గెంటేస్తారన్న భయం.. కట్చేస్తే చరిత్రకు అడుగు దూరంలో!
రెండు వారాల క్రితం.. మాయ చావ్లిన్స్కా ఒక క్వాలిఫయర్గా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ఆడేందుకు పారిస్కు చేరుకుంది. స్పాన్సర్స్ ఎవరూ లేకపోవడంతో సొంత డబ్బులతోనే ఫ్రెంచ్ ఓపెన్ ఆడేందుకు వచ్చింది. అయితే ఎవరూ ఊహించని విధంగా క్వాలిఫయర్ రౌండ్లో విజయం సాధించింది. ఆ తర్వాత నాలుగో రౌండ్ వరకు చేరుకున్న ఆమె తన జీవితంలో ఇదే పెద్ద విజయం అని భావించింది. కానీ కట్చేస్తే ఇవాళ చరిత్రకు అడుగుదూరంలో నిలిచింది ఈ 24 ఏళ్ల పోలండ్ సంచలనం. శనివారం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ మిరా ఆండ్రీవాతో ఫైనల్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో మాయ చావ్లిన్స్కా తన అనుభవాలను పంచుకుంది.ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో పోలండ్కు చెందిన క్వాలిఫయర్ 24 ఏళ్ల మాయ చావ్లిన్స్కా చరిత్రకు అడుగుదూరంలో ఉంది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో శనివారం జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చావ్లిన్స్కా రష్యాకు చెందిన మిరా ఆండ్రీవాను ఎదుర్కోనుంది. ఫైనల్లో గెలిచి టైటిల్ సాధిస్తే మాత్రం బ్రిటన్ స్టార్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను తర్వాత క్వాలిఫయర్ హోదాలో మహిళల సింగిల్స్ గ్రాండ్స్లామ్ టైటిల్ అందుకోనున్న క్రీడాకారిణిగా చావ్లిన్స్కా నిలవనుంది. ఈ నేపథ్యంలో టైటిల్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచిన చావ్లిన్స్కా టోర్నీ మధ్యలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. 'ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో అడుగుపెట్టినప్పుడు స్పాన్సర్లు ఎవరు లేకపోవడంతో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని హోటల్ రూంలో దిగాను. తన దగ్గర చాలినన్ని డబ్బులు లేకపోవడంతో టోర్నీ మధ్యలోనే హోటల్ వాళ్లు బయటకు గెంటేస్తారేమోనని చాలా భయపడ్డాను. కానీ ఇవాళ అన్ని రౌండ్లను దాటుకొని ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. టైటిల్ గెలుస్తానో లేదో తెలియదు కానీ జీవితాన్ని మాత్రం గెలిచేశాను. టైటిల్ గెలిస్తే నా దేశానికి గొప్ప విజయమవుతుంది. ఈ టోర్నీ ద్వారా నాకు వచ్చే ప్రైజ్మనీతో కష్టాలు తీరిపోనున్నాయి' అని మాయ చావ్లిన్స్కా ఎమోషనల్గా చెప్పుకొచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్కు ముందు తన ప్రొఫెషనల్ కెరీర్ మొత్తం కలిపి చావ్లిన్స్కా సుమారు 864,000 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 8.22 కోట్లు) సంపాదించింది. అయితే ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్లో విజేతగా నిలిస్తే చావ్లిన్స్కా సుమారు మూడు రెట్లు అంటే రూ. 30 కోట్లకు పైగా అందుకోనుంది. అదే రన్నరప్గా నిలిస్తే రూ. 15 కోట్ల 41 లక్షలు తీసుకోనుంది.చేతిపై పచ్చబొట్టుఇక మాయ చావ్లిన్స్కా ఎడమచేతిపై 'ఫ్రీ' అనే అక్షరం పచ్చబొట్టుగా పొడిపించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఆ పచ్చబొట్టు వెనుక ఉన్న కారణాన్ని చెప్పడానికి చావ్లిన్స్కా ఇష్టపడలేదు. కానీ ఆమె చేతిపై ఉన్న ఫ్రీ అనే టాటూ పదం ఇవాళ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేర్చిందని అభిమానులు విశ్వసిస్తున్నారు.Jazda Maja 🇵🇱#RolandGarros pic.twitter.com/9daStziM7E— Roland-Garros (@rolandgarros) June 4, 2026What a way to qualify for your first Grand Slam final 🤩 #RolandGarros pic.twitter.com/QsZMwVWOGL— Roland-Garros (@rolandgarros) June 4, 2026చదవండి: అఫ్గానిస్తాన్కు షాక్.. గుడ్బై చెప్పనున్న రషీద్ ఖాన్!
డబ్బు కోసమే వ్యాపారం చేయాలా?: రిచ్ డాడ్ క్లారిటీ
బంగారం, వెండి గురించి.. వాటిపై పెట్టుబడుల గురించి చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) తాజాగా డబ్బు సంపాదించడానికే వ్యాపారం చేయాలా?, అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.చాలామంది డబ్బు సంపాదించడానికే వ్యాపారం చేయాలా? అనే ప్రశ్న వేస్తుంటారు. కానీ వ్యాపారవేత్త కావడం వెనుక అసలు ఉద్దేశం కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాకూడదని కియోసాకి చెబుతారు. డబ్బు కోసం మాత్రమే వ్యాపారం మొదలు పెడితే, అది దీర్ఘకాలంలో విజయాన్ని ఇవ్వకపోవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు.నిజానికి డబ్బు సంపాదించడం ఈ రోజుల్లో చాలా కష్టమైన పని కాదు. కానీ సంపాదించిన డబ్బును నిలుపుకోవడం, దానిని సరిగ్గా ఉపయోగించడం చాలా ముఖ్యం. చాలామంది పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించినా, ఆర్థిక అవగాహన లేకపోవడం వల్ల త్వరగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే వ్యాపారం అంటే కేవలం సంపాదన కాదు, ఒక ఆర్థిక విద్య కూడా అని కియోసాకి పేర్కొన్నారు.ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో.. ఆస్తులు, బాధ్యతలు మధ్య తేడా ఏమిటో తెలుసుకోవడం అవసరం. అలాగే నగదు ప్రవాహం, అప్పుల నిర్వహణ, పన్నుల వ్యవస్థ వంటి విషయాలపై అవగాహన లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా అది నిలబడదు. ఈ జ్ఞానం లేకపోతే పెద్ద మొత్తంలో సంపాదించినా.. తిరిగి కోల్పోయే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: పెట్రోల్ రూ.26, గ్యాస్ రూ.157: పాతికేళ్లలో ఎంతలా అంటే..చాలామంది డబ్బు గురించి సలహాలు ఇస్తారు, కానీ వారు స్వయంగా వ్యాపారం చేసి అనుభవం పొందినవారు కాకపోవచ్చు. కాబట్టి ఎవరి సలహా అయినా గుడ్డిగా నమ్మకూడదు. స్వయంగా ఆర్థిక విషయాలను నేర్చుకోవడం చాలా అవసరం. వ్యాపారవేత్త కావడం అంటే రిస్క్ తీసుకోవడం మాత్రమే కాదు, ఆ రిస్క్ను ఎలా నిర్వహించాలో తెలుసుకోవడం కూడా.వ్యాపారం ప్రారంభించే ముందు 'నేను ఎంత డబ్బు సంపాదించగలను?' అనే ప్రశ్నకన్నా.. నేను సంపాదించిన డబ్బును ఎలా ఉపయోగించగలను? అనే ప్రశ్న చాలా ముఖ్యమైంది. సరైన ఆర్థిక జ్ఞానం ఉంటేనే సంపదను సృష్టించడంతో పాటు దానిని నిలబెట్టుకోవడం కూడా సాధ్యమవుతుందని కియోసాకి అభిప్రాయం.
అన్నామలై రాజీనామాపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తమిళనాడు బీజేపీలో కీలక నేతగా ఎదిగి, ఆ పార్టీతో తన ప్రస్థానాన్ని ముగించుకున్న అన్నామలై వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ స్పందించారు. ప్రధానంగా అన్నామలై రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో బీజేపీకి గుర్తింపు తెచ్చిన అన్నామలై పార్టీని వీడటం దురదృష్టకరమన్నారు. ‘ అన్నామలై ఆరేళ్ల కింద ఐపీఎస్కి రాజీమానా చేసి బీజేపీలో చేరారు. ఆయన తమిళనాడు లో బీజేపీకి గుర్తింపు తెచ్చాడు. అన్నామలై పార్టీని వీడడం దురదృష్టకరం. ఇలాంటి నేతలు పార్టీ వీడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా రాజీనామా ఇస్తే.. దానికి కారణం తెలుసుకోవాలి... వారిని పిలిచి మాట్లాడాలి. నాకు జరిగిందో అన్నామలై విషయంలో కూడా జరిగింది. తెలంగాణలో జరిగిన విషయాలనే కేంద్ర పెద్దలకు చెప్పాను. పెద్ద నాయకులను కలవడానికి ప్రయత్నం చేశా.. ఎవ్వరు కలవలేదు.. చివరకి పార్టీకి రాజీనామా ఇచ్చాను. కనీసం ఎందుకు రాజీనామా ఇచ్చావో అడగకుండా రాజీనామాను ఆమోదించారు. నేను బయటకి వచ్చి ఏడాది అయింది.. ఏ పార్టీ లోకి వెళ్ళలేదు.. వెళ్ళను కూడా. నాలాంటి, అన్నామలై లాంటి వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత పార్టీ పై ఉంది. ఇలాంటి వాళ్ళు బాధ పడితే.. రాష్ట్ర, కేంద్ర నాయకులు పిలిచి మాట్లాడాలి’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి:బీజేపీపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు..
భారత్పై మరోసారి ట్రంప్ అక్కసు...
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి భారత్పై అక్కసు వెల్లగక్కారు. చాలా కాలంగా భారత్, అమెరికాపై అధిక సుంకాలు విధించి భారీగా లాభాలు పొందిందందన్నారు. ఇప్పుడు ఆ పని అమెరికా చేస్తుందన్నారు. ఇటీవల ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.దీర్ఘకాలంగా ఉన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా, 2026 ఫిబ్రవరిలో భారత్, అమెరికా దేశాల మధ్య ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. అనంతరం ఇటీవలే న్యూఢిల్లీలో అమెరికా బృందం పర్యటించింది. భారత ప్రభుత్వ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు దాదాపు ఫైనల్ అయ్యాయని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిస్థితులు నడుమ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.ట్రంప్ మాట్లాడుతూ" ఇంతకాలం భారత్, అమెరికాపై అధిక పన్నులు విధించి లాభపడింది. ఇప్పుడు అది మావంతు. అమెరికా, భారత్ మధ్య త్వరలోనే ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం కుదరవచ్చు. ఎందుకంటే "నాకు మోదీ అంటే చాలా ఇష్టం. మోదీ నాకు చాలా మంచి స్నేహితుడు. మా మధ్య మంచి సంబంధం ఉంది, మేము ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటాము."అని అన్నారు.కాగా బలవంతపు కార్మిక వ్యవస్థను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్న కొన్ని దేశాలపై అదనపు దిగుమతి సుంకాలను (టారిఫ్లను) విధించాలని అమెరికా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదిత జాబితాలో భారతదేశం కూడా ఉంది. దీనిని అమలు చేస్తే, అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై అదనంగా 12.5% సుంకం విధించబడవచ్చు. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారవచ్చు. దీంతో ఎగుమతులు ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది.
‘మేం చేసింది చెప్పాలంటే రాస్తే రామాయణం.. చెబితే భారతం’
‘డీఎస్సీలో అక్రమాలు నిజం’
భారత్పై మరోసారి ట్రంప్ అక్కసు...
భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డికి తీవ్ర అస్వస్థత
టీమిండియాకు షాక్.. ఆరు నెలలు ఆటకు దూరమైన కోహ్లీ!
రామ్ చరణ్ బాడీ గార్డ్.. జిమ్ వర్కవుట్ వీడియో వైరల్
కుప్పకూలిన కివీస్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్
ఫోర్బ్స్లో మన ఐకాన్
తీవ్ర విషాదం.. కుంటలో దిగి ముగ్గురు చిన్నారుల మృతి
డబ్బు కోసమే వ్యాపారం చేయాలా?: రిచ్ డాడ్ క్లారిటీ
‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
జై చంద్రబాబు అంటే మీకు కనెక్ట్ అవుతుంది సార్!
ఈ రాశి వారికి ఆస్తి, ధనలాభాలు
భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్, భువనేశ్వర్కు చోటు!
మీ ‘కుర్చీ’ కింద భూమి కదిలినట్లు అనిపించింది సార్!!
'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?
యూట్యూబర్ నందు కేసులో కొత్త మలుపు
ఏడు నెలల్లో 101 కేజీల నుంచి 65 కేజీలకు..!
వామ్మో ఏం తిట్లు! ఏం బూతులు!! యుద్ధంలో మిసైల్స్ బదులు ఇవే ప్రయోగిస్తే ఈజీగా గెలిచేవాళ్లం సార్
భారత క్రికెటర్ల రిటైర్మెంట్పై బీసీసీఐ కఠిన నిర్ణయం..?
కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. ఎమోషనల్ పోస్ట్
సూపర్ ఎల్–నినోకు సిద్ధం కండి
పసిడి, వెండి.. కంగారు లేకుండా కొనండి!
ఓటీటీలో దురంధర్-2 ప్రీమియర్ షో.. స్ట్రీమింగ్ టైమ్ ఇదే...!
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
'అన్నామలై రాజీనామా చేయలేదు'
ఆశ్చర్యపరిచిన బెంగాల్ ట్విస్ట్
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
సూర్యకుమార్కు భారీ షాక్.. టీమిండియా కెప్టెన్గా తెలుగోడు!
‘మేం చేసింది చెప్పాలంటే రాస్తే రామాయణం.. చెబితే భారతం’
‘డీఎస్సీలో అక్రమాలు నిజం’
భారత్పై మరోసారి ట్రంప్ అక్కసు...
భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డికి తీవ్ర అస్వస్థత
టీమిండియాకు షాక్.. ఆరు నెలలు ఆటకు దూరమైన కోహ్లీ!
రామ్ చరణ్ బాడీ గార్డ్.. జిమ్ వర్కవుట్ వీడియో వైరల్
కుప్పకూలిన కివీస్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్
ఫోర్బ్స్లో మన ఐకాన్
తీవ్ర విషాదం.. కుంటలో దిగి ముగ్గురు చిన్నారుల మృతి
డబ్బు కోసమే వ్యాపారం చేయాలా?: రిచ్ డాడ్ క్లారిటీ
‘పెద్ది’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
జై చంద్రబాబు అంటే మీకు కనెక్ట్ అవుతుంది సార్!
ఈ రాశి వారికి ఆస్తి, ధనలాభాలు
భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్, భువనేశ్వర్కు చోటు!
మీ ‘కుర్చీ’ కింద భూమి కదిలినట్లు అనిపించింది సార్!!
'పెద్ది' మొదటిరోజు కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయ్?
యూట్యూబర్ నందు కేసులో కొత్త మలుపు
ఏడు నెలల్లో 101 కేజీల నుంచి 65 కేజీలకు..!
వామ్మో ఏం తిట్లు! ఏం బూతులు!! యుద్ధంలో మిసైల్స్ బదులు ఇవే ప్రయోగిస్తే ఈజీగా గెలిచేవాళ్లం సార్
భారత క్రికెటర్ల రిటైర్మెంట్పై బీసీసీఐ కఠిన నిర్ణయం..?
కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. ఎమోషనల్ పోస్ట్
సూపర్ ఎల్–నినోకు సిద్ధం కండి
పసిడి, వెండి.. కంగారు లేకుండా కొనండి!
ఓటీటీలో దురంధర్-2 ప్రీమియర్ షో.. స్ట్రీమింగ్ టైమ్ ఇదే...!
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
'అన్నామలై రాజీనామా చేయలేదు'
ఆశ్చర్యపరిచిన బెంగాల్ ట్విస్ట్
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
సూర్యకుమార్కు భారీ షాక్.. టీమిండియా కెప్టెన్గా తెలుగోడు!
ఫొటోలు
నాగచైతన్య దూత వెబ్ సిరీస్ సీక్వెల్ ప్రారంభం.. ఫోటోలు
'బిగ్బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)
పింక్ బ్యూటీలా మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)
హైదరాబాద్ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)
అమీర్పేటలో పొగ.. మంటలతో బెంబేలు (ఫొటోలు)
బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు
తిరుమల శ్రీవారి సేవలో ‘పెద్ది’ భామ జాన్వీ కపూర్ (ఫొటోలు)
తెలంగాణ : పాము (నాగదేవత) ఆకారంలో ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
సినిమా
కేవలం సాంగ్స్, ముద్దుల కోసమేనా?.. జాన్వీ రోల్పై సింగర్ షాకింగ్ పోస్ట్
టాలీవుడ్లో ఇప్పుడంతా పెద్ది హవా నడుస్తోంది. జూన్ 4న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. తొలిరోజే ఏకంగా రూ.135 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు పరంగా పెద్దికి కలిసొచ్చింది. దీంతో మొదటి రోజే సెంచరీ మార్క్ను దాటేసింది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.అయితే ఈ మూవీ జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదని టాక్ వినిపిస్తోంది. కేవలం గ్లామర్ కోసమే జాన్వీని తీసుకున్నారని విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సింగర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. పెద్దిలో జాన్వీ పాత్రను ఓవర్గా చూపించారని ఆరోపిస్తున్నారు. కేవలం సెక్సువల్ అట్రాక్షన్ కోసమే ఆమెను సినిమాలో తీసుకున్నారని సింగర్ సుమంగళి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా మేకర్స్ నిస్సహాయత వల్ల కలిగే వేదన చుట్టూ ఒక కథను అల్లారని.. కానీ జాన్వీ కపూర్ పోషించిన అచియమ్మ పాత్రకు అదే గౌరవాన్ని ఇవ్వలేదని ఆమె పోస్ట్లో రాసుకొచ్చారు. ఇప్పటికే జాన్వీ కపూర్ పాత్రపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తోన్న సంగతి తెలిసిందే.సుమంగళి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాస్తూ..'శక్తివంతమైన పురుషులతో నిండిన ఒక గదిలో కూర్చుని నిస్సహాయత వల్ల కలిగే వేదన గురించి ఒక కథను రాశారు. వాళ్లు అదే సమయంలో జాన్వీ కపూర్ పాత్రను కెమెరా ముందు కేవలం బలవంతపు ముద్దు పెట్టే ఒక వస్తువుగా.. పాటలు అయిపోయాక ఆమె పక్కకు పారేసే ఓ వస్తువుగా మాత్రమే చూపించారు. ఒక మనిషిని గౌరవించడం ఏమిటో వారికి కచ్చితంగా తెలుసు. కానీ ఆమె దానికి జాన్వీ కపూర్ అర్హురాలు కాదని ముందే నిర్ణయించుకున్నారని ఆమె విమర్శించారు. ఈ సినిమాలో హీరోయిన్కు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. భారతీయ సినిమాలో ఒక కథానాయికకు జరిగిన అత్యంత ఖరీదైన అవమానం అంటూ అనే శీర్షికతో ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ను షేర్ చేసింది.హీరోయిన్ కేవలం గ్లామర్ కోసమే కాదని.. ఆమె పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండాలని నెటిజన్స్ కోరుతున్నారు. సాంగ్స్, ముద్దుల కోసమే వారిని సినిమాలో చూపించడం కరెక్ట్ కాదంటున్నారు. మహిళలను కేవలం లైంగిక వస్తువులుగా చూడటాన్ని మానుకోవాలని హితవు పలుకుతున్నారు. అంతేకాకుండా పెద్ది మూవీలోని జాన్వీ కపూర్ సీన్స్పై కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అనుమతి లేకుండా హీరోయిన్ను తాకాలనుకుంటున్నానని పెద్ది చెప్పే సన్నివేశాలపై ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యలన్నీ లైంగిక దాడి కిందకే వస్తాయని చాలా మంది విమర్శిస్తున్నారు.
సెన్సేషనల్ సినిమా 'అబ్సెషన్' తెలుగు రివ్యూ
రీసెంట్ టైంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా 'అబ్సెషన్'. ఇదో హాలీవుడ్ సినిమా. తీసింది కూడా ఓ యూట్యూబర్. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్ పెడితే ఇప్పటివరకు రూ.1600 కోట్ల కలెక్షన్ సొంతం చేసుకుని రికార్డుల మీద రికార్డుల సృష్టిస్తోంది. మూడు వారాల క్రితం అమెరికాలో రిలీజై, గతవారం మన దేశంలోని థియేటర్లలోకి వచ్చింది. ఈ సెన్సేషనల్ మూవీలో అంతలా ఏముందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్టైనర్ 'మధువిధు' తెలుగు రివ్యూ)కథేంటి?బేర్ (మైకేల్ జాన్స్టన్) కాలేజీ కుర్రాడు. ఓ మ్యూజిక్ షాపులో పనిచేస్తుంటాడు. ఇతడికి ముగ్గురు ఫ్రెండ్స్. వాళ్లలో ఒకరైన నిక్కీని(ఇండే నవరెట్టే) ఇతడు ప్రేమిస్తుంటాడు. కానీ ఆమెకు ఆ విషయం చెప్పేందుకు చాలా భయపడిపోతుంటాడు. ఓ రోజు 'వన్ విష్' పేరుతో ఉన్న చిన్న వస్తువుని కొంటాడు. దాన్ని విరగ్గొట్టి నిక్కీ తనని చాలా ప్రేమించేయాలని బలంగా కోరుకుంటాడు. ఊహించని విధంగా ఆ కోరిక నిజమైపోతుంది. నిక్కీ, బేర్ని ప్రేమించడం మొదలుపెడుతుంది. అప్పటివరకు అంతా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే? అబ్సెషన్ అంటే తెలుగులో పిచ్చి లేదా యావ అనే అర్థం. అంటే ఒక వ్యక్తిపై లేదా ఒక వస్తువు గురించి విపరీతంగా ఆలోచించడం, ఇష్టపడటం అనే అర్థంలో దీన్ని ఉపయోగిస్తారు. ఈ సినిమా విషయానికొస్తే సింపుల్ స్టోరీ లైన్. అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. అయితే వాళ్లలో ఒకరు, ఎదుటి వ్యక్తిని పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తే ఏమవుతుందనేది మిగతా స్టోరీ.కేవలం గంట 45 నిమిషాల నిడివితో ఉండే ఈ సినిమా ప్రస్తుతం ఇంగ్లీష్లో, థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇదో సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ. హారర్ సీన్స్ ఏం ఉండవు గానీ కొన్నిచోట్ల అంతకు మించి భయపెడుతుంది. కూర్చున్న సీటు నుంచి కదిలిపోయేలా చేస్తుంది. చాలా నిదానంగా స్టోరీ మొదలవుతుంది. ఎప్పుడైతే హీరో.. హీరోయిన్ని తనని ప్రేమించాలని కోరుకుంటాడో అప్పటినుంచి అసలు కథ మొదలవుతుంది. చివరివరకు అదే టెంపో మెంటైన్ చేస్తారు.సాధారణంగా ఇంగ్లీష్ సినిమాల్లో ఇంటర్వెల్ లాంటివి ఉండవు. మన దేశంలో స్క్రీనింగ్ అయ్యే వాటికి సడన్గా కట్ చేసి ఇంటర్వెల్ కార్డ్ వేస్తారు. కానీ 'అబ్సెషన్'లో మాత్రం ఫెర్ఫెక్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఒక మూవీ వస్తుందంటే దీనిలో సీన్లు గతంలో ఎక్కడో చూశామే అని కచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇందులో అలా ఏం అనిపించదు. స్టోరీ నుంచి సీన్స్ వరకు అన్ని ఫ్రెష్గా ఉంటాయి.ఒక సీన్లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుంటారు. అంతా ప్రశాంతంగా ఉందేంటి? సమ్థింగ్ ఈజ్ ఫిషీ అని అనుకునేలోపు అదిరిపోయే బ్యాంగర్ పడుతుంది. క్లైమాక్స్ కూడా అస్సలు ఊహించలేం. ఈ మూవీలో హీరోహీరోయిన్తో పాటు మరో రెండు ఫ్రెండ్ పాత్రలు, అదనంగా మరో నలుగురైదుగురు మాత్రమే కనిపిస్తారు. ఈ సినిమా తీసిన కర్రీ బార్కర్ స్వతహాగా యూట్యూబర్. దీనికంటే ముందు ఓ మూవీ తీశాడు గానీ అది తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసుకున్నాడు. ఇదే తొలి ఫీచర్ ఫిల్మ్. అయినా సరే కంటెంట్, కలెక్షన్లతో కేక పుట్టించాడు.ప్రధాన పాత్రలు చేసిన మైకేల్ జాన్స్టన్, ఇండే నవరెట్టే జీవించేశారని చెప్పొచ్చు. ఓ సీన్లో హీరోయిన్ కళ్లు మాత్రమే హైలైట్ అయ్యేలా లైటింగ్ ఉంటుంది. ఆ సీన్ చూస్తున్నప్పుడు హీరోయిన్ పాత్ర దెయ్యంలా అనిపిస్తుంది. ఎలాంటి మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ అవసరం లేకుండా అలా చూపించడం క్రేజీగా అనిపిస్తుంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కావొచ్చని అంటున్నారు. కానీ ఇంగ్లీష్ సినిమాలు చూసే ఆసక్తి ఉంటే మాత్రం 'అబ్సెషన్'ని థియేటర్లో ఎక్స్పీరియెన్స్ చేయండి. టికెట్ డబ్బులకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది. అభ్యంతర సీన్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి కుటుంబంతో కలిసి చూసే ప్రయత్నాల్లాంటివి చేయొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: కళ్లు తెరిపించే కోర్ట్ రూమ్ సినిమా.. ఓటీటీ తెలుగు రివ్యూ)
‘పెద్ది’లో జాన్వీ కపూర్.. శ్రీదేవి ఒప్పుకునేదే కాదు!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజు ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. మొదటి రోజు రూ. 135 కోట్ల వసూలు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అదే సమయంలో జాన్వీ కపూర్ పాత్రపై పెద్ది ఎత్తున విమర్శలు చేస్తున్నారు. పెద్దిలో జాన్వీ పోషించిన అచ్చియమ్మ పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని, కేవలం గ్లామర్ షో కోసమే ఆమెను తీసుకున్నారని చెబుతున్నారు. కథతో సంబంధం లేకుండా కేవలం పాటలు, రొమాంటిక్ సీన్లకే ఆమెను పరిమితం చేశారని విమర్శిస్తున్నాయి. అంతేకాదు దేవరతో పోలిస్తే.. ఇందులో ఆమె నటన మరింత దారణంగా ఉందని చెబుతున్నారు. రామ్ చరణ్, జాన్వీల మధ్య వచ్చే కొన్ని సీన్లు, సంభాషణలు, నడక..ఇవన్నీ బీగ్రేడ్ సినిమాలను గుర్తు చేస్తున్నాయంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. శ్రీదేవి బతికి ఉంటే జాన్విని ఇలాంటి సినిమాల్లో నటించడానికి జాన్వీని అనుమతించేది కాదు అని నెటిజన్లు పోస్ట్ చేశారు.ఇక మరికొంతమంది నెటిజన్స్ అయితే జాన్వీ నటనను తప్పుపట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కొన్ని సన్నివేశాల్లో, పాటల్లో చాలా బాగా నటిందని ప్రశంసిస్తున్నారు. సెకండాఫ్లో వచ్చి ఎమోషనల్ సన్నివేశంలోనూ జాన్వీ నటన బాగుందని చెబుతున్నారు. After watching Peddi, you can't help but feel pity for Janhvi Kapoor. Sridevi would have never allowed her to act in such B-grade films in the South.#Peddi #PeddiReview #JanhviKapoor pic.twitter.com/F2beJEGaYl— 𝐳𝐚𝐲𝐝 (@MaheshFallout) June 4, 2026There is no need to blacklash her role in #Peddi She did great her part more over some scenes & one song trimed in Movie. And 2nd Half One Emotional is Enough her potentiaI of acting & i accept but for section audience response. But there is no need to negative her #JanhviKappor pic.twitter.com/6MkV7qfuia— 𝐀kh!L Kesana (@AlwaysAkhilK) June 4, 2026
అభిమానుల ఓవరాక్షన్.. ఉపాసన ఆగ్రహం.!
టాలీవుడ్లో ప్రస్తుతం పెద్ది హవా నడుస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా థియేటర్లకు క్యూ కట్టారు. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున హడావుడి కనిపించింది. పెద్ది సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.రామ్ చరణ్ సతీమణి కూడా స్వయంగా థియేటర్కు వెళ్లి పెద్ది మూవీని వీక్షించింది. హైదరాబాద్లోని ఓ థియేటర్కు వెళ్లిన ఉపాసన అభిమానులతో కలిసి మూవీ చూసింది. అయితే అదే సమయంలో థియేటర్లో అభిమానుల అల్లరితో అసహనానికి గురైంది. అక్కడే గట్టిగా అరుస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.కాగా.. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. థియేటర్ లో గొడవ పెట్టుకున్న ఉపాసన ఒక్కసారిగా అంతా షాక్ | Upasana Viral Video | CVR News#peddimovierelease #upasana #ramcharan #theatre #ramcharanfans #virulshorts #trending #viral #shorts #cvrnews pic.twitter.com/scrQaV0bAW— Cvr News Telugu (@cvrtelugunews) June 4, 2026
క్రీడలు
అఫ్గానిస్తాన్కు షాక్.. గుడ్బై చెప్పనున్న రషీద్ ఖాన్!
టీమిండియా, అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టెస్టు రిటైర్మెంట్పై త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్కు రషీద్ ఖాన్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్లో చాలాసేపు బౌలింగ్ చేయాల్సి రావడంతో, దీర్ఘకాలిక వెన్నునొప్పి వల్ల ఎక్కువ బంతులు వేయలేనని రషీద్ ఖాన్ గతం లోనే స్పష్టం చేశాడు. అయితే తాజాగా రషీద్ ఖాన్ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా అనే దానిపై ఆ జట్టు కోచ్ రిచర్డ్ ఫైబస్ స్పం దించారు. 'రషీద్ ఖాన్ దీర్ఘకాలిక నడుమునొప్పితో బాధపడుతున్నాడు. టెస్టు క్రికెట్కు దూరమవ్వాలని రషీద్ ఎప్పుడో నిర్ణయిం చుకున్నాడు.అతడు దేశంతో పాటు చాలా ప్రైవేటు లీగ్స్లో ఆడుతుంటాడు. అయితే రషీద్ మా జట్టుకు ఫ్రంట్లైన్ బౌలర్ కావడంతో అతడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది. టెస్టు క్రికెట్కు దూరంగా ఉండాలని భావిస్తున్న రషీద్తో నేను రెడ్బాల్ క్రికెట్లో కొనసాగాలని అడుగుతాను. కానీ ఆడతాడా లేదా అన్నది అతడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.27 ఏళ్ల రషీద్ ఖాన్ 2023 వన్డే ప్రపంచకప్కు ముందు నుంచే వెన్నుగాయం తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వస్తోంది. అప్పటినుంచి ఎక్కువసేపు బౌలింగ్ చేయడంలో రషీద్ ఖాన్ తీవ్రంగా ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో తాను టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా అని రషీద్ ఖాన్ తెలిపాడు. కాబట్టి టెస్టు క్రికెట్లో ఆడాలా వద్దా అనేది అతడి ఇష్టానికే వదిలేస్తున్నాం' అని తెలిపాడు.కాగా రషీద్ ఖాన్ గైర్హాజరీలో అఫ్గానిస్తాన్ జట్టుకు హష్మతుల్లా షాహిది జట్టును నడిపించనున్నాడు. జట్టులో రహమనుల్లా జద్రన్, అఫ్సర్ జజాయ్, ఇక్రమ్ అలీఖిలి, అజ్మతుల్లా ఒమర్జయ్లు కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. ఇక అఫ్గానిస్తాన్ 2018లో టెస్టు హోదా పొందింది. అప్పటినుంచి 12 మ్యాచ్లాడగా, నాలుగు విజయాలు, ఏడు ఓటములు, ఒక డ్రా నమోదు చేసింది. అఫ్గానిస్తాన్ చివరగా గతేడాది అక్టోబర్లో జింబాబ్వేతో టెస్టు మ్యాచ్ ఆడింది. అయితే ఆ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ 73 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అఫ్గానిస్తాన్ స్టార్ బౌలర్గా వెలుగొందుతున్న రషీద్ ఖాన్ ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు. ఆ జట్టు తరఫున ఆరు టెస్టుల్లో 154 పరుగులు, 45 వికెట్లు; 117 వన్డేల్లో 1,393 పరుగులు, 210 వికెట్లు; 113 టీ20ల్లో 622 పరుగులు, 190 వికెట్లు తీశాడు.చదవండి: ఆసీస్పై సిరీస్ విజయం.. పాక్ క్రికెటర్కు బంపరాఫర్!
IPL 2026: ‘మా కారు ట్రక్కు కిందకి దూసుకెళ్లింది’
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ షాకింగ్ విషయం వెల్లడించాడు. ఐపీఎల్-2026 ఫైనల్ ముగిసిన తర్వాత తాను ఘోరమైన ప్రమాదం బారినపడ్డాడనన్నాడు. దేవుడి దయ, భారత ప్రజల మంచితనం వల్ల సురక్షితంగా ఇంటికి చేరుకున్నానని తెలిపాడు.రెండోసారి టైటిల్ గెలిచిన ఆర్సీబీకాగా మార్చి 28- మే 31 మధ్య ఐపీఎల్ తాజా ఎడిషన్ జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)- గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో టైటాన్స్ను చిత్తు చేసి ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ గెలిచింది.ఈ మ్యాచ్ కామెంట్రీ బృందంలో మైకేల్ క్లార్క్ కూడా భాగం. ఫైనల్ ముగిసిన తర్వాత అతడు నరేంద్ర మోదీ స్టేడియం నుంచి విమానాశ్రయానికి కారులో బయల్దేరాడు. కొద్దిదూరం వెళ్లగానే కారు ఘోర ప్రమాదానికి గురైంది. అప్పటికి క్లార్క్ నిద్రపోతున్నాడు. ఒక్కసారిగా శబ్దం రావడంతో నిద్రలేవగా.. అప్పటికే కారు ఓ ట్రక్కు కిందకి వెళ్లిపోయింది.మా కారు ట్రక్కు కిందకి దూసుకువెళ్లిందిఈ చేదు ఘటన గురించి మైకేల్ క్లార్క్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. బియాండ్23 క్రికెట్ పాడ్కాస్ట్తో మాట్లాడుతూ.. ‘‘ముందుగా ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇండియాలో ఇంత మంచి వ్యక్తులు ఉన్నందుకు ఆయనకు థాంక్యూ చెప్పాల్సిందే. వారి వల్లే నేను సురక్షితంగా మా ఇంటికి వెళ్లగలిగాను.ఆరోజు నేను కారులో నిద్రపోతున్నాను. అలసట వల్ల ఒళ్లు తెలీకుండా నిద్రపట్టేసింది. ఒక్కసారిగా శబ్దం వచ్చింది. లేచి చూసే సరికి మా కారు ఓ ట్రక్కు కిందకి దూసుకువెళ్లింది. డ్రైవర్ అప్పుడు నాకు జరిగిన విషయం చెప్పాడు.ట్రక్కు బ్రేక్ లైట్లు కనిపించకపోవడం వల్ల తాను కన్ఫ్యూజ్ అయ్యానన్నాడు. అందుకే వెనుక నుంచి మా కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ క్రమంలో ట్రక్కు కిందకి దూసుకువెళ్లిపోయింది. నాకు చిన్న చిన్న గాయాలయ్యాయి.కాలు విరిగిపోయింది!అయితే, మా డ్రైవర్ కాలు మాత్రం విరిగిపోయే ఉంటుంది. అతడు చాలా భయపడ్డాడు. అది అతడి సొంతకారు కూడా కాదు. పాపం కంపెనీ తరఫున కారు నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు.విషయం తెలియగానే చుట్టుపక్కల ఉన్న ప్రజలు వచ్చి సాయం చేశారు. ఇక బీసీసీఐకి చెందిన ప్రతి ఒక్కరు నా బాగోగుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. నిజంగా వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారికి ఎల్లవేళలా కృతజ్ఞుడినై ఉంటాను.చాలా భయపడిపోయానుఅదొక ఘోర ప్రమాదం. ఇలాంటివి రోజూ జరుగుతూనే ఉండొచ్చు. అయితే, నేను మాత్రం చాలా భయపడిపోయాను. నిద్రలో ఉన్నవాడిని లేచి చూసే సరికి ట్రక్కు కింద ఉంటే ఎవరైనా కంగారు పడతారు కదా!’’ అని మైకేల్ క్లార్క్ చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.చదవండి: అతడికి అన్యాయం: గంభీర్
ఆసీస్పై సిరీస్ విజయం.. పాక్ క్రికెటర్కు బంపరాఫర్!
ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ విజయంతో పాకిస్తాన్ జట్టు జోష్లో ఉంది. అయితే సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు ఆల్రౌండర్ షాదాబ్ఖాన్ను అదృష్టం తలుపుతట్టింది.ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కానున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్) తొలి ఎడిషన్లో షాదాబ్ ఖాన్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. తద్వారా యూరోప్ టీ20 క్రికెట్ లీగ్లో ఆడనున్న తొలి పాక్ క్రికెటర్గా షాదాబ్ ఖాన్ నిలవనున్నాడు. ఇక ఈటీపీఎల్ టోర్నీలో షాదాబ్ ఖాన్ ఎడిన్బర్గ్ క్యాసిల్ రాకర్స్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కాగా ఈ ఎడిన్బర్గ్ క్యాసిల్ ఫ్రాంచైజీని మాజీ న్యూజిలాండ్ క్రికెటర్లు కైల్మిల్స్, నాథన్ మెక్కల్లమ్లు సొంతం చేసుకున్నారు. ఈ జట్టుకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్గా ఉండనున్నాడు. టామ్ బ్రూస్, టామ్ కరన్, జేజే స్మట్స్, ఆండ్రీ గౌస్తో కలిసి షాదాబ్ ఖాన్ ఆడనున్నాడు. కాగా ఎడిన్బర్గ్ మంచి ధరకే షాదాబ్తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 క్రికెట్లో ఈ పాకిస్తాన్ క్రికెటర్కు మంచి డిమాండ్ ఉంది. పాకిస్తాన్ సూపర్లీగ్లో (పీఎస్ఎల్) ఇస్లామాబాద్ యునైటెడ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న షాదాబ్ ఆ జట్టుకు మూడు పీఎస్ఎల్ టైటిల్స్ అందించడం విశేషం. పీఎస్ఎల్, బీబీఎల్, సీపీఎల్, బీపీఎల్, హండ్రెడ్ టోర్నీ కలిపి 350కి పైగా మ్యాచ్లాడిన షాదాబ్ఖాన్ 3,915 పరుగులు సాధించాడు. పాకిస్తాన్ తరఫున 124 టీ20ల్లో 1009 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు పడగొట్టాడు. యూరోప్లో క్రికెట్ను ప్రోత్సహించే దిశగా స్కాట్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్లోని స్థానిక క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చేందుకు యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ పేరిట కొత్త టోర్నీని తీసుకొచ్చింది. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్కు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కో-ఓనర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్లో చాలా మంది మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు కలిపి ఆయా ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. కైల్ మిల్స్, నాథన్ మెక్కల్లమ్ (ఎడిన్బర్గ్ క్యాసిల్), రాహుల్ ద్రవిడ్ (డబ్లిన్ గార్డియన్స్), గ్లెన్ మ్యాక్స్వెల్ (ఐరిష్ వోల్వ్స్), స్టీవ్ వా (ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్), జాంటీ రోడ్స్, ఫాఫ్ డుప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ (రోటర్డామ్ డాకర్స్)కు ఓనర్లుగా ఉన్నారు. ఈటీపీఎల్-2026 టోర్నీ ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వేదికగా జరగనుంది.చదవండి: గాయాల బారిన సీనియర్లు.. టీమిండియాకు షాక్ తప్పదా?
ODI WC: టీమిండియాకు 3 ఆప్షన్లు.. అతడే బెస్ట్!
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్గా, వన్డౌన్ బ్యాటర్గా సత్తా చాటిన ఈ జార్ఖండ్ డైనమైట్.. ఐపీఎల్-2026లోనూ పరుగుల వరద పారించాడు.వన్డేలలోనూ రీఎంట్రీసన్రైజర్స్ హైదరాబాద్ తరఫున పదిహేను మ్యాచ్లలో కలిపి 602 పరుగులు సాధించాడు. ఈ మేరకు టీ20లలో సత్తా చాటిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) వన్డేలలోనూ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. వన్డే వరల్డ్కప్-2023 తర్వాత జట్టుకు దూరమైన ఇషాన్.. అఫ్గనిస్తాన్ స్వదేశంలో జూన్ 13 నుంచి మొదలుకానున్న సిరీస్కు ఎంపికయ్యాడు.సీనియర్ కేఎల్ రాహుల్తో కలిసి వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కిషన్కు చోటు దక్కింది. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలో ఇషాన్కు యాజమాన్యం ఈ మేరకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.మూడో వికెట్ కీపర్గా..ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్, ఇషాన్లతో పాటు భారత్ మూడో వికెట్ కీపర్ను కూడా ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని సూచించాడు. సంజూ శాంసన్ను బ్యాకప్ కీపర్గా ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్కప్ టోర్నీ నేపథ్యంలో నంబర్ వన్ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు ప్రాధాన్యం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయగలడు. విలక్షణమైన ఆటగాడు.అతడి వన్డే రికార్డు గొప్పగా ఉందిఇక ఇషాన్ కిషన్ సైతం ఓపెనర్గా రాణించగలడు. వన్డౌన్లోనూ ఆడగలడు. అందుకే వారిద్దరికి సెలక్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, సంజూ శాంసన్ వన్డే రికార్డు కూడా గొప్పగా ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా అతడు రాణించాడు.ఒత్తిడిలోనూ రాణించగల పరిణతి సాధించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కాబట్టి సంజూను కూడా సెలక్టర్లు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. కాగా సంజూ ఇప్పటి వరకు 14 వన్డేలు ఆడి 510 పరుగులు సాధించాడు. చివరగా 2023 డిసెంబరులో టీమిండియా తరఫున వన్డే ఆడాడు.చదవండి: అతడికి అన్యాయం.. ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు: గంభీర్
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల రాక్షస పాలనపై రణభేరి.. రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
అమరావతి రైతులకు అండగా ఉంటాం... వైఎస్సార్సీపీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు... రాజధాని గ్రామాల రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
ఐపీఎల్ బాద్షా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై జయకేతనం
ఏపీ మెగా డీఎస్సీలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి సర్కార్ యత్నాలు... తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేసిన విద్యా శాఖ
చేతికి వచ్చి చేజారిన ఉద్యోగం... ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో బయటపడుతున్న లీలలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా... కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి
చంద్రబాబు రాక్షస పాలనపై పోరుబాట... వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పునకు సంకేతాలు.. సిద్ధరామయ్య రేపు రాజీనామా చేసే అవకాశం
బిజినెస్
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి, నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 116.66 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 74,243.34 వద్ద, నిఫ్టీ 49.85 పాయింట్లు లేదా 0.21 శాతం నష్టంతో 23,366.70 వద్ద నిలిచాయి.అగ్రి-టెక్ (ఇండియా) లిమిటెడ్, ప్రిమో కెమికల్స్ లిమిటెడ్, రామ్కో సిస్టమ్స్ లిమిటెడ్, భగేరియా ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జాగ్రన్ ప్రకాశన్ లిమిటెడ్, సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, సన్ఫ్లాగ్ ఐరన్ & స్టీల్ కంపెనీ లిమిటెడ్, వింధ్య టెలిలింక్స్ లిమిటెడ్, రవీంద్ర ఎనర్జీ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఐసీఐసీఐ బ్యాంకుకు సెబీ హెచ్చరిక
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షాక్ ఇచ్చింది. వాలంటరీ రిటెన్షన్ రూట్(వీఆర్ఆర్) కింద స్థానిక రుణ సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు సెబీ హెచ్చరిక లేఖ జారీ చేసింది. ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు దాఖలు చేసిన ఒక ఫైలింగ్లో అధికారికంగా వెల్లడించింది.అసలేం జరిగింది?సెక్యూరిటీ కస్టోడియన్ (Securities Custodian)గా వ్యవహరిస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్పీఐ)కు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూర్చినట్లు సెబీ గుర్తించింది. వీఆర్ఆర్ ప్రోగ్రామ్ కింద దేశీయ బాండ్లలో పెట్టుబడి పెట్టిన సదరు విదేశీ ఇన్వెస్టర్, లాక్-ఇన్ పీరియడ్ పూర్తి కాకముందే తన నిధులను స్వదేశానికి తిరిగి తీసుకెళ్లేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ అనుమతించింది.సెబీ అభ్యంతరంనిబంధనల ప్రకారం గడువు ముగియకుండా నిధులను వెనక్కి పంపడం ఆర్బీఐ, సెబీ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేస్తూ సెబీ జూన్ 1న బ్యాంకుకు హెచ్చరిక లేఖ పంపింది. ఈ ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను నిర్ణీత కాలపరిమితిలోగా ఎక్స్ఛేంజీలకు వెల్లడించడంలోనూ బ్యాంక్ విఫలమైంది. అనుకోకుండా జరిగిన ఆలస్యం వల్లే ఈ సమాచారాన్ని సకాలంలో సమర్పించలేకపోయామని బ్యాంక్ అంగీకరించింది.వీఆర్ఆర్ అంటే ఏమిటి? దాని ప్రాధాన్యత ఏంటి?భారతీయ ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులను దీర్ఘకాలం పాటు నిలిపి ఉంచేలా ప్రోత్సహించడానికి ఆర్బీఐ 2019లో ఈ స్వచ్ఛంద నిలుపుదల మార్గాన్ని (వీఆర్ఆర్) ప్రవేశపెట్టింది. సాధారణ ఎఫ్పీఐ పెట్టుబడులపై ఉండే కఠినమైన నియంత్రణ అవసరాల నుంచి విదేశీ ఇన్వెస్టర్లకు ఈ మార్గం ద్వారా కొన్ని మినహాయింపులు లభిస్తాయి. అయితే, ఇందుకు ప్రతిగా సదరు విదేశీ ఇన్వెస్టర్ తమ పెట్టుబడుల్లో ఒక కనీస శాతాన్ని నిర్ణీత కాలం పాటు దేశంలోనే ఉంచేందుకు స్వచ్ఛందంగా కట్టుబడి ఉండాలి. కాగా, ఇటీవలే (ఫిబ్రవరిలో) కేంద్ర బ్యాంక్ ఈ ఎఫ్పీఐ పెట్టుబడుల కోసం వీఆర్ఆర్ను జనరల్ రూట్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఐసీఐసీఐ బ్యాంక్ వివరణసెబీ తీసుకున్న ఈ నియంత్రణ చర్యపై ఐసీఐసీఐ బ్యాంక్ స్పందించింది. ఈ హెచ్చరిక లేఖ కేవలం ఒక నిర్దిష్ట సమ్మతి లోపానికి సంబంధించినది మాత్రమేనని తెలిపింది. ‘ఈ చర్య వల్ల బ్యాంకు ఆర్థిక స్థితిగతులపై ఎలాంటి ప్రభావం ఉండదు. బ్యాంకు దైనందిన కార్యకలాపాలు లేదా వ్యాపార నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగదు. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా అంతర్గత నియంత్రణలను మరింత బలోపేతం చేస్తాం’ అని చెప్పింది. బ్యాంకు మొత్తం పనితీరుపై గానీ, భద్రతపై గానీ దీని ప్రభావం ఏమాత్రం ఉండబోదని మేనేజ్మెంట్ ఇన్వెస్టర్లకు, ఖాతాదారులకు భరోసా ఇచ్చింది.ఇదీ చదవండి: మూల పడిన బంగారం.. దేశ ఆర్థికానికి మూలాధారం!
వైభవ్ సూర్యవంశీ ట్యాక్స్ ఎవరు కట్టాలి?: రూల్స్ ఏం చెబుతున్నాయ్!
15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన కనపరిచి.. అందరినీ ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే.. ఇతడు ఐపీఎల్ కాంట్రాక్టులు, ఎండార్స్మెంట్స్, స్పాన్సర్షిప్ డీల్స్ ద్వారా సుమారు రూ.7 కోట్ల వరకు ఆర్జించినట్లు సమాచారం. ఇంత చిన్న వయసులో అతనకి వస్తున్న భారీ ఆదాయానికి పన్నులు ఎవరు కట్టాలి? అనేది చాలామంది తెలుసుకోవాల్సిన ప్రశ్న. దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. మైనర్ పిల్లల (18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నవారు) ఆదాయానికి డైరెక్ట్ ట్యాక్స్ అంటూ ఉండదు. కాబట్టి.. వీరి ఆదాయాన్ని తల్లిదండ్రుల ఆదాయంగానే పరిగణిస్తారు. పిల్లలు సంపాదించినప్పటికీ.. దానికి సంబంధించిన ట్యాక్స్ తల్లిదండ్రులు చెల్లించాలన్నమాట.సెక్షన్ 99 ప్రకారం (మునుపటి సెక్షన్ 64(1A) స్థానంలో), మైనర్ ఆదాయం.. తల్లిదండ్రులలో ఎవరి మొత్తం ఆదాయం ఎక్కువగా ఉంటుందో, వారి ఆదాయంతో కలిపి లెక్కిస్తారు. తల్లిదండ్రులు విడిపోయిన సందర్భంలో.. పిల్లలను చూసుకునే తల్లి లేదా దండ్రి ఆదాయంలో అది కలుస్తుంది. దీంతో పిల్లల పేరుతో పెట్టుబడులు పెట్టినా, వాటి ద్వారా వచ్చిన వడ్డీ లేదా ఇతర లాభాలు సాధారణంగా తల్లిదండ్రుల పన్ను పరిధిలోకి వస్తాయి.అయితే.. ఈ నియమానికి ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. పిల్లలు తన సొంత ప్రతిభ, నైపుణ్యం, కృషి లేదా ప్రత్యేక జ్ఞానం ద్వారా సంపాదిస్తే, ఆ ఆదాయం తల్లిదండ్రుల ఆదాయంలో కలపరు. ఈ కారణం చేతనే.. వైభవ్ సూర్యవంశీ వంటి క్రీడాకారుల ఆదాయానికి నేరుగా వారి పేరుతోనే పన్ను విధించడం జరుగుతుంది.ఇదీ చదవండి: బంగారం పెట్టుబడులపై ఆంక్షలు.. HDFC కీలక నిర్ణయం!ఈ నిబంధన కేవలం క్రీడాకారులకు మాత్రమే కాకుండా.. యూట్యూబర్లు, సోషల్ మీడియా క్రియేటర్లు, బాల నటులు, ఈస్పోర్ట్స్ ప్లేయర్లకు కూడా వర్తిస్తుంది. పిల్ల తన సొంత ప్రతిభతో సంపాదిస్తే.. ఆ ఆదాయం అతని లేదా ఆమె పేరుతోనే పన్ను విధించడం జరుగుతుంది. పిల్లల 18 సంవత్సరాలు పూర్తయితే నియమాలు మారిపోతాయి. అప్పుడు అతను లేదా ఆమె స్వతంత్రంగా పన్ను చెల్లింపుదారుడిగా మారి, తన ఆదాయానికి తానే బాధ్యత వహించాలి.
మొబైల్ రీఛార్జ్లు పెరగొచ్చు!
దేశంలోని టెలికాం వినియోగదారులకు మరోసారి మొబైల్ రీఛార్జ్ల భారం పడే అవకాశం కనిపిస్తోంది. వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో టెలికాం కంపెనీలు టారిఫ్లను సుమారు 10 శాతం మేర పెంచే అవకాశముందని యాక్సిస్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. గతంలో జరిగినట్లుగా 15–20 శాతం భారీ పెంపులు అవసరం లేదని, ఈసారి పరిమిత స్థాయిలో ధరల సవరణ జరిగే అవకాశం ఉందని ఆయన సీఎన్బీసీ-టీవీ18 వార్తాసంస్థతో పేర్కొన్నారు.టెలికాం రంగంలో ప్రస్తుతం ఆదాయ వృద్ధి కేవలం టారిఫ్ పెంపులపైనే ఆధారపడడం లేదని మల్హోత్రా వివరించారు. వినియోగదారులు అధిక డేటా ప్రయోజనాలు, 5జీ సేవలు, ప్రీమియం ప్లాన్ల వైపు మారుతుండటంతో కంపెనీలకు ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) సహజంగానే పెరుగుతోందన్నారు. టారిఫ్ పెంపు లేకుండానే ఏఆర్పీయూ ఏటా 4–5 శాతం మేర పెరుగుతోందని ఆయన అంచనా వేశారు.ఇటీవల సంవత్సరాల్లో జరిగిన టారిఫ్ పెంపులను వినియోగదారులు పెద్దగా వ్యతిరేకించకపోవడం, 5జీ సేవల వినియోగం పెరగడం, అధిక విలువ కలిగిన ప్లాన్లకు మారుతున్న కస్టమర్ల సంఖ్య పెరగడం వంటి అంశాలు టెలికాం కంపెనీల ఆదాయాలకు ఊతమిస్తున్నాయి. దీంతో భారీ ధరల పెంపుల అవసరం ప్రస్తుతం కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.మరోవైపు, ఇతర బ్రోకరేజ్ సంస్థలు కూడా 2026లో టెలికాం టారిఫ్ల పెంపుపై అంచనాలు వెలువరించాయి. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన సంస్థలు 10–15 శాతం వరకు టారిఫ్లను పెంచవచ్చని జెఫరీస్ వంటి సంస్థలు ఇప్పటికే పేర్కొన్నాయి. అయితే ఇప్పటివరకు ఏ టెలికాం సంస్థ అధికారికంగా ధరల పెంపును ప్రకటించలేదు.టారిఫ్లు నిజంగానే 10 శాతం పెరిగితే ప్రస్తుతం రూ.299 ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ ధర సుమారు రూ.329కు, రూ.349 ప్లాన్ రూ.384కు చేరే అవకాశం ఉంటుంది. అయితే తుది నిర్ణయం టెలికాం కంపెనీల వ్యూహాలు, మార్కెట్ పరిస్థితులు, పోటీ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
ఫ్యామిలీ
60 ఏళ్లు.. లక్షన్నర కిలోమీటర్లు
హుషారు కోసమో, లేదా బేజారు తగ్గడం కోసమో శరీరానికి కాస్త వ్యాయామం అవసరమని సైకిలింగ్ చేసేవాళ్లను చూశాం. బ్యాటరీ సైకిళ్లు, స్కూటర్లు వచ్చాక పెడల్ మీద కాలు పెట్టేవారే కరువయ్యారు. కాని రాజస్థాన్లోని ఓ మహిళ తన అనితర సామర్థ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జైపూర్కి చెందిన రేణు సింఘి వయసు అక్షరాల 60 ఏళ్లు. అయితేనేం? టీనేజర్లు కూడా షాక్ అయ్యేలా సైకిలింగ్ చేస్తూ ఛాలెంజ్ విసురుతోంది. సైకిలింగ్ అంటే అదేదో ట్రాక్లోనో స్మూత్గా ఉన్న రోడ్డు మీదో కాదు. మిట్టపల్లాలు, కొండలు, గుట్టలు ఇలా ప్రదేశమేదైనా తగ్గేదేలే అంటూ సైకిల్ తొక్కేస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె సైకి లింగ్ మొదలుపెట్టింది 51 ఏళ్ల వయసులో..కాని ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆమె 1.5 లక్షల కిలోమీటర్లు సైకిలింగ్ చేసింది. అలాగే ‘1200 కి.మీ పారిస్ బ్రెస్ట్ పారిస్’ సైకిల్ రైడ్ పూర్తి చేసిన తొలి భారతీయ మహిళ కూడా రేణునే.. ఇలా పలు రేసుల్లో పాల్గొంటూ తన తోటి వయసు వారికి ఆదర్శంగా నిలుస్తోంది.
కుమారుడి కోసం ఉద్యోగానికి రిజైన్..!కట్చేస్తే..
గత కొద్దికాలంగా ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతూ..ఎంత మంది ఉద్యోగులును తీసేసిందో చూశాం. ఆ జాబితాలో మన కళ్లముందే ఎంత పేరుగాంచిన మహా మహా కంపెనీలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ పోస్ట్ నిజంగా మనసుని తాకుతుంది. కొన్ని కంపెనీలు ఇలా కూడా ఉద్యోగి పట్ల ఆలోచిస్తాయా అని అనిపిస్తుంది. అలాంటి పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.అంకిత్ పాండే అనే వ్యక్తి ఈ పోస్ట్ని సోషల్ మీడియాలో ఎక్స్లో పంచుకున్నారు. తన వద్ద ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అకౌంటెంట్ రాజీనామా లెటర్ని సమర్పించాడని చెప్పారు. అతడు పదేళ్లుగా మా కంపెనీలో సేవలందిస్తున్నాడు. అందువల్లే ఎందుకింత సడెన్గా రిజైన్ చేస్తున్నారని ప్రశ్నించగా..ఆయన కళ్లనీళ్లతో తన కొడుకు పరిస్థితి బాగోలేదని, వైద్యులు కూడా బతికే అవకాశాలు తక్కువ అని చెప్పారని బాధగా చెప్పాడు. దాంతో పోనీ ఇంటి నుంచి పనిచేస్తారా అని అడుగగా..కుమారుడికి తన అవసరం ఉందని, తనతో గడపాలని కోరుకుంటున్నానంటూ.. ఆ ఆఫర్ని తిర్కస్కరించాడని చెప్పారు. అప్పుడు వెంటనే అంకిత్ పాండే డోంట్.." వర్రీ మీ కుమారుడు బాగోగులు చూసుకో పర్లేదు మీకు కంపెనీ మద్దతు కొనసాగుతుంది. పదేళ్లుగా ఇక్కడే పనిచేశారు అందుకుగానూ..నెల నెల జీతం జమ అవుతుంది. చింతించొద్దు." అని ధైర్యం చెప్పి పంపామన్నారు. ఆ తర్వాత ఒక నెల తర్వాత స్వీట్స్ బాక్స్తో ఆ అకౌంటెంట్ తిరిగొచ్చి..మా అబ్బాయి కోలుకున్నాడని ఆనందంగా చెబుతూ స్వీట్స్ పంచిపెట్టాడు. పైగా జాబ్లో మళ్లా జాయిన్ అవ్వతూ..తాను పనిచేయని దానికి చెల్లించిన జీతాన్ని మినహాయించమని ఆ అకౌంటెంట్ అభ్యర్థించాడని అన్నారు. అందుకు యజమాని నిరాకరిస్తూ..అది జీతం కాదు మీ అబ్బాయ్ కోలుకోవడానికి తాము చేసిన చిన్న సహాయం మాత్రేమ. కొన్ని సార్లు ఒక సంస్థ పనిచేసే ప్రదేశం మాత్రమే కాదు..ఒక కుటుంబం లాంటిది కూడా అని అన్నానంటూ చెప్పుకొచ్చారు అంకిత్ పాండే పోస్ట్లో. ఇంతకుమించిన ఉద్యోగ భద్రత ఇంకేంకావాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి సహృద్భావంగా ఆలోచించే కంపెనీలు దొరకడం అరుదే కదూ.(చదవండి: భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!)
ఏడు నెలల్లో 101 కేజీల నుంచి 65 కేజీలకు..!
బరువు తగ్గడం ఒక్కోక్కరికీ ఒకోలా ఉంటుంది. కొందరు సులభంగా బరువు తగ్గితే..కొందరికీ అది భారంగా ఉంటుంది. కాఈ ఇక్కడ ఈ ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్ అధిక బరువు ఏ రేంజ్లో ఉందంటే తగ్గుతుందామె అనే ప్రశ్న కలిగేలా ఉంది. అంత అధిక బరువును తగ్గించుకునేందుకు ఉపక్రమించి..చాలా కొద్ది టైంలో మంచి పలితాన్ని అందుకుంది. పైగా ఓ హీరోయిన్ మాదిరి స్మార్ట్ లుక్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.ఆ ఫిట్నెస్ కంటెంట్ క్రియేటరే కాజల్. తన బరువు తగ్గే ప్రయాణాన్ని ఇన్స్టాగ్రామ్లో డాక్యుమెంట్ చేస్తూ..ఏడాది లోపే 101 కేజీల నుంచి 65 కేజీలకు ఎలా తగ్గిందో పంచుకుంది. ఆమె వీడియోల ప్రకారం, కాజల్ ఆగస్టు 2025లో తన పరివర్తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఏడు నెలల్లో దాదాపు 36 కేజీలు తగ్గారు. అందుకోసం డైట్ విషయంలో చాలా కేర్ తీసుకున్నానని, అదే తనను ఇంతలా బరువు తగ్గేలా చేసిందని చెప్పుకొచ్చింది. భోజన ప్రణాళిక..తొలిరోజు..ఆమె వారంలోని మొదటి రోజు ఒక సాధారణమైన, సమతుల్యమైన ఇంట్లో వండిన భోజనంతో మొదలవుతుంది. ఉదయం, ఆమె నానబెట్టిన ఐదు నట్స్తో ఒక కప్పు జీరా నీటిని తాగుతుంది. ఆ తర్వాత పుదీనా చట్నీతో రెండు చిన్న బేసన్ చిల్లాలను ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారంగా తీసుకుంటుంది. ఉదయం పూట చిరుతిండిగా, ఆమె ఒక గిన్నెడు పండ్లు అంటే.. మాగ్జిమ్ బొప్పాయితో పాటు, ఒక టేబుల్ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలను ఇష్టపడుతానని అన్నారు. మధ్యాహ్న భోజనంలో అర కప్పు బ్రౌన్ రైస్, శనగపప్పు, బెండకాయ కూర ఉంటాయి. తర్వాత, ఆమె 20 గ్రాముల వేయించిన మఖానాతో ఒక కప్పు గోరువెచ్చని హెర్బల్ టీ తాగుతుంది. రాత్రి భోజనంలో, ఆమె టోఫు బుర్జీ, వేయించిన బీన్స్, ఒక బాజ్రా రోటీ తింటుంది.రెండవ రోజురెండవ రోజు, కాజల్ జీరా నీటికి బదులుగా నానబెట్టిన చియా గింజలతో గోరువెచ్చని నిమ్మ నీటిని తీసుకుంటుంది. అల్పాహారంగా సోయా చంక్స్తో వెజిటబుల్ పోహా తింటుంది. ఆమె ఉదయం పూట అల్పాహారంగా ఒక పూర్తి ఆపిల్, ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు తింటుంది. తర్వాత మధ్యాహ్న భోజనంలో రెండు రోటీలు, పెసరపప్పు, సొరకాయ కూర, సలాడ్ తీసుకుంటుంది. సాయంత్రం అల్పాహారం కోసం, కాజల్ ఒక కప్పు మజ్జిగ, వేయించిన శనగలను ఎంచుకుంటుంది. ఆమె తన రోజును 100 గ్రాముల పాలక్ పనీర్, ఒక జొన్న రొట్టె, దోసకాయ రైతాతో ముగిస్తుంది.3వ రోజుఆమె 3వ రోజు భోజనాలు సాదాసీదాగా కడుపు నింపే వాటికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆమె ఉదయాన్ని అలోవెరా షాట్, గోరువెచ్చని నీటితో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత రాగి దోస, ప్రోటీన్ అధికంగా ఉండే సాంబార్, చట్నీ తీసుకుంటుంది. ఉదయం పూట చిరుతిండిగా, ఆమె ఒక జామకాయ, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు తింటుంది. మధ్యాహ్న భోజనంలో ఒక చిన్న జొన్న రొట్టె, కందిపప్పు, పాలకూర కూర, సలాడ్ ఉంటాయి. సాయంత్రం, ఆమె చియా గింజలు, బెర్రీలు లేదా దానిమ్మ గింజలతో కలిపిన తీపి లేని గ్రీక్ పెరుగు గిన్నెను ఎంచుకుంటుంది. రాత్రి భోజనంలో వెజిటబుల్ క్వినోవా పులావ్, దోసకాయ-టమోటా సలాడ్ ఉంటాయి.4వ రోజుకాజల్ 4వ రోజు భోజన ప్రణాళిక నానబెట్టిన మెంతి గింజల నీరు, వెజిటబుల్ ఉప్మాతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఒక బేరీపండు, 8-10 నానబెట్టిన ఎండుద్రాక్షలు తీసుకుంటుంది. మధ్యాహ్న భోజనంలో, ఆమె మిల్లెట్ ఖిచిడీ, కచ్రీ తింటుంది. సాయంత్రం, ఆమె నిమ్మరసం తాగి, హమ్మస్తో రెండు రైస్ కేక్లు తింటుంది. రాత్రి భోజనంలో సోయా కూర, ఒక రోటీ ఉంటాయి.5వ రోజుఆమె తన రోజును నిమ్మ-అల్లం నీళ్లు, నానబెట్టిన ఐదు వాల్నట్లు, కూరగాయలు, గ్రీన్ చట్నీతో కూడిన ఓట్స్ చిల్లాతో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత, ఈ కంటెంట్ క్రియేటర్ పండ్లు, గింజలు, ఆపై మధ్యాహ్న భోజనంలో రెండు బాజ్రా రోటీలు, మసూర్ పప్పు, బెండకాయ కూర, సలాడ్ తింటుంది. సాయంత్రం, ఆమె మజ్జిగ వేయించిన వేరుశెనగలు తింటుంది. రాత్రి భోజనంలో పనీర్ టిక్కా, వేయించిన జుకినీ,అర కప్పు బ్రౌన్ రైస్ ఉంటాయి.బరువు తగ్గే ఫలితాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తున్నప్పుడు నిలకడ, పరిమాణ నియంత్రణ, సమతుల్య ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యత అత్యంత ముఖ్యమని అంటున్నారు కాజల్. అప్పుడే చక్కటి ఫలితాలను సత్వరమే అందుకోగలమని అన్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Fit kajal (@flex_fit_kajal) (చదవండి: 'సక్సెస్'కి సరైన నిర్వచనం ఇదే..! తొలిసారిగా పేరెంట్స్ని..)
'సక్సెస్'కి సరైన నిర్వచనం ఇదే..! తొలిసారిగా పేరెంట్స్ని..
మన సక్సెస్ కోసం అహర్నిశలు కష్టపడ్డ పేరెంట్స్కి తిరిగి ఏదైన ఇవ్వగలిగడం కంటే మించిన విజయం ఇకొంకటి ఉండదు. ఈ కల కోసం అంతా ప్రయత్నిస్తుంటారు. కొందరికీ ఏవేవో కారణాల వల్ల కుదరకపోవచ్చు. కానీ కొందరు అనుకున్నది సాధించి విజయానికి అసలైన నిర్వచనం ఇస్తుంటారు. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.అభిషేక్ ఝా అనే వ్యవస్థాపకుడు ఏళ్లుగా ఈ కలం కోసం ఎదురు చూస్తున్నా అంటూ వివరిస్తుండటం వీడియోలో చూడొచ్చు. భావోద్వేగభరితమైన ఆ వీడియో క్లిప్లో తన తలిద్రండులను మొదటిసారి విదేశాలకు తీసుకువెళ్తున్నా అంటూ ఎయిర్పోర్ట్ నుంచి ఆ సతోషాన్ని పంచుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. అతను ఆ వీడియోలో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు. "ఎయిర్పోర్ట్లోని ఇమ్మిగ్రేషన్ అధికారి ఎందుకింత సంతోషంగా ఉన్నారని అడిగాడు. అందుకు తాను జీవితంలో విజయం సాధించిన మొదటి క్షణం ఇది. ఈ రోజు తొలిసారి తన తల్లిదండ్రులని ఒక అంతర్జాతీయ పర్యటనకు తీసుకువెళ్తున్నా. ఇదంతా తనకెలా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేను. నాతో కలిసి దేశం బయటకు అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. వాళ్లు తమ కూమారుడు వారికోసం సంపాదించిన ప్రపంచాన్ని చూడనున్నారు. అయినా ఈ సంతోషం అంతా గెలిచిన వారికే దక్కుతుంది మిత్రమా. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పేరెంట్స్ కోసం విజేతగా నిలవాలి. అంటూ అభిషేక్ తన పోస్ట్ని ముగించాడు. అంతేగాదు ఆ వీడియోకి ‘తన తల్లిదండ్రులకు ప్రపంచాన్ని ఇవ్వాలని కలలు కన్న ఆ 16 ఏళ్ల అభిషేక్ ఝా కోసం..’ అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేశాడు. నెటిజన్లు కూడా ఇది నిజమైన విజయానికి నిర్వచనం, తల్లిదండ్రులను గర్వపడేలా చేయడం కంటే మించిన అనుభూతి మరొకటి లేదు అని కొందరు, మీ పేరెంట్స్ ముఖాల్లో చిరునవ్వు వాళ్లు చేసిన ప్రతికష్టానికి దక్కిన ప్రతిఫలం అని మరికొందరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhishek Jha (@nofilterabhi) (చదవండి: సినిమా సీన్ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!)
అంతర్జాతీయం
ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం
నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు బహిరంగ లేఖ రాశారు. యుద్ధాన్ని ముఖాముఖి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. అయితే అదే సమయంలో యుద్ధానికి పూర్తి బాధ్యత పుతిన్దేనని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ జెలెన్స్కీ రాసిన ఈ ఓపెన్ లెటర్ అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జూన్ 4న విడుదల చేసిన ఈ లేఖలో ఆయన పుతిన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాటో, భౌగోళిక రాజకీయాలు, రష్యన్ భాష వంటి అంశాలను కారణాలుగా చూపుతున్నప్పటికీ, అసలు ఈ యుద్ధం పుతిన్ వ్యక్తిగత నిర్ణయమేనని పేర్కొన్నారు.గత 26 ఏళ్లలో పుతిన్ పాలనలో రష్యా–ఉక్రెయిన్ సంబంధాలు పూర్తిగా మారిపోయాయని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు వాణిజ్యం, పౌర సహకారం గురించి మాట్లాడుకునే దేశాలు ఇప్పుడు క్షిపణి దాడులు, మరణాలు, విధ్వంసం గురించే చర్చించాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. రష్యాలో యుద్ధ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందని జెలెన్స్కీ అన్నారు. పెరుగుతున్న ధరలు, ఇంధన కొరత, ఆంక్షలు, నిరంతర సైనిక నియామకాలతో సాధారణ రష్యన్లు అసంతృప్తికి గురవుతున్నారని పేర్కొన్నారు. యుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా రాజకీయ, ఆర్థిక వనరులు క్రమంగా బలహీనపడుతున్నాయని కూడా వ్యాఖ్యానించారు. యుద్ధభూమిలో రష్యా భారీ నష్టాలు చవిచూస్తోందని జెలెన్స్కీ పేర్కొన్నారు. మే నెలలోనే 30 వేల మందికిపైగా రష్యన్ సైనికులు మరణించారని లేదా తీవ్రంగా గాయపడ్డారని ఆయన తెలిపారు. ముఖ్యంగా డోనెట్స్క్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలన్న రష్యా లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదని, ఈ ఏడాది కూడా అది సాధ్యం కాదని ధీమా వ్యక్తం చేశారు.మరోవైపు, ఉక్రెయిన్ త్వరగా కుప్పకూలిపోతుందని భావించిన రష్యా అంచనాలు తప్పాయని జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ ప్రజల ప్రతిఘటనతో పాటు అమెరికా, యూరప్ దేశాల మద్దతు తమకు బలంగా నిలిచిందన్నారు. "మాకు మద్దతు వస్తోంది.. మీకు ఆంక్షలు వస్తున్నాయి" అంటూ పుతిన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.అంతర్జాతీయంగా రష్యా ఒంటరి అవుతోందని కూడా జెలెన్స్కీ పేర్కొన్నారు. ఉత్తర కొరియా సహాయం కోరిన తొలి రష్యా పాలకుడు పుతిన్ అని పేర్కొంటూ, ప్రస్తుతం చైనాపై కూడా రష్యా అధికంగా ఆధారపడుతోందన్నారు. రష్యాకు పరోక్షంగా సహకరిస్తున్న దేశాలు కూడా యుద్ధంపై విసుగు చెందుతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే ఇంత విమర్శల మధ్యలోనే జెలెన్స్కీ శాంతి ప్రతిపాదనను ముందుంచారు. స్విట్జర్లాండ్, టర్కీ లేదా ఏదైనా అరబ్ దేశంలో పుతిన్తో ముఖాముఖి సమావేశానికి సిద్ధమని ప్రకటించారు. దేశాల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు నాయకులే తీసుకోవాలని, అందుకే ప్రత్యక్ష చర్చలు అవసరమని పేర్కొన్నారు. ఈ చర్చల సమయంలో పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే ఇరు దేశాల యుద్ధ ఖైదీలను పూర్తిగా పరస్పరం విడుదల చేసుకోవడం, యుద్ధ సమయంలో తరలించిన పౌరులు, పిల్లలను తిరిగి పంపించడం వంటి చర్యలను ప్రతిపాదించారు.అమెరికా, యూరప్ దేశాలు కూడా శాంతి ప్రక్రియలో భాగస్వాములు కావాలని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో భద్రతా హామీలు, కొత్త ప్రాంతీయ భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు పాశ్చాత్య దేశాల పాత్ర కీలకమని అన్నారు. చివరగా పుతిన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. "ఈ యుద్ధాన్ని ముగించాల్సిన సమయం వచ్చిందని మీరు స్వయంగా నిర్ణయించుకోకపోతే.. ఉక్రెయిన్ తన ఉనికి కోసం పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఈ యుద్ధాన్ని ఆపగల శక్తి మీ చేతుల్లోనే ఉంది" అంటూ తన లేఖను ముగించారు. ఈ బహిరంగ లేఖ రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కొత్త మలుపుకు సంకేతమా? లేక మరో రాజకీయ ఒత్తిడి వ్యూహమా? అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.కీలకాంశాలు:🔹 పుతిన్కు జెలెన్స్కీ బహిరంగ లేఖ.. ప్రత్యక్ష చర్చలకు ఆహ్వానం.🔹 యుద్ధానికి పూర్తి బాధ్యత పుతిన్దేనని తీవ్ర విమర్శలు.🔹 రష్యా భారీ సైనిక, ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటోందని వ్యాఖ్య.🔹 స్విట్జర్లాండ్ లేదా టర్కీలో ముఖాముఖి భేటీకి సిద్ధమన్న జెలెన్స్కీ.🔹 చర్చల సమయంలో కాల్పుల విరమణ, ఖైదీల మార్పిడికి ప్రతిపాదన.🔹 చర్చలు విఫలమైతే పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక.
ఆ ఒప్పందాన్ని అంగీకరించం
బీరూట్: ఇజ్రాయెల్, లెబనాన్ ప్రభుత్వం మధ్య కుదిరిన తాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాము అంగీకరింబోమని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ నాయకుడు నయీమ్ కాశీం తేల్చిచెప్పారు. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వైదొలగాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కాశీం విడుదల చేసిన లిఖితపూర్వక ప్రకటనను హెజ్బొల్లా టీవీ అల్–మనార్లో గురువారం చదివి వినిపించారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం.. హెజ్బొల్లా మిలిటెంట్లు దక్షిణ లెబనాన్ను విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇందుకు మిలిటెంట్లు ఒప్పుకోవడం లేదు. అలాచేసే తాము లొంగిపోయినట్లు, ఓటమిని అంగీకరించినట్లే అవుతుందని అంటున్నారు. శత్రువుకు తలవంచబోమని తేల్చిచెబుతున్నారు. దురాక్రమణకు ముగింపు పలకాలని, లెబనాన్ నుంచి వైదొలగాలని ఇజ్రాయెల్ను కాశీం డిమాండ్ చేశారు. దురాక్రమణ కొనసాగుతున్నంత కాలం ప్రతిఘటనను విరమిస్తామని ఎవరికీ హామీ ఇవ్వలేదని స్పష్టంచేశారు. కాల్పుల విరమణ అమల్లోకి రావాలంటే ఇజ్రాయెల్ వెనక్కి తగ్గాలన్నారు. హెజ్బొల్లా గ్రూప్కు ఇరాన్ మద్దతిస్తున్న సంగతితెలిసిందే.
విండోపవర్
మీ ఇంట్లో కిటికీల సంఖ్యను రెట్టింపు చేసుకోండి వీలైతే మీ భవనాలను అద్దాలతో కప్పేసుకోండి ఎందుకంటే.. ఇంకొన్ని ఏళ్లలో ఈ కిటికీలు, అద్దాలే విద్యుదుత్పత్తి కేంద్రాలు కానున్నాయి మరి! సూర్యుడి వెలుతురును అడ్డుకోకుండానే విద్యుత్తును అందించడం వీటి ప్రత్యేకత. అదెలాగంటే...సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్టీయూ) సరికొత్త సోలార్ సెల్స్ను ఆవిష్కరించింది. అత్యంత పలుచగా ఉండటమే కాకుండా పెరోవిస్కైట్ అనే పదార్థంతో తయారైన ఈ సోలార్ సెల్స్ను నేరుగా కిటికీలు, అద్దాలపై ఏర్పాటు చేసకోవచ్చు. వెలుతురును కూడా ప్రసారం చేయగల ఈ అర్ధ పారదర్శక సోలార్ సెల్స్ రికార్డు స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి చేయగలవు. ప్రస్తుతం సోలార్ సెల్స్ సిలికాన్తో తయారవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే సిలికాన్ ఖరీదు చాలా ఎక్కువ. సామర్థ్యం విషయంలోనూ పరిమితులున్నాయి. బిగించుకోవడం, వాడుకోవడంలోనూ ఇబ్బందులున్నాయి. ఈ నేపథ్యంలో చౌక, మరింత సమర్థమైన సోలార్సెల్స్ తయారీకి చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే సుమారు రెండు దశాబ్దాల క్రితం పెరోవిసై్కట్ను ప్రత్యామ్నాయంగా గుర్తించారు. కాకపోతే అప్పట్లో వీటి సామర్థ్యం చాలా తక్కువగా అంటే కాంతి రూపంలో పడే శక్తిలో కేవలం రెండు శాతాన్ని మాత్రమే విద్యుత్తుగా మార్చగలిగేది. తరువాతి కాలంలో జరిగిన పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు ఈ సామర్థ్యం 20 శాతానికి చేరుకోవడం గమనార్హం. వెలుతురు, విద్యుత్తుల బ్యాలెన్స్... ఎన్టీయూ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన సరికొత్త పెరోవిస్కైట్ సోలార్ సెల్స్ ఎంత మందం ఉంటాయో తెలుసా? కేవలం పది నానోమీటర్లు. అంటే మనిషి వెంట్రుక కంటే పది వేల రెట్లు తక్కువ మందం అన్నమాట. పైగా ఈ సెల్స్పై పడే కాంతిలో 41 శాతం నేరుగా ప్రసారమయ్యేంత పారదర్శకంగా ఉంటాయి. అయితే ఇలా పారదర్శకంగా ఉంచేందుకు దీని విద్యుదుత్పత్తి సామర్థ్యం విషయంలో కొంత రాజీ పడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సోలార్ సెల్స్ 7.6 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. కాకపోతే చౌక కాబట్టి భవనాలను వీటితో కప్పేసి సిలికాల్ సోలార్ సెల్స్ కంటే ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే చిన్న ఉదాహరణ చూద్దాం.. న్యూయార్క్లో వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనే ఓ భారీ భవనముంది. ఈ ఒక్క భవనాన్ని ఎన్టీయూ శాస్త్రవేత్తలు తయారు చేసిన పెరోవిసై్కట్ సోలార్ సెల్స్ తో కప్పేస్తే వందల మెగా వాట్/గంటల విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంత విద్యుత్తుతో అమెరికాలో 40 వరకూ ఇండ్ల అవసరాలు తీర్చవచ్చునని అంచనా. సవాళ్లూ లేకపోలేదు... పెరోవిసై్కట్ సోలార్ సెల్స్తో ఎన్టీయూ శాస్త్రవేత్తలు సరికొత్త అద్భుతాన్ని సృష్టించినప్పటికీ వీటిని విస్తృత స్థాయిలో వాడే విషయంలో కొన్ని సవాళ్లు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇవి ఎంతకాలం మన్నుతాయి అన్నది. సిలికాన్ సోలార్ సెల్స్ సగటు ఆయుష్షు సుమారు 25 ఏళ్లు. అయితే పెరోవిసై్కట్ పదార్థానికి తడి తగిలితే సరిగ్గా పనిచేయవు. ఆక్సిజన్, వేడి, అతినీలలోహిత కిరణాలను తట్టుకోవడం కష్టం. అందువల్ల వీటి దీర్ఘకాలిక మన్నికపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే వాహనాల పైకప్పులపై వీటిని వాడుకోవడం ద్వారా బ్యాటరీలను నిత్యం ఛార్జ్ చేసుకుంటూ ఉండవచ్చు. అలాగే స్మార్ట్ గ్లాసెస్, తొడుక్కునే ఎలక్ట్రానిక్స్ వంటివి పదే పదే ఛార్జ్ చేసుకునే అవసరం తప్పుతుంది. ప్రస్తుతం ఈ సోలార్ సెల్స్పై ఎన్టీయూ పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు కంపెనీలతో చర్చలూ జరుపుతోంది. అన్నీ సవ్యంగా జరిగితే కొన్నేళ్లలోనే ఇవి మన ఇంటి కిటికీలపైకి చేరవచ్చు. పెరుగుతున్న ప్రాధాన్యం... 2009లో జపనీస్ శాస్త్రవేత్త సుటోము మియాసాకా పెరోవిస్కైట్ను సోలార్ సెల్స్ తయారీకి వాడవచ్చునని గుర్తించారు. అప్పటి నుంచి దీని ప్రాధాన్యం ఏటికేడాదీ పెరుగుతూ వస్తోంది. 2012 – 13 కల్లా పెరోవిసై్కట్ సోలార్ సెల్స్ సామర్థ్యం పది శాతానికి చేరింది. 2015 నాటికి 20 శాతం సామర్థ్యంతో సిలికాన్తో సరి సమానమైంది. మరో ఐదేళ్లకు సిలికాన్ – పెరోవిస్కైట్ సోలార్ సెల్స్ సామర్థ్యం 30 శాతానికి, తాజాగా టాండెమ్ పెరోవిసై్కట్ – సిలికాన్ మాడ్యూల్స్ 35 శాతానికి చేరుకుంది. అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియాల్లో ఈ సోలార్ సెల్స్ పైలెట్ స్థాయి ప్రాజెక్టులు నడుపుతూండటం గమనార్హం. –సాక్షి, నేషనల్ డెస్క్
పొట్టకూటి కోసం వెెళితే.. రూ. 52 కోట్ల లాటరీ
మనామా: ఆ భారతీయుడు పొట్టకూటి కోసం బహ్రెయిన్ వెళ్లాడు. ఆ దేశంలో చిన్నచితకా వ్యాపారాలు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. అయితే అంతలోనే ఆ చిరువ్యాపారిని అదృష్టలక్ష్మీ వరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 52 కోట్ల లక్కీడ్రాలో అతనికి దక్కింది. దీంతో ప్రవాస భారతీయుడు ఆనందంతో ఉబ్బితబ్బయ్యాడు.కేరళ త్రిసూర్కు చెందిన కృష్ణకుమార్ అనే వ్యక్తి గత 23 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం బహ్రెయిన్కు వెళ్లాడు. అప్పటి నుండి అక్కడ పలురకాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఏలాగైనా తన జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని భావించిన కృష్ణకుమార్ లాటరీ టికెట్లను కొనడం ప్రారంభించాడు. అప్పటి నుంచి తరచుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన కొనుగోలు చేసిన లాటరీ టికెట్ బంఫర్ డ్రాలో రూ. 52 కోట్ల ఫ్రైజ్మనీ గెలుచుకుంది. దీంతో బహ్రెయిన్ కరెన్సీ ప్రకారం రూ. రెండు కోట్ల దిర్హమ్లు ( రూ. 52 కోట్ల) రుపాయల ఫ్రైజ్మనీ గెలుచుకున్నారు. అయితే తను కొన్న టికెట్ లక్కీడ్రాలో ఎంపికవడంతో నిర్వాహకులు తనకు ఫోన్ చేశారని ఆసమయంలో తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందని కృష్ణకుమార్ తెలిపారు. అయితే ఇన్నేళ్లుగా తన స్నేహితులతో కలిసి లాటరీ టికెట్లు కొనేవాడినని ఇప్పుడు స్వంతంగా టికెట్ కొనడం దానికి లాటరీ తాకడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఇంతపెద్దమెుత్తంలో డబ్బు చూడడం ఇదే తొలిసారని బహుమతి డబ్బులతో ఏం చేయాలనే విషయం తన కుటుంబసభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని కృష్ణకుమార్ అన్నారు. అయితే ఈ లాటరీలో మెుదటి బహుమతి 25 మిలియన్ల దిర్హమ్లు కాగా ఐదుగురికి ఒక మిలియన్, లగ్జరీ కార్లు బహుమతులుగా ఉన్నాయి.
జాతీయం
భార్య బడిత పూజకు భర్త బలి
ఛతర్పూర్: మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో దంపతుల మధ్య జరిగిన ఘర్షణలో భర్త ప్రాణాలు కోల్పోయాడు. నిందితురాలు నీలం కుష్వాహ తన భర్తను కర్రతో కొట్టి చంపింది. ఆపై ఎనిమిది గంటల పాటు మృతదేహం వద్దే కూర్చుంది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. నీలం గత నాలుగేళ్లుగా తన భర్త దీన్దయాల్ కుష్వాహకు దూరంగా పుట్టింట్లోనే ఉంటోంది.జూన్ 1న దీన్దయాల్ మద్యం మత్తులో భార్య తల్లిదండ్రుల ఇంటికి వచ్చాడు. దీన్దయాల్ బలవంతంగా తలుపులు తెరిచి.. తమ కొడుకును తలకిందులుగా వేలాడదీశాడని నీలం ఆరోపించింది. తన భర్త బిడ్డకు హాని తలపెడతాడేమోనని ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. దీంతో ఆమె కర్రతో దీన్దయాల్పై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన దీన్దయాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య అనంతరం నీలం దాదాపు ఎనిమిది గంటల పాటు భర్త మృతదేహం పక్కనే కూర్చుంది.ఆ తర్వాత స్థానిక గుడికి వెళ్లి.. దేవుడి ముందు 10 నిమిషాల పాటు కూర్చుని క్షమాపణలు వేడుకుంది. అక్కడి నుంచి నేరుగా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఆమె.. తానే తన భర్తను చంపినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్కు తెలిపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లోని మంచంపై ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వేధింపులు, దాడి ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని.. అన్ని కోణాల్లోనూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణే మన సంస్కృతి
భారతదేశంలో అనాది నుంచి కూడా భూమిని భూమాతగా కొలుస్తున్నారు. వృక్షా లను, పశువులను పూజిస్తున్నారు. అంటే భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో ప్రకృతి– పర్యావరణం ఒక విడదీయలేని భాగం. మొక్కలు నాటడం, సహజ వనరులు వాడటంలో పొదుపు; వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత భారతీయ జీవన విధానంలో అంత ర్భాగంగా కొనసాగుతున్నాయి. అయితే ఆధునిక కాలం పోకడల కారణంగా మన జీవన శైలిలో కూడా మార్పులు వచ్చాయి. ఫలితంగా పంచభూతాలను కలుషితం చేస్తున్నాము. నిజానికి ప్రాచీన భారతీయ తత్వశాస్త్రాలు మన శరీరం పంచభూతాత్మకం (భూమ్యాకాశాలు, గాలి, నీరు, అగ్ని) అని పేర్కొంటున్నాయి. ఈ పంచభూతాలను నాశనం చేస్తున్నామంటే మనల్ని మనం నాశనం చేసుకున్నట్లే కదా! అందుకే పర్యావరణంలో భాగమైన పంచభూతాలను కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్లే లెక్క. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఎండలు, వడగాలులు, అకాల వర్షాలు, సునామి, భూకంపాలు వంటివి అన్నీ కూడా భూతాపం పెరిగి వాతావరణంలో అసమానతలు ఏర్పడి నందువలన వస్తున్నాయి. ఇందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా మానవుడు ప్రకృతిని విచక్షణా రహితంగా కొల్లగొట్టడమే. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని అధికం చేయడం కూడా మరో కారణం. ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న ప్లాస్టిక్ పదార్థాలను 2040 కల్లా 60 శాతానికి తగ్గించాలని పిలుపు ఇవ్వడం ఈ సదర్భంగా గమనార్హం. భూతాపానికి కారణమైన ఇంధనాల వినియోగాన్ని తగ్గించి ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోలియం వాడకాన్ని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి. ఈ చర్యల ద్వారా మన పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాదు, మన సంస్కృతిని కూడా రక్షించుకున్నట్లవుతుంది. – ప్రొ. వై.వి. రామిరెడ్డి
సస్పెన్స్కు తెర.. బీజేపీకి అన్నామలై గుడ్బై
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత, రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావశీల నాయకుడిగా పేరున్న అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించినట్లు సమాచారం.పార్టీతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో అన్నామలై రాజీనామా చేయబోతున్నారని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. దీంతో హైకమాండ్ ఆయన్ని ఢిల్లీకి పిలిపించుకుని భేటీలు జరిపింది. అయితే ఆయనను బుజ్జగించేందుకు కేంద్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. అంతర్గతంగా జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఆయన రాజీనామాను ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది.బిజెపి సభ్యత్వానికి అన్నామలై చేసిన రాజీనామాను జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించారని.. బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా వెల్లడించారు. కే అన్నామలై.. తమిళనాడు రాజకీయాల్లో గత కొన్నేళ్లలో వేగంగా ఎదిగిన యువ నాయకుల్లో ఒకరు. 1984 జూన్ 4న జన్మించిన ఆయన.. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్లో ర్యాంక్ కొట్టారు. 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా కర్ణాటకలో విధులు నిర్వహించారు. కఠినమైన, నిష్పాక్షిక అధికారిగా గుర్తింపు పొందిన ఆయన, కొంతకాలానికి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు.అలా మొదలైంది.. 2020 ఆగస్టులో బీజేపీలో చేరడం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచింది. పార్టీలో చేరిన తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. యువతను ఆకర్షించే ప్రసంగాలు, క్షేత్రస్థాయి పర్యటనలతో తమిళనాడులో బీజేపీకి కొత్త ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారాయన. అయితే ఆ ఫలితంతో సంబంధం లేకుండా.. అదే ఏడాది ఆయనను తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విస్తరణపై దృష్టి పెట్టి, డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. నొచ్చుకుని..రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ స్థిరమైన పట్టు సాధించడంలో సవాళ్లు ఎదురయ్యాయి. ఆపై లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడారాయన. అయినప్పటికీ ఆయన వ్యక్తిగత ఇమేజ్, దూకుడు నాయకత్వం తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. అన్నామలై.. గత కొంతకాలంగా పార్టీ నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడిచింది. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే పొత్తును ఆయన వద్దన్నారని.. ఆ ఎఫెక్ట్తోనే(పళనిస్వామి ఒత్తిడితోనే) ఆయన్ని బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి తప్పించారని గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇవ్వకపోగా.. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన క్రియాశీలకంగా కనిపించలేదు. ఈ క్రమంలో ఎన్నికల తర్వాత ఆయన బీజేపీని వీడబోతున్నారని ప్రచారం మొదలైంది. అయితే ఆ వార్తలను తమిళనాడు బీజేపీ యూనిట్ తోసిపుచ్చుతూ వచ్చింది. మరోవైపు.. అన్నామలైని వదులుకోకూడదని మంచిది కాదని ఆరెస్సెస్ బీజేపీకి సూచిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలు ఆయనతో చర్చించారు. అయితే ఆ చర్చలు విఫలం కావడంతో తాజాగా ఆయన రాజీనామాను ఆమోదించింది.ఇక అన్నామలై తదుపరి అడుగు ఏమిటన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఆయన త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చని అంచనా. మొత్తంగా, అన్నామలై రాజీనామాతో తమిళనాడు బీజేపీకి పెద్ద దెబ్బ తగిలినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఒంటిపై గాయాలు, గీతలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ కేసులో ట్విస్ట్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈస్ట్ ఢిల్లీలోని వసుంధర ఎన్క్లేవ్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళా ప్రొఫెసర్ తన అపార్ట్మెంట్లో హత్యకు గురైన ఘటన సంచలనం రేపింది. ఫ్లాట్ లోపల నుంచి తాళం వేసి ఉండటం, శరీరంపై గాయాలు కనిపించడంతో పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనపై పోలీసుల సమాచారం ప్రకారం.. బాధితురాలిని డెవోస్మితా పాల్గా గుర్తించారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె వసుంధర ఎన్క్లేవ్లోని ఒక అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం పలువురు ఫోన్ కాల్స్కు ఆమె స్పందించకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో, ఆమె సోదరి ప్రత్యక్షంగా అపార్ట్మెంట్కు వెళ్లారు. అక్కడ ఫ్లాట్ బయట నుంచి తాళం వేసి ఉండటంతో అపార్ట్మెంట్ సిబ్బంది సహాయంతో తలుపు తెరిచి లోపలికి వెళ్లగా, మహిళా ప్రొఫెసర్ శవమై కనిపించారు.అయితే, ప్రాథమిక విచారణలో శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా తలపై బలమైన దెబ్బలు, మణికట్టు వద్ద గాయాలు కనిపించినట్లు ఫోరెన్సిక్ టీమ్ తెలిపింది. దీంతో ఇది సహజ మరణం కాకుండా హత్యగా నిర్ధారించి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇంట్లో నగదు, విలువైన వస్తువులు యథాతథంగా ఉండటంతో దోపిడీ కోణాన్ని పోలీసులు తాత్కాలికంగా పక్కన పెట్టారు. దీని ఆధారంగా ఈ హత్య వ్యక్తిగత శత్రుత్వమా? లేదా తెలిసిన వ్యక్తి ద్వారా జరిగిందా అనే కోణం దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.ఇక, ఈ కేసులో పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసిన అంశం. ఫ్లాట్ బయట నుంచి తాళం వేసి ఉండటమే. ఘటన అనంతరం నిందితుడు తలుపు వేసి వెళ్లి ఉండవచ్చని లేదా కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సేకరిస్తున్నారు. అలాగే, అపార్ట్మెంట్లోకి వచ్చిన వ్యక్తుల వివరాలు పరిశీలించినట్టు తెలిపారు. బాధతురాలు మొబైల్ కాల్ డేటా రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఢిల్లీ యూనివర్సిటీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
ఎన్ఆర్ఐ
అమెరికా యూ టర్న్ : వారికి భారీ ఊరట
అమెరికాలోని భారతీయుల డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్న వేళ గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసం) కోసం దరఖాస్తు చేసుకునే హెచ్-1బి (H-1B) వీసాదారులకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డిహెచ్ఎస్) భారీ ఊరట నిచ్చింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుల పరిశీలన (ప్రాసెసింగ్) జరిగే సమయంలో అత్యధిక శాతం మంది వలసదారులు అమెరికాలోనే కొనసాగవచ్చని, వారు దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని DHS స్పష్టం చేసింది.గ్రీన్కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు, వారి దరఖాస్తులు ప్రాసెస్ అవుతున్నప్పుడు అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేద నిడీహెచ్ఎస్ స్పష్టం చేసింది. ఇటీవలి ప్రకటనపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో విధానంలో ఎలాంటి పెద్ద మార్పు జరగలేదని స్పష్టత వచ్చింది. దీని ప్రకారం గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న అత్యధిక శాతం మంది వలసదారులు తమ దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యే వరకు అమెరికాలోనే సురక్షితంగా ఉండవచ్చు.ఇదీ చదవండి: ఒక్కసారి సీఎం కాదు, డీకేకు తిరుగే లేదు : గురూజీ జోస్యందరఖాస్తుదారుడు అమెరికా వెలుపల ఉండి ప్రక్రియను పూర్తి చేయాలా లేదా అనే విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు తమ విచక్షణాధికారాల (case-by-case basis) ప్రకారం చాలా కాలంగా నిర్ణయిస్తున్నారు. తాజా మార్గదర్శకాలు కేవలం ఆ పాత అధికారాలను గుర్తుచేసేవే తప్ప కొత్త నిబంధనలు కావనిడీహెచ్ఎస్ ప్రతినిధి తెలిపారు.కాగా యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) చేసిన ఒక ప్రకటన వల్ల దరఖాస్తు దారులలో తీవ్ర గందరగోళం నెలకొంది. అసాధారణ మినహాయింపులంటే తప్ప, వారు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లి అక్కడి నుంచే గ్రీన్ కార్డ్ కోసం వేచి ఉండాలంటూ వెలువడిన వార్త తీవ్ర ఆందోళన రేపింది.
సౌదీ నుంచి సజీవంగా వస్తాడనుకోలేదు..!
రెండు దశాబ్దాల ఆ తల్లి నిరీక్షణకు తెరపడింది. కోట్ల రూపాయల ‘బ్లడ్ మనీ’.. దీర్ఘకాల న్యాయపోరాటం, అంతర్జాతీయ స్థాయిలో సాగిన చర్చల అనంతరం అబ్దుల్ రహీమ్ చివరికి స్వదేశానికి చేరాడు. అదీ ఈద్ అల్ అదా రోజున!. ఇంకేం కోజికోడ్ విమానాశ్రయంలో ఆయన్ని చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “ఇన్ని సంవత్సరాల ప్రార్థనలకు అల్లా సమాధానం ఇచ్చాడు” అంటూ తల్లి ఫాతిమా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని కదిలించాయి.కేరళలోని కోజికోడ్ జిల్లా ఫెరోక్కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఆయన డ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో, ఆయన సంరక్షణలో ఉన్న ఓ ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారి మరణించిన ఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సౌదీ మీడియాలో వచ్చిన వివరాల ప్రకారం.. ఆ చిన్నారి సౌదీ వ్యాపారవేత్త అబ్దుల్లా అబ్దురహ్మాన్ అల్ షహ్రి కొడుకు. ఆ బాలుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో, వైద్య సహాయక పరికరాలపై ఆధారపడి చికిత్స పొందుతున్నాడు. ఒక సందర్భంలో ఆ చిన్నారికి అమర్చిన వైద్య సహాయక పరికరాన్ని రహీమ్ అనుకోకుండా తాకాడు. దీంతో అస్వస్థతకు గురైన ఆ బాలుడు.. మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.తాను కావాలని చేయలేదని రహీమ్ చెప్పినా కోర్టులు వినలేదు. ఈ ఘటనపై సౌదీ కోర్టు విచారణ జరిపి 2012లో ఆయనకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పు తర్వాత కేసు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. కొడుకు మీద ఆశలు వదిలేసుకున్న టైంలో.. దగ్గరి బంధువు ద్వారా బ్లడ్ మనీ గురించి తెలుసుకుంది రహీమ్ తల్లి ఫాతిమా. కొందరు అధికారులు, మత పెద్దలు ద్వారా కొడుకు విడుదల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలా నెలల తరబడి చర్చల తర్వాత.. రహీమ్కు క్షమాభిక్ష ప్రసాదించేందుకు అబ్దుల్లా అబ్దురహ్మాన్ అల్ షహ్రి బ్లడ్మనీకి అంగీకరించింది. కేరళలో పెద్ద ఎత్తున మానవతా సహాయ ప్రచారం ప్రారంభమైంది. ప్రవాస భారతీయులు, వ్యాపారులు, విద్యార్థులు కలిసి నిధులు సేకరించారు. మొత్తం సుమారు రూ.47 కోట్లు సమీకరించగా, అందులో రూ.34 కోట్లు ‘బ్లడ్ మనీ’గా బాధిత కుటుంబానికి చెల్లించారు. అనంతరం బాధిత కుటుంబం క్షమాభిక్ష ఇవ్వడంతో 2014లో మరణశిక్ష రద్దయింది. అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.సౌదీ చట్టాల ప్రకారం పబ్లిక్ రైట్స్ కింద ఆయనకు అప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. దీంతో.. ఆ శిక్ష పూర్తయ్యేదాకా ఆయన ఆగాల్సి వచ్చింది. ఇటీవల ఆ శిక్షపూర్తి కావడంతో రహీమ్ విడుదల అయ్యాడు. ఈద్ పండుగ రోజున ఆయన కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, వందలాది మంది కుటుంబ సభ్యులు, మద్దతుదారులు అక్కడికి వచ్చి ఘన స్వాగతం పలికారు. రెండు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరిన ఆ క్షణం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.ఇంటివద్ద కూడా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. తల్లి ఫాతిమా కన్నీళ్లతో కుమారుడిని ఆలింగనం చేసుకుని, “ఇన్ని సంవత్సరాల ప్రార్థనలకు ఈ రోజు సమాధానం లభించింది” అని చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. భారత రాయబార కార్యాలయం, లీగల్ కమిటీ సహకారంతో అన్ని న్యాయపరమైన ప్రక్రియలు పూర్తిచేసి ఆయన స్వదేశానికి రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ ఘటన కేరళలోనే కాకుండా విదేశాల్లో ఉన్న మలయాళీ సమాజంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది.నిమిషా ప్రియా పరిస్థితి?రహీమ్ ఘటన నేపథ్యంలో.. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియా కేసు కూడా కొనసాగుతోంది. 2017లో ఓ యెమెన్ పౌరుడి మరణ ఘటనలో ఆమెపై కేసు నమోదై కోర్టు మరణశిక్ష విధించింది. అయితే కుటుంబ సభ్యులు, మానవ హక్కుల సంఘాలు, భారత ప్రభుత్వ వర్గాలు కలిసి ఆమె శిక్షను నిలిపివేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ‘బ్లడ్ మనీ’ ద్వారా క్షమాభిక్ష సాధించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, కేసు ఇంకా తుది దశకు చేరలేదు.
అమెరికా 'స్పెల్లింగ్ బీ' విజేతగా భారత సంతతి విద్యార్థి
అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి విద్యార్థి శ్రేయో పారిఖ్ విజేతగా నిలిచాడు. కాలిఫోర్నియాలోని రాంచో కుకామోంగాకు చెందిన ఈ 14 ఏళ్ల బాలుడు, గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో తన అపార ప్రతిభ ప్రదర్శనతో టైటిల్ను కైవసం చేసుకున్నాడు. శ్రేయ్ మొత్తం 90-సెకన్ల స్పెల్-ఆఫ్ రౌండ్లో అంచనాలకు తగ్గట్టుగా మొత్తం 32 పదాలను సరిగ్గా పలికి విజయం దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సుమారు రూ. 48 లక్షల నగదు, పతకం, స్క్రిప్స్ కప్, మెరియం వెబ్స్టర్ నుంచి రూ. 24 లక్షల నగదుర, డెల్టా నుంచి రూ. 96 వేలు విలువ చేసే ఫ్లైట్ క్రెడిట్లు, ఎన్సైక్లోపిడియా బ్రిటానికా నుంచి రూ. 38 వేలు విలువ చేసే వర్క్స్ శ్రేయ్కు లభించనున్నాయి. గతంలో 2024 పోటీల్లో మూడోస్థానంలో నిలవడగా..తాజా పోటీల్లో విజేతగా నిలిచి ట్రోపీ దక్కించుకున్నాడు. ఇక శ్రేయ్కు టెన్నిస్, రీడింగ్, గణితం, చెస్ వంటివి అతడి అభిరుచులు. చివరగా తనకు ఎక్కువగా భారత్లోని తాతయ్య నానమ్మల వద్ద గడపడం అంటే మహా ఇష్టం అని చెబుతున్నాడు. (చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!)
కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య
కెనడాలో గుజరాత్కు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని దారుణ హత్యు గురైంది. మృతురాలిని గుజరాత్లోని ఆనంద్ జిల్లా, బోర్సాద్కు చెందిన విధి కల్పేష్భాయ్ మేఘానిగా గుర్తించారు. దుండుగులు విధి మేఘను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది. అంతర్జాతీయ మీడియా ప్రకారం మేఘ గత నాలుగేళ్లుగా కెనడాలో నివసిస్తూ, తన చదువుతో పాటు, పార్ట్టైమ్ ఉద్యోగాన్ని కూడా చేసుకుంటూ ఉండేది. అంతేకాదు కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ నెల 15నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీనిపై కుటుంబ సభ్యులు, ఆమె సన్నిహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల గాలింపులో కెనడాలోని నయాగారా ప్రాంతంలో, కెనడా–అమెరికా సరిహద్దులో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒంటిపై కత్తిపోట్లు ఆధారంగా ఆమెను ఎవరో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ దాడికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.ఇదీ చదవండి: సీబీఎస్ఈ వివాదం : ఎట్టకేలకు మౌనం వీడిన ధరేంద్ర ప్రధాన్ఇదీ చదవండి: భారత మామిడి పళ్లపై జపాన్ బ్యాన్ : ఎందుకో తెలుసా?
క్రైమ్
భార్య బడిత పూజకు భర్త బలి
ఛతర్పూర్: మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లో దంపతుల మధ్య జరిగిన ఘర్షణలో భర్త ప్రాణాలు కోల్పోయాడు. నిందితురాలు నీలం కుష్వాహ తన భర్తను కర్రతో కొట్టి చంపింది. ఆపై ఎనిమిది గంటల పాటు మృతదేహం వద్దే కూర్చుంది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది. నీలం గత నాలుగేళ్లుగా తన భర్త దీన్దయాల్ కుష్వాహకు దూరంగా పుట్టింట్లోనే ఉంటోంది.జూన్ 1న దీన్దయాల్ మద్యం మత్తులో భార్య తల్లిదండ్రుల ఇంటికి వచ్చాడు. దీన్దయాల్ బలవంతంగా తలుపులు తెరిచి.. తమ కొడుకును తలకిందులుగా వేలాడదీశాడని నీలం ఆరోపించింది. తన భర్త బిడ్డకు హాని తలపెడతాడేమోనని ఆమె తీవ్ర భయాందోళనకు గురైంది. దీంతో ఆమె కర్రతో దీన్దయాల్పై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన దీన్దయాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హత్య అనంతరం నీలం దాదాపు ఎనిమిది గంటల పాటు భర్త మృతదేహం పక్కనే కూర్చుంది.ఆ తర్వాత స్థానిక గుడికి వెళ్లి.. దేవుడి ముందు 10 నిమిషాల పాటు కూర్చుని క్షమాపణలు వేడుకుంది. అక్కడి నుంచి నేరుగా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఆమె.. తానే తన భర్తను చంపినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్కు తెలిపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లోని మంచంపై ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వేధింపులు, దాడి ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని.. అన్ని కోణాల్లోనూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఒంటిపై గాయాలు, గీతలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ కేసులో ట్విస్ట్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈస్ట్ ఢిల్లీలోని వసుంధర ఎన్క్లేవ్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళా ప్రొఫెసర్ తన అపార్ట్మెంట్లో హత్యకు గురైన ఘటన సంచలనం రేపింది. ఫ్లాట్ లోపల నుంచి తాళం వేసి ఉండటం, శరీరంపై గాయాలు కనిపించడంతో పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనపై పోలీసుల సమాచారం ప్రకారం.. బాధితురాలిని డెవోస్మితా పాల్గా గుర్తించారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె వసుంధర ఎన్క్లేవ్లోని ఒక అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం పలువురు ఫోన్ కాల్స్కు ఆమె స్పందించకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో, ఆమె సోదరి ప్రత్యక్షంగా అపార్ట్మెంట్కు వెళ్లారు. అక్కడ ఫ్లాట్ బయట నుంచి తాళం వేసి ఉండటంతో అపార్ట్మెంట్ సిబ్బంది సహాయంతో తలుపు తెరిచి లోపలికి వెళ్లగా, మహిళా ప్రొఫెసర్ శవమై కనిపించారు.అయితే, ప్రాథమిక విచారణలో శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా తలపై బలమైన దెబ్బలు, మణికట్టు వద్ద గాయాలు కనిపించినట్లు ఫోరెన్సిక్ టీమ్ తెలిపింది. దీంతో ఇది సహజ మరణం కాకుండా హత్యగా నిర్ధారించి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇంట్లో నగదు, విలువైన వస్తువులు యథాతథంగా ఉండటంతో దోపిడీ కోణాన్ని పోలీసులు తాత్కాలికంగా పక్కన పెట్టారు. దీని ఆధారంగా ఈ హత్య వ్యక్తిగత శత్రుత్వమా? లేదా తెలిసిన వ్యక్తి ద్వారా జరిగిందా అనే కోణం దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.ఇక, ఈ కేసులో పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసిన అంశం. ఫ్లాట్ బయట నుంచి తాళం వేసి ఉండటమే. ఘటన అనంతరం నిందితుడు తలుపు వేసి వెళ్లి ఉండవచ్చని లేదా కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సేకరిస్తున్నారు. అలాగే, అపార్ట్మెంట్లోకి వచ్చిన వ్యక్తుల వివరాలు పరిశీలించినట్టు తెలిపారు. బాధతురాలు మొబైల్ కాల్ డేటా రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఢిల్లీ యూనివర్సిటీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
ఒంటరి మహిళపై అన్నదమ్ముల అఘాయిత్యం
పల్నాడు: వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్ తెలిపిన వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి సుధాకర్, అతడి సోదరుడు శ్రీను గ్రామ శివారులోని పొలాల్లో బుధవారం రాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేగింది. ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఇంకా మరువక ముందే.. తాజాగా నోయిడాలోని ఓ ఎత్తైన అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది.నోయిడాలోని ఐవీ కౌంటీ (Ivy County) అపార్ట్మెంట్ సముదాయంలోని 12వ అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో భవనం పైభాగం నుంచి భారీగా పొగలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలు కమ్ముకుపోవడంతో నివాసితులు భయాందోళనలకు గురయ్యారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భవనంలోని ఇతర ఫ్లాట్లలో ఉన్న వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.A fire broke out at the IVY County residential complex in Sector 75, Noida, raising serious concerns about the city’s firefighting preparedness. According to residents, fire brigade hoses were unable to project water beyond the sixth floor. pic.twitter.com/YnFPXZvW3N— Sanjay Kishore (@saintkishore) June 5, 2026ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై విచారణ కొనసాగుతున్న వేళే, తాజాగా నోయిడాలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం భవనాల అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రస్తుతం మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, ప్రాణనష్టం సంభవించిందా అనే విషయాలపై అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వీడియోలు
ఏపీలో జనసైనికులను ఎగిరెగిరి తన్నుతుంటే దిక్కులేదు తెలంగాణాలో మీటింగ్ పెడతాడంటా..!
61 ఏళ్ల వయసులో.. లవర్ తో ముచ్చటగా మూడోసారి
సంచలన ప్రకటన! అడవుల్లో, సరస్సుల్లో ఏలియన్స్?
నా సిగ్నేచర్ సాంగ్, లేలేలే నా రాజా పాడేటప్పుడు ANR షాక్
చంద్రబాబు 20కోట్ల భారీ స్కాం, బయటపెట్టిన అంబేటి రాంబాబు
'పెద్ది' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?
నందూస్ వరల్డ్ బాధితుడి ఆవేదన..జాబ్ తో పాటు వీసా ఇస్తామని
వైఎస్ జగన్, సజ్జలకు నోటీసులు అంబటి రియాక్షన్
కోహ్లికి ఇండియాలో ఉండటం ఇష్టం లేదు లివింగ్ స్టోన్ షాకింగ్ కామెంట్స్
జూన్ 28న మీరు పెట్టే పొలికేక ప్రభుత్వాన్ని గడ గడ లాడించాలి

