ప్రధాన వార్తలు

ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశాడు. ఇప్పుడు ఎంపీ పీఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నాడు’’ అంటూ కొలికపూడి మండిపడ్డారు.తిరువూరులో కిషోర్ ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడు. పార్టీ పదవులను సైతం కిషోర్ అమ్ముకుంటున్నాడు. అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళదాం. ఈ నెల 24న అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదాం. తాడోపేడో తేల్చుకుంటా’’ అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగులకు బాబు దగా

ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు..? ఎన్నో ఆశలు పెట్టుకున్నాముగా
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit sharma) తన పునరాగమనంలో తీవ్ర నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.7 నెలల తర్వాత భారత జట్టులోకి హిట్మ్యాన్పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.కానీ అందరి ఆశలను ఈ మాజీ కెప్టెన్ ఆడియశలు చేశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడానికి రోహిత్ ఇబ్బంది పడ్డాడు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్లు బౌన్సర్లతో రోహిత్ను భయపెట్టారు.భారత్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన హేజిల్వుడ్ బౌలింగ్లో రోహిత్ స్లిప్స్లో దొరికిపోయాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని హేజిల్వుడ్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బౌన్స్ ఎక్కువగా ఉండడంతో ఆ బంతిని రోహిత్ ఆడకుండా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ బంతిని ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్లో ఉన్న మాట్ రెన్షా చేతికి వెళ్లింది. దీంతో 14 బంతులు ఆడి కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ.. మైదానం వీడాల్సి వచ్చింది. పెర్త్లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న రోహిత్ శర్మ.. ఈ విధంగా ఔట్ అవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు అని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కాగా ఆసీస్ పర్యటనకు ముందు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్దానంలో శుభ్మన్ గిల్కు జట్టు పగ్గాలను అప్పగించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్కు భారత్ తరపున ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్వుడ్చదవండి: కొంచెం కూడా సిగ్గు లేదు.. జింబాబ్వేను బ్రతిమాలుకున్న పాకిస్తాన్

రైలు ఇంజన్పై పడ్డ బండరాయి.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి, అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఐరన్ లోడ్తో వెళ్తున్న రైలు ఇంజన్పై బండరాయి పడింది. దీంతో గూడ్స్ రైలు ఇంజన్ ముందు భాగం దెబ్బతింది. ఇవాళ (అక్టోబర్ 19, ఆదివారం) తెల్లవారుజామున తైడా- చిమిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఘటన జరిగింది. కొత్తవలస-కిరండోల్ లైన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.విశాఖ- కిరండోల్, కిరండోల్-విశాఖ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఆ మార్గంలో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది తక్షణమే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఇదీ చదవండి: ధనత్రయోదశి ప్రభావం.. బంగారం ఎంత కొన్నారంటే?

ఓటీటీలోకి చావును వెంటాడే సినిమా.. ధైర్యం ఉంటేనే చూడండి (రివ్యూ)
ఈ వీకెండ్లో మీరు అదిరిపోయే సినిమా చూడాలని అనుకుంటున్నారా..? అయితే, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్(Final Destination Bloodlines) చిత్రాన్ని చూసేయండి. అయితే, ఇందులో హింసాత్మకమైన సీన్స్ ఉంటాయి. మిమ్మల్ని కలవరపరిచే ఛాన్స్ ఉంది. కాబట్టి సున్నితమైన వారు, చిన్న పిల్లలు దూరంగా ఉండటం మంచిది. ఫైనల్ డెస్టినేషన్ మే 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ, అక్టోబర్ 16న జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఓటీటీలో అదిరిపోయే సూపర్ థ్రిల్లర్ సినిమా చూడాలనే ఆసక్తి ఉంటే దీనిని వదులుకోకండి. రూ.440 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2700 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ మూవీ రన్టైమ్ కేవలం 1:50 మాత్రమే.ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంఛైజీలో భాగంగా ఈ ఏడాది పార్ట్-6 విడుదలైంది. చివరిగా 2011లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ 5 తర్వాత సుమారు 14 ఏళ్లకు ఈ ఫ్రాంఛైజీ నుంచి ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్ వచ్చింది. ఈ మూవీని దర్శకులు జాక్ లిపోవ్స్కీ, ఆడమ్ స్టీన్ తెరకెక్కించారు. కైట్లిన్ శాంటా జువానా, రిచర్డ్ హార్మన్, టోనీ టాడ్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు.మన కుటుంబంలోని వ్యక్తులు ఏ విధంగా మరణిస్తారో ముందే తెలిస్తే ఎలా ఉంటుంది..? ఇదే కాన్సెప్ట్తో సినిమా కొనసాగుతుంది. అయితే, నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగానే ఈ మూవీని తీశామని మేకర్స్ చెప్పారు. ఇప్పటికే వచ్చిన ఈ ఫ్రాంఛైజీలోని 5 సినిమాలు కూడా ఇదే రేంజ్లో ఉంటాయి. తాజాగా విడుదలైన పార్ట్-6 కథ విషయానికి వస్తే.. 1968లో ఓ స్కై వ్యూ హోటల్లో జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే ఊహించి, వందల మందిని కాపాడుతుంది ఐరిస్ (బ్రెక్ బాసింగర్). జరగబోయే ప్రమాదం గురించి ఆమె పసిగట్టేస్తుంది. అయితే, వారి ఆయుష్షు తీరినా కూడా ఐరిస్ తెలివిగా కొందరిని కాపాడుతుంది. ఎంతో ఘోరమైన ప్రమాదంలో చాలామంది దారుణమైన రీతిలో మరణిస్తారు. కానీ ఐరిస్ వల్ల కొందరు ప్రాణాలతో బయటపడతారు. చావును ఎదిరించి ప్రాణాలతో ఉన్న వారిని ఒక్కొక్కరిగా చావు తరుముతూ వస్తుంది. అయితే, ఒక ఆర్డర్ ప్రకారమే వారు మరణిస్తారు. ఈ క్రమంలోనే వారందరినీ కాపాడిని ఐరిస్ వంతు ఒకరోజు వస్తుంది. ఆమె మరణిస్తే తన తర్వాతి కుటుంబ సభ్యులు కూడా చనిపోతారని గ్రహిస్తుంది. ఈ ఆర్డర్ను తప్పించేందుకు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? చావును ఎదిరించి ఎలా బతికింది..? తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఐరిస్ చాలా పకడ్బందీగా వేసుకున్న ప్లాన్ ఏంటి..? ఫైనల్గా తన కుటుంబ సభ్యులను కాపాడుకుందా..? ఈ క్రమంలోనే ఆమె మనవరాలు స్టేఫినీ (కైట్లిన్ శాంటా జువానా) చేసిన సాహసం ఏంటి..? అనేది తెలియాలంటే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లైన్స్ చూడాల్సిందే. ఇందులో ఎలాంటి అసభ్యకరమైన సీన్లు ఉండవ్.. ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ, ఘోరమైన ప్రమాదాలు కలవరపరిచేలా ఉంటాయి.ఫైనల్ డెస్టినేషన్ కథ సింపుల్గానే ఉన్నప్పటికీ ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తూ.. సస్పెన్స్ తో కూడిన డెత్ సీన్స్ ట్రీట్ ఇస్తాయి. గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న ఆడియెన్స్ ఈ మూవీకి దూరంగా ఉండటం మంచింది. మనిషి జీవితంలో మరణం ఏ రీతిలో పలకరిస్తుంది ముందే తెలుసుకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు.

‘25 వేల మరణాలను అడ్డుకున్నా’: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు సంచలన ప్రకటన చేశారు. ఇటీవల కరేబియన్లో అమెరికా జరిపిన సైనిక దాడిలో ఒక భారీ మాదకద్రవ్యాల జలాంతర్గామి ధ్వంసమైందని, ఈ దాడిలో ఇద్దరు నార్కో ఉగ్రవాదులను హతం చేశామని, మరో ఇద్దరిని సజీవంగా పట్టుకున్నామని తెలిపారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో.. ‘ఆ జలాంతర్గామిలో అధికంగా ఫెంటానిల్ తదితర మాదకద్రవ్యాలు ఉన్నాయని, అది నార్కోట్రాఫికింగ్ ట్రాన్సిట్ రూట్ ద్వారా అమెరికా వైపు వస్తున్నదని, దానిని అడ్డగించడం ద్వారా 25 వేల అమెరికన్ల మరణాలను నిరోధించగలిగానని’ ట్రంప్ పేర్కొన్నారు.తన సోషల్ మీడియా పోస్టులో ట్రంప్.. ‘ఒక భారీ మాదకద్రవ్యాల జలాంతర్గామిని నాశనం చేయడమనేది నాకు లభించిన గొప్ప గౌరవం. ఓడలో అధికంగా ఫెంటానిల్ ఉందని యూఎస్ ఇంటెలిజెన్స్ నిర్ధారించింది. ఆ జలాంతర్గామిలో నలుగురు నార్కోటెర్రరిస్టులు ఉన్నారు. వారిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సజీవంగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను వారి స్వదేశాలైన ఈక్వెడార్, కొలంబియాకు విచారణ కోసం తిరిగి పంపుతున్నారు’ అని పేర్కొన్నారు.ఈ దాడి తర్వాత అమెరికా నావికాదళం ఇద్దరు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకుందని, వారిని ఒక అమెరికన్ యుద్ధనౌకలో ఉంచిందని ఫాక్స్ న్యూస్ ధృవీకరించింది. కాగా గత నెలలో కరేబియన్లో యుద్ధ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి అమెరికా అనుమానిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా నౌకలను అడ్డగించడం ఇది ఆరోసారి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ తగిలిందని చెబుతున్న అమెరికా అధికారులు.. ఈ దాడుల్లో హతమైన 27 మంది మాదకద్రవ్యాల స్మగ్లర్లే అని ధృవీకరించే ఎటువంటి ఆధారాలను మీడియాకు అందించలేదు. ఈ రీతిలో అంతమొందించడం చట్టవిరుద్ధమని నిపుణులు వాదిస్తున్నారు. 📹 DESTROYED: Confirmed DRUG-CARRYING SUBMARINE navigating towards the United States on a well-known narcotrafficking transit route."Under my watch, the United States of America will not tolerate narcoterrorists trafficking illegal drugs, by land or by sea." - President Trump pic.twitter.com/N4TAkgPHXN— The White House (@WhiteHouse) October 18, 2025

ఉద్యోగులకు బాబు దగా
నేను రాగానే మంచి పీఆర్సీ ఇస్తాను.. ఇంటీరియం రిలీఫ్ (ఐఆర్) ఇస్తాను.. మీకు రావాల్సిన డబ్బులన్నీ వెంటనే ఇచ్చేస్తాను.. తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇస్తాను.. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సమస్య లేకుండా చేస్తాను.. ఎర్న్డ్ లీవ్లు, సరెండర్ లీవ్లు, ఇతరత్రా బకాయిలన్నీ ఇచ్చేస్తాను.. పోలీసులకు కూడా శని, ఆదివారాలు సెలవు ఇస్తాను.. హోం గార్డుల జీతాలు పెంచుతాను. – ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడుఇతర రాష్ట్రాలు ఉద్యోగుల ఖర్చును భారీగా తగ్గించుకుంటున్నాయి.. ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉద్యోగుల జీతాల ఖర్చు ఎక్కువగా ఉంది.. పైగా ఆర్టీసీ ఉద్యోగులను తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపేశారు.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల వల్ల అదనపు ఖర్చు వస్తోంది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే బాగోలేదు.. ఖర్చులు పెరిగిపోతున్నాయి.. సీపీఎస్ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.. పీఆర్సీకి మరింత వెసులుబాటు కావాలి.. ఉద్యోగులు రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. అయినా దీపావళి కానుకగా ఒక్క డీఏను ఇస్తున్నాం. – అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాత సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన దీపావళి కానుక తుస్సుమంది. అప్పుడు కాదు ఇప్పుడు అంటూ ఎన్నికలకు ముందు ఊరించి, లెక్కలేనన్ని హామీలు గుప్పించి.. వారితో ఓట్లు వేయించుకుని.. తీరా గద్దెనెక్కాక హామీల సంగతే మరిచారు. నెల కాదు.. రెండు నెలలు కాదు.. ఏకంగా 16 నెలలైనా ఇచ్చిన హామీలకు దిక్కులేదని ఉద్యోగులు రోడ్డెక్కుతుంటే నాలుగు డీఏలకు గాను ఒకే ఒక్క డీఏ ఇస్తామని.. ఇంతకంటే ఎక్కువగా ఆశించవద్దన్నట్లు చెప్పుకొచ్చారు. ఎప్పటిలాగే ఓ వైపు గత ప్రభుత్వంపై నిందలేస్తూ.. మరో వైపు ఉద్యోగుల ఖర్చు తగ్గిస్తానంటూ షాక్ ఇస్తున్నారు. అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలన్నీ వెంటనే తీరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు పూర్తి స్థాయిలో వారిని దగా చేశారు. నమ్మించి ఓట్లు వేయించుకుని నిండా ముంచారు. 16 నెలలుగా ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయకుండా కాలం గడుపుతూ చెవిలో పువ్వు పెట్టారు. రూ.31 వేల కోట్ల బకాయిల మాటే ఎత్తక పోవడం పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీల్లో కొన్నయినా అమలు చేస్తారని ఉద్యోగులు ఎదురు చూస్తుంటే ఒకే ఒక్క డీఏతో సరిపెట్టారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతుంటే ఒక్కటి మాత్రమే ఇస్తానని చెబుతూ ఆ ఖర్చు కూడా దండగేనని ఉద్యోగ సంఘాల సమావేశంలోనే చెప్పడం గమనార్హం. ఇతర రాష్ట్రాలు ఉద్యోగుల ఖర్చును భారీగా తగ్గించుకుంటున్నాయని, తాను కూడా అదే పని చేస్తానని చెప్పడంతో డీఏ ఏమో గానీ, మున్ముందు తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం 27 శాతం ఐఆర్ ప్రకటించారు. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ తల్లకిందులైనా పీఆర్సీ అమలు చేశారు. కానీ చంద్రబాబు తాను వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తానని చెప్పి ఆ మాటే మరచిపోయారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి గురించి ఆలోచన కూడా చేయలేదు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నిసార్లు అడిగినా వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. వారి ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతుండడం, వేలాది మంది టీచర్లు రోడ్డెక్కి భారీగా ధర్నా చేయడంతో ఉలిక్కిపడ్డారు. ఎలాగోలా వారి ఆందోళనను తగ్గించడానికి తనకు అలవాటైన రీతిలో మభ్యపెట్టే ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే శనివారం ఉద్యోగ సంఘాల నాయకులతో గంటల తరబడి సమావేశం నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నాయకుల్లోనే తమకు అనుకూలంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి చెందిన బాకా నాయకుడితో ఈ సమావేశంలో రెండు డీఏలు ఇస్తే చాలని, ఇంకేమీ వద్దని చెప్పించారు. చివరికి కంటి తుడుపుగా ఒక డీఏ ఇస్తానని, ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదంటూ సూక్తులు చెప్పి తప్పించుకున్నారు. అధికారంలోకి వస్తూనే పీఆర్సీ ఇస్తానన్నారుగా.. నిజానికి ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వచ్చీ రావడంతోనే మంచి పీఆర్సీ ఇస్తానని చెప్పి, ఇప్పుడు దాని గురించి తనకు వదిలేయాలని, ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తానని చెప్పడంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. నిజానికి ఉద్యోగులు పీఆర్సీ సంగతి దేవుడెరుగు కనీసం రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ స్థానంలో కొత్త కమిషనర్ను నియమించాలని కోరుతుంటే ఆ విషయాన్నే పట్టించుకోలేదు. అధికారంలోకి రాగానే చేస్తానని చెప్పిన మాటను ఆయన నీటి మీద రాతగా మార్చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లిస్తామని చెప్పి దానిపైనా నోరు మెదపలేదు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ను తాను వచ్చిన 6 నెలల్లో పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని 16 నెలలుగా పట్టించుకోకుండా ఇప్పుడు మరో 6 నెలల్లో చేస్తానని చెప్పడంతో అది జరిగేది కాదేమోనని ఉద్యోగులు వాపోతున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ విషయం సుప్రీంకోర్టులో ఉందని అబద్ధం చెబుతూ తప్పించుకుంటున్నారు. చైల్డ్ కేర్ లీవులు 180 వాడుకోవచ్చని చంద్రబాబు చెప్పినా, నిజానికి అది జగన్ హయాంలోనే అమల్లోకి వచ్చింది. తక్కువ రేటుకు ఇంటి స్థలం ఇస్తామని ఇచ్చిన హామీ ఊసే లేకుండా పోయింది. అన్ని ఉద్యోగాలిస్తే ఎలా! తన ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకపోగా, జగన్ హయాంలో 1.26 లక్షల శాశ్వత ఉద్యోగాలివ్వడాన్ని చంద్రబాబు తప్పు పట్టడం గమనార్హం. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా అంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను ఒకేసారి ఇవ్వడాన్ని ఆయన అనవసరమని చెప్పడం చూసి ఉద్యోగులు విస్తుపోతున్నారు. తద్వారా ఉద్యోగుల పట్ల తనకున్న చులకన భావాన్ని సీఎం బయట పెట్టుకున్నారు. సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతగా మేలు జరిగిందో చంద్రబాబు మరచిపోయారని, లేదా ఉద్దేశ పూర్వకంగా ఆ వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని, ప్రైవేటు ఏజెన్సీల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థ స్థానంలో ఆప్కాస్ను ప్రవేశ పెట్టడాన్ని కూడా చంద్రబాబు తప్పు పట్టడం పట్ల ఆయా ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వారి వల్ల వేల కోట్ల రూపాయల వ్యయం పెరిగిపోయిందని చెప్పి వారిని కించపరిచారు. ఇంతా చేసి.. ఇప్పుడు మొక్కుబడిగా ఒక డీఎతో దీపావళి కానుక అంటున్న సీఎం మాటలు, వ్యాఖ్యలను బట్టి తమ పరిస్థితి మున్ముందు మరింత దారుణంగా ఉంటుందనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో..చంద్రబాబు 2018 జూలై నుంచి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవ్వలేదు. కనీసం ఐఆర్ కూడా ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లారు. 2019 మేలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే (10 జూన్ 2019) వైఎస్ జగన్ 27 శాతం ఐఆర్ ప్రకటించారు. 2019 జూలై నుంచి వర్తింపచేసి ఆగస్ట్ ఒకటిన కొత్త జీతాలు ఇచ్చారు. తద్వారా 2019 జూలై నాటికి 30 ఏళ్లు సర్వీస్ ఉన్న ఒక ఉద్యోగికి సుమారుగా రూ.64 వేల బేసిక్ ఉంటే 27 శాతం.. అంటే రూ.17,280 అదనంగా జీతంలో కలిసింది. మరో వైపు కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారినా, జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు 2022లో పీఆర్సీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరహాలో వెంటనే ఐఆర్ ప్రకటించి ఉంటే.. 2024 జూలై నాటికి బేసిక్ సుమారు రూ.72 వేలుగా ఉన్న ఉద్యోగికి.. కనీసం 27 శాతం ఐఆర్ ఇచ్చినా ప్రతి నెల రూ.19,440 అదనంగా జీతం వచ్చి ఉండేది. అలా చేయకపోవడంతో ఆ ఉద్యోగి రూ.3 లక్షలకు పైగా నష్టపోయారు.16 నెలలుగా మోసం, దగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని.. మంచి పీఆర్సీ ఇస్తామని.. పెండింగ్ బకాయిలన్నీ ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయింది. ఐఆర్ ప్రకటించలేదు.. ఉన్న పీఆర్సీ కమిషన్ను రద్దుచేసింది.. కొత్త పీఆర్సీ కమిషన్ను ప్రకటించలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రభుత్వం శనివారం చర్చలకు పిలిస్తే.. ఐఆర్ ప్రకటిస్తారని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు ఇస్తారని.. కొత్త పీఆర్సీ కమిషన్ను ప్రకటిస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఆశించారు. కానీ, ఒక్క డీఏను మాత్రమే ప్రకటించింది. ఇది ఉద్యోగులను మోసం చేయడమే. తక్షణమే ఐఆర్ ప్రకటించాలి.. నాలుగు డీఏలు ఇవ్వాలి.. పెండింగ్లో ఉన్న బకాయిలు రూ.32 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలి. – కాకర్ల వెంకటరామిరెడ్డి, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ దాటవేత వైఖరి దారుణం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తవుతున్నా ఒక్కరోజు కూడా ఉద్యోగ సంఘాలను పట్టించుకోని ప్రభుత్వం శనివారం రోజంతా వారితో చర్చలు జరిపి ఒక్క డీఏ మాత్రమే ప్రకటించి తీవ్ర నిరాశకు గురిచేసింది. ఒక్క డీఏ ఇవ్వడానికి ఇంత హంగామా ఎందుకు? ఐఆర్ ఊసేలేదు. పీఆర్సీపై ప్రభుత్వం దాటవేత వైఖరిని అవలంబించడం దారుణం. – లెక్కల జమాల్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో–చైర్మన్, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉసూరుమనిపించారుఉపాధ్యాయ, ఉద్యోగుల్లో ప్రభుత్వం తీవ్ర నిరాశ నింపింది. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినప్పటికీ నాలుగు డీఏలు పెండింగ్లో ఉండగా కేవలం ఒక్క డీఏ మాత్రమే ప్రకటించారు. 30 శాతం ఐఆర్ ఊసేలేదు. పీఆర్సీ కమిటీ ప్రస్తావన లేదు. కేవలం రూ.160 కోట్లు మాత్రమే విడుదల చేసి ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి ఉసూరుమనిపించారు. దీనిని ప్రభుత్వం దీపావళి కానుక అని గొప్పలు చెప్పుకుంటోంది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. వైఎస్సార్టీఏ పక్షాన తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. – పి.అశోక్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్టీఏఉద్యోగవర్గం జీర్ణించుకోలేకపోతోందికొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. ఈరోజు ఉద్యోగ, పెన్షనర్ల సంఘ నాయకులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశాలు జరిపి ఒక్క విడత డీఏ మాత్రమే ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా మధ్యంతర భృతిని ఇవ్వకపోవడం, నాలుగు విడతల డీఏ పెండింగ్ ఉంటే ఒకటి మాత్రమే మంజూరు చేయడం, బకాయిలు ఊసే ఎత్తకపోవడాన్ని ఉద్యోగవర్గం జీర్ణించుకోలేకపోతోంది. దీపావళి పండగకు ఇవి తప్పక ఇస్తారని ఎదురుచూశారు. కానీ, ఒక్క డీఏతో తుస్సుమనిపించారు. – నలమారు చంద్రశేఖర్రెడ్డి, వైఎస్సార్సీపీ ఉద్యోగ–పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడుహామీలిచ్చి అన్యాయం అధికారంలోకి రాగానే డీఏ, ఐఆర్, మంచి పీఆర్పీ ఇస్తామని హామీలిచ్చి ఇప్పుడు ఒక్క డీఏ ఇవ్వడం అన్యాయం. సాధారణంగా అయితే ఆరు నెలలకు ఒకసారి డీఏ ఇవ్వాలి. నాలుగు డీఏలు పెండింగ్లో ఉంటే కేవలం ఒక్క డీఏ ఇవ్వడానికి సీఎం స్థాయిలో చర్చలు ఆశ్చర్యం కలిగించాయి. – వి.రెడ్డి శేఖర్రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి ఎందుకింత మోసం ఉద్యోగ, ఉపాధ్యాయులను ఎందుకింత మోసం చేయడం? పీఆర్సీ వేస్తారని ఆశించాం. ప్రభుత్వం దీనిపై నోరు మెదపకపోవడం అన్యాయం. కనీసం రెండు డీఏలైనా ఇస్తారని అనుకున్నాం. కానీ, ఒక్క డీఏ ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఒక్క డీఏ కోసం రెండ్రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో కాలయాపన చేయడం సమంజసం కాదు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేయడం దారుణం. మిగిలిన పెండింగ్ ఎరియర్స్ వెంటనే విడుదల చేయాలి. – జీవీ రమణ, రాష్ట్ర కార్యదర్శి. యూటీఎఫ్పీఆర్సీ, ఐఆర్ ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ పెండింగ్ బకాయిలు చెల్లించాలని సమావేశంలో గట్టిగా పట్టుబట్టాం. రెండు డీఏలైనా ఇవ్వాలని అడిగాం. అయితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులవల్ల ఒక్క డీఏ మాత్రమే ఇస్తున్నామని, సర్దుకోవాలని సీఎం చెప్పారు. పీఆర్సీ కమిటీ వేయాలని డిమాండ్ చేశాం. అందుకు కాస్త సమయం పడుతుందని, త్వరలో చర్యలు చేపడతామన్నారు. ఒక్క డీఏ వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు చిరు సంతోషమే మిగిలింది. పీఆర్సీ, ఐఆర్పై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది. – బాలాజీ, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంబకాయిల గురించీ పట్టదా? 2023 జూలై నుంచి పీఆర్సీ ప్రకటించాల్సి ఉంది. 30 శాతం మధ్యంతర భృతి అందించి ఉద్యోగులను ఆదుకోవాల్సింది పోయి కంటితుడుపు చర్యగా డీఏ ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పెండింగ్ బకాయిలు కూడా సత్వరమే చెల్లించాలని ఏడాదిన్నరగా చేస్తున్న డిమాండ్ పట్టించుకోకపోవడం బాధాకరం. – పిసిని వసంతరావు, అధ్యక్షుడు, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర నిరాశ దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు తీపికబురు అందిస్తారని అనుకున్నాం. చివరికి ఒక్క డీఏ ప్రకటించి తీవ్ర నిరాశ కలిగించారు. 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించి 12వ పీఆర్సీ కమిషన్ వేసి ఐఆర్ ప్రకటించి ఉంటే అందరూ ఆనందించే వారు. కానీ ప్రభుత్వం తీవ్రంగా నిరాశపరిచింది. – తమ్మినేని చందనరావు, స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, శ్రీకాకుళంఅందరిలోనూ అసంతృప్తి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ ప్రభుత్వ వాగ్దానాల అమలు కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే, 4 డీఏలకు బదులు కేవలం ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడంపై అందరిలోనూ అసంతృప్తి ఉంది. పండుగకు కనీసం రెండు డీఏలైనా ఇస్తే బాగుండేది. ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పండగ వేళ సర్కారు ఉసూరుమనిపించింది. – ఏ సుందరయ్య, ఫ్యోప్టో ఛైర్మన్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ వైఖరి దారుణం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలుపర్చడంలో విఫలమైన ప్రభుత్వం నాలుగు డీఏ బకాయిల్లో కేవలం ఒక్కటి మంజూరుచేసి చేతులు దులుపుకోవడం దారుణం. పీఆర్సీ కమిషన్ను నియమించి, ఐఆర్ ప్రకటించాలని చేసిన డిమాండ్లను పట్టించుకోకపోవడం సరికాదు. ఒక్క డీఏ మంజూరు ద్వారా ఒనగూరే ప్రయోజనమేమీ లేదు. – కె. నరసింహారావు, గుంటూరు జిల్లా ఫ్యాప్టో చైర్మన్

ధనత్రయోదశి ప్రభావం.. బంగారం ఎంత కొన్నారంటే?
ఈ ఏడాది ధంతేరస్ (ధనత్రయోదశి) సందర్భంగా భారతీయ వినియోగదారులు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వ్యాపారుల సంఘం శనివారం తెలిపింది. బంగారం, వెండి ధరలు బాగా పెరిగినప్పటికీ.. సుమారు 60,000 కోట్ల రూపాయలు వీటికోసం ఖర్చు చేసినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా. ఈ అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే 25% ఎక్కువ.బంగారం ధరలు గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 60 శాతం పెరిగింది. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.30 లక్షలు దాటేసింది. ధరలు పెరిగినప్పటికీ.. సెంటిమెంట్, డిమాండ్ రెండూ కలిసొచ్చాయని సీఏఐటీ ఆభరణాల విభాగం, ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా అన్నారు. ఢిల్లీ బులియన్ మార్కెట్లలో మాత్రమే రూ. 10,000 కోట్లకు పైగా అమ్మకాలు నమోదయ్యాయని ఆయన అన్నారు.ధంతేరస్, దీపావళి సమయంలో బంగారం కొనుగోలు శుభప్రదమని చాలామంది భావిస్తారు. ఈ కారణంగా ప్రతిఏటా ఈ పండుగల సమయంలో బంగారం అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా భారీగా పెరిగి.. కేజీ వెండి రేటు సుమారు రూ. 2 లక్షలు దాటేసింది. ఈ రేటు ఇందుకు ముందు ఏడాదితో పోలిస్తే.. 55 శాతం ఎక్కువ.బంగారం, వెండి అమ్మకాలు కాకుండా.. వంట సామాగ్రి అమ్మకాలు రూ.15,000 కోట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ వస్తువులు రూ.10,000 కోట్లు, అలంకరణ.. మతపరమైన వస్తువుల అమ్మకాలు రూ.3,000 కోట్లుగా ఉన్నాయని వ్యాపారుల సంఘం తెలిపింది.ఇదీ చదవండి: గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్ధన్తేరస్ కొనుగోలు పెరుగులపై.. సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, జీఎస్టీ రేట్లలో తగ్గింపులు, స్థానికంగా తయారైన ఉత్పత్తులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహం అందించడం వల్ల పండుగల సమయంలో వ్యాపారాలు పెరగడానికి దోహదపడ్డాయని అన్నారు. సాంప్రదాయ మార్కెట్లు, స్థానిక ఆభరణాల స్టోర్స్.. రిటైల్ దుకాణాలు రికార్డు స్థాయిలో కస్టమర్ల రద్దీని నమోదు చేశాయని పేర్కొన్నారు.

బీహార్ ఎన్నికలు.. ఎన్డీయే కూటమికి బిగ్ షాక్
పట్నా: బీహార్ అసెంబ్లీ(Bihar Assembly Election) ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే(NDA Alliance) కూటమికి ఊహించని షాక్ తగిలింది. మధుర అసెంబ్లీ స్థానం నుంచి కూటమి తరఫున ఎల్జేపీ అభ్యర్థిగా నిలిచిన సీమా సింగ్(Seema Singh) నామినేషన్ రద్దైంది. దీంతో, మధుర అసెంబ్లీ స్థానంలో ఎన్డీయే అభ్యర్థి పోటీలో లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పోటీ ఆర్జేడీ, జన్ సురాజ్ పార్టీల మధ్య ఉండనుంది.వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చాప్రా జిల్లాలోని మధుర అసెంబ్లీ స్థానం నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ఎల్జేపీ అభ్యర్థిగా సీమా సింగ్ నామినేషన్ వేశారు. మొదటి విడత నామినేషన్ వేయడానికి అక్టోబర్ 17 చివరి తేదీ కావడంతో ఆమె.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అధికారులు శనివారం పరిశీలించగా సీమా సింగ్ నామినేషన్లో లోపం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె నామినేషన్ రద్దు చేసినట్లు డిప్యూటీ ప్రొవిన్షియల్ ఎలక్షన్ ఆఫీసర్ (డీపీఆర్వో) ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే, ఈ నియోజకవర్గంలో నామినేషన్లో లోపం కారణంగా సీమా సింగ్తో పాటు మొత్తం నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారి తెలిపారు.సినిమా నుంచి పాలిటిక్స్లోకి.. సీమా సింగ్ పలు భోజ్పురి సినిమాల్లో నటించారు. తన మార్క్ నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, సినిమా రంగం నుంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చి అందరనీ ఆశ్చర్యపర్చారు. కాగా, చిరాగ్ పాశ్వాన్ తనకు మధుర స్థానాన్ని కేటాయించిన తర్వాత ఆమె చాలా నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి రాజకీయంగా యాక్టివ్గా ప్రచారం చేసుకుకున్నారు. మరోవైపు.. ఆమె తన అఫిడవిట్లో తొమ్మిదో తరగతి చదివినట్లు పేర్కొన్నారు. దీంతో, ఆమెపై ప్రజల్లో మరింత ఫోకస్ పెరిగింది. ఇదిలా ఉండగా.. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సీమా సింగ్పై కేసు నమోదైంది. ప్రభుత్వ అనుమతి లేకుండా షేక్పురాలో ఆమె హోలీ నిర్వహించిన కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదిలా ఉండగా.. బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈసారి అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి, జన్ సురాజ్ పార్టీ మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీకి గడువు నవంబర్ 22తో ముగియనుంది.

పాక్-ఆప్ఘన్ మధ్య కీలక చర్యలు.. శాంతికి ఓకే
దోహా: కొద్ది రోజులుగా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య శాంతి చర్యలు ఫలించాయి. పాక్-ఆప్ఘన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ మేరకు ఖతార్ (Qatar) విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో రెండు దేశాల సరిహద్దులో దాడులు నిలిచిపోనున్నాయి.ఖతార్ రాజధాని దోహా వేదికగా పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఈ చర్చలకు ఖతార్, తుర్కియే (Turkey) మధ్యవర్తిత్వం వహించాయి. చర్చల్లో పాల్గొనేందుకు ఇరుదేశాలకు చెందిన రక్షణ మంత్రులు ఖతార్ వచ్చారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణకు సంబంధించి కీలకంగా చర్చించారు. రెండు దఫాలుగా జరిగిన ఈ చర్చల్లో శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో, శాంతి చర్చలు ఫలించాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన స్థిరత్వాన్ని కొనసాగించడంపై రానున్న రోజుల్లో మరిన్ని చర్చలు జరిపేందుకు కూడా వారు అంగీకరించారని ఖతార్ వెల్లడించింది. ఈ మేరకు ఖతార్ (Qatar) విదేశాంగ మంత్రిత్వశాఖ స్వయంగా ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించింది.ఇక, శుక్రవారం అర్ధరాత్రి ఆఫ్ఘనిస్థాన్లోని పాక్టికా ప్రావిన్స్పై పాక్ వైమానిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాక్ చేసిన దాడుల్లో యువ క్రికెటర్లు, మహిళలు, చిన్నారులతో సహా కనీసం 10 మంది మృతి చెందారు. ఈ క్రమంలో పక్క దేశం నుంచి వస్తున్న దురాక్రమణలకు మాత్రమే ప్రతిస్పందిస్తున్నామన్నట్లుగా ఇరువర్గాలు వాదనలు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆప్ఘన్ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడంతో పాటు సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం పునరుద్ధరణ చర్యలపై మాత్రమే దృష్టి పెట్టామని పాక్ పేర్కొంది. సరిహద్దుల్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలను ఆప్ఘన్ ఖండించింది.

Italy: ఎయిర్ ఇండియా షాక్.. దీపావళి ప్రయాణాలు వాయిదా!
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉంటున్న పలువురు భారతీయులు దీపావళి పండుగకు స్వదేశానికి వస్తుంటారు. ఇందుకోసం ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. అలాంటి ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాకిచ్చింది. కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో పాల్గొందామనే సంతోషంలో ఉన్న ప్రవాస భారతీయుల ఆశలపై ఎయిర్ ఇండియా నీళ్లు జల్లింది.దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు ఇటలీ నుండి భారతదేశానికి బయలుదేరిన వందలాది మంది ప్రయాణికులు తాము శుక్రవారం ఎక్కాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దయ్యిందని తెలియడంతో షాక్నకు గురయ్యారు. తదుపరి విమానం సోమవారం(దీపావళి) లేదా ఆ మర్నాడు(మంగళవారం) బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా చెప్పడంతో వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. Hundreds of passengers returning for Diwali break left stranded after Air India’s flight from Milan to Delhi on Oct 17 (AI 138) is cancelled due to a technical glitch. Return now scheduled for four days later. Some were taken to a hotel, where they were later asked to leave.… pic.twitter.com/8LcmrocBfX— Jagriti Chandra (@jagritichandra) October 18, 2025సాంకేతిక సమస్య కారణంగా మిలన్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 138 విమానం రద్దు అయ్యిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది.‘ఎయిర్ ఇండియా.. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తుందని, షెడ్యూల్ చేసిన విమానంలో సాంకేతిక సమస్య కారణంగా కారణంగా.. 2025, అక్టోబర్ 17న మిలన్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 138 విమానం రద్దు అయ్యింది’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ విమానంలో ఎక్కాల్సిన ప్రయాణికులకు హోటల్ వసతి కల్పించామని, విమానాశ్రయం సమీపంలోనే వారికి ఈ ఏర్పాట్లు చేశామని ఎయిర్ ఇండియా తెలిపింది.‘ఎయిర్ ఇండియాతో పాటు ఇతర విమానయాన సంస్థలతో సీట్ల లభ్యత ఆధారంగా 2025, అక్టోబర్ 20 లేదా ఆ తర్వాత ప్రత్యామ్నాయ విమానాలలో ప్రయాణికులు తిరిగి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఇక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులందరికీ భోజనంతో సహా అవసరమైన అన్ని సహాయాలను ఎయిర్ ఇండియా అందిస్తుంది. వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతపై ఎయిర్ ఇండియా నిబద్ధత కలిగివుంటుందని పునరుద్ఘాటిస్తున్నాం’ అని ప్రతినిధి పేర్కొన్నారు.
ఆ రెండు చిత్రాల కంటే ‘డ్యూడ్’కే ఎక్కువ కలెక్షన్స్: ప్రదీప్ రంగనాథన్
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్ జామ్
Bihar Elections: గేదెనెక్కి ఒకరు.. సంకెళ్లతో మరొకరు.. తెగ నవ్విస్తున్న అభ్యర్థులు
ఎప్పుడూ చేయని వెరైటీ వంటకాలు టేస్టీ.. టేస్టీగా చేసేద్దాం ఇలా..!
డబుల్ సెంచరీతో చెలరేగిన రాహుల్
బిగ్బాస్ కోసం జాబ్ వదిలేశాను.. కన్నీళ్లు పెట్టుకున్న శ్రీజ
రీ ఎంట్రీలో అట్టర్ ప్లాప్.. విరాట్ కోహ్లి డకౌట్! ఇలా అయితే కష్టమే?
పోటీలోనూ వసూళ్లు బాగున్నాయి
ఫన్ అండ్ ఫవర్ఫుల్ టీవీ!
రైలు ఇంజన్పై పడ్డ బండరాయి.. తప్పిన పెను ప్రమాదం
రేపు తెలంగాణ బంద్.. డీజీపీ కీలక ఆదేశాలు
హైదరాబాద్ టు శ్రీశైలం నాన్ స్టాప్
25 ఫోర్లు, 8 సిక్స్లు.. పెర్త్లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ!
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆకస్మిక ధనలాభం
లొంగిపోతున్న మావోయిస్టులు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.
శృంగారంలో ఉండగా స్పృహ కోల్పోయాడని..
‘బంగారం ఓ కొనేస్తున్నారా? ఆ రిస్క్ మాత్రం తప్పదు’
ఎవడ్రా సామి నువ్వు.. పాక్ను ఇంతలా వణికిస్తున్నావ్?
పల్సర్ బైక్ సాంగ్కు ఎన్ని లక్షలు వచ్చాయంటే?
మెగా కోడలి సస్పెన్స్ థ్రిల్లర్.. సడన్గా ఓటీటీకి!
లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే..
తెలుసు కదా మూవీ రివ్యూ
తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..
యాంకర్ లాస్య గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా రోజా (ఫోటోలు)
షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్
... ఆన్లైన్ గేమ్లోనా! ఐతే ఓకే!!
బిగ్బాస్లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ ఔట్
నువ్వు నాదానివే..!
తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు!
ఆ రెండు చిత్రాల కంటే ‘డ్యూడ్’కే ఎక్కువ కలెక్షన్స్: ప్రదీప్ రంగనాథన్
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్ జామ్
Bihar Elections: గేదెనెక్కి ఒకరు.. సంకెళ్లతో మరొకరు.. తెగ నవ్విస్తున్న అభ్యర్థులు
ఎప్పుడూ చేయని వెరైటీ వంటకాలు టేస్టీ.. టేస్టీగా చేసేద్దాం ఇలా..!
డబుల్ సెంచరీతో చెలరేగిన రాహుల్
బిగ్బాస్ కోసం జాబ్ వదిలేశాను.. కన్నీళ్లు పెట్టుకున్న శ్రీజ
రీ ఎంట్రీలో అట్టర్ ప్లాప్.. విరాట్ కోహ్లి డకౌట్! ఇలా అయితే కష్టమే?
పోటీలోనూ వసూళ్లు బాగున్నాయి
ఫన్ అండ్ ఫవర్ఫుల్ టీవీ!
రైలు ఇంజన్పై పడ్డ బండరాయి.. తప్పిన పెను ప్రమాదం
రేపు తెలంగాణ బంద్.. డీజీపీ కీలక ఆదేశాలు
హైదరాబాద్ టు శ్రీశైలం నాన్ స్టాప్
25 ఫోర్లు, 8 సిక్స్లు.. పెర్త్లో బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ!
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆకస్మిక ధనలాభం
లొంగిపోతున్న మావోయిస్టులు
శృంగారంలో ఉండగా స్పృహ కోల్పోయాడని..
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.
‘బంగారం ఓ కొనేస్తున్నారా? ఆ రిస్క్ మాత్రం తప్పదు’
ఎవడ్రా సామి నువ్వు.. పాక్ను ఇంతలా వణికిస్తున్నావ్?
పల్సర్ బైక్ సాంగ్కు ఎన్ని లక్షలు వచ్చాయంటే?
మెగా కోడలి సస్పెన్స్ థ్రిల్లర్.. సడన్గా ఓటీటీకి!
లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే..
తెలుసు కదా మూవీ రివ్యూ
తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో సక్సెస్..కానీ ఐఏఎస్ వద్దని..
బిగ్బాస్లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ ఔట్
షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్
... ఆన్లైన్ గేమ్లోనా! ఐతే ఓకే!!
నువ్వు నాదానివే..!
తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు!
'నా కథను ఎన్టీఆర్తో చేయించండి'
సినిమా

ఎమోషనల్గా కనెక్ట్ కావడమే స్టార్డమ్: షారుక్ ఖాన్
‘‘స్టార్ అనే ట్యాగ్ మాకు నచ్చదు. మా ఇంట్లో మేం అందరిలానే ఉంటాం. మాతో కలిసి పని చేసిన దర్శకులు, రచయితలు, నిర్మాతలు, ప్రేక్షకుల ఆదరణ వల్లే ప్రస్తుతం మేం ఈ స్థాయిలో ఉన్నాం’’ అని సల్మాన్ ఖాన్ అన్నారు. సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ పాల్గొని, సందడి చేశారు. ఈ వేడుకలో ఈ ఖాన్ త్రయం వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.‘‘నాకు, ఆమిర్ ఖాన్కు సినీ నేపథ్యం ఉంది. కానీ షారుక్ మాత్రం ఢిల్లీ నుంచి వచ్చి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రతిభతోనే ఇండస్ట్రీలో ఎదిగాడు’’ అని సల్మాన్ మాట్లాడగా, ఇదే విషయంపై షారుక్ స్పందించారు. ‘‘సల్మాన్, ఆమిర్ల కుటుంబ సభ్యుడిగా నన్ను నేను భావిస్తాను. ఈ విధంగా నాకు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లే’’ అని షారుక్ చెప్పారు. అలాగే అభిమానులతో ఎమోషనల్గా కనెక్ట్ కావడమే స్టార్డమ్ అని కూడా షారుక్ తెలిపారు.అది సాధ్యమే: సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్లో సల్మాన్, ఆమిర్, షారుక్ ఖాన్ గెస్ట్ రోల్స్ చేశారు. మంచి కథ కుదిరితే ఆమిర్, షారుక్లతో కలిసి సినిమా చేయడానికి తాను రెడీ అని సల్మాన్ చెప్పారు. కానీ మా ముగ్గర్నీ భరించడం మేకర్స్కి సులభం కాదని సరదాగా అన్నారు సల్మాన్ ఖాన్.

'దర్శన్ కోరే సౌకర్యాలు ఇవ్వడం మా వల్ల కాదు'
హత్య కేసులో బెంగళూరు పరప్పన జైల్లో ఉన్న ప్రముఖ నటుడు దర్శన్కు కనీస సౌకర్యాలు కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఆయన ఆరోపణలతో వాస్తవాలను పరిశీలించేందుకు ఉన్నత న్యాయస్థానం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బెంగళూరు 57వ సీసీహెచ్ కోర్టుకు న్యాయసేవ ప్రాధికార కార్యదర్శి వరదరాజ నివేదికను అందించారు. ఆయనకు నిబంధనల ప్రకారం అందాల్సిన సౌకర్యాలు ఉన్నాయని వారు తెలిపారు. తనకు ఫంగస్ సోకిందని దర్శన్ అబద్ధం చెబుతున్నారంటూ చర్మవ్యాధుల చికిత్స నిపుణురాలు జ్యోతిబాయితో చేయించిన పరీక్ష నివేదికను కూడా న్యాయస్థానంలో అందజేశారు. రేణుకాస్వామి హత్య కేసులో తమకు బెయిలు మంజూరు చేయాలని దర్శన్, పవిత్రాగౌడ తదితరులు వేసుకున్న అర్జీ విచారణ 24వ తేదీకి వాయిదా పడింది.వసతులు సాధ్యం కాదు● దర్శన్కు పరుపు, దిండు ఇవ్వలేం, విచారణ ఖైదీకి ఇలాంటి సౌకర్యాలు ఇవ్వడం సాధ్యం కాదని జైలు అధికారులు స్పష్టం చేసినట్లు నివేదికలో తెలిపారు.● దర్శన్ బ్యారక్లో దేశీయ, పాశ్చాత్య శైలి కమోడ్లు ఉన్నాయి, ఆయన గంటపాటు ఎండలో వాకింగ్ చేయడానికి సౌకర్యం ఉంది.● దర్శన్ వాకింగ్ చేస్తుంటే ఇతర ఖైదీలు చూసి కేకలు వేస్తున్నారు. సెలబ్రిటీ కావడం వల్ల అతనికి కలవడానికి యత్నిస్తున్నారు. బయట వాకింగ్ చేయనిస్తే, జైలు చుట్టు పక్కల అపార్ట్మెంట్లలో ఉన్నవారు ఫోటోలు, వీడియోలు తీసుకునే అవకాశం ఉంది.● టీవీ ఇవ్వలేదంటున్నారు, అందరికీ ఓ హాల్లో టీవీ ఉంటుంది. బ్యారక్లో టీవీని అమర్చడం సాధ్యం కాదు అని జైలు అధికారులు చెప్పినట్లు తెలిపారు.● బంధుమిత్రులతో ఫోన్లో మాట్లాడితే కాల్స్ను రికార్డ్ చేస్తున్నారన్న దర్శన్ ఆరోపణలపై.. అది జైలు నియమమని చెప్పారు.● అరికాలికి ఫంగస్ వచ్చి పగుళ్లు రావడం వల్ల నొప్పులు వస్తున్నట్లు తెలిపారు. దర్శన్ను వైద్యులు వారానికి రెండుసార్లు పరిశీలిస్తున్నట్లు నివేదికలో వివరించారు.

హిట్ కొట్టిన విక్రమ్ వారసుడు.. తెలుగులో కూడా విడుదల
చియాన్ విక్రమ్ వారసుడు ధ్రువ్కు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన తండ్రి విక్రమ్ నటనను చూసి ఎదిగిన వారసుడు. తొలి చిత్రం వర్మతోనే నటుడిగా తానేమిటో నిరూపించుకున్నారు. అయితే ఆ చిత్రం సక్సెస్ కాకపోవడం, ఆ తరువాత తన తండ్రి విక్రమ్తో కలిసి నటించిన మహాన్ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో ధ్రువ్విక్రమ్ ఇప్పటివరకు విజయానికి దూరంగా ఉన్నారు. సరైన కథ, దర్శకుడి చేతిలో పడితే తన సత్తా చాటగలనని ఈ యువ నటుడు బైసన్ చిత్రంతో నిరూపించుకున్నారు. మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ కథానాయకుడిగా నటించిన బైసన్ చిత్రం దీపావళి పండుగ సందర్భంగా శుక్రవారం తెరపైకి వచ్చింది. కబడ్డీ క్రీడ నేపథ్యంలో యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని దర్శకుడు పా.రంజిత్కు చెందిన నీలం ప్రొడక్షన్న్స్, అప్లాజ్ ఎంటర్టెయిన్మెంట్, శాంతి సినిమా సంస్థలు కలిసి నిర్మించాయి. ఒక కుగ్రామానికి చెందిన పేద కుర్రాడు అత్యున్నత పురస్కారం అర్జున్ అవార్డును గెలుచుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం బైసన్.ఈచిత్రంలో హీరో అక్కగా రజిషా విజయన్, ఆయన తండ్రిగా పశుపతి, హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీరితో పాటు దర్శకుడు అమీర్, లాల్ ముఖ్యపాత్రలు పోషించారు. నివాస్ కే.ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధ్రువ్ నటన గురించే. ఆయన సహజత్వంగా తన పాత్రలో అంకితమై నటించారు. కొన్ని సన్నివేశాల్లో తన తండ్రి విక్రమ్ను గుర్తు చేశారు. ఈ చిత్రం తెలుగులో కూడా ఇదే టైటిల్తో అక్టోబర్ 24న విడుదల కానుంది. దర్శకుడు మారీ సెల్వరాజ్ గతంలో తెరకెక్కించిన మామన్నన్, కర్ణన్, వాజై చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు బైసన్ మూవీ కూడా మంచి విజయం సాధించింది.

బిగ్బాస్లో షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ ఔట్
బిగ్ బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత షో పరుగులు పెడుతుంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరూ ఊహించని వ్యక్తి వెళ్లిపోనున్నారు. ఇప్పటికే గతవారంలో ప్రేక్షకుల ఓటింగ్తో ప్రమేయం లేకుండానే షాకింగ్ ఎలిమినేషన్తో శ్రీజ దమ్ము బయటకు వచ్చేసింది. ఈ వారం నామినేషన్ లిస్ట్లో ఉన్న భరణి, దివ్య, తనూజ, పవన్, రాము, సుమన్లలో టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. అందరూ దివ్య, రాములలో ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ, బిగ్బాస్ అతిపెద్ద సర్ప్రైజ్ ఇచ్చేశాడు. ఒక టాప్ కంటెస్టెంట్ను హౌస్ నుంచి పంపించేశాడు.ఈ వారం భరణి ఎలిమినేట్ అయిపోయారు. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ ఈ అదివారం బిగ్బాస్ నుంచి బయటకు రానున్నారు. కేవలం ఎక్కువ బాండిగ్స్ పెట్టుకోవడం వల్లే భరణి ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఆపై ఈ వారంలో సంజన మీద ఆయన ఫైర్ తీరు ప్రేక్షకులకు నచ్చలేదు. ఆపై అతని గేమ్ స్ట్రాటజీని కూడా సరిగ్గా అంచనా వేయలేకపోయారు. టాప్లో తనే ఉన్నాననే భ్రమలో భరణి ఉండటంతో గేమ్పై పట్టు కోల్పోయారు. ముఖ్యంగా దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో భరణిని టాప్ 2లో ఉన్నారని చెప్పింది. ఆపై అతనితోనే దివ్య ఉండటంతో నమ్మేశాడు. దీంతో ఆయనలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఏకంగా తనను నామినేట్ చేసిన వారందరూ హౌస్ నుంచి వెళ్లిపోయారని కూడా కామెంట్ చేశారు. అంతలా తనపై తాను అతి నమ్మకం పెట్టుకున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్న భరణి ఆట చూసి ఇంట్లోకి వెళ్లిన దివ్య కూడా సలహాలు ఇవ్వలేదు. దీంతో ఆయన ఆట పతనానికి దారి తీసింది. కేవలం తన స్వయం కృతాపరాధం వల్లే భరణ ఎలిమినేట్ అయ్యారని చెప్పవచ్చు. అయితే, ఎలాంటి నెగటివిటి లేకుండా బిగ్బాస్ నుంచి వచ్చేశారు.
న్యూస్ పాడ్కాస్ట్

తుస్సుమన్న చంద్రబాబు కానుక... ప్రభుత్వ ఉద్యోగులకు దగా... నాలుగు డీఏలకు గాను ఒకే ఒక్క డీఏతో సరిపెట్టిన వైనం

ఏపీలో అద్దేపల్లి జనార్దనరావు డంప్ వద్ద స్వాధీనం చేసుకున్నది నకిలీ మద్యమే... ల్యాబ్ పరీక్షల సాక్షిగా బట్టబయలు

తయారీ కేంద్రంగా భారత్, 2047 నాటికి వికసిత్ భారత్ సాధనే లక్ష్యం... కర్నూలు సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడి

‘సాక్షి’ పత్రిక గొంతు నొక్కే కుతంత్రం... ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులతో చంద్రబాబు సర్కారు వేధింపులు

‘సాక్షి’ ప్రసారాల నిలిపివేతపై సుప్రీంకోర్టు సీరియస్. ఏపీలో కూటమి సర్కార్ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసహనం

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు.

ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపుల్లో నకిలీ కిక్కు. అన్ని గ్రామాల్లోనూ టీడీపీ కార్యకర్తల చేతుల్లోనే షాపులు

తవ్వేకొద్ది బయటపడుతోన్న టీడీపీ నేతల నకిలీ లిక్కర్ బాగోతం..A1 జనార్ధన్రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు..

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్..పెండింగ్ బిల్లులు చెల్లించాలని నెట్వర్క్ ఆస్పత్రుల డిమాండ్...పేదలకు పెనుశాపంగా మారిన కూటమి పాలన

ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు... ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి
క్రీడలు

భారత్కు భారీ షాక్.. మూడు వికెట్లు డౌన్
IND vs AUS 1st ODI live Updates and highlights: పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఆస్ట్రేలియా-భారత్ తలపడతున్నాయి.మరోసారి వర్షం అడ్డంకి..పెర్త్ వన్డేకు వరుణుడు మరోసారి అంతరాయం కలిగించాడు. భారత్ స్కోర్ 37/3 వద్ద ఉండగా.. వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు.11 ఓవర్లకు భారత్ స్కోర్: 35/311 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్(6), శ్రేయస్ అయ్యర్(6) ఉన్నారు.వర్షం అటంకి..తొలి వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా ఆట నిలిచే పోయే సమయానికి భారత్ స్కోర్: 25/3.కెప్టెన్ గిల్ ఔట్.. భారత్కు వరుస షాక్లు తగిలాయి. కెప్టెన్ గిల్ ఔట్. ఇన్నింగ్స్లో 10 పరుగులు చేసిన గిల్.. ఇల్లీస్ బౌలింగ్లో ఔటయ్యాడు. కింగ్ కోహ్లీ ఔట్..భారత్ మరో షాక్ తగిలింది. రోహిత్ బాటలోనే కింగ్ కోహ్లీ కూడా వెనుదిరిగాడు. స్టార్క్ బౌలింగ్లో కోహ్లీ.. క్యాచ్ అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఔట్..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 4 ఓవర్లకు భారత్ స్కోర్: 14/1ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు..3 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా13 పరుగులు చేసింది. క్రీజులో శుభ్మన్ గిల్(5), రోహిత్ శర్మ(8) ఉన్నారు.బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్..పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఆస్ట్రేలియా-భారత్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ తరపున నితీశ్ కుమార్ రెడ్డి వన్డే అరంగేట్రం చేశాడు. అదేవిధంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు ఆల్రౌండర్లతో టీమిండియాకు బరిలోకి దిగింది.మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లు ఫాస్ట్ బౌలర్లగా చోటు దక్కించుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. అయితే స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు చోటు దక్కలేదు.రోహిత్, విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఆసీస్ తరపున ఇద్దరు ఆటగాళ్లు డెబ్యూ చేశారు. మాట్ రెన్షా, మిచెల్ ఓవెన్లకు వన్డే క్యాప్లను అందించారు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్వుడ్

కొంచెం కూడా సిగ్గు లేదు.. జింబాబ్వేను బ్రతిమాలుకున్న పాకిస్తాన్
శ్రీలంక-పాకిస్తాన్తో జరగనున్న టీ20 ట్రై సిరీస్ నుంచి అఫ్గానిస్తాన్ వైదొలిగిన సంగతి తెలిసిందే. తమ దేశంపై పాకిస్తాన్ సైన్యం చేసిన వైమానిక దాడిని ఖండిస్తూ అఫ్గన్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్గాన్లోని అర్గున్, బర్మల్ జిల్లాలపై పాక్ సైన్యం చేసిన దాడిలో ముగ్గురు వర్ధమాన క్రికెటర్లు మృతి చెందారు ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన అఫ్గన్ బోర్డు పాక్ గడ్డపై క్రికెట్ ఆడేది లేదని తేల్చి చెప్పింది.అయితే అఫ్గానిస్తాన్ తప్పుకొన్నప్పటికి ఈ ముక్కోణపు టోర్నీ షెడ్యూల్ ప్రకారం జరగనుంది. ఈ టోర్నీలో అఫ్గాన్ స్ధానాన్ని జింబాబ్వేతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. ఇప్పటికే ఈ విషయంపై జింబాబ్వే క్రికెట్ బోర్డుతో పీసీబీ చర్చలు జరిపింది. అందుకు జింబాబ్వే క్రికెట్ కూడా అంగీకరించనట్లు పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా అఫ్గానిస్తాన్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు నేపాల్, యూఏఈ క్రికెట్ బోర్డులతో కూడా పాక్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కానీ అందుకు ఆయా క్రికెట్ బోర్డులు కాస్త సమయం కోరినట్లు సమాచారం. కానీ అంతలోనే జింబాబ్వే ఒప్పుకోవడంలో అప్డేటడ్ షెడ్యూల్ను పీసీబీ విడుదల చేసింది.అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శల వర్షం కురుస్తోంది. మీ దేశం చేసిన దాడిలో ముగ్గురు యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోతే .. సంతాపం తెలపాల్సింది బదులు కొత్త షెడ్యూల్ రిలీజ్ చేస్తారా? అంటూ ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు.నవంబర్ 17 నుండి 29 వరకు జరగనున్న ఈ ముక్కోణపు సిరీస్కు రావల్పిండి, లహోర్ ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ సిరీస్ టీ20 ప్రపంచకప్-2026 సన్నాహాకాల్లో భాగంగా జరగనుంది. కాగా ఈ యువ క్రికెటర్ల మృతి పట్ల ఐసీసీ, బీసీసీఐ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.ట్రైసిరీస్ షెడ్యూల్17 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి19 నవంబర్ – శ్రీలంక వర్సెస్ జింబాబ్వే, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి22 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, గడాఫీ స్టేడియం, లాహోర్23 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే, గడాఫీ స్టేడియం, లాహోర్25 నవంబర్ – శ్రీలంక వర్సెస్ జింబాబ్వే, గడాఫీ స్టేడియం, లాహోర్27 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, గడాఫీ స్టేడియం, లాహోర్29 నవంబర్ – ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్

ఆసీస్తో తొలి వన్డే.. రోహిత్, కోహ్లి ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్కు సమయం అసన్నమైంది. పెర్త్ వేదికగా ఆదివారం జరగనున్న తొలి వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. శుభ్మన్ గిల్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుండగా.. ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో ఆడనుంది.అందరి దృష్టి భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) పైనే ఉన్నాయి. వీరిద్దరూ దాదాపు ఏడు నెలల తర్వాత బ్లూ జెర్సీలో కన్పించనున్నారు. దీంతో రో-కో ద్వయం ఎలా ఆడుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టీమిండియా ఫ్యాన్స్కు ఓ బ్యాడ్ న్యూస్.పెర్త్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ జరిగే సమయంలో వరుణుడు పలు మార్లు ఆటకు అంతరాయం కలిగించే అవకాశముంది. వర్షం పడేందుకు 35 శాతానికి పైగా అస్కారం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం కూడా అక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.అయితే వర్షం కారణంగా పూర్తిగా రద్దు అయ్యే సూచనలు అయితే కన్పించడం లేదు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెర్త్ స్టేడియంలోని పిచ్ ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామమే అనే చెప్పుకోవాలి. కాబట్టి భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్చదవండి: ప్లే ఆఫ్స్కు చేరిన తెలుగు టైటాన్స్

ప్లే ఆఫ్స్కు చేరిన తెలుగు టైటాన్స్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 40–31 పాయింట్ల తేడాతో పట్టిక అగ్రస్థానంలో ఉన్న పుణేరి పల్టన్పై గెలిచి ముందంజ వేసింది. టైటాన్స్ తరఫున భరత్ 11, విజయ్ మాలిక్ 10 పాయింట్లు సాధించారు.ఈ సీజన్లో టైటాన్స్ 16 మ్యాచ్లాడి 9 విజయాలు, 7 పరాజయాలతో 18 పాయింట్లతో నిలిచింది. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 33–23 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. ఈ విజయంతో బెంగళూరు బుల్స్ కూడా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఇంకో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 38–30 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్పై గెలుపొందింది.
బిజినెస్

ఎమోషనల్గా కనెక్ట్ కావడమే స్టార్డమ్: షారుక్ ఖాన్
‘‘స్టార్ అనే ట్యాగ్ మాకు నచ్చదు. మా ఇంట్లో మేం అందరిలానే ఉంటాం. మాతో కలిసి పని చేసిన దర్శకులు, రచయితలు, నిర్మాతలు, ప్రేక్షకుల ఆదరణ వల్లే ప్రస్తుతం మేం ఈ స్థాయిలో ఉన్నాం’’ అని సల్మాన్ ఖాన్ అన్నారు. సౌదీ అరేబియాలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ పాల్గొని, సందడి చేశారు. ఈ వేడుకలో ఈ ఖాన్ త్రయం వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.‘‘నాకు, ఆమిర్ ఖాన్కు సినీ నేపథ్యం ఉంది. కానీ షారుక్ మాత్రం ఢిల్లీ నుంచి వచ్చి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రతిభతోనే ఇండస్ట్రీలో ఎదిగాడు’’ అని సల్మాన్ మాట్లాడగా, ఇదే విషయంపై షారుక్ స్పందించారు. ‘‘సల్మాన్, ఆమిర్ల కుటుంబ సభ్యుడిగా నన్ను నేను భావిస్తాను. ఈ విధంగా నాకు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లే’’ అని షారుక్ చెప్పారు. అలాగే అభిమానులతో ఎమోషనల్గా కనెక్ట్ కావడమే స్టార్డమ్ అని కూడా షారుక్ తెలిపారు.అది సాధ్యమే: సల్మాన్ ఖాన్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్లో సల్మాన్, ఆమిర్, షారుక్ ఖాన్ గెస్ట్ రోల్స్ చేశారు. మంచి కథ కుదిరితే ఆమిర్, షారుక్లతో కలిసి సినిమా చేయడానికి తాను రెడీ అని సల్మాన్ చెప్పారు. కానీ మా ముగ్గర్నీ భరించడం మేకర్స్కి సులభం కాదని సరదాగా అన్నారు సల్మాన్ ఖాన్.

రెండు నెలల్లో సింగిల్ డిజిట్కి లాజిస్టిక్స్ వ్యయాలు
న్యూఢిల్లీ: ఎక్స్ప్రెస్వేలు, ఆర్థిక కారిడార్లను వేగవంతంగా విస్తరించిన నేపథ్యంలో దేశీయంగా లాజిస్టిక్స్ వ్యయాలు వచ్చే రెండు నెలల్లో సింగిల్ డిజిట్ స్థాయికి తగ్గుతాయని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటికే ఇది 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గినట్లు ఐఐటీ చెన్నై, ఐఐటీ కాన్పూర్, ఐఐఎం బెంగళూరు రూపొందించిన నివేదికలో వెల్లడైందని పేర్కొన్నారు. డిసెంబర్ కల్లా ఇది 9 శాతానికి దిగి వస్తుందని అసోచాం వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గడం వల్ల అంతర్జాతీయంగా మన ఎగుమతిదారులు మరింతగా పోటీపడేందుకు వీలవుతుందన్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో లాజిస్టిక్స్ వ్యయాలు 12 శాతంగా ఉండగా, చైనాలో 8–10 శాతంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. మరోవైపు, వచ్చే అయిదేళ్లలో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దాలని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. తాను రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ రూ. 14 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం రూ. 22 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. పరిశ్రమ 4 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తోందని, కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధికంగా జీఎస్టీ కడుతోందని గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ రూ. 78 లక్షలకోట్లుగా, చైనా మార్కెట్ రూ. 47 లక్షల కోట్లుగా తొలి రెండు స్థానాల్లో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉంది. శిలాజ ఇంధనాల దిగమతులపై భారత్ ఏటా రూ. 22 లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోందని, దేశం పురోగమించాలంటే వీటికి ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనాలను వినియోగించడం కీలకమని మంత్రి తెలిపారు.

జీఎస్టీ ప్రయోజనాల పూర్తి బదలాయింపు
న్యూఢిల్లీ: ధరల తగ్గింపు రూ పంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) రేట్ల కోత ప్రయోజనాలు వినియోగదారులకు పూర్తిగా బదిలీ అవు తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రోజువారీ వినియోగించే 54 ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం సమీక్షిస్తోందని జీఎస్టీ బచత్ ఉత్సవ్పై నిర్వహించిన సమావేశంలో ఆమె చెప్పారు. వీటి వివరాలను ఎప్పటికప్పుడు జోనల్ ఏరియాల నుంచి తెప్పించుకుంటున్నామని మంత్రి వివరించారు. సెపె్టంబర్ 22 నుంచి జీఎస్టీ రేట్లను నిర్దిష్టంగా 2 శ్లాబుల కింద (5%, 18%, అల్ట్రా లగ్జరీ ఉత్పత్తులపై ప్ర త్యేకంగా 40% రేటు) సవరించిన సంగతి తెలిసిందే. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో కొనుగోళ్లు పెరిగాయని ఆమె పేర్కొ న్నారు. షాంపూ, పౌడరు, ఉపకరణాలు, బొమ్మలు మొదలైన వాటిపై రేట్లు తగ్గాయని వివరించారు. జీఎస్టీ రేట్ల కోతకు తగ్గట్లుగా ధరలు తగ్గించలేదంటూ వినియోగదారుల వ్యవహారాల విభాగానికి 3,169 ఫిర్యాదులు రాగా 3,075 ఫిర్యాదులు నోడల్ ఆఫీసర్లకు బదిలీ అయినట్లు పేర్కొన్నారు.

ఆర్బీఎల్ బ్యాంకులో ఎన్బీడీకి మెజారిటీ వాటాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఆర్బీఎల్ బ్యాంకులో మెజారిటీ 60 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ ప్రతిపాదించింది. ఇందుకోసం రూ. 26,853 కోట్లు ఆఫర్ చేసింది. విలువపరంగా దేశీ ఆర్థిక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సంబంధించి ఇది అత్యంత భారీ డీల్ కానుంది. ఇటీవలే జపాన్కి చెందిన ఎస్ఎంబీసీ మరో దేశీ ప్రైవేట్ బ్యాంక్ యస్ బ్యాంకులో 24.9 శాతం వాటాలను రూ. 16,333 కోట్లతో కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఆమోదించిన సందర్భంగా ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ నుంచి రూ. 26,853 కోట్ల సమీకరణకు కూడా తమ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఆర్బీఎల్ బ్యాంకు తెలిపింది. ఈ డీల్తో రెండు బ్యాంకుల భాగస్వాములకు ప్రయోజనం చేకూరగలదని ఆర్బీఎల్ బ్యాంక్ ఎండీ ఆర్ సుబ్రమణియకుమార్ తెలిపారు. ప్రిఫరెన్షియల్ ఇష్యూ .. ఒక్కొక్కటి రూ. 10 ముఖ విలువ చేసే 95.90 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను రూ. 228 రేటు చొప్పున ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంకునకు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన కేటాయించేందుకు బోర్డు ఆమోదించింది. ఇది 60 శాతం వాటాకు సమానం. ప్రిఫరెన్షియల్ ఇష్యూ అనంతరం ఆర్బీఎల్ బ్యాంకుపై ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్నకు నియంత్రణ లభిస్తుంది. అటుపైన దాన్ని ప్రమోటరుగా వ్యవహరిస్తారు. ఆర్బీఎల్ బ్యాంకును విదేశీ బ్యాంక్ అనుబంధ సంస్థగా వర్గీకరిస్తారు. ప్రిఫరెన్షియల్ ఇష్యూ కారణంగా ఎమిరేట్స్ ఎన్బీడీ, ఆర్బీఎల్ బ్యాంక్ షేర్హోల్డర్లకు ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆర్బీఎల్ బ్యాంకు నికర లాభం 20 శాతం క్షీణించి రూ. 223 కోట్ల నుంచి రూ. 179 కోట్లకు క్షీణించింది.
ఫ్యామిలీ

కాలానికి రివైండ్ బటన్
సినిమాల్లో టైమ్ మిషన్ లోకాన్ని చూసి ‘మనకీ ఒకటి ఉంటే బాగుండేది’ అని అనుకున్నారా? అయితే, ఈసారి శాస్త్రవేత్తలు నిజంగానే టైమ్ను వెనక్కి తిప్పేశారు! అది కూడా ఒక్క సెకను. ఈ అద్భుతం రష్యా, అమెరికా, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల కలయికతో సాధ్యమైంది. ఐబీఎమ్ క్వాంటమ్ కంప్యూటర్ ప్రాసెసర్పై ప్రత్యేక అల్గారిథమ్ వాడి, ఒక కణం స్థితిని రివైండ్ చేసి, మునుపటి స్థితికి తీసుకెళ్లగలిగారు. సాధారణంగా మనకు తెలిసిన ప్రపంచంలో టైమ్ ఒకే దిశలో ముందుకు వెళ్తుంది. కాని, క్వాంటమ్ లోకంలో మాత్రం వేరే నియమాలు వర్తిస్తాయి. అవే ఒకటి సూపర్పోజిషన్ , అంటే ఒకే సమయంలో కణం రెండు స్థితుల్లో ఉండటం. రెండు ఎంటాంగిల్మెంట్, అంటే రెండు కణాలు దూరంలో ఉన్నా ఒకదానిపై మరొకటి ప్రభావం చూపటం. ఇవన్నీ మ్యాజిక్లా అనిపించే కాన్సెప్ట్లు. వీటిని ఉపయోగించే శాస్త్రవేత్తలు టైమ్ని ‘ఒక్క సెకను వెనక్కి’ నెట్టగలిగారు. ఇప్పుడిది చిన్న అంచనా ప్రయోగమే అయినా, ‘పోయిందనుకున్న సమాచారం కూడా తిరిగి వస్తుంది’ అని ఇది రుజువు చేసింది. క్వాంటమ్ కంప్యూటర్లకు ఇది గోల్డెన్ ఆప్షన్ . ఎందుకంటే భవిష్యత్తులో డేటా రికవరీ, ఎర్రర్ కరెక్షన్ , సిస్టమ్ స్టేబిలిటీ అన్నీ సులభం కానున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలా అయితే, త్వరలోనే టైమ్కి రివైండ్ బటన్ వచ్చే రోజులు కూడా రానున్నాయన్నమాట!

Diwali: జగమంతా దీపావలి
ఇంటింటా దివ్వెల వరుసలతో అమావాస్య చీకటిని తరిమే పండుగ బాణసంచా రంగుల వెలుగులతో నింగీ నేలా మెరిసి మురిసే పండుగ దేశ దేశాల్లో పిన్నా పెద్దా జరుపుకొనే జగమంత పండుగ దీపావళిశరన్నవరాత్రులు ముగిశాక కొద్దిరోజుల విరామంలోనే దీపావళి సందడి మొదలవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో మూడు రోజులు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజులు ఘనంగా వేడుకలు జరుపుకొంటారు. దక్షిణాదిలో దీపావళికి ముందు ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశి, అమావాస్య రోజున దీపావళి, కార్తీక శుక్ల పాడ్యమి రోజున బలి పాడ్యమి జరుపుకొంటారు. ఉత్తరాదిలో ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా, చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకొంటారు. అమావాస్య రోజున దీపావళి, కార్తీక శుక్ల పాడ్యమి రోజున బలి పాడ్యమి, కార్తీక శుక్ల విదియ రోజున యమద్వితీయ జరుపుకొంటారు. ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాల్లో దీపావళి వేడుకలలో మరికొన్ని ఆచార భేదాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో విలక్షణమైన వేడుకలు, పూజలు కూడా జరుపుతారు.దీపావళికి మూలమైన నరకాసుర వధ పురాణగాథ అందరికీ తెలిసినదే! వరాహమూర్తికి భూదేవికి పుట్టిన కొడుకు నరకుడు. పెరిగి పెద్దవాడయ్యాక ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. నరకుడికి శోణితపుర పాలకుడైన బాణాసురుడితో స్నేహం ఏర్పడింది. బాణుడి ప్రోద్బలంతో నరకుడు దుర్మార్గం పట్టాడు. చుట్టుపక్కల రాజ్యాలపై దండెత్తి, ఆ రాజ్యాల రాజకుమార్తెలను తెచ్చి బంధించాడు. అలా పదహారువేల మందిని చెరపట్టాడు. కామాఖ్య అమ్మవారిని ఆరాధించే నరకుడు అమ్మవారి ద్వారా అనేక వరాలు పొందాడు. వరగర్వంతో ముల్లోకాలలోనూ జనాలను పీడించడం మొదలుపెట్టాడు. చివరకు స్వర్గంపై దండెత్తి, ఇంద్రుడిని తరిమికొట్టి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. నరకుడి ఆగడాలు శ్రుతి మించడంతో దేవతలందరూ శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా నరకుడితో యుద్ధం చేసి, అంతమొందించాడు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున నరకుడు అంతమొందడంతో ఆ వార్త తెలిసిన జనాలు మర్నాడు అమావాస్య రోజున ఇళ్ల ముంగిళ్లలో వరుసగా దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు. అప్పటి నుంచి దీపావళి పండుగ రోజున ఇళ్ల ముంగిళ్లలో దీపాలు వరుసగా వెలిగించడం ఆనవాయితీగా వస్తోందనేది పురాణాల కథనం. దీపావళి వేడుకల సందర్భంగా పాటించే ఆచారాల గురించి వివిధ వ్రతగ్రంథాలు విపులంగా తెలిపాయి. వీటి ప్రకారం ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున– ధనత్రయోదశి నాడు అపమృత్యు భయ నివారణ కోసం దీపం పెట్టాలి. దీనినే యమదీపం అంటారు. నరకచతుర్దశి రోజున నరకభయ నివారణ కోసం వేకువ జామునే అభ్యంగన స్నానం చేయాలి. సాయంకాలం దేవాలయాలలో దీపాలు వెలిగించాలి. అమావాస్య నాడు మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు బెరళ్లను నీటిలో నానబెట్టి; ఆ నీటితో అభ్యంగన స్నానం చేయాలి. ప్రదోష కాలంలో– అంటే సూర్యాస్తమయానికి ముందు దీపదానం చేసి, ఇంటి బయట జువ్వి కొమ్మలకు మంటపెట్టి, ఆ దివిటీలు తిప్పాలి. వీటిని ఉల్కలు అంటారు. దివిటీలు తిప్పిన తర్వాత లక్ష్మీపూజ చేసి, తీపి పదార్థాలను ఆరగిస్తారు. సూర్యాస్తమయం కాగానే ఇళ్ల ముంగిళ్లలో వరుసగా దీపాలు వెలిగించాలి. దీపావళి అమావాస్య రోజు రాత్రి కొన్ని ప్రాంతాల్లోని స్త్రీలు ఇళ్లల్లో చేటలు, పళ్లేలు, తప్పెట్లు వాయిస్తారు. ఇలా చేయడం వల్ల అలక్ష్మి తొలగి, అషై్టశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. దీపావళి అమావాస్య రాత్రివేళలోనే ఇళ్లలో బలి చక్రవర్తిని స్థాపిస్తారు. మర్నాడు పాడ్యమి రోజున ఉదయం బలి చక్రవర్తికి ఉత్సవం చేస్తారు. బలి చక్రవర్తి పూజ ముగిశాక ఉదయం వేళలోనే జూదం ఆడతారు. బలి పాడ్యమినాడు ఆడే జూదంలో గెలిచేవారికి ఏడాది మొత్తం శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఇదే రోజున కొన్ని ప్రాంతాల్లో గోవర్ధనపూజ చేస్తారు. ఆ రోజు పాడి పశువులను అలంకరించి, వాటికి ఆటవిడుపునిస్తారు. యమ ద్వితీయ రోజును భ్రాతృ ద్వితీయ అని కూడా అంటారు. ఆ రోజున సోదరీమణులు తమ సోదరులను ఇళ్లకు పిలిచి, విందుభోజనాలు పెడతారు.బాణసంచా సందడిదీపావళి రోజున బాణసంచా కాల్చడం తరతరాలుగా సాగుతోంది. చైనాలో పుట్టిన బాణసంచా అక్కడి నుంచి దేశదేశాలకు వ్యాపించింది. దీపావళి వేడుకల్లో బాణసంచా కాల్చడం దాదాపు పదిహేనో శతాబ్ది నుంచి మొదలై ఉంటుందని చరిత్రకారుల అంచనా. పద్దెనిమిది, పంతొమ్మిదో శతాబ్దాలలో బాణసంచాకు ఆదరణ తారస్థాయికి చేరుకుంది. దీపావళి పండుగ రోజున మాత్రమే కాకుండా; పెళ్లిళ్లు తదితర వేడుకల్లో కూడా బాణసంచా కాల్చడం పదిహేనో శతాబ్ది నుంచి కొనసాగుతోంది. గుజరాత్ ప్రాంతంలో 1518 సంవత్సరంలో ఒక పెళ్లివేడుకలో వీథుల్లో బాణసంచా కాల్పులతో జరిగిన సంరంభాన్ని పోర్చుగీసు యాత్రికుడు బార్బోసా విపులంగా రాశాడు. మొఘల్ సామ్రాజ్యంలో బాణసంచాకు అమితమైన ఆదరణ ఉండేది. ఔరంగజేబు మినహా మొఘల్ చక్రవర్తులందరూ బాణసంచా కాల్పులను, బాణసంచా తయారీ నిపుణులను బాగా ఆదరించారు. బ్రిటిష్ హయాంలో కూడా బాణసంచా కాల్పుల ప్రదర్శనకు మంచి ఆదరణ ఉండేది. బ్రిటిష్ కాలంలోనే తమిళనాడులోని శివకాశి బాణసంచా తయారీకి ప్రధాన కేంద్రంగా ఏర్పడింది. తొలిరోజుల్లో శివకాశిలో ఎవరికి వారు కుటీర పరిశ్రమలా బాణసంచా తయారు చేసేవారు. సరిగా వందేళ్ల కిందట– 1925లో అయన్ నాడద శివకాశిలో ‘నేషనల్ ఫైర్వర్క్స్’ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత శివకాశిలో ఇబ్బడి ముబ్బడిగా బాణసంచా తయారీ సంస్థలు ఏర్పడ్డాయి. శివకాశిలో తయారయ్యే బాణసంచా ఉత్పత్తులు విదేశాలకు కూడా భారీ ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. దేశంలో తయారయ్యే బాణసంచా సామగ్రిలో ఎనభై శాతం శివకాశిలోనే తయారవుతున్నాయంటే, ఈ పట్టణంలో బాణసంచా పరిశ్రమ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. శివకాశిలో బాణసంచా ఉత్పత్తుల విక్రయాల విలువ ఏటా రూ.26 వేల కోట్ల మేరకు ఉంటుందని తాజా అంచనాలు చెబుతున్నాయి.పెరిగిన కాలుష్య స్పృహబాణసంచా వల్ల వాతావరణ కాలుష్యం, ధ్వని కాలుష్యం ఫలితంగా ఏర్పడే ఆరోగ్య సమస్యలపై గడచిన పాతికేళ్లుగా జనాల్లో అవగాహన పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు బాణసంచా తయారీ, వినియోగాలపై ఆంక్షలు విధించడం కూడా మొదలైంది. ప్రభుత్వాల ఆంక్షల వల్ల బాణసంచా తయారీ సంస్థలు నిబంధనలకు లోబడి పర్యావరణానికి తక్కువ హాని కలిగించే, ‘గ్రీన్ క్రాకర్స్’ తయారు చేస్తున్నాయి. బాణసంచా తయారీలో ధ్వనికాలుష్య నియంత్రణకు సంబంధించి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. బాణసంచా తయారీ సంస్థలు ఈ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనంటూ 2001లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి దేశంలోని బాణసంచా తయారీ సంస్థలు నిబంధనలకు లోబడి ‘గ్రీన్ క్రాకర్స్’ తయారీని ప్రారంభించాయి. అయినప్పటికీ పలుచోట్ల పాత పద్ధతిలోనే బాణసంచా తయారీ కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’ (ఎన్జీటీ) 2020లో సంప్రదాయ బాణసంచాపై పూర్తి నిషేధం విధించింది. బాణసంచా కాలుష్య ప్రమాణాలను ధ్రువీకరించే లాబొరేటరీ ఇదివరకు నాగపూర్లో ఉండేది. శివకాశిలో తయారయ్యే బాణసంచా నమూనాలను అక్కడకు పంపేవారు. అక్కడి నుంచి ధ్రువీకరణ లభించాక మార్కెట్లోకి విడుదల చేసేవారు. శివకాశిలోనే బాణసంచా ప్రమాణాలను పరిశీలించి, ధ్రువీకరించేందుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (నీరి) ఉమ్మడిగా ‘సీఎస్ఐఆర్–నీరి’ లాబొరేటరీని 2019 ఆగస్టులో రూ.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఈ లాబొరేటరీ శివకాశిలో తయారయ్యే బాణసంచా నమూనాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, సత్వరమే ధ్రువీకరిస్తోంది.బాణసంచాతో ఆరోగ్య సమస్యలుబాణసంచా కాల్చడం వల్ల ఎక్కువగా చిన్నారులలో, వృద్ధులలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారితో పాటు ఇదివరకే ఉబ్బసం తదితర శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి, గర్భిణులకు, అలెర్జీలతో బాధపడేవారికి ఆరోగ్య సమస్యలు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. బాణసంచా కాల్పుల్లో వెలువడే పొగలో అత్యంత సూక్షా్మతి సూక్ష్మమైన (పీఎం2.5) పరిమాణంలోని రసాయనిక కణాలు ఊపిరితిత్తుల్లోకి చొరబడి శ్వాసనాళం వాపు, విపరీతమైన దగ్గు, ఉబ్బసం, బ్రోంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు తలెత్తుతాయి. ఈ సూక్ష్మ రసాయనిక కణాలు రక్తంలోకి చేరితే అధిక రక్తపోటు, గుండెజబ్బులు, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, వాటి మంటలు అంటుకుని, కాలిన గాయాలు, పేలుళ్ల శబ్దతీవ్రతకు చెవుల వినికిడి శక్తి దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బాణసంచా వెలుగులు, రంగులు ఆహ్లాదాన్ని ఇచ్చినా, తగిన జాగ్రత్తలతో కాల్చితేనే పండుగ ఆనందభరితంగా ఉంటుంది.జైనులకు, సిక్కులకు పర్వదినందీపావళి హిందువులకు మాత్రమే కాదు జైనులకు, సిక్కులకు కూడా పర్వదినం. జైనుల ఇరవైనాలుగో తీర్థంకరుడైన మహావీరుడు ఇదేరోజున నిర్యాణం పొందాడు. అందువల్ల దీపావళి రోజున జైనులు తమ మందిరాలను దీపాలతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. జైన పండితుడు ఆచార్య జినసేన క్రీస్తుశకం 705లో రచించిన ‘హరివంశపురాణం’లో దీపావళిని ‘దీపాలికాయ’ అనే పేరుతో ప్రస్తావించాడు. మహావీరుడు నిర్యాణం చెందిన ఈ రోజున దీపాలను వెలిగించే సంప్రదాయాన్ని జైనులు తప్పనిసరిగా పాటిస్తారు. దీపావళి మరునాడు కార్తీక శుక్ల పాడ్యమి నుంచి జైనులకు కొత్త సంవత్సరం మొదలవుతుంది.సిక్కులు దీపావళిని ‘బందీ ఛోడ్ దివస్’గా జరుపుకొంటారు. సిక్కుల ఆరో గురువు హరగోబింద్, తన 52 మంది అనుచరులతో కలసి ఖైదు నుంచి విడుదలైన రోజు కావడంతో సిక్కులు దీపావళిని ఖైదు విమోచన దినంగా జరుపుకొంటారు. హరగోబింద్ను నాటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ గ్వాలియర్ కోటలో బంధించాడు. తర్వాత 1619 సంతవ్సరం దీపావళి రోజున ఆ చెర నుంచి విడుదల చేశాడు. సిక్కులు దీపావళి రోజున గురుద్వారాలలో దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. బంధు మిత్రులతో కలసి విందు వినోదాలు జరుపుకొంటారు. రాత్రివేళ బాణసంచా కాలుస్తూ సందడి చేస్తారు.దీపావళి ముమ్మతాల పండుగదీపావళి జగమంతా వేడుకదీప ప్రశస్తిదీపం చీకటిని తరిమికొట్టి వెలుగును వెదజల్లుతుంది. దీపాన్ని జ్ఞానానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి ప్రతీకగా భావిస్తారు. దీపాన్ని లక్ష్మీస్వరూపంగా ఆరాధిస్తారు. దీప ప్రశస్తిని తెలిపే పురాణగాథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది దేవేంద్రుడు దుర్వాసుడి ఆగ్రహానికి గురికావడం వల్ల తన రాజ్యాన్ని, సంపదలను పోగొట్టుకున్న ఉదంతం. దుర్వాసుడు ఒకసారి స్వర్గానికి వెళ్లాడు. దేవేంద్రుడు అతడికి స్వాగత సత్కారాలు చేసి, చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. ఇంద్రుడి ఆతిథ్యానికి దుర్వాసుడు తృప్తిచెందాడు. స్వర్గం నుంచి తిరిగి బయలుదేరే ముందు ఇంద్రుడికి కానుకగా ఒక హారాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు ఆ హారాన్ని నిర్లక్ష్యంగా అందుకుని, తన పట్టపుటేనుగు ఐరావతానికి అందించాడు. ఐరావతం ఆ హారాన్ని నేలపై పడేసి, కాళ్లతో తొక్కి చిందరవందర చేసింది. ఈ దృశ్యం చూసి ఆగ్రహించిన దుర్వాసుడు ఇంద్రుడిని శపించాడు. ఫలితంగా ఇంద్రుడు తన స్వర్గాన్ని, సిరిసంపదలను కోల్పోయాడు. సర్వం కోల్పోవడంతో ఇంద్రుడు దిక్కుతోచక శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు. శ్రీమహావిష్ణువు ఒక దీపాన్ని వెలిగించి, ఇంద్రుడి చేతికి ఇచ్చాడు. ఆ దీపాన్ని మహాలక్ష్మీదేవిగా తలచి, పూజించమన్నాడు. దేవేంద్రుడు ఆ దీపాన్ని పూజించాడు. మహాలక్ష్మి అనుగ్రహం పొంది; తిరిగి స్వర్గాధిపత్యాన్ని, కోల్పోయిన సమస్త సంపదలను పొందాడు. ఈ పురాణ గాథ నేపథ్యంలోనే దీపావళి రోజున దీపాలు వెలిగించి, మహాలక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయంగా వస్తోంది. దీపావళి తర్వాత వచ్చే కార్తీక మాసమంతా దీపారాధన చేయడం కూడా సంప్రదాయంగా వస్తోంది. దీపదానం చేయడం వల్ల నరకబాధ తప్పుతుందని కొందరు నమ్ముతారు.దేశదేశాల్లో దీపావళిదీపావళి వేడుకలు భారత్తో పాటు భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే వివిధ దేశాల్లో ఘనంగా జరుగుతాయి. దాదాపు ఇరవై దేశాలలో దీపావళి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. హిందువులు ఎక్కువగా నివసించే నేపాల్, శ్రీలంక, మారిషస్ దేశాలతో పాటు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సురినేమ్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియా, మలేసియా, థాయ్లాండ్, మయాన్మార్, ఫిజి, గయానా తదితర దేశాల్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతాయి. నేపాల్లో దీపావళి సందర్భంగా ‘తీహార్’ వేడుకలను ఐదురోజుల పాటు జరుపుకొంటారు. ఈ సందర్భంగా విందు వినోదాలు; బాణసంచా సంబరాలు జరుపుకోవడంతో పాటు కాకులు, శునకాలు, గోవులను పూజించి, వాటికి ప్రత్యేకంగా ఆహారం పెడతారు. సింగపూర్లోని లిటిల్ ఇండియా ప్రాంతంలో దీపావళి వేడుకలు దేదీప్యమానంగా జరుగుతాయి. దీపావళి పండుగను ఫిజి, గయానా, మలేసియా, మారిషస్, మయాన్మార్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, సురినేమ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు అధికారిక సెలవుదినంగా పాటిస్తున్నాయి. అమెరికాలో కూడా దీపావళిని జాతీయ సెలవు దినంగా ప్రకటించే దిశగా అక్కడ స్థిరపడ్డ భారత సంతతి ప్రజలు అమెరికన్ ప్రభుత్వంపై కొన్నేళ్లుగా ఒత్తిడి తెస్తున్నారు. అమెరికాలో దీపావళి అధికారికంగా జాతీయ సెలవుదినం కాకున్నా, పెన్సిల్వేనియా వంటి కొన్ని రాష్ట్రాలు దీపావళిని సెలవు దినంగా పాటిస్తున్నాయి. కొన్నేళ్లుగా దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్ష నివాసమైన వైట్హౌస్లో వేడుకలు జరుపుతున్నారు. అలాగే బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో కూడా కొన్నేళ్లుగా దీపావళి వేడుకలు జరుపుతూ వస్తున్నారు.

కృష్ణుడిగా సత్యభామ
‘ఒక మహిళ పురుషుడి పాత్రలో మెప్పించడం చాలా కష్టం’ అంటారు సురభి కళాకారిణి 60 ఏళ్ల పద్మజా వర్మ. ఇప్పటి వరకు కృష్ణుడి పాత్రలో వేదికలపైన 3000కు పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చిన పద్మజా వర్మ సత్యభామగానూ మెప్పించారు. ప్రత్యేక పురస్కారాలనూ అందుకున్నారు. నేడు నరకచతుర్దశి సందర్భంగా కృష్ణుడి పాత్రలో జీవించిన పద్మజా వర్మ సాక్షి ఫ్యామిలీతో పంచుకున్న విశేషాలు ...సురభి పద్మజ వర్మకు దాదాపు 60 ఏళ్ల నాటక రంగ అనుభవం ఉంది. కృష్ణుడి పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తూ, కుటుంబ పోషణలో భాగమయ్యింది. గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా, కోడలిగా కుటుంబ జీవనంలోని సర్దుబాట్లను, తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న విధానాన్ని మన ముందుంచారు. మగవారి మధ్యలో ఒక్కదాన్నే మహిళను ‘‘మగవేషాలంటే చాలా ఠీవిగా నిలబడాలి. హుందాగా కనిపించాలి. కిరీటం పెట్టుకొని వేసే వేషం ఏదైనా కష్టమే. అందులోనూ మహిళ పురుషుడి వేషం వేయడం పెద్ద సవాల్. ఆ సమయంలో స్టేజీపైన చుట్టూతా మగవారే. కృష్ణుడి వేషంలో నేనొక్కదాన్నే మహిళను. నటనలో ఎటువంటి జంకు కనిపించకూడదు. గొంతులో తత్తరపాటు ఉండకూడదు. కిరీటం పక్కకు జరగకూడదు, ఫ్లూట్ పట్టుకోవడంలో నేర్పు ఉండాలి. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ రెండున్నర గంటల పాటు సీనును రక్తికట్టించాలి. అదో పెద్ద టాస్క్.బాల్యం నుంచీ... మూడు నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడే మా అమ్మానాన్నలు నన్ను వేదికమీదకు తీసుకెళ్లారు. శ్రీకృష్ణ లీలల్లో భాగంగా బాల కృష్ణుడి పాత్రలను ప్రదర్శించాను. మాకు చదువు అయినా, నటన అయినా కళారంగమే. పన్నెండేళ్ల తర్వాత మాయాబజార్లో శశిరేఖగా వేషాలు వేశాను. శశిరేఖగా ప్రదర్శనలో పాల్గొన్నప్పడు నా పాత్ర పూర్తయ్యాక ఒక వైపు కూర్చొని ఆ నాటక ప్రదర్శన మొత్తం చూసేదాన్ని. శశిరేఖ పాత్ర టీనేజ్ వరకే. ఆ వయసు దాటితే ఆ పాత్ర మరొకరికి ఇచ్చేస్తారు. నాకూ కొంత వయసు వచ్చాక శశిరేఖ బదులు రుక్మిణి, సత్యభామ.. ఇలా మహిళా ప్రాధాన్యత గల వేషాలే ఇచ్చారు.సత్యభామ.. మీరజాలగలరా..!కృష్ణుడి పాత్రకు దీటుగా ఉండేది సత్యభామ పాత్రే. సత్యభామ గా నటించేటప్పుడు ఆ పాత్రకు ఉన్న హావభావాలన్నీ ముఖంలో పలికించాలి. ‘మీర జాల గలడా నా యానతి... ’ అనే పాటలో నవరసాలు ఒలికించాలి. స్త్రీ పాత్రల్లోనూ మెప్పిస్తూ .. ఒక్కో దశ దాటుతున్న కొద్దీ మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలు మారిపోతుండటం గమనించాను.సందేహాలను జయిస్తూ... కృష్ణుడిగా మెప్పిస్తూ!ఇలాగే ఉంటే కళారంగంలో నా ప్రాధాన్యత ఏముంటుంది అని నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని. ‘పురుష పాత్రలు అయితేనే మార్పు లేకుండా ఎప్పటికీ వేయచ్చు, ఎలాగా...’ అని ఆలోచించేదాన్ని. పెళ్లయ్యాక మా మామగారి సొంత నాటక కంపెనీలోనే రకరకాల మహిళా ప్రాధాన్యమున్న పాత్రలు వేశాను. ఒకరోజు కృష్ణ వేషధారి ఆరోగ్యం బాగోలేక రాలేదు. ప్రదర్శన ఉంది. ఎలా అని ఆందోళన పడుతున్న సమయంలో ‘నేను కృష్ణుడిగా వేస్తాను’ అని మా మామగారికి ధైర్యం చెప్పాను. అలా మాయాబజార్లో కృష్ణుడిగా నటించాను. అయితే, పురుషుడిలా డ్రెస్ అవ్వడం.. మామూలు విషయం కాదని ఆ రోజే తెలిసింది. కంస వధ నాటకంలో మాత్రం కొంత టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, కంస పాత్రధారి మా మామగారే. కంసుని వధించేటప్పుడు బాహాబాహి తలపడటం, గుండెల మీద కొట్టడం.. వంటివి ఉంటాయి. కానీ, నటనలో రిలేషన్ కాదు ప్రతిభనే చూపాలనుకున్నాను. అక్కణ్ణుంచి ఇక నేనే కృష్ణుడిని. అలా నేటివరకు 3000కు పైగా కృష్ణుడి పాత్రలు వేసిన ఘనత నాకు దక్కింది. నాటకాన్ని చూసిన ప్రేక్షకులు స్వయంగా కలిసి, వారి అభిమానాన్ని తెలుపుతూ ఉంటారు. సాధారణ చీరలో నన్ను చూసినవారు ‘మీరేనా కృష్ణుడు’ అని ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే, అలంకరణలో వేదికపైన కృష్ణుడిలా మరో కొత్త జన్మ ఎత్తినట్టుగా ఉంటుంది. అప్పట్లో భయపడి కృష్ణుడి పాత్రను వదిలేసి ఉంటే.. నాటకరంగంలో నా ప్రత్యేకత అంటూ ఏమీ ఉండేది కాదు. నాకు ఈ యేడాది 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల మా పిల్లలిద్దరూ జీవితాల్లో బాగానే స్థిరపడ్డారు. ఇక నాకు బాధ్యతలేం లేవు కాబట్టి నా చివరిశ్వాస వరకు కృష్ణుడిలా నాటకరంగంలో మెప్పిస్తూనే ఉంటాను’’ అని వివరించారు కృష్ణ పాత్ర ధారి పద్మజావర్మ.– నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

చెడును నరికేసి... మంచిని వెలిగించి!
ఏదైనా శుభసంఘటన జరిగినప్పుడు కాని, ఎవరైనా మహానుభావులు పుట్టినప్పుడు కాని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. కాని, ఈ సందర్భంలో ఒకరు చనిపోతే అతడి పేరు మీద పండగ చేసుకోవటం జరుగుతోంది. అతడి చావు ఎందుకంతగా సంతోషప్రదమయిందంటే.... నరకుడు అజ్ఞానానికి, పీడనకు, హింసకు ప్రతీక. నరకం అంటే దుర్గతి. అది కలవాడు నరకుడు. అంటే చెడు నడత కలవాడు. ఆ చెడు తన కుమారునిలో ఉందన్న కారణంగానే అతడి సంహారానికి కారణమయింది తల్లి సత్యభామ. తనలా మరే తల్లీ ఎవరి గర్భశోకానికీ కారణం కాకూడదన్న కోరికతో తన కుమారుడి పేరు శాశ్వతంగా నిలిచి పోయేలా వరం కోరుకుంది. అందుకే శ్రీకృష్ణుడు అతడి పేరు మీదుగానే భవిష్యతులో అందరూ ‘నరక చతుర్దశి’ జరుపుకుంటారని వరమిచ్చాడు.హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వల్ల భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. నరకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలో పడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. ఎందుకంటే స్వయానా తన తల్లే తనను చంపదని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను చేసిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేసాయి. నరకుడు విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు.దేవమాత అదితి కుండలాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీ కృష్ణుడు ఇతనిని ద్వంద్వ యుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేసాడు. మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూవారనే విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం వాడికో వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగలేదు. చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ రాక్షసాధముని దురంతం పరాకాష్టనందుకుంది. ఇంద్రుడు ఆపదరక్షకుడైన శ్రీ కృష్ణుని శరణు వేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపుబాణానికి శ్రీ కృష్ణుడు ఒక క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి నరకుణ్ణి నిలువరించింది. ఆ తర్వాత కృష్ణుడు తేరుకుని సుదర్శన చక్రం ప్రయోగించి అతడిని సంహరించాడు. అలా ఆశ్వీయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసురుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి వల్లనే సంభవించింది.తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదించాడు శ్రీ కృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారు వేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధర్మం సుప్రతిష్టమైంది.ఈ రోజు ఏం చేయాలి?ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణ చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభిముఖంగా ‘యమాయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం. యముని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం.నరక చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారు చేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పెద్దలు నమ్ముతారు. నరకచతుర్దశి మరునాడే దీపావళి. రావణుడు... మా ఊరి అల్లుడు!దీపావళి అంటేనే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అయితే రాజస్థాన్లోని జోద్పూర్కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మండోల్లో దీపావళి రోజు దీపాలు వెలిగించడం, బాణసంచ కాల్చడం ఉండదు. నిశ్శబ్దాన్ని పాటిస్తారు. కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే స్థానిక పురాణం తెలుసుకోవాల్సిందే. దీని ప్రకారం... రావణుడి భార్య మండోదరి జన్మస్థలం మండేరే. రావణుడు మండోదరిని ఈ గ్రామంలోనే వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. మండేరేకి చెందిన మౌద్గిల్ బ్రాహ్మణులు తమను తాము మండోదరి కుటుంబ వారసులుగా భావిస్తారు. అందువల్ల వారు రావణుడిని రాక్షస రాజుగా కాకుండా గౌరవనీయమైన బంధువుగా చూస్తారు!చీకటి దీపావళి!దీపావళి వేడుకల తర్వాత హిమాచల్ప్రదేశ్లో బుద్ది దీపావళి(చీకటి దీపావళి లేదా పాత దీపావళి) జరుపుకుంటారు. దీపావళి తర్వాత మొదటి అమావాస్య రోజు బుద్ది దీపావళి వేడుకలు మొదలవుతాయి. రాముడి రాక వార్త ఒక నెల తర్వాత మాత్రమే హిమాచల్ప్రదేశ్కు చేరిందట. అందుకే ఆలస్యంగా పండగ జరుపుకునే సంప్రదాయం మొదలైంది అంటారు.దేవరి రాత్రిఛత్తీస్ఘడ్లోని గోండు తెగలు దీపావళిని ‘దేవరి’గా జరుపుకుంటాయి. దేవరి రాత్రి గ్రామంలోని మహిళలు తలలపై ఒక కుండలో నూనె దీపాన్ని వెలిగించి శ్రావ్యంగా పాటలు పాడుతూ, ప్రతి ఇంటి తలుపు తడుతూ తమతో చేరాలని ఆ ఇంటి మహిళలను అభ్యర్థిస్తారు. బియ్యపు పిండితో చేసిన దీపాలను ప్రతి ఇంటి ముందు ఉంచుతారు.ఆవులను తమపై నడిపించి...మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని బిదావాద్ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. దీపావళి రోజు తరువాత నేలపై పడుకొని ఆవులను తమపై నడిపించుకుంటారు. 33 కోట్ల దేవుళ్లు, దేవతలు ఆవులో కొలువై ఉన్నారని, వాటిని తమపై నడిపించుకోవడం ద్వారా దేవతల ఆశీర్వాదం దొరుకుతుందనేది భక్తుల నమ్మకం.భర్త కోసం రాత్రంతా దీపాలు...మహారాష్ట్రలో దీపావళి వేడుకలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన జానపద కథ ప్రచారంలో ఉంది. వివాహం జరిగిన నాలుగు రోజుల తరువాత చనిపోతాడని యువ రాజుకు శాపం. విషయం తెలిసిన వధువు తన భర్త ప్రాణాలు రక్షించుకోవడం కోసం రాత్రంతా అవిశ్రాంతంగా దీపాలు వెలిగిస్తూనే ఉంటుంది. ఆమె ప్రయత్నాల వల్ల భర్త బతుకుతాడు.శ్రీవిష్ణువు భూలోకానికి...గుజరాత్లో దీపావళి రోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అనేది తరతరాలుగా వస్తోంది. మహాలక్ష్మీదేవి భర్త విష్ణువు భూలోకానికి వచ్చిన గుర్తుగా మధ్యప్రదేశ్లో దీపావళి జరుపుకుంటారు. కోల్కత్తాలో దీపావళికి కాళీపూజ చేస్తారు.సోదర, సోదరీమణులు...మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో దీపావళి అనేది సోదర, సోదరీమణుల అనుబంధానికి ముడి పడి ఉన్న పండగగా జరుపుకుంటారు. దీపావళి తర్వాత రోజు జరుపుకునే ఈ పండగను ‘యమ–ద్విత్య’ అని పిలుస్తారు. యమున తన సోదరుడు, మృత్యుదేవుడు యముడికి ఆతిథ్యం ఇచ్చిన రోజు ఇదే అని పురాణ కథలు చెబుతాయి.లక్ష దీపాల ఆగ్రా కోటఅక్బర్ చక్రవర్తి పాలనలో దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకునేవారు. ఈ సంప్రదాయాన్ని ‘జష్నే చిరాఘన్’ అని పిలిచేవారు. లక్షలాది దీపాలతో ఆగ్రా కోట వెలిగిపోయేది. కోట ముందు ఉన్న మైదానంలో బాణసంచా కాల్చేవారు. – డి.వి.ఆర్.
ఫొటోలు


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 19-26)


'కె- ర్యాంప్' థాంక్స్ మీట్లో సందడిగా చిత్ర యూనిట్ (ఫోటోలు)


దీపావళి వచ్చేసింది..అందాల భామ రకుల్ ‘పటాకా’ లుక్ (ఫోటోలు)


హీరో సుహాస్ కొడుకు బారసాల ఫంక్షన్ (ఫోటోలు)


ఈ అక్కాచెల్లెళ్లు కలిశారంటే.. ప్రపంచంతో పనే లేదు! (ఫోటోలు)


యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న పీవీ సింధు దంపతులు (ఫొటోలు)


దివాలీ నైట్ పార్టీలో నమ్రతా శిరోద్కర్ (ఫోటోలు)


యాంకర్ లాస్య గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా రోజా (ఫోటోలు)


ఎల్లె ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2025..సందడి చేసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)


దీపావళి సెలవులు.. కూకట్పల్లి కిటకిట (ఫొటోలు)
అంతర్జాతీయం

ఢాకా ఎయిర్పోర్ట్లో భారీ అగ్ని ప్రమాదం
బంగ్లాదేశ్లోని ఢాకా ఎయిర్పోర్ట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆకస్మికంగా మంటలు ఎగిసి పడ్డాయి. దాంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది, ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. ఢాకాలోని హజ్రాత్ షాహ్జలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం గం. 2. 15 ని.ల ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. దాంతో పొగ దావానలంలా వ్యాపించింది. కిలో మీటర్ల మేర పొగ కమ్మేయడంతో విమానాల రాకపోకలను ఉన్నపళంగా నిలిపివేశారు. అంతర్జాతీయ గూడ్స్ వస్తువులు ఉంచే కార్గో ఏరియా గేట్ నంబర్ 8 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్లో ఉన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం ఇది. ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.VIDEO | Dhaka, Bangladesh: A fire broke out at a section of the Cargo Village of Hazrat Shahjalal International Airport this afternoon. More details awaited.#Dhaka #AirportFire #HazratShahjalal(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/flGkHso2xq— Press Trust of India (@PTI_News) October 18, 2025ఇదీ చదవండి:Air China: విమానంలో కలకలం.. గాల్లో ఉండగానే మంటలు

‘ఆధార్’ నమూనాతో ‘బ్రిట్ కార్డ్’.. యూకే ప్రధాని స్టార్మర్ వెల్లడి
లండన్: ఇటీవలే భారత్లోని ముంబైలో పర్యటించిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇక్కడి ఆధార్ డిజిటల్ బయోమెట్రిక్ ఐడీ వ్యవస్థను భారీ విజయంగా అభివర్ణించారు. యూకే రూపొందిస్తున్న ప్రణాళికాబద్ధ డిజిటల్ గుర్తింపు కార్యక్రమం ‘బ్రిట్ కార్డ్’కు దీనిని ఒక నమూనాగా పరిగణిస్తున్నామన్నారు.ఆధార్ కార్డు ప్రజా సంక్షేమం, సేవలకు బయోమెట్రిక్ డేటాను ఉపయోగిస్తుండగా, యూకే పథకం మరోలా ఉపయుక్తం కానుంది. అక్రమ వలసలను అరికట్టే దిశగా యూకే ‘బ్రిట్ కార్డ్’ను తీసుకురానుంది. అయితే దీనిపై యూకేలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తన రెండు రోజుల ముంబై పర్యటనలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ రూపకల్పనలో సహకారం అందించిన నందన్ నీలేకనితో పాటు పలువురితో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా భారతదేశంలో అమలవుతున్న డిజిటల్ ఐడీ కార్యక్రమం అమలు, ప్రభావంపై చర్చించారు. 15 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆధార్.. దేశంలోని ప్రజలందరికీ కీలకమైన గుర్తింపు కార్డుగా మారింది. బ్యాంకింగ్, సంక్షేమం తదితర సేవలకు ఆధారంగా మారింది. ఈ వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థకు పరిపాలనా ఖర్చులను ఆదా చేయడంలో కీలకంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఆదార్లోని లోతుపాతులపై చర్చించిన బ్రిటన్ ప్రధాని స్టార్మర్.. బ్రిట్ కార్డు దీనికి భిన్నమైన డిజైన్తో ఉంటుందని, బయోమెట్రిక్ డేటాను సేకరించదని తెలిపారని ‘ది గార్డియన్’ పేర్కొంది. కాగా బ్రిట్ కార్డ్ కోసం యూకే ప్రభుత్వం ఇంకా ఏ ప్రైవేట్ టెక్నాలజీ ప్రొవైడర్లతోనూ భాగస్వామ్యం కాలేదని సమాచారం. బ్రిట్ కార్డు ప్రజల గోప్యతకు భంగం కలిగిస్తుందని ప్రతిపక్ష పార్టీలు, కొందరు లేబర్ పార్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తూచ్ అదంతా ఉత్తినే.. జెలెన్స్కీకి ట్రంప్ ఝలక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. రష్యాను బెదిరించినట్టే వార్నింగ్ ఇచ్చి.. వెంటనే యూటర్న్ తీసుకున్నారు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ఆపకపోతే జెలెన్స్కీకి అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను ఇస్తామని ప్రకటించిన ట్రంప్.. తాజాగా అలాంటిదేమీ లేదని చేతులెత్తేశారు. దీంతో, మరోసారి అందరి ముందూ నవ్వులపాలయ్యారు.ఇక, రష్యా చేత ఎలా అయినా యుద్ధం ఆపించాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు. ఇందు కోసం ఇప్పటికే పలు రకాల ప్లాన్స్ వేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో సైతం ట్రంప్ భేటీ అయ్యారు. కానీ, ఉక్రెయిన్పై రష్యా దాడులు మాత్రం ఆడగం లేదు. ఈ నేపథ్యంలో రష్యా బెదిరించేందుకు ట్రంప్ కొత్త ప్లాన్ చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపకపోతే తమ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను జెలెన్స్కీకి ఇవ్వాల్సి వస్తుందని రష్యాను బెదిరించారు. ఇలా అయినా పుతిన్కు దారికి తెచ్చేందుకు పైకి గంభీరంగా ప్రకటన చేశారు.🇺🇸🇺🇦 US President Trump has rejected Ukrainian President Zelensky’s request for more tomahawk missiles in a “tense” White House meeting today. @europa pic.twitter.com/O5OVZFOjA7— EUROPA (@europa) October 18, 2025అయితే, తాజాగా ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఓవల్ ఆఫీసులో అధ్యక్షుడు ట్రంప్ను జెలెన్స్కీ కలిశారు. ఈ సందర్బంగా తోమహాక్ క్షిపణులపై చర్చించారు. తమకు క్షిపణులను ఇవ్వాలని అందుకు బదులుగా తాము డ్రోన్లను ఇస్తామని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. కానీ, ట్రంప్ మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఊహించని షాక్ ఇచ్చారు. తోమహక్ క్షిపణులను ఇప్పుడు ఇవ్వలేనని ట్రంప్ తెగేసి చెప్పేశారు. తాజా పరిస్థితుల్లో అమెరికా నిల్వలను తగ్గించలేనని.. వాటిని సరి చూసుకోవాలని తెలిపారు. దాని కన్నా ముఖ్యంగా తనకు యుద్ధం ముగించడమే అత్యంత ముఖ్యమని తెలిపారు.Again, Zelensky had a bath with cold water. He expected to get the Tomahawk cruise missiles to counter attacks on Russia. But Kerlmin already made a deal with President Trump. Mr. Putin is trying to delay the peace process because he doesn’t want to lose his power.— Rudra Raya (@RudraRaya) October 18, 2025 ఈ సందర్బంగా రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు తాను క్షిపణులను ఇవ్వలేనని చేతులెత్తేశారు. అయితే.. తోమహాక్ క్షిపణులు తమ దగ్గర ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలను సీరియస్గా తీసుకునేలా చేయవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు. మరోవైపు, బుడాపెస్ట్లో సమావేశం తర్వాత క్షిపణుల గురించి ఆలోచిస్తానని ట్రంప్ దానికి బదులు చెప్పారని వైట్హౌస్ అధికారులు చెబుతున్నారు. కాగా, ట్రంప్ తోమహాక్ క్షిపణుల నిరాకరణ వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక ఉందని తెలుస్తోంది. ఉక్రెయిన్కు క్షిపణులను ఇస్తే అమెరికా-రష్యా సంబంధాలకు హాని కలుగుతుందని, దాని వలన యుద్ధం మరింత సీరియస్ అవుతుందే తప్ప ఏం ఉపయోగం లేదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.

పాకిస్తాన్ సైన్యం అరాచకం.. తాలిబన్ నేత సీరియస్ వార్నింగ్
కాబూల్: దాయది దేశం పాకిస్తాన్(pakistan), ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు జరిగిన తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. డ్యూరాండ్ లైన్ వెంట వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడుల కారణంగా పదుల సంఖ్యలో ఆప్ఘన్ పౌరులు మృతి చెందినట్టు తెలిసింది. వారిలో ముగ్గురు ఆప్ఘన్ క్రికెటర్లు కూడా ఉన్నారు.పాక్ సైన్యం ఆప్ఘనిస్థాన్లోని మూడు రాష్ట్రాల్లో జనావాసాలే లక్ష్యంగా వైమానిక దాడులకు పాల్పడింది. ఇరుదేశాలు 48 గంటల కాల్పుల విరమణను పొడిగించడానికి పరస్పరం అంగీకరించిన కొన్ని గంటల తర్వాత పాక్ సైన్యం ఓవరాక్షన్కు దిగింది. డ్యూరాండ్ లైన్ (Durand Line) వెంబడి ఉన్న పక్తికా (Paktika) ప్రావిన్స్లోని అర్గున్, బెర్మల్ జిల్లాలలో పలు ఇళ్లపై మూడు ప్రాంతాల్లో బాంబు దాడి చేసింది. పాక్ దాడుల కారణంగా ముగ్గరు ఆప్ఘన్ క్రికెటర్లతో పాటుగా మరో 10 మంది పౌరులు మృతిచెందినట్టు సమాచారం.మరోవైపు.. పాక్ చర్యలపై తాలిబాన్ సీనియర్ నేత ఒకరు స్పందిస్తూ.. మూడు జిల్లాలపై పాక్ సైన్యం గగనతల దాడులకు తెగబడింది. పాక్ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించుకునేందుకు, రెండు దేశాల నాయకులు శనివారం ఖతార్, దోహాలో సమావేశం కానున్నారు. ఇప్పటికే పాక్ ప్రతినిధులు దోహా చేరుకున్నారు, ఆప్ఘనిస్థాన్ నుంచి ఇంకా బయల్దేరాల్సి ఉంది. అయితే, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందే ఉల్లంఘించడం గమనార్హం.
జాతీయం

2028 నాటికి దేశీయ 7 నానోమీటర్ చిప్ సిద్ధం
న్యూఢిల్లీ: కంప్యూటర్ చిప్లను దేశీయంగానే అభివృద్ధి చేసుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో డిజైన్ చేస్తున్న మొట్టమొదటి 7 నానోమీటర్ కంప్యూటర్ చిప్ ‘శక్తి’2028 నాటికి సిద్ధమవుతుందని ఐఐటీ–మద్రాసు బృందం శనివారం అశ్వినీ వైష్ణవ్కు తెలియజేసింది. ఈ మేరకు ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. స్థానికంగా అభివృద్ధి చేయనున్న చిప్ ప్లాంట్లోనే ఈ నానోమీటర్ చిప్ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలియజేశారు. ఐటీ సర్వర్లలో ఉపయోగించే నానో చిప్లను దేశీయంగానే తయారు చేసుకోవడానికి చర్యలు చేపట్టామని ఉద్ఘాటించారు. ఈ మేరకు ఐఐటీ–మద్రాసు బృందానికి అనుమతి ఇచి్చనట్లు పేర్కొన్నారు. ఆర్థిక, సమాచార, రక్షణ వంటి కీలక రంగాల్లో నానో చిప్ల ప్రాధాన్యత నానాటికీ పెరుగుతోందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, సర్వర్లలో 3 నుంచి 7 నానోమీటర్ల చిప్లను ఉపయోగిస్తున్నారు. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దేశీయంగానే ఉత్పత్తి చేసుకుంటే దిగుమతుల భారం తగ్గుతుందని ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది.

మొజాంబిక్ తీరంలో పడవ ప్రమాదం..
కొచ్చి: మొజాంబిక్లో బెయిరా తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు చనిపోగా ఒకరు గాయపడ్డారు. ఈ ఘటనలో మరో ఐదుగురిని సిబ్బంది కాపాడారని అక్కడి భారత దౌత్య కార్యాలయం తెలిపింది. గురువారం సముద్రంలో నిలిపి ఉన్న ఓడలో మెయింటెన్స్ పనికోసం కొందరిని పడవలో పంపించారు. పడవ నుంచి ఓడను చేరుకునేందుకు ప్రయతి్నస్తుండగా తీవ్రమైన అలల తాకిడికి పడవ బోల్తా పడిందని భారత ఎంబసీ తెలిపింది. ఘటన సమయంలో పడవలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని వివరించింది. అయితే, ప్రమాద బాధితుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనలో గల్లంతైన వారిలో ఇద్దరు మలయాళీలు కూడా ఉన్నట్లు కేరళ ఎమ్మెల్యే అనూప్ జాకబ్ శనివారం తెలిపారు. వీరిలో ఒకరు ఎర్నాకులం జిల్లా పిరవోమ్కు చెందిన ఇంద్రజిత్(22) కాగా, మరొకరు కొల్లమ్కు చెందిన వ్యక్తి అని ఆయన వివరించారు.

పాక్లో ప్రతి అంగుళం ‘బ్రహ్మోస్’ పరిధిలోనే..
లక్నో: రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించారు. పాకిస్తాన్లో ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలోనే ఉందని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని అన్నారు. భారత్పై మరోసారి కయ్యానికి కాలుదువి్వతే అసలు సినిమా చూపించక తప్పదని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణుల శక్తిసామర్థ్యాలు ఏమిటో ప్రపంచం చూసిందన్నారు.యుద్ధంలో భారత్ విజయం సాధించడం యాదృచ్చికం కాదని, అదొక అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను రాజ్నాథ్ సింగ్ శనివారం సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నానాటికీ బలీయమైన స్వదేశీ శక్తిగా ఎదుగుతున్న భారత్కు ఈ క్షిపణులు ఒక ప్రతీక అని అభివరి్ణంచారు. బ్రహ్మోస్ అంటే కేవలం మిస్సైల్ కాదని, భారతదేశ వ్యూహాత్మక విశ్వాసానికి ఆధారమని చెప్పారు. త్రివిధ దళాలకు ఇదొక మూలస్తంభంగా మారిందన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్లో జరిగినదంతా ట్రైలర్ మాత్రమే. ఒక కొత్త పాకిస్తాన్ను భారత్ సృష్టించగలదని పాకిస్తాన్కు తెలిసొచ్చింది. కానీ, ‘సమయం వచ్చినప్పుడు’.. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా తెలివైనవాళ్లని నాకు తెలుసు. చెప్పకుండానే అర్థం చేసుకోగలరు’’ అని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి ఆపరేషన్ సిందూర్ భారతీయుల్లో నూతన విశ్వాసాన్ని నింపిందని రక్షణ శాఖ మంత్రి ఉద్ఘాటించారు. ఈ విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించడం మనందరి సమ్మిళిత బాధ్యత అని పిలుపునిచ్చారు. మన దేశ శక్తిని ప్రపంచమంతా గుర్తిస్తోందని, కలలను నెరవేర్చుకోగలమన్న విశ్వాసాన్ని బ్రహ్మోస్ క్షిపణులు మరింత బలోపేతం చేశాయని చెప్పారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మనకు అవసరమైన ఆయుధాలు, రక్షణ పరికరాలను మనమే తయారుచేసుకోవాలని సంకల్పించామని తెలిపారు. రక్షణ తయారీ రంగంలో పెరుగుతున్న మన విశ్వాసానికి, సామర్థ్యానికి బ్రహ్మోస్ మిస్సైల్స్ ఉత్పత్తి కేంద్రం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. లక్నో అంటే పార్లమెంట్ నియోజకవర్గం మాత్రమే కాదని, ఈ నగరం తన హృదయంలో ఉందని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాలతోపాటు ఆధునిక టెక్నాలజీ, పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మారిందని ఆనందం వ్యక్తంచేశారు. లక్నోలో బ్రహ్మోస్ క్షిపణు లు ఉత్పత్తి కావడం చూస్తే ఒకనాటి స్వప్నం నేడు నెరవేరినట్లు తేటతెల్లమవుతోందని ఉద్ఘాటించారు. సహనం, కఠోర శ్రమ, అంకితభావానికి ఈ ప్రాజెక్టును ఒక ప్రతీకగా భావించవచ్చని వివరించారు. ఇక్కడ ప్రతిఏటా దాదాపు 100 క్షిపణులను ఉత్పత్తి చేయొచ్చని, వందలాది మందికి ప్రత్యక్షంగా ఉపా ధి లభిస్తుందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ యూనిట్ టర్నోవర్ రూ.3,000 కోట్లకు చేరుతుందని, తద్వారా జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం వస్తుందన్నారు.బ్రహ్మాస్త్రమే → బ్రహ్మోస్ క్షిపణి సూపర్సానిక్ క్రూయిజ్ మిస్సైల్ రకానికి చెందినది. → దాదాపు 300 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. → పొడవు 8.4 మీటర్లు. వ్యాసం 0.6 మీటర్లు. బరువు 3 టన్నులు → భూ ఉపరితలంపైనుంచి ప్రయోగించే క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. నౌకలపైనుంచి ప్రయోగించి క్షిపణి పరిధి 450 కిలోమీటర్లు. ఈ పరిధిని 800 కిలోమీటర్లకు పెంచడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. → జీపీఎస్ రాడార్ గైడెన్స్ సిస్టమ్ ఆధారంగా దూసుకెళ్తుంది. → బ్రహ్మోస్ మిస్సైల్లో ఘన ఇంధన బూస్టర్, ద్రవ ఇంధనం క్రూయిజ్ దశ ఉంటాయి. → గంటకు 3,400 నుంచి 3,700 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. → భూఉపరితలంతోపాటు యుద్ధ విమానాల నుంచి, నౌకల నుంచి, జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. → 2005 నుంచి బ్రహ్మోస్ క్షిపణులు భారత సైన్యంలో సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలను, శిక్షణ కేంద్రాలను, పాక్ వైమానిక దళం ఎయిర్బేస్లను ధ్వంసం చేశాయి. ఆర్థిక రంగానికీ లబ్ధి దేశీయంగా బ్రహ్మోస్ క్షిపణుల తయారీతో మన రక్షణ రంగంతోపాటు ఆర్థిక రంగానికి సై తం ఎంతో లబ్ధి చేకూరుతుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టంచేశారు. రెండు దేశాలకు క్షిపణులు ఎగుమ తి చేయడానికి మన బ్రహ్మోస్ టీమ్ ఒప్పందాలు కుదుర్చుకుందని, వీటి విలువ రూ.4,000 కోట్లు అని వెల్లడించారు. శుభప్రదమైన ధన త్రయోదశి రోజే క్షిపణులను సైన్యానికి అప్పగిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. లక్ష్మీదేవి ఆశీస్సులు రక్ష ణ రంగంపై, ఆర్థిక రంగంపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ ఈ ఏడాది మే 11న ప్రారంభమైంది.

బెంగుళూరులో దారుణం.. సీసీ కెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు
బెంగుళూరు: ప్రమాదం ఏ రూపంలో ఎదురవుతుందో చెప్పలేం.. బెంగుళూరులో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపింది. గత నెల సెప్టెంబర్ 13న గణేష్ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాకు హాజరై తిరిగి వస్తుండగా.. ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి.. నగలు దోచుకున్నారు. నిందితులను ప్రవీణ్, యోగనందగా పోలీసులు గుర్తించారు. బైక్పై ఆ మహిళల వద్దకు వచ్చి వారి బంగారు గొలుసులను లాక్కోవడానికి ప్రయత్నించారు.భయపడిన ఉష తన గొలుసును వారికి ఇచ్చేసింది. కానీ మరొక మహిళ వరలక్ష్మి, ప్రతిఘటించింది. దీంతో యోగానంద ఆమెపై కత్తితో క్రూరంగా దాడి చేసి.. రెండు వేళ్లను నరికాడు. ఆ తర్వాత నిందితులు 55 గ్రాముల బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి పారిపోయారు. సెప్టెంబర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది.ఈ ఘటనపై పోలీసులు వారాల తరబడి దర్యాప్తు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితులను అరెస్టు చేసింది. వారు దొంగిలించిన బంగారాన్ని, దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన జరిగిన తర్వాత యోగనంద పుదుచ్చేరి, ముంబై, గోవా వంటి నగరాలకు పారిపోయి.. ఆ తర్వాత కర్ణాటకలోని తన సొంత గ్రామానికి తిరిగి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. అతనికి గతంలో నేర చరిత్ర ఉందని, ఒక హత్య కేసులో కూడా ప్రమేయం ఉందని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు వరలక్ష్మి ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు.On camera: Two men on a bike wielding machetes rob women in Bengaluru, chop off two fingers and snatch their gold chain. Arrested after a month, police have now recovered 74g of gold and the weapons.https://t.co/ymRnB0fF5t pic.twitter.com/ElKFdlFKH2— Deepak Bopanna (@dpkBopanna) October 18, 2025
ఎన్ఆర్ఐ

ఈబీ–5 వీసాతో అమెరికాలో స్థిరపడడం సులభం
సాక్షి, అమరావతి: అమెరికాలో స్థిరపడడానికి ఈబీ–5 ఇన్వెస్టర్ వీసా సులభ మార్గమని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఇల్యా ఫిష్కిన్ (Ilya Fishkin) అన్నారు. ఈబీ–5 ఇన్వెస్టర్ వీసా గురించిన అవగాహన సదస్సును న్యూయార్క్ ఇమ్మిగ్రేషన్ ఫండ్ గురువారం విజయవాడలో నిర్వహించింది. ఈ సందర్భంగా ఇల్యా ఫిష్కిన్ మాట్లాడుతూ.. అమెరికాలో అనేక మంది భారతీయుల గ్రీన్కార్డ్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వారు సకాలంలో గ్రీన్ కార్డ్ పొందలేకపోతే అమెరికా వీడి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.అలాంటి వారికి ఈబీ–5 ఇన్వెస్టర్ వీసా (EB-5 investor visa) అద్భుత అవకాశమని తెలిపారు. ఈబీ–5 వీసా పొందాలంటే దాదాపు రూ.9.32 కోట్లు(1.05 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందన్నారు. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రాజెక్టు పెడితే మాత్రం రూ.7.11 కోట్లు సరిపోతుందన్నారు. ఈబీ–5 ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పార్టనర్లు సుబ్బరాజు పేరిచర్ల, సంపన్న్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఈబీ–5 వీసా అమెరికాలో ఉన్న భారతీయులు శాశ్వత నివాస హక్కు పొందే అవకాశాన్ని కల్పిస్తుందన్నారు.చదవండి: అప్పుడు దివాళా.. ఇప్పుడు రోజుకు 25 లక్షల సంపాదన!

డాలస్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
డాలస్, టెక్సస్: డాలస్ ప్రాంతంలో ఇర్వింగ్ నగరంలో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద మహాత్మాగాంధీ 156 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జగద్విఖ్యాత క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్ అక్టోబర్ 2వ తేదీన వేకువ ఝామునే మహత్మా గాంధీ మెమోరియల్ ను సందర్శించి జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. సచిన్ వెంట ప్రసిద్ధ వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్, కమ్యూనిటీ నాయకుడు సల్మాన్ ఫర్షోరి విచ్చేశారు.మహత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర సచిన్ ను సాదరంగా ఆహ్వానించి, ఈ మెమోరియల్ స్థాపన వెనుక ఉన్న కార్యవర్గ సభ్యుల శ్రమ, వేలాది ప్రవాస భారతీయుల సమిష్టి కృషి, దాతల దాతృత్వం, అనుమతి ఇవ్వడంలో అధికారులు అందించిన సహకారంతో దశమ వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్న వైనాన్ని సోదాహరణంగా వివరించారు.సచిన్ మాట్లాడుతూ – “గాంధీజయంతి రోజున అమెరికాలో గాంధీస్మారక స్థలిని సందర్శించి నివాళులర్పించడం తన అదృష్టమని, మహాత్మాగాంధీ జీవితం ప్రపంచంలో ఉన్న మానవాళిఅంతటికీ నిత్య నూతన శాంతి సందేశం అన్నారు. ఎంతో ప్రశాంత వాతావరణంలో, సుందరంగా, పరిశుభ్రంగా గాంధీ స్మారకస్థలిని నిర్వహిస్తున్న గాంధీ మెమోరియల్ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మరియు కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు” అన్నారు.మహాత్మాగాంధీ 156 వ జయంతి సందర్భంగా శనివారం నిర్వహించిన “గాంధీ శాంతి నడక-2025” లో వందలాది ప్రవాస భారతీయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఉత్తరాధ్యక్షులు మహేంద్ర రావు అందరినీ ఆహ్వానించి సభను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కాన్సల్ జెనరల్ ఆఫ్ ఇండియా డిసి మంజునాథ్, ప్రత్యేక అతిథులుగా సన్నీవేల్ మేయర్ సాజీ జార్జి, ఫ్రిస్కో నగర కౌన్సిల్ సభ్యుడు బర్ట్ టాకూర్, ఆంధ్రప్రదేశ్ “హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ డా. దాసరి శ్రీనివాసులు, ఐ.ఎ.ఎస్ (రి) హాజరై జాతిపితకు పుష్పాంజలి ఘటించి మహాత్మాగాంధీ జీవితంలోని ఎన్నో ఘట్టాలను, ఆయన త్యాగ నిరతిని గుర్తుచేసుకున్నారు. మహాత్మాగాంధీ శాంతి సందేశానికి చిహ్నంగా 10 తెల్లటి కపోతాలను ఆహుతుల కేరింతల మధ్య అతిథులు, నాయకుల అందరూ కలసి ఆకాశంలోకి ఎగురవేసి అందరూ కలసి శాంతినడకలో పాల్గొన్నారు.ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ నాయకులు రాజీవ్ కామత్, మహేంద్ర రావు, బి.యెన్ రావు, జస్టిన్ వర్ఘీస్, షబ్నం మాడ్గిల్, దీపక్ కార్లా, డా. జెపి, ముర్తుజా, కలై, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్, మహాత్మాగాంధీ మెమోరియల్ నాయకులు డా. ప్రసాద్ తోటకూర, తైయాబ్ కుండావాలా, మురళి వెన్నం, రాంకీ చేబ్రోలు, వినోద్ ఉప్పు, అనంత్ మల్లవరపు, కమ్యూనిటీ నాయకులు చంద్ర పొట్టిపాటి, చినసత్యం వీర్నపు, లక్షి పాలేటి, సురేఖా కోయ, క్రాంతి ఉప్పు, చిన్ని మొదలైన వారు ఈ వేడుకలలో పాల్గొన్నారు.మురళి వెన్నం హాజరైన అతిథులకు, కార్యక్రమాన్ని విజయవంతంలో కృషి చేసిన కార్యకర్తలకు, వేడి వేడి అల్పాహారం అందించిన “ఇండియా టుడే కెఫే” అధినేత వినోద్ ఉప్పు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

భార్యాబిడ్డల్ని విమానం ఎక్కించి వచ్చాడో లేదో తీవ్ర గుండెపోటు, విషాదం
ఇటీవలి కాలంలో వరుస ఎన్ఆర్ఐల మరణాలు ఆందోళన రేపుతున్నాయి. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో తన భార్య , కుమారుడికి వీడ్కోలు పలికిన కొన్ని గంటలకే UAEలో ఒక భారతీయ ప్రవాస ఇంజనీర్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుడిని హరిరాజ్ సుదేవన్ (37) (Hariraj Sudevan) గుర్తించారు.కేరళలోని అలప్పు జిల్లాకు చెందిన 37 ఏళ్ల హరిరాజ్ సుదేవన్ హరిరాజ్ సుదేవన్ గత 12 ఏళ్లుగా యుఎఇలో నివసిస్తున్నాడు. అయితే తన భార్య డాక్టర్ అను అశోక్ , 10 ఏళ్ల కుమారుడు ఇషాన్ దేవ్ హరి కేరళ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారిని విమానాశ్రయంలో దింపిన కొన్ని గంటలకే అబుదాబిలో గుండెపోటుతో మరణించాడు. అల్లుడు అకాల మరణంపై మామ అశోకన్ కేపీ తీవ్ర విచారాన్ని ప్రకటించారు. ఆయన ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామనంటూ కంట తడిపెట్టారు.ఆదివారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే ముందు తన కుమార్తె , మనవడు హరిరాజ్తో 10 రోజులు గడిపారని, అక్టోబర్ 27న తన కొడుకు పుట్టినరోజుకు హాజరు కావడానికి హరిరాజ్ ఈ నెల చివర్లో రావాల్సి ఉందని గుర్తు చేసుకున్నారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన సుదేవన్, యుఎఇలో 12 సంవత్సరాలకు పైగా సీనియర్ ఆఫ్షోర్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కుసాట్ నుండి బి.టెక్ ,ఐఐటీ మద్రాస్ నుండి ఎంటెక్ పట్టా పొందారు. హరిరాజ్, అబుదాబిలో సీనియర్ పనిచేస్తున్నారు. అంత్యక్రియల కోసం ఆయన మృతదేహాన్ని కేరళకు తరలించారు. థామస్ కుమార్తె పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి మా ఇంటికి వచ్చారని, ఎంతో సంతోషంగా గడిపామని సన్నిహిత స్నేహితుడు డిజిన్ థామస్ తెలిపారు.

బ్రూనైలో వికసిత్ భారత్ పరుగు విజయవంతం
భారత రాయబార కార్యాలయం – బ్రూనై దారుస్సలాం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పరుగును తమన్ మహ్కోటా జుబ్లీ ఎమాస్, ECO కారిడార్, బందర్ సేరిబెగావాన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ సభ్యులు, భారతీయ ప్రవాసులు మరియు బ్రూనై పౌరులతో సహా 150 మందికిపైగా ఉత్సాహభరితంగా పాల్గొన్నారు.వికసిత్ భారత్ 2047(Viksit Bharat@2047)దిశగా భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తమ అంకితభావాన్ని ప్రకటిస్తూ, పాల్గొన్నవారు ఐక్యతతో పరుగెత్తారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశ అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, సంఘీభావం, దేశభక్తిని అద్భుతంగా ప్రతిబింబించింది.ఈ సందర్భంగా పాల్గొన్నవారిని ఉద్దేశించి భారత రాయబారి రాము అబ్బగాని అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు "దేశ అభివృద్ధి కోసం అవసరమైతే 16 గంటలపాటు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రూనై తెలుగు సంఘం సైతం సక్రియంగా పాల్గొనడం విశేషం. భారత జాతీయ కార్యక్రమాల పట్ల తమ అంకితభావాన్ని ,ప్రవాస భారతీయుల ఐక్యతను చాటిచెప్పారు.
క్రైమ్

బెంగుళూరులో దారుణం.. సీసీ కెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు
బెంగుళూరు: ప్రమాదం ఏ రూపంలో ఎదురవుతుందో చెప్పలేం.. బెంగుళూరులో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపింది. గత నెల సెప్టెంబర్ 13న గణేష్ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాకు హాజరై తిరిగి వస్తుండగా.. ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి.. నగలు దోచుకున్నారు. నిందితులను ప్రవీణ్, యోగనందగా పోలీసులు గుర్తించారు. బైక్పై ఆ మహిళల వద్దకు వచ్చి వారి బంగారు గొలుసులను లాక్కోవడానికి ప్రయత్నించారు.భయపడిన ఉష తన గొలుసును వారికి ఇచ్చేసింది. కానీ మరొక మహిళ వరలక్ష్మి, ప్రతిఘటించింది. దీంతో యోగానంద ఆమెపై కత్తితో క్రూరంగా దాడి చేసి.. రెండు వేళ్లను నరికాడు. ఆ తర్వాత నిందితులు 55 గ్రాముల బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి పారిపోయారు. సెప్టెంబర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది.ఈ ఘటనపై పోలీసులు వారాల తరబడి దర్యాప్తు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితులను అరెస్టు చేసింది. వారు దొంగిలించిన బంగారాన్ని, దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన జరిగిన తర్వాత యోగనంద పుదుచ్చేరి, ముంబై, గోవా వంటి నగరాలకు పారిపోయి.. ఆ తర్వాత కర్ణాటకలోని తన సొంత గ్రామానికి తిరిగి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. అతనికి గతంలో నేర చరిత్ర ఉందని, ఒక హత్య కేసులో కూడా ప్రమేయం ఉందని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు వరలక్ష్మి ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు.On camera: Two men on a bike wielding machetes rob women in Bengaluru, chop off two fingers and snatch their gold chain. Arrested after a month, police have now recovered 74g of gold and the weapons.https://t.co/ymRnB0fF5t pic.twitter.com/ElKFdlFKH2— Deepak Bopanna (@dpkBopanna) October 18, 2025

లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చే కుట్ర!
పట్నంబజారు/నెహ్రూనగర్(గుంటూరు): దసరా పండుగ నాడు... నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో జరిగిన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చేందుకు టీడీపీ పెద్దలు కుట్ర చేస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కేసును టీడీపీ నేతల ఒత్తిడితో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు... ప్రధాన నిందితుడు, టీడీపీ కార్యకర్త అయిన కాకర్ల హరిచంద్రప్రసాద్, అతడి తండ్రిని అరెస్టు చేశారని, కేసుకు సంబంధించిన వాస్తవాలను ఇప్పటికీ బయటపెట్టలేదని అంటున్నారు. మీడియాకు వివరాలు ఏమీ లేకుండా, నిందితులను అరెస్టు చేసినట్లు చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకొన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. లక్ష్మీనాయుడిని ఢీకొట్టిన కారులో హరిచంద్రప్రసాద్ నాయనమ్మ కాకర్ల నారాయణమ్మ, అతడి భార్య కూడా ఉన్నారని, వీరిద్దరూ అతడిని ప్రోత్సహించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీనాయుడు చనిపోయినట్లు నిర్ధారించుకున్న తరువాత వారు వెళ్లిపోయారని, వారిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చూపించలేదని వాపోతున్నారు. హరిచంద్రప్రసాద్కు పూర్తి సహకారం అందించిన పలువురు యువకుల పైనా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా టీడీపీ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసును నీరుగార్చేందుకు తెరవెనుక పెద్దఎత్తున పన్నాగం పన్నుతున్నారని అంటున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం...దారకానిపాడుకు చెందిన లక్ష్మీనాయుడు (25)ను టీడీపీ కార్యకర్త కాకర్ల హరిచంద్రప్రసాద్ ఈ నెల 2న కారుతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశాడు. లక్ష్మీనాయుడు తన ట్రాక్టర్ను హరిచంద్రప్రసాద్కు అమ్మగా అతడు రూ.2 లక్షల దాకా ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. లక్ష్మీనాయుడు గట్టిగా నిలదీయడంతో అతడి భార్య సుజాత గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఓ సందర్భంలో లక్ష్మీనాయుడు తన భార్య సుజాత ఫోన్ నుంచి హరికి కాల్ చేశాడు. నంబరు సేవ్ చేసుకున్న హరి... సుజాత ఫోన్కు మేసేజ్లు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. సుజాత విసిగిపోయి భర్తకు చెప్పింది. లక్ష్మీనాయుడు తమ్ముడు పవన్ నాయుడు, బాబాయ్ కుమారుడు భార్గవ్ నాయుడుతో కలిసి హరిచంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి అతను చేస్తున్నది తప్పని హెచ్చరించారు. ‘‘నేను ఇలాగే చేస్తా. చేతనైంది చేసుకోండి’’ అంటూ హరిచంద్రప్రసాద్ దుర్భాషలాడాడు. మరోవైపు లక్ష్మీనాయుడు కుటుంబం కలగజేసుకుని అప్పు చెల్లించాలని అడగడంతో వేరేవాళ్ల వద్ద ఉన్న ట్రక్కును ష్యూరిటీగా ఉంచాడు. కానీ, తన ట్రాక్టర్ లాక్కున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి ఇబ్బందిపెట్టాడు. ఒకటికి రెండుసార్లు గొడవలు కావడం, లక్ష్మీనాయుడు సోదరులతో వచ్చి నిలదీయడంతో పరువు పోయిందని హరి వారిపై కసి పెంచుకున్నాడు. దసరా పండుగ నాడు బైక్పై వెళ్తున్న లక్ష్మీనాయుడు, పవన్, భార్గవ్ను కారుతో ఢీకొట్టాడు. కారు దిగి రాడ్డుతో కొట్టాడు. కారులోని మహిళలు సైతం చచ్చేదాకా తొక్కించు అంటూ అతనిని రెచ్చగొట్టారు. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలైన భార్గవ్నాయుడు, పవన్ గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, తాము ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి రంగాను సైతం హరి దుర్భాషలాడాడని, ఆయన ఫొటో పెట్టుకోవటం పాపామా అని లక్ష్మీనాయుడు కుటుంబం వాపోయింది.గుడ్లూరు ఘటనలో సమగ్ర దర్యాప్తు: ఎస్పీనెల్లూరు (క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు శివారులో ఈ నెల 2న జరిగిన లక్ష్మీనారాయణ హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితులు హరిచంద్రప్రసాద్, మాధవరావును అరెస్ట్ చేశామని, వారు రిమాండ్లో ఉన్నారని చెప్పారు. నిందితుల ఆస్తుల జాబితాను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. దర్యాప్తు సరిగా జరగడం లేదనేది అసత్య ప్రచారంగా పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాపు వర్గ నాయకుల్లో తీవ్ర ఆగ్రహంటీడీపీ కార్యకర్త హరిచందప్రసాద్ చేతిలో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కాపు యువకుడు కావడంతో ఆ సామాజిక వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు దారకానిపాడులో లక్ష్మీనాయుడు భార్య సుజాత, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను తప్పించే ప్రయత్నం చేయడం, నియోజకవర్గ ప్రజాప్రతినిధి... లక్ష్మీనాయుడు కుటుంబాన్ని కనీసం పరామర్శించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు తన సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో కాపాడుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేశారనే విమర్శలు చేశారు. కాగా, తీవ్ర విమర్శలు రావడంతో స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం హడావుడిగా దారకానిపాడు వెళ్లారు. పరామర్శ పేరుతో హడావుడి చేశారు. పేదలమైన మాపై ఇంత కక్షా?మాది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. పిల్లలు చిన్న చిన్న వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నారు. చేతికి అందివచి్చనవారు ఆసుపత్రుల పాలయ్యారు. వారి వైద్యానికి కనీసం డబ్బు పుట్టని పరిస్థితి. హరిచంద్రప్రసాద్ కారుతో గుద్దడంతో మా అన్న కుమారుడు లక్ష్మీనాయుడు చనిపోయాడు. పవన్కు నడుము విరిగి మంచానికి పరిమితమయ్యాడు. – తిరుమలశెట్టి వేణు, రమాదేవి (భార్గవ్నాయుడు తల్లిదండ్రులు)నా కూతురిని చంపుతానని బెదిరించాడుహరిచంద్రప్రసాద్ నన్ను లైంగికంగా వేధించాడు. లొంగకపోతే నన్నయినా, నా భర్తను అయినా చంపుతా అంటూ బెదిరించేవాడు. ఓసారి నా కూతురిని పైకి ఎత్తి చంపుతానంటూ భయపెట్టాడు. నా భర్తను దారుణంగా చంపేశాడు. ఈ ఊరికే చెందిన బెజవాడ అవినాష్, అల్లం విజయకుమార్, కామినేని శ్రీనివాసులు (పొందూరు శ్రీను) నా భర్త లక్ష్మీనాయుడు హత్యకు సహకరించారు. వారిని పోలీసులు వదిలేశారు. – లక్ష్మీనాయుడు భార్య సుజాత

ఒక్కగానొక్క కొడుకు.. ఇంకెందుకు బతకాలి?!
కర్నూలు: గాజులదిన్నె ప్రాజెక్టు వద్ద పారుతున్న నీటిలో ఆడుతూ సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తూ కాలు జారి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల గల్లంతు అయ్యారు. చెన్నారెడ్డి మృతదేహం లభ్యం కాగా ఉదయ్కుమార్ కోసం గాలిస్తున్నారు. ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం సీఈసీలో ఏఐ చదువుతున్న పీఎన్. చెన్నారెడ్డి(20), ఉదయ్ కుమార్(20), శివ, బాబు, అస్తాబ్, ధనుంజయ్, శ్రీనాథ్, సాయి గణేష్ విద్యార్థులు ఇంట్లో కళాశాలకు వెళ్తామని చెప్పి గురువారం ఉదయం గాజులదిన్నె ప్రాజెక్టుకు వచ్చారు. ప్రాజెక్టు గేట్లు, నీటి నిల్వ పరిసరాల్లో సందడి చేశారు. వారం రోజుల నుంచి గాజులదిన్నె ప్రాజెక్ట్ నాలుగవ క్రస్ట్ గేట్ ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని హంద్రీ నదిలోకి విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం పారుతున్న నీటిలో ఆడుతూ సెలీ్ఫలు దిగుతూ సందడి చేశారు. సెల్ఫీలు దిగుతూ కాలు జారి చెన్నారెడ్డి, ఉదయ్ కుమార్ పారుతున్న నీటిలో కొట్టుకొని కిందకు పోయారు. దీన్ని గమనించిన శివ వారిని కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు. చెన్నా రెడ్డి, ఉదయ్ కుమార్లు నీటిలో కొట్టుకుపోయి కింద ఉన్న నీటి గుంతలో మునిగిపోయారు. ఇద్దరు స్నేహితులు నీటిలో కొట్టుకుపోయి మునిగిపోవడంతో మిగతా వారు కేకలు వేశారు. దీంతో ప్రాజెక్టు అధికారులు గేటును మూసివేశారు. అయితే అప్పటికే వారిద్దరూ నీటిలో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మత్స్యకారులతో వెతికించారు. సాయంత్రం చెన్నారెడ్డి మృతదేహం లభ్యమైంది. ఉదయ్ కుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చీకటి పడడంతో కనిపించదని మత్స్యకారులు బయటికి వచ్చారు. శుక్రవారం ఉదయం ఉదయ్ కోసం గాలిస్తామని అధికారులు తెలిపారు. చెన్నారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. ఎందుకు బతకాలి? ‘ఉన్న ఒక్క కొడుకును పోగొట్టుకుని మేం ఎందుకు బతకాలిరా’ అంటూ చెన్నారెడ్డి తల్లిదండ్రులు మోహన్ రెడ్డి, శకుంతలు రోదించారు. ఎమ్మిగనూరుకు చెందిన మోహన్ రెడ్డి, శకుంతలకు ఒక కుమారుడు చెన్నారెడ్డి, ఇద్దరు కూమార్తెలు వైష్ణవి, చైతన్య ఉన్నారు. వీరు ఎమ్మిగనూరు పట్టణంలో హోటల్ పెట్టుకుని పిల్లల్ని చదివిస్తున్నారు. గత ఐదేళ్లుగా తండ్రి మౌలేశ్వర రెడ్డి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లి ఒక్కటే హోటల్ నడుపుతూ పెద్ద కూతురుకు వైష్ణవికు వివాహం చేశారు. హోటల్లో వచ్చిన సంపదనతోనే చెన్నారెడ్డిని, చైతన్యను చదివిస్తున్నారు. చెన్నారెడ్డి మృతిచెందిన సంఘటన తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రాజెక్టుకు చేరుకొని ఒక ఏడాదిలో చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తూ మమ్మల్ని పోషిస్తాడని ఎన్నో ఆశాలు పెట్టుకున్నాం. కానీ మమ్మల్ని ఇలా ఒంటరిని చేసి వెళ్లి పోతావని అనుకోలేదని ఉన్న ఒక్క కుమారుడు పోయాడు. ఇక మేము ఎందుకు బతకాలి అని తల్లిదండ్రులు రోదించారు. ఎవరూ ముందుకు రాలేదు మా స్నేహితులు నీటిలో కొట్టుకుపోయారని, కేకలు వేస్తూ సమీపంలో ఉన్న వారందరినీ వేడుకున్నా ఎవరు ముందుకు రాలేదు. నీటిలో మునిగిపోయారు సహాయం చేయండని వేడుకున్నా ఒక్కరూ కూడా సహాయం చేయలేదు. ఆ సమయంలో ఎవరైనా సహాయం చేసి ఉంటే మా స్నేహితులు బతికి ఉండేవారు. – చెన్నారెడ్డి, ఉదయ్ స్నేహితులు కన్నీటి పర్యంతం..‘అమ్మా.. కాలేజీకి వెళ్లి వస్తా అని చెప్పి.. ఇంకా రాలేదు కదా’ అంటూ ఉదయ్ తల్లిదండ్రులు రోదించారు. ఎమ్మిగనూరుకు చెందిన గోవింద్, రాధలకు ఇద్దరు కుమారులు. వీరు పట్టణంలో మగ్గం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు మనోహర్ బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు ఉదయ్ కుమార్ ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం సీఈసీలో ఏఐ చేస్తున్నాడు. గురువారం ఉదయం కాలేజీ వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వచ్చాడు. ‘3 గంటల సమయంలో మీ వాడు గాజులదిన్నె ప్రాజెక్టు నీటిలో మునిగి పోయాడని ఫోన్ వచ్చిందని మేము ఇకా ఎవరి కోసం బతకాలి’ అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించాయి.

ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో విస్తుపోయే విషయాలు
ఆ ఇద్దరూ క్లాస్మేట్స్. అయితే బ్యాక్లాగ్స్తో అతగాడు ఆమెకు ఓ సెమిస్టర్ జూనియర్ అయిపోయాడు. అయినా వాళ్ల మధ్య స్నేహం కొనసాగింది. ఇదే అదనుగా.. అదీ కాలేజీ క్యాంపస్లో.. అందులోనూ మెన్స్ టాయ్లెట్లో ఆమెపై ఆ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సౌత్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అత్యాచార ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. నిందితుడిని జీవన్ గౌడ(21)గా నిర్ధారించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. గురువారం అతనితో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కీలక విషయాలు వెల్లడించారు. బాధితురాలు(20), జీవన్ ఒకేసారి కాలేజీలో చేరారు. ఈ క్రమంలో జీవన్ ఓ సెమిస్టర్ తప్పడంతో వెనకబడిపోయాడు. అక్టోబర్ 10వ తేదీ ఉదయం కాలేజీకి బాధితురాలికి ఓ పార్సిల్ వచ్చింది. దానిని జీవన్ రిసీవ్ చేసుకుని ఆ వంకతో యువతిని కలిసి అందించాడు. దానిని అందుకుని ఆమె అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయింది. అయితే.. మధ్యాహ్నాం లంచ్ సమయంలో ఆమెకు పదే పదే ఫోన్ చేసి మాట్లాడాలంటూ ఏడో ఫ్లోర్లో ఉన్న అర్కిటెక్ట్ బ్లాక్ దగ్గరకు రావాలంటూ పిలిచాడు. అక్కడికి వెళ్లిన ఆమెకు ఎవరూ లేనిది చూసి బలవంతంగా ముద్దు పెట్టాడు. ఈ పరిణామంతో భయానికి గురైన యువతి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. అయితే.. లిఫ్ట్లో ఆమెతో పాటే కిందకు వెళ్లి.. ఆమె నోరు మూసేసి ఆరో ఫ్లోర్లో ఉన్న మెన్స్ టాయ్లెట్లోకి లాక్కెల్లాడు. అక్కడ వాష్రూంలో తలుపు బిగించి 20 నిమిషాలపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన తరవాత ఆమె హాస్టల్కు పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితులకు విషయం చెప్పింది. ఆ సమయంలో మరోసారి కాల్ చేసిన నిందితుడు పిల్ కావాలా సీనియర్?( ఎమర్జెన్సీ గర్భనిరోధక మాత్ర) అంటూ వెటకారంగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. అయితే.. ఇదంతా మాములు విషయమని, పెద్దది చేయొద్దంటూ తోటి రూమ్స్మేట్స్కు ఆమెకు సలహా పడేశారు.అయితే.. జరిగిన విషయాన్ని రెండు రోజుల తర్వాత పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వాళలు బెంగళూరు వచ్చి.. అక్టోబర్ 15వ తేదీన హనుమంత నగర పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన క్యాంపస్ ఫ్లోర్లో సీసీకెమెరాలు లేకపోవడంతో.. ఫోరెన్సిక్, డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ జరిపారు. చివరకు జీవన్ నేరానికి పాల్పడింది నిర్ధారించుకుని.. అరెస్ట్ చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 64 ప్రకారం.. రేప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ఈ ఘటనతో రుజువైందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించగా.. ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. సదరు ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పటిదాకా ఘటనపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు.ఇదీ చదవండి: వెనక నుంచి వచ్చి.. యామిని మెడపై కత్తి పెట్టి!
వీడియోలు


ఫలించిన YS జగన్ కృషి.. రాష్ట్రానికి మెడికల్ సీట్లు


ఆస్ట్రేలియాతో భారత్ తొలి వన్డే మ్యాచ్


ఎంపీ కేశినేని చిన్నిపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి సంచలన వ్యాఖ్యలు


Ding Dong: పెద్ద ప్లానే.. కిక్కే కిక్కు


డేంజర్ జోన్ లో ఇండియా


పక్కా ప్లాన్ తోనే నా భర్తను చంపారు


40ఏళ్ల పోరాటం.. అడవిని వీడిన ఆయుధం


శ్రీవారి దర్శనం టికెట్ల పేరిట టీడీపీ నాయకుడి మోసం


జనసైనికులను పట్టించుకోవా పవన్?


విజయవాడలో భారీ వర్షం.. వరదలో చిక్కుకున్న బస్సు