ప్రధాన వార్తలు

ఉక్రెయిన్ చేతికి టోమాహాక్ క్షిపణి.. అమెరికాకు.. రష్యా వార్నింగ్!
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తారాస్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్కు అమెరికా టోమాహాక్ క్షిపణులు పంపే యోచనపై రష్యా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం అన్ని వైపుల నుండి తీవ్ర రూపం దాల్చడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని రష్యా హెచ్చరించింది.అయితే, డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్కు టోమాహాక్ క్షిపణులు ఇవ్వడంపై స్పష్టత ఇచ్చారు. ఈ క్షిపణులను పంపే ముందు, యుద్ధ తీవ్రత పెరగకుండా చూసుకుంటానని తెలిపారు. ఉక్రెయిన్ వాటిని ఎలా ఉపయోగించబోతుందో ముందుగా తెలుసుకోవాలని భావిస్తున్నానని చెప్పారు. ఈ అంశంపై తాను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.‘టోమాహాక్ల అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది’అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యన్ ప్రభుత్వ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అన్ని వైపుల నుండి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయనే వాస్తవం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో అత్యంత ఘోరమైన ఉక్రెయిన్ యుద్ధం. 1962లో జరిగిన క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత, ఇప్పుడు రష్యా–పశ్చిమ దేశాల మధ్య జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం అత్యంత తీవ్రమైన ఘర్షణగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా.. పశ్చిమ దేశాలతో తీవ్రమైన రాజకీయ, దౌత్య వివాదంలో ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి రష్యా కామెంట్స్పై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల మాట్లాడుతూ, టోమాహాక్ క్షిపణులను అమెరికా సైనికుల ప్రత్యక్ష సహకారం లేకుండా ఉపయోగించడం అసాధ్యం అని అన్నారు. అందువల్ల, ఈ క్షిపణుల సరఫరా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే దశకు తీసుకెళ్తుందని హెచ్చరించారు.టోమాహాక్ క్షిపణిటోమాహాక్ క్షిపణి 2,500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. అంటే ఉక్రెయిన్ నుంచి వీటిని ప్రయోగిస్తే అవి మాస్కో, యూరోపియన్ రష్యాలోని చాలా ప్రాంతాలను సులభంగా చేరుకోగలవు. టోమాహాక్ అనేది అమెరికా నేవీ ఐకానిక్ సబ్సెనిక్ కూయిజ్ క్షిపణి. దీనిని 1970ల నుంచి అభివృద్ధి చేశారు. దీనిని ఓడలు, జలాంతర్గాములు, ల్యాండ్ లాంచర్ల నుంచి ఈజీగా ప్రయోగించవచ్చు. ఇది 1,000 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా కచ్చితంగా చేదించగలదు. వీటిలో బ్లాక్ ఐవీ (TACTOM) వెర్షన్ అత్యంత అధునాతనమైనది. ఈ సూపర్ వెపన్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. దీనిని విమానం నుంచి ప్రయోగించినప్పుడు ఒకసారి నిర్దేశించిన లక్ష్యాలను కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడీ క్షిపణులను అమెరికా.. ఉక్రెయిన్కు ఇస్తుంటే రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

విద్యుత్ ఉద్యోగుల ఛలో విజయవాడ
విజయవాడ తమ సమస్యలను పరిష్కరించకపోతే ‘పవర్’ ఏమిటో చూపిస్తామని ఇప్పటికే హెచ్చరించిన ఏపీ విద్యుత్ జేఏసీ.. రేపు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) చలో విజయవాడకు పిలుపునిచ్చింది. విద్యుత్ జేఏసీ పిలుపుతో ఉద్యమానికి సిద్ధమైంది విద్యుత్ సిబ్బంది. వేతనాలు, సర్వీస్ హక్కులు, ప్రమోషన్లు, పెన్షన్ విధానం సహా 15 ప్రధాన డిమాండ్లు చేస్తుంది విద్యుత్ జేఏసీ. విద్యుత్తు యాజమాన్యాలు, ప్రభుత్వంతో పలు దఫాల చర్చలు జరిగినా పరిష్కారం రాకపోవడంతో సమ్మెకు సిద్ధమైంది. దీనిలో భాగంగా రేపు చలో విజయవాడకు పిలుపునిచ్చింది. 15వ తేదీ నాటికి తమ సమస్యలకు పరిష్కారం రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగుతారని హెచ్చరించింది. సమ్మెలో పాల్గొనడానికి అరవై వేలమంది విద్యుత్ సిబ్బంది సన్నద్ధమైంది. రేపు చలో విజయవాడ కార్యక్రమానికి విద్యుత్ సిబ్బంది వేల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల ముఖ్యమైన డిమాండ్లివీ» కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలి.» విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు నగదురహిత అపరిమిత వైద్య సౌకర్యం కల్పించాలి.» జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 (ఎనర్జీ అసిస్టెంట్)లకు పాత సర్వీసు నిబంధనలు వర్తింపజేయాలి. వారికి అసిస్టెంటు లైన్మెన్గా పదోన్నతి కల్పించాలి.» కారుణ్య నియామకాలు కల్పించటంలో కన్సాలిడేటెడ్ పే ఇస్తున్న పద్ధతిని రద్దుచేసి పాత పద్ధతినే కొనసాగించాలి.» పెండింగ్లో ఉన్న నాలుగు డీఏ/డీఆర్లను మంజూరు చేయాలి. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ప్రకారం జీతం స్కేల్స్ రూపొందించాలి.» ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన జూనియర్ ఇంజనీర్లకు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతిలో ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించాలి.» అర్హులైన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) తదితర సర్వీసులకు చెందిన ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ ఖాళీలలో నియమించాలి. » 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను కాంట్రాక్టుకు ఇవ్వడం ఉపసంహరించాలి.» అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలి. పని ప్రమాణాల ప్రకారం అదనపు పోస్టులు మంజూరు చేయాలి.» పర్సనల్ ‘పే’ని ఎన్క్యాష్మెంట్ లీవ్, పదవీ విరమణ చేసినప్పుడు టెర్మినల్ లీవుతో కలిపి పేమెంట్ చేయాలి.» విద్యుత్ సంస్థలలో ఉన్న అన్ని ట్రస్టులను బలోపేతం చేసి మూడు నెలలకు ఒకసారి ట్రస్టు అడ్వైజరీ కమిటీ మీటింగ్లను నిర్వహించాలి.ఇదీ చదవండి: మా ‘పవర్’ ఏమిటో చూపిస్తాం!

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. నూతన ఉద్యోగయోగం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.సప్తమి రా.5.48 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: ఆరుద్ర రా.6.27 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: తె.5.56 నుండి 7.28 వరకు (తెల్లవారితే మంగళవారం),దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.55 వరకు, తదుపరి ప.2.28 నుండి 3.14 వరకు, అమృత ఘడియలు: ఉ.9.02 నుండి 10.33 వరకు.సూర్యోదయం : 5.55సూర్యాస్తమయం : 5.38రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం.... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కుటుంబసభ్యులతో వివాదాల పరిష్కారం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.వృషభం... ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.మిథునం.... పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. నూతన ఉద్యోగయోగం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకం.కర్కాటకం... వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.సింహం.... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.కన్య..... కొత్త పనులు ప్రారంభం. శుభవార్తలు. దైవదర్శనాలు. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.తుల.... పనులు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి.వృశ్చికం... బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.ధనుస్సు... ఆకస్మిక ధనలాభం. పనులు సజావుగా సాగుతాయి. బంధువుల కలయిక. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి..మకరం.... వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం. విలువైన వస్తువులు సేకరిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనయోగం.కుంభం.... ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆలయదర్శనాలు.మీనం... చేపట్టిన కార్యక్రమాలు మందగిస్తాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.

IND VS AUS: టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన మ్యాచ్లో (India vs Australia) భారత్పై ఆస్ట్రేలియా మహిళలు 3 వికెట్ల తేడాతో గెలిచారు. నిర్ణీత 49 ఓవర్లలో 331 పరుగులు చేసి టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్కు వరుసగా ఇది రెండవ ఓటమి.తొలుత టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేసి 330 పరుగులు (48.5 ఓవర్లలో ఆలౌట్) చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana), ప్రతిక రావల్ (Pratika Rawal) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా మంధన తన సహజ శైలిలో చెలరేగిపోయింది. 66 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనతో పోలిస్తే ప్రతిక రావల్ కాస్త నిదానంగా ఆడింది. 96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 75 పరుగులు చేసింది.ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో అలీస్సా హీలీ: 142 పరుగులు (107 బంతుల్లో) చేసి తన అద్భుత ఇన్నింగ్స్తో మ్యాచ్ను గెలిపించింది దాంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది.ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది, అయితే చివరి ఓవర్లలో ఆసీస్ విజయం సాధించింది. భారత్ మంచి స్కోరు చేసినా, హీలీ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ను ఆసీస్ చేతుల్లోకి తీసుకెళ్లింది.

లోటు.. లక్ష కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం ఆశించిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ గత కొన్నేళ్లుగా అతి తక్కువగా వస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో కేంద్రం నుంచి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశించి వార్షిక బడ్జెట్లో ప్రతిపాదిస్తున్న నిధులకు, ఆ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్రం ఇచ్చే మొత్తానికి పొంతన ఉండటం లేదు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఆశించిన మొత్తంలో రూ.లక్ష కోట్లకు పైగా లోటు ఉండడం గమనార్హం. గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులను 2020–21లో చివరిసారి రాష్ట్రం ఆశించిన మేరకు కేంద్రం ఇచ్చింది. ఆ ఏడాదిలో రూ.10 వేల కోట్లు ఈ పద్దు కింద వస్తాయని అంచనా వేస్తే రూ.15 వేల కోట్ల వరకు ఇచ్చింది. దీంతో మరుసటి ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.38 వేల కోట్లు వస్తాయని అంచనా వేసి వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించింది. కానీ, ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 నాటికి కేంద్రం నుంచి వచ్చింది రూ.8 వేల కోట్లు మాత్రమే. అప్పటి నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల విషయంలో భారీ అంతరం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆశించినదాంట్లో గరిష్టంగా 30 శాతం నిధులు కూడా ఈ పద్దు కింద రావడం లేదని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.22,782.50 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి బడ్జెట్లో పెడితే.. తొలి ఐదు నెలల్లో (2025, ఆగస్టు 31 నాటికి) ఇచ్చింది రూ.1,673.43 కోట్లు మాత్రమే. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే...గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే సాయం కింద ఇచ్చే మొత్తం అని చెప్పొచ్చు. ఈ గ్రాంట్ను తిరిగి ఇవ్వాల్సిన పని ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం తిరిగి చెల్లించే షరతు ఉంటుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చినా, రాష్ట్రం నుంచి ఏదైనా శాఖకు వెళ్లినా, ఎన్జీవోలు, విద్యాసంస్థలైనా ఇదే నిబంధన ఉంటుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతా ప్రాజెక్టులకు ఈ పద్దు కింద కేంద్రం నిధులు ఇచ్చే వెసులుబాటు ఉంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కూడా ఇవ్వొచ్చు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ నిధులను మంజూరు చేయవచ్చు. అయితే, ఈ నిధులను ఏ కారణం కోసం అయితే ఇచ్చారో వాటికి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాల స్వతంత్ర ఆలోచలను దెబ్బతీసే చర్య కేంద్ర ప్రభుత్వాల పెత్తందారీ వైఖరి కారణంగానే రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు రావడం లేదు. ఈ పద్దు కింద రాష్ట్రాలకు కేంద్రం నిధులు వస్తే తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆయా రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కానీ, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆర్థిక అధికారాల కేంద్రీకరణ మాత్రం ఏటేటా పెరుగుతోంది. రాష్ట్రాలను ఆదాయ వనరులుగా చూస్తున్నారే తప్ప సాయం చేయడం లేదు. సెస్ల రూపంలో కేంద్రమే పన్నులు వసూలు చేసుకుంటోంది. ఆ పన్నుల్లో వాటా ఆశించినంతగా ఇవ్వడం లేదు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా మంజూరు చేయడం లేదు. అనేక రకాలుగా కేంద్రంపై రాష్ట్రాలు ఆధారపడే విధంగా చేయడం ద్వారా ఆయా రాష్ట్రాల స్వతంత్ర ఆలోచనను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోంది. ఈ ఆర్థిక అసమతుల్యత గతంలోనూ ఉన్నదే అయినా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెరిగింది. – ప్రొఫెసర్ అందె సత్యం, ఆర్థిక నిపుణులు

మాటల్లో తెంపరితనం వద్దు!
‘‘వ్యూహాత్మకంగా మన శత్రువులందరినీ మనం తృణీకరించవచ్చు. కానీ, తార్కికంగా మనం వారందరినీ సీరియస్గా తీసుకుని తీరాలి.’’ మావో జెడాంగ్ 1957లో చేసిన ఈ వ్యాఖ్య లోతైనది. ‘‘ప్రభుత్వ సౌజన్యంతో సాగే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ కొనసాగిస్తే, భారత్ ఆపరేషన్ సిందూర్–1 సందర్భంగా చూపిన సంయమనాన్ని ఈసారి ప్రదర్శించకపోవచ్చు, ఈసారి మేం మరో అడుగు ముందుకేసి, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాం. అది ప్రపంచ పటంలో తాము కొనసాగాలో వద్దో పాక్ ఆలోచించుకొనేటట్లు చేస్తుంది’’ అని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఇటీవల అన్న మాటలు విన్నవెంటనే మావో వ్యాఖ్య గుర్తుకు వచ్చింది.మొన్న మే నెలలో, స్వల్పకాలికమే అయినా నిర్ణయాత్మకమైన రీతిలో చేసిన పోరాటంలో పాక్ వైమానిక దళం ఎంతటి భారీ నష్టాన్ని చవిచూసిందీ భారత వైమానిక దళ చీఫ్ ఎ.పి.సింగ్ ఒక పత్రికా సమావేశంలో వివరించిన తర్వాత ద్వివేదీ నుంచి ఆ రకమైన ప్రకటన వెలువడింది. భారత్ వైపు చోటుచేసుకున్నట్లు చెబుతున్న నష్టాలను సింగ్ తోసిపుచ్చారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వారిద్దరి కేమీ తీసిపోనన్నట్లుగా మాట్లాడారు. వివాదాస్పద సర్ క్రీక్ ప్రాంతంలో పాక్ ఎటువంటి దుస్సాహసానికి దిగినా, భారత్ ఇచ్చే దీటైన జవాబు పాకిస్తాన్ ‘‘చరిత్రను, భౌగోళిక స్వరూపాన్ని రెండింటినీ’’ మార్చివేస్తుందని తన భుజ్ పర్యటనలో హెచ్చరించారు.తానేం తక్కువ తినలేదు!వీటిపై పాక్ అసాధారణమైన రీతిలో స్పందించింది. భారత దేశంలో ఏ మూలనైనా దాడి చేయగల సామర్థ్యం తమ సొంతమని ప్రకటించింది. ఒకవేళ అణ్వాయుధాలతో పాక్ను నిర్మూలించ దలిస్తే, అది పరస్పరమైనదిగా ఉంటుందని కుండబద్దలు కొట్టింది. అణ్వాయుధ సంపత్తి కలిగిన పాకిస్తాన్ విఫల రాజ్యమనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అది గత 40 ఏళ్ళుగా భారత్పై ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. చేబదుళ్ళు తెచ్చుకుంటూ రోజులు నెట్టు కొస్తోంది. అయినప్పటికీ, 6,60,000 బలగం కలిగిన పాక్ సైన్యాన్నీ, దాని అణ్వాయుధాలనూ భారత్ తేలిగ్గా తీసుకోవడానికి లేదు.ప్రపంచం పటం నుంచి తుడిచిపెట్టేస్తూంటే పాక్ అణ్వాయుధాలను ప్రయోగించకుండా కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంటుందను కోవడం అవివేకం. అంత తేలికేం కాలేదు!పాక్ విజయ తంత్రాలను 1965లో ఛేదించడంలో భారత్ సఫలమైన మాట నిజమే కానీ, ఆ యుద్ధం ఒక రకంగా డ్రాగా ముగిసింది. రెండు పక్షాలూ ప్రత్యర్థి భూభాగాల నుంచి చెరికొంత ప్రయోజనాలను మూటగట్టుకున్నాయి. ఇక, పాక్తో భారత్ 1947 – 48 యుద్ధాన్ని కొనసాగించి ఉంటే మొత్తం జమ్ము–కశ్మీర్ విముక్త మయ్యేదనే అభిప్రాయం చాలా మందిలో బలంగా ఉంది. దేశ విభజన రక్తపు చారికలు ఆరకముందే, ఒక దేశంగా ఇంకా పూర్తిగా పటిష్ఠం కాకముందే, ఆ యుద్ధం జరిగివుంటే మరింత వినాశకర పర్యవసానాలకు దారితీసి ఉండేది. మనం 1971లో తూర్పున చేసిన యుద్ధం బ్రహ్మాండంగా విజ యవంతమైంది. కానీ, అది మనం ఓటమికి అణువంత అవకాశం కూడా ఇవ్వకూడని యుద్ధమనే సంగతిని మరచిపోకూడదు. ఈ విషయమై పాశ్చాత్యుల కథనం మాత్రం వేరు. పాక్ ఆకాశంలో సత్తా చూపలేక, చతికిలపడి ఉండవచ్చు. కానీ, క్షేత్ర స్థాయిలో మనం గడించిన లాభాలు అంతంతమాత్రమే! పైగా మనం ఛంబ్ (పీఓకే)ను కోల్పోవలసి వచ్చింది.ఇక కార్గిల్ సంగతికొస్తే ఎత్తుగడ రీత్యా అది ఒక పరిమిత యుద్ధం. భారత్, పాక్ రెండూ అపుడు అణ్వాయుధ దేశాలు. భౌగో ళికపరంగా, తీవ్రత పరంగా యుద్ధాన్ని కొంత మేరకే పరిమితం చేయా లనే వ్యూహాన్ని న్యూఢిల్లీ అనుసరించింది. ఈ సందర్భంగా భారత్కు అంతర్జాతీయంగా లభించిన మద్దతు పెద్ద ఫలితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా అమెరికా నుంచి లభించిన మద్దతు వల్ల కార్గిల్లోని మిగి లిన పర్వత శిఖరాల నుంచి పాక్ సేనలు తోక ముడవవలసి వచ్చింది. 2002లో నిర్వహించిన ‘ఆపరేషన్ పరాక్రమ్’ భారత్–పాక్ సేనల సమీకరణను చూసింది. కానీ, తొమ్మిది నెలల తర్వాత, తుది ఫలితం అనుకూలంగా వస్తుందనే పూచీ లేకపోవడం వల్ల, భారత్ దాన్ని విరమించుకోవాల్సి వచ్చింది. ముంబయ్పై 2008 దాడి నేపథ్యంలోనూ అదే రకమైన పరిణామం చోటుచేసుకుంది.‘ఆపరేషన్ పరాక్రమ్’ ఉపసంహరణ తర్వాత, ఆ సారాంశాన్ని పర్వేజ్ ముషారఫ్ బాగా వివరించారు. ‘‘వారు (భారత్) మాపై దాడికి దిగరని, రెండు సైనిక శక్తులనూ బేరీజు వేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను. దాడికి దిగే సేన విజయం సాధించేందుకు సైనికపరంగా ఒక నిర్దిష్ట నిష్పత్తి అవసరం. మేం నిర్వహిస్తూ వస్తున్న ఆ నిష్పత్తులు అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. ఆత్మరక్షణ చేసు కోవాల్సిన పక్షం తనను తాను కాపాడుకునేందుకు అవసరమైన దానికన్నా ఎక్కువ నిష్పత్తిలోనే ఉన్నాయి’’ అని ఆయన అన్నారు.ఇప్పుడేం మారిందని?పాక్పై భారత్ పదాతి దళాలతో దాడికి దిగితే విజయం ఖాయ మని సూచించేంతగా సంఖ్యలు, మోహరణలు, రక్షణ సామగ్రి పరంగా పరిస్థితిలో తేడా ఏమీ రాలేదు. మనం ఎంత చక్కగా సమా యత్తమై, ప్రేరణతో ఉన్నామో, అవతలి పక్షంవారు కూడా అలాగే ఉన్నారు. పైగా, వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సేనల మోహరింపును ఎదుర్కొనేందుకు గడచిన ఐదేళ్ళుగా భారత్ తన సేనల కదలికలను నిశితంగా మార్చుకోవాల్సి వస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో, పాకిస్తానీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో, ప్రధాని మోదీ నూతన మార్గదర్శక సూత్రాలను నిర్దేశించారు. పాక్ను శిక్షించేందుకు అణు, సంప్రదాయ ఘర్షణల మధ్య తేడాను మెరుగైన రీతిలో వినియోగించుకోవాల్సి ఉందని ఆ మార్గదర్శక సూత్రాలు డిమాండ్ చేస్తున్నాయి. నాశనమైపోతారు జాగ్రత్తంటూ ప్రత్యర్థులను హెచ్చరించే బదులు, ప్రధాని చెప్పినట్లు నడచుకునేందుకు తగిన వ్యూహాలను పన్నడంపై సైన్యాధికారులు దృష్టి కేంద్రీకరించాలి. మనోజ్ జోషీవ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్’లో విశిష్ట పరిశోధకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)

యుగాంత రచయిత
ఆధునిక యూరప్ సాహిత్యంలోనైనా, ఏ తరపు యూరప్ సాహిత్యంలోనైనా విశిష్ట స్థానం ఉన్న హంగెరీ రచయిత లాస్లో క్రాస్నాహోర్కైయేను ఈ యేటి సాహిత్య నోబెల్ పురస్కారం వరించింది. ‘ప్రళయ భయాల మధ్యలోనూ కళాశక్తిని తిరిగి ధ్రువీకరించే... ఆకర్షణీయమైన, దూరదృష్టి గల సాహిత్య కృతుల సమాహారానికిగానూ’ 1954లో జన్మించిన ఈ 71 ఏళ్ల ‘హంగేరియన్ రుషి’కి ఈ గౌరవం దక్కింది. తన తొలి నవల ‘సాటాన్టాంగో’(1985)కు మూడు దశాబ్దాల తర్వాత వెలువడిన ఆంగ్లానువాదానికిగానూ 2015లో ‘మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్’ అందుకున్న లాస్లో సరిగ్గా దశాబ్దం తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడే ఆయన ‘ద మెలంకలీ ఆఫ్ రెసిస్టెన్స్’ (1989), ‘వార్ అండ్ వార్’ (1999), ‘బారన్ వెంక్హెయిన్స్ హోమ్కమింగ్’ (2016) లాంటి ఇతర పోస్ట్మాడర్న్ నవలలు రాశారు.కథకుడు కూడా అయిన లాస్లో క్రాస్నాహోర్కైయే ప్రధానంగా హంగేరియన్ భాషలోనూ, చాలాకాలంగా నివాసం ఉండటం వల్ల జర్మన్లోనూ రాస్తారు. ఆయన సాహిత్యంలో ప్రపంచం వల్ల గాయపడిన మనుషులు కనిపిస్తారు. భయ పీడనలను వాళ్లు తప్పించుకోలేరు. సామాజిక అభద్రత, అశాంతి, భరించలేని ఉక్కపోత, నియంతృత్వపు అరాచకాల ఈ అపసవ్య ప్రపంచంలో జరిగే కర్కశ పోరాటాలను ఆయన చిత్రించారు. అందానికీ అవినీతికీ, అమాయకత్వానికీ కపటానికీ, బలహీనతకూ మొరటు బలానికీ మధ్య జరిగే ఎడతెగని పోరు; ప్రతి ఎత్తునూ ఒక అగాథానికి లాగే, ప్రతి స్వర్గాన్నీ ఒక నరకానికి నేలకూల్చే దారుణాలు ఆయన వస్తువులు. అందుకే అమెరికన్ విమర్శకురాలు సూసన్ సోంటాగ్ ఆయన్ని యుగాంత సాహిత్యపు గురువుగా అభివర్ణించారు. ఆయన కళ ఎల్లప్పుడూ అసంబద్ధతకు ఆతిథ్యంగా నిలుస్తుంది– ప్రపంచం తానే ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకొని, దయలేని ప్రతిద్వంద్విగా మారే మార్గాలకు సదా తెరిచి ఉంటుందని వ్యాఖ్యానిస్తారు బ్రిటిష్ రచయిత ఆడమ్ థర్ల్వెల్.కాఫ్కా ‘ద క్యాజిల్’, దోస్తోవ్స్కీ ‘ది ఇడియట్’ను అభిమానించే లాస్లో ఎన్నడూ రచయిత కావాలని అనుకోలేదు. 1970ల్లో ఆయన పాస్పోర్టును కమ్యూనిస్టు అధికారులు జప్తు చేశారు. దానివల్ల బొగ్గు గని కార్మికుడిగా పనిచేశారు. ఆవుల కొట్టాలకు రాత్రుళ్లు కావలి కాశారు. బార్లలో పియానో వాయించారు. గ్రామాల్లో పేదలతో కలిసి బతికారు. వీధుల్లోని జన భాషను ఒంటబట్టించుకున్నారు. మూడు నాలుగు నెలలకోసారి కొత్త పనులు వెతుక్కుంటూ తిరిగారు. ఈ అశాశ్వత ప్రపంచానికి కళ ఒక్కటే అతివిశిష్టమైన ప్రతిస్పందన అని నమ్మి రచనా వ్యాసంగం వైపు మళ్లారు. లాస్లో లాగే రాజ్య వ్యవస్థ బాధితుడైన హంగెరీ దిగ్దర్శకుడు బేలా టార్ ఆయనతో జట్టు కట్టడం యావత్ ప్రపంచ సినిమాకే మేలు చేసింది. బేలా టార్ను బేలా టార్గా నిలబెట్టిన సినిమాల రచయితగా లాస్లో పనిచేశారు. ‘డామ్నేషన్’, ‘ద లాస్ట్ బోట్– సిటీ లైఫ్’, ‘వెర్క్మెయిస్టర్ హార్మనీస్’, ‘ద ట్యూరిన్ హార్స్’తో పాటు ఏడు గంటల నిడివుండే ‘సాటాన్టాంగో’ వీరి కాంబినేషన్లో వెలువడ్డాయి. నలుపు తెలుపుల్లో తీయడం,దీర్ఘ షాట్లు, మౌనం మాట్లాడటం, ఏమీ జరగకుండానే ఎంతో జరిగినట్టనిపించడం వీటి ప్రత్యేకత.లాస్లో వచనంలో అన్నీ గుక్క తిప్పుకోలేని దీర్ఘ వాక్యాలే. ఫుల్స్టాపులు దేవుడికి సంబంధించినవంటారాయన. గుర్రాలు, గ్రహణాలు, తిమింగళాలు, ఇంకా మానవ ఉనికితో సహా ఈ విశ్వంలోని ప్రతిదాన్నీ అందమైనదిగా, అద్భుతమైనదిగా విశ్వసించే సాధారణ మనుషులు ఆయన సాహిత్యంలో ఆశావహ ప్రపంచపు ప్రతినిధులుగా కనబడతారు. కానీ ఆ ఆశ అనేది ఎప్పటికీ భవిష్యత్తుకు సంబంధించినదే; అలాంటి భవిష్యత్తుతో మనల్ని మనం భ్రమింపజేసుకుంటాం, ఆ భవిష్యత్తు ఎప్పటికీ రాదు; ఉన్నది వర్తమానం మాత్రమే అంటారు బౌద్ధ తాత్విక చింతనను ఇష్టపడే లాస్లో. యుగాంతం ఎప్పుడో సంభవించేది కాదనీ, అది ఇక్కడే ఉంది; అది సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ప్రక్రియ అనీ పాఠకులను అప్రమత్తం చేస్తారు. ఈ చీకటి యుగంలో బతకడానికి చదవడం మరింత శక్తినిస్తుందంటారు.

స్కూళ్ల తనిఖీకి టీచర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసే అధికారం ఉపాధ్యాయులకు ఇస్తూ విద్యాశాఖ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలకు 168, ప్రాథమికోన్నత పాఠశాలలకు 35, ఉన్నత పాఠశాలలకు 96 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఆయా స్థాయిల ప్రధానోపాధ్యాయుడు నోడల్ అధికారిగా, సెకండరీ గ్రేడ్ టీచర్లు సభ్యులుగా ఉంటారు. ప్రైమరీ, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వేసే కమిటీల్లో ముగ్గురు, హైస్కూల్ స్థాయిలో 9 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం ప్రతీ మండల పరిధిలో స్కూళ్ల తనిఖీకి కాంప్లెక్స్ హెచ్ఎంలు, మండల విద్యాశాఖాధికారులు పనిచేస్తున్నారు. తాజా కమిటీలు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడతాయి. ఏప్రిల్ 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ నేపథ్యంలో పాఠశాల తనిఖీలు విస్తృతం చేయాలని, ఇవి నిరంతరంగా ఉండాలని పేర్కొన్నారు. దీంతో తనిఖీలకు ఉపాధ్యాయులనే నియమించేందుకు విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. కమిటీలు ఏం చేస్తాయి? పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు ఏ విధంగా ఉంది? ఎప్పుడు వస్తున్నారు ? బోధన ప్రణాళికను ఎలా అమలు చేస్తున్నారు? విద్యార్థుల హాజరు శాతం? ఇతర ప్రధాన కార్యక్రమాలు ఎలా అమలు చేస్తున్నారు? అనే అంశాలను ఈ కమిటీలు పరిశీలిస్తాయి. ఆ వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులకు అందిస్తాయి. జిల్లా అధికారులు ప్రతీ నెలా 5వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యాలయానికి వాటిని పంపుతారు. కలెక్టర్ల సమావేశంలో ప్రతీనెలా ప్రభుత్వం ఈ అంశాలపై చర్చిస్తుంది. కమిటీల్లో ఎంపికయ్యే టీచర్లు ఏడాదిపాటు ఇదే పనిలో ఉంటారు. బోధన చేపట్టాల్సిన అవసరం ఉండదు. – పర్యవేక్షణ కమిటీ కోసం ఎంపిక చేసే టీచర్లు కనీసం పదేళ్ల పాటు టీచర్గా ప్రభుత్వ స్కూళ్లల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలు, లేదా ఎస్జీటీలను నియమిస్తారు. వీరు ప్రతీ రోజు రెండు స్కూళ్లను విధిగా తనిఖీ చేయాలి. – ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎంపిక చేసే టీచర్లు కూడా పదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తారు. వీరు రోజుకు రెండు స్కూళ్లను తనిఖీ చేయాలి. – ఉన్నత పాఠశాలలకు కూడా పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్లు అర్హులు. వీరు రోజూ ఒక స్కూల్ను, మూడు నెలల్లో 50 స్కూళ్లను తనిఖీ చేయాలి. కొంతకాలం బ్రేక్ తర్వాత.. మళ్లీ వాస్తవానికి పాఠశాలల తనిఖీకి ఉపాధ్యాయులను నియమిస్తూ జూన్ 21వ తేదీన విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ స్థాయి టీచర్.. గెజిటెడ్ హెచ్ఎం పనిచేసే స్కూల్ను తనిఖీ చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పటికే కాంప్లెక్స్ హెచ్ఎం, ఎంఈఓలతో పాటు అభ్యసన సామర్థ్య పరిశీలనకు ప్రత్యేకంగా ఐదు స్థాయిల అధికారులను నియమించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెన్ని తనిఖీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారని పలు సంఘాలు విద్యాశాఖ కార్యదర్శి వద్ద అభ్యంతరం తెలిపాయి. ఇప్పటికే స్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందని, కొత్త కమిటీల వల్ల ప్రతీ జిల్లాలోనూ రెండు శాతం టీచర్లు తనిఖీ అధికారులుగా వెళతారని తెలిపారు. దీంతో ఇచ్చిన ఉత్తర్వులను మధ్యలో నిలిపివేశారు. తనిఖీలు చేపట్టాల్సిందేనని, టీచర్లే తనిఖీలు చేస్తే వాస్తవాలు తెలుస్తాయని ఉన్నతాధికారులు భావించారు. దీంతో మళ్లీ తనిఖీ బృందాల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు.

నకిలీ మద్యం కుంభకోణం.. ఏపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైఎస్సార్సీపీ పిలుపు
తాడేపల్లి : నకిలీ మద్యం కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న క్రమంలో రేపు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. నకిలీ మద్యం తయారీని చంద్రబాబు సర్కార్ కుటీర పరిశ్రమలా మార్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టనుంది. నకిలీ మద్యం రాకెట్లో ఉన్న వారందర్నీ అరెస్ట్ చేయాలనే డిమాండ్తో ఆందోళనలకు పిలుపునిచ్చింది వైఎస్సార్సీపీ. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను బలపీఠంపై పెట్టడంపై నెట్టింట ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇదీ చదవండి: నకిలీ మద్యంలో ఈ ప్రశ్నలకు బదులేది..?

వందే భారత్ స్లీపర్ @ కాజీపేట
సాక్షి, హైదరాబాద్: కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ స్లీపర్ రైళ్లను తయారు చేయాలని రైల్వే బోర్డు భావిస్తోంది. వచ్చే సంవత్సరం మార్చిలో దీనికి సంబంధించిన ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. తొలుత కాజీపేటలో సాధారణ రైళ్లకు వినియోగించే ఎల్హెచ్బీ కోచ్లు, ఎంఎంటీఎస్ తరహా రైళ్లకు వినియోగించే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్ (ఈఎంయూ), సాధారణ వందేభారత్ కోచ్లను తయారు చేయాలని బోర్డు భావించింది. కానీ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీలైనన్ని వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన నేపథ్యంలో కాజీపేట కొత్త కోచ్ ఫ్యాక్టరీని అందుకు కేటాయించాలని తాజాగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ కోచ్ ఫ్యాక్టరీ దాదాపు సిద్ధమైనా, ఇప్పటివరకు కోచ్ల తయారీ ఆర్డర్ను ఇవ్వలేదు. వాటి స్థానంలో వందేభారత్ స్లీపర్ రైళ్లను తయారు చేయిస్తేనే బాగుంటుందన్న భావనతోనే వర్క్ ఆర్డర్ జారీలో జాప్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. వందేభారత్ స్లీపర్ రైళ్లకు డిమాండ్ ఎక్కువ ఉండటంతో... ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 రూట్లలో 76 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిల్లో 33 రైళ్లు మాత్రమే 20, 16 కోచ్లతో నడుస్తుండగా మిగతావన్నీ 8 కోచ్లతో కూడిన మినీ వందేభారత్ సర్వీసులుగా సేవలందిస్తున్నాయి. వందేభారత్ రైళ్లు ప్రారంభించిన కొత్తలో వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడి అన్ని రాష్ట్రాలు వాటి కోసం పోటీలో నిలిచాయి. కానీ, టికెట్ ధర ఎక్కువగా ఉండటం, అవి కేవలం పగటి పూట మాత్రమే నడుస్తుండటంతో వాటిపై రానురాను ఆసక్తి సన్నగిల్లుతోంది. ఇదే సమయంలో కేంద్రం వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే ఒక ప్రోటోటైప్ రైలు ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుంది. రెండోది త్వరలో ట్రయల్స్కు సిద్ధమవుతోంది. ఆ వెంటనే వీటిని పట్టాలెక్కించనున్నారు. వీటి గరిష్ట వేగం గంటకు 180 కి.మీ.లు కావటంతోపాటు ఇవి స్లీపర్ మోడ్ రైళ్లు అయినందున రాత్రివేళ తిరుగుతాయి. దూరప్రాంతాల మధ్య తిరిగే రైళ్లలో పగటివేళ ప్రయాణానికి ఎక్కువ మంది ఆసక్తి చూపరు. దానివల్ల పనులు చేసుకునే పగటి సమయం వృథా అవుతుండటమే కారణం. దీంతో ఇప్పుడు సాధారణ వందేభారత్ రైళ్లకు బదులు తమకు వందేభారత్ స్లీపర్ సర్వీసులు కేటాయించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. దీంతో క్రమంగా సాధారణ వందేభారత్ రైళ్ల డిమాండ్ తగ్గుతూ వస్తోంది. 200 వందేభారత్ స్లీపర్ రైళ్లు... వీలైనంత తొందరలో దేశవ్యాప్తంగా 200 వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. క్రమంగా ప్రస్తుతం తిరుగుతున్న రాజధాని, దురొంతో ప్రీమియం కేటగిరీ సహా సూపర్ ఫాస్ట్ రైళ్ల స్థానంలో వాటిని ప్రవేళపెట్టే యోచనలో ఉంది. ఇది జరగాలంటే తక్కువ సమయంలో వీలైనన్ని రేక్స్ తయారు కావాల్సి ఉంటుంది. – ప్రస్తుతం చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తొలి ప్రోటోటైప్ రైలు తయారు కాగా, అక్కడ మరిన్ని రైళ్లను తయారు చేయనున్నారు. – రష్యాకు చెందిన కినెత్ రైల్వే సొల్యూషన్స్తో కలిసి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్గా ఏర్పడి 120 రైళ్లను తయారు చేయనుంది. లాతూర్లోని మరాటా్వడా కోచ్ ఫ్యాక్టరీలో ఇవి తయారవుతాయి. – బెంగళూరులోని భారత్ ఎర్త్మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్)లో రెండో ప్రోటోటైప్ రైలు సిద్ధమవుతుండగా, ఇక్కడ వెంటనే మరిన్నింటి తయారీ కొనసాగనుంది. – కోల్కతా శివారులోని టీటాగర్ రైల్ సొల్యూషన్స్ ఫ్యాక్టరీ, ఉత్తరప్రదేశ్లోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీలను కూడా ఇందుకు వినియోగించనున్నారు. అయితే డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా ఉండాలంటే మరిన్ని కోచ్ ఫ్యాక్టరీల్లో కూడా వాటి తయారీ అవసరమని తాజాగా రైల్వే శాఖ భావిస్తోంది. దీంతో కొత్తగా అందుబాటులోకి వస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కూడా ఇందుకు వినియోగించాలని భావిస్తోంది. ఈమేరకు ఇటీవల అధికారులు కోచ్ ఫ్యాక్టరీని సందర్శించి వెళ్లారు. ఈ సంవత్సరం చివరి నాటికి అది పూర్తిస్థాయిలో సిద్ధం కానుంది. మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభించొచ్చని అధికారులు తేల్చారు. ఆ మేరకు రైల్వే బోర్డు ఉన్నతాధికారులు ఢిల్లీలో కూడా సమావేశమై దీనిపై చర్చించినట్టు తెలిసింది.
ఇలా సస్పెండ్ చేసుకుంటూ పోతే పార్టీలో ఎవరూ మిగలర్సార్!!
అప్పుతో ఐపీవో ఆట!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. నూతన ఉద్యోగయోగం
యుగాంత రచయిత
మాటల్లో తెంపరితనం వద్దు!
మనిషి లక్షణాలు
IND VS AUS: టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం
ఉక్రెయిన్ చేతికి టోమాహాక్ క్షిపణి.. అమెరికాకు.. రష్యా వార్నింగ్!
తన గోతిలో తనే పడ్డ శ్రీజ.. ఆడపులి రెమ్యునరేషన్ ఎంతంటే?
విద్యుత్ ఉద్యోగుల ఛలో విజయవాడ
మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా
Telangana: చలాన్ రూల్స్ ఛేంజ్
పగలూరాత్రి తేడా లేకుండా మందు తాగా.. ఆరుగురితో డేటింగ్, ఇద్దరితో పెళ్లి!
గృహప్రవేశం చేసిన సామ్.. కొత్తింట్లో పూజలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి పరపతి పెరుగుతుంది.. ఆస్తిలాభం
జియో ఫెస్టివల్ రీచార్జ్ ప్లాన్.. బోలెడు బెనిఫిట్లు
టీ20 క్రికెట్లో పెను సంచలనం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన నమీబియా
శాంతి బహుమతి ఇవ్వకుండా నాకు శాంతి లేకుండా చేస్తావా!!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. శుభవార్తలు
ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే
శుబ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. డాన్ బ్రాడ్మన్ రికార్డు బ్రేక్
ఇంతలా పెరిగితే కొనేదెలా.. తారాస్థాయికి చేరిన బంగారం ధరలు!
రాబర్ట్ కియోసాకి హెచ్చరిక: ఈ ఏడాదే అతిపెద్ద క్రాష్!
..అంటే మీది డ్రామా అనా..!
నాలుగేళ్లుగా శ్రీనివాస్తోనే బతుకుతున్నా.. నరకం చూడని రోజంటూ లేదు!
అధికారుల జోలికెందుకెళ్తాం సార్! వెళితే వాళ్ల ఓటర్ల జోలికెళ్తాం!!
IND vs WI 2nd Test: టీమిండియాకు భారీ షాక్..
భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడిని.. ఎవరూ రావొద్దని వార్నింగ్!
ఇదొక ఊహించని పరిణామం.. తప్పు అతడిదే: కుంబ్లే
ఇలా సస్పెండ్ చేసుకుంటూ పోతే పార్టీలో ఎవరూ మిగలర్సార్!!
అప్పుతో ఐపీవో ఆట!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. నూతన ఉద్యోగయోగం
యుగాంత రచయిత
మాటల్లో తెంపరితనం వద్దు!
మనిషి లక్షణాలు
IND VS AUS: టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం
ఉక్రెయిన్ చేతికి టోమాహాక్ క్షిపణి.. అమెరికాకు.. రష్యా వార్నింగ్!
తన గోతిలో తనే పడ్డ శ్రీజ.. ఆడపులి రెమ్యునరేషన్ ఎంతంటే?
విద్యుత్ ఉద్యోగుల ఛలో విజయవాడ
మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా
Telangana: చలాన్ రూల్స్ ఛేంజ్
పగలూరాత్రి తేడా లేకుండా మందు తాగా.. ఆరుగురితో డేటింగ్, ఇద్దరితో పెళ్లి!
గృహప్రవేశం చేసిన సామ్.. కొత్తింట్లో పూజలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశి వారికి పరపతి పెరుగుతుంది.. ఆస్తిలాభం
జియో ఫెస్టివల్ రీచార్జ్ ప్లాన్.. బోలెడు బెనిఫిట్లు
టీ20 క్రికెట్లో పెను సంచలనం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన నమీబియా
శాంతి బహుమతి ఇవ్వకుండా నాకు శాంతి లేకుండా చేస్తావా!!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. శుభవార్తలు
ఓటీటీల్లోకి వచ్చిన 37 సినిమాలు.. ఈ వీకెండ్ పండగే
శుబ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. డాన్ బ్రాడ్మన్ రికార్డు బ్రేక్
ఇంతలా పెరిగితే కొనేదెలా.. తారాస్థాయికి చేరిన బంగారం ధరలు!
రాబర్ట్ కియోసాకి హెచ్చరిక: ఈ ఏడాదే అతిపెద్ద క్రాష్!
..అంటే మీది డ్రామా అనా..!
నాలుగేళ్లుగా శ్రీనివాస్తోనే బతుకుతున్నా.. నరకం చూడని రోజంటూ లేదు!
అధికారుల జోలికెందుకెళ్తాం సార్! వెళితే వాళ్ల ఓటర్ల జోలికెళ్తాం!!
IND vs WI 2nd Test: టీమిండియాకు భారీ షాక్..
భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడిని.. ఎవరూ రావొద్దని వార్నింగ్!
ఇదొక ఊహించని పరిణామం.. తప్పు అతడిదే: కుంబ్లే
సినిమా

పవన్ను వదల్లేనంటూ రీతూ ఏడుపు.. పోయి హగ్ చేసుకోమన్న ఫ్లోరా
బిగ్బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో ఐదోవారం నామినేషన్స్ పూర్తవగానే ఎలిమినేట్ అయ్యేదెవరనేది ఫిక్స్ అయిపోయింది. కానీ రీతూ, ఫ్లోరా డేంజర్ జోన్లో ఉన్నట్లు కాసేపు సస్పెన్స్ క్రియేట్ చేశాడు నాగ్. హౌస్లో ఉంచినా సరే, పంపించినా సరే అన్నట్లుగా ఫ్లోరా చాలా కూల్గా ఉంది. కానీ, రీతూ మాత్రం ఏడుపందుకుంది. ఇద్దరినీ యాక్టివిటీ రూమ్కు పిలిచిన నాగ్.. చివరిసారి మీ మనసులోని మాటలు చెప్పమన్నాడు.ఆ విషయం సంజనాకు మాత్రమే తెలుసుఅప్పుడు ఫ్లోరా (Flora Saini) మాట్లాడుతూ.. బిగ్బాస్ హౌస్లో లైట్స్ ఆఫ్ అయిన తర్వాత నేను నా బెడ్పై చాలాసార్లు ఏడ్చాను. ఆ విషయం సంజనా ఒక్కరికే తెలుసు. తను మాత్రమే నా దగ్గరకు వచ్చింది. జైల్లో ఉన్నప్పుడు కూడా సంజనా ఒక్కరే వచ్చింది. సంజనాను నేను మిస్ అవుతాను. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. నీ గేమ్ ఎంజాయ్ చేయ్ అంటూ కాస్త ఎమోషనలైంది. రీతూ వంతు రాగా ఏడుస్తూనే మాట్లాడింది.వెళ్లి పవన్ను హగ్ చేసుకో..పవన్, నిన్ను చాలా మిస్ అవుతా.. నిన్ను వదిలిపెట్టి వెళ్లాలని లేదు. బాగా ఆడు.. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి ఏకధాటిగా ఏడ్చేసింది. తర్వాత నాగ్.. ఫ్లోరా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. అప్పటికీ రీతూ ఏడుపు ఆపకపోయేసరికి ఫ్లోరా.. నువ్వు సేఫ్ అయ్యావ్, ఎందుకేడుస్తున్నావ్.. హ్యాపీగా వెళ్లు, పవన్ను హగ్ చేసుకో అని చెప్పింది. సంజన, ఇమ్మాన్యుయేల్, దివ్య, శ్రీజలకు థంబ్స్ అప్ ఇచ్చి తనూజ, భరణికి థంబ్స్ డౌన్ సింబల్ ఇచ్చింది. సుమన్ శెట్టి.. థంబ్స్ అప్, థంబ్స్ డౌన్కు మధ్యలో ఉన్నాడంది. అందరికీ గుడ్బై చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.చదవండి: ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?

కాంతార చాప్టర్ 1.. రజినీకాంత్ కూలీ రికార్డ్ బ్రేక్!
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార ఛాప్టర్-1 రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్ల మార్క్ దాటేసిన ఈ సినిమా పదో రోజు కూడా అదే జోరును కొనసాగిస్తోంది. సెకండ్ వీకెండ్ కలిసి రావడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో ఇండియన్ మూవీగా నిలిచింది. పదో రోజు శనివారం ఒక్క రోజే రూ.37 కోట్ల నికర వసూళ్లు సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా రూ. 396.65 నెట్ వసూళ్లు రాగా.. రూ.476 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే రజనీకాంత్ కూలీ, సైయారా, వార్-2 లాంటి రీసెంట్ హిట్ సినిమాలను అధిగమించింది.మొదటి రోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ చేయనుంది. అయితే ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ఛావా కంటే వెనకే ఉంది. కాంతారా చాప్టర్ -1 ప్రపంచవ్యాప్తంగా చూస్తే పది రోజుల్లోనే రూ.560 నుంచి రూ.590 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన కూలీ(రూ.518 కోట్లు), టైగర్ జిందా హై (రూ.558 కోట్లు), ధూమ్ 3 (రూ.558 కోట్లు) సైయారా (రూ.570 కోట్లు), పద్మావత్ (కూ.585 కోట్లు), సంజు (రూ.589 కోట్లు) లాంటి లైఫ్టైమ్ గ్రాస్ కలెక్షన్స్ కూడా దాటేసినట్లే అవుతుంది. దీంతో ఈ సినిమా త్వరలోనే ఆరు వందల మార్క్ చేరుకునే అవకాశముంది.ఈ మూవీని 2022లో వచ్చిన బ్లాక్బస్టర్ మూవీ కాంతారకు ప్రీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు.

అమ్మాయిల్ని ఇంటికి తీసుకొస్తా.. పేరెంట్స్ అర్థం చేసుకుంటారు
బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ (Farah Khan) ఈ మధ్య యూట్యూబ్ వ్లాగ్స్పై స్పెషల్ ఫోకస్ చేసింది. ఎప్పుడూ ఏదో ఒక యాక్టర్ ఇంటికి వెళ్లి చిట్చాట్ చేస్తూ వీడియోలు తీస్తోంది. అలా తాజాగా హిందీ నటుడు కరణ్ టక్కర్ (Karan Tacker) ఇంటికి వెళ్లింది. ఎప్పటిలాగే తన వంటమనిషి దిలీప్ను తోడుగా తీసుకెళ్లింది. ఫరాఖాన్ చేసే వీడియోల పుణ్యమా అని దిలీప్ ఎక్కువ ఫేమస్ అయిపోయాడు. ఫ్యామిలీ హౌస్.. కానీ!కరణ్ ఇంటికి వెళ్లగా.. అక్కడున్న మహిళా సెక్యూరిటీ సిబ్బంది ఫరాఖాన్కు బదులుగా దిలీప్ను గుర్తుపట్టి హాయ్ చెప్పింది. అది చూసి అవాక్కైన ఫరా.. ఆమె నాకు బదులుగా నీకు హాయ్ చెప్పింది అని ఆశ్చర్యపోయింది. అందుకు దిలీప్ మురిసిపోతూ ఈ మధ్య నాకు ఆడవాళ్ల ఫాలోయింగ్ పెరిగిపోయిందన్నాడు. ఇక మెయిన్ డోర్ నుంచి అడుగుపెడుతూనే ఇదెవరి ఇల్లు అని అడిగింది ఫరా. అందుకు కరణ్.. మా కుటుంబానిది అని బదులిచ్చాడు. అలాగైతే కచ్చితంగా ఇది నీది కాదు, నీ తల్లిదండ్రుల ఇల్లే! అది సరే, మరి అమ్మాయిలను ఇంటికి ఎలా తీసుకొస్తావ్? అని సరదాగా అడిగింది. నాకింకా పెళ్లవలేదుఅందుకు కరణ్ వెంటనే.. మా ఇంట్లో అందరూ అర్థం చేసుకునేవాళ్లే! మా అభిరుచులకు అనుగుణంగా ఈ ఇల్లు కట్టారు. నాకింకా పెళ్లి కాలేదు కాబట్టి రెండు లివింగ్ రూమ్స్ ఉన్నాయి. ఒకటి మా పేరెంట్స్ కోసం, మరోటి నాకోసం! ఎప్పుడైనా ఎవరినైనా ఇంటికి తీసుకొస్తే మా ఫ్యామిలీ గ్రూప్లో మెసేజ్ చేస్తాను. అప్పుడు వాళ్లు వారి లివింగ్ రూమ్ దాటి ఇటుపక్క రారు. నా పేరెంట్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని చెప్పుకొచ్చాడు.సీరియల్స్.. రియాలిటీ షోలుకరణ్ టక్కర్.. లవ్ నే మిలాది జోడి, ఏక్ హజారూ మే మేరి బెహ్నా హై వంటి పలు సీరియల్స్లో నటించాడు. డ్యాన్స్ రియాలిటీ షో 'జలక్ దిక్లాజా 7'వ సీజన్లో పార్టిసిపేట్ చేయగా ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. 'ద వాయిస్', 'నాచ్ బలియే 8' వంటి పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. స్పెషల్ ఆప్స్, ఖాకీ వంటి వెబ్ సిరీస్లలో యాక్ట్ చేశాడు. తన్వి: ద గ్రేట్ సినిమాలోనూ నటించాడు. View this post on Instagram A post shared by Karan Tacker (@karantacker) చదవండి: గృహప్రవేశం చేసిన సామ్.. కొత్తింట్లో పూజలు

'మీ అందానికి సీక్రెట్ ఏంటని అడిగా'.. డ్రాగన్ హీరో ప్రదీప్
డ్రాగన్ మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్. మరో హిట్ కొట్టేందుకు రెడీ అయిపోయాడు. ప్రేమలు బ్యూటీ మమితా బైజు ఈ మూవీలో హీరోయిన్గా కనిపించనుంది. వీరిద్దరు జంటగా వస్తోన్న యూత్ ఎంటర్టైనర్ డ్యూడ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా యూత్ ఆడియన్స్ను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమాకు కీర్తీశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు హీరో ప్రదీప్. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో తన అందానికి సంబంధించిన ఓ సీక్రెట్ను పంచుకున్నారు. మొదటిసారి శరత్ కుమార్ సార్ను కలిసినప్పుడు మీ వయస్సు ఎంత సార్ అని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు. దాదాపు 71 ఏళ్ల వయసులోనూ కేవలం 40 ఏళ్ల యువకుడిలా కనిపించారని అన్నారు. ఆయనతో సార్ అసలు మీరు ఏం తింటారు? ఇంత అందంగా, యంగ్గా ఫిజిక్ ఉండడానికి కారణమని ఏంటని అడిగినట్లు తెలిపారు. దీనికి నేను రోజు ఉదయాన్నే బీట్ రూట్ జ్యూస్ తాగుతానని శరత్ సార్ నాతో చెప్పారని వెల్లడించారు. బీట్ రూట్ జ్యూస్ తాగితే అందంగా తయారు అవుతారేమో అనుకుని రోజు తాగేవాడినని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆరోగ్యపరంగానే కాకుండా.. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని ప్రదీప్ రంగనాథన్ వెల్లడించారు.కాగా.. డ్యూడ్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబరు 17న థియేటర్లలో విడుదల కానుంది.
న్యూస్ పాడ్కాస్ట్

తవ్వేకొద్ది బయటపడుతోన్న టీడీపీ నేతల నకిలీ లిక్కర్ బాగోతం..A1 జనార్ధన్రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు..

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్..పెండింగ్ బిల్లులు చెల్లించాలని నెట్వర్క్ ఆస్పత్రుల డిమాండ్...పేదలకు పెనుశాపంగా మారిన కూటమి పాలన

ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు... ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి

నేడు నర్సీపట్నం వైద్య కళాశాలను వైఎస్ జగన్ సందర్శన

ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల రక్షణకు పోరుబాట... నేడు నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరుబాట... ఉద్యమాన్ని ఉదృతం చేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు

ఏపీలో నకిలీ మద్యం రింగ్ లీడర్లను బుజ్జగిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలు

ఆంధ్రప్రదేశ్లో రాత్రికి రాత్రే కల్తీ మద్యం సూత్రధారులను మార్చేశారు... సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ‘ప్లాన్ బీ’ సిద్ధం... కోర్టుల్లో ప్రతికూల తీర్పులు వస్తే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం దందాకు కూటమి ప్రభుత్వం అండదండలు... తొలి ఏడాదే 5 వేల 280 కోట్ల రూపాయల దోపిడీ
క్రీడలు

భారత్తో రెండో టెస్ట్.. విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో (India vs West Indies) పర్యాటక వెస్టిండీస్ ఫాలో ఆన్ ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. ఒటమి ఖరారు చేసుకొనే, రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఊహించిన విధంగానే 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ పరాజయం దిశగా సాగుతున్న వేళ.. జాన్ క్యాంప్బెల్ (john Campbell), షాయ్ హోప్ (Shai Hope) అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి క్యాంప్బెల్ 87, హోప్ 66 పరుగులతో అజేయంగా ఉన్నారు. వీరిద్దరు మూడో వికెట్కు అజేయమైన 138 పరుగులు జోడించారు. విండీస్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులుగా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది. తేజ్నరైన్ చంద్రపాల్ను (10) సిరాజ్.. అలిక్ అథనాజ్ను (7) వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశారు.దీనికి ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోర్కే పతనమైంది. 41 పరుగులు చేసిన అథనాజ్ టాప్ స్కోరర్ కాగా.. చంద్రపాల్ (34), జాన్ క్యాంప్బెల్ (10), షాయ్ హోప్ (36), టెవిన్ ఇమ్లాచ్ (21), జస్టిన్ గ్రీవ్స్ (17), ఖారీ పియెర్ (23), ఆండర్సన్ ఫిలిప్ (24 నాటౌట్), జేడన్ సీల్స్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్, జడేజాతో పాటు సిరాజ్, బుమ్రా కూడా తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్కు 3, ఛేజ్కు ఓ వికెట్ దక్కింది. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్

IND VS AUS: అరుదైన మైలురాయిని తాకిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచ రికార్డు
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతుంది.తొలుత మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్లో (2025) 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించిన ఆమె.. ఆతర్వాత కొద్ది నిమిషాలకే వన్డేల్లో 5000 పరుగుల అరుదైన మైలురాయిని అందుకుంది. 1000 పరుగుల మార్కును సిక్సర్తో తాకిన మంధన.. 5000 పరుగుల మైలురాయిని కూడా సిక్సర్తోనే అందుకుంది.బంతులు, ఇన్నింగ్స్ల పరంగా మంధన ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5000 పరుగుల మైలురాయిని తాకిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మైలురాయిని తాకేందుకు ఆమెకు కేవలం 112 ఇన్నింగ్స్లు, 5569 బంతులు అవసరమయ్యాయి. గతంలో ఈ రికార్డులు స్టెఫానీ టేలర్ (129 ఇన్నింగ్స్లు), సూజీ బేట్స్ (6182 బంతులు) పేరిట ఉండేవి.ఈ రికార్డును అత్యంత పిన్న వయసులో (29) సొంతం చేసుకున్న ప్లేయర్గానూ మంధన రికార్డు నెలకొల్పింది.వన్డే క్రికెట్లో మంధన సహా కేవలం 5 మంది మాత్రమే 5000 పరుగులు పూర్తి చేశారు. మిథాలీ రాజ్ (7805) తర్వాత భారత్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్ మంధన మాత్రమే.ఈ మ్యాచ్లో మంధన 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటైంది. ప్రస్తుత ప్రపంచకప్లో మంధనకు ఇదే తొలి అర్ద సెంచరీ (4 మ్యాచ్ల్లో).వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేస్తుంది. 27 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 171/1గా ఉంది. మంధన ఔట్ కాగా.. ప్రతిక రావల్ (68), హర్లీన్ డియోల్ (12) క్రీజ్లో ఉన్నారు. మంధన వికెట్ సోఫీ మోలినెక్స్కు దక్కింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వన్డే వరల్డ్కప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనత సాధించింది. ఎవరూ సాధించని ఈ ఘనతను మంధన భారీ సిక్సర్తో చేరుకోవడం మరో విశేషం.వన్డేల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు (2025లో 18 ఇన్నింగ్స్ల్లో 1000* పరుగులు) చేసిన బ్యాటర్ల జాబితాలో మంధన తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ (1997లో 970 పరుగులు), లారా వోల్వార్డ్ట్ (2022లో 882 పరుగులు), న్యూజిలాండ్కు చెందిన డెబ్బీ హాక్లీ (1997లో 880), న్యూజిలాండ్కు చెందిన యామీ సాటర్థ్వైట్ (2016లో 853) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేస్తుంది. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 90/0గా ఉంది. ఓపెనర్లు మంధన 49, ప్రతిక రావల్ 40 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.మంధన@18మంధన ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగుల మార్కును 18 పరుగుల వద్ద చేరుకుంది. 1000 పరుగుల మార్కును ఆమె 18వ ఇన్నింగ్స్లో చేరుకుంది. మంధన జెర్సీ నంబర్ కూడా 18 కావడం విశేషం.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్లోనూ భారత్కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది). మూడో మ్యాచ్లో ఆసీస్ పాక్పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్లో ఉంది.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు

CWC 2025: ఆస్ట్రేలియాతో సమరం.. టీమిండియా బ్యాటింగ్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) ఇవాళ (అక్టోబర్ 12) ఆసక్తికర సమరం జరుగుతుంది. భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్లు వైజాగ్ వేదికగా అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత మహిళల జట్టు (Team India) వన్డేల్లో టాస్ కోల్పోవడం ఇది వరుసగా ఆరోసారి. తుది జట్లు..ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ (కెప్టెన్/వికెట్కీపర్), ఫోబ్ లిచ్ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్గ్రాత్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షుట్భారత్: ప్రతికా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్కీపర్), అమంజోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణికాగా, ప్రస్తుత ప్రపంచకప్లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్లోనూ భారత్కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది). మూడో మ్యాచ్లో ఆసీస్ పాక్పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్లో ఉంది. చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు
బిజినెస్

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త!
హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ సొల్యూషన్స్ అందించే థండర్ప్లస్ తాజాగా వాహనాల దిగ్గజం టాటా మోటర్స్తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతో పాటు మరో అయిదు రాష్ట్రాల్లో చిన్న వాణిజ్య వాహనాల చార్జింగ్ కోసం కొత్తగా 5,000 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను థండర్ప్లస్ ఇన్స్టాల్ చేయనుంది.వాణిజ్య వాహనాల పోర్ట్ఫోలియోను విద్యుదీకరించుకోవాలన్న టాటా మోటర్స్ ప్రయత్నాలకు ఇది సహాయకరంగా ఉండనుంది. నిరాటంకమైన, విశ్వసనీయమైన, విస్తరించతగిన విధంగా ఈవీ చార్జింగ్ స్టేషనలను అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమని థండర్ప్లస్ సీఈవో రాజీవ్ వైఎస్ఆర్ తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్కు డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎస్యూవీలకు అప్గ్రేడ్ కావాలనుకునే కస్టమర్లు తమ పంచ్ వాహనం వైపు మొగ్గు చూపే ధోరణి నెలకొందని టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో తమ మొత్తం అమ్మకాలకు సంబంధించి తెలంగాణలో 21 శాతం, ఆంధ్రప్రదేశ్లో 25 శాతం వాటా పంచ్దే ఉందని పేర్కొంది.హైదరాబాద్, విజయవాడలో ఈ ఎస్యూవీ విక్రయాలు రెండింతలు పెరిగాయని కంపెనీ వివరించింది. నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా టాటా మోటర్స్ విక్రయాల్లో పంచ్ వాటా 33 శాతంగా నమోదైనట్లు పేర్కొంది. సెప్టెంబర్లో దేశీయంగా టాప్ 5 కార్లలో ఒకటిగా నిల్చిందని వివరించింది.

రాబర్ట్ కియోసాకి హెచ్చరిక: ఈ ఏడాదే అతిపెద్ద క్రాష్!
ఎక్స్ వేదికగా పెట్టుబడికి సంబంధించిన విషయాలను పేర్కొంటూ ఉండే.. రిచ్ రాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో.. ఈ ఏడాది అతిపెద్ద క్రాష్ జరుగుతుందని హెచ్చరించారు.ప్రపంచ చరిత్రలో అతిపెద్ద క్రాష్ జరుగుతుందని.. నేను ముందే ఊహించాను. ఆ క్రాష్ ఈ ఏడాది జరుగుతుంది. బేబీ బూమ్ రిటైర్మెంట్లు తుడిచిపెట్టుకుపోబోతున్నాయి. కియోసాకి ప్రకారం.. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను పొందే అవకాశం ఉందని, ఇదే అతిపెద్ద క్రాష్ అని స్పష్టంగా అర్థమవుతోంది. స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడానికి టారిఫ్స్ ప్రభావం, ఆర్ధిక మాంద్యం, అంతర్జాతీయ అనిశ్చితి మొదలైనవి ప్రధాన కారణాలు.డబ్బు కూడబెట్టొద్దు, నిజమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టండని హెచ్చరిస్తూనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా.. నేను సేవర్స్ ఓడిపోయేవారు అని చెబుతూనే ఉన్నాను. చాలా సంవత్సరాలుగా నేను బంగారం, వెండి, బట్కాయిన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచించాను. వాటి ధరలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలుసు.ఇప్పుడు ఎథెరియంలను సేవ్ చేయమని చెబుతున్నాను. ఈ రోజు నేను వెండి & ఎథెరియం ఉత్తమమైనవని నమ్ముతున్నాను. ఎందుకంటే వీటి విలువ పెరుగుతూనే ఉంటుంది. వీటిని ముఖ్యంగా పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది. దయచేసి వెండి, ఎథెరియం లాభాలు & నష్టాలను మాత్రమే కాకుండా.. ఉపయోగాన్ని కూడా అధ్యయనం చేయండి. మీ సొంత ఆర్థిక జ్ఞానంతో పెట్టుబడి పెట్టండి. ఎప్పటికప్పుడు మీ సొంత ఆర్థిక తెలివితేటలను పెంచుకుంటుంటే.. తప్పకుండా ధనవంతులు అవుతారు. జాగ్రత్తపడండి అంటూ కియోసాకి ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: 'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకిపెరుగుతున్న వెండి ధరలుబంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కేజీ వెండి రూ. 190000 వద్దకు చేరింది. ఈ సందర్భంగా ''వెండి 50 డాలర్లు దాటేసింది, తరువాత 75 డాలర్లకు?.. సిల్వర్, ఎథిరియం హాట్, హాట్'' (ధరలు భారీగా ఉన్నాయని) అంటూ కియోసాకి ట్వీట్ చేశారు. దీన్నిబట్టి చూస్తే.. వెండి కూడా మరింత పెరుగుతుందని తెలుస్తోంది.REMINDER: I predicted the biggest crash in world history was coming in my book Rich Dad’s Prophecy. That crash will happen this year. Baby Boom Retirements are going to be wiped out. Many boomers will be homeless or living in their kids basement. Sad.REMiNDER: I have…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 11, 2025

కియా క్లావిస్ కొత్త వెర్షన్: ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం కియా (Kia) తాజాగా కారెన్స్ క్లావిస్ (Carens Clavis)లో కొత్త వెర్షన్ హెచ్టీఎక్స్ (ఓ)ని ప్రవేశపెట్టింది దీని ధర రూ. 19,26,717 (ఎక్స్ షోరూం)గా ఉంటుందని సంస్థ తెలిపింది.ఈ కొత్త వెర్షన్ కారులో బోస్ ప్రీమియం సౌండ్ సిస్టం, డ్రైవ్ మోడ్ సెలెక్ట్, స్మార్ట్ కీ రిమోట్ ఇంజిన్ స్టార్ట్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ తదితర ఫీచర్లు ఉంటాయి. ఇది 6,7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. అలాగే హెచ్టీకే ప్లస్, హెచ్టీకె ప్లస్ (ఓ)లో 6 సీటర్ వేరియంట్లను కూడా ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఇవి అక్టోబర్ 13 నుంచి దేశవ్యాప్తంగా తమ షోరూమ్లలో లభిస్తాయని పేర్కొంది.

ఎన్ని కార్లు ఉన్నా.. బ్లాక్ బీస్ట్ అంటేనే ఇష్టం: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. ఆటోమొబైల్ ఔత్సాహిలు. ఈ కారణంగానే పలు కార్లను వినియోగిస్తున్నారు. అయితే ఈయన ఉపయోగించే అన్ని కార్లు కూడా స్వదేశీ ఉత్పత్తులే. ముఖ్యంగా తనకు బొలెరో అంటే చాలా ఇష్టమని.. దీనిని ఆయన బ్లాక్ బీస్ట్ అని పిలుస్తారని గతంలో వెల్లడించారు. ఇప్పుడు తాజాగా ఓ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.మా మొట్టమొదటి హార్డ్ టాప్ ఎస్యూవీ అయిన 'మహీంద్రా అర్మాడ' మొదటిసారి విడుదలైనప్పటి నుంచి.. నేను మరే ఇతర కార్ బ్రాండ్ను నడపలేదు. అర్మడకు ముందు, నా దగ్గర హిందూస్తాన్ మోటార్స్ కాంటెస్సా ఉండేది!. అయితే నేను ఇప్పుడు మహీంద్రా లేటెస్ట్ కారు ఎక్స్ఈవీ 9ఈను ఉపయోగిస్తున్నప్పటికీ.. నాకు బొలెరో అంటేనే ఇష్టం అని నిజాయితీగా చెప్పగలను అని ఆనంద్స్కార్పియో ప్రారంభించబడటానికి ముందే నేను "బ్లాక్ బీస్ట్" అనే మారుపేరుతో ఉన్న నా బొలెరోను స్వయంగా నడిపాను. ఇప్పుడు, బీస్ట్ తిరిగి వచ్చింది. ఇది సరికొత్త 2025 అవతార్లో ఉంది. వ్యాగన్ ఆర్ తరువాత.. 2000లో ప్రారంభించినప్పటి నుంచి నిరంతర ఉత్పత్తిలో ఉన్న పురాతన భారతీయ కార్ బ్రాండ్ బొలెరో. అది ఆల్టో కంటే కేవలం ఒక నెల ముందు వచ్చిందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.ఇదీ చదవండి: కొత్తకారు కొన్న రోహిత్ శర్మ: ఎలాన్ మస్క్ రీపోస్ట్..కొన్నేళ్లుగా.. మహీంద్రా ఆటో బృందాలు బోలెరోను దశలవారీగా నిలిపేయాలని భావించప్పటికీ.. అది సాధ్యం కాలేదు. కానీ ఎప్పటికప్పుడు కొత్త హంగులతో అప్డేట్స్ పొందుతూనే ఉంది. ఇందులో భాగంగానే 2025 బొలెరో మార్కెట్లో లాంచ్ అయిందని వెల్లడించారు.2025 మహీంద్రా బొలెరోమహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల కొత్త బొలెరో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది చిన్న కాస్మొటిక్ అప్డేట్లతో పాటు.. కొత్త ఫీచర్స్ పొందుతుంది. అయితే యాంత్రికంగా ఎలాంటి అప్డేట్స్ పొందలేదు. ఇందులో 5 3 ఇంజిన్ ఉంటుంది. ఇది 76 హార్స్ పవర్, 210 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో మాత్రమే లభిస్తుంది.Since the Mahindra Armada, our first hard-top SUV, first rolled out, I’ve never driven any other car brand.(Before the Armada, I had a Hindustan Motors Contessa!)And although today I use the XEV 9e, the most advanced vehicle Mahindra has ever built, I can honestly say that the… pic.twitter.com/K4Axlnmzi2— anand mahindra (@anandmahindra) October 11, 2025
ఫ్యామిలీ

పిట్ట మైల్డ్.. వేట వైల్డ్
కాస్త వేట తెలిసిన పెద్దపెద్ద పక్షులైతే మాంసం ముక్కకోసం వెతుకుతాయి చిన్నా చితకా పక్షులు గింజలు తింటాయి. దొరికితే పురుగుపుట్రను నోట్లో వేసుకుంటాయి. అయితే ష్రైక్ అనే పక్షి క్రూరత్వాన్ని చూస్తే మాంసాహారులకు కూడా మనసు చలిస్తుంది. దీని వేటలో అంత వ్యూహం ఉంటుంది మరి! ‘లానిడే’ కుటుంబానికి చెందిన అనేక రకాల పక్షులను ష్రైక్ పక్షులు అంటారు. ఈ పక్షులు చూడటానికి చాలా మైల్డ్గా కనిపిస్తాయి గాని, వీటిని వైల్డ్ బర్డ్స్ అని కూడా అంటారు. వీటికి వేటాడే జంతువులకు ఉన్నట్లుగా బలమైన కాళ్లు, గోళ్లు ఉండవు. అందుకే ఇవి తన ఆహారాన్ని విలక్షణంగా సమకూర్చుకుంటాయి. చిన్న కీటకాలు, బల్లులు, కప్పలు, చిట్టెలుకలు, కాస్త బలహీనంగా ఉండే రామచిలుకలను వేటాడి, వాటిని నిర్దాక్షిణ్యంగా బతికి ఉండగానే ముళ్ళ పొదలపైన లేదా పదునైన కొమ్మలపైన, మొనలుదేరిన తీగలపైన గుచ్చి చంపుతాయి. మాంసం దుకాణంలో మాంసాన్ని కొక్కేలకు వేలాడదీసినట్లుగా ఈ పక్షులు తమ ఆహారాన్ని ముళ్లకంపలకు వేలాడదీస్తాయి. ఈ పద్ధతి వాటి మనుగడకు అత్యంత కీలకం. ష్రైక్ పక్షులు తమ ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి, తర్వాత అవసరమైనప్పుడు ముక్కలుగా చేసి తినడానికి ఈ విధానాన్నే ఎంచుకుంటాయి. మనకు ఈ పద్ధతి క్రూరంగా అనిపించినా, ప్రకృతిలో ఈ జీవులు తమ మనుగడ కోసం అనుసరించే వ్యూహం ఇదంతా. ఇక తినే ఆహారం విషతుల్యమైందనే అనుమానం వస్తే, ఈ పక్షులు తాము వేటాడిన ఆహారాన్ని అక్కడే వదిలిపెట్టి మరునాడు వచ్చి, అప్పటికి సురక్షితంగా ఉన్నట్లయితే తింటాయట!

చిన్నారులకు ఆస్తమా..! ఇన్హేలర్స్..నో వర్రీస్..
పిల్లల్లో ఆస్తమా వచ్చి వాళ్లు బాధపడుతుంటే చూసేవాళ్లకు ఆ దృశ్యం చాలా హృదయవిదారకంగా ఉంటుంది. అలా ఆయాసపడుతూ ఊపిరి అందని చిన్నారులను చూస్తే చాలా బాధగా ఉంటుంది. అయితే చిన్నవయసులో ఆస్తమా వచ్చిన చిన్నారుల విషయంలో అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. నిజానికి పిల్లల్లో వచ్చే ఈ ఆరోగ్య సమస్యను ‘రియాక్టివ్ ఎయిర్ వే డిసీజ్’ అంటారు. కానీ సామాన్య జనవాడుకలో దీన్ని ఆస్తమాగా చెబుతుంటారు. చిన్నారుల ఆస్తమా చికిత్సలో అవసరాన్ని బట్టి కొన్ని మందులు నెబ్యులైజేషన్ తర్వాత వారిలో మున్ముందు ఆస్తమా రాకుండా చూసేందుకు డాక్టర్లు రెండు రకాల ఇన్హేలర్స్ సూచిస్తుంటారు. ఇందులో మొదటి రకం ఇన్హేలర్స్ను ‘రిలీవర్స్’ అంటారు. ఇవి తక్షణం ఊపిరి అందేందుకు మొట్టమొదటి చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీటెమెంట్) కోసం వాడేవి. ఇవి అటాక్నుంచి రిలీవ్ చేస్తాయి కాబట్టి వీటిని ‘రిలీవర్స్’ అంటారు. ఇవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలిగొట్టాలను వెడల్పుగా విప్పారేలా చేసి పిల్లలు హాయిగా గాలితీసుకునేందుకు ఉపయోగపడతాయి. ఇక ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లో కొన్ని ఇన్ఫ్లమేటరీ సెల్స్ పుడతాయి. వీటిని తొలగించడం రిలీవర్స్కు సాధ్యం కాదు. అలాంటి వాటిని తొలగిస్తూ మున్ముందుకు అటాక్ రాకుండా నివారించే ఇన్హేలర్స్ను ‘ప్రివెంటర్స్’ అంటారు. అవి నివారణకు ఉపయోగపడతాయి కాబట్టి వాటిని ప్రివెంటార్స్గా అభివర్ణిస్తారు. ఇలా ఈ రెండు రకాల ఇన్హేలర్స్తో చిన్నారుల ఊపిరితిత్తుల కార్యకలాపాలు వీలైనంత నార్మల్గా పనిచేసేలా డాక్టర్లు చూస్తారు. ఇవి వాడుతూపోతుంటే క్రమంగా ‘రిలీవర్స్’ వాడాల్సిన అవసరం దాదాపుగా పూర్తిగా తగ్గిపోతుంది. పిల్లల్లో వ్యాధి తీవ్రత ఎంతగా ఉందో, దాన్ని అదుపులో ఉంచేందుకు మందుల డోస్లు ఎంతెంత మార్చాలో తెలుసుకోవడం కోసం అవసరమైనప్పుడు డాక్టర్లు ‘పల్మునరీ ఫంక్షన్ టెస్ట్ – పీఎఫ్టీ’ అనే పరీక్ష చేస్తారు. పిల్లలు పెరుగుతున్నకొద్దీ చాలామందిలో అటాక్స్ దాదాపు పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ. చాలామంది పిల్లల్లో ఆర్నెల్లలోనే ఆస్తమా పూర్తిగా అదుపులోకి వచ్చేసే అవకాశాలుంటాయి. ఒకసారి ఆస్తమా అదుపులోకి వచ్చాక ఇన్హేలర్స్ దాదాపు నిలిపివేయవచ్చు కూడా. అయితే ఈ ఇన్హేలర్స్కు పిల్లలు అలవాటు పడిపోతారేమోనని కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. పైగా ఇన్హేలర్స్ ఎంత సురక్షితమంటే నోటి నుంచి తీసుకునే మందులతో పోలిస్తే వాటిలోంచి దేహంలోకి వెళ్లే మందు కేవలం సమస్య ఉన్న చోటికే పరిమితమవుతుంది. దేహమంతటా తన దుష్ప్రభావాలు చూపదు. అందుకే అవి పూర్తిగా సురక్షితమని పేరెంట్స్ నమ్మవచ్చు. (చదవండి: Dental Health: ఓపెన్ యువర్ మౌత్..! నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఇలా..)

సేఫ్ హ్యాండిల్స్!
డోర్ హ్యాండిల్ అంటే మనం పెద్దగా పట్టించుకోని చిన్న వస్తువు. కాని, అక్కడే నిత్యం బ్యాక్టీరియా కణాలు పార్టీ చేసుకుంటుంటాయి. తెలియకుండానే వ్యాధులను లోపలికి ఆహ్వానించే ఈ హ్యాండిల్స్ని చూసి, ‘ఇక చాలు’ అనుకున్నాడు జమైకా యువ ఆవిష్కర్త రేవాన్స్ స్టూవర్ట్ట్. వెంటనే సెల్ఫ్ క్లీనింగ్ డోర్ హ్యాండిల్కు ప్రాణం పోశాడు. జమైకా తీరం దగ్గర పుట్టిన అతడి ఆలోచన ఇప్పుడు ఆసుపత్రుల తలుపులకు చేరి వేలాది మంది ప్రాణాలను రక్షిస్తోంది. రేవాన్స్ స్టూవర్ట్.. జమైకా పర్వతాల మధ్యలోని మౌంట్ ప్రాస్పెక్ట్ అనే చిన్న ఊరిలో పెరిగిన అబ్బాయి. జమైకా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్న విద్యార్థి. అయితే, కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమయ్యే విద్యార్థి కాదు, వాస్తవ సమస్యలను గమనించి, వాటికి పరిష్కారాలను వెతికే క్రియేటర్. చిన్నప్పటి నుంచి వస్తువులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ఆటబొమ్మలు, రేడియోలు విప్పదీసి మళ్లీ కలపడం అతని ఫేవరెట్ గేమ్. అందుకే అతని తల్లి ఎప్పుడూ అతనికి ‘రేవాన్స్ , వస్తువులను పగలగొట్టడం మానెయ్యి!’ అని చెబుతుండేది. కుటుంబంలో ఎవరికీ అక్షరాలు రాకున్నా, రేవాన్స్ యూనివర్సిటీలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఇన్నోవేషన్లపై ప్రేమ పెంచుకున్నాడు. వర్చువల్గా దుస్తులు ట్రై చేసుకునే సాఫ్ట్వేర్ను కూడా తయారు చేశాడు. కాని, అసలైన మలుపు ఒక ఆసుపత్రిలో వాలంటీర్గా పనిచేసేటప్పుడు వచ్చింది. అక్కడే గ్రహించాడు ‘డోర్ హ్యాండిల్స్ అంటే అనారోగ్యానికి నేరుగా ఫ్రీ ఎంట్రీ పాస్ల లాంటివి’. అప్పుడే ‘జెర్మోసోల్’ అనే మ్యాజిక్ డోర్ హ్యాండిల్ను తయారు చేశాడు. ఎలా పనిచే స్తుందంటే? సూర్యరశ్మిని సూక్ష్మజీవులు తట్టుకోలేవు కదా! అదే సూత్రాన్ని ఇక్కడ వాడాడు. హ్యాండిల్లో ఒక చిన్న అల్ట్రావయొలెట్ లైట్ అమర్చాడు. మనం తాకగానే అది వెలుగుతుంది. అందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్ కాంతి ముప్పయి సెకన్లలో హ్యాండిల్పై ఉన్న బ్యాక్టీరియాను అంతం చేస్తుంది. దాదాపు 99.9 శాతం శుభ్రత సాధ్యం! ఇది కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, కరీబియన్స్ వాతావరణానికి సరిపోయే ప్రాణరక్షక కవచం. ఆసుపత్రులు, స్కూళ్లు, ఆఫీసులు సహా ఎక్కడ తలుపులు ఉంటాయో, అక్కడ దీని రక్షణ అవసరం. ఈ అద్భుత ఆవిష్కరణ రేవాన్స్ కి జమైకా ప్రధాని చేతుల మీదుగా జాతీయ యువ శాస్త్రవేత్త అవార్డు, అలాగే కామన్వెల్త్ హెల్త్ ఇన్నోవేషన్స్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇప్పుడు తలుపు తీయడం అంటే కేవలం లోపలికి వెళ్లడం కాదు, సూక్ష్మజీవులను బయటే వదిలేయడం కూడా! ఈ విషయమై రేవాన్స్ మాట్లాడుతూ, ‘ఎన్ని కష్టాలు వచ్చినా మా కుటుంబం ఎప్పుడూ ఒకటిగానే నిలిచింది. వాళ్లే నా బలం, వాళ్లే నా ప్రేరణ’. అని చెప్పాడు. ∙

అసలైన అంధుడు
సూరారంలో సుబ్బయ్య అనే ఆస్తి పరుడు ఉండేవాడు. అతను పరమ లోభి. అనేక అక్రమ వ్యాపారాలు చేసి డబ్బు కూడబెట్టాడు. దానం చేసే బుద్ధి, పరోపకార గుణం సుబ్బయ్యలో మచ్చుకైనా లేకుండేవి. ఏ పనైనా వెంటనే కావాలనుకునేవాడు.అయితే, అతనికి దేవునిపై నమ్మకం ఎక్కువ. వీలు దొరికినప్పుడల్లా ఏదో ఒక దేవాలయానికి వెళ్లి తన కోరికలు చెప్పుకునేవాడు.పండరిపుర పాండురంగడు కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడని సుబ్బయ్య చెవిన పడింది. వెంటనే పండరిపురం వెళ్లాడు. చంద్రవంక నదిలో స్నానం చేసి పుండరీకుని దర్శనం చేసుకున్నాడు. తన కోరికలు పాండురంగనికి చెప్పమని కోరుకున్నాడు. ఆ తర్వాత పాండురంగని ఆలయానికి చేరుకున్నాడు.పాండురంగని ఆలయం ఎంతో సుందరంగా ఉంది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి. దైవ దర్శనానికి ఉన్న వరుస ఎంతో పొడవుగా భక్తులతో కిటకిటలాడుతోంది.సుబ్బయ్య అక్రమ బుద్ధి అక్కడ కూడా చూపించాడు. వరుసలో భక్తులు ఒకరి వెంట ఒకరు నెమ్మదిగా పాండురంగని భజన చేసుకుంటూ వెళుతున్నారు. సుబ్బయ్య మాత్రం వెంటనే భగవంతుని దర్శనం చేసుకోవాలని వరుసలోంచి పక్కకు వచ్చి అందర్నీ తోసుకుంటూ ముందుకు పోయాడు. పాండురంగని దర్శించుకుని బయటకు వెళ్లాడు. ‘అయ్యా! దానం చేయండి!’ అంటూ బిచ్చగాళ్లు చుట్టుముట్టారు. అందర్నీ విదిలించుకుని వెళ్ళి దూరంగా ఉన్న అరుగు మీద కూర్చున్నాడు.అక్కడ కంటికి నల్ల అద్దాలు పెట్టుకుని పాండురంగని కీర్తిస్తున్న అంధురాలు ‘అయ్యా! గర్భగుడిలో ఇటుక మీద పాండురంగ స్వామి రెండుచేతులు నడుం మీద పెట్టుకుని ఠీవిగా నిల్చున్న అందాన్ని చూడటానికి మన రెండు కళ్ళు చాలవట కదా!’ అడిగింది.సుబ్బయ్య మాట్లాడలేదు. ‘పాండురంగని పాదాలు మన చేతులతో, శిరస్సుతో స్పృశించవచ్చట కదా! మందిరంలో ఎటు చూసినా తులసి మాలలేనట కదా!?’ తిరిగి అడిగింది. ఆమెకు కళ్లు కనిపించవు. అందుకే చూడలేక అడిగింది. సుబ్బయ్యకు రెండు కళ్లున్నా వెంటనే దర్శనం చేసుకుని బయట పడాలని, ఇతర భక్తులను తోసుకు వెళ్లాడు. అందుకే ఆ అందాన్ని ఆస్వాదించలేకపోయాడు.తన కళ్ళకూ, కళాత్మకంగా చూసే కళ్లకు చాలా భేదం ఉంది. కళాత్మక హృదయం లేని తనకు గొప్ప శిల్పం కూడా బండరాయి లాగే కనిపించింది’ అనుకున్నాడు సుబ్బయ్య. పరోపకారం, దానగుణం లేని తాను కళ్లున్న అసలైన అంధుణ్ణనుకున్నాడు. అక్రమ మార్గం విడిచి సక్రమంగా జీవించాలనుకున్నాడు. అలా అనుకున్నాక పేదలకు దానధర్మాలు చేస్తూ, భగవంతుని సుందరరూపాన్ని చూడగలిగాడు సుబ్బయ్య. పువ్వులు∙ గుండాల నరేంద్రబాబుపూలమ్మా పువ్వులు రంగు రంగుల పువ్వులురంగేళీ రవ్వలురాసగుమ్మ గువ్వలురక రకాల పువ్వులురమ్యమైన పువ్వులురా రమ్మను పువ్వులురామచిలుక చిన్నెలుముద్ద ముద్ద బంతులుముద్దుల చేమంతులుమల్లెలు మందారాలుఎర్రనైన గులాబీలుఅరవిరిసిన సింగారాలు
ఫొటోలు


ఫిల్మ్ఫేర్ అవార్డ్ వేడుక.. డిజైనర్ డ్రస్లో ప్రియమణి (ఫొటోలు)


హీరో నితిన్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)


సీరియల్ నటితో రెండో పెళ్లి.. తండ్రి కాబోతున్న నటుడు (ఫోటోలు)


కమెడియన్ కూతురి 'హాఫ్ ఇయర్' బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)


స్పెయిన్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న అశ్విన్ (ఫోటోలు)


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 12-19)


దీపావళి డిన్నర్ పార్టీలో బాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)


ఒకప్పటి టాలీవుడ్ బ్యూటీ.. బీచ్లో ఫ్యామిలీతో (ఫొటోలు)


మోహన్బాబు యూనివర్సిటీలో యూత్ ఫెస్టివల్ (ఫొటోలు)


గ్రాండ్గా జరిగిన జెనిత్ ఫెస్ట్ 2025 (ఫోటోలు)
అంతర్జాతీయం

మిలిటెంట్ గ్రూప్ మిలియన్ మార్చ్.. అట్టుడుకుతున్న పాకిస్తాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ను బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, ఐఎస్ఐఎస్-ఖోరాసన్, తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ వంటి ఉగ్ర సంస్థలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో.. తాజాగా మరో మిలిటెంట్ గ్రూపు తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP) చేపట్టిన ‘లబ్బైక్ యా అక్సా మిలియన్ మార్చ్’ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా రావల్పిండిలో టీఎల్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ ఆందోళన కారణంగా పాకిస్తాన్లోని పలు ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రవాణా రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్థంభించిపోయింది. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సున్నిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. టీఎల్పీ నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రతి చర్యగా టీఎల్పీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాల్ని ధ్వంసం చేశారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. 65 మంది TLP కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారిపై శాంతి భంగం, ప్రభుత్వ ఆస్తుల నష్టం, ప్రజల రవాణాకు అడ్డంకులు కలిగించడం వంటి అభియోగాలు నమోదు చేశారు.ఈ ఘటనపై పాక్ పంజాబ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేశంలో శాంతి భద్రతలను కాపాడటం తమ ప్రాధాన్యత అని అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. మరోవైపు, TLP నాయకులు తమ కార్యకర్తలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన వారిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. Tehreek-e-Labbaik workers forcibly took away a Pakistani police vehicle.This shows exactly how far Pakistan has fallen. Radical mobs are now ruling cities, and the state that cultivated them is watching helplessly.Chaos has become permanent.@LtGenDPPandey @EPxInsights pic.twitter.com/4rKPpPysjm— Stuti Bhagat (@StutiBhagat_) October 11, 2025

ట్రంప్కు 79.. అతని గుండెకు 65’.. వైట్ హౌస్ ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(79) అసాధారణ ఆరోగ్యంతో ఉన్నారని వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా ట్రంప్ గుర్తింపు పొందారు. ట్రంప్ గుండె వయస్సు అతని వయస్సు కన్నా 14 ఏళ్లు చిన్నదిగా ఉన్నదని వైట్హౌస్ వైద్య వర్గాలు పేర్కొన్నాయి.గత జనవరిలో వైట్ హౌస్లో తిరిగి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన 79 ఏళ్ల ట్రంప్ తన పరిపాలనలో వినూత్న మార్పులు తీసుకువచ్చారు.‘ట్రంప్ అసాధారణ ఆరోగ్యంతో ఉన్నారు. అతని గుండె ఎంతో చక్కగా పనిచేస్తున్నదని ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు సీన్ బార్బబెల్లా తెలిపారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాకు వెల్లడించారు. ట్రంప్ తన అంతర్జాతీయ ప్రయాణానికి ముందుగా కోవిడ్-19 బూస్టర్ టీకాలు తీసుకోవడంతో పాటు పలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. మంచి రోగనిరోధక శక్తి పొందారని కరోలిన్ లీవిట్ తెలిపారు. ట్రంప్ గుండె పనితీరు అతనికన్నా 14 ఏళ్ల చిన్నవయసులో అంటే 65 ఏళ్ల వయసులో ఉన్న గుండె మాదిరిగా చురుకుగా పనిచేస్తున్నదన్నారు.ట్రంప్ ఆరోగ్యంపై ఏడాదిగా పలు వార్తలు వెలువడుతున్నాయి. 2024 ఎన్నికల సమయంలో నాటి అధ్యక్షుడు జో బైడెన్ వయసు, ఆరోగ్యంపై అప్పటి ప్రత్యర్థి ట్రంప్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపధ్యంలోనే బైడెన్ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో ట్రంప్ తాను ఆరోగ్యంపరంగా ఫిట్గా ఉన్నానని ప్రకటించుకున్నారు. తాజాగా ట్రంప్ మేరీల్యాండ్లోని బెథెస్డాలోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆరు నెలల తర్వాత ట్రంప్ చేయించుకున్న వైద్య పరీక్షల్లో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉందని వెల్లడయ్యింది.గత జూలైలో అధ్యక్షుడు ట్రంప్ తన కాళ్ల దిగువ భాగంలో వాపు, కుడి చేతిలో గాయాల సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా అప్పట్లో దర్శనమిచ్చాయి. ఈ సమయంలో వ్యక్తిగత వైద్యుడు సీన్ బార్బబెల్లా మాట్లాడుతూ 70 ఏళ్లు పైబడిన వారిలో కాళ్లలో వాపు కనిపించడం సాధారణమైన స్థితి అని తెలిపారు. అలాగే తరచూ కలరచాలనం చేయడం, ఆస్పిరిన్ వాడకం కారణంగా ట్రంప్ చేతికి గాయాలు కనిపిస్తున్నాయని తెలిపారు. 2020లో ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో కోవిడ్-19 బారిన పడి కోలుకున్నారు.

France: నాటకీయ పరిణామం.. తిరిగి ప్రధానిగా లెకోర్ను
పారిస్: ఫ్రాన్స్లో ప్రధానుల మార్పిడి తరచూ చోటుచేసుకుంటోంది. ఈ ఏడాదిలో నలుగురు ప్రధానమంత్రులు మారడాన్ని చూస్తే అక్కడి పరిస్థితి ఇట్టే అర్థం అవుతుంది. 30 రోజుల క్రితం సెబాస్టియన్ లెకోర్ను (39) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే నాలుగు రోజుల క్రితం కేబినెట్ ఏర్పాటు అనంతరం లెకోర్ను ప్రధాని పదవికి రాజీనామా చేశారు. మద్దతుదారులు బెదిరింపుల మధ్య తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇంతలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తనకు అత్యంత సన్నిహితుడైన సెబాస్టియన్ లెకోర్నుకు మద్దతు పలుకుతూ, తిరిగి ఆయనను ప్రధానిగా నియమించారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటు చేసే బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు.సెబాస్టియన్ లెకోర్ను రాజీనామా అనంతరం ప్రతిపక్షాలు నూతన ప్రధాని కోసం ఎదురు చూశాయి. అయితే దీనికి భిన్నంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడం వారిని నిరాశ పరిచింది. దేశంలోని రాజకీయ సంక్షోభాన్ని చక్కదిద్దాలని భావించిన మాక్రాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే లెకోర్నును తిరిగి నియమించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మిత్రపక్షాలు సహకరించే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం మరోమారు ఇబ్బందుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది నుంచి ఫ్రాన్స్లో రాజకీయ ప్రతిష్టంభన నెలకొంది. హంగ్ పార్లమెంట్ ఏర్పడిన దరిమిలా ప్రభుత్వం పలు ఇబ్బందులను ఎదుర్కొంటోంది.ఫ్రాన్స్ ప్రధానిగా లెకోర్ను సెప్టెంబర్ 9న ఎన్నికయ్యారు. అయితే కొద్ది రోజుల తరువాత తన పదవికి రాజీనామా చేశారు. కాగా నాలుగు రోజుల తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తిరిగి లెకోర్నును ప్రధానిగా నియమించారు. గత ఏడాది మాక్రాన్ తన అధికారాన్ని పదిలం చేసుకుంటారని భావించినప్పటికీ, హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. నాటి నుంచి ఫ్రాన్స్ రాజకీయ ప్రతిష్టంభనలో చిక్కుకుంది. పొదుపు బడ్జెట్పై కొనసాగుతున్న ప్రతిష్ఠంభనను ముగించేందుకు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు ప్రధానిగా కొత్త వ్యక్తిని ఆశించారు. అయితే దీనిని భిన్నంగా లెకోర్ను తిరిగి ఇదే పదవిలో నియమితులయ్యారు. ‘రిపబ్లిక్ అధ్యక్షుడు మాక్రాన్ తిరిగి లెకోర్నును ప్రధానిగా నామినేట్ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు’ అని ఎలీసీ ప్యాలెస్ మీడియాకు తెలిపింది.తిరిగి ప్రధానిగా ఎన్నికైన లెకోర్ను మాట్లాడుతూ తాను విధి లేని పరిస్థితుల్లో ఈ మిషన్ను అంగీకరించానని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఫ్రాన్స్కు బడ్జెట్ అందించేందుకు సాధ్యమైనంతవరకు కృషి చేస్తానని అయన అన్నారు. 2017లో అధ్యక్ష పదవిని చేపట్టిన మాక్రాన్ మొదటి నుంచే రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కాగా ఫ్రెంచ్ జాతీయ ర్యాలీ పార్టీ నేత జోర్డాన్ బార్డెల్లా ప్రధానిగా తిరిగి లెకోర్నును నియమించడాన్ని జోక్గా అభివర్ణించారు. లెకోర్ను గతంలో రక్షణ మంత్రిగా పనిచేశారు.

‘ఆమె అలా అనేసి ఉండొచ్చు..’ నోబెల్ దక్కకపోవడంపై స్పందించిన ట్రంప్
నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు(Trump reacts On Nobel Miss). వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకు ఆ గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు గతంలో తాను పలు సందర్భాల్లో సహాయం చేశానని ట్రంప్ అన్నారు. అలాగే, తన నాయకత్వంలో ఏడు యుద్ధాలను ముగించానని.. అందుకోసమైనా తనకు నోబెల్ రావాల్సిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తి(Maria Corina Machado) ఇవాళ నాకు ఫోన్ చేశారు. మీ గౌరవార్థమే నేను ఈ బహుమతిని అందుకున్నానని, మీరు దీనికి అన్నివిధాల అర్హులు అని ఆమె నాతో అన్నారు. అప్పుడు.. అలాగైతే నాకే ఇవ్వండి అని మాత్రం నేను అనలేదు. కానీ, ఆమె అలా అనేసి ఉండొచ్చు.. అంటూ సరదా వ్యాఖ్యలు చేయడంతో అక్కడ నవ్వులు పూశాయి. మరియా కొరీనా మచాడోకు గతంలో ఎన్నోసార్లు నా సాయం అందుకుంది. వెనిజులా సంక్షోభ సమయంలో ఎంతో సహాయం చేశా. ఏదైతేనేం లక్షల మందిని రక్షించా.. అందుకు సంతోషంగా ఉంది’’ అని ట్రంప్ వైట్హౌజ్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నోబెల్ వస్తుందని చెప్పారు. కానీ అది పెద్ద వ్యవహారం. అయినా నేను ఏడు యుద్ధాలు ఆపాను. అందుకోసమైనా తనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చి ఉండాల్సిందని ట్రంప్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. మచాడో తన నోబెల్ బహుమతిని వెనిజులా ప్రజలకు, ట్రంప్కు అంకితం ఇచ్చిన సంగతి తెలిసిందే. వెనిజులా ప్రజల బాధలకు, అలాగే మా ఉద్యమానికి ట్రంప్ ఇచ్చిన కీలక మద్దతుకు ఈ బహుమతిని అంకితం చేస్తున్నాను అంటూ ఎక్స్ ఖాతాలో ఆమె ఓ కృతజ్ఞత పోస్ట్ ఉంచారు. అయితే.. ట్రంప్నకు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై వైట్ హౌస్ భగ్గుమంది(White House Slams Nobel Committee for Trump Peace Prize Miss). నోబెల్ కమిటీ శాంతికంటే రాజకీయాలను ప్రాధాన్యంగా చూసింది అని విమర్శించింది. ఈ మేరకు వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ మానవతావాది. ఆయనకు మంచి హృదయం ఉంది. కానీ, నోబెల్ కమిటీ శాంతికంటే రాజకీయాలను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుందని ఇది నిరూపించింది. అయినా కూడా ట్రంప్ శాంతి ఒప్పందాలు చేయడం, యుద్ధాలను ముగించడం, ప్రాణాలను రక్షించడం ఆపబోరు అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చైనాపై పెద్దన్నకు కోపమొచ్చింది! నవంబర్ 1 నుంచి..
జాతీయం

కుటుంబాన్ని చిదిమేసిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ!
సాక్షి, చెన్నై: ఇన్స్టాగ్రామ్ ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఇందులో పరిచయమైన వ్యక్తితో భార్య వెళ్లిపోవడంతో భర్త ఉన్మాదిగా మారాడు. తన ముగ్గురు పిల్లల్ని గొంతు కోసి చంపేసి ఆపై పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లా పట్టుకోట్టైలో శనివారం వెలుగుచూసింది. ఈ ప్రాంతంలోని కోయిల్ సముద్రం గ్రామానికి చెందిన వినోద్ కుమార్ (38), నిత్య (35)కు పన్నెండేళ్ల క్రితం వివాహమైంది.తొలుత వినోద్ కుమార్ సొంతంగా వ్యాపారం చేయగా.. నష్టాలు రావడంతో ఫొటోగ్రాఫర్గా మారి ఆపై ఓ హోటల్లో పనికిచేరాడు. ఈ దంపతులకు కుమార్తెలు ఓవియ(11), కీర్తి(8), కుమారుడు ఈశ్వర్(5) ఉన్నారు. ఆర్థికంగా నష్టపోవడంతో ఆ కుటుంబానికి సమస్యలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో నిత్య ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది.వాటికి ఆకర్షితుడైన మన్నార్గుడికి చెందిన ఓ యువకుడు ఆమెను బుట్టలో వేసుకున్నాడు. ఆమె ఆర్థిక కష్టాలను గుర్తించి ఆ ఇంటికి కావాల్సిన వస్తువులను కొనిస్తూ ఆమెకు దగ్గరయ్యాడు. వీరిద్దరూ సన్నిహితంగా మెలగుతుండటాన్ని గుర్తించిన వినోద్కుమార్.. నిత్యను మందలించాడు. దీంతో తనకు విలాసవంతమైన జీవితం కావాలంటూ ఆ యువకుడితో నిత్య ఇటీవల వెళ్లిపోయింది.ఉన్మాదిగా మారి...ఆమెను బతిమిలాడినా తిరిగి రాకపోవడంతో విజయ్కుమార్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ఓవియ బడి మానేసి తన చెల్లి, తమ్ముడి లాలన చూసుకునేది. క్రమంగా వినోద్కుమార్ మానసికంగా కుంగిపోతూ ఉన్మాదిగా మారాడు. శుక్రవారం రాత్రి పకోడీని తన తమ్ముడు, చెల్లికి ఓవియ తినిపిస్తుండగా, మద్యం మత్తులో వచ్చిన వినోద్కుమార్ ఓవియ, ఈశ్వర్ను బయటకు పంపించాడు.మరో కుమార్తె కీర్తిని తన ఒడిలో పెట్టుకుని లాలిస్తూ, క్షణాల్లో కత్తితో ఆమె గొంతు కోసేశాడు. కీర్తి పెడుతున్న కేకలతో ఓవియ, ఈశ్వర్ ఇంట్లోకి పరుగులు తీశారు. క్షణాల్లో మిగిలిన ఇద్దరినీ గొంతుకోసి చంపేశాడు. రక్తపు మడుగులో మరణించిన పిల్లలను చూసి ఏడుస్తూ, తన భార్యకు గుణపాఠం చెప్పేశానంటూ తాను పనిచేస్తున్న హోటల్కు వెళ్లి ఈ విషయాన్ని చెప్పాడు. అక్కడి నుంచి మదుక్కూర్ పోలీసు స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు.

ప్రేమ ఎంత గరళం!
ప్రాప్తమనుకో ఈ క్షణమే బతుకులాగా.. పండెననుకో ఈ బతుకే మనసు తీరా.. అన్నాడొక కవి. ఆ కుర్రాడు కూడా ప్రేమించాడు. ప్రేమను పండించు కోవాలనుకున్నాడు. శాశ్వతంగా నిలబెట్టుకోవాలనుకున్నాడు. అదే నేరమైంది. గరళమైంది. ఇరవయ్యేళ్లకే నూరేళ్లు నింపింది. గులాబీలు ఇచ్చిన చేతులతోనే గటగట గరళం తాగాడు. ప్రేమను నిరూపించుకోవాలనే పెద్దల శాసనం.. అతనికి మృత్యు శాసనమయ్యింది.ఇరవయ్యేళ్లకే నూరేళ్లుఇది సినిమా కథ కాదు.. ఛత్తీస్గఢ్లోని కోర్బాలో జరిగిన ఒక హృదయాన్ని మెలిపెట్టే విషాదం. కృష్ణకుమార్ పాండో (20).. సోనారి గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. వారిద్దరి గాఢమైన ప్రేమబంధం అమ్మాయి కుటుంబానికి తెలిసిపోయింది. ఆ రోజు సెప్టెంబర్ 25.. ఆ యువతి కుటుంబం కృష్ణను తమ ఇంటికి పిలిపించింది. తన ప్రేయసి కుటుంబం ముందు కృష్ణ ధైర్యంగా నిలబడ్డాడు. అతని ధైర్యమల్లా.. ఆ క్షణంలో తన గుండె నిండా ఉన్న నిస్వార్థమైన, నిండైన ప్రేమే. కానీ ఆ కుటుంబం అతని ప్రేమను నమ్మడానికి ఒక అగ్నిపరీక్ష పెట్టింది. కాదుకాదు బలిపీఠం ఎక్కించింది.విషం తాగి నిరూపించుకో..‘నీ ప్రేమ నిజమే అయితే విషం తాగి నిరూపించుకో’.. అన్న పెద్దల మాటలు అతని చెవుల్లో ఎలా ఉరిమి ఉంటాయో ఊహించండి. ప్రేమ కోసం ఏదైనా చేస్తాననే యువకుడి ఆరాటాన్ని ఆ కుటుంబం దారుణంగా ఉపయోగించుకుంది. బహుశా ఆ క్షణంలో అతనికి తన జీవితం కంటే, తన ప్రేమ నిజమని రుజువు చేయడమే ముఖ్యం అనిపించిందేమో. వెనకా ముందూ ఆలోచించలేదు.. కృష్ణకుమార్ విషం తాగేశాడు. విషం.. అతని శరీరంలోకి ప్రవహించింది. ప్రతి కణాన్ని నాశనం చేయడం మొదలుపెట్టింది.నరకయాతన అనుభవించి..ఆ తరువాత, జరిగిన విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు కృష్ణను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి జిల్లా ఆసుపత్రికి మార్చినా, అతని పరిస్థితి విషమంగానే ఉంది. అతని గుండె, ఊపిరితిత్తులు ఆ విష ప్రభావానికి లొంగిపోతుంటే, చివరి క్షణాల్లో ఏం గుర్తుకొచ్చిందో.. ఎంతగానో ప్రేమించిన అమ్మాయి ముఖమా.. లేదా తన ప్రేమను బలిపీఠం ఎక్కించిన పెద్దల పైశాచిక వ్యాఖ్యలా.. చివరికి అక్టోబర్ 8న మృత్యువు ఒడిలోకి చేరుకున్నాడు. కృష్ణ కుటుంబ సభ్యులు.. అమ్మాయి తరఫు వారు బలవంతం చేయడమో, లేదా ప్రేరేపించడమో వల్లే తమ కుమారుడు విషం తాగాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రేమంటే పవిత్రత, త్యాగం.. కానీ దాన్ని ఇంతటి భయంకరమైన పరీక్షతో నిరూపించుకోవాలని పెద్దలు కోరడం, దానికి అమాయకపు యువకుడు బలైపోవడం.. నిజంగా ఇది గుండెల్ని పిండేసే విషాదం.

అడవి పందిని తింటే పంట సేఫ్!
అలప్పుళ (కేరళ): అడవి పందుల బెడద నుంచి తమ పంటలను కాపాడుకోవడానికి కేరళ రైతులకు.. ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పి.ప్రసాద్ వినూత్నమైన సలహా ఇచ్చారు. ఆయన శనివారం పాలమేల్ గ్రామ పంచాయతీలో మాట్లాడుతూ... ‘అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి కదా?. మీరంతా వాటి మాంసాన్ని తినండి!. ఈ సమస్య చాలా వేగంగా పరిష్కారమవుతుంది!‘ అని సెలవిచ్చారు. పంట పొలాల్లో హతమైన అడవి పందుల మాంసాన్ని ప్రజలు తినడానికి అనుమతించాలని అభిప్రాయపడ్డారు. ఆయన దీనికి లాజిక్ కూడా చెప్పారు. ‘ప్రజలకు అడవి పందులను చంపి, వాటి మాంసాన్ని తినేందుకు అనుమతి ఉంటే, ఈ సమస్య చాలా తొందరగా పరిష్కారమవుతుంది. కానీ, ప్రస్తుత చట్టం దీనికి ఒప్పుకోవట్లేదు’.. అని వాపోయారు. ‘అడవి పంది ఏమంత అంతరించిపోతున్న జంతువు కాదు కదా!‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలు.. రాష్ట్రంలో మానవ–జంతు సంఘర్షణలను తగ్గించేందుకు ఉద్దేశించిన వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972ను సవరించడానికి కేరళ అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించిన కొద్ది రోజుల తర్వాత రావడం విశేషం.

భారత్తో బంధానికి అత్యధిక ప్రాధాన్యం
న్యూఢిల్లీ: భారత్తో సంబంధాలకు అమెరికా అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని సెర్గియో గోర్ చెప్పారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. భారత్లో అమెరికా రాయబారిగా నిమితుడైన సెర్గియో గోర్ శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా సంతకం చేసిన చిత్రపటాన్ని మోదీకి బహూకరించారు. రక్షణ, వ్యాపారం, వాణిజ్యం, అరుదైన ఖనిజాలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారంపై మోదీ, సెర్గియో చర్చించారు. ఆరు రోజుల పర్యటన నిమిత్తం సెర్గియో శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తోపాటు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మోదీని కలుసుకున్నారు. సెర్గియోతో మా ట్లాడడం సంతోషంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అమెరికా రాయబారిగా ఆయన నేతృత్వంలో భారత్–అమెరికా సమగ్ర వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత ప్రధాని నరేంద్ర మో దీ గొప్ప నాయకుడు, మంచి మిత్రుడు అంటూ డొ నాల్డ్ ట్రంప్ తరచుగా ప్రశంసిస్తుంటారని సెర్గియో గోర్ గుర్తుచేశారు. మోదీతో కీలక అంశాలపై చర్చించానని తెలిపారు. వరుస భేటీల అనంతరం ఆయన మీడియా మాట్లాడారు. రక్షణ, వాణిజ్యం, టెక్నాలజీ, ఖనిజాలు సహా ద్వైపాక్షిక వ్యవహారాలపై అభిప్రాయాలు పంచుకున్నామని చెప్పారు. నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో భారత్–అమెరికాలు మరింత సన్నిహితంగా మారడం ఖాయమని అన్నారు. ఇరుదేశాలు కలిసికట్టుగా పనిచేయాలన్నదే తన ఆకాంక్ష అని ఉద్ఘాటించారు.
ఎన్ఆర్ఐ

రెడింగ్లో భవ్యంగా బతుకమ్మ జాతర
బర్క్షైర్ (యూకే): యునైటెడ్ కింగ్డమ్ రెడింగ్లోని రెడింగ్ జాతర టీమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు కుటుంబాల సమాగమంగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమానికి వెయ్యికి పైగా మంది హాజరై, తెలంగాణ సంస్కృతిని ఘనంగా చాటారు. పారంపర్య బతుకమ్మ పాటలతో మహిళలు బతుకమ్మలు ఆడగా, యువతులు, పిల్లలు ఉత్సాహంగా డాండియా ఆడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన దుర్గాపూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్నారులు కట్టిపడేసేలా భరతనాట్యం ప్రదర్శించగా, తెలుగు వంటకాలతో సాంప్రదాయ విందు అందించారు. వేడుకల అనంతరం బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేయడంతో కార్యక్రమం ముగిసింది. ఈ భవ్య కార్యక్రమాన్ని గత 11 ఏళ్లుగా నిరంతరంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు విశ్వేశ్వర్ మంథని, రంజిత్ నడిపల్లి, ప్రసాద్ అవధానుల, రమేశ్ జంగిలి, రఘు, చందు, రామ్రెడ్డి, రామ్ప్రసాద్, నాగార్జున మాట్లాడుతూ – “తెలంగాణ సంప్రదాయాలను తదుపరి తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం కొనసాగిస్తాం” అని తెలిపారు.

మలేషియాలో దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
కౌలాలంపూర్, అక్టోబర్ 4: భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (BAM) ఆధ్వర్యంలో, మలేషియాలోని అన్ని భారతీయ సమాజాలు కలసి ఘనంగా “దసరా • బతుకమ్మ • దీపావళి 2025” మహోత్సవాన్ని టానియా బ్యాంక్వెట్ హాల్, బ్రిక్ఫీల్డ్స్ లో నిర్వహించాయి.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ గారు లోక్సభ సభ్యుడు, హాజరై ఆశీస్సులు అందించారు. అలాగే భారత హైకమిషనర్ మరియు మలేషియా ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొని వేడుకకు విశిష్టతను తీసుకువచ్చారు. అతిథులు మాట్లాడుతూ – “ఈ వేడుక తెలుగు వారికే పరిమితం కాకుండా భారత దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతి భారతీయుడు ఐక్యంగా జరుపుకున్న ఒక గొప్ప సాంస్కృతిక మహోత్సవం. నిజంగా కన్నుల పండుగగా నిలిచింది” అని అభినందించారు.సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పాటలు, పండుగ ప్రత్యేకతలతో కూడిన కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకలో మలేషియాలో నివసిస్తున్న అన్ని భారతీయ NRIలు విశేషంగా పాల్గొని BAM మహోత్సవాన్ని విజయవంతం చేశారు.BAM ప్రధాన కమిటీ సభ్యులు* చోప్పరి సత్య – అధ్యక్షుడు* భాను ముత్తినేని – ఉపాధ్యక్షుడు* రవితేజ శ్రీదశ్యం – ప్రధాన కార్యదర్శి, IT మరియు PR కమ్యూనికేషన్* రుద్రాక్షల సునీల్ కుమార్ –కోశాధికారి * గజ్జడ శ్రీకాంత్ – సంయుక్తకోశాధికారి * రుద్రాక్షల రవికిరణ్ కుమార్ – యువజన నాయకుడు* గీత హజారే – మహిళా సాధికారత నాయకురాలు* సోప్పరి నవీన్ – కార్యవర్గ సభ్యుడు* యెనుముల వెంకట సాయి – కార్యవర్గ సభ్యుడు* అపర్ణ ఉగంధర్ – కార్యవర్గ సభ్యుడు* సైచరణి కొండ – కార్యవర్గ సభ్యుడు* రహిత – కార్యవర్గ సభ్యుడు* సోప్పరి రాజేష్ – కార్యవర్గ సభ్యుడు* పలకలూరి నాగరాజు – కార్యవర్గ సభ్యుడుBAM అధ్యక్షుడు చోప్పరి సత్య మాట్లాడుతూ: “ఈ వేడుకను విజయవంతం చేయడంలో సహకరించిన భారత హైకమిషన్, మలేషియా ప్రభుత్వ అధికారులు, అతిథులు, స్పాన్సర్లు, కమిటీ సభ్యులు మరియు మలేషియాలోని భారతీయ సమాజానికి మనఃపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు

లండన్లో తెలుగు విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా : జిల్లాలోని మేడిపల్లి మండలం దమ్మనపేట్లో విషాదచాయలు అలుముకున్నాయి. దమ్మనపేట్కు చెందిన ఎనుగు మహేందర్ రెడ్డి (26) అనే అనే విద్యార్థి లండన్లో దుర్మరణం చెందాడు. ఉన్నత విద్యను అభ్యసించడానికి లండన్కు వెళ్లిన మహేందర్రెడ్డికి గుండెపోటు రావడంతో మృత్యువాత పడినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నిన్న(శుక్రవారం, అక్టోబర్ 3వ తేదీ) రాత్రి మహేందర్రెడ్డి చనిపోయిన విషయాన్ని అతని స్నేహితులు తండ్రి రమేష్రెడ్డికి తెలియజేశారు. ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం లండన్కు వెళ్లాడు మహేందర్రెడ్డి. కుమారడు ప్రయోజకుడు అవ్వడానికి లండన్ వెళ్లి ఇలా మృతి చెందడం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తండ్రి శోకసంద్రంలో మునిగిపోయారు.

అమెరికాలోని ఒమాహా నగరంలో బతుకమ్మ వేడుకలు
తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం ఓమాహా నగరంలో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో హిందూ దేవాలయ సామాజిక భవనంలో జరిగిన ఈ వేడుకలకు తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అత్యంత వైభవంగా నిర్వహించడం ద్వారా తమ సంస్కృతి, వారసత్వాన్ని నిలబెట్టడమే కాకుండా, తమ తల్లిదండ్రుల నేలతో గల అనుబంధాన్ని కొనసాగిస్తూ.. భవిష్యత్తు తరాలకు ఈ సంప్రదాయాలు అందజేయాలన్న ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించారు. గత దశాబ్దానికి పైగా ఈ వేడుకలను అపర్ణ నేదునూరి, స్నిగ్ధ గంటా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు వెయ్యికి పైగా తెలుగు కుటుంబాలు, సంఘ సభ్యులు హాజరయ్యారు.ఈ ఉత్సవంలో సంప్రదాయకంగా అలంకరించిన రంగు రంగుల బతుకమ్మలు ఎంతో ఆకట్టుకున్నాయి. ప్రతి బతుకమ్మను ప్రత్యేకంగా రూపొందించారు. సువాసనభరిత పూలతో అలంకరించారు. వీటిలో భక్తి, సృజనాత్మకత, తెలుగు వారసత్వం ప్రతిబింబించింది. రంగురంగులు, వినూత్నంగా అలంకరించిన బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. గత రెండు సంవత్సరాలుగా విజేతగా నిలిచిన శ్రీదేవి నలం ఈసారి కూడా తన సృజనాత్మక అలంకరణతో మూడోసారి బహుమతి గెలుపొందారు. ఇది వేల మైళ్ళ దూరంలో ఉన్నా, తెలుగు సంప్రదాయాలను సజీవంగా నిలుపుకునే నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుకలలో సంప్రదాయ తెలుగు వంటకాలు భోజన ప్రియుల నోరూరించాయి. పిల్లలు కూడా పండుగ వాతావరణంలో మునిగి తేలారు. నిజమైన తెలుగు సాంస్కృతిక అనుభవాన్ని ఆస్వాదించారు.
క్రైమ్

గిరిజన మహిళపై హత్యాచారం
మెదక్జోన్/కొల్చారం(నర్సాపూర్): ఏడుపాయల పుణ్యక్షేత్ర సమీపంలో ఘోరం జరిగింది. ఆలయానికి అతి సమీపంలోని ఓ వెంచర్ పక్కన ముళ్ల పొదల్లో గిరిజన మహిళపై అత్యాచారం చేశారు. ఆపై గుర్తుతెలియని దుండగులు తీవ్రంగా కొట్టడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులో శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది.మెదక్ రూరల్ సీఐ జార్జ్, బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం సంగాయిగూడ తండాకు చెందిన గిరిజన మహిళ భర్త, పిల్లలతో కలిసి జీవనం సాగిస్తోంది. దంపతులిద్దరూ అడ్డా కూలీలుగా పనిచేస్తున్నారు. భర్త రెండు రోజుల క్రితం పని ఉండటంతో గజ్వేల్కు వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే ఆమె పనికోసం టిఫిన్ బాక్స్ పట్టుకొని ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కొడుకు తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఇంటికి వచ్చిన భర్త తన భార్య కోసం అంతటా వెతికినా ఆచూకీ లభించలేదు. ఇంతలోనే శనివారం ఉదయం 10 గంటల సమయంలో పోలీసుల ద్వారా విషయం తెలిసింది. ఘటనాస్థలిని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. ఆ మహిళను వెంచర్లోని స్తంభానికి చేతులు కట్టేసి ఉంచగా, తలకు బలమైన గాయం, కుడిచేయి విరిగి ఉంది. మెడ, ఇతర చోట్ల గాయాలు ఉన్నాయి. వెంటనే పోలీసులు హుటాహుటిన మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రాత్రి 7 గంటల వరకు చికిత్స అందిస్తున్నా స్పృహాలోకి రాలేదు. పరిస్థితి విషమించటంతో వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. వైద్యులు గిరిజన మహిళపై అత్యాచారం చేసిన తర్వాతే దాడి చేసి ఉంటారని చెబుతున్నారు. ల్యాబ్కు శాంపిల్స్ పంపామని రిపోర్టు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

భార్యను చంపి ప్రమాదంగా చిత్రీకరించి..
కొరాపుట్(ఒడిషా): భార్యను చంపేసి.. ప్రమాదంగా చిత్రించాడో ప్రబుద్ధుడు. ఆయన పోలీసు కావడం విశేషం. కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఓఎంపీ కాలనీలో ఐఆర్బీ జవాన్ శివ శంకర్ పాత్రో నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి అతని భార్య ప్రియాంక పండా మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. అందరూ ఇది ప్రమాదమే అని అనుకున్నారు. కానీ ప్రియాంక తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి కొరాపుట్లో సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత కేసు మలుపు తిరిగింది. వారు తమ కుమార్తె మృతదేహం చూసి అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా టెక్కలి పెద్ద బ్రాహ్మణ వీధికి చెందిన తరణి పండా తన కుమార్తె ప్రియాంకని నబరంగ్పూర్ జిల్లా డాబుగాంకి చెందిన ఐఆర్బీ కానిస్టేబుల్ శివ శంకర్ పాత్రోకి ఇచ్చి గత ఏడాది జులై 11న టెక్కలిలో వివాహం జరిపించారు. వివాహ సమయంలో 12 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు వరకట్నంగా ఇచ్చారు. నూతన దంపతులు కొరాపుట్ ఓఎంపీ కాలనీ నివాసం ఉండడంతో వారికి అవసరమైన సారె కింద ఇంటి సామగ్రి ఇచ్చారు. కానీ పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం ప్రియాంకపై భర్త భౌతిక దాడులు చేసేవాడు. ఇది తెలిసి కన్నవారు తమ శక్తి మేరకు అదనపు కట్నం పంపుతుండేవారు. భర్త వేధింపులతో ప్రియాంక పుట్టింటికి వెళ్లి సెప్టెంబర్ 4న తిరిగి కొరాపుట్ వచ్చింది. కానీ వేధింపులు ఆగలేదు. పుట్టింట తండ్రి ఆరోగ్య రీత్యా గత కొద్ది రోజులుగా వేధింపులు కన్నవారికి చెప్పలేదు. బుధవారం రాత్రి 8 గంటలకు వీడియో కాల్ ద్వారా ప్రియాంక తల్లిదండ్రులతో మాట్లాడింది. 9 గంటలకు శివ శంకర్ తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది వెంటనే రమ్మని టెక్కలికి ఫోన్ చేశాడు. వెంటనే వీరందరూ కొరాపుట్ చేరుకొని అనుమానంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా మృతురాలి తలపై ఇనుప రాడ్డుతో మోది చంపినట్లు తెలిసింది. దీంతో వెంటనే శివ శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక చనిపోయాక శివశంకర్ తన తల్లిని, ఏడు నెలల కుమార్తెను ఇంటి బయట కూర్చోబెట్టాడు. అనంతరం మృతదేహాన్ని దహనం చేసి ఇంటికి నిప్పంటించాడు. మొదటి అంతా ఇది అగ్ని ప్రమాదమే అనుకున్నారు. కానీ మృతురాలి తల్లిదండ్రులు రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో శివ శంకర్ తన నేరం అంగీకరించారు.

జెడ్పీటీసీ టిక్కెట్ ఇప్పిస్తా...రూ.లక్ష పంపు
విజయవాడ: సైబర్ నేరగాళ్లు కొత్త అవతారం ఎత్తారు. రాజకీయ నాయకుల వాయిస్తో మాట్లాడుతూ ఓ సొసైటీ అధ్యక్షుడిని రూ. లక్ష అడిగి విఫలయత్నం చేశారు. మూరకొండ ఏడుకొండలరావు కంచికచర్ల మండలం ఘనిఆత్కూరు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు ఈ నెల 8న రాత్రి వాట్సాప్ కాల్చేసి మాజీ మంత్రి దేవినేని ఉమా వాయిస్లో మాట్లాడి ఎక్కడున్నావ్ అని అడిగారు. నేను పక్క ఊరిలో ఉన్నానని చెప్పగా, ఒకసారి కారులో ఎక్కి మాట్లాడమని సైబర్ నేరగాళ్లు చెప్పారు. అదే విధంగా కారులో కూర్చుని ఏమిటండీ అని అడగ్గా, రానున్న జెడ్పీటీసీ ఎన్నికల్లో నీకు కంచికచర్ల, మైలవరం, ఇబ్రహీంపట్నంలలో ఏదో ఒకటి టికెట్ ఇప్పిస్తా, డబ్బులు ఎంత పెట్టుకుంటావని అడిగారు. మరలా ఐదు నిమిషాల తర్వాత ఫోన్కాల్ చేసి అన్నగారు (చంద్రబాబు) మాట్లాడతారంటా అని చెప్పి, ఫోన్ ఇవ్వగా, ఆయన వాయిస్తోనే మాట్లాడారు. దీంతో ఏడుకొండలరావుకు అనుమానం వచ్చింది. కొద్దిసేపటి ఒక రూ.లక్ష వేరేవారికి ట్రాన్స్ఫర్ చేయమని సైబర్ నేరగాళ్లు అడగ్గా, మరుసటి రోజు నేను క్యాష్ ఇస్తానని చెప్పి ఫోన్ పెట్టేశారు. మరుసటి రోజు ఫోన్ చేసి డబ్బులు విజయవాడలో ఎక్కడ ఇవ్వాలో చెప్పారు. 10వ తేదీ డబ్బులు ఇచ్చేందుకు రమ్మని చెప్పడంతో ఆయన బయలుదేరి నేరుగా గొల్లపూడిలోని దేవినేని ఉమా కార్యాలయానికి వెళ్లి, ఫోన్ చేసిన విషయం చెప్పారు. తాను ఫోన్ చేయలేదని చెప్పడంతో సైబర్ నేరగాళ్ల వల అని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు.

ప్రేమ పేరుతో ‘కోచ్’ వేధింపులు.. విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, అడ్డగుట్ట: ప్రేమ పేరుతో కోచ్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లాలాగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రఘు బాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లాలాపేటలోని సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసముంటున్న ప్రమోద్కుమార్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.వారి పెద్ద కుమార్తె మౌలిక(19) అలియాస్ వెన్నెల తార్నాకలోని రైల్వే డిగ్రీ కళాశాలలో బీఏ సెకండ్ ఇయర్ చదువుతుంది. అదే కాలేజీలో మాణికేశ్వర్ నగర్కు చెందిన అంబాజీ అనే యువకుడు కొన్ని నెలల క్రితం వాలీబాల్ కోచ్గా జాయిన్ అయ్యాడు. కొద్ది రోజులుగా అతను మౌలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి లోనైన మౌలిక బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అంబాజీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతురాలి సెల్ఫోన్లో డేటా పూర్తిగా డిలీట్ చేసి ఉందని, డేటాను రిట్రీవ్ చేస్తున్నట్లు చెప్పారు. అంబాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
వీడియోలు


ప్రైవేట్ వీడియోలకు స్కెచ్.. సినిమా సీన్ తలదన్నే ట్విస్ట్


కోట వినూత, చంద్రబాబుల హత్యకు టీడిపీ ఎమ్మెల్యే బొజ్జల కుట్ర


నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి


బలగం వేణుకి హ్యాండ్ ఇస్తోన్న హీరోలు..


కోట వినూత డ్రైవర్ రాయుడు సంచలన వీడియో వైరల్


విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కొత్త చిత్రం ప్రారంభం..


పవన్ కు కొత్త పేరు..


హాస్టళ్లా.. నరక కూపాలా.. పిల్లలకు మురుగు నీరు.. సార్లకు మినరల్ నీరు


సీఐ తీరుపై హైకోర్టు సీరియస్


అయ్యా మోదీ.. చేతులెత్తి మొక్కుతున్న.. రోజా ఎమోషనల్