అమెరికాలో ముగిసిన షట్డౌన్!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ షట్డౌన్ ఎత్తివేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికాలో షట్డౌన్ ముగించే బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. 222-209 ఓట్ల తేడాతో కాంగ్రెస్ బిల్లును ఆమోదించింది. అమెరికాలో అత్యంత సుదీర్ఘమైన 43 రోజుల ప్రభుత్వ షట్డౌన్ను ముగించడానికి బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రతినిధుల సభ ఒక బిల్లును ఆమోదించింది. అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం బిల్లును పంపింది. ట్రంప్ బిల్లును ఆమోదించిన వెంటనే షట్డౌన్ ముగియనుంది. ఇక, బిల్లుకు సంబంధించిన ప్రక్రియలో రిపబ్లికన్లు తమ స్వల్ప మెజారిటీతో 222-209 ఓట్ల తేడాతో బిల్లును ఆమోదించారు. #BREAKING: U.S. House votes to end government shutdown, 222-209. Goes now to the president. pic.twitter.com/LPySa48qUZ— CSPAN (@cspan) November 13, 2025అనంతరం వైట్హౌస్ స్పందిస్తూ.. ఈ బిల్లుపై ట్రంప్ చేస్తారని తెలిపింది. షట్డౌన్ను ముగించనున్నట్టు పేర్కొంది. తాజాగా షట్డౌన్ లిఫ్ట్ బిల్లుపై ప్రెసిడెంట్ ట్రంప్ సంతకంతో అన్ని సమస్యలు పరిష్కారం కానున్నాయని అన్ని వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, ఆమోదం పొందబోయే బిల్లు ప్రభుత్వాన్ని జనవరి 30 వరకు మాత్రమే నడపడానికి నిధులు కల్పిస్తుందని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి.HUGE: Congress passes bill to END THE DEMOCRAT SHUTDOWN.Now en route to President Trump's desk. 🇺🇸 pic.twitter.com/og0SGFmKks— The White House (@WhiteHouse) November 13, 2025ఈ షట్డౌన్ 2025 అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఆర్థిక వృద్ధి, ఫెడరల్ సర్వీసులు, ప్రజల జీవనాలపై తీవ్ర ప్రభావం చూపింది. డెమోక్రటిక్ పార్టీ ఆఫర్డబుల్ కేర్ యాక్ట్ (ఏసిఏ) సబ్సిడీల విస్తరణ కోరినప్పటికీ, రిపబ్లికన్ నేతలతో సమన్వయం చేసుకుని ఈ డీల్ సాధ్యమైంది. ఈ ఆమోదం ద్వారా దేశం మొత్తం స్థిరత్వాన్ని పొందుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ షట్డౌన్ కారణంగా సుమారు 1.4 మిలియన్ ఫెడరల్ ఉద్యోగులు ఫర్లో చేయబడి, వారికి జీతాలు ఆలస్యం అయ్యాయి. సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్ఏపి) వంటి ఆహార సహాయ పథకాలు 42 మిలియన్ అమెరికన్లకు ఆటంకం కలిగించాయి. కాంగ్రెస్ నేషనల్ బడ్జెట్ ఆఫీస్ అంచనాల ప్రకారం, ఈ షట్డౌన్ ఆర్థిక వృద్ధిని రెండు శాతాలు తగ్గించి.. మూడు బిలియన్ డాలర్ల నష్టాన్ని కలిగించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి కీలక సర్వీసులు ఆగిపోవడం వల్ల ప్రయాణికులు, వ్యాపారాలు ఇబ్బంది పడ్డాయి. ఈ పరిస్థితి ప్రజలలో అసంతృప్తిని పెంచి, రెండు పార్టీలపై ఒత్తిడి తీసుకొచ్చింది.
ఢిల్లీ పేలుడు: ‘నడిపింది’ అతనే.. డీఎన్ఏ పరీక్షలో వెల్లడి
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు సంస్థల అనుమానం నిజమయ్యింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర పేలిన ఐ20 కారును డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నడిపారని డీఎన్ఏ పరీక్షా ఫలితాలను స్పష్టం చేస్తున్నాయని సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది.డాక్టర్ ఉమర్ మొహమ్మద్.. ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో సీనియర్ వైద్యునిగా పనిచేస్తున్నారు. ఆయన డీఎన్ఏ నమూనాతో అతని తల్లి, సోదరుని డీఎన్ఏతో 100 శాతం సరిపోలిందని అధికారులు తెలిపారని ‘ఎన్డీటీవీ’ పేర్కొంది. పేలుడు తర్వాత ఐ20లో దొరికిన ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలను సేకరించి, పరీక్షలు నిర్వహించిన అధికారులు కారు నడిపింది ఉమర్ అనే నిర్థారణకు వచ్చారు. దీనికి ముందు ఉమర్ తల్లిని డీఎన్ఏ పరీక్ష కోసం పుల్వామాలో అదుపులోనికి తీసుకున్నారు. అలాగే పేలుడు తరువాత ఉమర్ తల్లి, అతని ఇద్దరు సోదరులను విచారిస్తున్నారు.జమ్ముకశ్మీర్ పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్లోని రెండు నివాస భవనాల నుండి దాదాపు 3,000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత ఈ పేలుడు సంభవించింది. ఈ నేపధ్యంలో వైట్-కాలర్ ఉగ్రవాద వ్యవస్థలో కీలక లింక్గా మారిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ను పోలీసులు అరెస్టు చేశారు. షకీల్ కూడా అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ నివాసి డాక్టర్ ఆదిల్ రాథర్ ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహ్మద్కు మద్దతుగా పోస్టర్లు వేసినందుకు అరెస్టు చేశారు. ఆ తరువాత తర్వాత షకీల్ను అరెస్టు చేశారు. షకీల్, రాథర్ అరెస్టులతో భయపడిన ఉమర్ ఎర్రకోట సమీపంలో పేలుడుకు కారకునిగా నిలిచాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: Delhi Blast: ట్రాఫిక్లో కారు పేలిందిలా.. తాజా వీడియో
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
త్వరలో సౌతాఫ్రికాతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్లకు (India vs South Africa) ముందు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ సిరీస్లకు సన్నాహకంగా నవంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే దేశవాలీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు.ఈ టోర్నీలో హార్దిక్ తన హోం టీమ్ బరోడా తరఫున బరిలోకి దిగుతాడు.హర్దిక్ చివరిగా ఈ ఏడాది సెప్టెంబర్లో కాంపిటేటివ్ క్రికెట్ ఆడాడు. ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో గాయపడిన అతను.. ఆతర్వాత పాకిస్తాన్తో జరిగిన ఫైనల్తో పాటు ఆస్ట్రేలియాలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లకు దూరమయ్యాడు. హార్దిక్ ఇటీవలే గాయం (ఎడమ క్వాడ్రిసెప్స్) నుంచి పూర్తిగా కోలుకొని, బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.ఫిట్నెస్ టెస్ట్లన్నీ క్లియర్ చేసి అధికారిక అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. నవంబర్ 26న బెంగాల్తో జరిగే మ్యాచ్తో రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు. ముస్తాక్ అలీ టోర్నీలో హార్దిక్ రెండు మ్యాచ్లకు (28న జరిగే మ్యాచ్కు కూడా) మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.ఆ తర్వాత అతను భారత జట్టుతో కలవాల్సి ఉంటుంది. నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్కు హార్దిక్ తప్పక ఎంపికయ్యే అవకాశం ఉంది. రాంచీ వేదికగా తొలి వన్డే జరుగనుంది. డిసెంబర్ 3న రాయ్పూర్, డిసెంబర్ 6న విశాఖపట్నంలో మిగిలిన రెండు వన్డేలు జరగనున్నాయి.ఆ తర్వాత సౌతాఫ్రికాతోనే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కటక్ వేదికగా డిసెంబర్ 9న ప్రారంభవుతుంది. ఈ సిరీస్లో కూడా హార్దిక్ బెర్త్ దాదాపుగా ఖరారైనట్టే. హార్దిక్ జట్టులో చేరితే భారత మిడిలార్డర్ మరింత బలోపేతమవుతుంది. హార్దిక్ గైర్హాజరీలో భారత్ ఆసియా కప్ ఫైనల్లో గెలిచి ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే.ఆతర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లలో భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. వన్డే సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా.. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.చదవండి: రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?
అలర్ట్.. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
సాక్షి, విశాఖ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇక, తెలంగాణలో పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైంది.అల్లూరి జిల్లాలోని అరకులోయలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గురువారం ఉదయం ఆరు గంటలకు 8 డిగ్రీలు, లంబసింగిలో 10, చింతపల్లిలో 12.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. పలు ప్రాంతాల్లో పొగ మంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శీతల గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది. వీటి ప్రభావంతో కొమురం భీం- ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్లో 6.8 డిగ్రీలు, సిర్పూర్లో 7.1 డిగ్రీలు, తిర్యానీలో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక, హైదరాబాద్ శేరిలింగంపల్లి హెచ్సీయూ ప్రాంతంలో 11.8 డిగ్రీలు, ఇబ్రహీంపట్నంలో 11.5, రాజేంద్రనగర్లో 12.9, మారేడుపల్లిలో 13.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉదయం పొగమంచు, చలిగాలులు, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.COLD WAVE INTENSIFIED ACROSS TG ⛄️SINGLE DIGIT TEMPERATURES(ASIFABAD)— Lingapur : 6.8°C— Sirpur (U) : 7.1°C— Ginnedari : 8.2°C— Kerameri : 9.3°C— Tiryani : 9.5°C(ADILABAD)— Neradigonda : 9.5°C— Sonala : 9.8°C— Bazarhathnoor : 9.9°C— Pochara : 9.9°C(SIRCILLA)—… pic.twitter.com/1U4ZMHAkLE— Weatherman Karthikk (@telangana_rains) November 13, 2025ఈ నెలలో సగటు ఉష్ణోగ్రతలు 13 నుంచి 17 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందన్నారు. రాబోయే వారం రోజులు ఇదే తరహా చలి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం- ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాచలం, రామగుండం, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, పటాన్చెరు, నిజామాబాద్, హైదరాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ శివారు హయత్నగర్ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 26 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నా.. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం అత్యల్పానికి పడిపోతాయన్నారు. చాలా ప్రాంతాల్లో 16 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.STRONG COLDWAVE GRIPS TELANGANA Sirpur in KB Asifabad recorded 7.1°C this morning, followed by Tiryani 8.2°C 🥶Meanwhile in Hyderabad City, HCU Serlingampally recorded 11.8°C, Rajendranagar 12.9°C, Maredpally 13.6°CMeanwhile outskirts of Hyderabad City like Ibrahimpatnam…— Telangana Weatherman (@balaji25_t) November 13, 2025
నాకు సూపర్ పవర్స్ వస్తే..!
టెక్నాలజీ అప్గ్రేడ్కు నిధులు
ఏడు నెలల గర్భిణి మృతి
IPL 2026: రేపే 'డెడ్లైన్'
మార్జిన్ ట్రేడింగ్పై పెరుగుతున్న ఆసక్తి
ఢిల్లీ పేలుడు: ‘నడిపింది’ అతనే.. డీఎన్ఏ పరీక్షలో వెల్లడి
అమెరికాలో ముగిసిన షట్డౌన్!
99 పైసలకే 27.10 ఎకరాలు.. ఉత్తర్వులు జారీ
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
నెతన్యాహును క్షమించండి.. ట్రంప్ లేఖ
కుటుంబంతో రాము రాథోడ్.. క్షమాపణలు చెబుతూ వీడియో
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారవృద్ధి
రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?
ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకి
నేను నా చాంబర్ నుంచి బయటికి వెళ్లినా ‘ఇన్’ అనే ఉంచు.. పరిస్థితులు బాగోలేవ్
ఈ రాశి వారికి ఆస్తి ఒప్పందాలు.. ఆర్థికాభివృద్ధి
విశాఖ: భర్త శారీరకంగా దూరం పెట్టాడని..
H1B Visa: తలొగ్గిన ట్రంప్.. మాకు వలస కార్మికులు కావాలి
ఎర్రకోట సమీపంలో పేలుడు - 12 మంది మృతి
సినిమా ప్రారంభోత్సవంలో సందడిగా నిహారిక (వీడియో)
జీవితాన్ని మళ్లీ చూస్తున్నా.. నవీన్ చంద్ర పోస్ట్ వైరల్ (ఫొటోలు)
హన్మకొండ జిల్లా: వీడిన ‘నాటు కోళ్ల’ మిస్టరీ
భారత జట్టు ప్రకటన.. రాహుల్ ద్రవిడ్ తనయుడికి ఛాన్స్
ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై..
100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద
బడికి పంపడానికి ఏమీ అభ్యంతరం లేదటకానీ మధ్యాహ్న భోజనం పెట్టనని హామీ ఇవ్వాలట సార్!
సింగరేణి ‘మల్టీప్లెక్స్’!
అందుకే వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయలేదు: బీసీసీఐ
రాష్ట్రమంతటా భూముల సర్వే
పొట్టి ఆవులు గట్టి మేలు!
నాకు సూపర్ పవర్స్ వస్తే..!
టెక్నాలజీ అప్గ్రేడ్కు నిధులు
ఏడు నెలల గర్భిణి మృతి
IPL 2026: రేపే 'డెడ్లైన్'
మార్జిన్ ట్రేడింగ్పై పెరుగుతున్న ఆసక్తి
ఢిల్లీ పేలుడు: ‘నడిపింది’ అతనే.. డీఎన్ఏ పరీక్షలో వెల్లడి
అమెరికాలో ముగిసిన షట్డౌన్!
99 పైసలకే 27.10 ఎకరాలు.. ఉత్తర్వులు జారీ
హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం
నెతన్యాహును క్షమించండి.. ట్రంప్ లేఖ
కుటుంబంతో రాము రాథోడ్.. క్షమాపణలు చెబుతూ వీడియో
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారవృద్ధి
రోహిత్ శర్మ అనుహ్య నిర్ణయం..! ఇక మిగిలింది కోహ్లినే?
ఇప్పుడు కొనండి, అప్పుడు అమ్మండి: కియోసాకి
నేను నా చాంబర్ నుంచి బయటికి వెళ్లినా ‘ఇన్’ అనే ఉంచు.. పరిస్థితులు బాగోలేవ్
ఈ రాశి వారికి ఆస్తి ఒప్పందాలు.. ఆర్థికాభివృద్ధి
విశాఖ: భర్త శారీరకంగా దూరం పెట్టాడని..
H1B Visa: తలొగ్గిన ట్రంప్.. మాకు వలస కార్మికులు కావాలి
ఎర్రకోట సమీపంలో పేలుడు - 12 మంది మృతి
హన్మకొండ జిల్లా: వీడిన ‘నాటు కోళ్ల’ మిస్టరీ
సినిమా ప్రారంభోత్సవంలో సందడిగా నిహారిక (వీడియో)
భారత జట్టు ప్రకటన.. రాహుల్ ద్రవిడ్ తనయుడికి ఛాన్స్
ఐసీసీ సంచలన నిర్ణయం.. ఇకపై..
100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద
బడికి పంపడానికి ఏమీ అభ్యంతరం లేదటకానీ మధ్యాహ్న భోజనం పెట్టనని హామీ ఇవ్వాలట సార్!
సింగరేణి ‘మల్టీప్లెక్స్’!
అందుకే వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయలేదు: బీసీసీఐ
రాష్ట్రమంతటా భూముల సర్వే
పొట్టి ఆవులు గట్టి మేలు!
దుల్కర్ సల్మాన్ కాంతా.. రిలీజ్కు ముందే వివాదం..!
సినిమా
'ఆయన పిలిస్తే అన్ని వదిలేసి వెళ్తారు'.. రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్
టాలీవుడ్ నటి రేణు దేశాయ్(Renu desai) ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. ఆమె చివరిసారిగా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్ను ప్రకటించలేదు. సినిమాల్లో నటించకపోయినా కూడా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్లోనే ఉంటోంది. దైవ భక్తి ఎక్కువగా ఉన్న రేణు దేశాయ్ కాస్తా గ్యాప్ దొరికితే ఆధ్యాత్మిక పర్యటనలతో బిజీగా ఉంటోంది.తాజాగా సోషల్ మీడియాలో తన ఆధ్యాత్మిక పర్యటనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ రోజు కాల భైరవ జయంతి రోజున మనం రక్షణ కోరకూడదు.. మనమే రక్షకుడిగా మారాలని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. కాల భైరవుడు మీతో పాటు నడుస్తూ శాంతి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడని రేణు దేశాయ్ రాసుకొచ్చింది. ఆ పరమశివుడు పిలిచిప్పుడు మీరు అన్ని వదిలేసి కాశీ వెళ్తారని తెలిపింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai)
'నా కెరీర్లో ఇదే ఫస్ట్ టైమ్'.. చికిరి సాంగ్ లిరిసిస్ట్ బాలాజీ కామెంట్స్!
రామ్చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ పెద్ది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. చికిరి చికిరి అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్తో దూసుకెళ్లింది. ఒక్క రోజులోనే మిలియన్ల వీక్షణలతో సరికొత్త రికార్డ్ సాధించింది. కాగా.. సింగర్ మోహిత్ చౌహాన్ పాడిన ఈ సాంగ్కు బాలాజీ లిరిక్స్ అందించారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.తాజాగా ఈ పాట గురించి లిరిసిస్ట్ బాలాజీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సిటీమార్, ఎంసీఏ పాటలకంటే నా కెరీర్లో ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్ వచ్చిన పాట ఇదేనని తెలిపారు. చికిరి.. చికిరి అనే పాట ఉత్తరాంధ్రలోని గ్రామీణ నేపథ్యంలోని వెనకబడిన జాతి నుంచి వచ్చిన యువకుడికి.. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఏమనిపించింది అనేదే కాన్సెప్ట్తో పుట్టుకొచ్చిందే ఈ పాట.చికిరి అంటే ప్రత్యేకంగా అర్థమేమి లేదన్నారు. ఆ అబ్బాయిని.. అమ్మాయిని పొగుడుతూ తన కోరికను ఇలా చికిరి పాట రూపంలో చెప్తాడని బాలాజీ తెలిపారు. ఈ సాంగ్ కోసం దాదాపు ఎనిమిది నెలలు ప్రయాణం చేశానన్నారు.ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో జాన్వీకపూర్ అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనుంది. శివ రాజ్కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కొరియోగ్రాఫర్ జానీ కేసు.. సింగర్ చిన్మయి మరో సంచలన ట్వీట్!
సింగర్ చిన్మయి పేరు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న దారుణాలపై పోరాటం చేస్తున్న సింగర్పై సోషల్ మీడియాలో అసభ్యకర రీతిలో కొందరు పోస్టులు పెడుతున్నారు. దీంతో తనపై వస్తున్న ట్రోల్స్పై చిన్మయి హైదరాబాద్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.అయితే కొద్ది రోజుల క్రితమే మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి సినిమాల్లో అవకాశాలు బాగానే వస్తున్నాయంటూ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్తో పాటు మరో కోలీవుడ్ సింగర్ కార్తీక్ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఇలాంటి వారికి అవకాశాలివ్వడం అంటే లైంగిక దాడులను ప్రోత్సహించడమేనంటూ సంచలన పోస్ట్ చేసింది. మన నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే.. అది తప్పకుండా వదిలిపెట్టదని సింగర్ ట్విటర్లో పోస్ట్ చేసింది.తాజాగా జానీ మాస్టర్ను ఉద్దేశించి సింగర్ చేసి తాజా ట్వీట్ టాలీవుడ్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. జానీ మాస్టర్ కేసు అత్యంత సంక్లిష్టమైనదంటూ పేర్కొంది. అతను మైనర్ను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా.. అంగీకరించలేదని బెదిరించాడని సింగర్ తెలిపింది. ఇక్కడ మాత్రం వీరిద్దరిది ఏకాభిప్రాయ రిలేషన్ అంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంది. అయితే 16 ఏళ్ల మైనర్ అమ్మాయి సమ్మతి ఇవ్వలేదనే విషయాన్ని వారు అర్థం చేసుకోవాలని చిన్మయి మండిపడింది. ఒక అడల్ట్ వ్యక్తి.. మైనర్తో రిలేషన్ పెట్టుకోవద్దనే బాధ్యత కలిగి ఉండాలని గుర్తు చేసింది.కానీ ఇక్కడ జానీ మాస్టర్ రిచ్.. అతనికి ఎంతోమంది పెద్దవాళ్లతో సంబంధాలు ఉండొచ్చని వెల్లడించింది. అందుకే ఈ వ్యవస్థలో బాధిత అమ్మాయికి న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువని సింగర్ పోస్ట్ చేసింది. నేను ఈ సమస్య గురించి మాట్లాడి ప్రతిసారీ.. అతని భార్య ఈ విషయం గురించి మాట్లాడవద్దని చెబుతోందని ఆరోపించింది. ఎందుకంటే ఇక్కడ వాళ్లు నిర్దోషిగా బయటపడతారని వందశాతం ధీమాతో ఉన్నారని.. మీ ఆత్మవిశ్వానికి నా శుభాకాంక్షలు అంటూ చిన్మయి వ్యంగ్యంగా రాసుకొచ్చింది. అవార్డుల మీద అవార్డులుఈ కేసులో జానీ మాస్టర్ నిర్దోషి అని తెలితే.. వెంటనే అతనికి అవార్డుల మీద అవార్డులు కూడా ఇస్తారని సింగర్ తెలిపింది. ఎక్కువ మంది మైనర్లను వేధించడం.. వాటి నుంచి తప్పించుకోవడానికి ఏమి చేయాలో వారికి కచ్చితంగా తెలుస్తుందని ట్విటర్లో రాసుకొచ్చింది. అన్నింటికంటే కొంతమంది పురుషులకు మైనర్లతో లైంగిక చర్యలో పాల్గొనేలా చేయడం ఒక థ్రిల్గా భావిస్తారని తెలిపింది. ఈ కేసులో నేను ఆశించేది ఏంటంటే.. ఆ అమ్మాయి గెలిచి.. తనపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి.. ఈ సమాజానికి కళ్లు తెరిపించాలని చిన్మయి సుదీర్ఘ పోస్ట్ చేసింది. జానీపై లైంగిక దాడి కేసుకాగా.. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై గతేడాది లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దీంతో జానీ మాస్టర్ను గోవాలో పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన అమ్మాయి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చాలా ఏళ్లుగా తనను వేధించడం, బెదిరించడం చేశాడని ఆరోపించింది. అమ్మాయికి 16 ఏళ్ల వయసు నుంచే వేధింపులకు పాల్పడ్డారని చెప్పడంతో పోక్సో కేసు కూడా నమోదు చేశారు. కాగా.. ప్రస్తుతం జానీ బెయిల్పై బయట ఉన్నాడు. The case of Jani Master is complex - but the most important aspect of it is sexual grooming - And him not only sexually abusing a minor but also threatening her at her workplace when she refused to comply.His personal ecosystem paints it as a 'consensual relationship' not…— Chinmayi Sripaada (@Chinmayi) November 11, 2025
మహేశ్ బాబు- రాజమౌళి కాంబో.. గన్ను గురిపెట్టిన ప్రియాంక చోప్రా
మహేశ్బాబు- రాజమౌళి కాంబోలో యాక్షన్ అడ్వెంచరస్ మూవీని తెరకెక్కిస్తున్నారు. తొలిసారి వీరిద్దరి జతకట్టడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రంలో మందాకిని పాత్రలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కనిపించనుంది.ఇటీవలే ఈ మూవీ నుంచి సించారీ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన ప్రియాంక చోప్రా పోస్టర్ చూస్తే రెండు చేతులతో గన్ పట్టుకుని ఫుల్ అగ్రెసివ్ అండ్ యాక్షన్ మోడ్లో కనిపించింది. చీరకట్టులో ప్రియాంక గన్ పట్టుకున్న పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూస్తుంటే ప్రియాంక చోప్రా రోల్ పవర్పుల్గా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ కుంభగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.మరోవైపు ఈ మూవీకి సంబంధించి బిగ్ ఈవెంట్ ప్లాన్ చేశారు రాజమౌళి. ఈనెల రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్గా నిర్వహించన్నారు. ఈ కార్యక్రమాన్ని జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్లో టైటిల్ రివీల్ చేయనున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra)
న్యూస్ పాడ్కాస్ట్
అది ముమ్మాటికీ ఉగ్ర దాడే... ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నేడు కోటి గొంతుకల గర్జన.... చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమ కార్యచరణ ప్రకటన
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు. తొమ్మిది మంది దుర్మరణం. 20 మందికి గాయాలు. రంగంలోకి దర్యాప్తు బృందాలు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం
ప్రజాధనాన్ని ప్రైవేటుకు దోచిపెడుతున్న కూటమి సర్కారు...
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
న్యూయార్క్ మేయర్గా జొహ్రాన్ మమ్దాని విజయం... చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు... తొలి ముస్లిం, పిన్నవయస్కుడైన మేయర్గా రికార్డు
ఏపీ సీఎం చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి... ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున పోరాటం సాగిస్తాం... మోంథా తుపాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 19 మంది మృతి.
క్రీడలు
తొలి రౌండ్లోనే తరుణ్ అవుట్
కుమామోటో: జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి, ఆయుశ్ శెట్టి, కిరణ్ జార్జి తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్య సేన్ 39 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో 21–12, 21–16తో ప్రపంచ 26వ ర్యాంకర్ కోకి వతనాబె (జపాన్)ను ఓడించాడు. ప్రపంచ 35వ ర్యాంకర్ ప్రణయ్ 68 నిమిషాల్లో 16–21, 21–13, 23–21తో ప్రపంచ 22వ ర్యాంకర్ లియోంగ్ జున్ హావో (మలేసియా)పై గెలుపొందాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో తరుణ్ మన్నేపల్లి 9–21, 19–21తో జియోన్ హైయోక్ జిన్ (దక్షిణ కొరియా) చేతిలో, కిరణ్ జార్జి 20–22, 10–21తో కోక్ జింగ్ హాంగ్ (మలేసియా) చేతిలో, ఆయుశ్ శెట్టి 16–21, 11–21తో కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 12–21, 21–19, 20–22తో ప్రెస్లీ స్మిత్–జెనీ గాయ్ (అమెరికా) జంట చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ప్రపంచ 20వ ర్యాంకర్ జియా హెంగ్ జేసన్ తె (సింగపూర్)తో లక్ష్య సేన్; ప్రపంచ 30వ ర్యాంకర్ రస్ముస్ గెమ్కే (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతారు. ముఖాముఖి రికార్డులో లక్ష్య సేన్ 3–0తో జియా హెంగ్పై, ప్రణయ్ 4–2తో రస్ముస్ గెమ్కేపై ఆధిక్యంలో ఉన్నారు. ఫైనల్లో అభిషేక్ జోడీఢాకా: ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్కు ఒక పతకం ఖాయమైంది. భారత్కు చెందిన అభిషేక్ వర్మ–దీప్షిక జోడీ ఫైనల్లోకి ప్రవేశించి స్వర్ణ, రజత పతకాల కోసం పోటీపడనుంది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో అభిషేక్–దీప్షిక ద్వయం 156–153తో రొక్సానా–ఆండ్రీ ట్యుటిన్ (కజకిస్తాన్) జంటను ఓడించింది. అంతకుముందు భారత జోడీ క్వార్టర్ ఫైనల్లో 159–155తో వియత్నాం ద్వయంపై, తొలి రౌండ్లో 158– 144తో యూఏఈ జంటపై గెలుపొందింది. మరోవైపు రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో యశ్దీప్–అన్షిక కుమారి (భారత్) జోడీ కాంస్యం కోసం బరిలో నిలిచింది. సెమీఫైనల్లో యశ్దీప్–అన్షిక జంట 1–5తో సీమా అక్తర్–రామకృష్ణ సాహా (బంగ్లాదేశ్) జోడీ చేతిలో ఓడిపోయింది.
‘టైబ్రేక్’కు అర్జున్, హరికృష్ణ
పనాజీ: సొంతగడ్డపై జరుగుతున్న పురుషుల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత్ నుంచి ముగ్గురు గ్రాండ్మాస్టర్లు ఇరిగేశి అర్జున్, పెంటేల హరికృష్ణ, ప్రజ్ఞానంద బరిలో మిగిలారు. ఈ ముగ్గురు తదుపరి దశకు అర్హత సాధిస్తారో లేదో నేడు టైబ్రేక్ రౌండ్ తర్వాత తేలుతుంది. క్లాసికల్ ఫార్మాట్లో నిర్ణీత రెండు గేమ్ల తర్వాత అర్జున్–పీటర్ లెకో (హంగేరి); హరికృష్ణ–నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్); ప్రజ్ఞానంద–డానిల్ దుబోవ్ (రష్యా) 1–1తో సమంగా నిలిచారు. దాంతో విజేతలను నిర్ణయించేందుకు నేడు ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్లను నిర్వహిస్తారు. అర్జున్–పీటర్ లెకో రెండో గేమ్ 36 ఎత్తుల్లో... హరికృష్ణ–గ్రాండెలియస్ రెండో గేమ్ 38 ఎత్తుల్లో... ప్రజ్ఞానంద–దుబోవ్ రెండో గేమ్ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. మరోవైపు మరో ఇద్దరు భారత గ్రాండ్మాస్టర్లు కార్తీక్ వెంకటరామన్, ప్రణవ్ నాలుగో రౌండ్ను దాటలేకపోయారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రెండుసార్లు జాతీయ చాంపియన్ కార్తీక్ 0.5–1.5తో లె క్వాంగ్ లియెమ్ (వియత్నాం) చేతిలో... ప్రణవ్ 0.5–1.5తో నొదిర్బెక్ యాకు»ొయెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశారు. రెండో గేమ్లో కార్తీక్ 68 ఎత్తుల్లో... ప్రణవ్ 38 ఎత్తుల్లో ఓడిపోయారు. నొదిర్బెక్ యాకుబొయెవ్, లె క్వాంగ్ లియెమ్లతోపాటు లెవోన్ అరోనియన్ (అమెరికా), అల్కంటారా మార్టినెజ్ (మెక్సికో), అలెగ్జాండర్ డాన్షేoకో (జర్మనీ) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. నాలుగో రౌండ్లో అరోనియన్ 1.5–0.5తో రాడోస్లా (పోలాండ్)పై, అల్కంటారా 1.5–0.5తో సరానా అలెక్సీ (సెర్బియా)పై, డాన్షేoకో 1.5–0.5తో బ్లూబామ్ మథియాస్ (జర్మనీ)పై విజయం సాధించారు.
నితీశ్ స్థానంలో జురేల్
కోల్కతా: ఫామ్లో ఉన్న వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురేల్ దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులో బరిలోకి దిగుతాడని భారత అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డస్కటే వెల్లడించారు. ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో జురేల్ను ఆడిస్తామని ఆయన చెప్పారు. 24 ఏళ్ల వికెట్ కీపర్ ఇప్పటివరకు టీమిండియా తరఫున ఏడు టెస్టులు ఆడాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’ జరిగిన రెండు అనధికారిక టెస్టులు సహా గత ఐదు ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో జురేల్ నాలుగు సెంచరీలు చేశాడు. రెగ్యులర్ వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గైర్హాజరీలో జురేల్ ఇంగ్లడ్ పర్యటనలో నాలుగో టెస్టు ఆడాడు. అయితే ఇప్పుడు పంత్ పునరాగమనం చేయనుండటంతో జురేల్ స్థానంపై నెలకొన్న సందేహాల్ని సహాయ కోచ్ డక్కటే ఒక్క మాటతో నివృత్తి చేశాడు. ఫామ్లో ఉన్న జురేల్, రెగ్యులర్ వికెట్ కీపర్ పంత్ ఇద్దరిని తొలి టెస్టులో ఆడిస్తామని స్పష్టం చేశారు. వ్యూహాలకు అనుగుణంగానే... ‘కాంబినేషన్పై పూర్తి స్పష్టతతో ఉన్నాం. ఇద్దరు వికెట్ కీపర్లలో ఏ ఒక్కరిని పక్కనబెట్టే ఉద్దేశం జట్టు మేనేజ్మెంట్కు లేదు’ అని డస్కటే వెల్లడించారు. గత ఆరు నెలలుగా నిలకడైన ఫామ్ను కొనసాగిస్తున్న ధ్రువ్ జురేల్ ఈడెన్ గార్డెన్స్లో శుక్రవారం మొదలయ్యే తొలి టెస్టులో ఆడతాడని చెప్పారు. నితీశ్ను పక్కనబెట్టడంపై స్పందిస్తూ... ‘అతను వెస్టిండీస్తో రెండు టెస్టులు ఆడాడు. ప్రతి మ్యాచ్లోనూ మెరుగవుతూనే ఉన్నాడు. కాబట్టి అతని భవిష్యత్తుకు ఎలాంటి ముప్పులేదు. అయితే ప్రస్తుత జట్టు వ్యూహాలకు అనుగుణంగానే అతను తుది జట్టుకు దూరం కానున్నాడు. బలమైన ప్రత్యర్థితో మ్యాచ్ గెలవాలంటే అందుబాటులో ఉన్న వనరుల్లో మరింత మెరుగైన బలగంతోనే బరిలోకి దిగుతాం. ఇప్పుడు ఇదే జరుగుతోంది. అంతేకానీ నితీశ్ను విస్మరించడం మాత్రం కాదు’ అని డస్కటే వివరించారు. పరుగులు చేసే స్పిన్నర్లు ఇక లోయర్ మిడిలార్డర్లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాల రూపంలో భారత్ బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా ఉందని అసిస్టెంట్ కోచ్ అన్నారు. వాళ్లు స్పిన్నర్లయి ఉండొచ్చు. కానీ బ్యాటింగ్ అవసరాల్ని తీరుస్తారని, కాబట్టి వారిపుడు బ్యాటర్లుగా పరిగణించవచ్చని చెప్పారు. తద్వారా కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులో ఉంటాడనే విషయాన్ని డస్కటే చెప్పకనే చెప్పినట్లయ్యింది. దీంతో ఇద్దరు పేసర్లు ముగ్గురు స్పిన్నర్లతో కూడిన బౌలింగ్ దళాన్ని తొలి టెస్టులో దింపేందుకు భారత టీమ్ మేనేజ్మెంట్ సిద్ధమైంది. ముగ్గురు టాపార్డర్, ముగ్గురు మిడిలార్డర్ బ్యాటర్లతో స్పెషలిస్టు బ్యాటింగ్ విభాగానికి ముగ్గురు స్పిన్ ఆల్రౌండర్లు జట్టును నడిపించనున్నారు. కసరత్తు చేశాం... సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ నుంచి టీమిండియా పాఠాలు నేర్చుకుందని డస్కటే పేర్కొన్నారు. గతేడాది భారత్ పర్యటనకు వచ్చిన కివీస్ 3–0తో ఆతిథ్య జట్టును వైట్వాష్ చేసింది. మన సిŠప్న్ పిచ్పై ప్రత్యర్థి స్పిన్నర్లు ఎజాజ్ పటేల్ (15 వికెట్లు), మిచెల్ సాన్ట్నర్ (13), ఫిలిప్స్ (8) పండగ చేసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి 36 వికెట్లు తీయడమే భారత్ కొంపముంచింది. దీనిపై అసిస్టెంట్ కోచ్ మాట్లాడుతూ ‘స్పిన్నేయడమే కాదు... ప్రత్యర్థి స్పిన్ను ఎదుర్కోవడంపై కూడా కసరత్తు చేశాం. ఎందుకంటే సఫారీ జట్టులోనూ నాణ్యమైన స్పిన్నర్లే అందుబాటులో ఉన్నరు. కాబట్టి కివీస్ నేర్పిన గత పాఠాల అనుభవంతో జట్టు సిద్ధమైంది’ అని అన్నారు.
బాబోయ్... మేమెళ్లిపోతాం!
కొలంబో: ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టును తాజా ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడి ఘటన కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మంగళవారం జరిగిన ఈ హేయమైన ఉగ్రదాడిలో 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఈ దాడి లంక జట్టులో భయాందోళనలు పెంచింది. ఏకంగా 8 మంది ఆటగాళ్లు తిరుగుముఖం పట్టాలని నిర్ణయించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం మూడు వన్డేల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ గురువారం రావల్పిండిలో జరగాల్సి ఉంది. సింహళ క్రికెటర్లు స్వదేశానికి పయనమైతే నేటి వన్డే మ్యాచ్ రద్దయ్యే అవకాశాలున్నాయి. తొలి వన్డే నెగ్గిన పాక్ 1–0తో ఆధిక్యంలో ఉంది. ఇది మగిశాక జింబాబ్వే మూడో జట్టుగా పాల్గొనే ముక్కోణపు టి20 సిరీస్లోనూ లంక తలపడాల్సి ఉంది. దీంతో ఈ నెలాఖరుదాకా బిక్కుబిక్కుమంటూ పాక్లో ఉండలేమని లంక క్రికెటర్లు పేర్కొంటున్నారు. అయితే లంక బోర్డు (ఎస్ఎల్సీ) మాత్రం షెడ్యూల్ ప్రకారమే తమ జట్టు పాక్ పర్యటనను ముగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అవసరమైతే 8 మంది క్రికెటర్లను రిజర్వ్ బెంచ్తోనైనా భర్తీ చేసేందుకు సిద్ధమని లంక బోర్డు సూచనప్రాయంగా పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు అభయమిచ్చినట్లు తెలిసింది. సరిగ్గా 16 ఏళ్ల క్రితం పాక్ పర్యటనకు వెళ్లిన లంక బృందంపై పాక్ ఉగ్రమూక దాడిచేసింది. ఈ ఘటనలో పలువురు లంక క్రికెటర్లు తూటా గాయాలకు గురయ్యారు.
బిజినెస్
టాటా మోటార్స్ సీవీ బంపర్ లిస్టింగ్
ముంబై: టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ (టీఎంసీవీ) అరంగేట్రంలోనే అదరగొట్టింది. టాటా మోటార్స్ విభజన నేపథ్యంలో టీఎంసీవీ షేరు విలువను రూ.260గా నిర్ధారించగా.. ఎన్ఎస్ఈలో ఇది 28.48 శాతం ప్రీమియంతో రూ.335 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.345 గరిష్టాన్ని తాకింది. చివరకు 26.56 శాతం లాభంతో 330 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్ఈలో ఇది 26.09 శాతం ప్రీమియంతో 330.25 వద్ద అరంగేట్రం చేసింది. ఇంట్రాడేలో రూ. 346.75ను తాకి, చివరికి రూ.327.65 వద్ద క్లోజయ్యింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,21,517 కోట్లుగా నమోదైంది. టాటా మోటార్స్ను టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ), టీఎంసీవీగా విడగొట్టిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్ ఇన్వెస్టర్లకు 1:1 నిష్పత్తిలో ఒక టీఎంసీవీ షేరును కేటాయించారు. ఈ డీమెర్జర్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. కాగా, అక్టోబర్ 14 నుంచి టాటా మోటార్స్ షేరు టీఎంపీవీగా రూ. 400 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. ప్రస్తుతం ఇది రూ.402 వద్ద కదలాడుతోంది. టీఎంసీవీ మాత్రం టాటా మోటార్స్ లిమిటెడ్ పేరుతో ఇప్పుడు ట్రేడవుతోంది. కాగా, ఈ రెండింటి ఉమ్మడి మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.2.7 లక్షల కోట్లకు చేరింది. నిర్ణయాత్మక క్షణం: చంద్రశేఖరన్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ లిస్టింగ్ అనేది కంపెనీ భవిష్యత్తు ప్రయాణానికి, అలాగే ఆటోమోటివ్ పరిశ్రమకు ఒక ‘నిర్ణయాత్మక క్షణం’ అని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పేర్కొన్నారు. బీఎస్ఈలో జరిగిన లిస్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాటా మోటార్స్ను ‘ఐకానిక్’ కంపెనీగా అభివరి్ణంచారు. అటువంటి ప్రతిష్టాత్మక కంపెనీలో నిర్మాణాత్మక మార్పులు చేపట్టడం చాలా కష్టమే అయినా, విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. ఈ ఏడాది జూలైలో ఇటాలియన్ వాణిజ్య వాహన దిగ్గజం ఇవెకో గ్రూప్ను (డిఫెన్స్ బిజినెస్ మినహా) 3.8 బిలియన్ యూరోలకు (దాదాపు రూ.38,240 కోట్లు) కొనుగోలు చేయనున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ధరలు.. కూల్!
న్యూఢిల్లీ: నిత్యావసర ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ నెలలో వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ/రిటైల్ ద్రవ్యోల్బణం) రికార్డు కనిష్ట స్థాయి 0.25 శాతానికి తగ్గుముఖం పట్టింది. కూరగాయలు, పండ్లు, గుడ్ల ధరలు శాంతించడానికి తోడు, జీఎస్టీలో 380 ఉత్పత్తుల రేట్ల తగ్గింపు ఇందుకు అనుకూలించింది. సీపీఐ డేటా 2014 నుంచి సమీకరిస్తుండగా, ఇంత కనిష్ట స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం చేరడం ఇదే ప్రథమం. ఈ ఏడాది సెపె్టంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.44 శాతం కాగా, 2024 అక్టోబర్లో 6.21 శాతంగా ఉండడం గమనార్హం. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ఈ వివరాలను విడుదల చేసింది. మైనస్లో ఆహార ద్రవ్యోల్బణం ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం మైనస్ 5.02గా నమోదైంది. జీఎస్టీ రేట్లు తగ్గడం, సానుకూల బేస్ ప్రభావం, నూనెలు, ఫ్యాట్స్, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాదరక్షలు, తృణ ధాన్యాలు, రవాణా ధరలు తగ్గడం వల్లేనని ఎన్ఎస్వో తెలిపింది. జీఎస్టీ రేట్ల సవరణ సెపె్టంబర్ 22 నుంచి అమల్లోకి రావడం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం మైనస్ 0.25 శాతంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 0.88 శాతంగా ఉంది. కేరళలో అత్యధికంగా 8.56 శాతం, తమిళనాడులో అత్యల్పంగా 1.29 శాతం ద్రవ్యోల్బణం కనిపించింది. అసోం, బిహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, యూపీలో మైనస్గా నమోదైంది. 2025–26 సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.6 శాతంగా ఉండొచ్చన్నది ఆర్బీఐ అంచనా. తాజా గణాంకాల నేపథ్యంలో దీన్ని మరింత దిగువకు సవరించొచ్చని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్ పేర్కొన్నారు. డిసెంబర్ భేటీలో రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చని అంచనా వేశారు. అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గడానికి సెప్టెంబర్ చివర్లో అమల్లోకి వచి్చన జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణమని కేర్ఎడ్జ్ రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త రజని సిన్హా పేర్కొన్నారు.
బంగారం ఇప్పట్లో భారీగా తగ్గుతుందా?
బంగారం ధరలు ఇప్పటికే భారీగా పెరిగిపోయాయి. కొన్ని రోజులుగా కొంత తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించినా మళ్లీ తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పట్లో బంగారం ధరలు తగ్గుతాయా.. కొనగలమా అని సామాన్య కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రముఖ వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ ఎమ్కే వెల్త్ మేనేజ్ మెంట్ (Emkay Wealth) బంగారం ధరలకు సంబంధించి కీలక అంచనాలు వెల్లడించింది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీ మార్పులు, సంస్థాగత డిమాండ్ బంగారాన్ని “సురక్షిత స్వర్గధామ” ఆస్తిగా మరింత బలపరిచాయి. ఎమ్కే వెల్త్ మేనేజ్మెంట్ ప్రకారం.. బంగారం ప్రస్తుతం దృఢమైన సాంకేతిక పునాదిలో ఉంది. సంస్థ అప్సైడ్ లక్ష్యాలను ఔన్స్కు 4,368 డాలర్ల నుంచి 4,600 డాలర్లుగా, అలాగే మద్దతు స్థాయిలను 3,890 డాలర్ల నుంచి 3,510 డాలర్ల వద్దగా నిర్దేశించింది.కాగా ప్రస్తుతం (12 నవంబర్ 2025 నాటికి) బంగారం ఔన్స్ ధర సుమారు 4,100 డాలర్ల వద్ద ఉంది. అదే తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,510 లుగా, 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,15,050 లుగా కొనసాగుతోంది.బంగారం పెరుగుదలకు ప్రాధాన కారణాలుడాలర్ బలహీనత: గత సంవత్సరం యూఎస్ డాలర్ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే 8% క్షీణించడం వల్ల, డాలర్ కాకుండా ఇతర కరెన్సీలలో ఉన్న పెట్టుబడిదారులకు బంగారం సాపేక్షంగా చౌకగా మారింది.ద్రవ్యోల్బణ అనిశ్చితి: అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమతుల్యత భయాలు బంగారాన్ని ద్రవ్యోల్బణ కవచంగా బలపరిచాయి.సెంట్రల్ బ్యాంక్ డైవర్సిఫికేషన్: డాలర్పై ఆధారాన్ని తగ్గించే క్రమంలో, వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ రిజర్వుల్లో బంగారం వాటాను పెంచుతున్నాయి.ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు: 2025లో రికార్డు స్థాయి 65 బిలియన్ డాలర్ల మేర ఈటీఎఫ్ల ప్రవాహాలు బంగారంపై రిటైల్, సంస్థాగత విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి.భౌగోళిక రాజకీయ అస్థిరత: తూర్పు ఐరోపా, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సురక్షిత-స్వర్గధామ ఆస్తులపై డిమాండ్ను నిలబెట్టాయి.
‘పరాయి ప్రతిభ’ కోసం పోటాపోటీ!
వలస కార్మికులకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. విదేశీ ప్రతిభను ఆకర్షించడానికి దేశాల మధ్య పోటీ విస్తృతమవుతోంది. వలస కార్మికుల కోసం కెనడా భారీ ప్రణాళికను ప్రకటించగా.. విదేశీ ప్రతిభను వద్దనుకున్న అమెరికా సైతం మనసు మార్చుకుని మళ్లీ కావాలంటోంది.ఆవిష్కరణలపరంగా తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు కెనడా కీలక చర్యలు తీసుకుంది. 1,000 మందికి పైగా అగ్రశ్రేణి అంతర్జాతీయ పరిశోధకులు ముఖ్యంగా హెచ్ -1బి వీసా హోల్డర్లను లను ఆకర్షించే లక్ష్యంతో 1.7 బిలియన్ కెనడియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. ప్రధాన మంత్రి మార్క్ కార్నీ తన మొదటి ఫెడరల్ బడ్జెట్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.నైపుణ్యం కలిగిన నిపుణులు, ముఖ్యంగా నిర్బంధ యూఎస్ వీసా విధానాల వల్ల ప్రభావితమైన వారి కోసం ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని కెనడా ప్రవేశపెడుతోంది. టెక్నాలజీ, హెల్త్ కేర్, నిర్మాణం వంటి అధిక-డిమాండ్ రంగాలను లక్ష్యంగా ఈ వ్యూహాత్మక ప్రణాళికను కెనాడా ప్రభుత్వం తీసుకొచ్చింది. విదేశీ ప్రతిభకు గుర్తింపునిచ్చేలా, వారు కెనడియన్ శ్రామిక శక్తిలో ఏకీకృతం అయ్యేలా వ్యవస్థల రూపకల్పనకు నిధులు వెచ్చిస్తోంది.అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడం, ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ -1బి వీసా రుసుములను పెంచేయడంతో విదేశీ ప్రతిభకు కలిగిన ఇబ్బందికర పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కెనడా ప్రణాళిక రచించింది. ఫాస్ట్-ట్రాక్ మార్గంతో పాటు, అగ్రశ్రేణి పరిశోధకులు, ఆవిష్కర్తలను నియమించుకోవడానికి బడ్జెట్ నిధులను కేటాయిస్తోంది.ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి గ్లోబల్ హబ్గా ఎదగాలన్న కెనడా ఆకాంక్షను తెలియజేస్తోంది. పరిశ్రమ నాయకులు ఈ ప్రణాళికను స్వాగతించారు. ఇది క్లిష్టమైన కార్మిక అంతరాలను భర్తీ చేయడానికి, ఏఐ, బయోటెక్, క్లీన్ ఎనర్జీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో కెనడా పోటీతత్వాన్ని పెంచడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.మనసు మార్చుకున్న అమెరికా!వలస కార్మికుల విషయంలో అమెరికా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే వలస కార్మికులపై విరుచుకుపడిన అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ (US President Trump).. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లు (రూ.88లక్షలు)కు పెంచి అమెరికాలో స్థిరపడాలనుకొనే ఉద్యోగస్థుల ఆశలపై నీళ్లు చల్లారు. వీసాల విషయంలో కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చారు.అయితే, తాజాగా ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్యూలో మాత్రం వలస కార్మికులపై ట్రంప్ సానుకూలంగా మాట్లాడారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్తోపాటు, రక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన వలస కార్మికులను నియమించుకోవాలన్నారు. ఆ రంగాలలో అమెరికన్లకు నైపుణ్యత లేదని అంగీకరించారు.
ఫ్యామిలీ
అమ్మ ఆఖరి కోరిక
‘ఏం కావాలి ఈ జీవితానికి?’ అనే ప్రశ్నకు జవాబు... ‘చిన్న ఆనందం’ కేన్సర్ బారిన పడిన ఆ తల్లికి తన జీవితం ముగింపు దశకు వచ్చిందనే విషయం తెలిసిపోయింది. ‘నాకు తాజ్మహల్ చూపెట్టరా’ అని కుమారుడిని అడిగింది. అడిగిందే తడవుగా తల్లితో పాటు తండ్రిని కూడా తీసుకెళ్లి తాజ్మహల్ చూపించాడు.‘ఈ జీవితానికి ఇది చాలురా’ అన్నట్లుగా ఉంది ఆమె కళ్లలోని సంతోషం. భర్త యూఎన్ శాంతి పరిరక్షక దళంలో పనిచేస్తున్నందు వల్ల చికిత్స కోసం ప్రతి రెండు వారాలకు ఒంటరిగా గ్వాలియర్ నుండి ఢిల్లీకి వెళ్లేది. ఆగ్రా, కాన్పూర్ల మధ్య ఒక చిన్న గ్రామంలో జన్మించిన ఆమె తాజ్మహల్ గురించి వినడమే తప్ప ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు.కుమారుడు ‘ది ఒబేరాయ్ అమర్విలాస్’లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ‘తాజ్ మహల్ చూడాలని ఉంది’ అని తల్లి అడిగిన తరువాత తల్లిదండ్రులను ఆగ్రాకు తీసుకువెళ్లి తాను ఉద్యోగం చేసే హోటల్లో వారికి బస ఏర్పాటు చేశాడు. హోటల్ నుంచి అల్లంత దూరాన తాజ్మహల్ కనిపిస్తోంది.‘ఎప్పుడు వెళుతున్నాం అక్కడికి?’ అని అడిగింది తల్లి. ఆ తరువాత కొద్దిసేపట్లోనే తల్లికి తాజ్ చూపించి ఆమెను ఆనందంలో ముంచెత్తాడు కుమారుడు. తాజ్మహల్ చూసిన పదిహేనురోజులకు ఆమె చనిపోయింది. తన తల్లి చివరి కోరిక గురించి రెడిట్లో చేసిన పోస్ట్ నెటిజనుల హృదయాలను కదిలించింది. (చదవండి:
స్త్రీలకు వారి ఆస్తి వారికి ఇవ్వాల్సిందే!
మా నాన్నగారికి నలుగురు అక్క చెల్లెళ్లు. అందరికీ 1990లలోనే పెళ్ళిళ్లు కూడా అయిపోయాయి. మా నాన్నగారి తల్లిగారి పేరిట ఉన్న ఆస్తిని, తను చనిపోయాక మా నాన్నగారు తన పేరుతో పట్టా పాస్ పుస్తకం తీసుకున్నారు. కొంత భూమిని అమ్మే క్రమంలో కొనేవారు మా అత్తయ్యల అంగీకారం కూడా కావాలి అని అడిగారు. అయితే అందుకు అత్తయ్యలు అంగీకరించలేదు. మా నాన్నగారు వాళ్లకి కట్నకానుకలు ఇచ్చి పెళ్లిళ్లు చేశారు.. ఇప్పుడు మా నలుగురు అత్తయ్యలకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాలా? ఇవ్వకుండా ఉండే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి.– ఫణీంద్ర, చిత్తూరు జిల్లాఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించాను కాబట్టి ఇక వారికి ఆస్తిలో ఎటువంటి భాగమూ ఉండదు అని చాలామంది భ్రమ పడుతూ ఉంటారు. పూర్వికులు ఆస్తి మగవారి హక్కు అని ఆడవారు కూడా నమ్మేస్తూ ఉంటారు. మీ అత్తయ్య గార్లకి పెళ్ళిళ్లు చేయకముందు – చేసిన తర్వాత కూడా ఆస్తిని మీ నాన్నగారు – మీరే కదా అనుభవిస్తున్నారు? మీరు అనుభవించిన దానితో పోలిస్తే వాళ్లకి చేసిన పెళ్ళిళ్లు సరితూగుతాయా? చట్టంలో ఎన్నో మార్పులు వచ్చాయి కానీ సమాజంలో ఇంకా రాలేదు. ఆడపిల్లలకు/స్త్రీలకు సమానమైన ఆస్తి హక్కులను చట్టం కల్పించినప్పటికీ తమ హక్కు కోసం ఎంతోమంది మహిళలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఏది ఏమైనా, హిందూ వారసత్వ (సవరించబడిన) చట్టం, 2005 లోని సెక్షన్ 6 ప్రకారం స్త్రీలకు పురుషులతో సమానమైన హక్కులు ఉన్నాయి. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా వినితా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో మరోసారి తేల్చి చెప్పింది. మీరు వివరించిన దాని ప్రకారం మీకు సెక్షన్ 15 వర్తిస్తుంది. వీలునామా రాయకుండా మరణించిన మహిళ ఆస్తి సెక్షన్ 15 ప్రకారం తన వారసులకు అనగా: 1. ప్రథమంగా కొడుకులకు (లేని పక్షంలో అతని వారసులకు), కూతుళ్ళకు (లేని పక్షంలో ఆమె వారసులకు) – భర్తకు సమానంగా సంక్రమిస్తుంది.2. ద్వితీయంగా భర్త వారసులకు3. తృతీయంగా తల్లి – తండ్రులకు4. లేదా నాలుగవ పక్షంలో తండ్రి గారి వారసులకు5. ఆఖరున తల్లిగారి వారసులకు;ఇలా క్రమపద్ధతిలో మొదటివారు, లేదా రెండవ వారు, ఎవరూ లేకుంటే ఆఖరున సూచించినవారికి ఆస్తి సంక్రమిస్తుంది. సెప్టెంబర్ 9, 2005 కంటే ముందు ఆస్తి పంపకాలు (పార్టిషన్) జరిగి ఉంటే తప్ప, స్త్రీలకు వారి ఆస్తి వారికి ఇవ్వాల్సిందే! పెళ్ళి చేశాము, కట్నం ఇచ్చాము, పురుడు పోశాము, సంక్రాంతికి కొత్త బట్టలు కొన్నాము అంటే కుదరదు. వారి హక్కును వారికి ఇవ్వండి. వారి ఆస్తిని వారికి ఇవ్వండి. మీ అత్తయ్యలకి తెలియకుండా ఆస్తిని అమ్మేస్తే అది మోసం చేసినట్టే. అలాంటి అమ్మకం చెల్లదు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. (చదవండి: మ్యాడ్ హనీ గురించి విన్నారా..? కానీ ఒక్క చుక్క తాగినా అంతే సంగతులు..)
ఓ ‘మష్రూమ్ లేడీ’ విజయగాథ
సేద్యం చేయడానికి సెంటు భూమి లేదు. రోగమో రొష్టో వచ్చినప్పుడు కాస్త సేద దీరుదామంటే పెద్దలు అందించిన ఆస్తులు కానీ, కూడబెట్టుకున్న కాసులు కానీ లేవు. అయితేనేం... ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. స్వయంకృషితో పేదరిక కష్టాలు దాటింది. ఎంతోమంది గ్రామీణ మహిళలు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడేలా చేస్తోంది... ఆమె బిహార్కు చెందిన బీనాదేవి. ఆమె విజయ గాథను అవలోకిద్దాం.బిహార్లోని ముంగేర్ జిల్లాకు చెందిన బీనాదేవి(Binadevi) ఒకప్పుడు కడు పేదరికాన్ని అనుభవించింది. తన నలుగురు పిల్లలకు భోజనం పెట్టడానికి ఎన్నో కష్టాలు పడింది. సాధారణంగా కష్టాలు చుట్టుముట్టినప్పుడు కన్నీటి సముద్రం తప్ప ఏమీ కనిపించదు. కాని బీనాదేవి ఒక శక్తిమంతమైన మార్గాన్ని చూసింది. అది తన భవిష్యత్ను మార్చిన మార్గం. తనను ‘ది మష్రూమ్ లేడీ’గా మార్చిన మార్గం.ఆ మార్గం పేరు... పుట్టగొడుగుల పెంపకం.తన ఇంటి ఇరుకైన గదిలోనే పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించింది బీనాదేవి. చాలా చిన్న స్థాయిలో మొదలైన పుట్టగొడుగుల పెంపకం గ్రామీణ సాధికారత ఉద్యమంగా మారింది. వందకు పైగా గ్రామాలలో వేలాది మంది మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది.ఒక కిలోవిత్తనాలతో తొలి ప్రయత్నం మొదలుపెట్టింది. మొదటి అడుగు అయితే వేసిందిగానీ పుట్టగొడుగుల పెంపకం అనుకున్నంత తేలిక కాదని అర్థమైంది. అందుకు శిక్షణ తీసుకోవడం తప్పనిసరని గ్రహించింది.భాగల్పూర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ తీసుకుంది. తగిన పరిజ్ఞానంతో పుట్టగొడుగుల పెంపకంప్రారంభించిన బీనాదేవికి లాభాలను అందుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఒక పూట తింటే మరో పూట పస్తు అన్నట్లుగా ఉండే బీనాదేవి సంవత్సరానికి లక్షలు అర్జించే స్థాయికి చేరుకుంది. స్థిరమైన ఆదాయం వల్ల పిల్లలను బాగా చదివించింది. ఇప్పుడామె పెద్ద కుమారుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. విజయం తనకే పరిమితం కావాలనుకోలేదు బీనాదేవి. ఆ విజయాన్ని ఇతరులకు కూడా పంచాలనుకుంది. పుట్టగొడుగుల పెంపకంలో ఎంతోమంది మహిళలకు తానే స్వయంగా శిక్షణ ఇచ్చింది.‘మహిళలు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో వారి పట్ల గౌరవం పెరుగుతుంది. వారి కుటుంబజీవితం మెరుగు పడుతుంది’ అంటున్న బీనాదేవి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుంచి అభినందనలు అందుకుంది. ‘కిసాన్ అభినవ’ పురస్కారాన్ని అందుకుంది.తిల్కారి గ్రామానికి చెందిన బీనాదేవికి పేదరికం కష్టాలు ఎన్ని ఉన్నా అపారమైన సంకల్పబలం ఉంది. ఆ బలమే ఆమెను స్ఫూర్తినిచ్చే మహిళ స్థాయికి తీసుకువెళ్లింది.స్ఫూర్తిదాయకమైన బీనాదేవి గురించి ‘ఎక్స్’లో రాసింది కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ. ‘మష్రూమ్ మహిళ బీనాదేవి పుట్టగొడుగుల పెంపకంలో తాను విజయం సాధించడమే కాదు ఎంతోమంది గ్రామీణ మహిళలు విజయం సాధించేలా స్ఫూర్తిని ఇచ్చింది. సహకారాన్ని అందించింది’ అని రాసింది. బీనాదేవి పుట్టగొడుగుల పెంపకం దగ్గర మాత్రమే ఆగిపోలేదు. గ్రామీణప్రాంతాలలో సేంద్రియ వ్యవసాయం, అక్షరాస్యతపై ఉద్యమ స్థాయిలో పనిచేస్తోంది.
డీప్ఫేక్ ఇప్పటి విలన్
సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా స్త్రీల ఇష్టాయిష్టాల వ్యక్తీకరణకు చోటు దొరికిందని భావిస్తున్నంతలోనే కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ట్రోలింగ్ చేసే ధోరణికి బదులు డీప్ఫేక్స్, న్యూడిటీ యాప్స్ ద్వారా స్త్రీలను భయభ్రాంతం చేయడం దేశంలో పెరిగిందని న్యూఢిల్లీకి చెందిన‘బ్రేక్త్రూ ఇండియా’ అనే ఎన్.జి.ఓ. తన అధ్యయనం ద్వారా తెలిపింది. స్త్రీలను వంటగదికే పరిమితం చేసినట్టుగా సోషల్ మీడియాకు బయటే వారిని ఉంచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలుపురుష అహంకారం చాటుకోవడానికి మగవారికి స్త్రీలను అణిచే పద్ధతులు కావాలి. స్త్రీలు ముందుకు అడుగు వేసినా, ఆత్మవిశ్వాసం ప్రదర్శించినా, గట్టి రాజకీయ అబీప్రాయాలు వ్యక్తపరిచినా, ఫ్యాషనబుల్గా ఉన్నా, ఆనవాయితీలను ఉల్లంఘించినా వారిని ‘అదుపు’ చేసి అహాన్ని సంతృప్తి పరుచుకోవాలనుకుంటారు పురుషులు. ఈ పని ఇళ్లల్లో, సంఘంలో ఒక విధంగా జరిగితే సోషల్ మీడియాలో మరో విధంగా జరుగుతోంది. సోషల్ మీడియాలో వివిధ ఆసక్తులతో గుర్తింపు పొందుతున్న స్త్రీలను బెదరగొట్టే ట్రోలింగులు గతంలో చూస్తే ఇప్పుడు ‘డీప్ఫేక్’లతో వారి మీద అంకుశం విసరాలని చూస్తున్నారు కొందరు. అంతేకాదు, డీప్ఫేక్ ఉపయోగిస్తూ ఆడవాళ్ల చిత్రాలను అసభ్యంగా రూపొందించి అవి చూపించి బెదిరించడం, డబ్బు వసూలు చేయడం, తాము చెప్పిన పనులకు ఉపయోగించడం చేస్తున్నారు. సామాన్య మహిళల నుంచి సెలబ్రెటీల వరకూ ఈ డీప్ఫేక్ బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల నటి అనుపమ పరమేశ్వరన్ తన డీప్ఫేక్ చిత్రాలను చూసి హతాశురాలైపోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలతో..భారతదేశం ఏఐ వినియోగ మార్కెట్లో ప్రపంచంలో రెండోస్థానంలో ఉంది. ఏఐలో వస్తున్న అప్డేట్లను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని మన దేశంలో అనేకరంగాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇదే సమయంలో నేరగాళ్లూ ఏఐని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. స్త్రీలు సోషల్మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలను తీసుకుని, ఏఐ ద్వారా తమకు నచ్చిన రీతిలో మార్చుకుంటున్నారు. అసభ్యంగా, నగ్నంగా తయారు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. అవి నిజమైన చిత్రాలలాగే ఉండటంతో బాధితులు కంగారు పడుతున్నారు. అవి బయటకు వస్తే తమ పరువుపోతుందని బాధపడుతూ మానసిక వేదనకు గురవుతున్నారు. అనేక కుటుంబాల్లో ఇది తీవ్రమైన సమస్యగా పరిణమిస్తోంది.సోషల్ మీడియాలో పెట్టిన నిమిషాల్లోనే..సెలబ్రెటీల చిత్రాలతోపాటు సామాన్యుల సోషల్ మీడియా అకౌంట్లపైనా మాయగాళ్లు నిరంతరం కన్నేసి ఉంచుతున్నారు. ఎవరైనా కొత్తగా చిత్రాలుపోస్ట్ చేస్తే నిమిషాల్లోనే వాటిని సేవ్ చేసుకుంటున్నారు. అనంతరం ఏఐ సాయంతో తమకు నచ్చినట్టుగా మార్చుకుంటున్నారు. ఇటీవలపోలీసుల వద్ద నమోదవుతున్న కేసుల్లో డీప్ఫేక్ కేసులు పెరుగుతున్నాయని ‘బ్రేక్త్రూ ఇండియా’ అధ్యయనంలో తేలింది. ఢిల్లీకి చెందిన ఈ ఎన్.జి.ఓ. సోషల్ మీడియాలో స్త్రీలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఇటీవల అధ్యయనం చేసింది.‘డబ్బుకోసమే కాకుండా మహిళల పట్ల కక్ష పెంచుకున్న కొందరు కావాలని ఆ మహిళల డీప్ఫేక్ అశ్లీల ఫొటోలు వారి కుటుంబసభ్యులకు పంపుతూ రాక్షసానందం పొందుతున్నారు. ప్రేమలో ఫెయిలైన అబ్బాయిలు తమ మాజీ ప్రియురాళ్ల చిత్రాలను ఇలా తయారు చేసి వాళ్లను బెదిరిస్తున్నారు. కొన్ని లోన్యాప్స్ తమ వద్ద లోన్ తీసుకున్నవారి చిత్రాలను మార్ఫింగ్ చేసి, వారి కుటుంబసభ్యులకు పంపిన ఉదంతాలు జరిగాయి’ ఆ అధ్యయనంలో తెలిసింది.డీప్ఫేక్ని గుర్తించే ప్రత్యేక చట్టాలేవీ? డీప్ఫేక్ రాజకీయ రంగాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. రాజకీయ నేతల చిత్రాలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా మార్చి, వారి గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ అన్ని సోషల్ మీడియా సంస్థలకు డీప్ఫేక్ చిత్రాలు, వీడియోలను తక్షణం తొలగించాలని తెలిపాయి. అయినా ఆగడాలు ఆగడం లేదు. ఈ డీప్ఫేక్ మోసాలతో మహిళలతోపాటు పురుషులూ మానసికంగా ఆందోళన చెందుతూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ తరహా నేరాల తీవ్రత పెరుగుతున్నా డీప్ఫేక్ని నేరంగా గుర్తించే ప్రత్యేక చట్టం మన దేశంలో లేదు. ప్రస్తుతానికి ఈ తరహా నేరాలను మహిళలపై వేధింపులు, సైబర్ నేరాల పరిధిలోనేపోలీసులు నమోదు చేస్తున్నారు.కట్టడి చేయడమెలా?సోషల్ మీడియా వాడకం సర్వసాధారణంగా మారిన నేపథ్యంలో డీప్ఫేక్ నేరాలను అడ్డుకోవడం కత్తిమీద సాముగా మారింది. ప్రోఫైల్ లాక్ వంటివి కొంత ఉపకరిస్తున్నా, పూర్తిస్థాయిలో అవీ రక్షణ కల్పించలేకపోతున్నాయని బాధితులు అంటున్నారు. ఈ నేరాలకు భయపడి సోషల్ మీడియాకు పూర్తి దూరంగా ఉంటున్నామని అంటున్నారు. అయితే డీప్ఫేక్లు వచ్చినప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా ఆ విషయం తెలపాలని నిపుణులు అంటున్నారు. అలాగే సోషల్ మీడియా పరిచయంతో ఇతరులకు ఫొటోలు, వీడియోలు పంపడం మానుకోవాలని సూచిస్తున్నారు. మరీ అభ్యంతరకరంగా తోచేవి, పూర్తి వ్యక్తిగతమైన చిత్రాలనుపోస్ట్ చేయకపోవడం మంచిదంటున్నారు. ఎవరైనా డీప్ఫేక్ ఫొటోలు చూపించి బెదిరిస్తే భయపడక వెంటనేపోలీసులను సంప్రదించాలని అంటున్నారు.
ఫొటోలు
‘ది గర్ల్ ఫ్రెండ్’ గ్రాండ్ సక్సెస్ మీట్...ముఖ్య అతిథిగా విజయ్ (ఫొటోలు)
‘ది గర్ల్ ఫ్రెండ్’ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ (ఫొటోలు)
హైదరాబాద్ : ఘనంగా కోటి దీపోత్సవం..హాజరైన వీసీ సజ్జనార్ (ఫొటోలు)
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ట్రెడిషనల్ లుక్లో సురేఖవాణి కూతురు సుప్రీత (ఫొటోలు)
వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (ఫొటోలు)
ఈ ఆలయం లో శివుడు తలక్రిందులుగా ఉంటాడు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ ప్రెస్మీట్లో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)
‘సంతాన ప్రాప్తిరస్తు’ ప్రీ రిలీజ్ లో మెరిసిన చాందినీ చౌదరి (ఫొటోలు)
అంతర్జాతీయం
శాలరీ.. తిరిగివ్వనంటూ అల్లరి..
రష్యాలోని ఓ ఫ్యాక్టరీ కార్మికుడిగా పనిచేస్తున్న వాద్లిమిర్ రైచగొవ్ శాలరీ అకౌంట్లో సడన్గా రూ.77 లక్షలు అదనంగా వచ్చిపడ్డాయి. మరో 34 మందికి ఇవ్వాల్సిన వేతనం సాఫ్ట్వేర్ తప్పిదం వల్ల రైచగొవ్ ఖాతాలకి వెళ్లిపోయినట్టు గుర్తించిన అకౌంట్స్ డిపార్ట్ మెంట్ వెంటనే అతడికి కాల్ చేసి డబ్బులు వెనక్కి వేయమని కోరింది. అయితే, అనుకోకుండా దక్కిన లక్ష్మీ కటాక్షాన్ని వదులుకోవడానికి ఇష్టంలేని రైచగొవ్.. బిల్లింగ్ లోపం అయితే వెనక్కి ఇవ్వడం తన బాధ్యత అని, కానీ అది సాంకేతిక లోపం కాబట్టి ఇవ్వడం, ఇవ్వకపోవడం తన ఇష్టమని వాదించాడు. తన కంపెనీ పేరుతో శాలరీ అని జమ అయినందున అది తనదేనన్నాడు. దీంతో కంపెనీ అతడిపై కేసు వేయగా.. కోర్టు కంపెనీకి అనుకూలంగా తీర్పు వెలువరించింది. రైచగొవ్ వెనక్కి తగ్గకుండా అప్పీల్ దాఖలు చేశాడు. అక్కడా చుక్కెదురు కావడంతో ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ప్రస్తుతం ఆ కేసు కోర్టు పరిశీలనలో ఉంది.
అమెరికా షట్డౌన్ ముగిసినట్టే!
వాషింగ్టన్: అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 41 రోజులపాటు ప్రజలను అష్టకష్టాలకు గురిచేసిన షట్డౌన్ ఎట్టకేలకు ముగింపు దశకు చేరింది. షట్డౌన్ను ముగించి, ప్రభుత్వ సేవలను మళ్లీ ప్రారంభించడానికి వీలుగా సంబంధిత బిల్లును సోమవారం సెనేట్లో ఆమోదించారు. బిల్లుకు మద్దతివ్వడాన్ని విపక్ష డెమొక్రటిక్ పార్టీలో కొందరు సభ్యులు వ్యతిరేకించారు. అయినప్పటికీ మెజార్టీ సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. అధికార రిపబ్లికన్ పార్టీతో అవగాహన కుదరడమే ఇందుకు కారణం. సెనేట్లో బిల్లుకు అనుకూలంగా 60 ఓట్లు, వ్యతిరేకంగా 40 ఓట్లు వచ్చాయి. ఇకపై కాంగ్రెస్లోని ప్రతినిధుల సభలో ఆమోదం పొందాల్సి ఉంది. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం పట్టుదలతో వ్యవహరిస్తుండడంతో అతిత్వరలో షట్డౌన్ ముగిసిపోనున్నట్లు తెలుస్తోంది.బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ సేవలను చాలా వేగంగా పునరుద్ధరించబోతున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా, షట్డౌన్ ముగింపు బిల్లును బుధవారం మధ్యాహ్నమే ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిసింది. ఈ సభలో కూడా ఆమోదం పొందితే బుధవారమే షట్డౌన్కు తెరపడే అవకాశం ఉంది. గత నెలలో వార్షిక నిధుల బిల్లుకు సెనేట్ ఆమోదం తెలపకపోవడంతో దేశమంతటా షట్డౌన్ మొదలైన సంగతి తెలిసిందే.దీంతో ప్రభుత్వ సేవలు చాలావరకు నిలిచిపోయాయి. అత్యంత ముఖ్యమైన సేవలు మాత్రమే కొనసాగాయి. వేతనాలు హఠాత్తుగా ఆగిపోవడంతో ఉద్యోగుల ఇక్కట్లపాలయ్యారు. నిధులు లేక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. పలు కీలక రంగాలు ప్రభావితమయ్యాయి. విమానయాన సేవలు కూడా ఆగిపోయాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
పాకిస్తాన్ మళ్లీ రక్తసిక్తం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి రక్తమోడింది. రాజధాని ఇస్లామాబాద్లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది బలయ్యారు. మరో 36 మంది క్షతగాత్రులుగా మారారు. ఇస్లామాబాద్ జిల్లా జ్యుడీషియల్ కోర్టు కాంప్లెక్స్ బయటే ఈ దాడి జరగడం గమనార్హం. దుస్తుల లోపల పేలుడు పదార్థాలు ధరించి వచి్చన దుండగుడు తొలుత కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని, అది సాధ్యం కాకపోవడంతో గేటు వద్ద పోలీసు వాహనం పక్కన నిల్చొని తనను తాను పేల్చేసుకున్నాడని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ వెల్లడించారు.ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భద్రతా సిబ్బంది, ఒక లాయర్ సహా 12 మంది మృతి చెందినట్లు తెలిపారు. పేలుడు శబ్దం ఆరు కిలోమీటర్ల దాకా వినిపించడం గమనార్హం. ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు కనిపించాయి. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారింది. జనం భయంతో పరుగులు తీశారు. ఈ దాడికి కారకులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. సాధారణంగా ఇలాంటి ఆత్మాహుతి దాడులు చేయడంలో తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) ఆరితేరిందని పాక్ అధికారులు చెప్పారు. తాలిబన్లు మతిలేని యుద్ధం ఆపాలి: ఖవాజా అసిఫ్ ఇస్లామాబాద్లో ఆత్మాహుతి దాడి జరిగినట్లు పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ ధ్రువీకరించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది న్యాయవాదులు, కోర్టు సిబ్బందే ఉన్నారు. పేలుడు తీవ్రతకు సూసైడ్ బాంబర్ తల తెగి దూరంగా పడిపోయింది.ఆత్మాహుతి దాడికి అఫ్గాన్లోని తాలిబన్ పాలకులు కారణం కావొచ్చని ఖవాజా అసిఫ్ అనుమానం వ్యక్తంచేశారు. తమపై ఈ మతిలేని యుద్ధం ఆపాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తాలిబన్లను హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంపై పాక్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే రాజధానిలో దాడి జరగడం కలకలం సృష్టించింది.
డేవిడ్ సలాయ్కు బుకర్ ప్రైజ్
లండన్: హంగేరీ నుంచి బ్రిటన్కు వలసవచ్చిన ఓ సాధారణ వ్యక్తి జీవితంలోని సుఖదుఃఖాలు, విషాధాల కలబోతగా రూపుదిద్దుకున్న ఊహాత్మక ‘ఫ్లెష్’ నవల రచించిన హంగేరీ–బ్రిటన్ రచయిత డేవిడ్ సలాయ్కు 2025 బుకర్ ప్రైజ్ వరించింది. 51 ఏళ్ల సలాయ్కు సోమవారం లండన్లోని ప్రఖ్యాత ఓల్డ్ బిల్డింగ్స్గేట్ వేదికపై బుకర్ అవార్డ్ను గత ఏడాది విజేత సమంతా హార్వే ప్రదానం చేశారు. అవార్డ్తో పాటు 50,000 పౌండ్ల నగదు పురస్కారం సలాయ్కు అందజేశారు. ఫేవరెట్లుగా నిలిచిన తొలి ఐదుగురు పోటీదారులను వెనక్కినెట్టి సలాయ్ ఈ అవార్డ్ను గెల్చుకోవడం విశేషం. భారతీయ రచయిత కిరణ్ దేశాయ్ సైతం గట్టిపోటీనిచ్చినా ఆద్యంతం అద్భుతంగా సాగే ఫ్లెష్ రచనకు ప్రాణంపోసిన సలాయ్కు అవార్డ్ దక్కింది.ఒకవేళ కిరణ్ దేశాయ్ ఈ అవార్డ్ను గెల్చుకుని ఉంటే 56 ఏళ్ల అవార్డ్ చరిత్రలో దీనిని రెండుసార్లు గెల్చుకున్న తొలి రచయితగా ఈమె రికార్డ్ నెలకొల్పేది. ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ రచనకు దేశాయ్కు 2006లో బుకర్ ప్రైజ్ దక్కింది. ‘ఫ్లెష్’ నవల మొత్తం హంగేరీకి చెందిన ఇస్ట్వాన్ అనే వలసదారుని చుట్టూ తిరుగుతుంది. ఇస్ట్వాన్ టీనేజీలో పక్కింటి వివాహితతో సాన్నిహిత్యం మొదలు సైన్యంలో చేరి ఇరాక్ యుద్దంలో పాల్గొనడం, తర్వాత దిక్కులేక లండన్కు శరణారి్థగా వెళ్లడం దాకా ఎన్నెన్నో అంశాలను ఎంతో వాస్తవిక కోణంలో రచయిత సలాయ్ రాసుకొచ్చారు.బ్రిటన్లో ప్రైవేట్ సెక్యూరిటీ నిపుణుడికి బౌన్సర్గా, డ్రైవర్గా పనిచేయడం ఈ క్రమంలో సంపన్న క్లయింట్తో వివాహం తర్వాత లండన్ ధనిక సమాజంలో పరపతి, పలుకుబడితో విలాసవంత జీవనం గడపడం దాకా ఇస్ట్వాన్ జీవిత ఘట్టాలను రచయిత ఏకబిగిన చదివేలా చేశారు. మానసిక సంఘర్షణలతో ఇస్ట్వాన్ చివరకు ఏకాకిగా మారి సాధారణ జీవితం గడుపుతాడు. ఈ నవల పేజీల పేరాల మధ్య రచయిత కొంత ఖాళీ స్థలాన్ని వదిలేశారు.పాఠకుడు సైతం నవలలో పూర్తిగా లీనమై ఇస్ట్వాన్ వ్యక్తిత్వాన్ని తనదైన శైలిలో రాసుకునేందుకు ఈ స్థలాన్ని వదిలేశారు. ఈ ఏడాది 153 నవలలు పోటీపడగా సలాయ్ రచన అవార్డ్ను ఎగరేసుకుపోయింది. రచయిత సలాయ్ కెనడాలో పుట్టారు. తర్వాత బ్రిటన్లో పెరిగారు. తాజాగా వియన్నాలో స్థిరపడ్డారు. ఈయన గతంలో రచించిన ‘ఆల్ దట్ మ్యాన్ ఈజ్’ నవల 2016లో తుదిజాబితాకు ఎంపికైనా అవార్డ్ను గెలవలేకపోయింది.
జాతీయం
ముమ్మాటికీ ఉగ్ర దాడే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద 12 మందిని బలి తీసుకున్న కారు పేలుడు ఘటన ముమ్మాటికీ ఉగ్రవాద దాడేనని కేంద్ర మంత్రివర్గం తేల్చిచెప్పింది. ఈ పేలుడుపై విచారణ వేగవంతం చేయాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించింది. దుశ్చర్యకు కారకులైన దుండగులను, వారి భాగస్వాములను, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులను సాధ్యమైనంత త్వరగా చట్టం ముందుకు తీసుకురావాలని నిర్దేశించింది. ఉగ్రవాద పోషకులను వదిలిపెట్టబోమని తేల్చిచెప్పింది. విచారణలో ఎలాంటి జాప్యం చేయొద్దని దర్యాప్తు సంస్థలకు సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీ దాడిలో మరణించివారి ఆత్మశాంతి కోసం ప్రధాని, మంత్రులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. దాడిలో సామాన్యులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ మంత్రివర్గ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించారు. మొత్తం పరిస్థితిని ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కేబినెట్ వెల్లడించింది. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని మంత్రివర్గం తమ తీర్మానంలో స్పష్టంచేసింది. ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే అంతం చేయాల్సిందేనని పేర్కొంది. దర్యాప్తు జరుగుతున్న తీరు, కుట్రదారులను గుర్తించడానికి చేపట్టిన చర్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంత్రివర్గ సహచరులకు తెలియజేశారు. ‘భద్రతపై కేబినెట్ కమిటీ’ సమావేశం ఢిల్లీ పేలుడు ఘటనను మతిలేని ఉగ్రవాద చర్యగా కేబినెట్ అభివర్ణించింది. ఈ పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టంచేసింది. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. బాధితులకు తగిన సాయం, చికిత్స అందించడంలో వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, దర్యాప్తు సంస్థల సిబ్బంది, సాధారణ పౌరులు చురుగ్గా వ్యవహరించారని ప్రశంసించింది. వారి అంకితభావం, విధి నిర్వహణలో చిత్తశుద్ధి శ్లాఘనీయమని ఉద్ఘాటించింది. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించింది. దేశ పౌరుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మంత్రివర్గం తేల్చిచెప్పింది. జాతీయ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు మోదీ నేతృత్వంలో ‘భద్రతపై కేబినెట్ కమిటీ’ సమావేశం జరిగింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి శాఖ మంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ పేలుడు ఘటనతోపాటు తాజా పరిస్థితిపై ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. రూ.25,060 కోట్లతో ఎగమతి ప్రోత్సాహక మిషన్ ఎగమతి ప్రోత్సాహక మిషన్(ఈపీఎం)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఆరు ఆర్థిక సంవత్సరాల్లో రూ.25,060 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభిస్తారు. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో దేశీయ ఎగుమతిదారులను ఆదుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో రెండు ఉప పథకాలు ఉన్నాయి. అవి నిర్యాత్ పోత్రాహన్(రూ.10,410 కోట్లు), నిర్యాత్ దిశ(రూ.14,659 కోట్లు). ⇒ అరుదైన ఖనిజాలైన గ్రాఫైట్, సేసియం, రుబీడియం జిర్కోనియంపై రాయల్టీ రేట్ల హేతుబదీ్ధకరణ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మన దేశంలో ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుందని చెబుతున్నారు. ఆయా ఖనిజాలపై రాయలీ్టని తగ్గించబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ⇒ మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడానికి వీలుగా క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రవేశపెట్టడానికి మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకంలో భాగంగా ఎగుమతిదారులకు 100 శాతం క్రెడిట్ గ్యారంటీ కవరేజీని వర్తింపజేస్తారు. అర్హులైన ఎగుమతిదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) అదనంగా రూ.20,000 కోట్ల మేర రుణ సౌకర్యం కల్పించబోతున్నారు.
పెళ్లి వేదికపై కత్తిపోట్ల కలకలం.. నిందితుణ్ని వెంటాడిన డ్రోన్ కెమెరా.. వీడియో వైరల్
ముంబై: తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల అంటూ బంధు పరివారమంతా ఆనందంగా పాటలు పాడుకుంటుండగా పెళ్లి వేదికపై కత్తిపోట్లు కలకలం రేపాయి. పెళ్లి తంతుపూర్తయి బంధువులతో కలిసి నూతన వధూవరులు ఫొటోలు దిగుతుండగా ఓ వ్యక్తి పెళ్లి కొడుకును కత్తితో పొడిచి పరారయ్యాడు. దీంతో పెళ్లి వేదికపై ఏం జరుగుతుందో అర్థం కాక బంధువులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మహరాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో సోమవారం జరిగిన ఓ పెళ్లి వేడుకలో దారుణం జరిగింది. వేదికపై ఉన్న పెళ్లికుమారుడు సజల్ రామ్ సముద్ర (22)పై నిందితుడు రాఘో జితేంద్ర బక్షి అనే వ్యక్తి కత్తితో మూడు సార్లు దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తన స్నేహితుడు బైక్తో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పెళ్లి వీడియోగ్రాఫర్ తన డ్రోన్ కెమెరాతో నిందితుణ్ని దాదాపు రెండు కిలోమీటర్లు ట్రాక్ చేశాడు. అప్రమత్తమైన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రోన్ ఫుటేజ్ ఆధారంగా నిందితుణ్ని,అతను దాక్కున్న ప్రాంతాన్ని గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో, ఈ దాడికి కారణం డీజే డాన్స్ సమయంలో జరిగిన చిన్న గొడవ అని తేలింది. ఆ గొడవతో ఆగ్రహించిన నిందితుడు పెళ్లికుమారుడిపై దాడికి పాల్పడ్డాడు. గాయపడిన సజల్ రామ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.अमरावती में एक शादी समारोह में दो लड़कों ने दूल्हे पर जानलेवा हमला कर दिया। इसके बाद ड्रोन कैमरामैन में जो किया वो काबिल ए तारीफ है। pic.twitter.com/38SnObPAOO— Shashank shukla (@shashaankshukla) November 12, 2025
ఢిల్లీ పేలుడు ఘటన.. మరో కారు స్వాధీనం
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం(నవంబర్ 10వ తేదీ) రాత్రి జరిగిన భారీ పేలుళ్లలో అక్కడికక్కడే తొమ్మిది మంది దుర్మరణం చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు అసువులు బాశారు. ఈ ఉగ్ర కార్యకలాపాలకు కారణమైన ఒక్కొక్కరినీ స్పెషల్ టీమ్స్ అదుపులోకి తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మరో కారును స్వాధీనం చేసుకున్నారు. హరియాణాలోని ఖండవాలీ గ్రామంలో రెడ్ పోర్డ్ ఈకోస్పోర్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ ఉమర్దిగా గుర్తించారు. ఆ కారు సదరు గ్రామంలో ఓ ఇంటి బయట పార్క్ చేసి ఉండటంతో దాన్ని తనిఖీ చేసి చూడగా అది ఉమర్ మహ్మద్కు చెందినిదిగా కనుగొన్నారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ కారులోనే ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి భారీ పేలుడు పదార్థాలను తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంచితే, ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కారు పేలుడు ఘటనలో తదుపరి కార్యచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సోమవారం రాత్రి జరిగిన పేలుడు ధాటికి సమీప మార్కెట్లోని ప్రజలు, రోడ్లమీద ఉన్న వ్యక్తులు ప్రాణభయంతో పరుగులుతీశారు. తీవ్రస్థాయి పేలుడు కారణంగా మృతదేహాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో అక్కడ భీతావహవాతావరణం నెలకొంది. మంటలు, హాహాకారా లు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీ సమీప ఫరీదాబాద్లో 2,900 కేజీల పేలుడు పదార్థాలను జమ్మూకశ్మీర్, హరియాణా, యూపీ పోలీసుల బృందం స్వాదీనంచేసుకున్న కొన్ని గంటలకే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం యాధృచ్ఛికం కాదని దర్యాప్తు వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి.
చిన్న తప్పిదం రూ.లక్ష కోట్లు : ఆర్బీఐ సీరియస్
కర్ణాటక బ్యాంక్ చేసిన ఒక తప్పు ఎంట్రీ దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ నియంత్రణ సంస్థలను అప్రమత్తం చేసింది.బ్యాంకింగ్ వ్యవస్థ చరిత్రలో అతిపెద్ద తప్పుపై బ్యాంకింగ్ రెగ్యులేటరీ ఆర్బీఐ (RBI) ఇపుడు దృష్టి సారించింది. అంతర్గతంగా, కర్ణాటక బ్యాంక్ నాయకత్వ బృందం దాని ప్రక్రియలను బలోపేతం చేయడంలో బిజీగా ఉంది, ఎందుకంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారులు నియంత్రణలు. రిస్క్ మేనేజ్మెంట్ వైఫల్యంపై బ్యాంకును ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత సంవత్సరం కొనసాగుతున్న వార్షిక పర్యవేక్షణలో రెగ్యులేటర్ దృష్టిని ఆకర్షించిన ప్రధాన సమస్యలలో ఫ్యాట్ ఫింగర్ ఎర్రర్ కూడా ఒకటి అని ఈ పరిణామం గురించి తెలిసిన ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయని మనీ కంట్రోల్ తన కథనంలో పేర్కొంది. 2023 ఆగస్టు 9న దేశ బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేసిన ఆ ఘటన వివరాలేంటో తెలుసా?మనీ కంట్రోల్ కథనం ప్రకారం కర్ణాటక బ్యాంక్ ఖాతానుంచి ఒక తప్పిదం( A fat finger error) సాయంత్రం 5:17లకు లక్ష కోట్ల రూపాయలు ఒక అకౌంట్కు బదిలీ అయ్యాయి! ఉద్యోగి పొరపాటున ఈ నగదును యాక్టివ్గాలేని పొదుపు ఖాతాలోకి నమోదు చేశాడు. కానీ ఆశ్చర్యకరంగా రాత్రి 8 గంటలకు దాదాపు 3 గంటల్లోపు ఆ సొమ్ము తిరిగి క్రెడిట్ అయింది. దీనిపై బ్యాంకు ఉన్నత యాజమాన్యం దిగ్భ్రాంతి చెందింది. కానీ ఈ సంఘటన గురించి ఉన్నతాధికారులకు లేదా బోర్డుకు వెంటనే తెలియజేయలేదు. ఈ విషయాన్ని ఆరు నెలలు దాచిపెట్టారని ఆరోపణ. దీన్ని తీవ్రమైన నిర్లక్ష్యంగా పరిగణించి RBI దర్యాప్తు ప్రారంభించింది.అయితే ఈ వ్యవహారం గురించి బ్యాంక్ రిస్క్ మేనేజ్మెంట్ బృందానికి తెలియజేసినట్టు, కానీ అది బోర్డుకు చేరడానికి ఆరు నెలలు పట్టిందని సంబంధిత పత్రాల ద్వారా తెలుస్తోంది. ( లోయర్ బెర్త్.. సీనియర్ సిటిజన్స్ కోసం చిట్కా వైరల్ వీడియో)డబ్బు యాక్టివ్ ఖాతాకు బదిలీ చేయలేదు, సిస్టమ్ ఎంట్రీ, కాబట్టి సరిపోయింది. లేదంటే లక్ష కోట్ల రూపాయలంటే మాటలా. ఇది కర్ణాటక బ్యాంక్ మొత్తం అడ్వాన్సుల కంటే చాలా రెట్లు ఎక్కువ. 2024మార్చిలో అర్హత కలిగిన సంస్థాగత ప్లేస్మెంట్ల జారీ ద్వారా బ్యాంక్ దాదాపు రూ. 600 కోట్ల మూలధనాన్ని సేకరించింది. FY25లో బ్యాంక్ మొత్తం అడ్వాన్సులు రూ.76,541 కోట్లు. తప్పుగా నమోదు చేసిన సొమ్ము రూ. 100,000 కోట్లు. దీని అర్థం ఒక చిన్న మిస్టేక్ బ్యాంకు పరిమాణం కంటే పెద్దది.(రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్ స్టోరీ) ఈ సంఘటన పరిణామ క్రమం ఇలామార్చి 4, 2024 : మొదటిసారి రిస్క్ కమిటీకి సమాచారం అందించారు.మార్చి 11, 2024: రిస్క్ కమిటీ వివరణాత్మక నివేదికను కోరింది.మార్చి 15, 2024: ఐటీ విభాగం ఒక నోట్ను సమర్పించింది.మార్చి 28, 2024: దీనిపై బోర్డుకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అక్టోబర్ 23, 2024: బోర్డు సమావేశంలో ఈ సమస్యను మళ్ళీ లేవనెత్తినట్టు తెలుస్తోంది.ఇపుడు ఈ రెండు విషయాలపైనా ఇపుడు ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది ఇంత పెద్ద వ్యవస్థ వైఫల్యాన్ని ఆరు నెలలుగా ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? అనేది ఆరా తీస్తోంది. ఈ సంఘటనను తన వార్షిక పర్యవేక్షణ ,పర్యవేక్షణలో కీలకమైన సమస్యగా పరిగణిస్తోంది.మరోవైపు ఇటీవల బ్యాంకు సీఎండీ శ్రీకృష్ణన్ హెచ్ ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ రావు ఈ సంవత్సరం జూలైలో తమ పదవుల నుండి వైదొలిగారు. ఎండీ రాజీనామా తర్వాత, ముఖ్యంగా 2023 తరువాత బ్యాంకులో చేరిన సీనియర్ లీడర్ షిప్ ఎగ్జిక్యూటివ్లు బ్యాంకును వీడారు. అయితే ఒక వేళ ఆ ఖాతా నిద్రాణంగా ఉండకపోతే, మనీ క్రెడిట్ కాగానే వాళ్లు స్పందించి ఉంటే? ఆ సొమ్ము దుర్వినియోగానికి ప్రయత్నించి ఉంటే? ఇది కేవలం అక్షర దోషమా లేదా సిస్టమ్ నియంత్రణలలో బలహీనతా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలు, రిపోర్టింగ్ గురించి తీవ్ర ఆందోళన రేకెత్తించింది.కర్ణాటక బ్యాంక్ అధికారిక స్పందనదీనిపై స్పందించిన బ్యాంకు ఇప్పటికే ఈ సమస్యను పరిష్కరించుకున్నామని, ఆర్థిక నష్టం జరగలేదని స్పష్టం చేసింది. దీన్ని ఆర్బీఐకి నివేదించినట్టు కూడా తెలిపింది. దీనిపై RBI ఇంకా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.
ఎన్ఆర్ఐ
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. భారత్కు చెందిన అనిల్కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తన పూర్తి పేరు అనిల్కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్కార్ కొనుగోలు చేసి.. సెవెన్స్టార్ హోటల్లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.From anticipation to celebration, this is the reveal that changed everything!Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025
డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు
డాలస్, టెక్సస్: ఈ అవగాహనా సదస్సు ఏర్పాటుచేసిన ప్రముఖ ప్రవాస భారతీయ నాయుకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రపంచంలోని విభిన్న భాషలు, సంస్కృతులు, కళలు, ఆచార, వ్యవహారాలు, మతాలు అవలంభించండానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రయాలున్న దేశం అమెరికా. అందుకే అమెరికా దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, వివిధ భాషలవారి చర్చిలు, గురుద్వారాలు, సినగాగ్స్ లాంటి ఎన్నో ప్రార్ధనాలయాలు దర్శనమిస్తాయి.అనేక నగరాలలో భారతీయ మూలాలున్న లక్షలాదిమంది ప్రజలు ఎన్నో తరాలుగా ఈ జనజీవన స్రవంతిలో మమేకమవుతూ, వివిధ రంగాలలో బాధ్యాతాయుతంగా సేవలందిస్తూ, అమెరికా దేశ ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి దోహద పడుతూ, మంచి గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్రయాలు దారి తప్పుతున్న ధోరణలతో కొన్ని ప్రాంతాలలో ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించి వివిధ సంఘాల ప్రతినిధులతో డాలస్ నగరంలో ఒక అవగాహనా సదస్సు ఏర్పాటుచేసి, ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలను, విషయాలను కూలంకషంగా చర్చించి ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసేందుకు యీ సదస్సు ఏర్పాటుచేశాం అన్నారు”.➢ ముందుగా అమెరికాదేశ విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా అందరూ గౌరవించాలి. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వేదికమీద కేవలం ఒక్క భారతీయ జెండా మాత్రమే ఉంచకూడదు. భారత, అమెరికా దేశపు రెండు జెండాలు ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉండేటట్లుగా చూడాలి. వేదికపైన ఉన్న జెండాలలో వేదికముందు ఉన్న ప్రేక్షకులకు ఎడమవైపు భాగంలో అమెరికాదేశ పతాకం, కుడివైపు భారతదేశ పతాకం కనబడేటట్లుగా ఉంచాలి.జాతీయగీతాలు ఆలపించేడప్పుడు ముందుగా భారత జాతీయగీతం, ఆ తర్వాత అమెరికా జాతీయగీతం ఆలాపించాలి. భారత జాతీయగీతం పాడుతున్నపుడు నిశబ్దంగా, నిటారుగా నిలబడి ఉండాలి. అమెరికా జాతీయగీతం ఆలపిస్తున్నపుడు, అమెరికాదేశ జాతీయపతాకం వైపు చూస్తూ, కుడిచేతిని గుండెదగ్గర ఉంచుకోవాలి. టోపీలుధరించి ఉన్నట్లయితే జాతీయ గీతాలు ఆలపిస్తున్నంతసేపు వాటిని తీసిఉంచడం మర్యాద. ➢ భారతీయులు ముఖ్యంగా తెలుగువారి వందలాది కుటుంబాలు ఎక్కువగా ఒకేచోట నివసిస్తున్న ప్రాంతాలాలో దైవిక, ఆధ్యాత్మిక ఉత్సవాల పేరుతో కొన్ని రహదారులు మూసివేసి, లౌడ్ స్పీకర్ల మోతలు, బాణసంచాలు, నినాదాలతో వీధుల్లో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు యిబ్బందికరంగా మారుతోంది. దీనికి సిటీ పర్మిషన్ ఉన్నట్లయితే, ట్రాఫిక్ డైవర్షన్ గుర్తులు, తగు పోలీస్ రక్షణ సిబ్బంది సహాయం తప్పనిసరి. ఇలాంటివి ఇళ్ళమధ్యలోగాక, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు, ఆలయ ప్రాంగణాలకు పరిమితం చెయ్యడం ఉత్తమం. అలా కాకపోతే ఎన్నో ఉపద్రవాలకు గురిఅయ్యే ప్రమాదంఉంది.➢ ఉదాహరణకు ఇటీవలే ఇలాంటి సంఘటనతో తన కారులో రోడ్ మీద ఎటూ వెళ్ళడానికి వీలులేక, ఈ ఉత్సవాల జనంమధ్య చిక్కకుని, విసిగిపోయిన ఒక అమెరికన్ తన కారు దిగి తుపాకి చూపడంతో, అందరూ బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు. ఆ తుపాకీ పేలినా, బంగారు ఆభరణాలు ధరించి ఆ ఉత్సవాలలో పాల్గొన్న పిల్లలు, పెద్దల సమూహంలో తొక్కిసలాట జరిగినా, ఊహకందని ప్రమాదం జరిగి ఉండేది. ఇళ్ళ మధ్యలోగాని, ఆరు బయటగాని బాణాసంచా ఏ ఉత్సవాలలోనైనా కాల్చకూడదు. అలా చేయడానికి ‘పైరోటెక్ లైసెన్స్’ ఉండాలి, అనుభవజ్ఞులైన, లైసెన్స్ ఉన్న టెక్నీషియన్స్ మాత్రమే ఆ పనిచేయడానికి అర్హులు. ➢ మన భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నప్పుడు దియేటర్లవద్ద హడావిడి శ్రుతిమించి రా(రో) గాన పడుతుంది. హీరోలకు అభిమానులు ఉండడం తప్పుగాదు గాని, దియేటర్లలో వారికి వందలాది కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, పేపర్లు చించి విసిరి, ఈలలు, గోలలు, డాన్సులతో ఒక జాతరను తలపించడంతో అదే మూవీ కాంప్లెక్స్ లో ఇతర భాషల సినిమాలు వీక్షించేవారు భయకంపితులవుతున్నారు.నిజానికి ఎంతో ఖర్చుపెట్టి సినిమా చూద్దామని వచ్చిన ఆయా హీరోల అభిమానులుకూడా కేకలు, అరుపుల మధ్య ఆ సినిమాను పూర్తిగా ఆస్వాదించలేక అసంతృప్తికి లోనవుతున్నారు. పోలీసులువచ్చి ఈ గోల, గందరగోళాల మధ్య ఆడుతున్న సినిమాను మధ్యలో ఆపివేసి అందరినీ బయటకు పంపి వెయ్యడం లాంటి సంఘటనలు ప్రవాస భారతీయులందరికీ సిగ్గుచేటు, అవమానకరం. ➢ ఇక ఆయా రాజాకీయపార్టీల నాయకులు వచ్చినప్పుడు అభిమానులు చేసే హడావిడే వేరు. వీధుల్లో భారీ కార్ల ర్యాలీలు, జెండాలు, నినాదాలతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి వారు, ఆయా నాయకులకు అభిమానం చూపడం, సభలు సమావేశాలు నాల్గు గోడలమధ్య ఏర్పాటు చేసుకోవడం ఎవరికీ అభ్యంతరం కాకూడదు. కాని సమస్యంతా రోడ్లమీద, రాజకీయ నాయకులు బసచేసిన హోటళ్ళవద్ద ఇతరుల శాంతికి భంగం కల్పిస్తూ అభిమానులు చేసే గోలే. అదే హోటళ్ళలో అనేక వందలమంది అమెరికన్లు బసచేసి ఉన్నారనే స్పృహకూడా లేకుండా వేసున్న అరుపులు, కేకలకు పోలీస్లు వచ్చి అందరినీ తరిమికొట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా విచారకరం.➢ చాలామంది ప్రవాస భారతీయులకు ఇంటి ఎదురుగాను, ప్రక్కన నివసిస్తున్న అమెరికన్ల పేర్లు కూడా తెలియవు. అమెరికా జనజీవన స్రవంతిలో భాగంఅవుతూ ఇరుగుపొరుగుతో కలసిమెలిసి జీవించడం చాలా అవసరం. ఎన్నో తరాలగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం గనుక స్థానిక, జాతీయ రాజకీయ నాయకులతో పార్టీలకతీతంగా సంభందాలు కలిగి ఉండాలి. అమెరికా పౌరసత్వం కల్గిఉన్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడం, తమ సమస్యలను, అభిప్రాయాలను రాజకీయనాయకులకు తెలియజేయడం ఎంతైనా అవసరం.➢ మరో పెద్ద సమస్య – ఊళ్ళ పేర్లను మార్చి వ్రాయడం, పలకడం. ఉదాహరణకు-1856లో ఏర్పడ్డ ‘డాలస్’ నగరాన్ని ‘డాలస్ పురం’ గా “ఉల్లాసపురం” గా పలకడం;1913లో ఏర్పడ్డ “క్యారల్టన్” అనే నగరాన్ని “కేరళాటౌన్” గా పలకడం ఎందుకంటే అక్కడ కొంతమంది కేరళ రాష్ట్రం నుంచి వచ్చినవారు ఉన్నారు గనుక; 1950లో ఏర్పడ్డ “గంటర్” అనే నగరాన్ని “గుంటూరు” గా మార్చి పలకడం ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు గనుక. ఇవి అన్నీ వినడానికి హాస్యంగానే ఉంటాయి కాని ఇవి అమెరికన్ల దృష్టిలోపడి అపహాస్యానికి, అపాయానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి కొంతమంది అమెరికన్లు మన భారతదేశం వచ్చి మన పట్టణాల పేర్లను ఇంగ్లీష్ పేర్లతో మార్చివేస్తే ఎలా ఉంటుందో మనకు!. ఇలాంటి విపరీత మనస్తత్వానికి వెంటనే స్వస్తి పలకాలి.➢ వ్యక్తిగత శుచి, శుభ్రత పాటించకపోవడం, వాల్ మార్ట్ లాంటి స్టోర్స్ లో దొంగతనాలు చేస్తూ దొరికిపొయి చిక్కుల్లో పడడం, స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ లేదా తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయి పోలీసులతో వాగ్వివాదాలకు దిగడం, పరిసరాలను అశుభ్రపరచడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోను, రెస్టారెంట్లలోను సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడంలాంటి సంస్కృతిని విడనాడాలి.➢ వాట్స్ ఆప్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్ మొదలైన సాధనాల ద్వారా పంపే సందేశాలు, ముఖ్యంగా అమెరికన్ రాజకీయ విమర్శలు తరచూ అమెరికన్ అధికారులు గమనిస్తున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని మెలగాలి.➢ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు, రాజకీయ నాయకులు, సినిమా కధానాయకులు వారి అభిమానులకు సరైన దిశానిర్దేశం చెయ్యడం ఎంతైనా అవసరం. అవగాహన కల్పించడంలో ప్రసారమాధ్యమాల పాత్ర, కృషి కొనియాడ దగ్గది.➢ రెండు గంటలకు పైగా సాగిన ఈ అవగాహానా సదస్సులో తానా, ఆటా, నాటా, నాట్స్, టాన్టెక్స్, టిపాడ్, డేటా, సురభి రేడియో, గ్రేటర్ ఫోర్ట్ వర్త్ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ఎన్నో దశాబ్దాలగా డాలస్ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసంఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం మొదలైన ప్రవాస భారతీయనాయకులు హాజరై వారి వారి అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.అతి తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన నాయకులకు, అనివార్యకారణాలవల్ల హాజరుకాలేకపోయినా సందేశాలను పంపిన వారికి, రుచికరమైన విందుభోజన ఏర్పాట్లు చేసిన ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారికి, అన్ని వసతులతో కూడిన కాన్ఫరెన్స్ హాల్ ను సమకూర్చిన డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఒకేసారి రెండు ఉద్యోగాలు : డాలర్లకు కక్కుర్తి పడితే ముప్పు తప్పదు!
మూన్లైటింగ్ ఆరోపణలపై భారత సంతతికి చెందిన వ్యక్తికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన వార్త ఇంటర్నెట్లో దావాలనంలా వ్యాపించింది. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన మెహుల్ గోస్వామిని యుఎస్ లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్నగోస్వామి మాల్టా పట్టణంలో మరో కాంట్రాక్ట్ ఉద్యోగం చేయడాన్ని నేరంగా పరిగణించింది. 2022 మార్చిలో గోస్వామి న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్లో రిమోట్ వర్క్(work from home) తోపాటు, మాల్టాలోని సెమీకండక్టర్ కంపెనీకి కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. గోస్వామిపై అందిన ఫిర్యాదును విచారణ చేపట్టిన మోహుల్ గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. గోస్వామి మూన్ లైటింగ్ కారణంగా రాష్ట్రఖజానాకు రూ.44 లక్షల నష్టం జరిగిందని అధికారులు భావించారు. డ్యూయల్ ఎంప్లాయ్ మెంట్ రూల్ ప్రకారం అమెరికాలో రెండు ఉద్యోగాలు చేయడం నేరంగా పరిగణించిన దర్యాప్తు సంస్థప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం చేయడం ప్రజలను మోసం చేయడమే అని, ప్రజా వనరుల దుర్వినియోగం అని పేర్కొంది.ప్రభుత్వ ఉద్యోగులకు నిజాయితీతో సేవ చేసే బాధ్యత ఉంది కానీ గోస్వామి ఆ నమ్మకాన్ని తీవ్రంగా ఉల్లంఘించాడని న్యూయార్క్ స్టేట్ ఇన్స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ అన్నారు.ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూనే రెండో పూర్తికాలం ఉద్యోగం చేయడం అంటే ప్రజల డబ్బుతోపాటు ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడమే అవుతుందని లూసీ లాంగ్ పేర్కొన్నారు.ఏంటీ నేరం; ఏలాంటి శిక్షసరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ,రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయం ఈ విషయంపై సంయుక్త దర్యాప్తు చేపట్టి,గోస్వామి అరెస్టు చేసింది. సొంత పూచీకత్తుపై విడుదలయ్యాడు. ఈ కేసు ప్రస్తుతం తదుపరి చట్టపరమైన చర్యలు పెండింగ్లో ఉంది. రెండవ డిగ్రీలో గ్రాండ్ చోరీ అభియోగం మోపబడింది, ఇది న్యూయార్క్లో తీవ్రమైన క్లాస్ సి నేరం. ఈ నేరం రుజువైతే గోస్వా మికి గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.13 లక్షల వరకు లేదా పొందిన ఆర్థిక ప్రయోజనాలకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధించే అవకాశముంది.చదవండి: ఇషా, ఆకాష్ అంబానీ బర్త్డే: తరలి వెళ్లిన తారలుడాలర్లకు కక్కుర్తిపడితేడాలర్లకు ఆశ పడి విదేశాల్లో ఉద్యోగాలు చేసకుంటున్న నిపుణులైన ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. లక్షలకోసం ఆశపడితే దేశం పరువు ప్రతిష్టలకు భంగం కలగడంతో పాటు,వ్యక్తిగతంగా కూడా భారీ నష్టం తప్పదని, ఉద్యోగులు నిబద్దతగా నిజీయితీగా ఉండాలని సూచిస్తున్నారు.గతంలో అమెరికా సంస్థలతో మూన్లైట్ చేస్తూ మరో భారతీయుడు పరేఖ్, పట్టుబడ్డాడు. మూన్ లైటింగ్ ద్వారా ఐదు యుఎస్ స్టార్టప్లను మోసం చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాన్ని మొదట మిక్స్ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు మరియు మాజీ CEO సుహైల్ దోషి సోషల్మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. (రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్)
మనోళ్ల దీపావళి ఎఫెక్ట్: వెల్లువెత్తిన ఫిర్యాదులు
భారత్తో పాటు ప్రపంచంలోని నలుమూలలా భారతీయులు, మన మూలాలు ఉన్నవాళ్లు దీపావళి వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అయితే.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేడుకల్లోనూ పలు చోట్ల అపశ్రుతి ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తగా.. అదే సమయంలో విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. దీపావళి వేడుకల్లో.. గాయాలు, ప్రమాదాలు, చివరాఖరికి మరణాలు కూడా సంభవించిన సందర్భాలు ఉన్నాయి. అయితే అమెరికాలో ఈ ఏడాది జరిగిన వేడుకల్లో ‘నష్టం’ కాస్త ఎక్కువే జరిగిందని పరిస్థితులు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. అర్ధరాత్రి పూట అక్కడి భారతీయులు చేసిన హంగామాపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో జరిగిన డ్యామేజ్ ఉదాహరణంగా నిలిచింది!.న్యూయార్క్ నగరం క్వీన్స్ ప్రాంతంలో.. బాణాసంచా కారణంగా లింకన్ స్ట్రీట్లోని మూడు నివాసాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇక్కడి దీపావళి వేడుకలకు.. అదీ కూడా అర్ధరాత్రి పూట నిర్వహణకు అసలు అనుమతే లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఫైర్వర్క్స్ గాల్లోకి ఎగసి ఓ ఇంట్లోకి నేరుగా దూసుకెళ్లిన తర్వాత మంటలు వ్యాపించాయి. మరోపక్క.. Your #Diwali celebration? My house is gone!What a sad incident, disappointing beyond words.Indians in the U.S., wake up before it's too late!! pic.twitter.com/7SQjiVBgfV— M9 USA🇺🇸 (@M9USA_) October 24, 2025UPDATE: We have received video from the homeowner showing the damage caused by the illegal and irresponsible Diwali fireworks.In addition, a vehicle and the garage were completely burned and damaged. https://t.co/vOh5Oa58o3 pic.twitter.com/436GvhB9KD— YEGWAVE (@yegwave) October 24, 2025న్యూజెర్సీలో ఒక్క ఎడిసన్ నుంచే 40 ఎమర్జెన్సీ కాల్స్ అధికారులకు వెళ్లాయట. ఆస్తి నష్టంతో పాటు ముందస్తు జాగ్రత్తగా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారట. తమ నిద్రకు భంగం వాటిల్లిందనే ఫిర్యాదులు చేసిన వాళ్లు ఉన్నారట. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేడుకలను జరగనివ్వకుండా ఆపేశారు కూడా. ఇంకోపక్క.. Look at the aftermath of these Diwali celebrations.It’s chaos. Litter everywhere. Police holding people back. Indians hanging out of cars speeding by.And these people have the audacity to compare Christmas parades to this.I’m fed up.pic.twitter.com/2gX57IcKW3— Anti-Taxxer (@mapleblooded) October 23, 2025దీపావళి వేడుకల కారణంగా అగ్నిప్రమాదాలు సంభవించి కొందరి నివాసాలు పూర్తిగా ధ్వంసమై అయ్యాయని.. కట్టుబట్టలతో వాళ్లు రోడ్డు మీద పడ్డారని కొన్ని వీడియోలు, కథనాలు బయటకు వచ్చాయి. ‘‘ఇలా జరుగుతుందని అనుకోలేదు. మాకేం మిగల్లేదు. నా కొడుకు ఒంటి మీద సరైన బట్టలు కూడా లేవు. హోటల్ గదిలో జీవించాల్సి వస్తోంది’’ అని బాధితురాలు జువానిటా కొలన్ ఓ మీడియా సంస్థతో పేర్కొనడం గమనార్హం. దీంతో.. Indians were celebrating Diwali in US. Their police and fire department came to join the celebration and played Holi. pic.twitter.com/nLLlnFlh8p— Joy (@Joydas) October 23, 2025అమెరికా దీపావళి వేడుకలపై మునుపెన్నడూ లేనిస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అందుకు ఆ స్థాయిలో జరిగిన నష్టమే కారణమని స్పష్టమవుతోంది. దీంతో అధికారులు ఇలాంటి వేడుకలను అనుమతించొద్దని.. ఒకవేళ అనుమతించినా.. సురక్షిత నిబంధనలు పాటించేలా కఠిన మార్గదర్శకాలను తీసుకురావాలని పలువురు అమెరికన్లు కోరుతున్నారు. ఈ ఘటనలకు సంబంధించి.. పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని సమాచారం.Indians have been living a respectful life in USA, UK, Canada and other Countries for over a century. What has really changed with the current expats creating such a ruckus, nuisance, civic garbage, displaying absolute lack of civic sense, cultural bankruptcy, this Diwali❓… pic.twitter.com/dGzt3SrtIs— Raju Parulekar (@rajuparulekar) October 24, 2025
క్రైమ్
భార్యపై అనుమానంతో దారుణం చేసిన భర్త
అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్యపై దారుణ దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరంపల్లికి చెందిన ఎర్రిస్వామి తన భార్య రత్నమ్మపై అనుమానంతో కోపావేశంలో రత్నమ్మ గొంతు కోసి పరారయ్యాడు.దాంతో రత్నమ్మ తీవ్రంగా గాయపడగా, ఆమెను తక్షణమే కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.ఎర్రిస్వామి స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు.సదరు ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న ఎర్రిస్వామి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
పెళ్లికి ఒకరోజు ముందు వరుడి ఆత్మహత్య
నిజామాబాదు జిల్లా: రెండ్రోజుల్లో పెళ్లి జరుగనుండగా పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నా యి. ఎడపల్లి మండలంలోని మంగల్ పహాడ్ గ్రామానికి చెందిన చేపూరి నారాగౌడ్ కు ముగ్గురు కుమారులు. చిన్న కొడుకు ప్రతాప్ గౌడ్ (31) ఇంటి వద్ద వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. ప్రతాప్ గౌడ్ కు ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ నెల 13న పెళ్లి జరగాల్సి ఉంది. అయి తే సోమవారం నుంచి ప్రతాప్ గౌడ్ కనిపించకుండా పోయాడు. కుటుంబీకులు వెతికి నా ఆచూకి లభించలేదు. మంగళవారం స్థానికులకు గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఉన్న స్థితిలో ప్రతాప్ గౌడ్ మృత దేహం కనిపించింది. దీంతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చా రు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెళ్లి కొడుకు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
మూడేళ్ల తర్వాత బెంగాల్ మాజీ మంత్రికి బెయిల్
కోల్కతా: స్కూల్ సిబ్బంది నియామకాల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ ఎట్టకేలకు బెయిల్ లభించింది. మంగళవారం ఆయన అలీపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. 2016లో చేపట్టిన స్కూళ్లలో బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఛటర్జీపై అభియోగాలు వచ్చాయి. దీంతో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు 2022 జూలై 23న అరెస్ట్ చేశారు. అనారోగ్యానికి గురైన ఆయన్ను అధికారులు ఏప్రిల్లో ముకుందాపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. సోమవారం ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు మొత్తం 8 మంది సాక్షుల వాంగ్మూలాల నమోదు పూర్తయినందున ఆయనకు బెయల్ ఇచ్చేందుకు అంగీకరించింది.చదవండి: లగ్జరీ అపార్ట్మెంట్ : గోడకు పెన్సిల్తో రంధ్రం?! వైరల్ వీడియోఈ మేరకు కోర్టు ఆదేశాలు వెలువడటంతో ప్రెసిడెన్సీ జైలు అధికారులు ఛటర్జీని విడుదల చేశారు. సాక్షుల వాంగ్మూలాల నమోదు పూర్తయితే పార్థ ఛటర్జీకి బెయిలివ్వ వచ్చునంటూ ఆగస్ట్ 18వ తేదీన సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతకుముందే, ఛటర్జీకి ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరైంది. ఆయన్ను మరే లాభదాయక పదవుల్లో నియమించరాదనే షరతుతో కలకత్తా హైకోర్టు సెప్టెంబర్ 26న బెయిల్కు పచ్చజెండా ఊపింది. బెయిల్పై పార్థ ఛటర్జీ విడుదలవడంతో కోల్కతాలోని ఆయన నివాసం వద్ద టీఎంసీ కార్యకర్తలు హడావుడి చేశారు. ఇదీ చదవండి: 100 ఎకరాల ఫామ్ హౌస్, లగ్జరీ కార్లు : కళ్లు చెదిరే సంపద
ట్రాన్స్జెండర్ రాజేశ్వరి ఆత్మహత్య
వరంగల్ జిల్లా: కుటుంబ సభ్యులకు దూరమయ్యాననే మనస్తాపంతో ఓ ట్రాన్స్జెండర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వరంగల్లోని రామగోపాలపూర్లో చోటు చేసుకుంది. మామునూరు ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్న మడిసిలేరు గ్రామానికి చెందిన సోది కృష్ణ కుమారుడు శివప్రసాద్ అలియాస్ రాజేశ్వరి (20) నాలుగు సంవత్సరాల నుంచి బంధువు శ్యామల అక్షరతో కలిసి రామగోపాలపూర్లో నివసిస్తోంది. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం శివప్రసాద్ ట్రాన్స్ జెండర్గా సర్జరీ చేయించుని రాజేశ్వరిగా పేరుమార్చకున్నాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నానని మనస్తాపానికి గురవుతోంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రామగోపాలపూర్లో తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై ట్రాన్స్ జెండర్ తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
వీడియోలు
అప్పుల్లో రికార్డుల్ని తిరగరాస్తున్న బాబు.. ఏకంగా రూ.1,02,533 కోట్లు
మా వాళ్లు సంయమనం కోల్పోతే నీ పరిస్థితి.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఉగ్రవాదుల టార్గెట్ జనవరి 26.. వెలుగులోకి సంచలన నిజాలు
మహిమ గల చెంబు మీ డబ్బులు డబుల్..!
అప్పుడో మాట.. ఇప్పుడో మాట.. దేవుడి సాక్షిగా దొరికిపోయారు
భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు
కోటి గళాల గర్జన.. గ్రాండ్ సక్సెస్
ఎందుకు వచ్చారు.. వెళ్లిపోండి.. మీడియాను ఘోరంగా అవమానించిన లోకేష్
సెంటు భూమి ఇవ్వలేదు... 3 లక్షల ఇళ్లు కట్టేశాడంట బాబును చీదరించుకుంటున్న జనం
ఇన్నాళ్లకు బయటపడ్డ కర్నూల్ బస్సు ప్రమాదం.. సంచలన వీడియో

