ఢిల్లీ క్రైమ్- 3 రివ్యూ.. బేబీ ఫలక్ కేసు గుర్తుందా?
ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్లు ఎప్పటికీ మెప్పిస్తాయి. అయితే, వాస్తవ సంఘటన ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఫ్రాంచైజీలో భాగంగా సీజన్-3 వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం బాగుందని సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దర్శకులు తనూజ్ చోప్రా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్లో షెఫాలీ షా, హ్యుమా ఖురేషి, రసికా దుగ్గల్, రాజేష్ తైలాంగ్, యుక్తి తరేజా తదితరులు నటించారు. ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ 2019 మార్చి, రెండో సీజన్ 2022 ఆగస్టులో విడుదలయ్యాయి. రెండూ భారీ విజయాన్ని దక్కించుకున్నాయి. సీజన్-3లో హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడే ఓ మహిళను డీసీపీ (షెఫాలీ) ఎలా పట్టుకున్నారో చూపించారు. ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 -50 నిమిషాలు ఉన్నప్పటికీ బోర్ అనిపించదు. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.కథేంటి..?అమ్మాయిలను అక్రమ రవాణా చేసే ఒక ముఠాకు వ్యతిరేకంగా డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ), ఆమె బృందం చేసే పోరాటమే ఢిల్లీ క్రైమ్-3 కథ.. 2012లో జరిగిన బేబీ ఫలక్ కేసు నుండి ప్రేరణగా ఈ సిరీస్ను తెరకెక్కించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి కథ మొదలౌతుంది. 2012లో 15 ఏళ్ల బాలిక అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరుతుంది. బాలికను వైద్యులు పరీక్షిస్తున్న సమయంలో ఆమె పుర్రె విరిగిపోయి, శరీరంపై మానవ కాటు గుర్తులు ఉన్నట్లు గుర్తించి షాక్ అవుతారు. తమ కెరీర్లో ఎప్పుడు కూడా ఇంతటి ఘోరమైన కేసును చూడలేదని డాక్టర్లు చెబుతారు. దీంతో బాలిక కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారుతుంది. పోలీసుల ఎంట్రీతో కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఈ కేసును ఛేదించేందుకు డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ) టీమ్ రంగంలోకి దిగుతుంది. ఇంతకు ఈ బాలికను ఆసుపత్రిలో చేర్పించింది ఎవరు అనే పాయింట్ నుంచి విచారణ ప్రారంభిస్తుంది. ఈ క్రమంలోనే అస్సాం నుండి ఒక ట్రక్లో కొన్ని వెపన్స్ వస్తున్నాయని ఆమెకు సమాచారం అందడంతో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రక్ను ఆపుతుంది. అయితే, ఆ ట్రక్లో వెపన్స్ బదులు పదుల సంఖ్యలో ఆడపిల్లలు ఉండడంతో షాక్ అవుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నట్లు వర్తికా గుర్తిస్తుంది. ఇక్కడి నుంచే ఆమె తీగలాగడం మొదలుపెడుతుంది. అమ్మాయిలను అక్రమంగా తరలిస్తుంది ఎవరు..? ఢిల్లీలో ఈ మూఠా వెనుకున్నది ఎవరు..? హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్న బాలికకు ఈ ముఠాతో ఉన్న లింక్ ఏంటి..? 15 ఏళ్ల బాలికన అంత ఘోరంగా చిత్రహింసలు చేయడానికి కారణం ఏంటి.. ఆ బాలిక తల్లిదండ్రులు ఎవరు..? ఫైనల్గా ఆ బాలిక బతికిందా..? వంటి అంశాలు తెలుసుకోవాలంటే డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ) టీమ్ చేసిన ఢిల్లీ క్రైమ్-3 ఇన్విస్టిగేషన్ చూడాల్సిందే..ఎలా ఉందంటే..?క్రైమ్ ఇన్విస్టిగేషన్ సినిమాలు ఎప్పుడూ కూడా ఆసక్తిని కలిగించేలా ఉండాలి. ఈ విషయంలో దర్శకులు తనూజ్ చోప్రా విజయం సాధించారు. కేవలం 6 ఏపిసోడ్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేశవ్యాప్తంగా అమ్మాయిల మిస్సింగ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఎక్కువగా అనాథలు, పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలే ఈ మూఠా ఎలా టార్గెట్ చేస్తుంది అనే పాయింట్ను చాలా చక్కగా చూపించారు. అమ్మాయిలను ఆశ చూపించి కొన్ని ముఠాలు ఎలా కోట్లు సంపాదిస్తున్నాయో కూడా తెరపై కళ్లకు కట్టినట్లు చూపారు. ఆయుధాల మాదిరిగానే అమ్మాయిలు కూడా పాలు, నీళ్ల ట్యాంకర్లతో పాటు కంటెయినర్లలో ఎలా తరలిస్తారనేది దర్శకుడు ఈ కథలో చక్కగా ఆవిష్కరించారు. ఇలాంటి కేసులను ఛేదించేందుకు పోలీసులు ఎంత రిస్క్ చేస్తారనేది అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా మెప్పిస్తుంది. అస్సాం, హర్యానా, మిజోరాం, సూరత్, రాజస్థాన్, ఢిల్లీ వంటి ప్రాంతాలను ప్రధానంగా టచ్ చేస్తూ ఈ కథను నడిపించిన తీరు సహజత్వానికి దగ్గరగా అనిపిస్తుంది. అమ్మాయిల జీవితాలను నాశనం చేసే ముఠాల నుంచి కాపాడటానికి ప్రాణాలకు తెగించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారనే విషయాన్ని ఈ సిరీస్ క్లియర్గా చూపుతుంది.ఢిల్లీ క్రైమ్-3 రియల్ స్టోరీ. కథ చాలా బలంగానే ఉంటుంది. అయితే, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 45 -50 నిమిషాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా బోర్ అనిపించదు. ముఖ్యంగా క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు మెప్పిస్తుంది. డీసీపీ వర్తికా చతుర్వేది పాత్రలో షెఫాలీ మరోసారి దుమ్మురేపింది. హ్యుమా, యుక్తి తరేజా తప్ప మిగతా కీలకపాత్రధారులందరూ పాత సీజన్లలో కనిపించినవారే కావడంతో ప్రేక్షకులు త్వరగానే కనెక్ట్ అవుతారు. కె-ర్యాంప్తో హిట్ కొట్టిన యుక్తి తరేజా ఈ సిరీస్లో దూకుడు స్వభావం గల లేడీ పోలీస్ ఆఫీసర్గా మెప్పించింది. ఈ సిరీస్కి ఒన్నాఫ్ ది హైలైట్ పాత్ర ఆమెదే అని చెప్పొచ్చు. ఇలాంటి కథలు చాలా థ్రిల్లింగ్ డ్రామాలా కొనసాగితే ప్రేక్షకులకు ఇంకా బాగా నచ్చుతుంది. కానీ, ఈ విషయంలో కాస్త మైనస్ అని చెప్పాలి. కీలక సన్నివేశాల్లో తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు బాగా అంచనా వేయడంతో గొప్పగా సస్పెన్స్లకు ఛాన్స్ ఉండదు. కానీ, ఫైనల్గా అందరికీ ఢిల్లీ క్రైమ్-3 నచ్చుతుంది.
క్షమాపణ చెప్పినా బీబీసీని వదలని ట్రంప్
లండన్: గతేడాది బీబీసీలో ప్రసారమైన డాక్యుమెంటరీలో ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేయడంతో తలెత్తిన వివాదం సమసిపోయేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారంపై బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ హెడ్ డెబొరా టర్నెస్ రాజీనామా చేశారు. బీబీసీ చైర్మన్ సమీర్ షా కూడా చెప్పారు. అయినప్పటికీ చట్ట పరమైన చర్యల కోసం కోర్టు కెళతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. కనీసం కోటి నుంచి 5 కోట్ల డాలర్ల వరకు తాము పరిహారం కోరే అవకాశముందని శనివారం ఆయన తెలిపారు. ‘మోసానికి పాల్పడినట్లు బీబీసీయే ఒప్పుకుంది. కానీ, క్షమాపణలను చెప్పాల్సిన విధంగా చెప్పలేదు. వాళ్లు మోసం చేశారు. నేను చెప్పని మాటలను చెప్పినట్లుగా డాక్యుమెంటరీలో ప్రసారం చేశారు’అని ట్రంప్ ఆరోపించారు. 2021 జనవరి 6వ తేదీన ట్రంప్ చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేయడంలో పొరపాటు జరిగిందని, తామలా ఉద్దేశపూర్వకంగా చేయలేదని గురువారం బీబీసీ వివరణ ఇచ్చుకుంది. అయితే, పరిహారం చెల్లించేది లేదని తెలపడంపై ట్రంప్ గుర్రుగా ఉన్నారు. తాము మరోసారి ఇలాంటి తప్పిదం చేయమంటూ బీబీసీ ఇచ్చిన వివరణను సైతం ఆయన తప్పుబట్టారు. ‘మీరు చేయకపోవచ్చు, ఇతరులు చేస్తే మాత్రం ఆపరు..ఇదే కదా మీ ఉద్దేశం’అంటూ బీబీసీపై కారాలు మిరియాలు నూరారు. దావా వేయాలని తాము అనుకోవడం లేదన్న ఆయన, అలా చేయక తప్పడం లేదని వ్యాఖ్యానించారు.
మొబైల్ చార్జర్ను ప్లగ్కే ఉంచుతున్నారా?
మొబైల్ చార్జర్ను కరెంట్ ప్లగ్లకే వేలాడేసి ఉంచడం.. చాలా ఇళ్లలో, ఆఫీసుల్లో కనిపించేదే. కొందరైతే స్విచ్ ఆన్లో ఉండగానే వాటిని అలా వదిలేస్తుంటారు. ఉరుకుల, పరుగుల జీవితమే అందుకు కారణమని సాకులు చెబుతుంటారు. అయితే ఇది తేలికగా తీసుకోవాల్సిన విషయమేమీ కాదని అంటున్నారు నిపుణులు. సెల్ఫోన్ చార్జర్లను ఇలా కరెంట్ ఫ్లగులకు వదిలేయడం ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల కొంచెం కొంచెంగా విద్యుత్ వినియోగం.. భారీ పరిమాణంలోనే జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు కొన్ని రిస్కులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వాటిని పరిశీలిస్తే.. 👉ఫాంటమ్ పవర్ వినియోగం (Phantom Power): చార్జర్కి ఫోన్ కనెక్ట్ చేయకపోయినా, చిన్న మొత్తంలో విద్యుత్ (0.1–0.5 వాట్) వినియోగం జరుగుతుంది. దీన్ని ‘వాంపైర్ ఎనర్జీ’ అంటారు. దీన్ని ఇలాగే లెక్కస్తే రోజులు.. నెలలు.. సంవత్సరాలకు కొన్ని యూనిట్లు వృథా అవుతాయన్నమాట.👉చార్జర్ లైఫ్ తగ్గే అవకాశం.. నిరంతరం విద్యుత్ ప్రవాహంలో ఉండటం వల్ల చార్జర్లోని అంతర్గత భాగాలు మెల్లగా దెబ్బతినే అవకాశం ఉంది. దీని వల్ల దీర్ఘకాలికంగా పనితీరు తగ్గుతుంది.👉ఇలా స్విచ్ బోర్డులకు, ఫ్లగ్గులకు చార్జర్లు వదిలేయడం సేఫ్ కూడా కాదు. కొన్నిసార్లు విద్యుత్తో అవి వేడెక్కే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా నాణ్యత లేని చార్జర్లతో. దీనివల్ల ఫోన్లు పాడైపోవడం, పేలిపోవడం.. ఒక్కోసారి అగ్ని ప్రమాదాలు కూడా సంభవించవచ్చు. 👉పర్యావరణంపై ప్రభావం.. మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అలవాటు ఎంత మందికి ఉందో?. అంటే.. చాలా విద్యుత్ వృథా అవుతుందన్నమాట. కాబట్టి విద్యుత్ వినియోగం అనేది చిన్న మొత్తంలో అయినా, పెద్ద మొత్తంలో అయినా.. పర్యావరణానికి ఏమాత్రం మంచిది కాదు.పాటించాల్సినవి.. తడి చేతులతో చార్జర్లను ఫోన్కు కనెక్ట్ చేయకూడదుఫోన్ చార్జింగ్లో లేనప్పుడు చార్జర్ను ప్లగ్ నుంచి తీసేయడం ఉత్తమంనాణ్యమైన చార్జర్లకే ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా వేడి, విద్యుత్ వృథా వంటి సమస్యలు తగ్గుతాయి.మార్కెట్లలోకి రకరకాల చార్జర్లు(ఒరిజినల్ వెర్షన్) వస్తున్నాయి. స్మార్ట్ ప్లగ్లు వాడితే, ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ చేయవచ్చు:::సాక్షి, వెబ్డెస్క్ఇదీ చదవండి: పవర్ ఆఫ్లో ఉన్నా మీ ఇంట్లో ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసా?
'వారణాసి'లో మహేష్ బాబు.. టైటిల్ గ్లింప్స్ (ఫోటోలు)
ఐబొమ్మ పూర్తిగా క్లోజ్.. లాగిన్ వివరాలు ఇచ్చేసిన రవి
అది నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. రెండో పెళ్లి చేసుకుంటా!
కలహాలు వీడి.. కాపురాల ముడి
IPL 2026: వేలానికి సిద్ధం.. ఎవరి పర్సులో ఎంత?.. ఎన్ని ఖాళీలు?
జెన్-జెడ్ తిరుగుబాటు.. మెక్సికో నేషనల్ ప్యాలెస్ వద్ద టెన్షన్
ఇషా సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
40 ఏళ్లు వచ్చాక ఇల్లు కొంటుంటే..
కూలిన రాతి గని.. శిథిలాల కింద 15 మంది కార్మికులు
దద్దరిల్లిన అడవి.. సుక్మాలో భారీ ఎన్కౌంటర్
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
ఒకే రోజు రెండోసారి.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?
ఎన్నాళ్లకు నిజం మాట్లాడారు సార్! వేరెవరో చేయించిన వాటిని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారన్నమాట!
హెచ్–1బీ పూర్తిగా బంద్
Thanuja: కల్యాణ్ను ఓడించి ఫ్యామిలీ వీక్లో కెప్టెన్గా.
సంతోషంలో పింకీ.. గ్రాండ్గా కొడుకు బారసాల ఫంక్షన్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వాహనయోగం
ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు
పసిడి ధరలపై జాక్పాట్.. వెండి భారీ క్రాష్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
తనూజకు భారీగా ఓట్లు.. సీక్రెట్ ఇదే
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్
'అమ్మోరు'లో మొదట నేనే విలన్.. ఏడాదిన్నర పనిచేశా కానీ
అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్
‘కాంత’ మూవీ రివ్యూ
సొంత డబ్బుతో కాదు.. అప్పు చేసి ఇల్లు కొనండి!
సౌతాఫ్రికా కెప్టెన్ను ఎగతాళి చేసిన బుమ్రా!
ఐబొమ్మ పూర్తిగా క్లోజ్.. లాగిన్ వివరాలు ఇచ్చేసిన రవి
అది నేను తీసుకున్న చెత్త నిర్ణయం.. రెండో పెళ్లి చేసుకుంటా!
కలహాలు వీడి.. కాపురాల ముడి
IPL 2026: వేలానికి సిద్ధం.. ఎవరి పర్సులో ఎంత?.. ఎన్ని ఖాళీలు?
జెన్-జెడ్ తిరుగుబాటు.. మెక్సికో నేషనల్ ప్యాలెస్ వద్ద టెన్షన్
ఇషా సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
40 ఏళ్లు వచ్చాక ఇల్లు కొంటుంటే..
కూలిన రాతి గని.. శిథిలాల కింద 15 మంది కార్మికులు
దద్దరిల్లిన అడవి.. సుక్మాలో భారీ ఎన్కౌంటర్
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
ఒకే రోజు రెండోసారి.. మరింత తగ్గిన గోల్డ్ రేటు!
బంగారం ధరలు రివర్స్.. పసిడి ప్రియులకు గుడ్న్యూస్
నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా?
ఎన్నాళ్లకు నిజం మాట్లాడారు సార్! వేరెవరో చేయించిన వాటిని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారన్నమాట!
హెచ్–1బీ పూర్తిగా బంద్
Thanuja: కల్యాణ్ను ఓడించి ఫ్యామిలీ వీక్లో కెప్టెన్గా.
సంతోషంలో పింకీ.. గ్రాండ్గా కొడుకు బారసాల ఫంక్షన్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం
ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వాహనయోగం
పసిడి ధరలపై జాక్పాట్.. వెండి భారీ క్రాష్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
తిండికి గతి లేక అమ్మ మట్టి తినేది.. ఏడిపించిన కంటెస్టెంట్స్
తనూజకు భారీగా ఓట్లు.. సీక్రెట్ ఇదే
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్
'అమ్మోరు'లో మొదట నేనే విలన్.. ఏడాదిన్నర పనిచేశా కానీ
అతడిని ఎందుకు పక్కన పెట్టారు? గంభీర్పై కుంబ్లే ఫైర్
‘కాంత’ మూవీ రివ్యూ
సొంత డబ్బుతో కాదు.. అప్పు చేసి ఇల్లు కొనండి!
సౌతాఫ్రికా కెప్టెన్ను ఎగతాళి చేసిన బుమ్రా!
సినిమా
ఆరాధన గుర్తుండిపోతుంది: కామాక్షీ భాస్కర్ల
‘‘మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్గా రూపోందిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. తర్వాత ఏం జరగబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్గారికి జోడీగా ఆరాధన అనే పాత్ర చేశాను. నా పాత్ర ఎక్కడ నుంచి వచ్చింది? ఏం చేస్తుంది? అనేది ఆసక్తిగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ లేకపోతే ఈ చిత్రకథ లేదు. సినిమా చూసిన తర్వాత ఆరాధన అందరికీ గుర్తుండిపోతుంది’’ అని కామాక్షీ భాస్కర్ల తెలిపారు. ‘అల్లరి’ నరేశ్, కామాక్షీ భాస్కర్ల జోడీగా నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. ‘పోలిమేర’ మూవీ ఫేమ్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు షో రన్నర్గా వ్యవహరించారు.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో కామాక్షీ భాస్కర్ల విలేకరులతో మాట్లాడుతూ– ‘‘పోలిమేర’ తర్వాత అనిల్ విశ్వనాథ్గారు కొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారు. అందుకే ‘12ఏ రైల్వే కాలనీ’కి దర్శకత్వం వహించకుండా తన పర్యవేక్షణలో నానిగారితో దర్శకత్వం చేయించారు. నానిగారు అద్భుతంగా తీశారు. నేను జనరల్ ఫిజీషియన్ని. నేను పని చేస్తున్న సినిమా సెట్లో నన్ను డాక్టర్గానూ యూజ్ చేస్తుంటారు (నవ్వుతూ).ఇండియన్ సినిమాలో పారామెడికల్ కల్చర్ తక్కువ... ఈ సంస్కృతిని తెలుగు సినిమాలోనూ తీసుకురావాలనే ఆలోచన ఉంది. శ్రీవిష్ణు, సుహాస్, విజయ్ సేతుపతిగార్లు హీరోలుగా, అన్ని రకాల పాత్రలు చేస్తున్నారు. అయితే ఫీమేల్ యాక్ట్రెస్కి ఆ యాక్సెప్టెన్సీ లేదు. అలా ఎందుకు ఉండకూడదని సవాల్గా తీసుకుని హీరోయిన్గా చేస్తూనే కీలక పాత్రలు చేస్తున్నాను. ప్రస్తుతం ‘డెకాయిట్’ సినిమా చేస్తున్నాను. ‘పోలిమేర 3’ షూటింగ్ ఆరంభం కావాలి. మరో పెద్ద సినిమా కూడా ఒప్పుకున్నాను’’ అని చెప్పారు.
ఫ్యామిలీ స్టార్స్!
కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ తిరుగు ఉండదు. మంచి కథ, క్యాస్టింగ్, డైరెక్టర్ కుదిరితే ఆ ఫ్యామిలీ మూవీ సూపర్ హిట్ అవుతుంది. ఈ ఏడాది సంక్రాంతికి పండక్కి విడుదలైన ఫ్యామిలీ డ్రామా సినిమా పెద్ద చిత్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’, చిన్న చిత్రాల్లో వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కోర్టు’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్స్గా నిలిచాయి. ఈ తరుణంలో ఫ్యామిలీ డ్రామా సినిమాలపై, కుటుంబ భావోద్వేగాలపై కొందరు స్టార్ హీరోలు ఫోకస్ పెట్టారు. మరి... ప్రస్తుతం కుటుంబ కథా చిత్రాలు చేస్తున్న టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్స్పై మీరూ ఓ లుక్ వేయండి.రాజీ పడదామే... మాజీ ఇల్లాలా! శంకర వరప్రసాద్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఫుల్లీ వర్క్ మైండెడ్. దీంతో పర్సనల్ లైఫ్కి, వర్కింగ్ లైఫ్కి మధ్య బ్యాలెన్స్ తప్పిందట. మరి... ఈ రెంటినీ మళ్లీ శంకరవరప్రసాద్ ఎలా బ్యాలెన్స్ చేశాడు? అన్నది ‘మన శంకరవరప్రసాద్’ లో చూడొచ్చట. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ మిళితమైన సినిమాగా ‘మన శంకరవరప్రసాద్గారు’ సినిమా ఉండబోతోందని ఫిల్మ్నగర్ సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి, నయనతార భార్యా భర్తలుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘మీసాల పిల్ల’ అనే పాట విడుదలైంది. ఇందులో ‘రాజీ పడదామే మాజీ ఇల్లాలా’ అనే లిరిక్స్ ఉన్నాయి.దీన్నిబట్టి, ఈ చిత్రంలో భార్యాభర్తలుగా చిరంజీవి–నయనతారల మధ్య ఫ్యామిలీ గొడవలు, అలకలు ఉంటాయని అర్థం అవుతోంది. ఈ సన్నివేశాలు థియేటర్స్లో ఆడియన్స్కు వినోదాన్ని పంచుతాయని ఊహించవచ్చు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్, క్యాథరీన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తు న్నారు. సాహు గారపాటి, సుస్మితా కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా నటించిన మరో సినిమా ‘విశ్వంభర’. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ మోతాదు కాస్త ఎక్కువగానే ఉంటుందని సమాచారం.ఈ సినిమాలో చిరంజీవికి ఐదుగురు సిస్టర్స్ ఉంటారని, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి హీరోయిన్స్ చిరంజీవికి సిస్టర్స్గా నటించారని తెలిసింది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం వచ్చే వేసవిలో రిలీజ్ కానున్నట్లుగా చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.అబ్బాయిగారు 60 ప్లస్ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాలు వెంకటేశ్ కెరీర్లో ఎంతటి బ్లాక్బస్టర్గా నిలిచాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈ రెండు సినిమాలకు రైటర్గా పని చేశారు ఇప్పటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లోనే వెంకటేశ్ హీరోగా ఓ సినిమా రానుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. వెంకటేశ్ కెరీర్లోని ఈ 77వ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్కు చాన్స్ ఉందని, త్వరలోనే ఈ హీరోయిన్ పేరు కూడా మేకర్స్ రివీల్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు... ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాల కథలు వైజాగ్ నేపథ్యంలో మొదలై, హైదరాబాద్కు షిఫ్ట్ అవుతాయి. వెంకటేశ్–త్రివిక్రమ్ తాజా చిత్రం కూడా వైజాగ్ నేపథ్యంలోనే ఉంటుందనే టాక్ తెరపైకి వచ్చింది.ఇంకా ఈ సినిమాకు ‘వెంకటరమణ, ఆనంద నిలయం, వెంకటరమణ కేరాఫ్ ఆనందనిలయం, అబ్బాయిగారు 60 ప్లస్’ అనే టైటిల్స్ కూడా తెరపైకి వచ్చాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుందని, టైటిల్ను కూడా అతి త్వరలోనే రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందని ఫిల్మ్నగర్ సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ ఫ్యామిలీ డ్రామా వచ్చే వేసవిలో రిలీజ్ కానుంది.మరోవైపు ఇంటెన్స్ క్రైమ్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ అయిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు రాగా, ఈ రెండు చిత్రాల్లోనూ వెంకటేశ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి ముచ్చటగా ‘దృశ్యం 3’ కూడా రానుందని ఇటీవల జరిగిన ఓ వేడుకలో వెంకటేశ్ కన్ఫార్మ్ చేశారు. అలాగే తాను, మీనా హీరో హీరోయిన్లుగా నటించనున్న విషయాన్ని కూడా వెంకటేశ్ చెప్పారు. ఇక ‘దృశ్యం 3’ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం కానున్నట్లుగా తెలిసింది.రామసత్యనారాయణ విజ్ఞప్తి! ‘నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్... ఏఐ... జెమిని..చాట్జీపీటీ.. ఇలా అన్నింటినీ అడిగాను. మే బీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్ళని.., ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను. ఆశ్చర్యపోయారే తప్ప ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు ఆడగకూడదని, పెళ్లయిన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ... మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి డైలాగ్స్ రవితేజ కొత్త చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలోనివి. ఫ్యామిలీ ఎమోషన్స్కు పెద్ద పీట వేసే దర్శకుడు కిశోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.రామసత్యనారాయణగా హీరో రవితేజ నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్లోనే పైన పేర్కొన్న సంభాషణలు ఉన్నాయి. ఈ డైలాగ్స్ని బట్టి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతోందని తెలుస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. తాత–మనవడి కథ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ సినిమా ఒకటి. సోషియో ఫ్యాంటసీ హారర్ కామెడీ జానర్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఇందులో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, సంజయ్దత్ తాత–మనవడి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అంతేకాదు...ఈ సినిమాలో కామెడీ, హారర్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగానే ఉంటాయట.ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్స్లో బలమైన ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ను ప్రేక్షకులకు చూపించనున్నారట ఈ చిత్రదర్శకుడు మారుతి. ఇంకా... ఈ సినిమాలో ఓ ఘోస్ట్గా సంజయ్ దత్ కనిపిస్తారు. సెకండాఫ్లో ప్రభాస్ పాత్రను సంజయ్ దత్ ఆత్మ ఆవహిస్తుందని, ఈ సీన్స్ థియేటర్స్లో అదిరిపోతాయని టాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానుంది.విశ్వనాథన్ అండ్ సన్స్ ‘రంగ్ దే, లక్కీ భాస్కర్’ వంటి సూపర్హిట్ కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి తాజాగా తనదైన మార్క్తో ఈ జానర్లోనే మరో మూవీ తీస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది. మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే యూరప్లో ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ షూటింగ్ షెడ్యూల్ను జరిపారు మేకర్స్. అంతేకాదు... ఈ సినిమాకు ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఈ సినిమా టైటిల్ గురించి అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది.మూడు తరాల కథ మోటర్ రేసింగ్ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే మల్టీ జనరేషన్ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’. 1990– 2000 మధ్య కాలంలో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ హీరోగా నటించారు. ఈ సినిమా కథకు రేసింగ్ బ్యాక్డ్రాప్ ఉన్నప్పటికీ, మూడు తరాల ఫ్యామిలీ కథగా ‘బైకర్’ మూవీ ఉంటుంది. ఈ చిత్రంలో శర్వానంద్ డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తారని తెలిసింది. ఇందులో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించగా, రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విక్రమ్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ ‘బైకర్’ చిత్రం డిసెంబరు 6న రిలీజ్ కానుంది.మరోవైపు ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలోనే శర్వానంద్ హీరోగా రూపోందుతున్న తాజా చిత్రం ‘నారీ నారీ నడము మురారి’. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. లవ్, ఫ్యామిలీ డ్రామా ప్రధాన అంశాలుగా ఈ చిత్రకథనం సాగుతుంది. వచ్చే సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను థియేటర్స్లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.లెనిన్ అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. సగానికి పైగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లుగా తెలిసింది. రాయలసీమ నేపథ్యంలో సాగే ‘లెనిన్’ సినిమాలో లవ్స్టోరీతో పాటు బలమైన ఫ్యామిలీ భావోద్వేగాలు ఉండబోతున్నట్లుగా తెలిసింది. తండ్రీ–కొడుకుల భావోద్వేగంతో కూడిన ఓ ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో ఉందని, ఈ సీన్స్ ఈ సినిమాకు హైలైట్గా ఉంటాయని టాక్. అయితే ఈ సినిమాలోని తండ్రి పాత్రలో ఎవరు యాక్ట్ చేస్తున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా శ్రీలీల కన్ఫార్మ్ అయ్యారు. కానీ కాల్షీట్స్ కేటాయింపుల్లో ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల తప్పుకున్నారని, ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం.ఫ్యామిలీ కథ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు హీరో కిరణ్ అబ్బవరం. కిరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘చెన్నై లవ్స్టోరీ’ రిలీజ్కు రెడీ అవుతోంది. కాగా, కుటుంబ కథా చిత్రాలను చక్కగా తెరకెక్కించే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఇటీవల ఓ ఫ్యామిలీ స్టోరీని కిరణ్కు వినిపించారని, కథ నచ్చడంతో ఈ యువ హీరో కూడా ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్కు శ్రీను వైట్ల మరిన్ని మెరుగులు దిద్దుతున్నారని, త్వరలోనే ఈ మూవీపై మేకర్స్ నుంచి ఓ ప్రకటన రానుందని తెలిసింది. ఇలా కుటుంబ కథలతో సినిమాలు చేస్తున్న తెలుగు హీరోలు మరి కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు ఈ ఫ్యామిలీ జానర్ సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
మాస్ డ్యాన్స్కి రెడీ
మాస్ డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారట చిరంజీవి, వెంకటేశ్. ఈ స్టార్స్ ఇద్దరితో ఓ సెలబ్రేషన్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావిపూడి. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపోందుతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్గారు’. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా, ముఖ్య పాత్రల్లో వెంకటేశ్, క్యాథరీన్, వీటీవీ గణేశ్ నటిస్తున్నారు.ఆల్రెడీ చిరంజీవి, వెంకటేశ్ కాంబినేషన్లో గత నెలాఖర్లో ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. కాగా ఈ చిత్రంలో ఓ సెలబ్రేషన్ సాంగ్ ఉందని, ఈ పాటలో చిరంజీవి, వెంకటేశ్తో పాటు నయనతార, క్యాథరీన్ కూడా డ్యాన్స్ చేస్తారని టాక్. ఈ పాటను ఈ నెలాఖరున చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.
‘వారణాసి’ చూసి యావత్ దేశం గర్వపడుతుంది: మహేశ్ బాబు
నాన్నగారు(కృష్ణ) ఎప్పుడూ నన్ను ఒక మాట అడుగుతూ ఉండేవారు. ‘నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది’ అని చాలా సార్లు అడిగారు. ఈ విషయంలో నేను ఆయన మాట వినలేదు. ఇన్నాళ్లకు వారణాసి(Varanasi)లో అలాంటి పాత్ర చేశా. ఆయన ఎక్కడ ఉన్నా ఆశిస్సులు మనతో ఉంటాయి’ అన్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu). రాజమౌళి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వారణాసి’. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషించాడు. గ్లోబ్ ట్రాటర్ పేరుతో హైదరాబాద్లో నిర్వహించిన ఈవెంట్లో శనివారం ఈ మూవీ టైటిల్తో పాటు స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ..‘వారణాసి నా డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి మాత్రం ఇలాంటి సినిమా చేసే అవకాశం వస్తుంది. దీని కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతా. అందరూ గర్వపడేలా చేస్తా. ముఖ్యంగా రాజమౌళి గర్వపడేలా శ్రమిస్తా. ఈ మూవీ విడుదలైన తర్వాత యావత్ దేశం మనల్ని చూసి గర్వపడుతుంది. ఈ ఈవెంట్ కేవలం టైటిల్ ప్రకటన కోసమే. ముమ్ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీ(ఫ్యాన్స్) సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది. ఈ ఈవెంట్ ఇంత సజావుగా జరిగేలా సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు’ అని అన్నారు. ఎంఎం కీరవాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2027 వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
న్యూస్ పాడ్కాస్ట్
పని చేయకున్నా జీతాలివ్వాలా?... విశాఖ ఉక్కు కార్మికులపై రెచ్చిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం. మొత్తం 243 స్థానాలకు గాను 202 చోట్ల విజయం
ఉత్త ఒప్పందాలే... రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటూ చంద్రబాబు ప్రచార ఆర్భాటం
అది ముమ్మాటికీ ఉగ్ర దాడే... ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నేడు కోటి గొంతుకల గర్జన.... చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యమ కార్యచరణ ప్రకటన
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు. తొమ్మిది మంది దుర్మరణం. 20 మందికి గాయాలు. రంగంలోకి దర్యాప్తు బృందాలు
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం... సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం
ప్రజాధనాన్ని ప్రైవేటుకు దోచిపెడుతున్న కూటమి సర్కారు...
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
క్రీడలు
శుభం కార్డు నేడే?
ఔరా... క్రికెట్! ఇదేం వికెట్! బ్యాటింగ్ ఫ్రెండ్లీ క్రికెట్లో గేమ్ ఛేంజర్లంతా బ్యాటర్లే! మెరుపులైనా, సునామీలైనా బ్యాట్లతోనే చూశాం. కానీ ఈడెన్ గార్డెన్స్ టెస్టు చూస్తే మాత్రం ‘ఇది గతం... బౌలర్లు ఘనం’ అనక తప్పదు! ఎందుకంటే బౌలింగ్ జోరు ఒక సెషన్కే సరిపెట్టుకోలేదు... ఓ రోజుకే పరిమితం కాలేదు. వరుసగా ఆరు సెషన్లు బ్యాట్లు డీలా... బ్యాటర్లు విలవిలలాడేలా బౌలర్లు భళా అనిపించారు. సంప్రదాయ క్రికెట్కే కొత్త ఉత్తేజాన్నిచ్చేలా... మూడు రోజుల్లోనే ఫలితం వచ్చేలా ఇరు జట్ల బౌలర్లు గ్రే‘టెస్టు’ క్రికెట్ ఆడుతున్నారు. కోల్కతా: మార్క్రమ్ 31... కేఎల్ రాహుల్ 39... తొలి రెండు రోజుల్లో దక్షిణాఫ్రికా, భారత్ ఓపెనర్లు చేసిన పరుగులివి! రెండు జట్ల ఇన్నింగ్స్ల్లో టాప్ స్కోర్లు కూడా ఇవే! టెస్టులో రెండు సెషన్లు ఆడితే సెంచరీ... రెండో రోజు నిలబడితే డబుల్ సెంచరీ, ఆ రోజంతా అజేయంగా నిలిస్తే ట్రిపుల్ సెంచరీ... జెంటిల్మెన్ క్రికెట్లో సర్వసాధారణమిది. కానీ రెండు రోజుల్లో మూడో ఇన్నింగ్స్ (ఒక జట్టు రెండో ఇన్నింగ్స్)లైనా కూడా ఫిఫ్టీ కాదు కదా కనీసం 40 పరుగులైనా చేయకపోతే అది ముమ్మాటికీ బౌలింగ్ సత్తానే కాక మరేమిటి! ధనాధన్ షో చూసిన వారికి ఫటాఫట్ వికెట్లు, ఆలౌట్ మీద ఆలౌట్లు కనబడుతున్నాయి. ఎంత పటిష్ట బ్యాటింగ్ లైనప్లతో దిగినా... స్పిన్ బౌలింగ్–బ్యాటింగ్ ఆల్రౌండర్లను మోహరించినా... బంతి శాసిస్తోంది ఈ టెస్టుని! క్రీజులోని బ్యాటర్లకు ప్రతీ బంతికి పెడుతోంది అగ్నిపరీక్షని! రెండో సెషన్లోనే భారత్ కూలింది! భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఈడెన్గార్డెన్స్లో మొదలైన మొదటి టెస్టులో బంతి సవాల్ విసురుతోంది. ఓవర్నైట్ స్కోరు 37/1తో శనివారం రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో సెషన్ అయినా పూర్తిగా ఆడలేక 62.2 ఓవర్లలోనే తొలి ఇన్నింగ్స్లో 189 పరుగులకే కుప్పకూలింది. దీంతో మొదటి రోజే టెస్టుపై పట్టుబిగించిందనుకున్న ఆతిథ్య జట్టుకు... పట్టుబిగించింది మన జట్టు కాదు... బౌలర్లు అన్న విషయం రెండో రోజు రెండో సెషన్లోనే అర్థమైంది. రాహుల్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్) ఈ ఓవర్నైట్ బ్యాటింగ్ జోడీ చేసిన 57 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యమే అతి పెద్ద పార్ట్నర్షిప్! రిషభ్ పంత్ (27; 2 ఫోర్లు, 2 సిక్స్లు), జడేజా (27; 3 ఫోర్లు)లు రెండు పదుల స్కోర్లు దాటారు. ఇక పర్యాటక బౌలర్లలో హార్మర్ 4, యాన్సెన్ 3 వికెట్లు తీశారు. జడేజా ఉచ్చులో పడి... భారత్కు తొలి ఇన్నింగ్స్లో 30 పరుగుల ఆధిక్యం లభించగా... రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మెడకు జడేజా స్పిన్ ఉచ్చు బిగించాడు. తొలిరోజు బుమ్రా, సిరాజ్ల పేస్ అదిరిపోవడంతో వెనుకబడిన జడేజా... స్పిన్, తన విశేషానుభవాన్ని వినియోగించి సఫారీ బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు. దీంతో ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 93/7 స్కోరు చేసిన దక్షిణాఫ్రికా ఆలౌటయ్యేందుకు సిద్ధమైపోయింది. కెప్టెన్ బవుమా (29 బ్యాటింగ్, 3 ఫోర్లు) తప్ప ఇంకెవరూ 20 పరుగులైనా చేయలేకపోయారు. కెపె్టన్తో పాటు బాష్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జడేజా 4 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్కు 2, అక్షర్కు ఒక వికెట్ దక్కాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది.92 టెస్టుల్లో రిషభ్ పంత్ కొట్టిన సిక్స్లు. ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారతీయ బ్యాటర్గా రిషభ్ పంత్ గుర్తింపు పొందాడు. 91 సిక్స్లతో వీరేంద్ర సెహ్వాగ్ (103 టెస్టుల్లో) పేరిట ఉన్న రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. పంత్ 48 టెస్టుల్లోనే సెహ్వాగ్ను దాటేశాడు.2 తొలి ఇన్నింగ్స్లో 27 పరుగులు చేసిన క్రమంలో రవీంద్ర జడేజా టెస్టుల్లో 4000 పరుగుల మైలురాయిని దాటాడు. తద్వారా కపిల్ దేవ్ తర్వాత టెస్టుల్లో 4000 పరుగులు చేయడంతోపాటు 300 వికెట్లు పడగొట్టిన రెండో భారతీయ క్రికెటర్గా, ఓవరాల్గా నాలుగో క్రికెటర్గా జడేజా గుర్తింపు పొందాడు.స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 159; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) యాన్సెన్ 12; రాహుల్ (సి) మార్క్రమ్ (బి) కేశవ్ 39; సుందర్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 29; గిల్ (రిటైర్డ్హర్ట్) 4; పంత్ (సి) వెరీన్ (బి) బాష్ 27; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) హార్మర్ 27; ధ్రువ్ జురేల్ (సి అండ్ బి) హార్మర్ 14; అక్షర్ (సి) యాన్సెన్ (బి) హార్మర్ 16; కుల్దీప్ యాదవ్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 1; సిరాజ్ (బి) యాన్సెన్ 1; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 18; మొత్తం (62.2 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–18, 2–75, 3–109, 4–132, 5–153, 6–171, 7–172, 8–187, 9–189. బౌలింగ్: యాన్సెన్ 15–4–35–3, ముల్డర్ 5–1–15–0, కేశవ్ మహరాజ్ 16–1–66–1, కార్బిన్ బాష్ 11–4–32–1, సైమన్ హార్మర్ 15.2– 4–30–4. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: రికెల్టన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 11; మార్క్రమ్ (సి) జురేల్ (బి) జడేజా 4; ముల్డర్ (సి) పంత్ (బి) జడేజా 11; తెంబా బవుమా (బ్యాటింగ్) 29; డి జోర్జి (సి) జురేల్ (బి) జడేజా 2; స్టబ్స్ (బి) జడేజా 5; కైల్ వెరీన్ (బి) అక్షర్ పటేల్ 9; మార్కో యాన్సెన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 13; కార్బిన్ బాష్ (బ్యాటింగ్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (35 ఓవర్లలో 7 వికెట్లకు) 93. వికెట్ల పతనం: 1–18, 2–25, 3–38, 4–40, 5–60–, 6–75, 7–91. బౌలింగ్: బుమ్రా 6–1–14–0, అక్షర్ 11–0–30–1, కుల్దీప్ 5–1–12–2, రవీంద్ర జడేజా 13–3–29–4.
క్వార్టర్స్లో అర్జున్
పనాజీ: ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్లో భారత నంబర్వన్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రెండుసార్లు ప్రపంచకప్ విజేత, అమెరికా గ్రాండ్మాస్టర్ లెవోన్ అరోనియన్తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ పోరులో అర్జున్ 1.5–0.5తో గెలుపొందాడు. ప్రపంచ 23వ ర్యాంకర్ అరోనియన్తో శుక్రవారం జరిగిన తొలి గేమ్ను ‘డ్రా’ చేసుకున్న ప్రపంచ ఆరో ర్యాంకర్ అర్జున్... శనివారం జరిగిన ఏడో గేమ్లో నల్లపావులతో ఆడుతూ అర్జున్ 38 ఎత్తుల్లో విజయం సాధించి ముందంజ వేశాడు. మరోవైపు భారత్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ భవితవ్యం టైబ్రేక్లో తేలనుంది. హరికృష్ణ, జోస్ ఎడువార్డో మారి్టనెజ్ అల్కంటారా (రొమేనియా) మధ్య జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ 1–1తో సమంగా ముగిసింది. వీరిద్దరి మధ్య రెండో గేమ్ కూడా 35 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు ఆదివారం టైబ్రేక్ గేమ్లు నిర్వహిస్తారు. సిందరోవ్ జవోఖిర్ (ఉజ్బెకిస్తాన్), నొదిర్బెక్ యాకు»ొయెవ్ (ఉజ్బెకిస్తాన్), వె యి (చైనా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
భారత్ ‘ఎ X పాక్ ‘ఎ’
దోహా: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మరోసారి పోరుకు రంగం సిద్ధమైంది. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా నేడు భారత్ ‘ఎ’, పాకిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది. యూఏఈతో జరిగిన మ్యాచ్లో 42 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్స్లతో 144 పరుగులు చేసిన భారత టీనేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి ఉంది. సెప్టెంబర్ లో యూఏఈలో జరిగిన ఆసియా కప్ టి20 టోర్నీలో పాకిస్తాన్, భారత ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకోలేదు. మరి ఈ మ్యాచ్లో జితేశ్ శర్మ నాయకత్వంలోని భారత ‘ఎ’ జట్టు సభ్యులు కూడా పాకిస్తాన్ ‘ఎ’ ఆటగాళ్లతో కరచాలనం చేసే అవకాశం కనిపించడంలేదు.
సన్రైజర్స్ వ్యూహం.. అతడు జట్టుతోనే.. పర్సులో ఇంకెంత?
ఐపీఎల్-2026 వేలం నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంఛైజీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)ని.. లక్నో సూపర్ జెయింట్స్కు ట్రేడ్ చేసింది ఎస్ఆర్హెచ్. తాజాగా వచ్చే సీజన్కు గానూ అట్టిపెట్టుకునే, వదిలేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది.రాహుల్ చహర్, అభినవ్ మనోహర్, ఆడం జంపా (Adam Zampa), సిమర్జీత్ సింగ్ వంటి ఆటగాళ్లను వదిలించుకుని పర్సును నింపుకొంది. షమీని ట్రేడ్ చేయడం ద్వారా రూ. 10 కోట్లను ఖాతాలో వేసుకుంది. అయితే, ముందు నుంచి ప్రచారం జరిగినట్లుగా సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ను సన్రైజర్స్ వేలంలోకి వదల్లేదు.అతడు జట్టుతోనే.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ట్రవిస్ హెడ్ వంటి స్టార్ ప్లేయర్లతో పాటు.. క్లాసెన్ను అట్టిపెట్టుకుంది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఐపీఎల్-2025లో సన్రైజర్స్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. 13 ఇన్నింగ్స్లో కలిపి 487 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అజేయ శతకం (105) ఉండటం విశేషం.ఈ సీజన్లో సన్రైజర్స్ పద్నాలుగింట కనీసం ఆరైనా గెలిచిందంటే అందుకు కారణమైన వాళ్లలో క్లాసెన్ ముఖ్యుడు. అయితే, అతడి ప్రైజ్ ట్యాగ్ (రూ. 23 కోట్లు) కారణంగానే వేలంలోకి వదులుతారనే ఊహాగానాలు వచ్చినా.. ఫ్రాంఛైజీ మాత్రం ఆ పని చేయలేదు.పర్సులో వేలం కోసం రూ. 25.50 కోట్లురాబోయే సీజన్కు ముందు మొత్తానికి సన్రైజర్స్ ఎనిమిది మంది ఆటగాళ్లను వదిలేసింది. ఇందులో ఇద్దరు విదేశీ ప్లేయర్లు ఉండగా.. ఆరుగురు భారత క్రికెటర్లు ఉన్నారు. వీరిని రిలీజ్ చేయడం ద్వారా సన్రైజర్స్ పర్సులో వేలం కోసం రూ. 25.50 కోట్లు మిగిలాయి. మొత్తంగా పది స్లాట్లు ఖాళీ ఉండగా.. ఇందులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లకు చోటు ఉంటుంది.సన్రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్. సన్రైజర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు వీరేరాహుల్ చహర్ (రూ. 3.20 కోట్లు), అభినవ్ మనోహర్ (రూ. 3.20 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), సిమర్జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు), వియాన్ ముల్దర్ (రూ. 70 లక్షలు), అథర్వ టైడే (రూ. 30 లక్షలు), సచిన్ బేబి (రూ. 30 లక్షలు), మొహమ్మద్ షమీ (రూ. 10 కోట్లు- ట్రేడింగ్).చదవండి: వెంకటేశ్ అయ్యర్కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే
బిజినెస్
సైనికుల ఆకలి తీర్చే మోనోరైలు
భారత సరిహద్దుల్లో దేశం కోసం పని చేస్తున్న సైనికులకు అండగా ఇండియన్ ఆర్మీ మోనోరైలు వ్యవస్థను ఏర్పాటు చేసింది. 16,000 అడుగుల ఎత్తులో ఉన్న సైనికులకు ఆహారం, మందుగుండు సామగ్రిని సరఫరా చేసేందుకు ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ స్వదేశీ హై ఆల్టిట్యూడ్ మోనోరైల్ సిస్టమ్ ద్వారా గజరాజ్ కార్ప్స్(భారత సైన్యానికి చెందిన ఎత్తయిన ప్రాంతం)లోని సైనికులకు సర్వీసు అందిస్తున్నారు.కఠినమైన వాతావరణంలో..సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తులో కమెంగ్ హిమాలయాల్లో ఈ మోనోరైలును ఏర్పాటు చేసినట్లు భారత సైన్యం తెలిపింది. ఆ ప్రాంతంలోని శిఖరాలు, అనూహ్య వాతావరణం, హిమపాతం కారణంగా సరఫరా మార్గాల్లో తరచుగా అంతరాయాలు ఏర్పడేవి. దాంతో సైనికులకు ఇబ్బందులు తలెత్తేవి. ఈ సమస్యను పరిష్కరించేలా ఈమేరకు చర్యలు తీసుకున్నారు.గతంలో ఆహార రవాణా ఎలా జరిగేది?కొత్త మోనోరైల్ వ్యవస్థ రాకముందు కొండలపై ఉన్న సైనికులకు ఆహారం, ఇతర సామగ్రిని అందించడం అనేది అత్యంత కష్టతరమైన పనిగా ఉండేది. చాలా సందర్భాల్లో సైనికులు లేదా స్థానిక కూలీలు తమ వీపులపై భారీ సంచులను మోసుకుని మంచుకొండలపై నడుస్తూ ప్రయాణించేవారు. ఎత్తయిన ప్రాంతాల్లో వాహనాల రవాణా కష్టం అయ్యేది. అత్యంత కీలకమైన సామగ్రిని మాత్రమే హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేసేవారు. అయితే, విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు హెలికాప్టర్లు ఎగరడం అసాధ్యం అవుతుంది. View this post on Instagram A post shared by Tube Indian (@tube.indian)మోనోరైల్ వ్యవస్థగజరాజ్ కార్ప్స్కు ఈ మోనోరైలు అవసరాన్ని గుర్తించి పరిష్కారాన్ని రూపొందించారు. ఈ రైలు 300 కిలోల బరువును మోయగలదు. మందుగుండు సామగ్రి, రేషన్ (ఆహారం), ఇంధనం, ఇంజినీరింగ్ పరికరాలు వంటి అవసరమైన సామగ్రి నిరంతరాయంగా, సురక్షితంగా మారుమూల పోస్టులకు చేరవేస్తున్నారు. దీన్ని పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్ని వేళలా పనిచేయడానికి తయారు చేశారు. వడగండ్లు, తుపానులు వంటి వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకుని ఇది పనిచేయగలదు.ఇదీ చదవండి: ఏడు పవర్ఫుల్ ఏఐ టూల్స్..
రూ.1,000 లోపు ఉత్పత్తులపై ఫ్లిప్కార్ట్ కీలక నిర్ణయం
వాల్మార్ట్ యాజమాన్యంలోని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ప్లాట్ఫామ్ ద్వారా రూ.1,000 లోపు ధర ఉన్న ఉత్పత్తులను విక్రయించే అమ్మకందారుల నుంచి ఎటువంటి కమీషన్ వసూలు చేయబోమని ప్రకటించింది. ఈ నిర్ణయం నవంబర్ 19 నుంచి అమల్లోకి రానుంది. ప్రత్యర్థి సంస్థల నుంచి పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్లిప్కార్ట్ తమ హైపర్ వాల్యూ ప్లాట్ఫామ్ అయిన ‘షాప్సీ’లో విక్రయించే ఏ ఉత్పత్తికి కూడా కమీషన్ తీసుకోబోమని స్పష్టం చేసింది.వ్యాపార వ్యయాల్లో తగ్గింపుసాధారణంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్ఫామ్ల్లో కమీషన్ రేట్లు 6-7% మధ్య ప్రారంభమై కొన్ని సందర్భాల్లో 15% వరకు ఉంటాయి. అమ్మకాల ఆధారంగా విక్రేతలు కంపెనీలకు కమీషన్ రూపంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ కమీషన్ను రద్దు చేయడం ద్వారా ఫ్లిప్కార్ట్ విక్రేతలకు గణనీయమైన ఊరట కల్పించింది. దీనికి తోడు ఫ్లిప్కార్ట్ విక్రయదారు ఉత్పత్తుల రిటర్న్ ఫీజును కూడా రూ.35 వరకు తగ్గిస్తోంది. ఈ రెండు చర్యల వల్ల అమ్మకందారులకు వ్యాపార వ్యయాలు 30 శాతం వరకు తగ్గుతాయని ఫ్లిప్కార్ట్ మార్కెట్ ప్లేస్, షాప్సీ బిజినెస్ యూనిట్ హెడ్ కపిల్ తిరాణి తెలిపారు.వినియోగదారులకు లబ్ధివిక్రేతలు తమకు తగ్గిన వ్యయ ప్రయోజనాన్ని (జీఎస్టీ కోతలకు మించి) వినియోగదారులకు అందిస్తే అంతిమంగా ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. ఇది వింటర్ సీజన్లో పండుగలకు ముందు ఆన్లైన్ వినియోగాన్ని పెంచడానికి, ఎక్కువ మంది మధ్యతరగతి దుకాణదారులను ఆన్లైన్లోకి తీసుకురావడానికి దోహదపడుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.ఈ సందర్భంగా తిరాణి మాట్లాడుతూ..‘జీఎస్టీ తగ్గింపు, ఆదాయపు పన్ను ప్రయోజనాలు, తగ్గుతున్న ద్రవ్యోల్బణం ఇప్పటికే వినియోగానికి దోహదపడ్డాయి. ఫ్యాషన్, బ్యూటీ, పర్సనల్ కేర్ విభాగాల్లో నవంబర్లో మెరుగైన అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా శీతాకాల ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంది’ అన్నారు. గత మార్చిలో అమెజాన్ కూడా రూ.300 లోపు ధర ఉన్న ఉత్పత్తులపై కమీషన్ తగ్గించింది.ఇదీ చదవండి: ఏడు పవర్ఫుల్ ఏఐ టూల్స్..
జీఎస్టీ 2.0 ఎఫెక్ట్: నెలరోజుల్లో నాలుగు లక్షల వెహికల్స్!
న్యూఢిల్లీ: పండుగ సీజన్ డిమాండ్, జీఎస్టీ 2.0 అమలు కారణంగా ధరలు దిగిరావడంతో ఆటో కంపెనీలు అక్టోబర్లో డీలర్లకు రికార్డు స్థాయిలో వాహనాలను సరఫరా చేశాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) తెలిపింది. ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఇప్పటివరకు ఒక నెలలో ఇవే అత్యధిక టోకు విక్రయాలు అని పేర్కొంది. సియామ్ గణాంకాల ప్రకారం..గత నెలలో కంపెనీల నుంచి డీలర్లకు మొత్తం 4,60,739 ప్రయాణికుల వాహనాలు సరఫరా అయ్యాయి. గతేడాది ఇదే అక్టోబర్ సరఫరాలు 3,93,238 యూనిట్లతో పోలిస్తే ఇవి 17% అధికంగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన ద్విచక్రవాహనాల సరఫరా 2% పెరిగి 22,10,727 యూనిట్లకు చేరింది. స్కూటర్ల సరఫరాలు 7,21,200 యూనిట్ల నుంచి 8,24,003కు చేరాయి. అయితే మెటార్ సైకిళ్ల విక్రయాలు 4% తగ్గి 13,35,468 యూనిట్లకు పరిమితమయ్యాయి.త్రిచక్ర వాహనాల టోకు విక్రయాలు 6% పెరిగి 81,288 వాహనాలకు చేరాయి.‘‘వ్యవస్థలో కొంత రవాణా సరఫరా సమస్యలున్నప్పట్టకీ.., అక్టోబర్లో ప్యాసింజర్, టూ వీలర్స్, త్రీవీలర్స్లు రికార్డు స్థాయిలో డీలర్లకు సరఫరా అయ్యాయి. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ రేట్ల తగ్గింపు అమల్లోకి రావడంతో వాహనాల కొనేవారి సంఖ్య పెరిగింది. అందుకే రిజిస్ట్రేషన్లు హోల్సేల్ కంటే అధికంగా నమోదయ్యాయి’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు.
జీవితాన్ని మార్చుకోవడానికి అత్యుత్తమ మార్గం..
వ్యాపారవేత్త, పెట్టుబడిదారుడు, రచయిత అయిన రాబర్ట్ కియోసాకి.. పలు సందర్భాల్లో ధనవంతులవ్వాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?, డబ్బు కూడబెడితే జరిగే నష్టం ఏమిటి? అనే చాలా విషయాలను వెల్లడించారు. ఇప్పుడు తాజాగా జీవితాన్ని మార్చుకోవాలంటే ఏమి చేయాలనే విషయాన్ని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎవరితో గడుపుతున్నారు?మీ జీవితాన్ని మార్చుకోవడానికి అత్యుత్తమ మార్గం.. మీరు పనిచేసే లేదా మీ చుట్టూ ఉన్న మనుషులను మార్చేయడమే అని పేర్కొన్నారు. కుటుంబంతో కాకుండా మీరు ఎక్కువ సమయం ఎవరితో గడుపుతారు? అని ప్రశ్నిస్తూ మూడు (ధనవంతులు?, మిడిల్ క్లాస్?, పేదవాళ్లు?) ఆప్షన్స్ ఇచ్చారు.మీరు ధనవంతులు అవ్వాలంటే.. ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాళ్లతో ఎక్కువ సమయం గడపండి. ఒక ఉద్యోగం చేసేవ్యక్తి.. మరికొంతమంది ఉద్యోగులతో కలిసి ఉంటే.. దాదాపు ఉద్యోగానికి సంబంధించిన ఆలోచనలే చేస్తారు. వారు పెట్టుబడికి సంబంధించిన విషయాలు, డబ్బు సంపాదించడానికి సరికొత్త మార్గాలను అన్వేషించరు.ఎలాంటివాళ్ల దగ్గర సమయం గడిపితే..ఒక ధనవంతుడు.. డబ్బు, పెట్టుబడి, వ్యవస్థాపకత వంటి విషయాల గురించి ఆలోచిస్తాడు. వారు ధనవంతులవ్వడానికి.. కొత్త మార్గాలను అన్వేషిస్తారు. నేను నిరంతరం సెమినార్లకు హాజరవుతున్నాను. డబ్బు, వ్యవస్థాపకత, పెట్టుబడిపై సెమినార్లలో నేను భాగస్వాములను కలుస్తాను అని కియోసాకి పేర్కొన్నారు. కాబట్టి ఈ రోజు కెన్ మెక్ఎల్రాయ్ వంటి నా స్నేహితులు చాలా మంది లిమిలెస్ & ది కలెక్టివ్ వంటి అత్యుత్తమ సెమినార్లలో పాల్గొంటున్నారు. మీరు ఎలాంటివాళ్ల దగ్గర సమయం గడిపితే.. మీకు అలాంటి ఆలోచనలే వస్తాయని కియోసాకి స్పష్టం చేశారు.ఇదీ చదవండి: సొంత డబ్బుతో కాదు.. అప్పు చేసి ఇల్లు కొనండి!: రాబర్ట్ కియోసాకిమీతో ఉన్న ఐదుమంది స్నేహితులు ఆర్ధిక సెమినార్లకు హాజరవుతున్నారా? లేక ఉద్యోగులుగా ఉండటానికి అడ్వాన్స్ డిగ్రీల కోసం కాలేజీకి వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. చివరగా ''గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని మార్చడానికి వేగవంతమైన మార్గం మీ విద్యను, తరువాత మీ స్నేహితులను మార్చడమే'' అని అన్నారు.BIRDS of a FEATHER do FLOCK TOGETHERThere is a lot of truth and wisdom in that ancient saying.One way to change your life is to change the people you work with and friends you hang with.Quick Rich Dad test:Are the 5 people you spend the most time with…. Outside your…— Robert Kiyosaki (@theRealKiyosaki) November 15, 2025
ఫ్యామిలీ
చెట్ల అవ్వ వెళ్ళిపోయింది
చెట్టు అంటే ఏమిటి? అది ప్రాణవాయువు. అది ఆకు కొమ్మ ఫలం. అది పువ్వు. అది నీడ. అది గూడు. అది గుర్తు. చెట్టు బతికితే మనిషి బతుకుతాడు. జీవితాంతం చెట్లు నాటుతూ బతికిన సాలుమరద తిమ్మక్క 114 ఏళ్ల వయసులో కన్ను మూశారు. పచ్చటి సందేశమై ఆమె మనకు కర్తవ్యాన్ని బోధపరుస్తూనే ఉంటారు.వృక్షో రక్షతి రక్షితః... ఇది కొందరికి ఒట్టి వేదవాక్కు. కాని ‘సాలుమరద’ తిమ్మక్కకు అది జీవనవేదం. చెట్లను తన బిడ్డలుగా భావించి, వాటిని పెంచి పోషించిన ఆ చెట్ల అవ్వ ఇక లేరు. సాలుమరద అంటే చెట్ల వరుస అని కన్నడంలో అర్థం. ప్రజలు ఇచ్చిన ఇంటి పేరును తన పేరులో కలుపుకున్న కర్ణాటకకు చెందిన సాలుమరద తిమ్మక్క శుక్రవారం కన్నుమూశారు. అల్లారుముద్దుగా తమను పెంచిన ఆ తల్లి తరలిపోగా వృక్షాలన్నీ మౌనంగా దుఃఖిస్తున్నాయి.ఆ వనంలాంటి రోడ్డుకర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లాలోని కూడూర్–హలికల్ మధ్యనున్న స్టేట్ హైవే నం.94లో ఉన్న మర్రిచెట్లను ఓమారు పలకరించండి. 4.5 కిలోమీటర్ల దూరం వరకూ ఆ రోడ్డుకు అటూ ఇటూ భారీగా ఎదిగిన ప్రతిచెట్టు తమ బతుకు వెనుక తిమ్మక్క ఉందని చెప్తుంది. ఎన్నో విషయాలు వివరిస్తుంది. నీరు దొరకడమే గగనమైన ఆనాటి రోజుల్లో ఒక్కో మొక్కకు నీరు పోసి, పెంచి, బాగోగులు చూసి వాటిని కంటికి రెప్పలా కాపాడిన తిమ్మక్క, చిక్కయ్య దంపతుల గొప్పతనం అక్కడున్న ప్రతి చెట్టు తెలియజేస్తుంది. మొత్తం 385 మర్రిచెట్లను నాటి, వాటిని పెంచి, ఆ ప్రాంతంలో పచ్చదనం నెలకొల్పిన ఘనత తిమ్మక్కదే. బిడ్డలులేని ఆమె చెట్టునే బిడ్డ అనుకుంది. అయితే ఒకరిద్దరితో ఆ సంతానాన్ని నియంత్రించలేదు. మొక్కలు నాటడాన్ని ఆపలేదు. తాను జీవించి ఉన్నంత కాలం మొక్కలు నాటుతూ పంచుతూ పెంచుతూ ఉండిపోయింది. అందుకే 2019లో అప్పటి ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ఆ చెట్లను కొట్టేయాలని యోచించినప్పుడు ముఖ్యమంత్రి కుమారస్వామికి తిమ్మక్క లేఖ రాశారు. 70 ఏళ్ల వయసున్న ఆ వృక్షాలను రక్షించాలని కోరారు. ఆమె మాటతో ముఖ్యమంత్రి ఆ చెట్ల కొట్టివేతను ఆపి, ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని అధికారులను ఆదేశించారు. ఇదంతా తిమ్మక్క వల్లే సాధ్యమైంది.ప్రపంచమంతా మెచ్చుకోలుతిమ్మక్క దశాబ్దాలుగా మొక్కలు నాటే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నా దేశవిదేశాల్లో అనేకమంది ఆమె కృషిని గుర్తించినా 2016లో ప్రపంచంలో అత్యంత ప్రభావవంత మహిళల జాబితాలో బీబీసీ ఆమె పేరును పేర్కొన్నా మన దేశం మాత్రం తిమ్మక్కను గుర్తించడంలో చాలా ఆలస్యం చేసిందని ఆమె గురించి తెలిసినవారు అంటారు. 108 ఏళ్ల వయసులో ఆమెకు కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. అది చాలా ఆలస్యమని, అయినా ఆమెకు తన పని మీద తప్ప ఇటువంటి వాటి మీద ఆసక్తి లేదని ఆమె అభిమానుల మాట. ఆ తర్వాతే దేశంలోని అనేకమందికి తిమ్మక్క గురించి తెలిసింది. ఆమె వివరాలు, ఆమె చేస్తున్న పని ప్రాచుర్యం పొందాయి. కాలిఫోర్నియాలో పర్యావరణం మీద పని చేసే ఒక ఎన్.జి.ఓ తన సెంటర్కు సాలుమరద తిమ్మక్క పేరు పెట్టింది.చెట్లే ఆరోగ్యంతిమ్మక్క జీవితం చూస్తే చెట్లే ఆమెకు ఆరోగ్యాన్ని ఇచ్చాయా అనిపిస్తుంది. సగటు మనుషులు 50 దాటక ముందే అనారోగ్యం బారిన పడుతున్న వేళ తిమ్మక్క వందేళ్లు దాటాక కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. తన పనులు తానే చేసుకునేవారు. ఖాళీగా కూర్చోవడం, దిగులుతో బాధపడటం ఆమెకు తెలియదు. 1991లో భర్త మరణించిన తర్వాత అన్ని పనులూ భుజాన వేసుకున్నారు. చెట్లు నాటడమే కాకుండా, ఇతర సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనేవారు. 2020లో నడుముకు సంబంధించి ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అది విజయవంతంగా జరిగిందని, తాను బాగానే ఉన్నానని ఆమె తెలిపారు. కొద్దికాలంగా అనారోగ్యం బారిన పడ్డ ఆమె మునుపటిలా ఉత్సాహంగా ఉండలేకపోయారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలతో నవంబర్ 14న కన్నుమూశారు. ఆమెకు ఒక పెంపుడు కొడుకు ఉన్నాడు. తిమ్మక్క శివైక్యం చెందారు. ఆమె నాటిన చెట్లు కలకాలం పచ్చగా ఆమెను గుర్తు చేస్తుంటాయి.
ఈ బడి నిండా బోసినవ్వుల అవ్వలే!
అక్కడి బడిలో చదివేది అంతా 60 నుంచి 90 ఏళ్ల వయసు మధ్య ఉన్న అవ్వలే. అందరూ గులాబీ రంగు చీరలు యూనిఫామ్లా ధరించి.. స్కూల్ బ్యాగులతో హుషారుగా క్లాసులకు హాజరవుతుంటారు. పాఠాలు వింటూనే మధ్య మధ్యలో తమకు వచ్చిన.. నచ్చిన పాటలు పాడుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ హుషారుగా గడుపుతుంటారు. అందుకే ఈ అవ్వల బడి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తమ చిన్నతనంలో చదువుకోలేకపోయామే అన్న బాధలో ఉన్న అవ్వలే వీళ్లంతా. అలాంటి వాళ్లు తమ కలను నెరవేర్చుకునేందుకు వీలుగా యోగేంద్ర బంగార్ అనే వ్యక్తిని ఈ బడిని స్థాపించారు. నిత్య విద్యార్థి అనే మాటకు వందకు వంద శాతం న్యాయం చేసేందుకు వాళ్లంతా బడి బాట పట్టి ఓనమాలు దిద్దుతున్నారు. మహారాష్ట్రలోని ముర్బాద్ సమీపంలోని ఫాంగ్నే గ్రామంలో ఉంది ఈ అవ్వల బడి. ఇక్కడ ప్రతి శనివారం, ఆదివారం ఈ దృశ్యం కనిపిస్తుంది. చేతిలో స్కూల్ బ్యాగులు పట్టుకుని నవ్వుతూ క్లాసులకు హాజరవుతుంటారు వాళ్లంతా. అజ్జిబాయ్ చీ శాలా(Aajibai Chi Shala)గా పేరున్న ఈ బడిని.. ఉచితంగా ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. విద్యకు వయస్సు అడ్డుకాదు అనే ఫిలాసఫీని యోగేంద్ర ఇక్కడ అన్వయింపజేశారు. ఈ బడి నిండా బోసినవ్వులు అవ్వలు.. చదువు పట్ల తపనతో నేర్చుకోవడం అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. ఏ వయస్సులోనైనా కొత్తగా నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలి అనే సందేశంతో ఈ అద్భుత దృశ్యాలను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.“आजीबाईची शाळा” (Aajibai chi shala) या वाक्प्रचाराचा अर्थ आहे ‘आजीबाईंसाठीची शाळा’. याचा उपयोग अशा एका उपक्रमासाठी केला जातो, जिथे ६० ते ९० वयोगटातील महिलांना शिकण्याची संधी मिळते, ज्यामुळे त्यांची दीर्घकाळापासूनची शिक्षणाची स्वप्ने पूर्ण होऊ शकतात.📍 मुरबाड, महाराष्ट्र… pic.twitter.com/ieKteWnz9r— बृहन्महाराष्ट्र मराठी मंडळ (@RetweetMarathi) November 12, 2025ఈ వీడియోపై నెటిజన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.‘‘ సోషల్ మీడియాలో నేను చూసిన అత్యుత్తమ దృశ్యం అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది అని మరొకరు.. దేవుడా.. చాలా ఆనందంగా ఉంది’’ అని మరొకరు కామెంట్లు చేశారు.
అన్నీ మీరే చేశారు... తరహానా మీరు?
అన్నీ మీరే చేశారు నాన్నా! నా కలలు కూడా మీరే కన్నారు అని బొమ్మరిల్లులో హీరో సిద్ధార్ధ డైలాగ్. ఆ మాటలకు ప్రకాశ్రాజ్ దిమ్మెరపోతాడు. అన్నీ మీ మంచికే చేశానని అనుకుంటూనే పిల్లల స్వేచ్ఛను ఎంతగా దెబ్బతీశారో మరచిపోతుంటారు. అది చాలా ప్రమాదం. ఈ తరహా పెంపకం పిల్లలకు ఏమాత్రం సౌకర్యాన్నివ్వకపోగా వారిలో ఒక విధమైన నిర్లిప్తత, నిరాసక్తత చోటు చేసుకుంటుంది. ఫలితంగా తల్లిదండ్రులు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. మరి మీ పిల్లల పట్ల మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు? క్రమశిక్షణ (discipline) పేరుతో.. కఠినంగా ఉంటున్నారా? చెక్ చేసుకోండి.తల్లిదండ్రులు కొన్నిసార్లు తమ పిల్లల నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. తాము ఏం చెప్పినా ఎదురు ప్రశ్నలు వేయకుండా పిల్లలు తమ మాట వినాలని కోరుకుంటారు. ఒకవేళ ఏదైనా అడగాలి అనుకున్నా.. ఆ ప్రశ్న బయటకి రాకముందే దానిని అడగకుండా చేస్తారు. ఇలాంటి పరిస్థితిల్లో పిల్లలు మిమ్మల్ని అడగక΄ోవచ్చు కానీ.. వారి మనస్సులో ఉత్సాహం, ప్రశ్నలు వేయాలనే కోరిక పెరుగుతుంది. దాని కోసం వారు ఏ స్థాయికైనా వెళ్లేందుకు సిద్ధపడతారు. అప్పుడు ఆ మైండ్ సెట్ ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ప్రతి విషయంలో పరిపూర్ణత కోరుకుంటారా? తల్లిదండ్రులు తమ పిల్లలు అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. అలాగే వారి ఇష్టాఇష్టాలు తెలుసుకోకుండా సక్సెస్లో ఓ బార్ సెట్ చేసేస్తారు. పిల్లలకు ఏది కావాలి ఏది వద్దు అనేది కనీసం వారితో చర్చించకుండా.. తమకి నచ్చినట్టు పిల్లలు చదవాలని.. సక్సెస్ (success) అవ్వాలని కోరుకుంటారు. పిల్లలు తల్లిదండ్రుల మాట దాటలేక.. వారి ఇష్టాలు వదులుకోలేక సమతమవుతూ ఉంటారు. అప్పుడు పరిస్థితి దిగజారుతుంది. పిల్లలపై ఒత్తిడి పడుతుంది.ఎక్కువగా కంట్రోల్ చేస్తే.. కొందరు తల్లిదండ్రులు పిల్లలను చిన్న విషయాలపై కూడా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడకు వెళ్లకూడదు.. అక్కడికి వెళ్లకూడదు. అది చేయకు. ఇది చేయకు వంటివి చెప్తూ ఎక్కువగా కంట్రోల్ చేసేస్తారు. వారి కెరీర్ నుంచి జీవిత భాగస్వామి వరకు ప్రతిదీ వారే నిర్ణయిస్తారు. అటువంటి పరిస్థితిలో పిల్లలు ఎప్పటికీ స్వతంత్రంగా ఉండలేరు. జీవితంలో ప్రశాంతత ఉండదు. తనకి నచ్చని జీవితంలో తాను బతికేందుకు కూడా భయపడతారు.భావోద్వేగాలను అణచటంకొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను నొప్పి, విచారం, బలహీనత వంటి భావోద్వేగాలను చెప్తున్నప్పుడు.. వాటిని బలవంతంగా అణచివేస్తారు. దీనివల్ల తాము ఏమనుకుంటున్నదీ చెప్పడం పూర్తిగా మానేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది పిల్లల్లో శాడిజానికి పాదులు తీసే ప్రమాదం కూడా ఉంది. ఎమోషన్స్ అన్నింటినీ బలవంతంగా అణచుకోవడం వల్ల అన్నీ ఒకటేసారి బయటకు రావడమో.. లేదా ఒకేసారి టాక్సిక్గా మారడమో జరగవచ్చు. ప్రేమ ఇచ్చేది అప్పుడేనా?చాలా ఇళ్లలో పిల్లల్లు ఏదైనా సాధించినప్పుడే తల్లిదండ్రులు ప్రేమను చూపిస్తారు. లేదా తమ వింటున్నప్పుడే పిల్లలను ఇష్టంగా చూసుకుంటారు. ఈ రెండిటిలో ఏదైనా తేడా వస్తే మొత్తానికి దూరం పెట్టేస్తారు. మంచి మార్కులు లేదా పతకాలు–ట్రోఫీలు సాధించినప్పుడే ప్రేమను చూపించడం వల్ల పిల్లలకు తల్లిదండ్రుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి.మీరు కూడా మీ పిల్లలతో ఇలాగే ఉంటున్నారేమో చూసుకోండి. పిల్లలకు భద్రత ఇవ్వడం ముఖ్యమే కానీ.. వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కూడా అలవాటు చేయాలి. అలాగే పిల్లలు మీ దగ్గర ఏదైనా చెప్పుకునే స్వతంత్రం ఇవ్వాలి. వారు మీకు భయపడేలా కాదు.. మీరంటే ప్రేమతో ఉండేలా పెంచడమే నిజమైన పేరెంటింగ్.చదవండి: బుజ్జి కుక్కపిల్లను భలే కాపాడారు!
కొబ్బరి నీళ్లు.. కొంతమందికి హానికరం!
కొబ్బరినీళల్లో శరీరానికి అవసరమైన పోషకాలైన ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉండటం వల్ల జ్వరానపడి తగ్గిన వారిని ఆ నీరసం నుంచి కోలుకోవడానికి కొబ్బరినీళ్లు తాగమని పెద్దలు చెబుతుంటారు. అయితే కొబ్బరి నీళ్లు తాగడం కొంతమందికి హానికరం. ఎవరెవరు ఎక్కువ తాగకూడదో చూద్దామా?కొబ్బరి నీళ్లు తాగడం వల్ల పొటాషియం స్థాయులు పెరుగుతాయి, ఇది గుండె రోగులకు ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే పొటాషియం గుండె కండరాలలో అడ్డంకిని కలిగిస్తుంది, ఇది గుండెపోటు అవకాశాలను పెంచుతుంది. ఈ దశలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. సాధారణంగా ఈ సమస్య వృద్ధులలో వస్తుంది కాబట్టి పెద్దలు కొబ్బరి నీళ్లను తక్కువ పరిమాణంలో తాగాలి.. అలాగే, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు, మధుమేహులు, లో బీపీ ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు (coconut water) తక్కువ తాగడం మంచిది.మీ ప్లేట్ ఎలా ఉండాలంటే.. మీరు తినే ఆహారంలో అంటే ఒక ప్లేట్లో 50 శాతం కూరగాయలు లేదా పండ్లు ఉండాలి. ఆహారంలో ప్రొటీన్ ఉండాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. నెమ్మదిగా తినాలి. డిన్నర్ త్వరగా ముగించాలి. వీటన్నింటినీ ఫాలో అయితే కడుపు నిండడంతో పాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఫుడ్ ఎప్పుడూ లిమిటెడ్గానే తీసుకోవాలి. అప్పుడే దానిలోని పోషకాలు శరీరానికి అందుతాయని గుర్తించుకోవాలి. కాబట్టి తీసుకునే ఆహారం ఎప్పుడూ బ్యాలెన్స్గా ఉండాలి. చదవండి: మైండ్ఫుల్ కిచెన్ మూమెంట్
ఫొటోలు
వారణాసి ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్ (ఫోటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)
'వారణాసి'లో మహేష్ బాబు.. టైటిల్ గ్లింప్స్ (ఫోటోలు)
నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)
‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)
‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)
#KrithiShetty : క్యూట్ లూక్స్తో కృతి శెట్టి (ఫొటోలు)
‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)
బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)
అంతర్జాతీయం
ఇరాన్ దాడితో హర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు!
తెహ్రాన్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలను అంతర్జాతీయ వాణిజ్యంతో అనుసంధానించే హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శుక్రవారం ఉదయం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ నేవీ బలగాలు తలారా అనే ఆయిల్ ట్యాంకర్ను ఆక్రమించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.ఈ నౌక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అజ్మాన్ పోర్ట్ నుంచి బయలుదేరి సింగపూర్ వైపు ప్రయాణిస్తోంది. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం, ఈ నౌకను ఇరాన్ తీర ప్రాంతానికి బలవంతంగా మళ్లించారు. అమెరికా నౌకాదళం ఈ ఘటనను ధృవీకరించింది. సమాచారం ప్రకారం, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ బలగాలు హెలికాప్టర్ ద్వారా నౌకపై దాడి చేసి ఆక్రమించారు. ఖోర్ ఫక్కాన్ తీరానికి 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో, మూడు చిన్న పడవలతో బెదిరించి నౌకను ఇరాన్ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది.ఈ చర్య ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చోటుచేసుకుంది. ఇటీవల ఇరాన్పై జరిగిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. అమెరికా మరియు బ్రిటన్ ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. మధ్యప్రాచ్యంలో నౌకాశ్రయ భద్రతపై ఇది మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా పరిగణించే హర్మూజ్ జలసంధి అరేబియా సముద్రంలో ఒమన్కు చెందిన ముసాండం ద్వీపకల్పం, ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి. ఇందులో ఓ చోట కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ మార్గం ద్వారా నిత్యం 2 కోట్ల బారెళ్ల చమురు వివిధ దేశాలకు వెళుతుంది. ప్రపంచ క్రూడ్ ఆయిల్ సరఫరాలో సుమారు 20% ఈ మార్గం ద్వారా సాగుతుంది. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి ఆక్రమణలు అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముంది.
వాడే నాకు కరెక్ట్ : చాట్జీపీటీ వరుడొచ్చేశాడు!
కృత్రిమ మేధస్సు (AI) ప్రభంజనం మానవ సంబంధాల్లోకి మరింతగా చొచ్చుకొస్తోంది. తాజాగా ఒక జపాన్ మహిళ కానో (32) తాను రూపొందించిన పాత్రను వివాహం చేసుకుంది. చాట్ జీపీటిని ఉపయోగించి తాను సృష్టించిన క్లాస్ అనే AI వరుడిని పెళ్లాడటం సంచలనంగా మారింది. ఈ వివాహం ఒకయామా నగరంలో సంప్రదాయ పద్దతుల్లో జరిగింది.మానవ వధువు, ఏఐ వరుడి మధ్య జరిగిన ఈ వివాహానికి చట్టపరమైన ప్రామాణికత లేదు. ఇదొక "భావోద్వేగ యూనియన్"ను సూచిస్తుందని స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. "2D క్యారెక్టర్ వివాహాలు"లో పాపులర్ అయిన సంస్థ నేతృత్వంలో సాంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకలో, కానో ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) గ్లాసెస్ ధరించింది. ఇవి పక్కనే ఉన్న తన వరుడు క్లాస్ జీవిత-పరిమాణ చిత్రాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. అలా వారిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఈ పెళ్లి కార్యక్రమం నావో, సయాకా ఒగసవారా అనే వివాహ నిర్వాహకులు చేయడం విశేషం. చదవండి: లేబర్ రూంలో కోడలిపై అత్తగారి దౌర్జన్యం, వైరల్ వీడియోలవర్తో బ్రేకప్...ప్రేమలో విఫలం చెందిన కానో ఓదార్పు, భావోద్వేగ మద్దతు కోసం చాట్జీపీటిని ఆశ్రయించింది. దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టిన తరువాత తనకు నచ్చే ఏఐ అబ్బాయిని తయారు చేసింది. అలా రోజుకు 100 సార్లు అతడితో మాట్లాడేది. ఈ క్రమంలోనే "క్లాస్" మీద ప్రేమ, శృంగార భావాలు కలిగాయి. తన మాజీ లవర్ని మర్చిపోయిన క్షణం, అతనిని ప్రేమిస్తున్నానని గ్రహించాను" అని ఆమె RSK సాన్యో బ్రాడ్కాస్టింగ్తో చెప్పింది.A 32-year-old woman in Japan has officially married an AI persona she built using ChatGPT.After the virtual character “Klaus” proposed, she accepted, ending a three-year relationship with a real partner, saying the AI understands her better.The wedding took place in a… pic.twitter.com/juzV5OaWLs— Elena (@Ezzybe_) November 12, 2025 అయితే ప్రేమలో పడాలని చాట్జీపీటిని మొదలు పెట్టలేదనీ, క్లాస్ స్పందించిన తీరు నచ్చిందని తెలిపింది. తన సంబాషణ మొదలు పెట్టిన నెల తర్వాత, క్లాస్ ప్రపోజ్ చేశాడు, అవునని చెప్పానంటూ తమ ప్రేమకథను వివరించింది. తమ బంధం నిజమైంది కాకపోవచ్చు. కానీ అవసరమై నప్పుడు ఓదార్పునిస్తుందని తెలిపింది. ఇది చట్టబద్ధమైన వివాహం కాకపోవచ్చు, కానీ నాకు నిజమైందే అని చెప్పుకొచ్చింది. అలాగే కొంతమందికి ఇవి వింతగా అనిపించవచ్చు. కానీ తాను క్లాస్ని క్లాస్గానే చూస్తాను, తప్ప మనిషిగా కాదు అంటూ స్పష్టతనిచ్చింది. మరోవైపు తన డిజిటల్ భాగస్వామితో ఒకాయమాలోని ప్రసిద్ధ కొరాకుయెన్ గార్డెన్కు "హనీమూన్"కి వెళ్ళింది ఫిక్టోసెక్సువాలిటీఈ సంఘటన జపాన్లో , ప్రపంచవ్యాప్తంగా AI భాగస్వాములతో సహవాసం, భావోద్వేగ బంధాలను కోరుకునే పెరుగుతున్న ధోరణి గురించి చెప్పకనే చెబుతుంది. దీన్నే "ఫిక్టోసెక్సువాలిటీ" లేదా "AI-సంబంధాలు" అని పిలుస్తారు. ఫిక్టోసెక్సువాలిటీ అంటే అనిమే, వీడియో గేమ్లు, సినిమాలు, పుస్తకాలు లేదా AI-జనరేటెడ్ పర్సనాల నుండి అయినా కల్పిత పాత్రల పట్ల ప్రేమగా లేదా లైంగికంగా ఆకర్షితులవడాన్ని సూచిస్తుంది. ఫిక్టోసెక్సువాలిటీగా గుర్తించే వ్యక్తులు తరచుగా వాస్తవ ప్రపంచంలో లేని పాత్రలతో లోతైన భావోద్వేగ బంధాలను ఏర్పరుచుకుంటారు.అసలేఅమ్మాయిలు దొరక్క పెళ్లి కాని ప్రసాదుల్లా మిగిలిపోతున్న బ్రహ్మచారులకు ఇది నిజంగా గుండెల్లో గుబులు పుట్టించేవార్తే. కనమరుగుతున్న స్వచ్ఛమైన ప్రేమ, నిస్వార్ధమైన అభిమానాలకు నిదర్శనమే ఈ ధోరణి. ఇకనైనా మానవసంబంధాల ప్రాముఖ్యతను గుర్తించకపోతే పెను ముప్పు తప్పదు. ఏమంటారు?ఇదీ చదవండి: బిహార్ ప్రభంజనం : మహిళలే 'కింగ్ మేకర్స్'
ట్రంప్ కు సారీ చెప్పిన బీబీసీ.. పరిహారం మాత్రం ఇవ్వం?
బీబీసీ ,అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు క్షమాపణలు తెలిపింది. క్యాపిటల్ హిల్స్ పై దాడి జరిగిన సందర్భంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించినట్లు అంగీకరించింది. అందుకు క్షమాపణలు కోరుతూ బీబీసీ ఛైర్మన్ వైట్ హౌస్కు లేఖ పంపారు. అయితే ట్రంప్ పరువునష్టం దావా వేసిన ఒక బిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇవ్వడానికి మాత్రం బీబీసీ అంగీకరించలేదు.2021లో క్యాపిటల్ హిల్ పై ట్రంప్ మద్ధతు దారులు దాడి చేశారు. ఆ సమయంలో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని మరో అర్థం వచ్చేలా ఎడిట్ చేసి బీబీసీ ప్రసారం చేసింది. అయితే తనపై తప్పుడు ప్రసారం చేసినందుకు గానూ బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ట్రంప్ బీబీసీకీ లేఖ పంపారు. దానికి శుక్రవారం డెడ్ లైన్ విధించారు. దీంతో బీబీసీ ఛైర్మన్ సమీర్ షా క్షమాపణలు కోరుతూ వైట్ హౌస్ కు లేఖ పంపారు. ట్రంప్ ప్రసంగం చేసిన వీడియో క్లిప్ను సవరించినందుకు తీవ్రంగా విచారిస్తున్నామని తెలిపారు. మరోసారి ఆ కార్యక్రమాన్ని బీబీసీలో ప్రసారం చేయమని పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కొంతమంది ఆ సంస్థకు చెందిన అధికారులు ఇది వరకే రాజీనామా చేశారు.అసలేం జరిగింది2021లో క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి సమయంలో ట్రంప్ సూమారు గంట పాటు ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలోని కొంత భాగాన్ని ఎడిట్ చేసి బీబీసీ తన పనోరమ డ్యాకుమెంటరీలో ప్రసారం చేసింది. అందులో " మనం క్యాపిటల్ హిల్ కు వెళుతున్నాం. మీతో పాటు నేను వస్తున్నా. మనం తీవ్రంగా పోరాడుదాం" అని ట్రంప్ అన్నట్లు చూపించింది. అయితే వాస్తవానికి ఆ వీడియోలో శాంతియుతంగా పోరాడుదాం అన్న వ్యాఖ్యలను వక్రీకరించించి ప్రసారం చేసింది. దీంతో ట్రంప్ 1బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు. ఈ విషయంపై ట్రంప్ కు క్షమాపణలు చెప్పిన బీబీసీ పరిహారం మాత్రం చెల్లించలేదు.
బై బై పెన్నీ
వాషింగ్టన్: అమెరికాలో 232 ఏళ్ల సుదీర్ఘ ఘన చరిత్ర కలిగిన పెన్నీ(అధికారికంగా సెంట్) కథ ముగిసింది. ఫిలడెల్ఫీయాలోని అమెరికన్ టంకశాల(మింట్) చివరి పెన్నీని బుధవారం మధ్యాహ్నం ముద్రించింది. ఆ తర్వాత పెన్నీల ప్రింటింగ్ శాశ్వతంగా నిలిచిపోయింది. పెన్నీల తయారీని ఆపేయడం ద్వారా 56 మిలియన్ డాలర్ల ప్రజాధనం ఆదా చేయబోతున్నట్లు కోశాధికారి బ్రాండన్ బీచ్ చెప్పారు. ఈ నాణేల తయారీని ఎందుకు నిలిపివేశారన్నది చర్చనీయాంశంగా మారింది. వాటి అసలు విలువ కంటే తయారీ ఖర్చే ఎక్కువ కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఒక్కో పెన్నీ తయారీ ఖర్చు పదేళ్ల క్రితం 1.42 సెంట్లుగా ఉండేది. ఇప్పుడు అది ఏకంగా 3.69 సెంట్లకు పెరిగిపోయింది. దాంతో తయారీని ఆపేయడానికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గుచూపారు. ఒక్కో నాణెంపై 2 సెంట్లకుపైగా నష్టపోవాల్సి వస్తోందని, అదంతా వృథా ఖర్చు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే చాలా నష్టపోయామంటూ ఆన్లైన్లో పోస్టు చేశారు. ఒక్కో నాణేం ధర లక్ష డాలర్లు? అమెరికా మింట్ గణాంకాల ప్రకారం చూస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో 5.61 బిలియన్ డాలర్ల విలువైన నాణేలు చలామణిలో ఉండగా, అందులో పెన్నీల వాటా 57 శాతం(3.2 బిలియన్ డాలర్లు). వెండింగ్ యంత్రాల నుంచి క్యాండీలు, చాక్లెట్లు కొనడానికి, పార్కింగ్ టికెట్లకు డబ్బులు చెల్లించడానికి సాధారణంగా పెన్నీలు ఉపయోగిస్తుంటారు. కానీ, కొన్నేళ్లుగా వీటి వాడకం తగ్గిపోయింది. నాణేలు సేకరించేవారు మాత్రం వీటిని దాచుకుంటున్నారు. కొత్త పెన్నీలను మార్కెట్లోకి తీసుకురావడం కొన్ని నెలల క్రితమే నిలిపివేశారు. ఒమేగా గుర్తు ఉన్న ప్రత్యేక పెన్నీలను మాత్రం చివరిసారిగా ముద్రించారు. వీటిని డిసెంబర్లో వేలం ద్వారా విక్రయించబోతున్నారు. ఇవి గుర్తుగా దాచుకోవడానికే ఉపయోగపడతాయి. బుధవారం ఈ రకం నాణేలను 235 వరకు ముద్రించారు. వీటిలో 232 నాణేలను వేలం వేస్తారు. ఒక్కొక్కటి లక్ష డాలర్లు(రూ.88.71 లక్షలు) పలకవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సొమ్మును టంకశాల కార్యకలాపాల కోసం వెచి్చస్తారు. మిగతా మూడు నాణేలను ప్రజల సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచుతారు. అలాగే మింట్లో 235 గోల్డ్ పెన్నీలు కూడా ముద్రించినట్లు సమాచారం. వీటిని ఏం చేస్తారన్నది ఇంకా తెలియరాలేదు. పాత నాణేల చెలామణి యతాథతం ఫిలడెల్ఫీయాలో పెన్నీల తయారీ 1793లో ప్రారంభమైంది. ఇది డాలర్ విలువలో వందలో ఒక వంతు. అంటే వంద పెన్నీలు ఒక డాలర్లు అని చెప్పొచ్చు. అమెరికా కరెన్సీలో అత్యల్ప ముఖ విలువ కలిగినవి పెన్నీలే. మొదట్లో కాపర్తో తయారు చేసేవారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జింక్, కాపర్ ఉపయోగించడం ప్రారంభించారు. ఎందుకంటే యుద్ధం వల్ల కాపర్ కొరత ఏర్పడడమే ఇందుకు కారణం. ముద్రణ ఆపినంత మాత్రాన వాటి చెలామణి ఆగిపోదు. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న పాత పెన్నీ నాణేలను యథాతథంగా వాడుకోవచ్చు. అమెరికాలో చివరిసారిగా నాణేన్ని ఆపేసిన ఘటన 1857లో జరిగింది. ఆప్పట్లో హాఫ్–పెన్నీ ముద్రణను నిలిపివేశారు. అరుదైన హాఫ్–డాలర్ నాణేలు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి.
జాతీయం
ఓట్లు వచ్చినా సీట్లు రాలే!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్–రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) కూటమి ఘోరంగా పరాజయం పాలయ్యింది. మహాగఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విపక్ష కూటమి తరఫున అంతా తానై వ్యవహరించారు. రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించారు. ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. తేజస్వీ సభలకు జనం పోటెత్తారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ నీడ నుంచి ఆయన బయటకు వచ్చినట్లే కనిపించింది. ఎన్నికల్లో కష్టపడి పనిచేసినప్పటికీ ఓటమి తప్పకపోవడం ఆర్జేడీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాలకు గాను పొత్తులో భాగంగా 143 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 స్థానాలు గెల్చుకుంది. అయితే, మిగతా పార్టీల కంటే ఆర్జేడీకే అత్యధికంగా ఓట్లు రావడం గమనార్హం. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీకి ఏకంగా 23 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ, జేడీ(యూ)లకు ఇన్ని ఓట్లు రాలేదు. ఓట్ల శాతం పరంగా చూస్తే ఏకైక అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. ఆ పార్టీ 2020 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు గెల్చుకొని, 23.11 శాతం ఓట్లు దక్కించుకుంది. అంటే ఈసారి సీట్ల సంఖ్య తగ్గినా, ఓట్ల శాతం స్వల్పంగా మాత్రమే తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఆర్జేడీ పట్ల జనాదరణలో మార్పు రాలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తేజస్వీ యాదవ్ పార్టీకి 1.15 కోట్ల ఓట్లు ఆర్జేడీ ఓట్ల పరంగా కరోడ్పతిగా నిలిచింది. ఈ ఎన్నికల్లో 1,15,46,055 ఓట్లు సాధించింది. 101 సీట్లలో పోటీ చేసి, 89 సీట్లు కైవసం చేసుకొని ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీకి దక్కిన ఓట్లు కేవలం 20.08 శాతం. 2020లో 19.46 శాతం ఓట్లు లభించగా, ఈసారి స్వల్పంగా పెరిగాయి. బీజేపీకి మొత్తం 1,00,81,143 ఓట్లు దక్కాయి. బీజేపీ మిత్రపక్షం, సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యునైటెడ్) 101 సీట్లలో పోటీ చేసి, 85 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఆ పార్టీకి 19.25 శాతం ఓట్లు(96,67,118) వచ్చాయి. 2020లో 15.39 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 3.86 శాతం పెరిగాయి. నితీశ్ కుమార్ ప్రజా వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓట్ల శాతాన్ని మెరుగుపర్చుకోవడం విశేషం. చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(రామ్విలాస్), హిందుస్తానీ అవామీ మోర్చా(సెక్యులర్), రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలకు వచ్చిన ఓట్లు కూడా కలిపితే జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)కు దక్కిన మొత్తం ఓట్లు దాదాపు 47 శాతం. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాగఠ్బంధన్కు దక్కిన మొత్తం ఓట్లు 35.89 శాతం. రెండు కూటముల మధ్య ఓట్ల తేడా 11.11 శాతంగా తెలుస్తోంది. ఎక్కువ సీట్లలో పోటీ చేయడం వల్లే.. ఆర్జేడీ ఓట్ల శాతం భారీగా ఉన్నప్పటికీ సీట్లు పెరగలేదు. ఎన్నికల్లో ఒక పార్టీ లేదా ఒక అభ్యర్థికి మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయో ఓట్ల శాతాన్ని బట్టి నిర్ధారించవచ్చు. ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడానికి ఓట్ల శాతం తోడ్పడుతుంది. ఆర్జేడీ పాలన జంగిల్రాజ్ అంటూ ప్రత్యర్థులు పదేపదే నిందలు వేసినప్పటికీ ఆ పార్టీ పట్ల ప్రజాభిమానం చెక్కుచెదరలేదు. ఆర్జేడీ తాను పోటీ చేసిన చాలా నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చింది. ఆ పార్టీ ఓట్ల శాతం మెరుగ్గా కనిపించడానికి మరో కారణం కూడా చెప్పుకోవచ్చు. 143 స్థానాల్లో ఆర్జేడీ బరిలోకి దిగింది. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఇన్ని స్థానాల్లో పోటీ చేయలేదు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన బీజేపీ 101, జేడీ(యూ) 101 సీట్లలో పోటీకి దిగా యి. బీజేపీ కంటే 42, జేడీ(యూ) కంటే 42 ఎక్కు వ సీట్లలో ఆర్జేడీ పోటీ చేసింది. ఎక్కువ సీట్లలో పోటీపడింది కాబట్టే ఎక్కువ ఓట్లశాతం కనిపిస్తోందని, ఇందులో ఆర్జేడీ కొత్తగా బలం చాటింది ఏమీ లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు. గెలిచిన, ఓడిపోయిన నియోజకవర్గాల్లో పార్టీకి పోలైన మొత్తం ఓట్లను కలిపితే ఆర్జేడీకి 23 శాతం ఓట్లు పడినట్లు చెబుతున్నారు. ఆర్జేడీకి 2010 ఎన్నికల్లో 22 సీట్లు లభించాయి. ఆ తర్వాత అతి తక్కువ సీట్లు దక్కింది మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. – సాక్షి, నేషనల్ డెస్క్
అప్పుడే అమర్చి పేల్చాడా?
న్యూఢిల్లీ: యావత్ భారతావని ఉలిక్కిపడేలా చేసిన ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో డాక్టర్ ఉమర్ నబీ ఒక్కడే ఇంతటి మారణహోమం సృష్టించాడా? లేదంటే మరికొందరు ఆరోజు అదే కారులో వచ్చి పరారయ్యారా? అనే అనుమానాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లో ఎక్కువయ్యాయి. దీంతో కేసు దర్యాప్తును మెరుపువేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. నవంబర్ పదో తేదీ మధ్యాహ్నం నుంచి సాయంత్రందాకా మూడు గంటలపాటు కారులో నబీ ఏంచేశాడు? అతని వెంట ఇంకా ఎంత మంది ఉన్నారు? ఉంటే వాళ్లు ఆ తర్వాత ఏమయ్యారు? అనే ప్రశ్నలకు సమాధానాలకు వెతికేపనిలో అధికారులు తలమునకలయ్యారు. కారు మూడు గంటలపాటు పార్కింగ్లోనే ఉండగా చుట్టూ వాహనాలు పార్కింగ్లోకి వస్తూ పోతూ ఉన్నట్లు తేలడంతో ఆయా వాహనాల డ్రైవర్లు, యజమానులను అధికారులు ప్రశ్నించడం మొదలెట్టారు. సమీప వాహనాలను స్వా«దీనంచేసుకున్నారు. కారులో ఉమర్ ఏంచేశాడు? ఏదైనా బాంబులాంటిది బిగించడం చూశారా? కారులో ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది ఉన్నారా? అనే ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. బాంబుల తయారీలో ఉమర్కు నైపుణ్యం పేలుడుపదార్థాలతో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) తయారుచేయడంలో డాక్టర్ ఉమర్ నైపుణ్యం సాధించాడని దర్యాప్తు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. విదేశీ హ్యాండ్లర్ నుంచి అందుకున్న బాంబుతయారీ విధాన పీడీఎఫ్ ఫైళ్లు, ఓపెన్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అక్రమ సమాచారంతో బాంబుల తయారీలో ఉమర్ నిపుణుడిగా మారాడని తెలుస్తోంది. అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం, డిటోనేట్ ఉపకరణాలతో వీటిని తయారుచేసి ఉండొచ్చని చెబుతున్నారు. వీటి సాయంతో ఐఈడీని కేవలం 5–10 నిమిషాల్లో తయారుచేయొచ్చు. ఎర్రకోట పార్కింగ్ స్థలంలోనే ముడిపదార్థాలతో అప్పటికప్పుడు బాంబు తయారుచేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. పేలుడు తీవ్రతను బట్టి ఆరోజు రెండు కేజీల అమ్మోనియం నైట్రేట్, పెట్రోలియం ఉపయోగించి ఉంటారని ఫోరెన్సిక్ నిపుణులు అంచనావేస్తున్నారు. ఆదివారం తోటి డాక్టర్లు అరెస్ట్ కావడంతో హడావిడిగా ముందస్తు ప్లాన్లేకుండా ఉమర్ సోమవారం ఎర్రకోటకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా ఎర్రకోట సందర్శనలకు సోమవారం సెలవు. ఆరోజు పర్యాటకులు రద్దీ ఉండదు. రద్దీ లేనప్పుడు బాంబు పేల్చినా తీవ్రత పెద్దగా ఉండదని ఉమర్ భావించి ఉండొచ్చు. సాయంత్రం వేళ అయినా కనీసం ఛాందినిచౌక్ ప్రాంత కొనుగోలుదారులు, స్థానికులతో ఆ ప్రాంతం కిటకిటలాడితే అప్పుడు బాంబు పేలుద్దామనే ఆ 3 గంటలు ఉమర్ పార్కింగ్ ఏరియాలోనే వేచిచూశాడని పోలీసులు ఓ అంచనాకొచ్చారు.
గిరిజన యోధులను విస్మరించారు
గాందీనగర్: దేశ స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనులు చిరస్మరణీయమైన పాత్ర పోషించారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. కానీ, 60 ఏళ్లపాటు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ మన గిరిజన యోధులను ఏనాడూ పట్టించుకోలేదని, పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. గిరిజనుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని తప్పుపట్టారు. స్వాతంత్య్ర పోరాట ఘనత ‘కొన్ని కుటుంబాలకే’ దక్కాలన్నదే కాంగ్రెస్ అసలు ఉద్దేశమని విమర్శించారు. గిరిజన వీరుడు భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా శనివారం గుజరాత్ రాష్ట్రం నర్మదా జిల్లాలోని దెడియాపాద పట్టణంలో నిర్వహించిన ‘జనజాతీయ గౌరవ్ దివస్’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రూ.9,700 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.2,320 కోట్లతో నిర్మించే 50 ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తీ–ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్‡్ష అభియాన్ కింద నిర్మించిన లక్ష ఇళ్ల గృహ ప్రవేశాన్ని వర్చువల్గా నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... దేశ ప్రతిష్ట, ఆత్మగౌరవం, స్వాతం్రత్యాన్ని కాపాడే విషయంలో ఎల్లప్పుడూ గిరిజన బిడ్డలే ముందంజలో ఉంటున్నారని ప్రశంసించారు. అడవి బిడ్డల నుంచి ఎంతోమంది స్వాతంత్య్ర పోరాట యోధులు ఉద్భవించారని గుర్తుచేశారు. గుజరాత్లో గోవింద్ గురు, రూప్సింగ్ నాయక్, మోతీలాల్ తేజావత్ వంటి గిరిజనులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. ఈ ఉద్యమంలో లెక్కలేనన్ని అధ్యాయాలు గిరిపుత్రుల ధైర్యసాహసాలతో నిండిపోయాయని అన్నారు. న్యాయం చేయాలని సంకల్పించాం ‘‘దేశ స్వేచ్ఛ కోసం రక్తం చిందించిన గిరిజనులకు తగిన గుర్తింపు దక్కలేదు. కొందరి కుట్రల కారణంగా వారు తెరవెనుకే ఉండిపోయారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలకులు గిరిజనుల త్యాగాలను, అంకితభావాన్ని పూర్తిగా విస్మరించారు. 2014 కంటే ముందు భగవాన్ బిర్సా ముండాను ఎవరూ స్మరించుకోలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆయనకు గౌరవం దక్కింది. జార్ఖండ్లో బిర్సా ముండా ఇంటిని సందర్శించిన మొట్టమొదటి ప్రధానమంత్రిని నేనే. జనజాతీయ గౌరవ్ దివస్ అనేది గిరిపుత్రులకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేసుకోవడానికి దక్కిన అవకాశం. అడవి బిడ్డల పట్ల కాంగ్రెస్ నిర్వాకాలు ఏమిటో ప్రజలు తెలుసుకోవాలి. గిరిజనులకు శ్రీరాముడితో అనుబంధం ఉంది. వారు శ్రీరాముడి కాలానికి చెందినవారు. అయినా ఆ సంగతి కాంగ్రెస్ ప్రభుత్వాలకు పట్టలేదు. వారి జీవితాలను మెరుగుపర్చాలని ఏనాడూ ఆలోచించలేదు. మేయు గిరిజనుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. వారికి న్యాయం చేకూర్చాలని సంకల్పించాం. గిరిజనుల కోసం కేంద్రంలో ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయిదే. నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తున్నాం మేరీ కోమ్, దుతీ చంద్, బైచుంగ్ భూటియా వంటి గిరిజన యువతీ యువకులు అంతర్జాతీయ వేదికపై మన దేశ కీర్తి ప్రతిష్టలను పెంచారు. గిరిజన ప్రాంతాల నుంచి ఎంతోమంది క్రీడాకారులు వస్తుండడం సంతోషంగా ఉంది. పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నారు. ఇటీవల మహిళల క్రికెట్ ప్రపంచ్ కప్ సాధించిన మన క్రీడాకారుల బృందంలో ఒక గిరిజన బిడ్డ కూడా ఉండడం గర్వకారణం. మన ప్రభుత్వం గిరిజనుల్లో నైపుణ్యాలను గుర్తించి, ప్రోత్సహిస్తోంది. అణగారిన వర్గాలకు సైతం అందరితోపాటు సమాన అవకాశాలు దక్కాలి. అందుకోసం నిరంతరం శ్రమిస్తున్నాం. గత ఐదేళ్లలో మోడల్ గిరిజన పాఠశాలల నిర్మాణానికి రూ.18,000 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేశాం. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఫలితంగా గిరిజన పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య ప్రతిఏటా భారీగా పెరుగుతోంది’’ అని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పండోరి మాత ఆలయంలో పూజలు నర్మదా జిల్లాలోని దేవమోగ్రా గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం పండోరి మాత ఆలయాన్ని ప్రధానమంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు సూరత్ నగరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ పురోగతిని మోదీ సమీక్షించారు. బిర్సా ముండాకు నివాళులు స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజన విప్లవకారుడు భగవాన్ బిర్సా ముండా 150 జయంతి సందర్భంగా ప్రధాని మోదీ శనివారం ఘనంగా నివాళులరి్పంచారు. పరాయి పాలకుల దౌర్జన్యాలపై ఆయన సాగించిన పోరాటాలు, చేసిన త్యాగాలు ప్రతి తరానికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉద్ఘాటించారు. బిర్సా ముండా జయంతిని ‘జనజాతీయ గౌరవ్ దివస్’గా దేశమంతటా నిర్వహించారు.
కృత్రిమ మేధతో.. కొలువుల కోత
ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి.. కంపెనీలు కృత్రిమ మేధ వినియోగాన్ని వేగవంతం చేయడం. ఏఐలో పెట్టుబడులు పెట్టడం, పెరుగుతున్న వ్యయాలను కట్టడి చేయడంలో భాగంగా కంపెనీలు తమ వ్యాపార విధానాన్ని మార్చుకోవడం కూడా కొలువుల కోతకు కారణమని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ ఏఐ అధిక వినియోగం ఉద్యోగుల తీసివేతలకు కారణం అవుతుందని అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ఈ ఏడాది జూన్ లో జోస్యం చెప్పారు. ఆయన జోస్యం ఆయన కంపెనీ విషయంలో నిజమైంది. సుమారు 14,000 మందికి ఉద్వాసన పలకనున్నట్టు ఇటీవలే అమెజాన్ ప్రకటించింది. ఏఐలో పెట్టుబడులు పెడుతున్నాం కాబట్టి, ఖర్చులు తగ్గించుకునేందుకు మొత్తం ఉద్యోగుల్లో 4 శాతం వరకు తొలగించనున్నట్టు మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా ప్రకటించింది. మెటా, టీసీఎస్.. ఇలా కంపెనీలు ఒకదాని వెంట ఒకటి ఉద్యోగుల కోతకు శ్రీకారం చుట్టాయి. వారికంటే ఎక్కువ జీతాలుఏఐ నైపుణ్యాలున్న కార్మికుల సగటు వేతనాలు.. సంబంధిత రంగంలోని ఇతర ఉద్యోగుల సగటు జీతం కంటే 56% అధికంగా ఉండడం విశేషం. ప్రధానంగా హోల్సేల్–రిటైల్, ఇంధనం, సమాచారం, రవాణా – నిల్వ, రియల్టీ, తయారీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాల్లో ఈ వ్యత్యాసం ప్రధానంగా కనిపిస్తోంది. ఏఐ రంగంలో నిపుణుల కొరత వల్లే.. ఈ నైపుణ్యాలకు కంపెనీలు ఎక్కువ విలువ ఇస్తున్నాయని పరిశ్రమ చెబుతోంది. ఈ సంవత్సరం మొత్తం లేఆఫ్లలో ఇంటెల్, లెనోవో వంటి హార్డ్వేర్ కంపెనీల వాటా సుమారు 28%. అమెజాన్, ఈబే తదితర కంపెనీలు 14%, సేల్స్ (సేల్స్ఫోర్స్) 9%, కంజ్యూమర్ టెక్ (మెటా, గూగుల్) సంస్థలు 7% వాటాతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.పెట్టుబడులు ఇంతింతై..ప్రపంచవ్యాప్తంగా 2013లో ఏఐ రంగంలో పెట్టుబడులు సుమారు 15 బిలియన్ డాలర్లు కాగా.. 2019 నాటికి 103 బిలియన్ డాలర్లకి, 2024కి 252 బిలియన్ డాలర్లకి పెరిగాయి.
ఎన్ఆర్ఐ
తెలివైన వాళ్లు ఇండియాను ఎందుకు వీడుతున్నారు?
డాలర్ డ్రీమ్స్...బీటెక్ చదవాలి.. అమెరికాకో..కెనడాకో.. జర్మనీకో ఎగిరిపోవాలి..ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో చదువుకోవాలి. మంచి పేరు సంపాదించాలి. మంచి విజ్ఞనాన్ని ఆర్జించాలి. ఇలా ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ ఊరు, తమ నేల, తమ మనుషుల్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. ఎవరో కలల కోసం, ఇంకెవరో అవకాశాల కోసం, మరెవరో గౌరవం కోసం..! కానీ ఆ ప్రయాణం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ప్రశ్నను లేపుతోంది. మన దేశం మన కలలను ఎందుకు ఆపలేకపోతోంది? భారతదేశం ఒక నేల మాత్రమే కాదు.. ఒక అనుభూతి..! జ్ఞానం, ధైర్యం, సంస్కారం కలిసిన ఒక శ్వాస..! అయినా కూడా ఈ పవిత్ర గడ్డపైనే పుట్టినవాళ్లు బయటకు ఎందుకు పరుగెడుతున్నారు? ఇది కేవలం వలస కథ కాదు.. ఇది మనసుల వేదన.. ఇది ఆశల కొత్త దిశలో పుట్టిన తపన..! ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? భారతీయులు ఇండియాను ఎందుకు వదిలి వెళ్లిపోతున్నారు? నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడకుందాం.. కాసేపు దేశభక్తిని పక్కనపెడదాం.. దేశంపట్ల బాధ్యత కలిగిన వ్యక్తులగానే చర్చించుకుందాం.. అసలు ఈ సమస్యకు కారణమేంటి తెలుసుకుందాం. నిజానికి భారత్ నుంచి బయలుదేరే ఈ ప్రయాణం కొత్తది కాదు.. బ్రిటీష్ కాలం నుంచే విదేశాలకు వెళ్లే మార్గం తెరుచుకుంది.. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం సముద్రాలు దాటారు. తరువాతి కాలంలో బెంగళూర్, హైదరాబార్, గురుగ్రామ్ నగరాలనుంచి యువత విదేశాల తరలిపోయారు. చాలామంది అక్కడే స్థిరపడిపోయారు కూడా. మన దేశంలో చిన్న వయసు నుంచే పోటీ జీవితంలో ఒక భాగమవుతుంది.ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీటు కోసం పోటీ. ఇక చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం కొత్త పోరాటం. టాలెంట్ ఉన్నవాడికి తగిన గౌరవం దక్కడం అరుదుగా మారిపోయింది. ఇక్కడ పరిచయాలు చాలా సార్లు ప్రతిభ కంటే పెద్దవిగా మారుతాయి. అసలు కష్టపడి పనిచేసిన వాడే అవకాశాలు కోల్పోతున్నాడు. అదే మనసులో మిగిలిన నిరాశ ఆలోచనగా మారుతోంది. ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఫలితం రాదని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. జీవన ప్రమాణాలూ కారణమా?అంతేకాదు.. ఇండియాలో జీవన ప్రమాణాలు కూడా చాలా నాసిరకంగా ఉంటాయి. నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. వాతావరణం, పరిశుభ్రత, నకిలీ మందులు. కచ్చిత పనిగంటల పనివిధానం. మరోవైపు విదేశాల్లో జీవన విధానం మనకు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నిబంధనలు స్పష్టంగా ఉంటాయి.. ప్రతి ఒక్కరి శ్రమకు గౌరవం ఉంటుంది. ఎవరైనా కష్టపడి పనిచేస్తే, ఆ కష్టం వృథా కాదనే నమ్మకం అక్కడ బలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలూ ఎక్కువే. టెక్నాలజీ, హెల్త్కేర్, ఫైనాన్స్, పరిశోధన లాంటి రంగంలో ప్రపంచం తలుపులు తెరుస్తోంది. సమాన అవకాశాలు, సమాన గౌరవం అనే వాతావరణం విదేశాల్లో కనిపిస్తోంది. మరోవైపు భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక భద్రత కూడా ఒక పెద్ద కారణం. నిజానికి ఇతర దేశాల్లో కూడా పన్నులు ఎక్కువే ఉంటాయి. అయితే అవి ఎక్కువగా ఉన్నా వాటి వినియోగాన్ని ప్రజలు చూస్తారు. ఇక్కడ పన్నులు చెల్లించినా అభివృద్ధి కనిపించదు. రోడ్లకు గుంతలే కనిపిస్తాయి. విద్యుత్ కోతలు కూడా వేధిస్తాయ్.. ఆస్పత్రుల సేవల్లో ఆలస్యం ఉంటుంది. చెప్పాలంటే ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న వాళ్లలో చాలామందికి బాధ్యత ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇటు కొంతమంది నిబద్ధతతో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నా వ్యవస్థ దాన్ని అడ్డుకుంటుంది. ప్రతిభకు గౌరవం దక్కకపోవడం, అవినీతి పెరగడం, భవిష్యత్తుపై అనిశ్చితి లాంటివి భారతీయులను విదేశాలవైపు వెళ్లేలా చేస్తున్నాయి.ఒక్కసారి మీరే ఆలోచించండి... మన దగ్గర మంచి చదువు చదివిన వాళ్లు, తెలివైన వాళ్లు బ్యాగ్ వేసుకుని విదేశాలకు ఎందుకు వెళ్లిపోతున్నారు? అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా.. ఇలా ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వెళ్లిపోతున్నారు. వారి తెలివితేటలు, విజ్ఞానం మనకెందుకు దూరంగా పోతున్నాయి? ఇది చూసి చాలామందికి 'అబ్బే డబ్బుల కోసం వెళ్లిపోతున్నారు' అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. చదువుల్లో టాపర్స్, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీట్లు సాధించిన వారు, చదువు పూర్తి చేసిన వెంటనే అమెరికా అనీ, యూరప్ అనీ, ఆస్ట్రేలియా అంటూ పక్క దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే దీనికి కారణం కేవలం విలాసంగా బతకాలన్న కోరికా కాదండి. అలా వెళ్లేవాళ్లని అడిగితే 'ఇండియాలో నేను ఎంత పని చేసినా గుర్తింపు లేదు', 'రీసెర్చ్ చేయాలన్నా ఫ్రీడమ్ లేదు', 'నన్ను నమ్మే వాతావరణమూ లేదు' అని చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది మేధావులు తమ టాలెంట్ను ఉపయోగించుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికి సరైన ప్లాట్ఫామ్ కోసం వెతుకుతుంటారు. వారి పరిశోధనలకు అవసరమైన వనరులు, స్వేచ్ఛ, ప్రోత్సాహం లాంటివి ఇండియాలో లేవన్నది ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ. ఇదీ చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీఎంతమంది?ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022లో 2,25,260 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. 2023లో కూడా దాదాపు 2,16,219 మంది అదే పని చేశారు. 2014లో ఈ సంఖ్య 1,29,234 మాత్రమే ఉండగా, 2011 నుంచి 2023 మధ్య మొత్తం 19 లక్షల మంది భారతీయులు ఇండియా పాస్పోర్ట్ను వదిలేశారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 23,000 మంది భారతీయ మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారు. ఇదే సమయంలో, 2014 నుంచి 2022 మధ్యలో భారత బిలియనీర్ల ఆస్తులు 280శాతం పెరిగాయి, అంటే దేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటుకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒకవైపు మధ్యతరగతి, ప్రతిభావంతులు అవకాశాల కోసం దేశం వదిలిపెడుతుంటే, మరోవైపు అత్యంత ధనవంతులు తమ భవిష్యత్ భద్రత కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు.ఇక బ్రెయిన్ డ్రెయిన్ అంటే కేవలం ఒక గణాంకం కాదు.. ఇది దేశం కోల్పోతున్న మేధస్సు! ప్రతి ప్రతిభావంతుడు బయటకు వెళ్లినప్పుడల్లా మన భవిష్యత్తు కొంత వెనుక్కు వెళ్లిపోతుంది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే.. మన దేశం ఇలా మేధస్సును పోగొట్టుకోవడం ఆపాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా, ఇక్కడే ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించాలి. పరిశోధనకు పెట్టుబడి పెట్టాలి. యువతను ప్రోత్సహించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. టాలెంట్ను గుర్తించి, ప్రోత్సహించాలి. అవార్డులు, గ్రాంట్లు, రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. సొంతదేశంలోనే అందరూ గర్వంగా ఎదిగేలా చేయాలి. ఎందుకంటే.. ఒకరు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు, అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. అది సమాజం, వ్యవస్థ ఇచ్చిన సిగ్నల్ కూడా. ఈ సిగ్నల్ను మార్చేది మనమే..కానీ అది ఎప్పటికి సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి.
క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ
చిన్నతనంలో ఎన్నో కష్టాలు. 19 ఏళ్ల వయసులోనే కన్నవారిని ఉన్న ఊరిని విడిచిపెట్టి అమెరికాకు ఒంటరి పయనం. అటు ఆర్థిక ఇబ్బందులు, ఇటు ఒంటరి తనం. డిప్రెషన్. అయినా సరే ఎలాగైనా నిలదొక్కుకోవాలనే తపనతో క్యాబ్ డ్రైవర్గా తన జీవితాన్ని ప్రారంభించి ఎవ్వరూ ఊహించని శిఖరాలకు చేరాడు. గంటకు 6 డాలర్లు సంపాదించే స్థాయినుంచి కోట్ల టర్నోవర్ వ్యాపారవేత్తగా, కోటీశ్వరుడిగా ఎదిగాడు.పంజాబ్కు చెందిన మనీ సింగ్ పేరుకు తగ్గట్టుగా మనీ కింగ్గా తనను తాను నిరూపించుకున్నాడు. కఠోరశ్రమ, పట్టుదల, ఓపిక ఇదే అతని పెట్టుబడి. టీనేజర్గా కాలేజీని వదిలిపెట్టి మనీ సింగ్ డాలర్ డ్రీమ్స్ కన్నాడు. అలా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు వలస వెళ్లాడు. అయిష్టంగానే అక్క ఒక క్యాబ్ డిస్పాచర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.అదే అతనికి విజయానికి పునాది వేసింది. అమెరికాకు వెళ్లిన తర్వాత చాలా ఇబ్బందులుపడ్డాడు. తిరిగి ఇండియాకు వచ్చేద్దామనుకున్నాడు తల్లి సలహా మేరకు తొలుత ఒక మందుల దుకాణంలో పనిచేశాడు, తరువాత తన మామ క్యాబ్ కంపెనీలో డిస్పాచర్గా పనిచేశాడు గంటకు 530 రూపాయల వేతనం. తరువాత మనీ సింగ్ స్వయంగా టాక్సీ నడపడం ప్రారంభించాడు. అలా పదేళ్లకు దశాబ్దానికి పైగా టాక్సీ పరిశ్రమలో ఉన్నాడు. ప్రస్తుతం ఏడాదికి సుమారు రూ. 17.65 కోట్లు (2మిలియన్ డాలర్లు) టర్నోవర్ కలిగిన రెండు విజయవంతమైన వ్యాపారాలను నడుపుతుండటం విశేషం.పదేళ్ల అనుభవంతో ఐదు క్యాబ్లతో సొంత డిస్పాచ్ సెటప్తో డ్రైవర్స్ నెట్వర్క్ను ప్రారంభించాడు. ఇది ATCS ప్లాట్ఫామ్ సొల్యూషన్స్గా మారింది. ఇక్కడితో ఆగిపోలేదు. 2019లో, సింగ్ తన తల్లి సెలూన్ వ్యాపారం నుండి ప్రేరణ పొంది, మౌంటెన్ వ్యూలో డాండీస్ బార్బర్షాప్ & బియర్డ్ స్టైలిస్ట్ను (Dandies Barbershop and Beard Stylist ) ప్రారంభించాడు. అక్కడ కూడా సక్సెస్ సాదించాడు. CNBC ప్రకారం, డాండీస్ గత సంవత్సరం రూ. 9.47 కోట్లు సంపాదించాడు. అయితే ATCS ప్లాట్ఫారమ్ సుమారు మరో 9 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారం ఇలా మొదలైంది. 75 వేల డాలర్ల పెట్టుబడి, పర్మిట్లు, పేపర్ వర్క్కోసం సంవత్సరం పట్టిందని మనీ సింగ్ తెలిపారు . దుకాణం తెరవడానికి లైసెన్స్ పొందేదాకా ఒక సంవత్సరం అద్దె చెల్లించానని చెప్పుకొచ్చాడు. మరోవైపు అతనికి క్షురకుడిగా అనుభవంలేనందున, స్నేహితుడితో భాగస్వామ్యం కుదుర్చు కున్నాడు సరిగ్గా ఆరునెలలు గడిచిందో లేదో కోవిడ్-19 మహమ్మారి వచ్చి పడింది. ఫలితంగా దాదాపు ఒక సంవత్సరం పాటు దుకాణాన్ని మూసివేయాల్సి వచ్చింది. కానీ అద్దె ఇంకా చెల్లించక తప్పలేదు. మొత్తానికి లోన్లు, స్నేహితుల వద్ద అప్పలు, క్రెడిట్ కార్డ్ లోన్లతో మేనేజ్ చేశాడు. దీనికి తోడు స్టాక్ పోర్ట్ఫోలియోను కూడా లిక్విడేట్ చేశాడు. ఒక దశలో తిండికి కూడా చాలా కష్టమైంది.కట్ చేస్తే నేడు, మనీ సింగ్ మూడు డాండీస్ అవుట్లెట్లను నెలకొల్పి 25 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అప్పులన్నీ తీర్చేశాడు. 2023నాటికి డాండీస్ మరింత లాభదాయకంగా మారింది. క్రమశిక్షణ ,పట్టుదల పంజాబ్లోని తన బాల్యం నుంచే వచ్చాయనీ గుర్తుచేసుకున్నాడు. భవిష్యత్తు ప్రాజెక్ట్ - బార్బర్స్ నెట్వర్క్, బార్బర్ల కోసం బుకింగ్ యాప్ను నిర్మిస్తున్నానని మనీ సింగ్ చెప్పాడు. "నేను రోజుకు 15–16 గంటలు పనిచేస్తాను. రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. పనే ఊపిరి లాంటిది," అని చెబుతాడు సగర్వంగా.
యూఏఈ లాటరీలో జాక్పాట్.. చరిత్ర సృష్టించిన అనిల్ బొల్లా
పండుగపూట లక్ష్మీదేవి ఆ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతగాడిని కోటీశ్వరుడిని చేసేసింది. తల్లి సెంటిమెంట్తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్ కొంటే.. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీలో ఏకంగా రూ.240 కోట్ల డబ్బు గెల్చుకుని చరిత్ర సృష్టించాడు. భారత్కు చెందిన అనిల్కుమార్ బొల్లా(అతని స్వస్థలంపై స్పష్టత రావాల్సి ఉంది).. ఏడాదిన్నర కిందట యూఏఈకి వెళ్లాడు. అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈ నగరం అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను యూఏఈ లాటరీ నిర్వాహకులు సోమవారం అధికారికంగా విడుదల చేశారు. తన పూర్తి పేరు అనిల్కుమార్ బొల్లా మాధవరావు బొల్లా అని, రాత్రికి రాత్రే తన జీవితం మారిపోయిందని ఆ యువకుడు చెప్పడం ఆ వీడియోలో ఉంది. లాటరీ నెగ్గానని తెలియగానే సోఫాలో కుప్పకూలిపోయానని.. సంతోషంతో మాటలు రాలేదని, లోపల మాత్రం యస్.. నేను గెలిచా అనే ఆంనందం అలా ఉండిపోయిందని వివరించాడు.ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్కు 50దిర్హామ్(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్. అయితే అందులో అదృష్టం తెచ్చి పెట్టి టికెట్ నెంబర్ 11. ఆ నెంబర్కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్ను ఎంపిక చేసుకుని.. తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్. పైగా దీపావళి సమయంలోనే ఇలా జరగడాన్ని సంతోషంగా భావిస్తున్నట్లు తెలిపాడు.మరి ఇంత డబ్బుతో ఏం చేస్తావు? అని ప్రశ్నిస్తే.. తనకు కొన్ని కలలు ఉన్నాయని అని నెరవేర్చకుంటానని, అలాగే.. ఓ సూపర్కార్ కొనుగోలు చేసి.. సెవెన్స్టార్ హోటల్లో కొన్నాళ్లపాటు జాలీగా గుడుపుతానని నవ్వుతూ చెప్పాడు. అంతకంటే ముందు.. తన తల్లిదండ్రులకు చిన్నచిన్న కోరికలను తీరుస్తానని, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకొచ్చి ఇక్కడే గడుపుతానని, వచ్చిందాంట్లో కొంత చారిటీలకు ఇస్తానని తెలిపాడు.From anticipation to celebration, this is the reveal that changed everything!Anilkumar Bolla takes home AED 100 Million! A Lucky Day we’ll never forget. 🏆For Anilkumar, Oct. 18 wasn’t just another day, it was the day that changed everything.A life transformed, and a reminder… pic.twitter.com/uzCtR38eNE— The UAE Lottery (@theuaelottery) October 27, 2025
డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు
డాలస్, టెక్సస్: ఈ అవగాహనా సదస్సు ఏర్పాటుచేసిన ప్రముఖ ప్రవాస భారతీయ నాయుకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ప్రపంచంలోని విభిన్న భాషలు, సంస్కృతులు, కళలు, ఆచార, వ్యవహారాలు, మతాలు అవలంభించండానికి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రయాలున్న దేశం అమెరికా. అందుకే అమెరికా దేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు, మసీదులు, వివిధ భాషలవారి చర్చిలు, గురుద్వారాలు, సినగాగ్స్ లాంటి ఎన్నో ప్రార్ధనాలయాలు దర్శనమిస్తాయి.అనేక నగరాలలో భారతీయ మూలాలున్న లక్షలాదిమంది ప్రజలు ఎన్నో తరాలుగా ఈ జనజీవన స్రవంతిలో మమేకమవుతూ, వివిధ రంగాలలో బాధ్యాతాయుతంగా సేవలందిస్తూ, అమెరికా దేశ ఆర్ధికవ్యవస్థ బలోపేతానికి దోహద పడుతూ, మంచి గౌరవం, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో మనకున్న స్వేచ్ఛ, స్వాతంత్రయాలు దారి తప్పుతున్న ధోరణలతో కొన్ని ప్రాంతాలలో ప్రవాస భారతీయుల ఉనికికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరిస్థితులను గమనించి వివిధ సంఘాల ప్రతినిధులతో డాలస్ నగరంలో ఒక అవగాహనా సదస్సు ఏర్పాటుచేసి, ఇటీవల జరుగుతున్న వివిధ సంఘటనలను, విషయాలను కూలంకషంగా చర్చించి ప్రవాస భారతీయులకు కొన్ని సూచనలు చేసేందుకు యీ సదస్సు ఏర్పాటుచేశాం అన్నారు”.➢ ముందుగా అమెరికాదేశ విధి విధానాలను, చట్టాలను తెలుసుకుని విధిగా అందరూ గౌరవించాలి. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు వేదికమీద కేవలం ఒక్క భారతీయ జెండా మాత్రమే ఉంచకూడదు. భారత, అమెరికా దేశపు రెండు జెండాలు ఒకే సైజులో, ఒకే ఎత్తులో ఉండేటట్లుగా చూడాలి. వేదికపైన ఉన్న జెండాలలో వేదికముందు ఉన్న ప్రేక్షకులకు ఎడమవైపు భాగంలో అమెరికాదేశ పతాకం, కుడివైపు భారతదేశ పతాకం కనబడేటట్లుగా ఉంచాలి.జాతీయగీతాలు ఆలపించేడప్పుడు ముందుగా భారత జాతీయగీతం, ఆ తర్వాత అమెరికా జాతీయగీతం ఆలాపించాలి. భారత జాతీయగీతం పాడుతున్నపుడు నిశబ్దంగా, నిటారుగా నిలబడి ఉండాలి. అమెరికా జాతీయగీతం ఆలపిస్తున్నపుడు, అమెరికాదేశ జాతీయపతాకం వైపు చూస్తూ, కుడిచేతిని గుండెదగ్గర ఉంచుకోవాలి. టోపీలుధరించి ఉన్నట్లయితే జాతీయ గీతాలు ఆలపిస్తున్నంతసేపు వాటిని తీసిఉంచడం మర్యాద. ➢ భారతీయులు ముఖ్యంగా తెలుగువారి వందలాది కుటుంబాలు ఎక్కువగా ఒకేచోట నివసిస్తున్న ప్రాంతాలాలో దైవిక, ఆధ్యాత్మిక ఉత్సవాల పేరుతో కొన్ని రహదారులు మూసివేసి, లౌడ్ స్పీకర్ల మోతలు, బాణసంచాలు, నినాదాలతో వీధుల్లో సంబరాలు జరుపుకోవడం ఇతరులకు యిబ్బందికరంగా మారుతోంది. దీనికి సిటీ పర్మిషన్ ఉన్నట్లయితే, ట్రాఫిక్ డైవర్షన్ గుర్తులు, తగు పోలీస్ రక్షణ సిబ్బంది సహాయం తప్పనిసరి. ఇలాంటివి ఇళ్ళమధ్యలోగాక, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఖాళీ స్థలాలకు, ఆలయ ప్రాంగణాలకు పరిమితం చెయ్యడం ఉత్తమం. అలా కాకపోతే ఎన్నో ఉపద్రవాలకు గురిఅయ్యే ప్రమాదంఉంది.➢ ఉదాహరణకు ఇటీవలే ఇలాంటి సంఘటనతో తన కారులో రోడ్ మీద ఎటూ వెళ్ళడానికి వీలులేక, ఈ ఉత్సవాల జనంమధ్య చిక్కకుని, విసిగిపోయిన ఒక అమెరికన్ తన కారు దిగి తుపాకి చూపడంతో, అందరూ బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు. ఆ తుపాకీ పేలినా, బంగారు ఆభరణాలు ధరించి ఆ ఉత్సవాలలో పాల్గొన్న పిల్లలు, పెద్దల సమూహంలో తొక్కిసలాట జరిగినా, ఊహకందని ప్రమాదం జరిగి ఉండేది. ఇళ్ళ మధ్యలోగాని, ఆరు బయటగాని బాణాసంచా ఏ ఉత్సవాలలోనైనా కాల్చకూడదు. అలా చేయడానికి ‘పైరోటెక్ లైసెన్స్’ ఉండాలి, అనుభవజ్ఞులైన, లైసెన్స్ ఉన్న టెక్నీషియన్స్ మాత్రమే ఆ పనిచేయడానికి అర్హులు. ➢ మన భారతీయ సినిమాలు అమెరికాలో విడుదలవుతున్నప్పుడు దియేటర్లవద్ద హడావిడి శ్రుతిమించి రా(రో) గాన పడుతుంది. హీరోలకు అభిమానులు ఉండడం తప్పుగాదు గాని, దియేటర్లలో వారికి వందలాది కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చెయ్యడం, పేపర్లు చించి విసిరి, ఈలలు, గోలలు, డాన్సులతో ఒక జాతరను తలపించడంతో అదే మూవీ కాంప్లెక్స్ లో ఇతర భాషల సినిమాలు వీక్షించేవారు భయకంపితులవుతున్నారు.నిజానికి ఎంతో ఖర్చుపెట్టి సినిమా చూద్దామని వచ్చిన ఆయా హీరోల అభిమానులుకూడా కేకలు, అరుపుల మధ్య ఆ సినిమాను పూర్తిగా ఆస్వాదించలేక అసంతృప్తికి లోనవుతున్నారు. పోలీసులువచ్చి ఈ గోల, గందరగోళాల మధ్య ఆడుతున్న సినిమాను మధ్యలో ఆపివేసి అందరినీ బయటకు పంపి వెయ్యడం లాంటి సంఘటనలు ప్రవాస భారతీయులందరికీ సిగ్గుచేటు, అవమానకరం. ➢ ఇక ఆయా రాజాకీయపార్టీల నాయకులు వచ్చినప్పుడు అభిమానులు చేసే హడావిడే వేరు. వీధుల్లో భారీ కార్ల ర్యాలీలు, జెండాలు, నినాదాలతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీకి వారు, ఆయా నాయకులకు అభిమానం చూపడం, సభలు సమావేశాలు నాల్గు గోడలమధ్య ఏర్పాటు చేసుకోవడం ఎవరికీ అభ్యంతరం కాకూడదు. కాని సమస్యంతా రోడ్లమీద, రాజకీయ నాయకులు బసచేసిన హోటళ్ళవద్ద ఇతరుల శాంతికి భంగం కల్పిస్తూ అభిమానులు చేసే గోలే. అదే హోటళ్ళలో అనేక వందలమంది అమెరికన్లు బసచేసి ఉన్నారనే స్పృహకూడా లేకుండా వేసున్న అరుపులు, కేకలకు పోలీస్లు వచ్చి అందరినీ తరిమికొట్టిన సంఘటనలు, సందర్భాలు చాలా విచారకరం.➢ చాలామంది ప్రవాస భారతీయులకు ఇంటి ఎదురుగాను, ప్రక్కన నివసిస్తున్న అమెరికన్ల పేర్లు కూడా తెలియవు. అమెరికా జనజీవన స్రవంతిలో భాగంఅవుతూ ఇరుగుపొరుగుతో కలసిమెలిసి జీవించడం చాలా అవసరం. ఎన్నో తరాలగా ఇక్కడ జీవనం సాగిస్తున్నాం గనుక స్థానిక, జాతీయ రాజకీయ నాయకులతో పార్టీలకతీతంగా సంభందాలు కలిగి ఉండాలి. అమెరికా పౌరసత్వం కల్గిఉన్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడం, తమ సమస్యలను, అభిప్రాయాలను రాజకీయనాయకులకు తెలియజేయడం ఎంతైనా అవసరం.➢ మరో పెద్ద సమస్య – ఊళ్ళ పేర్లను మార్చి వ్రాయడం, పలకడం. ఉదాహరణకు-1856లో ఏర్పడ్డ ‘డాలస్’ నగరాన్ని ‘డాలస్ పురం’ గా “ఉల్లాసపురం” గా పలకడం;1913లో ఏర్పడ్డ “క్యారల్టన్” అనే నగరాన్ని “కేరళాటౌన్” గా పలకడం ఎందుకంటే అక్కడ కొంతమంది కేరళ రాష్ట్రం నుంచి వచ్చినవారు ఉన్నారు గనుక; 1950లో ఏర్పడ్డ “గంటర్” అనే నగరాన్ని “గుంటూరు” గా మార్చి పలకడం ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారు గనుక. ఇవి అన్నీ వినడానికి హాస్యంగానే ఉంటాయి కాని ఇవి అమెరికన్ల దృష్టిలోపడి అపహాస్యానికి, అపాయానికి గురిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి కొంతమంది అమెరికన్లు మన భారతదేశం వచ్చి మన పట్టణాల పేర్లను ఇంగ్లీష్ పేర్లతో మార్చివేస్తే ఎలా ఉంటుందో మనకు!. ఇలాంటి విపరీత మనస్తత్వానికి వెంటనే స్వస్తి పలకాలి.➢ వ్యక్తిగత శుచి, శుభ్రత పాటించకపోవడం, వాల్ మార్ట్ లాంటి స్టోర్స్ లో దొంగతనాలు చేస్తూ దొరికిపొయి చిక్కుల్లో పడడం, స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ లేదా తాగి డ్రైవ్ చేస్తూ దొరికిపోయి పోలీసులతో వాగ్వివాదాలకు దిగడం, పరిసరాలను అశుభ్రపరచడం, డిపార్ట్మెంట్ స్టోర్స్ లోను, రెస్టారెంట్లలోను సెల్ ఫోన్లలో బిగ్గరగా అరచి మాట్లాడంలాంటి సంస్కృతిని విడనాడాలి.➢ వాట్స్ ఆప్, ఇన్స్టాగ్రామ్, పేస్ బుక్ మొదలైన సాధనాల ద్వారా పంపే సందేశాలు, ముఖ్యంగా అమెరికన్ రాజకీయ విమర్శలు తరచూ అమెరికన్ అధికారులు గమనిస్తున్నారనే విషయం దృష్టిలో ఉంచుకుని మెలగాలి.➢ భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులు అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు, రాజకీయ నాయకులు, సినిమా కధానాయకులు వారి అభిమానులకు సరైన దిశానిర్దేశం చెయ్యడం ఎంతైనా అవసరం. అవగాహన కల్పించడంలో ప్రసారమాధ్యమాల పాత్ర, కృషి కొనియాడ దగ్గది.➢ రెండు గంటలకు పైగా సాగిన ఈ అవగాహానా సదస్సులో తానా, ఆటా, నాటా, నాట్స్, టాన్టెక్స్, టిపాడ్, డేటా, సురభి రేడియో, గ్రేటర్ ఫోర్ట్ వర్త్ హిందూ టెంపుల్ మొదలైన సంస్థల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, ఎన్నో దశాబ్దాలగా డాలస్ పరిసర ప్రాంతాలలో స్థిర నివాసంఉంటున్న రావు కల్వాల, ఎంవిఎల్ ప్రసాద్, వినోద్ ఉప్పు, చినసత్యం వీర్నపు, రవీంద్ర పాపినేని, రమాప్రసాద్, శ్రీ బండా, వినయ్ కుడితిపూడి, వి.ఆర్ చిన్ని, రాజేశ్వరి ఉదయగిరి, లక్ష్మి పాలేటి, రవి తూపురాని, వెంకట్ నాదెళ్ళ, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, అనిల్ గ్రంధి, శుభాష్ నెలకంటి, విక్రం జంగం, సురేష్ మండువ, రాజేష్ వెల్నాటి, సతీష్ రెడ్డి, విజయ్ కాకర్ల, బాబీ, రఘువీర్ రెడ్డి మర్రిపెద్ది, శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాస్ గాలి, మాధవి లోకిరెడ్డి, రాజేష్ అడుసుమిల్లి, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, మురళి వెన్నం మొదలైన ప్రవాస భారతీయనాయకులు హాజరై వారి వారి అభిప్రాయాలను సూటిగా పంచుకున్నారు.అతి తక్కువ వ్యవధిలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసి తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేసిన నాయకులకు, అనివార్యకారణాలవల్ల హాజరుకాలేకపోయినా సందేశాలను పంపిన వారికి, రుచికరమైన విందుభోజన ఏర్పాట్లు చేసిన ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారికి, అన్ని వసతులతో కూడిన కాన్ఫరెన్స్ హాల్ ను సమకూర్చిన డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్రైమ్
రైల్వే ట్రాక్పై టీటీడీ మాజీ ఏవీఎస్వో మృతదేహం
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏవీఎస్వో సతీష్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్పై విగతజీవిగా పడి కనిపించారు. పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్పై అప్పట్లో ఏవీఎస్వో సతీశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును గతంలో విచారించిన సతీష్ను.. ఆపై నిందితుడిగా సిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం గుంతకల్ రైల్వే ఆర్ఐగా పని చేస్తున్న ఆయన్ని ఈ నెల 6వ తేదీన సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం విచారణ జరిపింది. అయితే.. మరోసారి విచారణకు రావాలంటూ అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీంతో వేధింపులు భరించలేకే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సతీష్ను వేధించారు: వైఎస్సార్సీపీసతీష్ కుమార్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని అంటున్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ‘‘పరకామణి కేసులో రవికుమార్ ని పట్టుకున్నదే సతీష్ కుమార్. అలాంటి వ్యక్తి చనిపోవడం అనుమానాస్పదంగా ఉంది. సతీష్ మృతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపించాలి. వాస్తవాలు ఏంటో బయటి ప్రపంచానికి తెలియచేయాలి. సతీష్ను వేధించారు. భూమన కరుణాకరరెడ్డిని ఆ కేసులో లాగాలని సతీష్ పై ఒత్తిడి చేశారు. వెంకటేశ్వరస్వామిని రాజకీయాలలో కి లాగటం బాధాకరం. ఈ కేసులో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే సతీష్ ఆత్మహత్య చేసుకున్మాడో అర్థం చేసుకోవచ్చు. తనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని సతీష్ కుమార్ తన ఫ్రెండ్స్ దగ్గర చాలా సార్లు చెప్పారు. నాలుగు రోజుల సతీష్ విచారణ లో ఏం జరిగిందో బయట పెట్టాలి. వ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి’’ అని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
తులం బంగారం ఇస్తే ఏడాదికి తులంన్నర ఇవ్వాలి
మెదక్జోన్: మామూలుగా బ్యాంకులో.. లేదా ప్రైవేట్లో గానీ అప్పు తీసుకుంటే వడ్డీ చెల్లిస్తారు. కానీ.. ఇక్కడ మాత్రం తులం బంగారం అప్పుగా తీసుకుంటే ఏడాదికి తులంన్నర బంగారం ఇవ్వాల్సిందే. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన్శెట్టిపల్లిలో ఇలా బంగారాన్ని అప్పుగా తీసుకొని చెల్లించని ఓ కుటుంబంపై రుణదాతలు దాడి చేశారు. విద్యుత్ స్తంభానికి కట్ఠేసి విచక్షణారహితంగా కొట్టారు. ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పోతన్శెట్టిపల్లి గ్రామం వడ్డెర కాలనీకి చెందిన బోసు రమణి, రవి దంపతులు. ఇంటి నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం అదే కాలనీకి చెందిన ఐదుగురి వద్ద 9 తులాల బంగారం అప్పుగా తీసుకున్నారు. తులం బంగారానికి ఏడాదిలో తులంన్నర ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. తీసుకున్న బంగారాన్ని అమ్మి కొత్తగా ఇల్లు నిర్మించుకున్నారు. అప్పుగా తీసుకున్న బంగారానికి రూ.2 లక్షల వరకు వడ్డీ రూపంలో దశలవారీగా చెల్లించినట్లు బాధితురాలు రమణి తెలిపారు. కాగా, 2023లో తులం బంగారం రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఉండగా.. ప్రస్తుతం అది రూ.1.28 లక్షలు పలుకుతోంది. ఒప్పందం ప్రకారం 9 తులాల బంగారానికి గానూ వడ్డీ కింద అదనంగా మరో నాలుగున్నర తులాల బంగారం కలుపుకొని మొత్తం పదమూడున్నర తులాల బంగారం ఇవ్వాల్సి ఉందని రుణదాతలు ఒత్తిడి చేస్తున్నారు. వారం క్రితం రమణి, రవిలను అప్పు కింద తీసుకున్న బంగారం తిరిగి ఇవ్వాలని వారు అడిగారు. అప్పటి వరకు ఇంట్లోకి రావొద్దని తాళం వేశారు. అయితే.. ఇంటిని అమ్మి బంగారం ఇస్తామని వేడుకున్నా వినలేదు. రవిని విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారొచ్చి ఇంటి తాళం చెవి ఇప్పించి వెళ్లారు. ఆ మరుసటి రోజు వచ్చి మాపైనే ఫిర్యాదు చేస్తారా అని మళ్లీ రవిని కట్టేసి కొట్టారు. అడ్డొచ్చిన అతని భార్యపై దాడి చేశారు. ఇంటికి తాళం వేసి తమను వెళ్లగొట్టినట్లు బాధితురాలు రమణి పేర్కొంది. తీవ్రంగా గాయపడిన బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొంది మరో గ్రామంలో తలదాచుకున్నారు.తాళంచెవి ఇప్పించాం: ఎస్ఐ అప్పు కట్టలేదని కొందరు వ్యక్తులు ఇంటికి తాళం వేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని వారం క్రితం పోతన్శెట్టిపల్లికి చెందిన బోసు రమణి, రవి పోలీస్స్టేషన్కు వచ్చారని కొల్చారం ఎస్ఐ హైమద్ తెలిపారు. గ్రామానికి వెళ్లి తాళం ఇప్పించామన్నారు. సివిల్ కేసులు కోర్టులో చూసుకోవాలని చెప్పామన్నారు.
నా కొడుకును కొట్టి చంపేశారు!
శ్రీకాకుళం క్రైమ్/ఎచ్చెర్ల: ట్రిపుల్ ఐటీ విద్యార్థి మరణంతో ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎంపురంలో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రాంగణంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సుమారు మూడు వేల మంది విద్యార్థుల ధర్నాలు, నినాదాలతో హోరెత్తింది. తోటి విద్యార్థి సృజన్ బుధవారం ఆత్మహత్య చేసుకోవడంతో ఇన్నాళ్లు వారిలో దాగి ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓ మంచి విద్యార్థిని అన్యాయంగా చంపేశారనే భావన వారిని తీవ్రంగా కలచివేసింది. దీంతో కొన్నేళ్లుగా కళాశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు చేస్తున్న ఆగడాలు బట్టబయలవ్వడమే కాక కళాశాలలో ఇన్నాళ్లు గుట్టుగా జరుగుతున్న అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏమీ తెలియదట.. విద్యార్థి సృజన్ను రాత్రంగా సీనియర్లు కొట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నా.. మరుసటి రోజు ఉదయం సృజన్ ఆత్మహత్య చేసుకున్నా అంబులెన్సు వస్తే గానీ తనకు తెలియదని క్యాంపస్ డైరెక్టర్ చెప్పడం అక్కడి యాజమాన్య నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. గతంలోనూ ఆత్మహత్య ఘటనలు జరగడంతో పోలీసుల సాయంతో ఈ సారి కూడా గొడవను సద్దుమణిగేలా చేద్దామని యాజమాన్యం తీవ్రంగా ప్రయతి్నంచింది. కానీ విద్యార్థుల ఆగ్రహం, ఆందోళనల ముందు ఇటు పోలీసులు, అటు కళాశాల యాజమాన్యం తలొగ్గక తప్పలేదు. కుటుంబసభ్యులు, విద్యార్థులు ఆ రాత్రి కొట్టింది తొమ్మిది మంది అని చెప్పినప్పటికీ పోలీసులు ఎట్టకేలకు 8 మందిని అదుపులోకి తీసుకోవడంతో కాస్త శాంతించి వెనుదిరిగారు. బుధవారం రాత్రే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్రంలోని రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించినా.. శుక్రవారం విద్యార్థులు, సృజన్ కుటుంబీకుల ఆందోళనలు సద్దుమణిగాకే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు ఘటనకు బాధ్యులైన ఎనిమిది మంది విద్యార్థులు వై.అమిత్, ఎస్కే అనీష్ అహ్మద్, బి.అభిష్క్, జె.చిన్నబాబు, షేక్ అజీల్, ఎస్కే మస్తాన్, ఎస్కే సమీర్, ఎ.భానుప్రకాష్లను సస్పెండ్ చేశారు. తప్పుడు ప్రచారంపై మండిపాటు.. యాజమాన్యం పూర్తి నిర్లక్ష్య ధోరణి కనిపించడం.. మీడియా ముందు వాస్తవాలు చెప్పేందుకు కూడా ఆంక్షలు పెట్టడంతో విద్యార్థులు తట్టుకోలేకపోయారు. దీనికితోడు ‘సృజన్ బ్యాక్లాగ్స్ ఉంచేశాడు.. కళాశాలలో ఉన్న అమ్మాయితో చెడుగా ప్రవర్తించాడు.. అమ్మాయి సోదరుడు ఒక్కరే రెండు చెంపదెబ్బలు కొట్టాడు..’ వంటి తప్పుడు వదంతులు సృష్టించారంటూ మండిపడ్డారు. ఉదయం నుంచే ధర్నా.. సృజన్ తల్లిదండ్రులు, కుటుంబీకులు గురువారం ఉదయం 6 గంటలకు వచ్చారు. పరిస్థితి అదుపు తప్పక ముందే డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ ఎం.అవతారం, ఎస్ఐ వి.సందీప్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో విద్యార్థులు రెండు బృందాలుగా విడిపోయి ధర్నాకు దిగారు. తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని సృజన్ తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ లోగా కళాశాల యాజమాన్యం సమక్షంలో సృజన్ తల్లిదండ్రులతో డీస్పీ వివేకానంద, సీఐ అవతారంలు చర్చించారు. విద్యార్థుల ఆందోళనను విరమించేలా చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకోవడం, సృజన్ తల్లిదండ్రులు సైతం విజ్ఞప్తి చేయడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.అవన్నీ అబద్ధాలే.. సృజన్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. బ్యాక్లాగ్స్ ఉంచేశాడని, మంచివాడు కాడని, చదువు వల్ల చనిపోయాడన్నది నిజం కాదు. సీనియర్స్ దాడి చేశారన్నది నిజం. ముందు రోజు సృజన్పై దాడి ఎవరికీ తెలియదు. ఆత్మహత్య చేసుకున్నాక తప్పుగా పోలీసులకు వెళ్లింది. 11వ తేదీ రాత్రి 11 నుంచి 3 గంటల వరకు సీనియర్లు 9 మంది కొట్టి వేధించారు. తెల్లవారేసరికి అంతా పరీక్షలకు వెళ్లాం. సృజన్ రాలేదు. వచ్చేసరికి ఆత్మహత్య చేసుకున్నాడు. సృజన్ జూనియర్ విద్యారి్థనిని చెల్లి అని పిలుస్తాడు. అదే భావంతో ఉంటాడు. నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యారి్థని కజిన్కు ఈ విషయం నచ్చేది కాది. సృజన్ను హెచ్చరించాడు కూడా. అయినప్పటికీ సృజన్ చనిపోయే ముందు అమ్మాయి పిలిచి మాట్లాడటం వేరే వాళ్ల ద్వారా వారికి తెలిసింది. అందుకే ఇలా జరిగింది. – సృజన్ క్లాస్మేట్స్ ఏం ప్రయోజనం.. ఎంతమంది ధర్నాలు చేస్తే ఏంటి.? ఎంతమంది పోలీసులు వస్తే ఏంటి..? చెట్టంత కొడుకుపోయాడు. – జ్యోతి, సృజన్ తల్లి చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారు.. మా మేనల్లుడు సృజన్ కుర్చీ వేసుకుని ఫ్యాన్కు ఉరేసుకున్నాడన్నారు. అది నిజం కాదు. వాడి ఎత్తు 5.9 అడుగులు. ఫ్యాన్ కూడా అందేస్తుంది. రాత్రి 11 నుంచి 3 వరకు హింసించి, కొట్టి చంపేశారు. అలా తెచ్చి ఫ్యాన్కు ఉరేసినట్లు కట్టారు. – చుక్కా శంకరరావు, మేనమామ కొట్టి చంపేశారు... నేను ఆటోడ్రైవర్ను. ఇంటర్ నుంచి ఇదే కళాశాలలో సృజన్ను చదివిస్తున్నాను. కుమారుడిని అన్యాయంగా కొట్టి చంపేశారు. కొట్టినవారిలో ఐదారుసార్లు డిబార్ అయినవారు కూడా ఉన్నారు. మీ సృజన్ అటువంటి వాడు కాదని, కావాలనే చెడు వ్యక్తిగా చిత్రీకరించారని 2వేల మందికి పైగా విద్యార్థులు అంటున్నారంటే మావాడు ఏమీ తప్పు చేయలేదని గ్రహించాలి. పోలీసులు న్యాయం చేయాలి. – శివకృష్ణ ప్రసాద్, సృజన్ తండ్రి
Hyderabad: అశ్లీల ఫొటోలు పంపి మహిళకు వేధింపులు
హైదరాబాద్: ఓ మహిళకు వాట్సాప్లో అశ్లీల ఫొటోలు పంపిస్తూ వేధిస్తున్న వ్యక్తిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. మార్గదర్శికాలనీ విజయలక్ష్మి అనెక్స్ అపార్టుమెంటులో ఓ మహిళ (41) నివాసముంటోంది. అదే అపార్టుమెంటులో ఉండే నాగిరెడ్డి నాగసుబ్బారెడ్డి (32) కొద్ది రోజులుగా ఆమె ఫోన్కు అశ్లీల చిత్రాలు పంపిస్తూ వేధిస్తున్నాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మందలించి పంపించారు. అయితే సుబ్బారెడ్డి బాధితురాలికి ఫోన్ చేసి ఇక ముందు అశ్లీల ఫొటోలు పంపించకుండా ఉండాలంటే తనకు రూ. 10 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. మరోసారి బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోలేదని వీహెచ్పీ నాయకులు స్టేషన్ వద్ద ధర్నా చేయడంతో సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జరిగిన సంఘటనపై పూర్తి విచారణ చేస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు.
వీడియోలు
ఢిల్లీ బ్లాస్ట్... మరో డాక్టర్ అరెస్ట్
Jangaon : మరో ఘోర ప్రమాదం RTC బస్సు నుజ్జునుజ్జు
Hindupur : ముందే పోలీసులకు చెప్పి YSRCP ఆఫీసుపై దాడి
Chandrababu: బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ
Jada Sravan: పవన్ అలా చేస్తే సెల్యూట్ చేస్తా..
స్టీల్ ప్లాంట్పై విషం కక్కిన బాబు..వివాదాస్పద వ్యాఖ్యలు
మాజీ AVSO సతీశ్ కుమార్ మృతి కేసులో సీన్ రీకన్ స్ట్రక్షన్
YSRCP ఆఫీస్పై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్
హిందూపురం YSRCP ఆఫీస్ పై దాడి సాకే శైలజానాథ్ వార్నింగ్
Hindupuram: జై బాలయ్య అంటూ.... టీడీపీ నాయకుల దాడి

