంది.
హరీష్ ఫోనే వాడలేదు.. విచారణ ఏంటి?: బండి సంజయ్
భారత్తో తొలి టీ20.. న్యూజిలాండ్ తుది జట్టు ఇదే..!
నవీన్ చంద్ర సైకలాజికల్ థ్రిల్లర్.. భయపెడుతోన్న టీజర్
అక్రమ సంబంధానికి అడ్డు.. భర్తను చంపిన భార్య
తెలంగాణ సీఐడీ కీలక నిర్ణయం.. ఇంటివద్దే ఫిర్యాదు
స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేటు!
కారును లాగే కొండ.. ఎక్కడుందో తెలుసా?
న్యూజిలాండ్తో తొలి టీ20.. టీమిండియా కెప్టెన్ కీలక ప్రకటన
మనశంకర వరప్రసాద్గారు..ఆ పాట పాడింది చిరంజీవి మేనకోడలే..!
ఢిల్లీ ప్రజలకు గుడ్న్యూస్
మారిపోయిన గోల్డ్ రేటు.. లేటెస్ట్ ధరలు ఇలా!
గత ప్రభుత్వం చేసినవన్నీ క్రెడిట్ చోరీ చేశాం.. ఇదీ అంతేగా సార్!!
అవన్నీ నాన్న కోరికలు.. నెరవేరే సమయానికి ఆయన లేడు!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
క్యారవాన్లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే
‘కథ’లేని సినిమాలపై కాసుల వర్షం.. కారణం ఏంటి?
సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్?
శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్
‘ప్లీజ్ నాన్న.. నాకు చావాలని లేదు..’
ఈ రాశి వారికి జీవితాశయం నెరవేరుతుంది
రైలు దిగబోయి పట్టాలపై పడి..
కాంగ్రేస్, కమ్యూనిస్టు సోదరులు కొట్లాడితేనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది - సీఎం రేవంత్ రెడ్డి
కోహ్లితో ప్రేమాయణం? స్పందించిన సంజనా గల్రానీ
మరో వారసురాలు వచ్చేస్తుంది
ఇండియా వీసా వచ్చిందోచ్.. పాకిస్తానీ ఆనందం
ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
'ఆరనీకుమా ఈ దీపం' సాంగ్.. రవితేజ మాస్ డ్యాన్స్
టీమిండియా సిరీస్ ఓటమి.. ఆ ముగ్గురే విలన్లు
హరీష్ ఫోనే వాడలేదు.. విచారణ ఏంటి?: బండి సంజయ్
భారత్తో తొలి టీ20.. న్యూజిలాండ్ తుది జట్టు ఇదే..!
నవీన్ చంద్ర సైకలాజికల్ థ్రిల్లర్.. భయపెడుతోన్న టీజర్
అక్రమ సంబంధానికి అడ్డు.. భర్తను చంపిన భార్య
తెలంగాణ సీఐడీ కీలక నిర్ణయం.. ఇంటివద్దే ఫిర్యాదు
స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేటు!
కారును లాగే కొండ.. ఎక్కడుందో తెలుసా?
న్యూజిలాండ్తో తొలి టీ20.. టీమిండియా కెప్టెన్ కీలక ప్రకటన
మనశంకర వరప్రసాద్గారు..ఆ పాట పాడింది చిరంజీవి మేనకోడలే..!
ఢిల్లీ ప్రజలకు గుడ్న్యూస్
మారిపోయిన గోల్డ్ రేటు.. లేటెస్ట్ ధరలు ఇలా!
గత ప్రభుత్వం చేసినవన్నీ క్రెడిట్ చోరీ చేశాం.. ఇదీ అంతేగా సార్!!
అవన్నీ నాన్న కోరికలు.. నెరవేరే సమయానికి ఆయన లేడు!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
క్యారవాన్లో అసభ్య ప్రవర్తన.. హీరో చెంప పగలగొట్టా: పూజా హెగ్డే
‘కథ’లేని సినిమాలపై కాసుల వర్షం.. కారణం ఏంటి?
సిగరెట్ మాఫియా గుప్పిట్లోకి భారత్?
శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్
‘ప్లీజ్ నాన్న.. నాకు చావాలని లేదు..’
ఈ రాశి వారికి జీవితాశయం నెరవేరుతుంది
రైలు దిగబోయి పట్టాలపై పడి..
కాంగ్రేస్, కమ్యూనిస్టు సోదరులు కొట్లాడితేనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది - సీఎం రేవంత్ రెడ్డి
కోహ్లితో ప్రేమాయణం? స్పందించిన సంజనా గల్రానీ
మరో వారసురాలు వచ్చేస్తుంది
ఇండియా వీసా వచ్చిందోచ్.. పాకిస్తానీ ఆనందం
ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి
సైకో కిల్లర్ 'కలాం కావల్' మూవీ రివ్యూ..
'ఆరనీకుమా ఈ దీపం' సాంగ్.. రవితేజ మాస్ డ్యాన్స్
టీమిండియా సిరీస్ ఓటమి.. ఆ ముగ్గురే విలన్లు
ఫొటోలు
సీతాకల్యాణం చేసిన 'బిగ్బాస్' ప్రియాంక సింగ్ (ఫొటోలు)
2016లో సారా టెండుల్కర్ ఇలా.. పోస్ట్ వైరల్ (ఫొటోలు)
ఫ్యాషన్ ..అదిరెన్: కనువిందు చేసిన ఫ్యాషన్ షో (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
వాఘా బోర్డర్లో 'ధురంధర్' బ్యూటీ (ఫొటోలు)
టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)
సముద్రపు ఒడ్డున సేదతీరుతున్న పూజిత పొన్నాడ -ఎంత బాగుందో! (ఫొటోలు)
అల్లు అర్జున్ ఫ్యామిలీ.. జపాన్ ట్రిప్లో ఇలా (ఫొటోలు)
నటుడు నరేష్ బర్త్డే స్పెషల్.. పవిత్రతో అనుబంధం (ఫోటోలు)
టిల్లుగాని పోరీ.. మతిపోయే గ్లామరస్గా (ఫొటోలు)
సినిమా
రామ్చరణ్ కండల సీక్రెట్ అతడే
టాలీవుడ్లో ఇప్పుడు బెస్ట్ ఫిజిక్ను స్క్రీన్పై చూపించడానికి స్టార్స్ పోటీపడుతున్నారు. పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ కఠినమైన కసరత్తులతో ఫిజిక్ను తీర్చిదిద్దుకుంటున్నాడు.దీనికి నిదర్శనంగానా అన్నట్టు... లేటెస్ట్గా బయటకు వచ్చిన ఆయన ఫిట్ లుక్ బాగా వైరల్ అయింది. సినిమాకి డైరెక్టర్ ఎంత ముఖ్యమో హీరోల ఫిజిక్లకు ట్రైనర్ కూడా అంతే. మరి రామ్ చరణ్ లుక్ని ఈ రేంజ్లో క్లిక్ అయ్యేలా చేసిన ఆ ట్రైనర్ ఎవరు? ఆయన నేపధ్యం ఏమిటి?ఆయనే ముంబయికి చెందిన రాకేష్ ఉడియార్. ఆమిర్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఫిట్నెస్ ట్రైనర్గా బాలీవుడ్కి సుపరిచితుడైన రాకేష్ ఇప్పుడు దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే సెలబ్రిటీ ట్రైనర్స్లో ఒకడు. ఎంత శ్రద్ధగా సెలబ్రిటీల శరీరాలను తీర్చిదిద్దుతున్నాడో అంతే శ్రద్ధగా ఆయన తన జీవితాన్ని కూడా నిర్మించుకున్నారని ఆయన విజయాల వెనుక ఉన్న కధ వెల్లడిస్తుంది. ఆయన గతంలో ఒకసారి తన స్ఫూర్తిదాయక జీవితం గురించి మీడియాతో పంచుకున్నాడు.రాకేష్ జీవితం చాలా కష్టాలతో గడిచింది.అతని తండ్రికి పక్షవాతం వచ్చిన తర్వాత, చిన్న వయసులోనే రాకేష్ లోకల్ రైళ్లలో చిన్న చిన్న వస్తువులు అమ్మేవాడు. అతని సోదరుడితో కలిసి రోజుకు సుమారు 25 రూపాయలు సంపాదించేవారు. తర్వాత, రాకేష్ తల్లికి ఒక ఇంట్లో పనిమనిషిగా ఉద్యోగం దొరికింది, ఆ ఇంటి యజమాని ఆ ఇద్దరు తోబుట్టువులను పాఠశాలకు పంపడానికి ముందుకొచ్చారు. రాకేష్ అదే సమయంలో ఒక దాబాలో కూడా పనిచేశాడు.‘‘నాకు ఎప్పుడూ ఫిట్నెస్పై ఆసక్తి ఉండేది దాని గురించి విస్త్రుతంగా పుస్తకాలు చదివేవాడిని. 16 ఏళ్ల వయసులో, నాకు ఒక జిమ్లో స్వీపర్గా ఉద్యోగం వచ్చింది, ఆ తర్వాత ఫ్లోర్ ట్రైనర్గా పదోన్నతి పొందాను. చివరికి, నేను ఫ్రీలాన్సర్గా మారి సెలబ్రిటీలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను,’’ అని ఫిట్నెస్ రంగంలోకి తన ప్రవేశాన్ని గుర్తుచేసుకుంటూ రాకేష్ చెప్పాడు. సల్మాన్ ఖాన్ రాకేష్ ప్రముఖ క్లయింట్లలో ఒకరు. ‘‘నేను అర్బాజ్ ఖాన్(సల్మాన్ సోదరుడు) కు శిక్షణ ఇస్తున్నప్పుడు, సల్మాన్ నాకు ఫోన్ చేసి, బాడీగార్డ్ సినిమా కోసం తనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు’’ అంటూ రాకేష్ గుర్తు చేసుకుంటాడు. అప్పటి నుంచీ రాకేష్ సల్మాన్కు పర్సనల్ ట్రైనర్గా కొనసాగుతున్నాడు. ఇక మరో బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ఖాన్ తన పీకే సినిమా ప్రారంభించడానికి ముందే, రాకేష్కు ఫోన్ చేసి తన ట్రైనర్గా ఉండమని అడిగాడట. అప్పటి నుంచీ వీరిద్దరి జోడీ కూడా కంటిన్యూ అవుతోంది.రామ్చరణ్తో పరిచయం అలా...‘ధ్రువ’ సినిమా సమయంలో తొలిసారి పూర్తిగా కండలు తిరిగిన గ్రీకు శిల్పం లాంటి శరీరం కావాలనుకున్నప్పుడు మన టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్కు రాకేష్ పేరును సూచించింది సల్మానే. ‘‘చరణ్ సల్మాన్ లు మంచి స్నేహితులు.ఆ సినిమా కోసం ది బెస్ట్ ఫిజిక్తో ఫిట్గా కనపడాలని చరణ్ అనుకున్నాడు’’ అని రాకేష్ చెప్పాడు. అప్పటి నుంచి రామ్ చరణ్తో రాకేష్ పనిచేస్తున్నాడు. ‘‘చరణ్కు శిక్షణ ఇవ్వడానికి నేను హైదరాబాద్, ముంబయి మధ్య రాకపోకలు సాగిస్తుంటాను. చరణ్ తరచుగా నన్ను సంప్రదిస్తాడు. ఆయన అవసరాలకు అనుగుణంగా తన వర్కవుట్, పోషకాహారం మొదలైన వాటి గురించి నేను ఒక ప్రణాళికను రూపొందిస్తుంటాను’’ అంటూ రాకేష్ వివరిస్తున్నాడు.రామ్చరణ్ మాత్రమే కాదు దియా మీర్జా, కునాల్ కపూర్, డైసీ షా పుల్కిత్ సామ్రాట్తో సహా తారలెందరికో రాకేష్ శిక్షణ ఇచ్చాడు. ‘‘నటీనటులు తమ పాత్రల కోసం బరువు తగ్గుతూ, పెరుగుతూ ఉంటారు, ఆ సమయంలో వారికి వైద్యులు శిక్షకులు దగ్గరగా పనిచేస్తాం; ఆ లుక్ పొందడానికి ఒక ఫిట్నెస్ ప్రణాళిక ఆహారం అందిస్తాం. ఉదాహరణకు దంగల్ సినిమా కోసం, ఆమిర్ఖాన్ 97 కిలోల నుంచి బరువు తగ్గాల్సి వచ్చింది దానిని సాధించడానికి అతనికి సరైన బృందం సహాయం చేసింది.’అదే విధంగా మరో సినిమా కోసం రామ్ చరణ్ సన్నగా మారాలని ఆశించారు’’ అంటూ రాకేష్ గుర్తు చేసుకుంటాడు. ’ ఆమిర్ సల్మాన్, రామ్ చరణ్ లు ఎంత పెద్ద బిజీ హీరోలైనా తమ వర్కౌట్ సెషన్ల విషయంలో అలసత్వం చూపరని చాలా పట్టుదలగా ఉంటారని రాకేష్ వెల్లడించాడు. ‘సల్మాన్ ఎంత అలసిపోయినా లేదా ఇంటికి ఆలస్యంగా వచ్చినా, జిమ్కు వెళ్లడం మానడు. అతనికి తినడం అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా తన తల్లి వంటకం అంటే మరీ ఇష్టం, కానీ అతను ఎప్పుడూ అదనపు కేలరీలు పెరగనివ్వడు,‘ అని రాకేష్ చెప్పాడు.
సంక్రాంతి సినిమా హిట్.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
మనశంకర వరప్రసాద్గారు మూవీ సూపర్ హిట్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. తన సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ ప్రయాణంలో తనకు ఎల్లప్పుడు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.మెగాస్టార్ తన పోస్ట్లో రాస్తూ..'మన శంకరవరప్రసాద్ గారు సినిమాపై ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ, అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞతతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే. నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది. ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది' అంటూ ఎమోషనల్గా రాసుకొచ్చారు.మీరు వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే శక్తి. రికార్డులు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్ మెషీన్ అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు, సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో... లవ్ యూ ఆల్.. ఇట్లు మీ చిరంజీవి' అంటూ పోస్ట్ చేశారు.కాగా.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మనశంకర వరప్రసాద్గారు జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించి అభిమానులను మెప్పించారు. తాజాగా ఈ మూవీ అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్లో చేరిన రీజినల్ సినిమాగా రికార్డ్ సృష్టించింది. From the heart, with love & gratitude 🙏🏻 pic.twitter.com/LJ2g32x3qC— Chiranjeevi Konidela (@KChiruTweets) January 20, 2026
రేణు దేశాయ్ సంచలన పోస్ట్.. నన్ను కాపాడటానికి ఎవరూ లేరు
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. మరోసారి వార్తల్లో నిలిచింది. వీధి కుక్కల్ని అన్యాయంగా చంపేస్తున్నారని సోమవారం ప్రెస్ మీట్ పెట్టిన ఈమె చాలా వ్యాఖ్యలు చేసింది. ఐదు కుక్కలు కరిస్తే మిగతా వాటన్నింటినీ చంపేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తుందనే కామెంట్స్ వినిపించాయి. దీనిపైనా స్పందిస్తూ తనకు రాజకీయాలు ఇష్టం లేదని, ఏ పార్టీలోకి వెళ్లడం లేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఏకంగా తను ఒంటరి, ఎవరూ లేరని సంచలన పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాకు రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్)'నన్ను కాపాడటానికి అమ్మనాన్న, అన్నయ్య, భర్త.. ఎవరూ లేరు. తాజా అంశంపై నా తప్పు లేకపోయినా సరే ఎందరో నన్ను విమర్శిస్తున్నారు. మీరు చేసే కామెంట్స్పై తిరిగి స్పందించను. నేను నమ్మే భగవంతుడి దగ్గర మాత్రమే నా బాధ చెబుతాను. ఆయన నా ప్రార్థనలు వింటున్నాడనే నమ్మకం నాకు ఉంది. నేను ఎప్పటికప్పుడు కాశీకి ఎందుకు వెళ్తానో మీకు ఇప్పడు అర్థమైంటుంది' అని రేణు దేశాయ్ రాసుకొచ్చింది. ఈ మేరకు కాశీలోని గంగ నదిలో బోటులో ఉన్న వీడియోని షేర్ చేసింది.ఇదే పోస్టులో వీధి కుక్కలని చంపే విషయమై తన పోరాటం గురించి మరోసారి ప్రస్తావించింది. 'నేను ఎప్పుడూ నా హక్కుల కోసం పోరాడలేదు. వీధి కుక్కల విషయంలో మాత్రం పోరాటం ఆపను. కొన్ని కుక్కలు చేసిన తప్పునకు వందలాది వాటిని చంపాలనే నిర్ణయం సరైనది కాదు. ఇది మీకు అర్థమయ్యేంతవరకు పోరాడుతూనే ఉంటాను' అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: కూరగాయలు తింటే జీర్ణం కావు.. స్టార్ హీరోకి వింత సమస్య!) View this post on Instagram A post shared by renu desai (@renuudesai)
సినిమా టికెట్ ధరల పెంపు... హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి నుంచి టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను 90 రోజుల ముందే ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా రిలీజైన మెగాస్టార్ చిరంజీవి మూవీ మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి టికెట్ ధరల పెంపు అంశంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైన సంగతి తెలిసిందే. టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. ది రాజాసాబ్ సినిమా టికెట్ ధరలపై ఈనెల 9న వాదనలు జరగ్గా.. అంతకుముందే అంటే 8వ తేదీ అర్ధరాత్రి ది రాజాసాబ్ మూవీ టికెట్ ధరలు, ప్రీమియర్లకు అనుమతి ఇస్తూ మెమో జారీ చేశారు. ఈ విషయాన్ని లాయర్ విజయ్ గోపాల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదే సమయంలో మన శంకరవరప్రసాద్ గారు చిత్రానికి కూడా టికెట్ ధరలు పెంచుతూ 8వ తేదీనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయవాది కోర్టుకు వివరించారు. కానీ ఆ ఉత్తర్వులను మాత్రం ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాలేదన్నారు. దీంతో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణ వాయిదా వేసింది.
క్రీడలు
ఆసీస్ దిగ్గజ క్రికెటర్ కొడుకుకు ప్రతిష్టాత్మక అవార్డు
ఆసీస్ దిగ్గజ క్రికెటర్ డారెన్ లెహ్మన్ కొడుకు జేక్ లెహ్మన్కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ 33 ఏళ్ల ఎడమ చేతి బ్యాటర్ను 2024-25 సీజన్కు గానూ మెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జేక్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయాక ఈ అవార్డు లభించింది.ఆసీస్ దేశవాలీ క్రికెట్లో సుదీర్ఘంగా రాణిస్తున్నా జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు రాకపోవడంతో జేక్ గత నెలలోనే తన బ్రిటిష్ పాస్పోర్ట్ ఆధారంగా ఇంగ్లండ్కు వలస వెళ్లాడు. అక్కడ అతను హ్యాంప్షైర్ కౌంటీతో లోకల్ ప్లేయర్ కేటగిరీలో రెండు సంవత్సరాల ఒప్పందం చేసుకున్నాడు. ఓ ఆటగాడు ఇతర దేశం తరఫున లోకల్ కేటగిరీలో అవకాశం దక్కించుకుంటే, తన సొంత దేశానికి ఆడే అర్హత కోల్పోతాడు. జేక్ విషయంలో ఇదే జరిగింది. జేక్ హ్యాంప్షైర్తో ఒప్పందం చేసుకోవడం వల్ల ఆస్ట్రేలియాకు ఆడాలన్న తన కలను చెరిపేసుకున్నాడు.షెఫీల్డ్ షీల్డ్లో రికార్డు ప్రదర్శన జేక్ 2024-25 షెఫీల్డ్ షీల్డ్ సీజన్లో దక్షిణ ఆస్ట్రేలియా తరఫున రికార్డు ప్రదర్శన చేశాడు. 10 మ్యాచ్ల్లో నాలుగు వరుస సెంచరీల సాయంతో 44.11 సగటున 750 పరుగులు చేశాడు. ఆ సీజన్ ఫైనల్లో జేక్ చేసిన సెంచరీ దక్షిణ ఆస్ట్రేలియాకు దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రెడ్బాల్ టైటిల్ను అందించింది.తండ్రి వారసత్వం జేక్ తండ్రి డారెన్ లెహ్మన్ తన జమానాలో మూడుసార్లు డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పుడు అతని కుమారుడు జేక్ కూడా ఆ అవార్డును తొలిసారి గెలుచుకుని తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాడు. ఈ అవార్డుకు ఎంపికైన తర్వాత జేక్ మాట్లాడుతూ .. ఇది నాకు షాక్లా అనిపించింది. గత 18 నెలలుగా మంచి క్రికెట్ ఆడుతున్నాను. సహచరులు, ప్రత్యర్థులు ఇచ్చిన గుర్తింపు ప్రత్యేకమైనది. ఈ అవార్డు నాకు గౌరవమని అన్నాడు. ఆస్ట్రేలియాకు ఆడటం నా కలజేక్ ఆసీస్ తరఫున ఆడే అవకాశాల కోసం సుదీర్ఘంగా ఎదురుచూసి గత నెలలోనే ఇంగ్లండ్ కౌంటీ హ్యాంప్షైర్తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాకు ఆడటం నా కల. కానీ అది సాధ్యం కాలేదు. అయినా 12 సంవత్సరాలుగా ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడినందుకు గర్వంగా ఉంది. ఇప్పుడు ఇంగ్లండ్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సమయం ఆసన్నమైందని అన్నాడు.
నీ లక్ష్యం ఏమిటి?.. హార్దిక్తో గంభీర్.. వీడియో వైరల్
సొంతగడ్డపై న్యూజిలాండ్కు వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. టీ20లలోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ప్రపంచకప్-2026 టోర్నమెంట్కు సన్నాహకంగా కివీస్తో జరిగే ఈ సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగ్గట్లుగానే సూర్యకుమార్ సేన ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేసింది.హార్దిక్ పాండ్యా రీఎంట్రీహెడ్కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) మార్గదర్శనంలో టీమిండియా స్టార్లు నెట్స్లో చెమటోడ్చారు. ఇక న్యూజిలాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా చాన్నాళ్ల తర్వాత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) పునరాగమనం చేయనున్నాడు. ఆసియా టీ20 కప్-2025 మ్యాచ్లో గాయపడ్డ అతడు అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.అయితే, దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా ఎడిషన్లలో సొంత జట్టు బరోడా తరఫున బరిలోకి దిగిన హార్దిక్.. మంచి ఫామ్లో ఉన్నాడు. కివీస్తో టీ20 సిరీస్, ప్రపంచకప్ టోర్నీల్లోనూ ఇదే జోరు కనబరచాలని భావిస్తున్నాడు. ఎక్కడికి ఎక్కుపెట్టావు?ఇందుకు తగ్గట్లుగానే ప్రాక్టీస్ సెషన్లో బంతితో, బ్యాట్తో హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. ముఖ్యంగా గంభీర్ చూస్తుండగా భారీ షాట్లతో దుమ్ములేపిన ఈ ఆల్రౌండర్.. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా గంభీర్- హార్దిక్ మధ్య జరిగిన సంభాషణ నెట్టింట వైరల్గా మారింది.పవర్ఫుల్ హిట్టింగ్తో షాట్లు బాదే క్రమంలో హార్దిక్ పాండ్యా తనకు ఎదురుగా ఉన్న వారిని పక్కకు జరగమని చెప్పాడు. ఇందుకు నవ్వుతూ బదులిచ్చిన గంభీర్.. ‘‘నువ్వు ఎక్కడికి బంతిని తరలించబోతున్నావు.. నీ లక్ష్యం ఏమిటి?’’ అని అడిగాడు. ఇందుకు హార్దిక్.. ‘‘మొదటి టైర్లోకి’’ అని బదులిచ్చాడు. ఇంతలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుంటూ.. ‘‘అన్నీ సెకండ్ టైర్లోకే కొడుతున్నాడు’’ అంటూ నవ్వులు చిందించాడు. బుమ్రా కూడాఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యాతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా కివీస్తో టీ20 సిరీస్తో తిరిగి టీమిండియాతో చేరాడు. కాగా జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో భారత్- న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అనంతరం ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్-2026 జరుగనుంది. ఇందుకు భారత్- శ్రీలంక వేదికలు.చదవండి: శ్రేయస్ అయ్యర్కు భారీ షాక్!Sound On 🔊 Dialling up the intensity as #TeamIndia steps into T20I mode to take on New Zealand ⚡️ #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/RSE2DXLFXA— BCCI (@BCCI) January 20, 2026
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
మహిళల ఐపీఎల్లో (WPL) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సరికొత్త చరిత్ర సృష్టించింది. లీగ్ చరిత్రలో వరుసగా ఆరు విజయాలు సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. నిన్న (జనవరి 19) గుజరాత్ జెయింట్స్పై విజయం సాధించిన ఈ జట్టు.. అంతకుముందు ఇదే ఎడిషన్లో (2026) ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్, ముంబై ఇండియన్స్పై వరుస విజయాలు సాధించింది. FIRST TEAM TO PLAYOFFS - ITS RCB...!!!!- The Historic moment with 6 consecutive wins. 💥 pic.twitter.com/ufVqDnuPZq— Johns. (@CricCrazyJohns) January 19, 2026అంతకుముందు ఎడిషన్లో (2025) తమ చివరి మ్యాచ్లోనూ ముంబై ఇండియన్స్ను మట్టికరిపించిన ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్లో వరుసగా ఆరు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. లీగ్ చరిత్రలో ఏ జట్టు వరుసగా ఇన్ని మ్యాచ్ల్లో విజయాలు సాధించలేదు. గతంలో ముంబై ఇండియన్స్ రెండు సార్లు వరుసగా ఐదు మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. ఆర్సీబీనే గతంలో ఓ సారి వరుసగా ఐదు మ్యాచ్ల్లో గెలుపొందింది.ప్లే ఆఫ్స్కు ఆర్సీబీతాజాగా గుజరాత్ జెయింట్స్పై విజయంతో ఆర్సీబీ ఈ ఎడిషన్లో ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ప్లే ఆఫ్స్కు ముందు ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. 24న ఢిల్లీతో, 26న ముంబై ఇండియన్స్తో, 29న యూపీతో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్ల్లో ఓడినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్లో ఉంటుంది.నిన్నటి మ్యాచ్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటి గుజరాత్ను 61 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసి, అనామక ప్లేయర్ గౌతమి నాయక్ (55 బంతుల్లో 73; 7 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. మంధన (26), రిచా ఘోష్ (27) ఓ మోస్తరు స్కోర్లతో రాణించగా.. ఆఖర్లో రాధా యాదవ్ (17), శ్రేయాంక పాటిల్ (8 నాటౌట్) బ్యాట్ ఝులిపించారు. గుజరాత్ బౌలర్లలో కశ్వీ గౌతమ్, ఆష్లే గార్డ్నర్ తలో 2, రేణుకా సింగ్, సోఫి డివైన్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం 179 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ పూర్తిగా చేతులెత్తేసింది. సయాలి సత్ఘరే (4-0-21-3), డి క్లెర్క్ (4-0-17-2), లారెన్ బెల్ (4-1-23-1), రాధా యాదవ్ (4-0-34-1), శ్రేయాంక పాటిల్ (4-0-19-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్లో ఆష్లే గార్డ్నర్ (54) ఒంటరిపోరాటం చేసినా, ప్రయోజనం లేకుండా పోయింది. అనుష్క శర్మ (18), భారతి ఫుల్మాలి (14), తనుజా కన్వర్ (11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
వెస్టిండీస్కు షాకిచ్చిన ఆఫ్ఘనిస్తాన్
ఇటీవలికాలంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు వెస్టిండీస్కు వరుసగా షాకులిస్తుంది. తాజాగా అదే సీన్ రిపీటైంది.దుబాయ్ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్లో ఆఫ్ఘన్ జట్టు విండీస్పై 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఇబ్రహీం జద్రాన్ (56 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), దర్విష్ రసూలీ (59 బంతుల్లో 84; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడి ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ అందించారు. వీరిద్దరూ చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో రహ్మానుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. సెదిఖుల్లా అటల్ 2 పరుగులు మాత్రమే చేశాడు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్, మాథ్యూ ఫోర్డ్ తలో వికెట్ తీశారు.అనంతరం 182 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ తడబడింది. జియా ఉర్ రెహ్మాన్ (4-0-36-3), రషీద్ ఖాన్ (4-0-19-2), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (4-0-29-2), నూర్ అహ్మద్ (3-0-34-2) ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. విండీస్ ఇన్నింగ్స్లో సాంప్సన్ (30) టాప్ స్కోరర్గా కాగా.. జాన్సన్ ఛార్లెస్ (27), మోటీ (28), ఫోర్డ్ (25) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటరల్లో ఎవిన్ లూయిస్, బ్రాండన్ కింగ్ చెరో 4, జాంగూ, హెట్మైర్, పియెర్రీ తలో 3 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ సిరీస్లోని రెండో టీ20 రేపు (జనవరి 21) ఇదే వేదికగా జరుగనుంది.
న్యూస్ పాడ్కాస్ట్
స్వచ్ఛంద పంటల బీమాకూ మంగళం. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం
ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారిన మద్యం... సంక్రాంతి సీజన్లో టీడీపీ మద్యం సిండికేట్కు పండుగ
ఆంధ్రప్రదేశ్లో భూముల ‘రీ సర్వే’పై చంద్రబాబు దొంగాట... అప్పుడు దుష్ప్రచారం చేసి ఇప్పుడు క్రెడిట్ చోరీ కోసం పాకులాట
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందర్భంగా జూదాల జాతర.. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో విచ్చలవిడిగా మద్యం ప్రవాహం
సంక్రాంతి సంబరాలను జూదంగా మార్చేసిన కూటమి నేతలు... ఏపీలో పండుగ వేళ యథేచ్ఛగా దోపిడీ... 2 రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల జూదం .
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ రిజిస్ట్రేషన్ల బాదుడు... వచ్చే నెల నుంచి పెంపు అమలు చేసేందుకు సన్నాహాలు... ఆదాయమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు పండుగ లేనట్లే... ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచిన ఏపీ సీఎం చంద్రబాబు
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు మరో డ్రామా. ఖజానాకు రాబడి తగ్గిందంటూ కార్యదర్శులు, కలెక్టర్లపై సీఎం చంద్రబాబు చిర్రుబుర్రు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో రెండేళ్లుగా భారీగా తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య... ప్రైవేటు స్కూళ్లలో పెరిగిన చేరికలు
ఆంధ్రప్రదేశ్లో దారి దోపిడీకి పచ్చజెండా... సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు తలాడిస్తున్న కూటమి ప్రభుత్వం
బిజినెస్
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. రైలు ప్రయాణంలో మార్పులు!
భారతీయ రైల్వే సామాన్య ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను చేరువ చేస్తూ తీసుకువచ్చిన ‘అమృత్ భారత్ ఎక్స్ప్రెస్’ సేవల్లో కీలక మార్పులు చేసింది. అమృత్ భారత్ రైళ్లలో టికెట్ బుకింగ్ విధానం, ఛార్జీల నిర్మాణం, రిజర్వేషన్ నిబంధనల్లో కొత్త మార్పులు అమలులోకి తీసుకొచ్చింది.ఆర్ఏసీ విధానానికి స్వస్తిఅమృత్ భారత్ రైళ్లలో స్లీపర్ క్లాస్ ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ రైళ్లలో ఆర్ఏసీ విధానం ఉండదు. టికెట్ బుక్ చేసుకునే సమయంలో అది నేరుగా కన్ఫర్మ్ అవుతుంది లేదా వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. దీనివల్ల సీటు షేర్ చేసుకోవాల్సిన ఇబ్బంది ఉండదు. ప్రయాణం మరింత సుఖమయంగా ఉంటుంది. అయితే, రద్దీ సమయాల్లో ప్రయాణించే అవకాశం స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.ఛార్జీలు ఇవే..రైల్వే ఆదాయం, సర్వీసుల నాణ్యతను సమతుల్యం చేస్తూ కనీస ఛార్జీలను నిర్ణయించింది. కనీసం 200 కిలోమీటర్ల దూరానికి టికెట్ ఛార్జీ వసూలు చేస్తారు. దీని బేసిక్ ఛార్జీ రూ.149 నుంచి ప్రారంభమవుతుంది. సెకండ్ క్లాస్ (అన్రిజర్వ్డ్) కేటగిరీలో కనీసం 50 కిలోమీటర్ల దూరానికి ఛార్జీ వసూలు చేస్తారు. దీని ప్రారంభ ధర రూ.36. రిజర్వేషన్ ఫీజు, సూపర్ ఫాస్ట్ సర్ ఛార్జీలు అదనంగా ఉంటాయి.అమృత్ భారత్ vs వందే భారత్.. ప్రధాన వ్యత్యాసాలుఅమృత్ భారత్ ఎక్స్ప్రెస్వందే భారత్ ఎక్స్ప్రెస్సామాన్యులకు తక్కువ ధరలో ప్రయాణంప్రీమియం, వేగవంతమైన ప్రయాణంనాన్-ఏసీ(స్లీపర్, సెకండ్ క్లాస్)పూర్తిగా ఏసీ (చైర్ కార్, స్లీపర్)ఆర్ఏసీ లేదు (కన్ఫర్మ్ లేదా వెయిటింగ్)కేవలం కన్ఫర్మ్ టికెట్లుమెరుగైన బెర్త్లుఆటోమేటిక్ డోర్లు, వై-ఫై, క్యాటరింగ్ దేశవ్యాప్తంగా కొత్త మార్గాలుకనెక్టివిటీని పెంచే లక్ష్యంతో రైల్వే శాఖ మరో 9 కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ప్రధానంగా ఈశాన్య భారతదేశాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతాయి.కామాఖ్య - రోహ్తక్: అస్సాం నుంచి హర్యానా వరకు.దిబ్రూగఢ్ - లఖ్నవూ: యూపీ, అస్సాం మధ్య.సంత్రాగాచి - తాంబరం: కోల్కతా, చెన్నై మధ్య.హౌరా - ఆనంద్ విహార్ (ఢిల్లీ): కోల్కతా నుంచి ఢిల్లీ. ఇవేకాక ఇతర ప్రాంతాల్లోనూ ఈ రైళ్లు సేవలందిస్తున్నాయి.ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే..
రూ.10,300 కోట్ల యూరియా ప్రాజెక్టు
దేశీయ ఎరువుల ఉత్పత్తి రంగంలో స్వయంసమృద్ధి సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎంఎఫ్ఎల్) భారీ విస్తరణకు చర్యలు చేపట్టింది. చెన్నైలో సుమారు రూ.10,300 కోట్ల అంచనా వ్యయంతో కొత్తగా గ్రీన్ఫీల్డ్ అమ్మోనియా–యూరియా సమ్మేళన ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. చెన్నైలో జరిగిన ‘పాన్ ఐఐటీ టెక్4భారత్ సమిట్ 2026’లో పాల్గొన్న సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) మనోజ్కుమార్ జైన్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.ప్రాజెక్టు ముఖ్యాంశాలుఈ ప్లాంట్ ద్వారా దక్షిణ భారతదేశంలో నెలకొన్న యూరియా కొరతను అధిగమించే అవకాశం ఉందని సంస్థ భావిస్తోంది. దీని ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 13 లక్షల టన్నులు. ఈ ఎంఎఫ్ఎల్ సముదాయం ఉత్తర చెన్నైలోని మణాలీలో ఉంది. ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్ (PDIL) రూపొందించిన ప్రీ-ఫీజిబిలిటీ నివేదికకు ఇప్పటికే బోర్డు ఆమోదం లభించింది. ‘కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును రూపొందించాం. అనుమతులు లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఇది దేశ ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తుంది’ అని మనోజ్కుమార్ జైన్ పేర్కొన్నారు.రికార్డు స్థాయి ఆపరేషనల్ పనితీరు1970లో ప్రారంభమైన పాత ప్లాంట్ను ప్రస్తుతం 120 శాతం సామర్థ్యంతో నడుపుతున్నట్లు జైన్ తెలిపారు. ఆధునిక సాంకేతికతతో ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 10–12 శాతం మెరుగుపరిచినట్లు ఆయన వెల్లడించారు. మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (MFL) 2024–25 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధించింది. సంస్థ వార్షిక ఆదాయం గతంతో పోలిస్తే 14 శాతం వృద్ధిని నమోదు చేస్తూ రూ.2,542 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల సామర్థ్యం మెరుగుపడటంతో సంస్థ ఈ కాలంలో రూ.64.25 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.ఉత్పత్తి పరంగా కూడా ఎంఎఫ్ఎల్ సరికొత్త రికార్డులను సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 5,28,400 టన్నుల నీమ్ కోటెడ్ యూరియాను ఉత్పత్తి చేయగా, అమోనియా ఉత్పత్తి కూడా సంస్థ ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని విధంగా 3,26,260 టన్నులకు చేరింది. ముఖ్యంగా పర్యావరణ హితంగా, పొదుపుగా కార్యకలాపాలు నిర్వహించడంలో సంస్థ గణనీయమైన ప్రగతి సాధించింది. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా ఒక టన్ను ఉత్పత్తికి కేవలం 6.875 గిగా కేలరీల (Gcal) శక్తిని మాత్రమే వినియోగించింది. ఇది సంస్థ చరిత్రలోనే నమోదైన అత్యంత తక్కువ శక్తి వినియోగం కావడం విశేషం.ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే..కొత్త గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఎంఎఫ్ఎల్ ఆదాయం పెరగడమే కాకుండా విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 2025లో జరిగిన 59వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కూడా ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను సంస్థ నొక్కి చెప్పింది.
విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి అణు ప్రాజెక్టులు?
భారతదేశ ఇంధన రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దేశంలో అణు విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధిని తన పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఇందుకోసం వ్యాపార నిబంధనల కేటాయింపులో అవసరమైన సవరణలు చేయాలని కోరుతూ కేబినెట్ సెక్రటేరియట్కు ప్రతిపాదనలు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.అంతర్జాతీయ సహకారంతో ప్రాజెక్టులుఅంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) పరిధిలోని రియాక్టర్లతో అణు విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసే బాధ్యతను తమ మంత్రిత్వ శాఖకు అప్పగించాలని విద్యుత్ శాఖ కోరుతోంది. ప్రస్తుతం, అణు విద్యుత్ రంగానికి సంబంధించిన పూర్తి పరిపాలనా అధికారాలు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఆధ్వర్యంలోని అణు శక్తి విభాగం (DAE) వద్ద ఉన్నాయి.‘శాంతి’ చట్టండిసెంబర్ 2025లో ప్రకటించిన ‘సస్టైనబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా’(SHANE - శాంతి) చట్టానికి ముందే ఈ ప్రతిపాదనలు రావడం గమనార్హం. అణు రంగంలో నియంత్రిత పద్ధతిలో పరిమిత ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించడం ఈ చట్టం ఉద్దేశం. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డును (AERB) మరింత బలోపేతం చేసేందుకు ఇది తోడ్పడుతుందని ప్రభుత్వం నమ్ముతుంది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ప్లాంట్లు, భద్రత, ఇంధనం వంటి కీలక అంశాలు మాత్రం యథాతథంగా డీఏఈ పరిధిలోనే ఉంటాయి.2047 నాటికి 100 గిగావాట్ల లక్ష్యంభారతదేశం 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్పీసీఐఎల్(డీఏఈ పరిధిలో) దాదాపు 50 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బాధ్యత వహించాలి. ఎన్టీపీసీ (విద్యుత్ శాఖ పరిధిలో) సుమారు 30 గిగావాట్ల ఉత్పత్తి చేయాల్సి ఉంది. ‘వ్యూహాత్మక ప్లాంట్లు, భద్రత వంటి ప్రధాన అంశాలు డీఈఏ వద్దే ఉండాలి. కానీ విద్యుత్ ఉత్పత్తి పంపిణీ బాధ్యతలు విద్యుత్ శాఖకు బదిలీ చేయడం వల్ల పనుల్లో వేగం పెరుగుతుంది’ అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.నియంత్రణలో స్పష్టతగతంలోని 1962 అణు శక్తి చట్టం ప్రకారం, టారిఫ్ ధరలను సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) సంప్రదింపులతో డీఏఈ నిర్ణయించేది. అయితే, రాబోయే కొత్త నిబంధనలు, ‘శాంతి’ చట్టం ద్వారా టారిఫ్ నిర్ణయాల్లో మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ధరల నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వం వద్దే ఉండనుంది.ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే..
బ్రిక్స్ దేశాల డిజిటల్ కరెన్సీలు అనుసంధానం?
అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటక రంగాల్లో చెల్లింపుల ప్రక్రియను మరింత సరళతరం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక అడుగు వేసింది. బ్రిక్స్(BRICS) కూటమిలోని సభ్య దేశాల అధికారిక డిజిటల్ కరెన్సీలను (CBDC) పరస్పరం అనుసంధానించాలని ఆర్బీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ఈ చర్య ద్వారా అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలర్పై ఉన్న ఆధిపత్యాన్ని తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.2026 బ్రిక్స్ సదస్సు అజెండాలో..2026లో జరగనున్న BRICS సదస్సులో ఈ ప్రతిపాదనను ప్రధాన అజెండాగా చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరగనున్న బ్రిక్స్ సదస్సులో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపడితే సభ్య దేశాల డిజిటల్ కరెన్సీల అనుసంధానంపై తొలిసారిగా అధికారిక ప్రతిపాదన వెలువడే అవకాశం ఉంది.డీ-డాలరైజేషన్ దిశగా అడుగులు..బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన ఈ బ్రిక్స్ కూటమి ప్రత్యామ్నాయ చెల్లింపు వ్యవస్థల వైపు మొగ్గు చూపడంపై అమెరికా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కూటమిని అమెరికా వ్యతిరేకంగా అభివర్ణిస్తూ సభ్య దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని గతంలోనే హెచ్చరించారు. అయితే, భారత్ మాత్రం రూపాయి వాడకాన్ని విస్తరించే ప్రయత్నాలు డీ-డాలరైజేషన్ (డాలర్ వినియోగాన్ని తగ్గించడం) లక్ష్యంగా చేస్తున్నవి కావని, కేవలం వాణిజ్య సౌలభ్యం కోసమేనని స్పష్టం చేస్తోంది.2025 రియో డిక్లరేషన్కు కొనసాగింపు2025లో బ్రెజిల్లోని రియో డి-జెనీరోలో జరిగిన బ్రిక్స్ సదస్సులో సభ్య దేశాల చెల్లింపు వ్యవస్థల మధ్య ‘ఇంటరాపరబిలిటీ’ (పరస్పర అనుకూలత) పెంచాలని నిర్ణయించారు. తాజా ఆర్బీఐ ప్రతిపాదన ఆ నిర్ణయానికి కొనసాగింపుగా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రిక్స్ దేశాల్లో ఏదీ పూర్తిస్థాయిలో డిజిటల్ కరెన్సీని విడుదల చేయనప్పటికీ ఐదు ప్రధాన దేశాలు పైలట్ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి.భారత ‘ఈ-రూపీ’ పురోగతిభారత్ తన డిజిటల్ కరెన్సీ రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. డిసెంబర్ 2022లో ప్రారంభమైన ‘ఈ-రూపీ’కి ప్రస్తుతం 70 లక్షల మంది రిటైల్ వినియోగదారులు ఉన్నారు. ఆఫ్లైన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీల కోసం ఆర్బీఐ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. మరోవైపు చైనా కూడా తన డిజిటల్ యువాన్ అంతర్జాతీయ వినియోగాన్ని పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.సవాళ్లు..బ్రిక్స్ దేశాల డిజిటల్ కరెన్సీల అనుసంధానం అంత సులభం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశాల మధ్య ఉండే వాణిజ్య అసమతుల్యతలు, సాంకేతిక పరమైన భిన్నత్వాలు, పాలనా నియమాలను ఏకీకృతం చేయడం వంటి అంశాలపై లోతైన చర్చలు జరగాల్సి ఉంది. ఈ ప్రతిపాదనపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర సభ్య దేశాల కేంద్ర బ్యాంకులు ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదని గమనించాలి.ఇదీ చదవండి: ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే..
ఫ్యామిలీ
అందరికీ అమ్మమ్మ
‘‘నా ఫ్రెండ్కు ఫోన్ చేస్తే ‘ఇప్పుడు రాకు, సీరియల్ చూస్తున్నా’ అంది. అమ్మమ్మలు నానమ్మలు సీరియల్స్ చూస్తుంటే పిల్లలకు ఎవరు కథలు చెప్తారని పిల్లల కోసంరాయడం మొదలుపెట్టాను. అలా దేశానికే ‘ఆచి’ (అమ్మమ్మ) అయ్యాను’’ అన్నారు సుధామూర్తి. 50 ఏళ్ల వయసులో రాయడం మొదలుపెట్టి తన 50వ పుస్తకం వెలువరించిన సందర్భంగ ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో వేలాది ప్రేక్షకులతో ఆమె మాట్లాడారు. తన మనవరాలిని దృష్టిలో పెట్టుకుని పిల్లలందరి కోసం కథలెలా రాస్తున్నారో వివరించారు.‘మా కాలం అమ్మమ్మలు, నానమ్మల్లా ఇప్పటి అమ్మమ్మలు, నానమ్మలు లేరు. వాళ్లు సీరియల్స్తో బిజీగా ఉన్నారు. కుంకుమ్ తన అత్తగారిని మెప్పిస్తుందా లేదా అని వారి టెన్షన్. కుంకుమ్ ఒక పాత్ర అట. లేదంటే వాళ్లకు వాట్సప్ గ్రూపులున్నాయి. వాటిలో బిజీగా ఉంటున్నారు. మరి పిల్లలకు మంచి విషయాలు ఎవరు చెప్పాలి... ఎలా చెప్పాలి... ఇప్పటికే మైక్రో ఫ్యామిలీల వల్ల పిల్లలు అమ్మమ్మలతో, నానమ్మలతో గడపడం లేదు. ఉన్న అమ్మమ్మలేమో బిజీ. పిల్లల గురించి చాలా నిర్లక్ష్యం సాగుతోంది. అందుకనే పిల్లల కోసం కథలు రాయడం మొదలుపెట్టాను. ఇప్పటికి 50 పుస్తకాలు రాస్తే వాటిలో 30 పిల్లల కోసమే. అందుకే పిల్లలందరూ నన్ను ‘ఆచి’ అని పిలుస్తున్నారు. అలా దేశానికే బామ్మనయ్యాను’ అని హర్షధ్వానాల హోరు మధ్య సుధామూర్తి చెప్పారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో తన 50వ పుస్తకం ‘ది మేజిక్ ఆఫ్ లాస్ట్ ఇయర్ రింగ్స్’ వెలువడ్డ సందర్భంగా ఆమె మాట్లాడారు.→ మనవరాలి కోసం‘లండన్లో పెరుగుతున్న నా ఇద్దరు మనవరాళ్లలో ఒక మనవరాలు అనుష్కకు అక్కడకు వెళ్లినప్పుడల్లా కథలు చెప్పేదాన్ని. ఆ అమ్మాయి లాంటి పాత్ర ‘నూని’ ని సృష్టించి ఆ పాత్రతో ఒక ట్రయాలజీ రాస్తున్నాను. మొదటి భాగం ‘ది మేజిక్ ఆఫ్ ది లాస్ట్ టెంపుల్’లో మన పిల్లలకు తెలియాల్సిన ఆర్కియాలజీ గురించి చెప్పాను. మన దేశంలో ఆర్కియాలజీ ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మన దేశం పురావస్తు శాస్త్రాన్ని పట్టుగొమ్మ. సైన్స్, టెక్నాలజీ చదువులో ఎలాగూ ఉంటుంది. ఆర్కియాలజీ ద్వారా గతాన్ని తెలుసుకోమని ఎవరు చెప్తారు? అందుకే ఆ భాగం రాశాను. రెండో భాగం ‘ది మేజిక్ ఆఫ్ లాస్ట్ ఇయర్ రింగ్స్’ రాశాను. ఇది మన దేశ బాలలకు పార్టిషన్ గురించి తెలియాలని రాశాను’ అన్నారామె.→ సునాక్ కుటుంబం కాందిశీకులే‘నా మనవరాలి వంటి పిల్లలకు దేశ విభజన గురించి ఎందుకు చెప్పాలనుకున్నానంటే నా అల్లుడు రిషి సునాక్ కుటుంబం కూడా కాందిశీకులే. వాళ్లు పాకిస్తాన్ నుంచి దేశ విభజన సమయంలో కట్టుబట్టలతో వలస వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత నైరోబీలో స్థిరపడి అక్కడి నుంచి కూడా యు.కెకు కట్టుబట్టలతో వలస రావాల్సి వచ్చింది. కాలి కింద నేల లేకపోవడం అంటే ఏమిటో, నేలతో పాటు భాష, సంస్కృతిని కూడా కోల్పోవడం అంటే ఏమిటే పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. అయితే ఇది నెగెటివ్ ఇంపాక్ట్ ఇచ్చేదిలా కాకుండా గతంలో పెద్దవాళ్లు చేసిన తప్పును ఇప్పుడు మనం చేయకూడదు... విభజనలు, విడదీయడాలు ఎవరికీ మంచివి కావు అని అర్థమయ్యేలా చెప్పడానికే ఈ పుస్తకం రాశాను. మూడవ భాగం నార్త్ ఈస్ట్ రాష్ట్రాల గురించి రాస్తాను. వాటి గురించి పిల్లలకు ఎవరూ సరిగా చెప్పరు’ అన్నారామె.→ జీవితం సులభం చేయకండిఇవాళ తల్లిదండ్రులు పిల్లలకు అడిగింది సమస్తం అందచేస్తున్నారు. దాంతో వారికి జీవితం ఇంత సులభమనే భావన కలిగిస్తున్నారు. జీవితం ఎంత మాత్రం సులభం కాదు. దానికి దానివైన ఎగుళ్లు, దిగుళ్లు, ఆనందాలు, బాధలు ఉంటాయి. పిల్లల్ని వాటికి ప్రిపేర్ చేయాలి. నా కొడుకు చిన్నప్పుడు కింద పడితే లేపి ‘నడిచిన వాడే పడతాడు. కాళ్లు ఉన్నది నడవడానికి. పడితే లేచి ముందుకు సాగడానికి’ అని చెప్పేదాన్ని. పిల్లలకు సమస్యలే రాకుండా చూడాలనుకోవడం సరి కాదు’ అన్నారామె.రచయితలు కావాలనుకున్న పిల్లలందరూ బాగా పుస్తకాలు చదవాలని, మంచి రచయితలందరూ మంచి పాఠకులని సూచించారామె.– జైపూర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
ప్రకృతి ప్రేమికులకు.. అల్టిమేట్ డెస్టినేషన్
కశ్మీర్ను ‘భూమిపై వెలసిన స్వర్గం’ అని పిలుస్తారు. గుల్మార్గ్ వెళ్తే మీరు కూడా అదే మాట అంటారు. సముద్ర మట్టానికి సుమారు 8,800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే మరో లోకంలోకి వచ్చామా అనే అనుభూతి కలగకమానదు. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మంచు దుప్పటి పరుచుకుని ఉన్నట్టే అనిపిస్తుంది. సాహసాలు చేయాలనుకునే ప్రయాణికులకు, ప్రశాంతత కోసం వెతికే ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక అల్టిమేట్ డెస్టినేషన్.గండోలా రైడ్గుల్మార్గ్లో గండోలా అంటే రోప్వే. ఇది ఈ ప్రాంతం ప్రధాన ఆకర్షణ. ఆసియాలోనే అత్యంత ఎత్తైన గండోలా కూడా ఇదే. గండోలా ప్రయాణం రెండు దశల్లో ఉంటుంది. ఫేజ్ నెం.1 లో గుల్మార్గ్ నుంచి కాంగ్దూరి స్టేషన్ వరకు 8,530 అడుగుల ఎత్తులో గండోలాపై ప్రయాణం ఉంటుంది. ఇది పైన్ చెట్ల మధ్యలోంచి ఈ థ్రిల్లింగ్ రైడ్లా సాగుతుంది. ఫేజ్.2 లో కాంగ్దూరి స్టేషన్ నుంచి అఫర్వట్ పర్వతం వరకు 14,403 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తారు. 12 నిమిషాల రైడ్లో గతంలో ఎప్పుడూ చూడనంత మంచును, మంచు పర్వతాలను వీక్షించవచ్చు.మంచు పర్వతాల దర్శనంచలికాలానికి ముందు గుల్మార్గ్ ఒక అందమైన పువ్వుల లోయగా అలరిస్తుంది. చలికాలం వచ్చేసరికి మంచు ప్రపంచంలా మారిపోతుంది. చలికి డ్రంగ్ అనే జలపాతం గడ్డకట్టుకుపోవడం చూస్తే ప్రకృతి కాలాన్ని ఆపిందేమో, జలపాతాన్ని పాజ్ చేసిందేమో అనిపిస్తుంది. తీవ్రమైన చలిలో ఇక్కడి పర్యాటక ప్రాంతాలన్నీ మంచు ప్రేమికులతో కిటకిటలాడుతాయి. ఇక ఫొటోగ్రఫీ ఇష్టపడే వారికి గుల్మార్గ్లో ప్రతీ ఫ్రేమ్ ఒక పోస్ట్కార్డ్లా కనిపిస్తుంది.ఏమేం చూడాలంటే...గుల్మార్గ్ వెళ్లినప్పుడు మీరు వద్దన్నా మీకు ఎన్నో అందమైన లొకేషన్లు కనిపిస్తాయి. అయితే అవకాశం ఉంటే సెంట్ మేరీ చర్చ్ గోథిక్ శిల్పకళను, అఫార్వత్ పర్వతంపై మంచు మకుటాన్ని, చలికి మంచులా మారిన అల్ఫాథర్ సరస్సును, ఫ్రీజ్ అయిన డ్రంగ్ జలపాతాన్ని, దట్టమైన పైన్ చెట్ల వనాలు, స్థానిక గ్రామాలను, స్థానికుల జీవితాన్ని వెళ్లి చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మంచు కురిసే వేళల్లో ఆకాశం నుంచి జారిపడే మల్లెపువ్వుల్లాంటి స్నో, దూరంగా పొగమంచులోంచి కనిపించి కనిపించనట్టు ఉండే పైన్ చెట్లు, పర్యాటకులు కనిపించగానే స్థానికుల కళ్లలో కనిపించే వెలుగు, కలపతో చేసిన ఇళ్లపై పలకలపై అక్షరాల్లా చేరుకున్న మంచు.. ఇవన్నీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వెళ్లి చూసి అనుభూతి చెందాల్సిందే!పొద్దున్నే కావా.. మధ్యాహ్నం ఛాయ్కశ్మీర్ అనేది ఫుడ్ లవర్స్కు కూడా స్వర్గం లాంటిదే. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కశ్మీరీ కావా (kashmiri kahwa) అనే ఫేమస్ గ్రీన్ టీని అస్సలు మిస్ అవ్వరు. స్థానిక కుంకుమపువ్వు, నట్స్ను కలిపి సర్వ్ చేస్తారు. రోగన్ జోష్, యాఖ్ని, దమ్ ఆలూ ఇవి టేస్ట్ చేయకుండా పర్యాటకులు ఉండలేరు. అలాగే ఇక్కడ అడుగడుగునా చాట్, మ్యాగీ, వజ్వాన్ రుచులు అందుబాటులో ఉంటాయి. పొద్దున్నే కావా, మధ్యాహ్నం చాయ్ అనేది ఎక్కువ మంది టూరిస్టులు ట్రై చేసే కాంబినేషన్.బెస్ట్ స్కీయింగ్ పాయింట్చలికాలంలో గుల్మార్గ్లో స్కీయింగ్, స్నో బోర్డింగ్, స్నో ట్రెక్కింగ్ యాక్టివిటీస్ కోసం భారతీయులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. ఎండాకాలంలో మౌంటెన్ బైకింగ్, ట్రెక్కింగ్ ట్రై చేయవచ్చు.వింటర్లో ఇక్కడ స్కీయింగ్, స్నో బోర్డింగ్ చేయడం అనేది ఒక లైఫ్టైమ్ ఎక్స్పీరియెన్స్. ఇక్కడి స్నో స్పోర్ట్స్ (Snow Sports) ఎంజాయ్ చేయడానికి ప్రొఫెషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచి ఇన్ స్ట్రక్టర్ ఉంటే సరిపోతుంది.జీవితాంతం గుర్తుండే ట్రిప్గుల్మార్గ్లో సూర్యోదయాన్ని అసలు మిస్ అవ్వొద్దు. పిర్ పంజాల్ పర్వత శ్రేణిలో ఉన్న హిమగిరులపై సూర్యకిరణాలు పడి, పర్వతాలు బంగార రంగులో మెరవడం అనేది జీవితాంతం గుర్తుంటుంది. అలాగే కేబుల్ కార్ రైడ్ సమయంలో తనువును మీటే చలిగాలి, పైన్ చెట్ల సువాసన, ఆకాశంలో విన్యాసం చేసే వివిధ రంగులు ఇవన్నీ ఎవరైనా అంత ఈజీగా మర్చిపోగలరా? మనకు తెలియకుండానే మన మనసు కోరుకునే అనుభూతులు ఎన్నో. సూర్యాస్తమయం తరువాత గుల్మార్గ్లోని గ్రామాల్లో వీధి దీపాలు ఎక్కువగా, మనుషులు తక్కువగా కనిపిస్తారు. వెచ్చని దుప్పటిలో ముడుచుకుని పడుకునే సమయంలో స్వర్గం అంటే ఇదేనేమో అనిపిస్తుంది.షాపింగ్గుల్మార్గ్లో కశ్మీరీ హ్యాండీక్రాఫ్టులు, శాలువాలు, కార్పెట్లు, కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్ చాలా ఫేమస్. అలాగే స్థానిక మసాలా దినుసులను కూడా ట్రై చేయవచ్చు. కశ్మీర్ యాపిల్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే మీరు డ్రై యాపిల్ (Dry Apple) గురించి ఎప్పుడైనా విన్నారా? అది కూడా మీరు ఇక్కడ ట్రై చేయవచ్చు.కశ్మీర్ టూరును (Kashmir Tour) ఒక యాత్రలా కాకుండా ఒక స్ట్రెస్ రిలీవింగ్ మాత్రలా భావించవచ్చు. గుల్మార్గ్కు కేవలం అందమైన లొకేషన్ల కోసం మాత్రమే కాకుండా ఇక్కడి వైబ్ను ఫీల్ అవ్వడానికి వెళితే స్వర్గం అంటే ఇదే అనిపించకుండా ఉండదు. కశ్మీర్ వెళ్తే స్వర్గం ఎక్కడ ఉంటుందో అనే ప్రశ్నకు సమాధానం కూడా తెలిసిపోతుంది.గుల్మార్గ్ ఎప్పుడు వెళ్లాలి?చలికాలంలో గుల్మార్గ్ మంచు ప్రపంచంలా మారిపోతుంది. అయితే మార్చి నుంచి జూన్ మధ్యలో పర్యటనకు బెస్ట్ టైమ్. ఈ సమయంలో ఎటు చూసినా పచ్చదనం, పువ్వులు, పర్యాటకుల చిరునవ్వులు కనిపిస్తాయి. దూరం నుంచి భారీ పర్వతాలను చూస్తూ చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టవచ్చు. చలికాలంలో స్నో ఫాల్, వింటర్ స్పోర్ట్స్ కోసం బెస్ట్ టైమ్.ఎలా చేరుకోవాలి?గుల్మార్గ్ చేరుకోవడానికి కశ్మీర్ క్యాపిటల్ శ్రీనగర్ చేరుకోవాలి. శ్రీనగర్కు దేశంలోని అన్ని విమానాశ్రయాల నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ను క్యాబ్ లేదా లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా చేరుకోవచ్చు. షేరింగ్లో కూడా ప్రయత్నించవచ్చు. ఈ ప్రయాణం చాలా అందమైనది. స్నో ఫాల్ (Snowfall) సమయంలో స్థానిక పరిస్థితులను బట్టి ప్లాన్ చేసుకోవాలి.చదవండి: ఇక్కడ మనుషులను తాకితే ఫైన్ వేస్తారు!ఎక్కడ ఉండాలంటే..! గుల్మార్గ్ అనేది ఒక హాట్ టూరిస్ట్ డెస్టినేషన్. వర్షాకాలం మినహా సంవత్సరం మొత్తం పర్యాటకులు దేశవిదేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. గుల్మార్గ్లో బడ్జెట్ హోటల్స్ నుంచి లగ్జరీ రిసార్టుల వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. పీక్ సీజన్లో అడ్వాన్స్ బుకింగ్ తప్పనిసరి. రిసార్టుల్లో ఆధునిక సదుపాయాలు, వ్యాలీ వ్యూ రూములు, ఫైన్ డైనింగ్ సదుపాయాలు ఉంటాయి. బడ్జెట్ ప్రయాణికుల కోసం గెస్ట్ హౌసులు, హోమ్స్టేలు ఉన్నాయి. ఎకో–ఫ్రెండ్లీ కాటేజీలను కూడా ట్రై చేయవచ్చు.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు.కామ్
ఇవాల్టితో శబరిమల దర్శనం ముగియనుంది..!
శబరిమలలోని భక్తుల దర్శనం ఈరోజు రాత్రి 10 గంటలకు ముగుయనుంది. భక్తులను పంప నుంచి సాయంత్రం 5 గంటల వరకే బయలుదేరడానికి అనుమతిస్తారు. ఉదయం కొద్ది మొత్తంలో డబ్బుతో అభిషేకం జరుగుతుంది. నెయ్యాభిషేకం నిన్న ముగిసింది. హరివరాసనం మంత్రోచ్ఛారణతో నాదం ముగిసిన తర్వాత, రాజ ప్రతినిధి సమక్షంలో గురుతి మణిమండపం ముందు ప్రారంభమవుతుంది.రేపు (జనవరి 20), రాజ ప్రతినిధికి మాత్రమే దర్శనం ఉంటుంది. గణపతి హోమం తర్వాత, తిరువాభరణం తిరుగు ప్రయాణం పండలం శ్రాంపిక్కల్ ప్యాలెస్కు బయలుదేరుతుంది. రాజ ప్రతినిధి దర్శనం తర్వాత, ప్రధాన పూజారి అయ్యప్ప విగ్రహానికి విభూతి అభిషేకం చేసి, ఆలయాన్ని మూసివేయడానికి హరివరాసనం పఠిస్తారు. ప్రధాన పూజారి ఆలయ తాళం చెవులను రాజప్రతినిధికి అప్పగిస్తారు. ఇది కూడా ఒక పద్ధతిలో నియమానుసారంగా జరుగుతుంది. 18వ మెట్టు దిగిన తర్వాత ప్రధాని పూజారి దేవస్వం బోర్డు ప్రతినిధులు, శబరిమల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కు తాళలను అప్పగిస్తారు. నెలవారి పూజ ఖర్చులు చెల్లించిన తర్వాత అతను పండలం ప్యాలెస్కు తిరిగి వస్తాడు.ఇదిలా ఉండగా, శబరిమల దర్శనం కోసం స్పాట్ బుకింగ్ కౌంటర్లు నేటి వరకు పనిచేస్తాయి, అప్పటి వరకు అయ్యప్ప భక్తులను దర్శనం చేసుకోవడానికి అనుమతిస్తారు. పంప, నీలక్కల్, ఎరుమేలిలలో స్పాట్ బుకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. జనవరి 19 వరకు వర్చువల్ క్యూ బుకింగ్ అందుబాటులో ఉంటుంది. జనవరి 19న, వర్చువల్ క్యూ ద్వారా 30 వేల మందిని, స్పాట్ బుకింగ్ ద్వారా 5 వేల మంది భక్తులను అనుమతించినట్లు సమాచారం. ఇవాళ మలికప్పురం గురుతిఇవాళ, మలికప్పురం మణిమండపం ముందు శబరిమల యాత్ర ముగుస్తుంది. సన్నిధానం నాదం హరివరాసనం పారాయణంతో ముగిసిన తర్వాత, పండలం రాజప్రతినిధి సమక్షంలో వేడుక జరుగుతుంది. సాయంత్రం గురుతికి సన్నాహాలు ప్రారంభమవుతాయి. మణిమండపం ముందు వాఝపూల, కురుత్తోల ఉపయోగించి ఐదు 64 నేత్రాల కలాలు తయారు చేస్తారు. మధ్యలో ఒక లాంతరు వెలిగిస్తారు. తర్వాత దీపాలు, పూల దండలతో అలంకరిస్తారు.ఈ గురుతి తంతు కూడా ఒకేసారి మలికప్పురం కన్నిమూల ప్రాంతంలో, కోచుకదత్త ముందు, మలికప్పురం గోపురం తూర్పున జరుగుతుంది. మలికప్పురంలోని రాజప్రతినిధి సాయంత్రం సన్నిధానానికి తిరిగి వస్తారు. అక్కడ హరివరాసనం పూర్తి అయ్యి.. రాజప్రతినిధి తిరిగి వచ్చాక ఈ వేడుక ప్రారంభమవుతుంది. అయితే భక్తులు గురుతి మొదటి వేడుకను మాత్రమే చూడగలరు. గురుతికి ముందు, మలికప్పురం మేల్శాంతి కూడా సన్నిధానానికి తిరిగి వస్తారు.మలికప్పురం గురుతి (Malikappuram Guruthi) అంటే శబరిమల అయ్యప్ప దేవాలయం దగ్గర ఉన్న మలికప్పురం దేవతకు నిర్వహించే ఒక ముఖ్యమైన, వార్షిక పూజా కార్యక్రమం. అయ్యప్ప ఆలయానికి మలికప్పురం దేవత (మాలిక్కపురత్తమ్మ) ఉంటుంది. ఇక్కడ గురుతి పూజ అనేది తీర్థయాత్ర ముగింపులో నిర్వహించే సంప్రదాయ ఆచారం. దీనిలో భాగంగా కొండ దేవతల ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేస్తారు. ఈ ఘట్టాన్ని.. అయ్యప్పను సందర్శిన అనంతరం చాలా శుభప్రదంగా భావిస్తారు అయ్యప్ప భక్తులు. (చదవండి: రేపటితో శబరిమల ఆలయం మూసివేత.. ఆదాయం ఎంతంటే?)
జస్ట్ 90 రోజుల్లో 12 కిలోల బరువు..! వెయిట్లాస్ ప్లాన్ ఎలా ఉండాలంటే..
బరువు తగ్గే జర్నీ నిబద్ధతతో కూడిన స్థిర ప్రయాణం. దీనికి ఎలాంటి షార్ట్కట్లు ఉండవు. కేవలం సరైన ఆహారం, చక్కటి వ్యాయామాల కలయికతోటే బరువు తగ్గడం అనేది సాధ్యం. చాలామంది ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్పే మాట ఇది. అదే నిజం అని నిరూపితమైంది కృష్ణ ఇంగ్లే రోగి విషయంలో. ఎన్నో ఏళ్లుగా అధిక బరువుతో అనేక అనారోగ్య సమస్యలతో బాధపడ్డ ఈ వ్యక్తి..జస్ట్ 90 రోజుల్లో ఏదో మ్యాజిక్ చేసినట్లుగా ఏకంగా 12 కిలోల బరువు తగ్గాడు. తనకు అదేలా సాధ్యమైందో కూడా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. మరి అతడి వెయిట్లాస్ సీక్రెట్ ఏంటో సవివరంగా చూద్దామా..!.మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన కృష్ణ ఇంగ్లే ఎక్స్లో తాను అధిక బరువు సంబధిత సమస్యలతో బాధపడుతున్నానని, వెయిట్లాస్ కోసం యూట్యూబ్లో అనేక వీడియోలతో సహా ఏఐ హెల్ప్ కూడా తీసుకున్నట్లు తెలిపాడు. అయితే అవేమి తన బరువుని తగ్గించలేకపోయాయని బాధగా చెప్పుకొచ్చాడు. ఏ చిట్కాలు, సూచనలు పనిచేయకపోవడంతో..కొల్హాపూర్కు చెందిన డాక్టర్ సాయాజీరావు గైక్వాడ్ను సంప్రదించినట్లు తెలిపాడు. ఆయన మంచి కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార ప్రణాళికను సూచించారు. అదే సమయంలో భోజనంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా చూసుకున్నారు. ప్రతి రోజు కనీసం 90 నుంచి 120 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకున్నాడు. స్వీట్స్కి పూర్తిగా దూరంగా ఉన్నాడు. వారానికి ఒకసారి మాత్రమే 10 నుంచి 12 గ్రాముల చక్కెరను పెరుగులో కలుపుకుని తినేవాడు. అలాగే కృష్ణ రోజుకు రెండు పూటలా భోజనం చేయడం, భోజనం తర్వాత 10 నిమిషాల నడక తప్పనిసరిగా పాటించేవాడు. అయితే పడుకోవడానికి కనీసం 2 నుంచి 3 గంటల ముందు రాత్రి భోజనం చేసేలా చూసుకున్నాడు. అంతేకాకుండా వారానికి కనీసం నాలుగు రోజులు బీచ్లో 4 నుంచి 5 కిలోమీటర్లు నడిచేవాడు. ఈ విధమైన ప్రణాళికతో అంతకుమునుపు ఉన్న అధిక బరువు సంబంధిత సమస్యలన్నీ తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా తీవ్రమైన ఎసిడిటీ సమస్య చాలమటుకు నార్మల్ అయ్యింది. అలా కృష్ణ 78 నుంచి 80 కిలోల బరువుకి చేరుకోగానే మొత్తం అనారోగ్య సమస్యలన్నీ చాలావరకు క్యూర్ అయ్యాయని పోస్ట్లో రాసుకొచ్చాడు. అంతేగాదు తాను డైట్లో ఎలాంటి ఫుడ్ తీసుకునేవాడో కూడా తెలిపాడు. కృష్ణ తన భోజనంలో గుడ్లు, చికెన్, పెరుగు, పప్పులు, సోయా చంక్స్ వాటితోపాటు ఆవిరి మీద ఉడికించిన కూరగాయలు, పండ్లు, సలాడ్లు ఉండేలా చూసుకునేవాడనని వివరించాడు. ఇక కృష్ణ విషయంలో బరువు తగ్గడంలో కీలకంగా మారినవి ఏంటో డాక్టర్ సాయాజరివు గైక్వాడ్ ఇలా పంచుకున్నారు.బాగా నిద్రపోవడంఆకలిని అదుపులో ఉంచుకోవడంమనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం తదితరాలే బరువు తగ్గేందుకు హెల్ప్ అయ్యాయని అన్నారు. అందువల్లే ఎసిడిటీ సమస్య తగ్గి, అతనిలో శక్తి స్థాయిలు మెరుగుపడ్డాయని అన్నారు. చివరగా ఆయన.. శరీరానికి పోషణవంతమైన ఆహారాన్ని అందేలా దినచర్యలో భాగం చేసుకోవడం అనేది స్థిరంగా ఉంటే..బరువు తగ్గడం అత్యంత సహజసిద్ధంగానే జరుగుతుందని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం.A follower DM’d me this 👇 (shared with identity hidden)“Your posts changed my mindset about diet.”84–85 kg → 72–73 kg in 90 days.No extremes.Just clarity and consistency. 🙏 pic.twitter.com/7XFgOdP98y— Dr.Sayajirao Gaikwad (@DietDrsayajirao) January 17, 2026 (చదవండి: Republic Day 2026: గణతంత్ర వేడుకల ఆహ్వాన పత్రిక స్పెషాల్టీ ఇదే..! అష్టలక్ష్మి రాష్ట్రాల..)
అంతర్జాతీయం
ఆస్పత్రిలో నర్సు.. అందాల తార!
ఆమె ఓ నర్సు. కాదు కాదు ‘అందాల నర్సు’! కలలు అందరూ కంటారు. కానీ కొందరే వాటిని నిజం చేసుకుంటారు. కువైట్లో నర్సుగా పనిచేస్తున్న బినీషాది అలాంటి ‘అందమైన’ కథే.కేరళకు చెందిన బినీషాకు డ్యాన్స్, మోడలింగ్ పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ, కుటుంబ పోషణ కోసం నర్సింగ్ వృత్తిని ఎంచుకుంది. కానీ ఆమె తన కలలను వదలలేదు. స్టాఫ్ నర్సుగా పని చేస్తూనే.. నృత్యం, మోడలింగ్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. ఈ ప్రయాణంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు 2023లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ను సాధించడం ద్వారా లభించింది.ఇటు నర్సింగ్.. అటు మోడలింగ్ఆరోగ్య సంరక్షణ బినీషా జీవితంలో ఒక భాగం. మోడలింగ్, డ్యాన్సింగ్ ఇతర పార్శ్వాలు. ఈ రెండు ప్రపంచాలను సమానంగా కొనసాగించడం ఆమె ప్రత్యేకత. బినీషా తన తండ్రి బాబు కుటుంబం కోసం పడిన కష్టాలను చూస్తూ పెరిగింది. పాఠశాల రోజుల నుంచే కళలపై ఆసక్తి చూపుతున్న కుమార్తె కలలను తల్లి షీలా ఎంత గానో ప్రోత్సహించింది. పాఠశాల కళల వేదికపై మెరిసినప్పటికీ, కళతో జీవితాన్ని సాగించడం కష్టమని గ్రహించిన బినీషా, వృత్తిపరమైన కోర్సు వైపు మొగ్గు చూపింది. అలా నర్సింగ్ చదివి పూర్తి చేసింది.చదువు పూర్తయ్యాక, నాలుగేళ్ల పాటు ఐసీయూ నర్సుగా పనిచేసింది. అదే సమయంలో, గ్లామ్ గైడెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2023 పోటీలో కేరళకు ప్రాతినిధ్యం వహించిన బినీషా.. దాదాపు 40 మంది పోటీదారుల దాటుకుని టైటిల్ గెలిచింది. ఇప్పుడు తన సోదరి అలీషా చదువులను కూడా బినీషానే చూసుకుంటోంది.
స్పెయిన్లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ
మాడ్రిడ్: స్పెయిన్లో సోమవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొనడంతో 39 మంది మృతి చెందారు. దాదాపు వందమందికి పైగా గాయపడ్డారు. వారిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం మలగా నుంచి మాడ్రిడ్కు వెళ్తున్న ఒక హైస్పీడ్ రైలుకు ఆడమూజ్ సమీపంలో ప్రమాదం జరిగింది. మొదటి రైలు వెనుక భాగం పట్టాలు తప్పి.. పక్కనే మరో రైలు ట్రాక్పై పడింది. ఎదురుగా వస్తున్న రెండో రైలును ఢీకొట్టింది. దీంతో రెండో రైలులోని మొదటి రెండు బోగీలు ట్రాక్పై నుంచి 4 మీటర్ల కిందకి పడి´ యాయి. ఈ రైలు ముందు భాగానికి అత్యంత తీవ్రమైన నష్టం వాటిల్లింది. కొన్ని బోగీలు నాలుగు మీటర్ల కట్ట కిందకు పడిపోయాయి. కొన్ని మెలి తిరిగిపోయాయి. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి దాదాపు 400 మంది ప్రయాణికులున్నారు. కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ సుత్తులు ఉపయోగించి కిటికీలను పగలగొట్టుకుని బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంకా వందల మంది ప్రయాణికులు శిథిలాల కింద ఉన్నారు. వారిని వెలికితీసే పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం కారణంగా మాడ్రిడ్, అండలూసియన్ నగరాలైన కార్డోబా, సెవిల్లె, మలగా, హుయెల్వా మధ్య హై–స్పీడ్ సర్వీసులను సోమవారం నిలిపివేశారు. రైలు పట్టాలు తప్పినప్పుడు గంటకు 179 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ‘ఒక క్షణం భూకంపం వచ్చినట్లు అనిపించిందని, రైలు పట్టాలు తప్పింది’ అని పట్టాలు తప్పిన రైలులో ఉన్న జర్నలిస్ట్ సాల్వడార్ జిమెనెజ్ తెలిపారు. మొదట పట్టాలు తప్పిన రైలు ప్రైవేట్ కంపెనీ ఇర్యోకు చెందినది. తీవ్రంగా నష్టపోయిన రెండో రైలు స్పెయిన్ ప్రభుత్వ రైలు కంపెనీ రెన్ఫేకు చెందినది. హైస్పీడ్ రైలు నెట్వర్క్.. స్పెయిన్ యూరప్లో అతిపెద్ద హై–స్పీడ్ రైలు నెట్వర్క్ను కలిగి ఉన్న దేశం. మాడ్రిడ్, బార్సిలోనా, సెవిల్లె, వాలెన్సియా, మలగా తో సహా ప్రధాన నగరాలను కలుపు తూ 3,000 కిలోమీటర్లకు పైగా ప్రత్యేక ట్రాక్లు న్నాయి.
26కు పెరిగిన పాక్ మాల్ మృతుల సంఖ్య
కరాచీ: పాకిస్తాన్లోకి కరాచీలో జనసమ్మర్థ గుల్ ప్లాజా షాపింగ్ మాల్లో శనివారం రాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారానికి 26కు పెరిగింది. దాదాపు 60 మంది మంది జాడ గల్లంతైంది. మంటలను ఆదివారం రాత్రి అదుపులోకి తెచ్చారు. దీంతో భారీ హోల్సేల్, రిటైల్ దుకాణాల సముదాయమైన ఈ షాపింగ్ మాల్లోకి సోమవారం ఉదయం అగి్నమాపక సిబ్బంది ప్రవేశించి శిథిలాలను తొలగిస్తున్నారు. మరికొందరి మృతదేహాలు లభ్యమవడంతో మరణాల సంఖ్య పెరిగింది. ఇంకా పలువురు ఆచూకీ తెలియాల్సి ఉందని ‘రెస్క్యూ 1122’అధికార ప్రతినిధి హసన్ ఉల్ హసీబ్ఖాన్ చెప్పారు. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య 50 దాటవచ్చని కరాచీ కమిషనర్ హసన్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. ఘటనపై సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలో కోటి పాకిస్తాన్ రూపాయలను ఆయన ఎక్స్గ్రేషియాగా ప్రకటించారు. ప్రమాదంలో షాపింగ్మాల్లోని దాదాపు 300 కోట్ల పాక్ రూపాయల సరకు బుగ్గిపాలైందని అంచనావేస్తున్నారు. భవనం చాలా గంటలపాటు కాలిపోవడంతో నిర్మాణం బాగా దెబ్బతిన్నదని, దాదాపు భవనం మొత్తాన్ని నేలమట్టం చేయాల్సి రావొచ్చని అధికారులు అంచనావేస్తున్నారు. కరాచీలో సరైన రక్షణ, భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, అధిక విద్యుత్ లోడు, అక్రమ నిర్మాణాల కారణంగా గతంలో పలు షాపింగ్ మాల్స్ ప్రమాదాల బారిన పడ్డాయి.
చైనా జనాభా మరింత తగ్గింది!
బ్యాంకాక్: చైనాలో జనాభా తగ్గుదల క్రమంగా సంక్షోభ స్థాయికి చేరుతోంది. గత ఏడాది కాలంలో దేశంలో జనాభా 33.9 లక్షల మేరకు తగ్గి 140.4 కోట్లకు చేరింది. 2025లో దేశంలో జననాల రేటు ఏకంగా 17 శాతం మేరకు పడిపోయింది. ఇక జననాల సంఖ్య కేవలం 79.2 లక్షలుగా నమోదైంది. 2024తో పోలిస్తే 16.2 లక్షల మేరకు తగ్గింది. ఇక 2025లో చైనాలో మరణాల సంఖ్య 1.131 కోట్లుగా నమోదైంది. గత ఐదు దశాబ్దాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం! చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) సోమవారం విడుదల చేసిన తాజా జనాభా లెక్కల్లో ఈ వివరాలను పొందుపరిచింది. ఆ దేశంలో జననాల సంఖ్యలో తగ్గుదల నమోదవడం ఇది వరుసగా నాలుగో ఏడాది! ఈ పరిణామం షీ జింగ్పిన్ సర్కారుకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2100 నాటికి చైనా జనాభా 63.3 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం అంచనా వేసింది. చైనా దశాబ్దాల పాటు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగడం, 2023లో ఆ స్థానాన్ని భారత్కు కోల్పోవడం తెలిసిందే. పెళ్లీ వద్దు, పిల్లలూ వద్దు! చైనాలో జనాభా తగ్గుదల సమస్యకు ప్రధాన కారణం పిల్ల్లల్ని కనడం పట్ల చైనీయుల్లో వ్యక్తమవుతున్న తీవ్ర నిరాసక్తతే. చుక్కలనంటుతున్న జీవన వ్యయం, భరించలేని ఒత్తిళ్ల నడుమ పిల్లల్ని కని పెంచడం తమవల్ల కాదంటూ సగటు చైనీయులు చేతులెత్తేస్తున్నారు. జీవనవ్యయం ఊహాతీతంగా పెరిగిపోతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. యువతీ యువకుల్లో చాలామంది అసలు పెళ్లి మాటే ఎత్తడం లేదు. వీలైనంత కాలం సింగిల్గానే బతుకు బండి లాగించడానికి ఇష్టపడుతున్నారు. దాంతో కొన్నేళ్లుగా చైనాలో పెళ్లిళ్ల సంఖ్యలో కూడా భారీగా తగ్గుదల నమోదవుతోంది. 2024లో దేశవ్యాప్తంగా జరిగిన పెళ్లిళ్లు కేవలం 61 లక్షలే! 2023తో పోలిస్తే ఏకంగా 20 శాతం తగ్గుదల! అంతేకాదు, గత 45 ఏళ్లలో అత్యల్పం కూడా!! దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సంఖ్య గత పదేళ్లుగా తగ్గుతూనే వస్తోంది. అయితే 2025లో మాత్రం చైనాలో పెళ్లిళ్ల సంఖ్య 8.5 శాతం పెరుగుదల నమోదైంది. పెరుగుతున్న వృద్ధులు వృద్ధుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుండటం చైనా నాయకత్వాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తున్న అంశం. ప్రస్తుతం అక్కడ వృద్ధుల సంఖ్య 32.3 కోట్లు. మొత్తం జనాభాలో ఇది ఏకంగా 23 శాతం! అక్కడ వృద్ధుల సంఖ్య ఏటా పెరుగుతూనే వస్తోంది. అదేసమయంలో పనిచేసే వయసువారి సంఖ్యలో తగ్గుదల నమోదవుతోంది. 2035 నాటికి చైనాలో వృద్ధుల సంఖ్య 40 కోట్లు దాటుతుందని అంచనా. కారి్మకుల లభ్యత భారీగా తగ్గుతుండటంతో రిటైర్మెంట్ వయసును పురుషులకు 60 నుంచి 63 ఏళ్లకు, మహిళలకు 55 నుంచి 58 ఏళ్లకు చైనా పెంచేసింది.‘పామూ’ కారణమేనా?చైనాలో జననాలు భారీగా తగ్గడానికి మరో గమ్మత్తైన కారణం కూడా తెరపైకి రావడం విశేషం. అదే... స్నేక్ ఇయర్! చైనా క్యాలెండర్ ప్రకారం 2025 వుడ్ స్నేక్ నామ సంవత్సరం. పాము పేరిట వచ్చే ఏడాది పిల్లల్ని కనేందుకు అస్సలు అనువైనది కాదన్నది చైనీయుల నమ్మకం. ఈ కారణంగా కూడా గతేడాది జననాల రేటు బాగా తగ్గిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనాలో సంవత్సరాలకు జంతువుల పేర్లు పెట్టడం వేల ఏళ్లనాటి సంప్రదాయం. 12 ఏళ్లకు 12 జంతువుల పేర్లుంటాయి. వన్ చైల్డ్ పాలసీ జనాభా నియంత్రణకు దశాబ్దాల పాటు చైనా అనుసరించిన కఠిన నిబంధనలు కూడా ప్రస్తుత పరిస్థితికి మరో ప్రధాన కారణంగా మారాయి. ఒక్కరి కంటే ఎక్కువ మందిన ఇకనేందుకు వీల్లేదన్న నిబంధనను 1980 ఉంచి చైనా అత్యంత కఠినంగా అమలు చేయడం తెలిసిందే. జనాభా తగ్గుదల నేపథ్యంలో పదేళ్ల క్రితం ఈ నిబంధనను ఎత్తేసినా లాభం లేకపోయింది. దంపతులు ఇద్దరు పిల్లల్ని కనొచ్చంటూ 2015లో నిబంధనలను చైనా ప్రభుత్వం సడలించింది. ఐదేళ్లయినా పెద్దగా ఫలితం లేకపోవడంతో 2021లో దాన్ని ముగ్గురు పిల్లలకు పెంచింది. అయినా జనం మాత్రం ఎక్కువ మందిని దేవుడెరుగు, ఒక్కర్ని కూడా కనేందుకు ఇష్టపడటం లేదు! ఒక్కో కాన్పుకు 3,600 యువాన్లు (500 డాలర్లు) ఇస్తామన్న ప్రకటన కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అంతేగాక ప్రతి పిల్లాడికీ పెంపకం నిమిత్తం ఏటా 1,534 డాలర్లు ఇస్తామన్నా జనం అంతగా పట్టించుకోలేదు. ఇలా కాదని ప్రభుత్వం కండోమ్ల వాడకాన్ని తగ్గించే చర్యలకు దిగింది. అందులో భాగంగా వాటిపై, గర్భ నిరోధక మాత్రలపై ఎడాపెడా పన్నులు పెంచేసింది. కండోమ్లపై అయితే జనవరి 1 నుంచి పన్నులను మరో 13 శాతం పెంచేసింది! అంతేగాక డే కేర్ సెంటర్లు, కేజీ స్కూళ్లకు పలు పన్ను మినహాయింపులు వంటి పలు చర్యలకు కూడా దిగింది. అయినా జనాభా పెరుగుదల విషయంలో ఆశించిన ఫలితాలు పెద్దగా కనిపించడం లేదని తాజా గణాంకాలు మరోసారి తేల్చేశాయి. ఒక దేశంలో జనాభా పెరగాలంటే మహిళల సగటు సంతాన సాఫల్య రేటు కనీసం 2.1, అంతకు మించి ఉండాలి. కానీ చైనాలో మాత్రం అది 2020 నాటికే ఏకంగా 1.3కి తగ్గిపోయింది! ఇక 2025లోనైతే ఆ దేశంలో జననాల రేటు ప్రతి 1,000 మంది జనాభాకు ఏకంగా 5.63 శాతానికి తగ్గిపోయింది. 1949లో మావో జె డాంగ్ సారథ్యంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచీ ఆ దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఇదే అత్యల్పం! చైనాతో పాటు తైవాన్, సింగపూర్, దక్షిణ కొరియా వంటి పలు తూర్పు ఆసియా దేశాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తూ వస్తోంది!!
జాతీయం
ప్రేమ వివాహం చేసుకున్నాడని గ్రామ బహిష్కరణ
తమిళనాడు: కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో నాలుగేళ్లుగా గ్రామానికి రానివ్వకుండా బహిష్కరించి, వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ బాధితుడు సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలూకా ఓబులాపురం గ్రామానికి చెందిన ప్రేమ్(27). ఇతను ఎంబీసీ కులానికి చెందిన వ్యక్తి. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మత్స్యకార కుటుంబానికి చెందిన భానుమతి(24)ని ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. దీంతో గ్రామ పెద్దలు ప్రేమ్తోపాటు అతడి కుటుంబ సభ్యులను గ్రామ బహిష్కరణ చేసినట్టు తెలుస్తుంది. దీంతోపాటు గ్రామంలోకి ప్రవేశించకూడదని, ఆలయంలోని గుడికి రాకూడదు, గ్రామంలో వెళ్లకూడదు, శుభ కార్యంలో పాల్గొన కూడదని నిబంధన విధించారు. దీంతో పాటు గత రెండు రోజుల క్రితం తన ఇంటిని సైతం ధ్వంసం చేశారని, ఇదే విషయంపై ఆరంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించాడు. తమను గ్రామ బహిష్కరణ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోడంతోపాటు తమకు భద్రత కలి్పంచాలని కోరుతూ బాధితుడు తల్లిదండ్రులు, భార్యతో కలిసి ఆందోళన నిర్వహించాడు.
కమల దళపతిగా నితిన్ నబీన్
ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్.. జెపీ నడ్డా నుంచి బాధ్యతలు స్పీకరించారు. ఇవాళ(జనవరి 20, మంగళవారం) ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజానాథ్ సింగ్, పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలడని.. ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయన్నారు. ‘‘నేను బీజేపీ కార్యకర్త.. నితిన్ నాకు బాస్. బీజేపీలో నిర్ణయాలు, ఎంపికలు అన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయి. దేశసేవ, ప్రజాసేవే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది’’ అని మోదీ పేర్కొన్నారు.‘‘ప్రభుత్వానికి అధిపతి అయినా... బీజేపీ కార్యకర్త కావడమే నాకు గర్వ కారణం. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను నితిన్ నబీన్ విజయవంతంగా నిర్వహించారు. తనను తాను రుజువు చేసుకున్నారు. పార్టీ కంటే, దేశం ముఖ్యమనే నినాదంతో పనిచేస్తున్నాం. కుటుంబ రాజకీయ పార్టీలు యువకులకు తలుపులు మూసేస్తున్నాయి. ఇలాంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువకులను రాజకీయ నాయకులను తయారు చేయాలనుకుంటున్నాను..బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం పనిచేస్తుంది. మోదీకి అనుకూలంగా వార్తలు రాసినా, చెప్పినా వారిని అర్బన్ నక్సల్స్ టార్గెట్ చేస్తున్నారు. అర్బన్ నక్సలైట్ల ఆగడాలను అరికట్టాలి. కాంగ్రెస్ పార్టీ అధోగతికి ఆ పార్టీ విధానాలు కారణం. కుటుంబ రాజకీయాలే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచాయి. కాంగ్రెస్ లక్షణాలు మన పార్టీకి అంటకుండా జాగ్రత్తపడాలి’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు.కాగా, 26 ఏళ్లకే ఎమ్మెల్యే. 45వ ఏటే బీజేపీ వంటి అతి పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కునిగా రికార్డు. నితిన్ నబీన్ రాజకీయ ప్రస్థానం తొలినుంచీ ఆసక్తికరమే. ఆయన ఎన్నికతో బీజేపీ పగ్గాలు రెండో తరం చేతికి అందినట్టయింది.నిజానికి బీజేపీలో జాతీయ స్థాయి ప్రముఖ నేతల జాబితాలో నబీన్ పేరు ఎప్పుడూ పెద్దగా లేదు. అలాంటి నేతలకు ఏకంగా అధ్యక్ష పగ్గాలు అందడం అనూహ్యమనే చెప్పాలి. నబీన్ జన్మించింది బీజేపీ పురుడు పోసుకున్న 1980లోనే కావడం విశేషం. ఆయన జార్ఖండ్లోని రాంచీలో జన్మించారు. ఆయన కాయస్థ కులస్తుడు.యువకుడే అయినా పాలన, పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు తదితరాల్లో అపార అనుభవం ఆయన సొంతం. నబీన్ రాజకీయ ప్రస్థానం బీజేపీ యువజన విభాగమైన యువమోర్చాతో మొదలైంది. నబీన్ కుటుంబానికి ఆరెస్సెస్తో సన్నిహిత బంధముంది. ఆయన తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కూడా బీజేపీ నాయకుడే. పట్నా వెస్ట్ ఎమ్మెల్యేగా ఉంటూ 2006లో మరణించారు. దాంతో జరిగిన ఉప ఎన్నికలో నబీన్ ఏకంగా 60 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అప్పటినుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు! 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ ఇన్చార్జిగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ పార్టీని విజయపథంలో నడిపి జాతీయ నాయకత్వాన్ని మెప్పించారు.తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా ఛత్తీస్గఢ్లో 11 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 10 సీట్లు నెగ్గేలా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి నడ్డా వారసునిగా పలువురు ప్రముఖుల పేర్లు విన్పించినా, పార్టీ నాయకత్వం మాత్రం అనూహ్యంగా నబీన్ వైపు మొగ్గింది. గత డిసెంబర్ 16న ఆయనను తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించింది. మంగళవారం ఆయన నుంచి నబీన్ లాంఛనంగా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకోనున్నారు. ఆయనకు భార్య దీప్మాలా శ్రీవాత్సవ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కీలకమైన పశ్చిమబెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడపాల్సిన గురుతర బాధ్యత నబీన్ భుజస్కంధాలపై ఉంది.
మహిళా పోలీసుల టాయిలెట్లో రహస్య వీడియోలు
చెన్నై: రామనాథపురం జిల్లా పరమకుడిలో శనివారం ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అమరవీరుడు ఇమాన్యుయేల్ శేఖరన్ మణి మండపాన్ని ప్రారంభించడానికి వచ్చారు. ఆయన భద్రతా విధుల కోసం రామనాథపురం, శివగంగై, విరుదునగర్, నెల్లై, తూత్తుకుడి, తంజావూరు వంటి వివిధ జిల్లాల నుంచి పురుష, మహిళా పోలీసు అధికారులు అక్కడికి వచ్చారు.ఈ స్థితిలో, తంజావూరు నుంచి మహిళా పోలీసు అధికారులను పరమకుడిలోని మణినగర్ ప్రాంతంలోని అవుట్పోస్ట్ చెక్ పోస్ట్ వద్ద మోహరించారు. పరమకుడి నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న స్పెషల్ సబ్–ఇన్స్పెక్టర్ ముత్తుపాండిని కూడా భద్రతా పనుల కోసం నియమించారు. ఈ అవుట్పోస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఓ టాయిలెట్ ఉంది. భద్రతా విధుల్లో ఉన్న తంజావూరుకు చెందిన మహిళా పోలీసులకు ఈ టాయిలెట్ను కేటాయించారు. అందులోకి వెళ్లిన సమయంలో కొంతమంది మహిళా పోలీసు అధికారులు టాయిలెట్లో దాచిన సెల్ఫో¯న్ను చూసి అనుమానం వ్యక్తం చేశారు. తరువాత, వారు దానిని బయటకు తీసినప్పుడు, అది వీడియో రికార్డ్ చేస్తున్నట్లు గుర్తించారు. మహిళా పోలీసు అధికారులు టాయిలెట్లోకి ప్రవేశించే దృశ్యాలు అందులో ఉండడం చూసి వారు దిగ్భ్రాంతి చెందారు. వెంటనే వారు సెల్ఫోన్ను స్వా«దీనం చేసుకుని పరమకుడి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా.. అది స్పెషల్ సబ్–ఇ¯న్స్పెక్టర్ ముత్తుపాండి సెల్ ఫోన్ అని తేలింది. దర్యాప్తులో, స్పెషల్ సబ్–ఇన్స్పెక్టర్ ముత్తుపాండి ఎవరూ లేని సమయంలో టాయిలెట్లోకి వెళ్లాడని, ఆపై తన సెల్ ఫో¯న్లో వీడియోను ఆన్ చేసి ఎవరికీ తెలియకుండా ఒక ప్రదేశంలో దాచాడని తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి స్పెషల్ సబ్–ఇ¯న్స్పెక్టర్ ముత్తుపాండిని ఆదివారం అరెస్టు చేసి రామనాథపురం జైలుకు తరలించారు.
అదే జరిగి ఉంటే..? నోయిడా టెక్కీ ప్రాణాలతో ఉండేవాడేమో!
నోయిడాలో సెక్టార్-150లో నీటితో నిండిన గోతిలో పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ యువరాజ్ మెహతా మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ గోతిలో నీరు చేరకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రాజెక్టు అవసరమని ఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖ మూడేళ్ల క్రితమే నోయిడా అథారిటీకి లేఖ రాసింది. కానీ.. ఆ లేఖ ఫైళ్లలోనే మరుగునపడిపోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. చివరకు గత శుక్రవారం రాత్రి యువరాజ్ను ఆ నీటి గుంత బలితీసుకుంది.పీటీఐ కథనం ప్రకారం.. 2023లో యూపీ నీటిపారుదల శాఖ నోయిడా అథారిటీకి ఒక అధికారిక లేఖ పంపింది. వర్షపు, డ్రైనేజీ నీరు నిల్వ ఉండకుండా, దానిని హిండన్ నదిలోకి మళ్లించడానికి అక్కడ 'హెడ్ రెగ్యులేటర్లు' ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకోసం బడ్జెట్ కేటాయింపులు కూడా జరిగాయి. కానీ, ఆ లేఖపై నోయిడా అథారిటీ ఎలాంటి చర్య తీసుకోలేదు. దీనిపై అడిగితే తమకు అలాంటి లేఖ ఏదీ అందలేదని ఒక అధికారి పీటీఐకి తెలిపాడు.గత శుక్రవారం(జనవరి 23) రాత్రి యువరాజ్ గురుగ్రామ్లోని తన ఆఫీసు నుంచి కారులో నోయిడా సెక్టార్ 150లోని ఇంటికి వస్తున్నాడు. ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉండగా, మంచు కారణంగా దారి సరిగ్గా కనిపించకపోవడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన లోతైన గోతిలో పడిపోయింది. ఆ గొయ్యి కేవలం వర్షపు నీటితోనే కాకుండా, సమీపంలోని నివాస ప్రాంతాల డ్రైనేజీ నీటితో నిండిపోయి ఉంది.కారు గోతిలో పడగానే యువరాజ్ తన తండ్రికి ఫోన్ చేశాడు. సాయం కోసం అభ్యర్థించాడు. వెంటనే తండ్రి పోలీసులుకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చినా దట్టమైన మంచు కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. యువరాజ్ తన ఫోన్ టార్చ్ వెలిగించి సుమారు 90 నిమిషాల పాటు (అర్ధరాత్రి 1.30 గంటల వరకు) సహాయం కోసం కేకలు వేశాడని, ఆ తర్వాతే మునిగిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తెల్లవారుజామున 4.30 గంటలకు అతని మృతదేహం లభ్యమైంది.ఈ ఘటనపై యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణకు ముగ్గురు సభ్యుల సిట్ బృందాన్ని నియమించింది. నిర్లక్ష్యం వహించినందుకు నోయిడా అథారిటీ సీఈఓను బదిలీ చేసి వెయిటింగ్ లిస్టులో పెట్టింది. కాగా, యువరాజ్ తండ్రి ఫిర్యాదు మేరకు విష్టౌన్ ప్లానర్స్, లోటస్ గ్రీన్స్ సంస్థలపై కేసు నమోదైంది. అయితే, లోటస్ గ్రీన్స్ ఈ ఘటనతో తమకు సంబంధం లేదని పేర్కొంది. తాము ఆ స్థలాన్ని 2019-20లోనే 'గృహప్రవేశ్ గ్రూప్'కు బదిలీ చేశామని, వారే బేస్మెంట్ పనులు మొదలుపెట్టి మధ్యలో ఆపేశారని క్లారిటీ ఇచ్చింది. అక్కడ కనీసం బారికేడ్లు గానీ, వెలుతురునిచ్చే రిఫ్లెక్టర్లు గానీ లేవని.. తన కుమారుడిలా మరెవరూ ప్రాణాలు కోల్పోకూడదంటూ యువరాజ్ తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు.
ఎన్ఆర్ఐ
భారతీయ విద్యార్థులకు అమెరికా బిగ్ వార్నింగ్
భారతీయ విద్యార్థులకు అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వీసా అనేది హక్కేం కాదని.. తమ చట్టాలను ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని హెచ్చరించింది. వీసా రద్దుతో పాటు దేశ బహిష్కరణ కూడా ఖాయమని స్పష్టం చేసింది. భారత్లోని యూఎస్ ఎంబసీ బుధవారం ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. అందులో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు హెచ్చరిక జారీ చేసింది. అందులో.. ‘‘అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీసా అనేది హక్కు కాదు. అది ఒక ప్రత్యేక అవకాశం మాత్రమే’’ అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. దేశం నుంచి వెల్లగొట్టడమే కాకుండా భవిష్యత్తులో వీసా అర్హత కోల్పోవచ్చని స్పష్టం చేసింది. Breaking U.S. laws can have serious consequences for your student visa. If you are arrested or violate any laws, your visa may be revoked, you may be deported, and you could be ineligible for future U.S. visas. Follow the rules and don’t jeopardize your travel. A U.S. visa is a… pic.twitter.com/A3qyoo6fuD— U.S. Embassy India (@USAndIndia) January 7, 2026ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. స్టూడెంట్ వీసా ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫీజులను గణనీయంగా పెంచడంతో పాటు సోషల్ మీడియా తనిఖీలు తప్పనిసరిగా మారాయి. అలాగే స్టూడెంట్ స్టేకు టైమ్ లిమిట్ వంటి నిబంధనలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ మార్పులు అమెరికాలో చదవాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బెదిరింపులు రావడం గమనార్హం.
అమెరికాలో తెలుగు దంపతుల దుర్మరణం
వాషింగ్టన్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రానికి చెందిన దంపతులు దుర్మరణం చెందారు. ఈరోజు(సోమవారం) వాషింగ్టన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణ కిషోర్, ఆశలు మృతిచెందారు. అమెరికాలో కృష్ణకిషోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తన్నాడు. ఓ కార్యక్రమం మీద బయటకు వెళ్లి తిరిగి కారలో వస్తుండగా వీరు రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతించెందారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిది భారత్లోని తెలుగు రాష్ట్రం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుగా గుర్తించారు. పది రోజుల క్రితమే కిషోర్ పాలకొల్లుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తన్నారు. పాలకొల్లు వచ్చిన సమయంలో తమ కలిసి వెళ్లాడని పలువురు స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు.
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య!
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. న్యూ ఇయర్ వేడుకల రోజున అదృశ్యమైన నికితా గోడిశాల అనే యువతి తన మాజీ ప్రియుడు ఫ్లాట్లో శవమై కనిపించింది. మేరీల్యాండ్లోన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఫ్లాట్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దాంతో అర్జున్ శర్మనే ఆమెన హత్య చేసినట్లు పోలీసుల భావిస్తున్నారు. ప్రస్తుతం అర్జున్ శర్మ పరారీలో ఉన్నాడు. అతని కోసం యూఎస్ పోలీసులు గాలిస్తున్నారు.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నిఖిత.. ప్రస్తుతం ఆమె హోవర్డ్ కౌంటీలో ఉన్న ఎల్లికాట్ సిటీలో డేటా మరియు స్ట్రాటజీ అనలిస్ట్గా పనిచేస్తుంది.మాజీ ప్రియుడిపై ఫస్ట్- సెకండ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపుతూ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. జనవరి 2వ తేదీన ఆమె అవృశ్యమైన ఫిర్యాదు తమకు వచ్చిందని, ఈ మేరకు విచారణ చేపడితే ఆమె హత్య గావించబడ్డ విషయం తాజాగా వెలుగుచూసిందన్నారు. మేరీల్యాండ్ సిటీలోని అర్జున్శర్మ ఫ్లాట్లో ఆమె డిసెంబర్ 31వ తేదీన చివరిసారి కనిపించినట్లు పోలీసులకు అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. అదే అపార్ట్మెంట్లో సెర్చ్ వారెంట్ అమలు చేసి దర్యాప్తు ప్రారంభించగా, కత్తిపోట్లతో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆమెది తెలంగాణ రాష్ట్రంగా అనుమానిస్తున్నారు. ఆమె స్వస్థలంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే అర్జున్ శర్మది కూడా ఇండియానే. హత్య చేసిన తర్వాత అర్జున్ శర్మ భారత్కు వచ్చేశాడు.హత్యోదంతం తర్వాత భారత్కు వచ్చేసిన అర్జున్ శర్మను తమిళనాడులో అరెస్టు చేశారు. అర్జున్ శర్మది తమిళనాడు రాష్ట్రంగా తెలుస్తోంది.
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో మాజీ ఉపరాష్ట్రపతి ఆత్మీయ సమ్మేళనం
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం సింగపూరులోని నేషనల్ పబ్లిక్ స్కూలు ఆవరణలో దాదాపు 400 మంది ఆహూతులు సమక్షంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ అధ్యక్షత వహిస్తూ మాట్లాడుతూ, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ప్రారంభమే వెంకయ్య నాయుడు ఆశీస్సుల సందేశంతో జరిగిందని, అప్పటి నుంచి ప్రతి దశలోనూ వారి మార్గదర్శకత్వం, సూచనలు, ప్రోత్సాహం తమకు నిరంతరం లభిస్తూనే ఉన్నాయని తెలిపారు. అలాగే అతి తక్కువ సమయంలో సమాచారం అందించినప్పటికీ, సమయాన్ని సర్దుబాటు చేసుకుని కార్యక్రమానికి హాజరైన సింగపూరు భారతీయ హైకమిషనర్ డా. శిల్పక్ అంబులే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్య అతిథి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కుటుంబంలో, సమాజంలో, దేశంలో ఐక్యత ఉన్నప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. దేశంలో ఉన్న ప్రతిఒక్కరూ, నేతలందరూ ఐక్యంగా ఉండాలి. ఎన్నికల వరకే ప్రత్యర్థులు. ఆ తర్వాత అందరం భారతీయులం. ఐక్యంగా ఉంటే శాంతి ఉంటుంది. ‘‘భాష పోతే శ్వాస పోతుంది" అంటూ మాతృభాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను శ్రీ వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. తెలుగులోని గొప్ప సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించి ప్రపంచానికి అందించాలని విదేశాల్లోని తెలుగువారికి పిలుపునిచ్చారు.శ్రీ సాంస్కృతిక కళాసారథి గాయని–గాయకులు ఆలపించిన “మా తెలుగు తల్లికి” గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. సింగపూరులోని ప్రముఖ తెలుగు సంస్థలైన తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగుదేశం ఫోరమ్, కాకతీయ సంస్కృతిక పరివారం, APNRT ప్రతినిధులు హాజరై శ్రీ వెంకయ్య నాయుడు గారిని ఘనంగా సన్మానించారు.తదుపరి కార్యక్రమానికి హాల్ను సమకూర్చిన కొత్తమాస్ వెంకటేశ్వర రావు (KV Rao, SIFAS) , నేషనల్ పబ్లిక్ స్కూల్ సిబ్బందిని అభినందించారు. అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ అందించిన హనుమంత రావు మాదల, నాగులపల్లి శ్రీనివాసు, శివప్రసాద్ టీమ్, సరిగమ గ్రాండ్, సూపర్ డీలక్స్, కూల్ టైం, వీర ఫ్లేవర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. గాయని–గాయకులు సౌభాగ్యలక్ష్మి తంగిరాల, చంద్రహాస్ ఆనంద్, శేషుకుమారి యడవల్లి, ఉషాగాయత్రి నిష్టల, అలాగే శరజ అన్నదానం, సౌమ్య ఆలూరు, కృష్ణ కాంతి లను శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ, రామాంజనేయులు చామిరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సుబ్బు వి. పాలకుర్తి వ్యాఖ్యానం అందించగా, వంశీ కృష్ణ శిష్ట్లా, కుమారస్వామి గుళ్లపల్లి సాంకేతిక సహకారం అందించారు. అలాగే మాధవి పాలకుర్తి, మమత మాదాబత్తుల సత్య జాస్తి, రేణుక చామిరాజు, ప్రసన్న భరద్వాజ్, శ్రీలలిత తదితరులు వాలంటీర్ సేవలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానంతరం విచ్చేసిన ఆహుతులందరికీ సరిగమ గ్రాండ్ వారు ఏర్పాటు చేసిన విందు భోజనంతో కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో ముగిసింది.
క్రైమ్
ఆ కుటుంబంలో వరుస మరణాలు
పల్నాడు జిల్లా: భార్య, బిడ్డల కోసం వెళుతున్న భర్త రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. విధి ఆడిన వింత నాటకంలో భార్య బిడ్డలను చూడకుండానే భర్త కన్నుమూశాడు. ఈ హృదయవిదార ఘటన నడికుడి సమీపంలో సోమవారం జరిగింది. ఈ ఘటనలో మండలంలోని గామాలపాడుకి చెందిన సంకురాత్రి జగపతిబాబు(28) మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గామాలపాడుకి చెందిన ముక్కంటి, వెంకటరావమ్మ దంపతులకు జగపతిబాబు ఏకైక కుమారుడు కాగా కుమార్తె కూడా సంతానం. కారంపూడి మండలం ఒప్పిచర్లకి చెందిన రవళితో జగపతిబాబుకి వివాహాం కాగా వీరికి సాత్విక్(3), హేమశ్రీ(1) సంతానం. – నడికుడి మార్కెట్యార్డు వద్ద ఉన్న పెట్రోల్ బంకులో జగపతిబాబు పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగ కోసం భార్య రవళి ఆమె పుట్టింటికి వెళ్లింది. సంక్రాంతి పండుగ రోజు జగపతిబాబు కూడా అత్తగారింట్లోనే ఉండి ఆ తరువాత గామాలపాడుకి వచ్చాడు. పండుగ ముగియటంతో భార్య, పిల్లలను తీసుకువచ్చేందుకు ద్విచక్రవాహనంపై జగపతిబాబు బయలుదేరాడు. ఈ క్రమంలో నడికుడి దాటిన తరువాత జామతోట వద్ద టాటా ఏసీ వాహనం ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి వెళ్లాయి. ఈ ఘటనలో జగపతిబాబు తలకు బలమైన గాయాలు కాగా టాటా ఏసీ వాహనం డ్రైవర్ బెల్లంకొండ మండలం చిన్నరాజుపాలెంకి చెందిన కలపాల వీరయ్య కూడా తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ జగపతిబాబు మృతిచెందగా మెరుగైన వైద్యం కోసం వీరయ్యని గుంటూరుకు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ జి.పాపారావు పరిశీలన చేశారు. మృతుడు జగపతిబాబు భార్య రవళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగపతిబాబు కుటుంబంలో వరుస మరణాలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జగపతిబాబు కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్నది. జగపతిబాబు తల్లిదండ్రులు ముక్కంటి, వెంకటరావమ్మలు మృతిచెందగా తోడబుట్టిన చెల్లెలు కూడా మృతిచెందింది. ముక్కంటి తాలుకా కుటుంబ సభ్యులంతా మృతిచెందగా జగపతిబాబు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో జగపతిబాబు కూడా మృతిచెందటంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. జగపతిబాబు, రవళి దంపతులకు మూడేళ్ల కుమారుడు సాతి్వక్, ఏడాది వయస్సున హేమశ్రీ సంతానం. పెట్రోల్ బంకులో పనిచేస్తూ జగపతిబాబు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జగపతిబాబు కూడా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందటంతో భార్య, పిల్లలు అనాధలయ్యారు. ⇒ సంఘటన గురించి తెలిసిన వెంటనే భార్య, ముక్కుపచ్చలారని పిల్లలు గురజాల ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి బోరన విలపించారు. నువ్వు లేకుండా మేమేట్లా బతకాలయ్యా అంటూ రవళి ఏడుస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పిల్లలిద్దరిని నేనేట్ల బ్రతికించాలయ్యా అంటూ రవళి గుండెలు పగిలేలా రోధిస్తుంది. చిన్నారులైన సాత్విక్, హేమశ్రీలు మా నాన్నకి ఏమైందని చూస్తున్న తీరు కూడా అక్కడున్నవారిని తీవ్రంగా కలచివేసింది. బంధువులు, కుటుంబ సభ్యులు చిన్నారులను హత్తుకుని రోదించారు. జగపతిబాబు కుటుంబంలో జరుగుతున్న వరుస ఘటనలతో గామాలపాడు విషాదఛాయలు అలుముకున్నాయి.
మహిళా పోలీసుల టాయిలెట్లో రహస్య వీడియోలు
చెన్నై: రామనాథపురం జిల్లా పరమకుడిలో శనివారం ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అమరవీరుడు ఇమాన్యుయేల్ శేఖరన్ మణి మండపాన్ని ప్రారంభించడానికి వచ్చారు. ఆయన భద్రతా విధుల కోసం రామనాథపురం, శివగంగై, విరుదునగర్, నెల్లై, తూత్తుకుడి, తంజావూరు వంటి వివిధ జిల్లాల నుంచి పురుష, మహిళా పోలీసు అధికారులు అక్కడికి వచ్చారు.ఈ స్థితిలో, తంజావూరు నుంచి మహిళా పోలీసు అధికారులను పరమకుడిలోని మణినగర్ ప్రాంతంలోని అవుట్పోస్ట్ చెక్ పోస్ట్ వద్ద మోహరించారు. పరమకుడి నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న స్పెషల్ సబ్–ఇన్స్పెక్టర్ ముత్తుపాండిని కూడా భద్రతా పనుల కోసం నియమించారు. ఈ అవుట్పోస్ట్ చెక్ పోస్ట్ వద్ద ఓ టాయిలెట్ ఉంది. భద్రతా విధుల్లో ఉన్న తంజావూరుకు చెందిన మహిళా పోలీసులకు ఈ టాయిలెట్ను కేటాయించారు. అందులోకి వెళ్లిన సమయంలో కొంతమంది మహిళా పోలీసు అధికారులు టాయిలెట్లో దాచిన సెల్ఫో¯న్ను చూసి అనుమానం వ్యక్తం చేశారు. తరువాత, వారు దానిని బయటకు తీసినప్పుడు, అది వీడియో రికార్డ్ చేస్తున్నట్లు గుర్తించారు. మహిళా పోలీసు అధికారులు టాయిలెట్లోకి ప్రవేశించే దృశ్యాలు అందులో ఉండడం చూసి వారు దిగ్భ్రాంతి చెందారు. వెంటనే వారు సెల్ఫోన్ను స్వా«దీనం చేసుకుని పరమకుడి ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా.. అది స్పెషల్ సబ్–ఇ¯న్స్పెక్టర్ ముత్తుపాండి సెల్ ఫోన్ అని తేలింది. దర్యాప్తులో, స్పెషల్ సబ్–ఇన్స్పెక్టర్ ముత్తుపాండి ఎవరూ లేని సమయంలో టాయిలెట్లోకి వెళ్లాడని, ఆపై తన సెల్ ఫో¯న్లో వీడియోను ఆన్ చేసి ఎవరికీ తెలియకుండా ఒక ప్రదేశంలో దాచాడని తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి స్పెషల్ సబ్–ఇ¯న్స్పెక్టర్ ముత్తుపాండిని ఆదివారం అరెస్టు చేసి రామనాథపురం జైలుకు తరలించారు.
పెళ్లిలో చూశాడు.. సినిమాను మించి ట్విస్టులు!
గంగానగర్: రాజస్థాన్లో దారుణ ఘటన జరిగింది. పద్నాలుగేళ్ల బాలిక తనతో మాట్లాడటానికి నిరాకరించిందని ఓ ఫొటోగ్రాఫర్ ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక స్కూలుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దాడి చేసిన అనంతరం పరారైన ఓంప్రకాష్ (అలియాస్ జానీ) కోసం మూడురోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం అరెస్ట్ చేశారు.పెళ్లికి ఫోటోగ్రాఫర్గా వెళ్లి..పోలీసు విచారణలో నిందితుడు ఓంప్రకాష్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసుల వెల్లడించిన వివరాలు ప్రకారం.. తను ఒక పెళ్లికి ఫోటోగ్రాఫర్గా వెళ్ళినప్పుడు ఆ బాలికను మొదటిసారి చూశానని తెలిపాడు. ఆ తర్వాత అతను బాలికతో మాట్లాడడానికి ప్రయత్నించగా.. ఆమె అతడిని మందలించింది. దీనిని అవమానంగా భావించిన ఓంప్రకాష్, ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. గంగానగర్ జిల్లాలోని సుభాష్ పార్క్ ప్రాంతంలో బాలిక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా, ఓంప్రకాష్ బైక్పై వచ్చి ఆమెపై యాసిడ్ బాటిల్ను విసిరాడు. ఈ దాడిలో బాలిక దుస్తులు కాలిపోవడంతో పాటు చేతి వేలికి గాయమైంది. బాలికకు తృటిలో ప్రాణాపాయం తప్పింది.తప్పించుకోవడానికి పక్కా ప్లాన్..పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నిందితుడు పక్కా ప్లాన్ వేశాడు. ముఖానికి కర్చీఫ్, తలకు హెల్మెట్ ధరించడమే కాకుండా, తన బైక్ నంబర్ ప్లేట్ కనిపించకుండా బట్టతో కప్పేశాడు. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనప్పటికీ, నిందితుడు తన ఆనవాళ్లు తెలియకుండా వ్యవహరించాడు. దీంతో యువకుడిని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది. ఈ క్రమంలో ఎస్పీ అమృత దుహన్ నిందితుడి సమాచారం ఇచ్చిన వారికి రూ. 25,000 రివార్డు ప్రకటించారు. సాంకేతిక ఆధారాలు, స్థానికుల సాయంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి పోలీసులు నిందితుడిని మార్కెట్ వీధుల్లో ఊరేగించారు.
రైలు దిగబోయి పట్టాలపై పడి..
మిర్యాలగూడ అర్బన్: కదులుతున్న రైల్లో నుంచి దిగేందుకు ప్రయత్నించిన టికెట్ కలెక్టర్ (టీసీ) ప్రమాదవశాత్తు రైలు కింద పడి రెండు కాళ్లు కోల్పోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం జరిగింది. రైల్వే పోలీసులు వివరాలు తెలిపారు. మహబూబాబాద్కు చెందిన బి.శ్యామ్కుమార్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్ (టీసీ)గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం విధులు ముగించుకుని పని నిమిత్తం నల్లగొండకు రైలులో బయల్దేరాడు. కానీ, నల్లగొండ రైల్వే స్టేషన్లో రైలు దిగలేదు.రైలు మిర్యాలగూడ మీదుగా దామచర్ల మండలంలోని విష్ణుపురం రైల్వే స్టేషన్కు చేరుకుంటున్న సమయంలో కొద్దిగా నెమ్మదించడంతో అతడు రైల్లో నుంచి కిందకు దిగబోయాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కదులుతున్న రైలు కింద పడిపోయాడు. దీంతో అతడి రెండు కాళ్లు పూర్తిగా తెగిపడ్డాయి. స్థానికులు గుర్తించి వెంటనే అతడిని ఆటోలో స్థానిక హెల్త్ సబ్ సెంటర్కు తరలించారు. అక్కడి నుంచి మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
వీడియోలు
TDP MLA చేసిన అవమానం.. షరీఫ్ కు ముస్లిం నేతల పరామర్శ
సాత్విక వీరవల్లి హీరోయిన్ గా ఎంట్రీ..
జగన్ పై తప్పుడు రాతలు ఆంధ్రజ్యోతి పేపర్ ను తగలబెట్టిన YSRCP
బీఆర్ఎస్ VS పోలీస్ .. జూబ్లీహిల్స్ స్టేషన్ వద్ద హైటెన్షన్
ఏ క్షణమైనా యుద్ధం.. రంగంలోకి ఫ్రాన్స్, జర్మనీ బలగాలు
అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్..
రక్తం కారేలా కొట్టుకున్న TDP, జనసేన కార్యకర్తలు
Varudu: బట్టలు విప్పి రికార్డింగ్ డాన్సులు వెయ్యండన్న వారిని ఎందుకు నడిరోడ్డుపై నడిపించలేదు..
నీ అబ్బా సొమ్ము అనుకుంటున్నావా? లోకేష్ పై నిప్పులు చెరిగిన సతీష్ రెడ్డి
చంద్రబాబుపై కేసులు ఎందుకు కొట్టేశారు? హైకోర్టు ఆగ్రహం
