ప్రధాన వార్తలు

శ్రీకాంత్కు పెరోల్.. అడ్డంగా దొరికిన హోంమంత్రి అనిత
సాక్షి, అమరావతి: తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అలివేలి శ్రీకాంత్కు నిబంధనలకు విరుద్ధంగా పెరోల్ మంజూరు చేయించడం వెనుక రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమేయం ఉందని తేటతెల్లమైంది. అంతటి తీవ్రమైన నేరాల్లో శిక్ష పడిన అతనికి పెరోల్ మంజూరు చేయడం సాధ్యం కాదని హోం శాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్ స్పష్టంగా తిరస్కరించినా, హోం మంత్రి అనిత ఒత్తిడితోనే పెరోల్ మంజూరైందని స్పష్టమైంది. శ్రీకాంత్ పెరోల్ ప్రతిపాదనను జూలై 16నే హోం శాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్ తిరస్కరించడం గమనార్హం. దీంతో మంత్రి బుకాయింపు బెడిసికొట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జీవిత ఖైదీ అలివేలి శ్రీకాంత్కు పెరోల్ మంజూరు కోసం నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, పాశం సునీల్కుమార్లు హోంశాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్కు సిఫార్సు చేశారు. ఆ మేరకు వారిద్దరూ సిఫార్సు లేఖలు కూడా ఇచ్చారు. కానీ.. తీవ్రమైన నేరాలకు పాల్పడి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తుండటంతోపాటు గతంలో ఒకసారి జైలు నుంచి పరారైన శ్రీకాంత్కు పెరోల్ ఇవ్వకూడదని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్రాజు నివేదిక సమరి్పంచారు. దాంతో శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేయాలన్న ప్రతిపాదనను కిషోర్ కుమార్ తిరస్కరించారు. ఈ మేరకు అధికారికంగానే జూలై 16న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పట్టుపట్టి మరోమారు హోం మంత్రి అనితపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణతో మంత్రికిడీల్ కుదిర్చారు. డీల్ ఓకే కావడంతో శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేయాలని ఆదేశిస్తూ హోం మంత్రి అనిత స్వయంగా నోట్ఫైల్పై సంతకం పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ ఫైల్ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ వద్దకు వెళ్లింది. హోం మంత్రి ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితిలో కుమార్ విశ్వజిత్ అనివార్యంగా శ్రీకాంత్కు పెరోల్ మంజూరు చేస్తూ జూలై 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించాయి.

ఆసియాకు డబుల్ ఇంజిన్లు భారత్, చైనా!
న్యూఢిల్లీ: భారత్- చైనా సంబంధాలు మళ్లీ పట్టాలెక్కుతున్న తరుణంలో.. ఆ దేశ రాయబారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వేచ్ఛా వాణిజ్యంతో ఇన్నాళ్లూ లాభపడిన అమెరికా ఇప్పుడు టారిఫ్ల పేరుతో బేరాలాడుతూ భారత్పై వేధింపులకు దిగుతోందని భారత్లో చైనా రాయబారి జు ఫెయింగ్హాంగ్ విమర్శించారు. భారత్పై అమెరికా ప్రభుత్వం 50 శాతం టారిఫ్లు విధించడాన్ని తమ దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. మౌనంగా ఉంటే అమెరికా వేధింపుల్ని మరింతగా పెంచుతుందన్న ఆయన.. ఈ విషయంలో భారత్ పక్షాన చైనా గట్టిగా నిలబడుతుందని వెల్లడించారు. భారత ఉత్పత్తులకు చైనా మార్కెట్లను తెరవడంపై ఫెయింగ్ హాంగ్ స్పందిస్తూ... ఒకరి ఉత్పత్తులకు మరొకరు అవకాశమివ్వడం ద్వారా రెండు దేశాల అభివృద్ధికి ఎంతగానో అవకాశముందని చెప్పారు. ఆసియాకు రెండు దేశాలు డబుల్ ఇంజన్ల వంటివని అభివర్ణించారు. పోటీపరంగా చూస్తే ఐటీ, సాఫ్ట్వేర్, బయోమెడిసిన్ ఉత్పత్తుల్లో భారత్ మెరుగ్గా, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నిర్మాణరంగం, నూతన ఇంధన రంగాల్లో చైనాది పైచేయిగా ఉందని వివరించారు. రెండు ప్రధాన మార్కెట్లు అనుసంధానమైతే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వివరించారు. భారత్పై అమెరికా సుంకాల (US Tariffs) విధింపు, వాటిని మరింత పెంచుతామని ఆ దేశం చేస్తున్న ప్రకటనలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాణిజ్య, సుంకాల యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫీహాంగ్ వ్యాఖ్యానించారు.ఇటువంటి సందర్భాల్లో మౌనంగా ఉండటం, రాజీ పడటం.. బెదిరింపులకు పాల్పడేవారికి మరింత ధైర్యాన్నిస్తుంది. చైనా (China)లోని తియాంజిన్ వేదికగా ‘షాంఘై సహకార సంస్థ’ (SCO) శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో భారత్ సహా అన్నిపక్షాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ‘‘అంతర్జాతీయ వేదికపై పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భారత్, చైనాలు ఐక్యంగా ఉంటూ.. పరస్పరం సహకరించుకోవాలి. ఇరుదేశాల స్నేహం.. ఆసియాకు, ప్రపంచానికీ మేలు చేకూరుస్తుంది. భారత్, చైనాలు కలిసి తమ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టగలవు’’ అని ఫీహాంగ్ పేర్కొన్నారు.జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలురష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు భారత్పై అమెరికా విధించిన సుంకాలపై మాస్కో వేదికగా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదని.. చైనా అని పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనకు మాస్కో వెళ్లిన జైశంకర్ గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలిశారు. ఆ దేశ విదేశాంగమంత్రి సెర్గీ లవ్రోవ్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో భారత్పై అమెరికా విధించిన సుంకాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జైశంకర్ ఘాటుగా స్పందించారు. అంతేకాదు.. మాస్కో నుంచి అత్యధిక స్థాయిలో ఎల్పీజీ దిగుమతి చేసుకుంటున్న దేశం కూడా భారత్ కాదని, యూరోపియన్ యూనియన్ అని వెల్లడించారు. ప్రపంచ ఇంధన ధరల స్థిరీకరణకు భారత్ సాయాన్ని అమెరికా కోరిందని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని కూడా అగ్రరాజ్యమే సూచించిందని అన్నారు. 2022 తర్వాత రష్యాతో వాణిజ్యం అత్యధికంగా జరిపిన దేశం కూడా భారత్ కాదని అన్నారు. అయినా భారత్పైనే ఎక్కువ సుంకాలు విధించడంలోని తర్కమేంటో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.

‘కాళేశ్వరం’పై నివేదిక ఎందుకు బయటపెట్టారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీలో ఎందుకు బహిర్గతం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అధికారికంగా నివేదికను మీడి యాకు అందజేశారా?, మీరు విడుదల చేయకుంటే మీడియాకు కాపీ ఎలా వచ్చింది? అసెంబ్లీలో చర్చించారా?.. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే ఉద్దేశం ఉందా?.. అని అడిగింది. కమిషన్ నివేదికను అధికారికంగా విడుదల చేయలేదని, అసెంబ్లీలో ఇంకా చర్చించలేదని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి బదులిచ్చారు. ప్రధాన న్యాయమూర్తి అడిగిన వివరాలతో పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. జస్టిస్ ఘోష్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు, మాజీ నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, ప్రభుత్వం తరఫున ఏజీ, కమిషన్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతో కమిషన్ ఏర్పాటు కేసీఆర్, హరీశ్రావు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘మేడిగడ్డ బరాజ్కు సంబందించిన ప్రతిదీ కేబినెట్, ఇంజనీర్ల సూచనలు, ఆమోదంతోనే జరిగింది. దురదృష్టవశాత్తు అసాధారణ వర్షాలతో ఓ పిల్లర్ కుంగింది. దీనికి డిజైనింగ్, ఇంజనీరింగ్తో ఎలాంటి సంబంధం లేదు. అయినా ప్రభుత్వం రాజకీయ కక్షతో జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ చట్ట నిబంధనలు పాటించలేదు. చట్టంలోని నిబంధనలనే కాకుండా, చట్టబద్ధతను, ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించింది. మమ్మల్ని ముద్దాయిలుగా చిత్రీకరిస్తూ, నివేదిక కాపీ ఇవ్వాలని కోరినా ఇప్పటివరకు ఇవ్వకుండా.. పదేపదే మీడియా ముందు మా ప్రతిష్టను దిగజార్చేలా మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దానిపై అసెంబ్లీలో చర్చించాలని తీర్మానించారు. అసెంబ్లీలో చర్చించకుండానే ప్రభుత్వం పవర్పాయింట్ ప్రజెంటేషన్తో నివేదికలోని వివరాలు మీడియాకు తెలియజేసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే మీడియా సమావేశంలో నివేదికను బహిర్గతం చేశారు. నివేదికపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన సారాంశాన్ని వందలాది అధికారిక, అనధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేశారు. దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు సీఎం, మంత్రులు పదే పదే ప్రెస్మీట్లలో బీఆర్ఎస్ పార్టీ, పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. పబ్లిసిటీ కోసం పాకులాడుతూ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో అప్రతిష్టపాలు చేసేందుకు, రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పిటిషనర్లకు నోటీసులు సైతం సరైన విధానంలో ఇవ్వలేదు. చట్టంలోని సెక్షన్ 8బీ, 8సీ కింద సమన్లు జారీ చేయలేదు. కేవలం సాక్షిగానే నోటీసులిచ్చారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సాక్షులు ఇచ్చిన వివరాలపై క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకుంటే 8బీ, 8సీ కింద నోటీసులు ఇవ్వాలి. నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలి. ముందస్తు ప్రణాళిక ప్రకారం మా ప్రతిష్టను దెబ్బతీసేలా పక్షపాతంతో, చట్టవిరుద్ధంగా సమర్పించిన నివేదికను రద్దు చేయాలి..’ అని కోరారు. ఈ సందర్భంగా కిరణ్బేడీ, ఎల్కే అద్వానీపై కమిషన్లను కొట్టివేసిన కేసులకు సంబంధించిన వివరాలు ధర్మాసనానికి అందజేశారు. ఇద్దరూ శాసనసభ్యులే.. అందుకే అసెంబ్లీలో చర్చ ప్రభుత్వం, కమిషన్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ‘నివేదికపై అసెంబ్లీలో చర్చించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. నివేదిక నేరుగా అసెంబ్లీలో బహిర్గతం చేస్తాం. పిటిషనర్లు ఇద్దరూ శాసనసభ సభ్యులు. ప్రజాప్రయోజనంతో ముడిపడి ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వేల కోట్ల రూపాయల ప్రజా ధనం వెచ్చించి ప్రాజెక్టు నిర్మించారు..’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీజే జోక్యం చేసుకున్నారు. అసెంబ్లీలో చర్చించాలని భావించినప్పుడు నివేదికను మీడియాకు ఎందుకు విడుదల చేశారని ఏజీని ప్రశ్నించారు. ‘నివేదిక ప్రతిని పబ్లిక్ డొమైన్లో పెట్టారా?, పిటిషనర్లకు 8బీ కింద నోటీసులిచ్చారా? నివేదిక ప్రస్తుత స్థితి ఏంటీ? అసెంబ్లీలో ప్రవేశపెట్టారా?’ అని అడిగారు. మీడియాకు ఇవ్వలేదు..పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు మీడియాకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదని, పబ్లిక్ డొమైన్లోనూ పెట్టలేదని ఏజీ బదులిచ్చారు. నివేదికకు కేబినెట్ ఆమోదం తర్వాత రూపొందించిన 60 పేజీల త్రిసభ్య కమిటీ నివేదికలోని వివరాలను మీడియాకు ఇచ్చామని చెప్పారు. 8బీ కిందే పిటిషనర్లకు నోటీసులిచ్చామని తెలిపారు. అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. కిరణ్బేడీ, ఎల్కే అద్వానీ కేసులు ఇక్కడ వర్తించవని వాదించారు. కాగా, తనకు సమర్పించిన నివేదిక ప్రతి సరిగా కనిపించడం లేదంటూ కొన్ని పాయింట్లు హైలైట్ చేసి ఉండటంపై సీజే అభ్యంతరం తెలిపారు. విచారణను నిలిపివేద్దాం అని అన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల విజ్ఞప్తితో విచారణ కొనసాగించారు. వివరాలు స్పష్టంగా ఉన్న కాపీ ఇవ్వాలని వారికి సూచించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుసుకుని చెప్పాలని ఏజీకి సూచిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.

బంగ్లాదేశ్ ఇప్పుడొక టైమ్ బాంబ్!
‘ఉక్కు మహిళ’ షేక్ హసీనా నిరంకుశ పాలనకు తెరపడినా, బంగ్లాదేశ్లో ప్రజా స్వామ్య ద్వారాలు తెరుచుకోలేదు. విద్యార్థుల తిరుగుబాటుకు వెనుక ఉండి మద్దతు ఇచ్చిన సైన్యం హసీనా నిష్క్రమణతో నేరుగా రంగంలోకి దిగింది. తమ ఆటలు సాగనివ్వని హసీనాపై సైనిక అధికారులు పగ తీర్చుకున్నారు. చివరకు ఆమె దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. సైన్యంతో పాటు విద్యార్థుల తిరుగు బాటుకు అన్ని రకాలుగా తోడ్పాటు అందించిన ఇస్లామిస్ట్ శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. సెక్యులర్ పాలనలో కుక్కిన పేనుల్లా పడి ఉన్న ఈ శక్తులు ఇదే అదనుగా వీధుల్లోకి వచ్చాయి.యూనస్ దేనికి వారధి?తను స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ ద్వారా బీదాబిక్కీకి రుణ సాయం అందిస్తూ వారి పాలిట దేవుడిగా కీర్తించబడి 2006లో నోబెల్ శాంతి బహుమతి పొందిన మహమ్మద్ యూనస్ను గద్దె ఎక్కించడంతో బంగ్లాదేశీయుల ప్రజాస్వామ్య ఆశలు మరింత బలపడ్డాయి. అయితే అవి వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు.నోబెల్ కమిటీ యూనస్ను ఎంపిక చేయడానికి గ్రామీణ్ బ్యాంకు ద్వారా ఆయన సేవలు అందించారనడం అనేది పైకి కనిపించే కారణం మాత్రమే! భౌగోళిక రాజకీయాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. ఇస్లాముకూ, పశ్చిమ దేశాల ప్రజలకూ నడుమ యూనస్ ఒక వారధి లాంటి వాడని కమిటీ అధ్యక్షుడు ఆయనకు అవార్డు ప్రకటిస్తూ అభివర్ణించారు. 2001 సెప్టెంబర్ 11న యూఎస్ మీద జరిగిన టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో ‘ఇస్లామును ఒక భూతంగా చూసే విస్తృత ధోరణి’ని ఎదుర్కోవడానికి యూనస్ ఎంపిక తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. యూనస్ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ లాబీయింగ్ చేయడం వెనుక అసలు కారణం ఇదే!దేశంలో సమూల సంస్కరణలు ప్రవేశపెడతాననీ, ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తాననీ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేతగా సైన్యం వెన్నుదన్నుతో పగ్గాలు చేతబట్టిన యూనస్ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. అయితే ఎన్నికలు పదే పదే వాయిదా పడుతున్నాయి. ఇలా ఉండగా, రాజ్యాంగ బద్ధత లేనప్పటికీ, మధ్యంతర ప్రభుత్వం అనేక స్వతంత్ర సంస్థల్లో పెనుమార్పులు ప్రకటిస్తోంది. వీటిలో భాగంగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తినీ, సీనియారిటీ పరంగా ఆయన తర్వాతి స్థానాల్లో ఉండే అయిదుగురు న్యాయమూర్తులనూ పదవుల నుంచి తొలగించింది. హసీనా పార్టీ అవామీ లీగ్ను నిషేధించింది. దేశంలోనే అతి పెద్దదైన ఈ రాజకీయ పార్టీ నాయకత్వంలోనే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.వీధుల్లో బీభత్స కాండమానవ హక్కులను కాపాడవలసిన ప్రభుత్వమే వాటిని ఉల్లంఘిస్తోంది. నిరసనలను అణచివేస్తోంది. న్యాయవాదులు, విద్యా వేత్తలు, పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలను, హసీనా మద్దతుదారు లను మూకుమ్మడిగా జైళ్లకు పంపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అనేక వేల మందిని నిర్బంధంలోకి తీసుకుంది. హత్యలు వంటి అభియోగాలు మోపి జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెడు తోంది. వారిపై పెరిగిపోయిన దాడుల పట్ల అంతర్జాతీయ మీడియా పరిశీలక సంస్థలు ఆందోళన ప్రకటిస్తున్నాయి. దేశంలో కస్టడీ హత్యలు, చిత్రహింసలు మామూలు అయ్యాయి.ఇస్లామిస్టు ఉగ్రవాదులకు పునరావాసం కల్పించే కొత్త పరి ణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. యూనస్ నాయకత్వంలోని మిలిటరీ–ముల్లా ప్రభుత్వం జిహాదీ గ్రూపుల మీద నిషేధాలు ఎత్తివేసింది. కరడు గట్టిన ఉగ్రవాద నాయకులకు స్వేచ్ఛ ప్రసాదించింది. అంతకంటే ఘోరంగా, అనేక మంది ఉగ్రవాదులు మంత్రి పదవులు, ఉన్నత ప్రభుత్వోద్యోగాలు పొందారు. వారి అనుచర గణాలు ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బౌద్ధులు, క్రైస్తవులు, హిందువులు, గిరిజన తెగల మీద దాడులు చేస్తున్నారు. ‘ఇతర’ ఇస్లామిక తెగలనూ వారు విడిచి పెట్టడం లేదు. ఈ దాడులను నేరాలుగా పరిగణించక పోవడం విశేషం. స్త్రీలు ధరించే దుస్తులను సాకుగా చూపి, వారి మీదా దాడు లకు తెగబడుతున్నారు. తాలిబన్ శైలిలో ‘మోరల్ పోలీసింగ్’ సంస్కృతి వ్యాప్తి చెందుతోంది. పరిస్థితి ఎంత దుర్మార్గంగా తయా రైందంటే, ఆఖరుకు అవామీ లీగ్ పార్టీకి బద్ధ వ్యతిరేకమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సైతం ఈ మౌలిక హక్కుల హననాన్ని, ‘మతం పేరిట రేగిన ఉన్మాదం’గా, ‘వీధుల్లో బీభత్స కాండ’గా అభివర్ణిస్తోంది.పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది. జీడీపీ వృద్ధి కుప్పకూలింది. విదేశీ రుణం పెరిగి పోయింది. ద్రవ్యోల్బణం 12 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ఇన్వెస్టర్ల విశ్వాసం క్షీణించడంతో, స్టాక్ మార్కెట్ అయిదేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఉద్యోగాలు పోతున్నాయి. ఉపాధి దొరకడం లేదు. జీవన ప్రమాణాలు తిరోగమిస్తున్నాయి. ఇలాంటి ఆర్థిక వ్యవస్థ ఉగ్రవాద వ్యాప్తికీ, సామాజిక అశాంతికీ దారి తీస్తుంది.ఇండియాకూ గట్టి దెబ్బముస్లిం మెజారిటీ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యానికి బంగ్లాదేశ్ ఒకప్పుడు చిరునామాగా ఉండేది. కోవిడ్–19 మహమ్మారి ముంచు కొచ్చే వరకు ఆర్థిక అభివృద్ధి, సామాజిక స్థిరత్వం దిశగా పురోగమించింది. ఏ దేశం నుంచి విడిపోయేందుకు విముక్తి ఉద్యమం చేసిందో ఆ దేశం బాటలోనే ప్రయాణించే దుఃస్థితి నేడు బంగ్లాదేశ్కు పట్టింది. బంగ్లాదేశ్ దుష్పరిణామాల ప్రభావం ఈ ప్రాంతం అంతటా పడుతుంది. బంగ్లాదేశ్కు మూడు వైపులా సరిహద్దుగా ఉన్న ఇండి యాలోకి అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు ప్రవేశించారు. హసీనా హయాంలో ఉగ్రవాద నిరోధకత, ప్రాంతీయ సంధాయకత అంశాల్లో ఇండియాకు బంగ్లాదేశ్ అత్యంత సన్నిహిత భాగస్వామిగా ఉండేది. ఆమె ప్రభుత్వం కూలిపోవడం... వ్యూహాత్మక ప్రయోజ నాల పరంగా ఇండియాకు గట్టి దెబ్బ. ఇప్పుడు ఆ వైపున కూడా సరిహద్దు భద్రత పెంచడం అనివార్యం అయ్యింది. లేదంటే, బంగ్లా దేశ్ నుంచి కూడా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం పొంచివుంది.హసీనా పదవీచ్యుతి వల్ల ఎదురు కానున్న ప్రమాదాలను ఇండియా తక్షణం గుర్తించినప్పటికీ, అమెరికా అందుకు విరుద్ధంగా ఆ మార్పును స్వాగతించింది. అయితే, బంగ్లాదేశ్ ఇదే పంథాను కొనసాగిస్తే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ సుస్థిరత సౌభాగ్యాల కోసం యూఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న కృషి కొరగాకుండా పోతుంది. సుదూర దేశాలను సైతం ముగ్గులోకి దించే మరో అంత ర్జాతీయ స్థాయి ఉద్రిక్త కేంద్రంగా బంగ్లాదేశ్ అవతరిస్తుందని పరి శీలకులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు, మత స్వేచ్ఛ, ప్రాంతీయ సుస్థిరతలను పరిరక్షించాల్సిన తక్షణ అవసరాన్ని అంతర్జాతీయ సమాజం సీరియస్గా తీసుకోవాలి, బంగ్లాదేశ్ అధః పతనాన్ని ఇక ఎంత మాత్రం ఉపేక్షించకూడదు.బ్రహ్మ చేలానీ వ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’ ఎమిరెటస్ ప్రొఫెసర్ (‘ప్రాజెక్ట్ సిండికేట్’ సౌజన్యంతో)

దారి మళ్లిన యూరియా..
సొసైటీలకు సరఫరా కావాల్సిన యూరియా రాష్ట్రంలో దారి మళ్లింది. ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తూ టీడీపీ నేతలు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. మరికొంత మంది వ్యవసాయ అవసరాలకు ఉపయోగించాల్సిన యూరియాను బీర్ల తయారీతో పాటు పెయింట్, వార్నిష్, ప్లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం, పశువుల దాణా.. కోళ్లు, చేపలు, రొయ్యల మేత తయారీ, కల్తీ పాల తయారీ కోసం దర్జాగా దారిమళ్లించారు. ఇదంతా అధికార కూటమి పార్టీల ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతోంది.ఈయనో రైతు.. పేరు సిరపురపు రామునాయుడు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఇతనికి ఉన్న రెండు ఎకరాల పొలంలో వరి పంట సాగు చేశాడు. ఇప్పుడు యూరియా అవసరం కావడంతో ఐదు రోజులుగా తిరుగుతున్నాడు. ఇప్పటికీ ఒక్క బస్తా కూడా దొరకలేదు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని వాపోతున్నాడు. ప్రభుత్వం చూస్తుంటే స్టాక్ ఉందని చెబుతోందని, ఇక్కడ చూస్తే నో స్టాక్ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలంలోని బెణికల్లులో టీడీపీ మండల నేత రమేష్కు చెందిన గోదాములో పెద్ద ఎత్తున యూరియాను అన్లోడ్ చేశారు. వాస్తవానికి ఈ నిల్వలను డీసీఎంఎస్, సొసైటీ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. ఓ పక్క సొసైటీ కేంద్రాల వద్ద యూరియా నో స్టాక్ అని బోర్డులు పెట్టి, మండలానికి కేటాయించే యూరియా నిల్వలను తన గోదాముల్లోకి తరలించుకుపోయాడు. ఇదేమిటని ప్రశ్నించిన రైతులపై సదరు టీడీపీ నేత తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఓ వైపు తీవ్ర వర్షాభావం.. మరో వైపు అధిక వర్షాలు.. ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారమే 2.5 లక్షల ఎకరాలు ముంపునకు గురైనట్టు చెబుతుండగా, వాస్తవానికి దాదాపు 4 లక్షల ఎకరాలకు పైగా ముంపునీటిలో చిక్కుకున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణ, గోదావరి జిల్లాలతో పాటు దాదాపు 14 జిల్లాల్లో ఎటు చూసినా ముంపునీటిలో చిక్కుకున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ పంటలు తిరిగి నిలదొక్కుకోవాలంటే బూస్టర్ డోస్ ఇవ్వాల్సిందే. లేకుంటే పంట పెరుగుదల లేక దిగుబడులు తగ్గి పంట నాణ్యత దెబ్బ తింటుంది. ప్రస్తుతం పిలక కట్టే దశలో వరి పైరు ఉంది. ఈ దశలో ఎకరాకు కనీసం 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటా‹Ù, పత్తికైతే 25–30 కిలోల యూరియా, 10–15 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రణాళికా బద్ధంగా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. బఫర్ స్టాక్ నిర్వహణలో మార్క్ఫెడ్ విఫలమైంది. ఈసారి 2 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేయనున్నామని, రైతులకు కొరత లేకుండా సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో లక్ష టన్నులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నారు. కారణం బఫర్ స్టాక్ నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమే కారణం. మరో వైపు ఉన్న కొద్దిపాటి నిల్వలను టీడీపీ నేతలు దొడ్డిదారిన తమ గోదాములకు మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏమూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాలు కాదు కదా.. కనీసం సహకార సంఘాల్లో సైతం యూరియా కట్ట దొరకని పరిస్థితి. మిగిలిన ఎరువుల పరిస్థితి కూడా ఇంతే. అధికారులు మాత్రం రాష్ట్రంలో నిల్వలకు ఢోకా లేదని చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. సర్కారు వద్ద ఉన్నది 10 శాతమే 2025– ఖరీఫ్ సీజన్ సాగు లక్ష్యం 85.26 లక్షలు కాగా ఆగస్టు 21వ తేదీ నాటికి 50.75 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 27 లక్షల ఎకరాల్లో వరి, 9.2 లక్షల ఎకరాల్లో పత్తి, 3.2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4.50 లక్షల ఎకరాల్లో కందులు, 4 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. దాదాపు రెండు నెలల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దెబ్బతిన్న రైతులు ప్రస్తుతం అధిక వర్షాలతో నష్టపోతున్నారు. ఈ పరిస్థితిలో యూరియా కట్ట దొరక్క రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఖరీఫ్ సీజన్కు 16.76 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 6.45 లక్షల టన్నుల నిల్వలున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందులో సొసైటీలు, ఆర్ఎస్కేల వద్ద 65 వేల టన్నులు, మార్క్ఫెడ్ గోడౌన్లో 55 వేల టన్నులుండగా, మిగిలిన ఎరువులన్నీ ప్రైవేటు హోల్సేల్, రిటైల్ వ్యాపారుల వద్దే ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో వీరు లాబీయింగ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కామరాజుపేట సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు ఎమ్మార్పీకి మించి విక్రయాలు బహిరంగ మార్కెట్లో యూరియా కట్ట (ప్రభుత్వ ధర 50 కేజీల బస్తా రూ.266.50) రూ.350 నుంచి రూ.450 వరకు విక్రయిస్తున్నారు. యూరియా ఒక్కటే కాదు.. డీఏపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. డీఏపీ నిల్వలు కూడా 70 వేల టన్నులకు మించి లేవు. దీంతో ఓపెన్ మార్కెట్లో డీఏపీ బస్తా (ప్రభుత్వ ధర రూ.1350) రూ.1,550 చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. యూరియాతో పాటు ఇతర ఎరువుల కోసం రైతుల ఆందోళనలు ప్రతి జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి. చెప్పేదొకటి.. వాస్తవం మరొకటి అనంతపురం జిల్లాలో యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. చాలా ప్రాంతాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోంది. రైతులు ఆర్ఎస్కేలు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్తో పాటు ప్రైవేట్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఒకట్రెండు బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. చాలా చోట్ల టోకెన్లు ఇచ్చి పంపుతున్నా, మరుసటి రోజు కూడా ఇవ్వడం లేదు. ‘ఈ ఖరీఫ్కు సంబంధించి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 26,839 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు ఉండగా.. ఇప్పటికే 29 వేల మెట్రిక్ టన్నులకు పైగా సరఫరా అయ్యింది. ఇందులో 28 వేల మెట్రిక్ టన్నులకు పైగా పంపిణీ జరిగింది. ఇంకా వేర్హౌస్లో బఫర్ స్టాక్ కింద 1,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది’ అని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరి తెలిపారు. ఈ లెక్కన రైతులెందుకు యూరియా కోసం రోడ్డెక్కుతున్నట్లు?ఎరువులను అధికార పార్టీ కార్యకర్తలు దారి మళ్లించడంతో శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కనితూరులో రైతుల పాట్లు అన్ని జిల్లాల్లోనూ అవే కష్టాలు ⇒ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో ఎరువుల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బస్తా రూ.400తో అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న అరకొర ఎరువులు రైతు భరోసా కేంద్రాలకు కాకుండా కూటమి నాయకుల ఇళ్ల వద్ద ఉంచుకుని ఆ పార్టీ వర్గీయులకే అందిస్తున్నారు. ⇒ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పెడన, పామర్రు, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఇదే సమయంలో ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో మాత్రం పుష్కలంగా అందుబాటులో ఉంది. అయితే యూరియాతో పాటు ఇతర మందులు కూడా కొనుగోలు చేయాలని వారు షరతు పెడుతున్నారు. సొసైటీల్లో అధికార పక్ష నేతలు సిఫారసు చేసిన వారికే యూరియా అందుతోంది. పలమనేరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు ⇒ వైఎస్సార్ కడప జిల్లాలో ఓ వైపు యూరియా కొరత తీవ్రంగా ఉంది. మరో వైపు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, యూరియాకు సంబంధించిన సమస్యలుంటే 8331057300, 9491940106 నంబర్లలో సంప్రదించాలని జిల్లా అధికారులు చెబుతున్నారు. ⇒ కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 2,429 టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నా.. ప్రయివేటు డీలర్లు, ఆర్బీకేలు, పీఏసీఎస్లు, డీసీఎంఎస్ల్లో బస్తా కూడా యూరియా లభించడం లేదు. ఆదోని, కౌతాళం, హొళగుంద, పెద్దకడుబూరు, గోనెగండ్ల తదితర మండలాల్లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. ⇒ ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు యూరియా కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. అధికారులు చెబుతున్న విధంగా యూరియా క్షేత్ర స్థాయిలో ఎక్కడా దొరకడం లేదు. ప్రైవేటు షాపు నిర్వాహకులు మాత్రం యూరియాను అధిక రేట్లకు అమ్మేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. పలమనేరులోని ఓ రైతు సమాఖ్య కేంద్రానికి గురువారం ఒక లోడు యూరియా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రైతులు షాపు తెరవక ముందే భారీగా క్యూ కట్టారు. గంట వ్యవధిలో ఖాళీ అయింది. వందలాది మంది రైతులకు దొరక్క పోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ⇒ ఉమ్మడి గుంటూరు జిల్లాలో వ్యాపారులు కృతిమ కొరత సృష్టించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. పెదకాకాని మండలంలోని గోళ్ళమూడి గ్రామంలో యూరియా ఉందని తెలియడంతో రైతులు క్యూకట్టారు. సొసైటీ వద్ద, ఆర్బీకే వద్ద కాకుండా లారీని రోడ్డుపై పెట్టి అమ్మకాలు చేపట్టారు. గురువారం ఆధార్ కార్డుకు రెండు బస్తాల చొప్పున కొంత మందికి మాత్రమే ఇచ్చారు. ఒక్క బస్తా ఇచ్చుంటే ఒట్టు మాకు ఎనిమిది ఎకరాలు సొంతభూమి ఉంది. మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. వరి, మిర్చి, పత్తి, కంది వంటి పంటలు సాగు చేస్తున్నాం. వరి నాట్లు వేస్తున్నాం. యూరియా అత్యవసరం అయింది. అన్ని పనులు వదులు కొని ఆర్బీకేలు, ప్రయివేటు డీలర్ల చుట్టూ 25 రోజులుగా తిరుగుతున్నాం. ఒక బస్తా ఇచ్చుంటే ఒట్టు. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. – మర్రిస్వామి, రైతు, హొళగుంద, కర్నూలు జిల్లాఅధిక ధరకు అమ్ముతున్నారు పంటలకు అవసరమైన యూరియా దొరక్క ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాం. 45 కేజీల బస్తా రూ.266కు అమ్మాల్సిన యూరియా దొరక్కపోవడంతో సుమారు రూ.500 కు పైగా ధర పలుకుతోంది. గతంలో ఎన్నడూ ఈ ధరలు చూడలేదు. ఈ విధంగా అధిక ధరలకు యూరియా కొనుగోలు చేసి వ్యవసాయం చేయలేం. – పీ సుధాకర్, రైతు, సోమేపల్లి, త్రిపురాంతకం మండలం, ప్రకాశం జిల్లాగత ప్రభుత్వంలో ఎన్ని బస్తాలైనా ఇచ్చేవారునేను ఐదెకరాల్లో వరి, ఐదెకరాల్లో దుంపతోట సాగు చేస్తున్నాను. నాకు 50 బస్తాల యూరియా అవసరం. గతంలో ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆధార్ కార్డుకు ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. ఇది ఎక్కడ చల్లాలో, ఏం చేయాలో తెలియడం లేదు. మాకు అవసరమైన మేరకు యూరియాను వెంటనే అందించాలి. – రాజమంద్రపు శ్రీను, రైతు, జగ్గంపేట నియోజకవర్గం, కాకినాడ జిల్లా 266 బస్తాల యూరియా లారీ పక్కదారి మంత్రి ఫరూక్ అనుచరుడి ప్రోద్బలంతో వ్యాపారికి విక్రయం సాక్షి, నంద్యాల: యూరియా దొరక్క ఓ వైపు రైతులు రోడ్డెక్కుతుంటే మరోవైపు అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ అవి వచ్చీరాగానే వాటిని గద్దల్లా తన్నుకుపోతున్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలోని పసురపాడు గ్రామానికి మార్క్ఫెడ్ ద్వారా 266 బస్తాల యూరియాను అధికారులు గత మంగళవారం రైతు సేవా కేంద్రానికి మంజూరు చేశారు. యూరియా ఈనెల 19న రావాల్సి ఉంది. అయితే, ఆ స్టాకు మొత్తం సంబంధిత రైతుసేవా కేంద్రానికి రాకుండానే మాయమైంది. టీడీపీ నాయకులు ఈ స్టాకు మొత్తాన్ని అమ్ముకున్నట్లు తెలుస్తోంది. గ్రామానికి రావాల్సిన యూరియా రాకపోవడంతో రైతులు మార్క్ఫెడ్ కార్యాలయాన్ని సంప్రదించగా 266 బస్తాలు పంపామని తెలిపారు. దీంతో గ్రామ రైతులు విలేజ్ హార్టీకల్చరల్ అసిస్టెంట్ (వీహెచ్ఏ) శ్రీకాంత్రెడ్డిని అడగ్గా.. ఇంకా రాలేదని ఆయన నిర్లక్ష్యంగా బదులిచ్చారు. అనుమానం వచ్చిన రైతులు గోస్పాడు ఏఓకు ఫిర్యాదుచేశారు. ఇది తెలుసుకున్న శ్రీకాంత్రెడ్డి పత్తాలేకుండాపోయారు. దీంతో.. గ్రామస్తులకు యూరియా అందిందా లేదా అని ఏఓ విచారించి రైతులకు అందలేదని తెలుసుకున్నారు. అనంతరం.. వారి సంతకాలు తీసుకుని జిల్లా వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నాయకులే వీహెచ్ఏ శ్రీకాంత్రెడ్డితో కుమ్మక్కై 266 బస్తాల యూరియా లారీని నంద్యాలలోనే ఓ బడా వ్యాపారికి అమ్మి సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. మంత్రి ఫరూక్ ముఖ్య అనుచరుడి ప్రోద్బలంతోనే ఎరువు లారీని అమ్మే సాహసం టీడీపీ నాయకులు చేశారని తెలుస్తోంది.

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి.. ప్రముఖులతో పరిచయాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.చతుర్దశి ప.11.54 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: ఆశ్లేష రా.1.10 వరకు, తదుపరి మఖ,వర్జ్యం: ప.1.59 నుండి 3.35 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.07 వరకు, తదుపరి ప.12.30 నుండి 1.20 వరకు,అమృత ఘడియలు: రా.11.40 నుండి 1.15 వరకు.సూర్యోదయం : 5.47సూర్యాస్తమయం : 6.20రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కష్టానికి తగిన ఫలితం దక్కదు. ఆరోగ్యభంగం. పనులలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు.వృషభం.... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.మిథునం..... బంధువులతో వివాదాలు. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.కర్కాటకం.... వ్యవహారాలలో పురోగతి. ఆస్తుల వివాదాలు పరిష్కారం. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.సింహం..... పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. బంధుమిత్రులతో విభేదాలు. విద్యార్థుల యత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. అనారోగ్యం.కన్య..... అందరిలోనూ గుర్తింపు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు చకచకా సాగుతాయి. ఆహ్వానాలు, గ్రీటింగ్లు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.తుల.... మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.వృశ్చికం..... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.ధనుస్సు... శ్రమ మరింత పెరుగుతుంది. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ధనవ్యయం.మకరం... పనులు విజయవంతంగా సాగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి.కుంభం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింతగా కలసివస్తాయి. సత్కారాలు జరుగుతాయి.మీనం... మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. అనారోగ్యం.

భారత్, పాక్ పోరుకు రాజముద్ర
ఒకవైపు పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం... మన దేశంలో ఉన్న పాక్ జాతీయులను వెంటనే వెనక్కి పంపడంతో పాటు అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటూ ప్రభుత్వ స్పందన... ఇలాంటి స్థితిలో శత్రుదేశం పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్లను బాయ్కాట్ చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు... స్వయంగా టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ తటస్థ వేదికల్లో కూడా ఆడకూడదంటూ వ్యాఖ్యలు ... వెటరన్ ఆటగాళ్ల ‘వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్’లో పాక్తో రెండు మ్యాచ్ల్లో బరిలోకి దిగకుండా తప్పుకున్న భారత బృందంపై ప్రశంసలు...మరోవైపు ‘ఆ మ్యాచ్’ కోసమేనా అన్నట్లుగా ఆసియా కప్ వేదిక భారత్ నుంచి యూఏఈకి మారడం... కొద్ది రోజులకే షెడ్యూల్ విడుదల... జోరుగా ప్రచారం మొదలు పెట్టిన ప్రసారకర్తలు... భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్కు 10 సెకన్ల ప్రకటనకు రూ. 16 లక్షల రేటు... చూస్తుండగానే టోర్నీలో పాల్గొనే జట్ల ప్రకటన... అయినా సరే చివరి నిమిషంలో మ్యాచ్ రద్దు కావచ్చని, లేదా భారత్ ఆడకుండా పాయింట్లు ఇవ్వవచ్చని చర్చ... కానీ అలాంటి అవసరం లేదని తేలిపోయింది. ఇప్పుడు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి భారత్, పాక్ పోరుకు ఆమోద ముద్ర వేసింది. న్యూఢిల్లీ: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న దుబాయ్లో జరిగే మ్యాచ్ నిర్వహణపై ఉన్న సందేహాలు తొలగిపోయాయి. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ను చూసేందుకు అమితోత్సాహంతో సిద్ధం కావచ్చు! ఆసియా కప్లో పాక్తో తలపడేందుకు కేంద్ర ప్రభుత్వం మన జట్టుకు అనుమతి ఇచ్చింది. ఇతర దేశాలు కూడా పాల్గొంటున్న ‘మల్టీలేటరల్ ఈవెంట్’ కావడంతో ఈ మ్యాచ్లో ఆడటంపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం లేదని ప్రకటించింది. టోర్నీ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ మ్యాచ్లపై ఉన్న ఆసక్తి, ప్రాధాన్యతను బట్టి చూస్తే తాజా ప్రకటనతో వాణిజ్యపరంగా భాగస్వాములందరూ సంతోషించే నిర్ణయం వెలువడటం విశేషం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఆడేందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేసింది. మార్గదర్శకాలతో స్పష్టత... భారత్, పాకిస్తాన్ మధ్య నిజానికి 2012–13 నుంచి ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కానీ ఇరు జట్లు ఐసీసీ టోర్నీలైన వన్డే, టి20 వరల్డ్ కప్లు, చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ మ్యాచ్లలో తలపడుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ప్రకటనలో కొత్తగా పేర్కొన్న అంశం ఏమీ లేదు. అయితే దీనికే మరింత స్పష్టతనిస్తూ అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేసింది. సరిహద్దు దేశాల మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో క్రీడా సంబంధాల విషయంలో కేంద్రం వీటిని ప్రకటించింది. ‘క్రీడలకు సంబంధించి పాకిస్తాన్తో ఎలా వ్యవహరించాలనే విషయంపై ప్రభుత్వం తమ విధానాన్ని వెల్లడిస్తోంది. ఇరు జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఉండవు. మన జట్టు అక్కడికి వెళ్లి ఆడేందుకు లేదా ఆ జట్టు ఇక్కడికి వచ్చే ఆడేందుకు కూడా అనుమతించేది లేదు. అయితే పలు ఇతర జట్లతో ముడిపడి ఉన్న టోర్నీల విషయంలో ఆయా క్రీడల అంతర్జాతీయ సంఘాల నిబంధనలను, మన ఆటగాళ్లను కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. భారత్ పెద్ద ఈవెంట్ల వేదికగా మారుతున్న అంశాన్ని కూడా చూడాలి. కాబట్టి ఇలాంటి ఈవెంట్లలో పాక్ ఆడుతున్నా సరే మన జట్టు పాల్గొనవచ్చు. భారత్ ఆతిథ్యం ఇచ్చే ఇలాంటి టోర్నీల్లో కూడా పాకిస్తాన్ ఆడేందుకు అభ్యంతరం లేదు’ అని కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనలో పేర్కొంది. అధికారుల కోసం వీసా సడలింపులు... భవిష్యత్లో కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్ కూడా నిర్వహించాలని ఆశిస్తున్న నేపథ్యంలో మన దేశానికి అత్యుత్తమ వేదికగా గుర్తింపు రావాలని కూడా కేంద్రం భావిస్తోంది. అందుకే వివిధ క్రీడా ఈవెంట్ల సమయంలో వీసాలు జారీ చేసే విషయంపై కూడా ప్రకటనలో వివరంగా పేర్కొంది. ‘క్రీడాకారులు, అధికారులు, సాంకేతిక సిబ్బందితో పాటు అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులకు వారి అధికారిక పర్యటన సమయం, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వీసాలు జారీ చేస్తాం. ఇది గరిష్టంగా ఐదేళ్లు ఉంటుంది. టోర్నీల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి వచ్చే అధికారులకు ఇబ్బంది లేకుండా తమ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఇది ఉపకరిస్తుంది’ అని కేంద్రం వెల్లడించింది.

రాజ్యాంగవ్యవస్థలు పనిచేయకుంటే ఆ పని కోర్టులే చేస్తాయి
న్యూఢిల్లీ: రాష్ట్రాల బిల్లులకు ఆమోదం తెలపడంపై గవర్నర్లకు, తనకు గడువు నిర్దేశిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరిన అంశంపై గురువారం సైతం రాజ్యాంగ ధర్మాసనం విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వానుద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ సేథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై వాదనలను ఆలకిస్తూ ఈ వ్యాఖ్యలుచేసింది. ‘‘రాజ్యాంగబద్ద సంస్థలు తమ విధులను నిర్వర్తించకుండా నిర్లక్ష్యవహించినా, రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా గవర్నర్ నిష్క్రియాపరత్వం చూపినా సరే తాము చేతులు కట్టుకుని కూర్చోవాలా?’’ అని కేంద్ర తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సూటిగా ప్రశ్నించింది. దీనిపై మెహతా బదులిచ్చారు. ‘‘అసెంబ్లీలు ఆమోదించి పంపిన బిల్లులపై ఎటూ తేల్చకుండా గవర్నర్ వాటిని అలాగే తనవద్దే అట్టిపెట్టుకుంటే అలాంటి సందర్భాల్లో రాష్ట్రాలే రాజకీయ పరిష్కారాలను వెతకాలి. అంతేగానీ న్యాయస్థానాల నుంచి పరిష్కారాలను ఆశించకూడదు. సమస్య పరిష్కారానికి సంప్రతింపుల మార్గంలో వెళ్లాలి. చర్చలకే తొలి ప్రాధాన్యత దక్కాలి’’ అని అన్నారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ జోక్యంచేసుకున్నారు. ‘‘ మీరన్నట్లు చర్చలకు సిద్ధపడకుండా ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం మా వద్దకొస్తే మేమేం చేయాలి?’’ అని ప్రశ్నించారు. దీనికి బదులుగా మెహతా.. ‘‘ ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కోర్టులను ఆశ్రయిస్తారని నేను అనుకోవట్లేను. సీఎం తొలుత ఆ గవర్నర్తో భేటీ కావాలి. అప్పుడా గవర్నర్ ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కలిసి వారి సలహాలు, సూచనలతో పరిష్కారాలు వెతుకుతారు. కొన్ని సార్లు టెలిఫోన్ సంభాషణలు కూడా సమస్యలను సద్దుమణిగేలా చేశాయి’’ అని అన్నారు. ‘‘ సమస్యల పరిష్కారానికి కొన్ని దశాబ్దాలుగా ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు. ఇది కూడా సాధ్యంకాకపోతే తొలుత ప్రతినిధి బృందం రంగంలోకి దిగి గవర్నర్, రాష్ట్రపతితో చర్చలు జరుపుతుంది. కొన్ని సార్లు మధ్యవర్తిత్వం కూడా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ మధ్య సఖ్యత కోసం రాజనీతిజ్ఞత అనేది బాగా అక్కరకొస్తుంది’’ అని మెహతా వాదించారు. దీనిపై సీజేఐ గవాయ్ స్పందించారు. ‘‘ ఈ ప్రక్రియలో ఏదైనా తప్పు జరిగితే ప్రత్యామ్నాయంఉండాలి కదా. రాజ్యాంగానికి పరిరక్షకులుగా కోర్టులున్నాయి. అందుకే ఇలాంటి ప్రత్యామ్నాయాన్ని సైతం రాజ్యాంగానికి ఆపాదించేలా ఉండాలి’’ అని ఆయన అన్నారు. దీనిపై మెహతా మాట్లాడారు. ‘‘ ఏదైనా అంశాన్ని మనకు అనుగుణంగా ఆపాదించుకోవడం వేరు. రాజ్యాంగానికి సరిపోయేలా చూడడం వేరు. రాజ్యాంగబద్ధ సంస్థలతో ఏదైనా అంశాన్ని పరిష్కరించుకోవాలన్న సందర్భాల్లో కొంత వెసులుబాట్లు కల్పించాలి’’ అని అన్నారు.

పెట్టుబడులతో రండి!
మాస్కో: సంక్లిష్టమైన భౌగోళిక సవాళ్లు ఎదుర్కోవడానికి భారత్–రష్యా కలిసికట్టుగా పనిచేయాలని, ఇందుకోసం సృజనాత్మక, నూతన మార్గాలు అన్వేషించాలని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పిలుపునిచ్చారు. రెండు దేశాలు పరస్పర సహకార ఎజెండాను మరింత విస్తృతపర్చుకోవాలని, వైవిధ్య భరితంగా మార్చుకోవాలని చెప్పారు. మరిన్ని ఉమ్మడి కార్యక్రమాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యంలో వైవిధ్యం కృషి చేయాలని అన్నారు. భారత్–రష్యా సంబంధాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడం, విభిన్నమైన వాణిజ్య సంబంధాలు నెలకొల్పడం మనం ఆశయం కావాలని స్పష్టం చేశారు. జైశంకర్ బుధవారం మాస్కోలో రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్మినిస్టర్ డెనిస్ మంతురోవ్తో సమావేశమయ్యారు. భారత్–రష్యా సంబంధాలు, తాజా పరిణామలపై చర్చించారు. ఇండియా–రష్యా ఇంటర్–గవర్నమెంటల్ కమిషన్ ఫర్ ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్, టెక్నాలాజికల్, కల్చరల్ కో–ఆపరేషన్(ఐఆర్ఐజీసీ–టీఈసీ) ఫ్రేమ్వర్క్లో భాగంగా ఈ చర్చలు జరిగాయి. భారత్పై అమెరికా ప్రభుత్వం భారీగా టారిఫ్లు విధించిన నేపథ్యంలో భారత్–రష్యా సంబంధాల ఆవశ్యకతను జైశంకర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధానంగా ఇరుదేశాల నడుమ ఆర్థిక బంధం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పూర్తి సామర్థ్యం మేరకు కలిసి పనిచేద్దాం భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని రష్యా పారిశ్రామికవేత్తలకు జైశంకర్ విజ్ఞప్తి చేశారు. వ్యాపార అభివృద్ధికి భారత్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని చెప్పారు. నూతన రంగాల్లోనూ స్నేహ సంబంధాలను విస్తరింపజేసుకోవాలని సూచించారు. వ్యాపార, పెట్టుబడుల సంబంధాల్లో పూర్తి సామర్థ్యం మేరకు కలిసి పని చేద్దామని కోరారు. ఇందుకోసం కొన్ని లక్ష్యాలు, గడువులు నిర్దేశించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సమున్నత లక్ష్య సాధన కోసం మనకు మనమే సవాలు విసురుకోవాలని వ్యాఖ్యానించారు. చేతులు కలిపి ఉమ్మడిగా పనిచేస్తే నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి సాధించవచ్చని స్పష్టంచేశారు. ఐఆర్ఐజీసీకి సంబంధించిన వేర్వేరు వర్కింగ్ గ్రూప్లు, బిజినెస్ ఫోరమ్ మధ్య సహకారం కోసం ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకుందామని ప్రతిపాదించారు. ఒకరి ఆలోచనలను మరొకరితో పంచుకోవాలన్నారు. ఇండియా, రష్యాలోని వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఐఆర్ఐజీసీ తోడ్పడుతుందని తెలిపారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, కారి్మకులను రష్యాకు పంపించబోతున్నట్లు జైశంకర్ చెప్పారు. సెర్గీ లావ్రోవ్తో సమావేశం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమతుల, స్థిరమైన విధానంలో విస్తరింపజేసుకోవాలని భారత్, రష్యా నిర్ణయించుకున్నాయి. వాణిజ్యం విషయంలో నియంత్రణలు, అవరోధాలను వేగంగా పరిష్కరించుకోవాలని జైశంకర్ చెప్పారు. ఆయన రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్తో భేటీ అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో స్థిరంగా కొనసాగుతున్న అతిపెద్ద సంబంధాల్లో భారత్–రష్యా సంబంధాలు కూడా ఉన్నాయని తెలిపారు. వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలని జైశంకర్, లావ్రోవ్ నిర్ణయానికొచ్చారు.

రోగమొస్తే జేబు గుల్లే
గుంటూరు జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి భార్య జనవరిలో అనారోగ్యం పాలయ్యారు. చికిత్స కోసం కుటుంబసభ్యులు కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఎంప్లాయీ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్) కార్డు ఉందని, నగదు రహిత వైద్యం అందించాలని కుటుంబసభ్యులు కోరారు. కానీ, ‘ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. డబ్బు కట్టి వైద్యం చేయించుకునేట్లైతే ఉండండి. లేదంటే వెళ్లిపోండి’ అని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది. చేసేదేం లేక రూ.3 లక్షలకు పైగా బిల్లును సొంతంగా చెల్లించారు. రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేస్తే, ప్రభుత్వం ఇప్పటికీ మంజూరు చేయలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన పశు సంవర్ధక శాఖ ఉద్యోగి కాలు నొప్పితో వైద్యులను సంప్రదించగా శస్త్రచికిత్స చేయాలన్నారు. ఈహెచ్ఎస్ కింద చికిత్స కోసం కర్నూలులోని నెట్వర్క్లోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా... ‘‘ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. ఉచిత చికిత్సలు అందించలేం’’ అని వైద్యులు చెప్పారు. ఫీజు కట్టి రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.సాక్షి, అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలమంది ఉద్యోగులు, పింఛనర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు నిదర్శనాలు. ఈ రెండు ఘటనలు చంద్రబాబు ప్రభుత్వం వారి ఆరోగ్య భద్రతను పూర్తిగా గాలికి వదిలేసిందనేందుకు తార్కాణాలు. నెలనెల ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)కు తమ వాటా చెల్లిస్తున్నా... ఆపద సమయంలో అక్కరకు రావడం లేదనేందుకు సాక్ష్యాలు. ఉద్యోగులు, పింఛనర్లు అనారోగ్యంతో నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్తే.. నగదు రహిత వైద్యం లభించడం లేదు. దీంతో జేబులోంచి డబ్బు పెట్టాల్సి వస్తోంది. రూ.లక్షల్లో అప్పులు చేసి వైద్యం చేయించుకుని రీయింబర్స్మెంట్కు దరఖాస్తు పెట్టుకుంటే నెలల తరబడి మంజూరు చేయడంలేదు. రాష్ట్రంలో ఈహెచ్ఎస్పై 22 లక్షల మందికి పైగా ఉద్యోగులు, పింఛనర్లు, వారి కుటుంబసభ్యులు ఆధారపడి ఉన్నారు. 50:50 నిష్పత్తిలో ఉద్యోగులు, ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తున్నారు. నిరుడు చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక నిరుపేదల ఆపద్బాంధవి ఆరోగ్యశ్రీతో పాటు, ఈహెచ్ఎస్ను అటకెక్కించారు. చికిత్సలు చేసిన ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు మంజూరు చేయడం మానేశారు. ఏకంగా రూ.320 కోట్ల మేర ఈహెచ్ఎస్ బిల్లులు బకాయి పెట్టారు. అరోగ్యశ్రీ బిల్లుల బకాయిలు రూ.4 వేల కోట్లకు పైమాటే. ఇవన్నీ నెలల తరబడి పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలుసార్లు నెట్వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు ప్రభుత్వానికి వివరించారు. అయినప్పటికీ స్పందన కొరవడడంతో ఆస్పత్రులు పూర్తిగా ఈహెచ్ఎస్ సేవలను నిలిపివేశాయి. కేన్సర్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ, లివర్, ఇతర పెద్ద అనారోగ్య సమస్యలతో పాటు ప్రమాదాల్లో గాయాలపాలైనవారు ఉచిత వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ 2019కి ముందు నాటి పరిస్థితి... వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీతో పాటు, ఈహెచ్ఎస్ పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం బలోపేతం చేసింది. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండే అన్ని నెట్వర్క్ ఆస్పత్రులకు ఈహెచ్ఎస్ సేవలను విస్తరించింది. అంతేకాకుండా 2019కు ముందు చంద్రబాబు ప్రభుత్వం తొలగించిన ప్రొసీజర్లను పునరుద్ధరించింది. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడితే... ఉద్యోగులు, పింఛనర్లు వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకూడదని 46 కేన్సర్ ప్రొసీజర్లను పథకంలోకి చేర్చింది. మొత్తంమ్మీద 2014–19 మధ్య కంటే 2019–24 కాలంలో ఈహెచ్ఎస్ లబ్ధిదారులకు రెట్టించిన ఆరోగ్య భరోసా లభించింది. 2014–19 సమయంలో టీడీపీ పాలనలో రూ.976 కోట్లు ఖర్చు చేయగా, 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.1,427 కోట్లు ఖర్చు పెట్టారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఈహెచ్ఎస్కు 2019కి ముందునాటి పరిస్థితి దాపురించిందని లబ్దిదారులు వాపోతున్నారు. కార్డులు ఎక్కడా ఆమోదించడం లేదు ఈహెచ్ఎస్ కార్డులు ఎక్కడా ఆమోదించడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం రూ.2 లక్షల వరకే మెడికల్ రీయింబర్స్మెంట్ ఇస్తోంది. ఎక్కువ ఖర్చు పెట్టుకున్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. రీయింబర్స్మెంట్ పరిమితిని రూ.5 లక్షలు చేయాలి. ఉద్యోగి కాంట్రిబ్యూషన్ ప్రతి నెల నేరుగా ట్రస్ట్కు జమ చేయాలి. ఈ విధానం అమలైతేనే మేలు జరుగుతుంది. ప్రొసీజర్స్ రేట్లను సమీక్షించి పెంచాలి. ప్రస్తుతం ఉన్న ధరలతో నష్టపోతున్నామని ఆస్పత్రులు చెబుతున్నాయి. –కె.వెంకట్రామిరెడ్డి, అధ్యక్షులు, సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రభుత్వం– ఆస్పత్రుల మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నారు ఉద్యోగుల నుంచి ఠంఛన్గా ఈహెచ్ఎస్ వాటా తీసుకుంటున్నా... ప్రభుత్వం ట్రస్ట్కు ఆ డబ్బు జమ చేయడం లేదు. ట్రస్ట్ ఆసుపత్రులకు బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో అప్పు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రులు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. రూ.5 లక్షలు పెట్టి వైద్యం చేయించుకుంటే రీయింబర్స్మెంట్ కేవలం రూ.90 వేలు ఇస్తున్నారు. ఇదేమని అడిగితే ఆమోదించిన ప్రొసీజర్ రేట్లు ప్రకారం అంతే వస్తుందని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు చెబుతున్నారు. అటు ఆస్పత్రులు, ఇటు ప్రభుత్వం మధ్య ఉద్యోగులు నలిగిపోతున్నారు. ఓపీ, వార్షిక ఆరోగ్య చెకప్లతో పథకాన్ని బలోపేతం చేస్తామన్న హామీలు నీటి మీద రాతలే అయ్యాయి. ఐపీ సేవలు అందక ఉద్యోగులు, పింఛనర్లు నరకం చూస్తున్నారు. –బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్
‘18 ఏళ్ల వారికి ఆధార్ ఆపేస్తున్నాం’
చరిత్ర చెప్పకుండా.. పరువు కాపాడుతూ...
టిబెట్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్
లోక్సభలో 12, రాజ్యసభలో 14
ఆసియాకు డబుల్ ఇంజిన్లు భారత్, చైనా!
పుతిన్తో జైశంకర్ భేటీ
యాక్షన్ షురూ..రీ ఎంట్రీకి రెడీ అయిన స్టార్స్
శ్రీకాంత్కు పెరోల్.. అడ్డంగా దొరికిన హోంమంత్రి అనిత
రాజ్యాంగవ్యవస్థలు పనిచేయకుంటే ఆ పని కోర్టులే చేస్తాయి
పెట్టుబడులతో రండి!
కేపీహెచ్బీలో వేశ్యను బుక్ చేసుకోబోయి..
'వార్ 2' ఎఫెక్ట్.. నాగవంశీకి బిగ్ ఆఫర్?
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలలో పురోభివృద్ధి
బంగారం ధరలు యూటర్న్!
థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు
కమెడియన్ రాకేశ్ కూతురి 1st బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
చెత్త ఎఫైర్లు పెట్టుకున్నా.. మగ తోడు అవసరం లేదు : సీనియర్ హీరోయిన్
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
బంగారం, వెండి ధరలు.. ఒక్కసారిగా రివర్స్!
కంగారు పడక్కర్లేద్సార్! అది అమెరికాలో!!
వాళ్లు ఓటేసి నన్ను గెలిపించినా.. ఆ భారం మోయాల్సింది నువ్వే!!
అనుపమ 'పరదా' సినిమా రివ్యూ
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ఆగడాలకు చెక్ పెట్టాల్సిందే సార్!
...గెలవకుండా చేస్తేసరి!
కోపమొస్తే కొట్టేస్తా.. మీరేమైనా దేవుళ్లా?.. నోరెళ్లబెట్టిన జడ్జిలు
డీఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి
ఆ ముగ్గురు ఎందుకు?.. ఈ జట్టుతో కప్ గెలవలేరు: భారత మాజీ కెప్టెన్ ఫైర్
అదృష్టం ఏంటంటే ఈ ప్రపంచంలో మీకెవరూ స్నేహితులేర్సార్!
హలో నేను కలెక్టర్ను మాట్లాడుతున్నా..
మరో అద్భుతం భారతీయ రైల్వే ఖాతాలో..
‘18 ఏళ్ల వారికి ఆధార్ ఆపేస్తున్నాం’
చరిత్ర చెప్పకుండా.. పరువు కాపాడుతూ...
టిబెట్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్
లోక్సభలో 12, రాజ్యసభలో 14
ఆసియాకు డబుల్ ఇంజిన్లు భారత్, చైనా!
పుతిన్తో జైశంకర్ భేటీ
యాక్షన్ షురూ..రీ ఎంట్రీకి రెడీ అయిన స్టార్స్
శ్రీకాంత్కు పెరోల్.. అడ్డంగా దొరికిన హోంమంత్రి అనిత
రాజ్యాంగవ్యవస్థలు పనిచేయకుంటే ఆ పని కోర్టులే చేస్తాయి
పెట్టుబడులతో రండి!
కేపీహెచ్బీలో వేశ్యను బుక్ చేసుకోబోయి..
'వార్ 2' ఎఫెక్ట్.. నాగవంశీకి బిగ్ ఆఫర్?
ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి.. వ్యాపారాలలో పురోభివృద్ధి
థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు
బంగారం ధరలు యూటర్న్!
చెత్త ఎఫైర్లు పెట్టుకున్నా.. మగ తోడు అవసరం లేదు : సీనియర్ హీరోయిన్
బంగారం, వెండి ధరలు.. ఒక్కసారిగా రివర్స్!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి
కంగారు పడక్కర్లేద్సార్! అది అమెరికాలో!!
వాళ్లు ఓటేసి నన్ను గెలిపించినా.. ఆ భారం మోయాల్సింది నువ్వే!!
అనుపమ 'పరదా' సినిమా రివ్యూ
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ఆగడాలకు చెక్ పెట్టాల్సిందే సార్!
...గెలవకుండా చేస్తేసరి!
కోపమొస్తే కొట్టేస్తా.. మీరేమైనా దేవుళ్లా?.. నోరెళ్లబెట్టిన జడ్జిలు
డీఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి
ఆ ముగ్గురు ఎందుకు?.. ఈ జట్టుతో కప్ గెలవలేరు: భారత మాజీ కెప్టెన్ ఫైర్
అదృష్టం ఏంటంటే ఈ ప్రపంచంలో మీకెవరూ స్నేహితులేర్సార్!
హలో నేను కలెక్టర్ను మాట్లాడుతున్నా..
మరో అద్భుతం భారతీయ రైల్వే ఖాతాలో..
ఆస్ట్రేలియా టూర్.. రోహిత్ శర్మ ఊహించని నిర్ణయం!?
సినిమా

బిగ్బాస్ షోలో మైక్ టైసన్? పారితోషికంపై చర్చలు!
బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన షో బిగ్బాస్ (Bigg Boss Reality Show). సెలబ్రిటీల ముచ్చట్లు, గొడవలు, జీవిత కథలు, వారి కోపావేశాలు.. ఇలా ప్రతి విషయాన్ని దగ్గరుండి చూడటమంటే జనాలకు భలే సరదా! అందుకే బిగ్బాస్ ఏళ్ల తరబడి విజయవంతంగా రన్ అవుతోంది. ఇకపోతే ఈసారి ఈ రియాలిటీ షోలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ భాగం కానున్నారంటూ ప్రచారం జరుగుతోంది. తెలుగు బిగ్బాస్ అనుకునేరు, కాదు! హిందీ బిగ్బాస్ 19వ సీజన్లో ఆయన్ను వైల్డ్ కార్డ్గా ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట!వైల్డ్ కార్డ్గా..పారితోషికం గురించి చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. అన్నీ కుదిరితే అక్టోబర్లో బిగ్బాస్ హౌస్లో మైక్ టైసన్ అడుగుపెడతాడట! ఒక వారం లేదా పదిరోజులు మాత్రమే ఆయన హౌస్లో ఉంటాడని సమాచారం. టైసన్ ఎంట్రీ ఇస్తే షోకు మరింత క్రేజ్ వస్తుందని బిగ్బాస్ టీమ్ యోచిస్తోంది. మరి వీరి ప్లాన్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి! హిందీ బిగ్బాస్ 19వ సీజన్ ఆగస్టు 24న ప్రారంభం కానుంది.తెలుగు సినిమాలో..కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. సుదీర్ఘ కెరీర్లో 50 విజయాలు సాధించిన 58 ఏళ్ల టైసన్... అందులో 44 బౌట్లను నాకౌట్ చేశాడు. 2005లో బాక్సింగ్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తర్వాత పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీలోనూ అతిథి పాత్రలో కనిపించాడు.చదవండి: నటి రెండో పెళ్లి.. తోడుగా నిలబడ్డ 12 ఏళ్ల కూతురు

థియేటర్లలో పరదా..ఈ శుక్రవారం ఓటీటీల్లో 16 సినిమాలు!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పోటీలో లేవు. అనుపమ పరమేశ్వరన్ పరదా, సత్యరాజ్, ఉదయభాను ప్రధానపాత్రల్లో వచ్చిన త్రిబాణధారి బార్బరిక్ లాంచి సినిమాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి. దీంతో ఈ వారంలో వీకెండ్లో పరదా మూవీ కోసం మాత్రమే సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ సినిమాలు సందడి చేస్తుంటాయి. ఎప్పటిలాగే ఈ వారంలో కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. వాటిలో తమిళ చిత్రం సార్ మేడమ్, బాలీవుడ్ మూవీ మా, మారీషన్ లాంటి డబ్బింగ్ సినిమాలు ఆసక్తి పెంచుతున్నాయి. ఫ్రైడే ఒక్క రోజులోనే దాదాపు 16 చిత్రాలు సందడి చేయనున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి. అమెజాన్ ప్రైమ్సార్ మేడమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 22ఎఫ్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22నెట్ఫ్లిక్స్అబాండడ్ మ్యాన్ (టర్కిష్ సినిమా) - ఆగస్టు 22ఏయిమా (కొరియన్ సిరీస్) - ఆగస్టు 22లాంగ్ స్టోరీ షార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22మా (హిందీ సినిమా) - ఆగస్టు 22మారిషన్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 22ద ట్రూత్ అబౌట్ జెస్సీ స్మోలెట్? (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22బాన్ అపెట్టీ, యువర్ మెజస్టీ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 23జియో హాట్స్టార్ఏనీ మేనీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22పీస్ మేకర్ -సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 22జీ5ఆమర్ బాస్ (బెంగాలీ సినిమా) - ఆగస్టు 22ఆపిల్ ప్లస్ టీవీఇన్వేజన్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) - ఆగస్టు 22ఆహాకొత్తపల్లిలో ఒకప్పుడు (తెలుగు సినిమా) - ఆగస్టు 22సన్ నెక్ట్స్కపటనాటక సూత్రధారి (కన్నడ సినిమా) - ఆగస్టు 22కోలాహాలం(మలయాళ సినిమా)- ఆగస్టు 22లయన్స్ గేట్ ప్లేఉడ్ వాకర్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 22

మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఈ ఏడాది కూడా అక్కడేనా?
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చేసింది. ఈనెల 22న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే గ్రాండ్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే రెడీ అయిపోయారు. దీంతో ఒక్కరోజు ముందుగానే అభిమానులకు విశ్వంభర బిగ్ అప్డేట్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ చిరు 70వ బర్త్డే మరింత గ్రాండ్గా జరుపుకోనున్నారు.తన 70వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం చిరంజీవి ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. తన ఫ్యామిలీతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఎప్పటిలాగే బెంగళూరుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లో శ్రీజ కూతురు, తన మనవరాలితో మెగాస్టార్ వెళ్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. చిరువెంట ఆయన భార్య సురేఖతో పాటు చిన్నకూరుతు శ్రీజ సైతం విమానాశ్రయంలో కనిపించారు. ఈ బర్త్ డే వేడుకల్లో రామ్ చరణ్, ఉపాసనతో పాటు.. వీరి కుమార్తె క్లీంకారా కూడా పాల్గొననున్నారు.ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా.. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ స్వయంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

అనుపమ 'పరదా' సినిమా రివ్యూ
'రివ్యూలు నచ్చితేనే మా సినిమా చూడండి'.. రీసెంట్గా ప్రమోషన్లలో హీరోయిన్ అనుపమ చెప్పిన మాట ఇది. చాలా నమ్మకంతో ఆగస్టు 22న రిలీజ్ పెట్టుకుని, రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేశారు. ఆ చిత్రమే 'పరదా'. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్తో తీసిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించింది. సంగీత, మలయాళ నటి దర్శన రాజేంద్రన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?పడతి అనే గ్రామంలో ఈడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల ముఖానికి పరదా కప్పుకొని తిరుగుతుంటుంది. దానికి ఓ కారణం ఉంటుంది. పొరపాటున ఎవరైనా పరదా తీస్తే వాళ్లు.. గ్రామదేవత జ్వాలమ్మకు ఆత్మాహుతి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదే ఊరిలో ఉండే సుబ్బు(అనుపమ), రాజేశ్ (రాగ్ మయూర్) ప్రేమలో ఉంటారు. వీళ్లకీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయిస్తారు. సరిగ్గా నిశ్చితార్థం రోజున సుబ్బు ఫొటో కారణంగా.. ఈమె ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. తన తప్పు లేదని చెబుతున్నా సరే వినరు. దీంతో అనుకోని పరిస్థితుల మధ్య సుబ్బు తన ఊరి దాటి ధర్మశాల వెళ్లాల్సి వస్తుంది. ఈమెకు తోడుగా రత్న(సంగీత), అమిష్ట(దర్శన రాజేంద్రన్) కూడా వెళ్తారు. ఇంతకీ ధర్మశాల ఎందుకు వెళ్లారు? చివరకు సుబ్బు.. పరదా తీసిందా లేదా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?గత కొన్నాళ్లలో హీరో సెంట్రిక్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కాస్త తగ్గాయని చెప్పొచ్చు. ఆ లోటుని భర్తీ చేసేందుకు వచ్చిన చిత్రమే 'పరదా'. ఇందులో హీరోహీరోయిన్లు అంటూ ఎవరూ ఉండరు. కథే మెయిన్ హీరో.పడతి గ్రామంలో జ్వాలమ్మ జాతరతో సినిమా మొదలవుతుంది. ఈ ఊరిలోని ఈడొచ్చిన అమ్మాయిలు, మహిళలు ఎందుకు పరదా కప్పుకోవాల్సి వచ్చిందనేది మొదటి పది నిమిషాల్లోనే తోలుబొమ్మలాట కథతో చెప్పేస్తారు. తర్వాత సుబ్బు, రాజేశ్ ప్రేమ.. నిశ్చితార్థం.. అనుకోని అవాంతరం వల్ల అది ఆగిపోవడం.. ఇలా కథలో సంఘర్షణ ఏర్పడుతుంది. తన తప్పు లేదని చెబుతున్నా సరే సుబ్బుని ఆత్మాహుతి చేసుకోవాలని ఊరి పెద్దలు ఆదేశించడం.. తర్వాత అనుకోని పరిస్థితుల్లో సుబ్బు.. మరో ఇద్దరు మహిళలతో కలిసి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వెళ్లాల్సి రావడం జరుగుతుంది. తర్వాత ఏమైంది? ఈ ప్రయాణంలో ఏం తెలుసుకున్నారనేది తెలియాలంటే మూవీ చూడాలి.ఒకప్పటితో పోలిస్తే అమ్మాయిల్లో చైతన్యం పెరిగింది. మగాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా భిన్న రంగాల్లో రాణిస్తున్నారు. అయినా సరే కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాల పేరుతో మహిళలని ఇబ్బంది పెడుతున్నారు. ఆచారం, సంప్రదాయం అని చెప్పి బయట ప్రపంచం చూడనీయకుండా చేస్తున్నారు. అలాంటి ఓ ఊరికి చెందిన అమ్మాయి.. తన ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ ఎలాంటి సాహసం చేసింది? మూఢనమ్మకాలపై ఎలా పోరాడింది అనే కల్పిత కథతో తీసిన చిత్రమే ఇది.సినిమా ప్రారంభంలో జెయింట్ వీల్ ఎక్కడానికే సుబ్బు చాలా భయపడుతుంది. కానీ పరిస్థితుల కారణంగా ఎత్తయిన ఎవరెస్ట్ వరకు వెళ్తుంది. తనలో భయాన్ని పోగొట్టుకుంటుంది. మూవీ అంతా సుబ్బు పాత్ర పరదా కప్పుకొని ఉంటుంది. ఆమె పూర్తిగా పరదా తీసేసే సీన్లో సీతాకోక చిలుక రిఫరెన్స్ మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. సుబ్బుతో పాటు జర్నీ చేసే రత్న ఓ గృహిణి, ఆమిష్ట ఓ ఇంజినీర్. ఈ పాత్రల్ని ప్రారంభించిన తీరు, ముగించిన తీరు కూడా మెచ్చుకునేలా ఉంటుంది. సెకండాఫ్ మొదలవగానే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ వస్తుంది. ఉన్నది కాసేపే అయినా.. ఆయన చెప్పే ఓ స్టోరీ, డైలాగ్స్ మంచి ఎమోషనల్గా అనిపిస్తాయి. క్లైమాక్స్లో సుబ్బు పాత్ర.. దేవుడికి కట్టిన వస్త్రాల్ని తగలబెట్టే సీన్, ఊరి ప్రజల కళ్లు తెరిపించింది అనేలా విజువల్గా చూపించడం బాగుంది.అన్ని ప్లస్సులేనా మైనస్సులు లేవా అంటే ఉన్నాయి. సినిమా అంతా కూడా మహిళలు, వారి చైతన్యం అనేలా సాగుతుంది. రెగ్యులర్ ప్రేక్షకులందరికీ ఇది నచ్చకపోవచ్చు. కానీ అమ్మాయిలు మాత్రం తప్పకుండా ఈ మూవీ చూడాలి. చూస్తున్నంతసేపు కచ్చితంగా ఎమోషనల్ అవుతారు.ఎవరెలా చేశారు?సుబ్బు పాత్రలో అనుపమ అద్భుతంగా నటించింది. ఈ పాత్ర ప్రారంభంలో బిడియం, భయం, ప్రేమ లాంటి అంశాలతో చలాకీగా కనిపిస్తుంది. తర్వాత సీరియస్ టోన్లోకి మారుతుంది. చివరకొచ్చేసరికి ఫియర్లెస్ ఉమన్గా మారడం లాంటి మార్పు కిక్ ఇస్తుంది. రత్నగా చేసిన సంగీత క్యారెక్టర్ కూడా చాలామంది గృహిణులకు కనెక్ట్ అవుతుంది. ఓ సీన్లో ఈమె తన భర్త క్యారెక్టర్తో చేసే కామెడీ భలే నవ్విస్తుంది. పెళ్లి, పిల్లలు వద్దు అంటూ ఇండిపెండెంట్గా ఉండే మహిళలకు దర్శన రాజేంద్రన్ చేసిన అమిష్టా క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. లీడ్ రోల్స్ చేసిన ఈ ముగ్గురు కూడా బాగా చేశారు. రాగ్ మయూర్, 'బలగం' సుధాకర్ రెడ్డి.. ఇలా మిగిలిన వాళ్లు కూడా తమ వంతు న్యాయం చేశారు.టెక్నికల్ టీమ్ కూడా సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం అక్కడక్కడ కాస్త లౌడ్గా అనిపించింది కానీ మిగతా చోట్ల సెట్ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్గా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల గురించి చెప్పుకోవాలి. గతంలో సినిమా బండి, శుభం అని సినిమాలు తీశాడు. అవి మోస్తరుగా అనిపించాయి కానీ ఈ మూవీతో తనలో చాలానే విషయం ఉందని నిరూపించాడు. ఫిమేల్ సెంట్రిక్ తరహా సినిమాలంటే ఇష్టముంటే మాత్రం 'పరదా' మిస్ కావొద్దు.- చందు డొంకాన
న్యూస్ పాడ్కాస్ట్

పెద్దల కోసం పేదల భూములు... ‘నాలా’ చట్టం రద్దుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలపడంపై సర్వత్రా ఆందోళన

నింద మాటున ప్రభుత్వాలను కూల్చేస్తారా?... ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల తొలగింపు బిల్లులపై లోక్సభలో విపక్షాల ఆగ్రహం

దివ్యాంగుల జీవితాల్లో పింఛను చిచ్చు... అనర్హులని పేర్కొంటూ పింఛను నిలిపివేస్తున్నట్టు ఏపీలో కూటమి ప్రభుత్వం నోటీసులు

మాతోనే బేరసారాలా?. మద్యం కేసులో ప్రాసిక్యూషన్ తీరుపై ఏసీబీ ప్రత్యేక కోర్టు తీవ్ర ఆక్షేపణ

ఆంధ్రప్రదేశ్లో కారుచౌకగా భూముల విక్రయాలు.. ఎంత భూమైనా 99 పైసలకే.. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్..

ఏపీలో విద్యుత్ కొనుగోలులో మరో కనికట్టు... అధిక ధరకు సోలార్ విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కూటమి ప్రభుత్వం

ఎర్రకోట సాక్షిగా పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక

రిగ్గింగ్ ఎన్నికల్లో సిగ్గుపడే గెలుపు.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అడ్డదారిలో టీడీపీ విజయం

చంద్రబాబు మోసకారి... పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ...

ఎన్నికలకే కళంకం!. అత్యంత దుర్మార్గంగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నిక పోలింగ్. పిండారీలు, థగ్గులు, బందిపోట్లు తమ ముందు దిగదుడుపేనని చాటిన టీడీపీ కాలకేయులు
క్రీడలు

భారత్ గురి ‘బంగారం’
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ సీనియర్ విభాగంలో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. గురువారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్కు బంగారు పతకం లభించింది. రుద్రాంక్ష్ పాటిల్, అర్జున్ బబూటా, అంకుశ్ జాదవ్లతో కూడిన భారత జట్టు 1892.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని గెల్చుకుంది. రుద్రాంక్ష్ 632.3 పాయింట్లు, అర్జున్ 631.6 పాయింట్లు, అంకుశ్ 628.6 పాయింట్లు స్కోరు చేశారు. అయితే వ్యక్తిగత విభాగంలో రుద్రాంక్ష్ 207.6 పాయింట్లతో నాలుగో స్థానంలో, అర్జున్ 185.8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. సత్పయేవ్ (కజకిస్తాన్; 250.1 పాయింట్లు) స్వర్ణం... లూ డింగ్కి (చైనా; 249.8 పాయింట్లు) రజతం... హజున్ పార్క్ (కొరియా; 228.7 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఇదే వేదికపై జరుగుతున్న ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో భారత షూటర్లు మెరిశారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్, వ్యక్తిగత విభాగంలో భారత్కే స్వర్ణాలు దక్కాయి.వ్యక్తిగత విభాగంలో అభినవ్ షా 250.4 పాయింట్లతో పసిడి పతకం నెగ్గగా... టీమ్ విభాగంలో అభినవ్, హిమాంశు, ప్రణవ్లతో కూడిన భారత జట్టు 1890.1 పాయింట్లతో బంగారు పతకాన్ని నెగ్గింది. జూనియర్ మహిళల స్కీట్ ఈవెంట్లో మాన్సి స్వర్ణం, యశస్వి రజతం... జూనియర్ పురుషుల స్కీట్ ఈవెంట్లో హర్మెహర్ రజతం, జ్యోతిరాదిత్య సిసోడియా కాంస్యం గెలిచారు. హర్మెహర్, జ్యోతిరాదిత్య, అతుల్లతో కూడిన బృందం టీమ్ స్కీట్ ఈవెంట్లో బంగారు పతకాన్ని దక్కించుకుంది. ఓవరాల్గా భారత్ 16 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో 31 పతకాలతో ‘టాప్’లో ఉంది.

టాపార్డర్ విఫలం
బ్రిస్బేన్: టాపార్డర్ విఫలమవడంతో... ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుతో గురువారం ప్రారంభమైన ఏకైక అనధికారిక టెస్టులో భారత మహిళల ‘ఎ’ జట్టు కష్టాల్లో పడింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన రాధా యాదవ్ సారథ్యంలోని భారత మహిళల ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట నలిచే సమయానికి 23.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (38 బంతుల్లో 35; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడింది. మరో ఓపెనర్ నందిని కశ్యప్ (0), ధారా గుజ్జర్ (0) డకౌట్ కాగా... తేజల్ హసబి్నస్ (9; 2 ఫోర్లు), తనుశ్రీ సర్కార్ (13; 2 ఫోర్లు) విఫలమయ్యారు. కెప్టెన్ రాధా యాదవ్ (8 బ్యాటింగ్; 1 ఫోర్), రాఘ్వీ బిస్త్ (26 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా టి20 సిరీస్ను 0–3తో కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు, వన్డే సిరీస్ను 2–1తో కైవసం చేసుకుంది. ఏకైక అనధికారిక టెస్టుకు వర్షం ఆటంకం కలిగించగా... ఆట సాగిన కాసేపులోనే భారత జట్టు వెనుకబడిపోయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఎదురునిలవలేక మన బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు వరుస కట్టారు. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు బౌలర్లలో జార్జియా 3 వికెట్లు పడగొట్టింది.

భారత్, పాక్ పోరుకు రాజముద్ర
ఒకవైపు పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం... మన దేశంలో ఉన్న పాక్ జాతీయులను వెంటనే వెనక్కి పంపడంతో పాటు అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటూ ప్రభుత్వ స్పందన... ఇలాంటి స్థితిలో శత్రుదేశం పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్లను బాయ్కాట్ చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు... స్వయంగా టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ తటస్థ వేదికల్లో కూడా ఆడకూడదంటూ వ్యాఖ్యలు ... వెటరన్ ఆటగాళ్ల ‘వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్’లో పాక్తో రెండు మ్యాచ్ల్లో బరిలోకి దిగకుండా తప్పుకున్న భారత బృందంపై ప్రశంసలు...మరోవైపు ‘ఆ మ్యాచ్’ కోసమేనా అన్నట్లుగా ఆసియా కప్ వేదిక భారత్ నుంచి యూఏఈకి మారడం... కొద్ది రోజులకే షెడ్యూల్ విడుదల... జోరుగా ప్రచారం మొదలు పెట్టిన ప్రసారకర్తలు... భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్కు 10 సెకన్ల ప్రకటనకు రూ. 16 లక్షల రేటు... చూస్తుండగానే టోర్నీలో పాల్గొనే జట్ల ప్రకటన... అయినా సరే చివరి నిమిషంలో మ్యాచ్ రద్దు కావచ్చని, లేదా భారత్ ఆడకుండా పాయింట్లు ఇవ్వవచ్చని చర్చ... కానీ అలాంటి అవసరం లేదని తేలిపోయింది. ఇప్పుడు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి భారత్, పాక్ పోరుకు ఆమోద ముద్ర వేసింది. న్యూఢిల్లీ: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న దుబాయ్లో జరిగే మ్యాచ్ నిర్వహణపై ఉన్న సందేహాలు తొలగిపోయాయి. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ను చూసేందుకు అమితోత్సాహంతో సిద్ధం కావచ్చు! ఆసియా కప్లో పాక్తో తలపడేందుకు కేంద్ర ప్రభుత్వం మన జట్టుకు అనుమతి ఇచ్చింది. ఇతర దేశాలు కూడా పాల్గొంటున్న ‘మల్టీలేటరల్ ఈవెంట్’ కావడంతో ఈ మ్యాచ్లో ఆడటంపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం లేదని ప్రకటించింది. టోర్నీ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ మ్యాచ్లపై ఉన్న ఆసక్తి, ప్రాధాన్యతను బట్టి చూస్తే తాజా ప్రకటనతో వాణిజ్యపరంగా భాగస్వాములందరూ సంతోషించే నిర్ణయం వెలువడటం విశేషం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు ఆడేందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేసింది. మార్గదర్శకాలతో స్పష్టత... భారత్, పాకిస్తాన్ మధ్య నిజానికి 2012–13 నుంచి ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. కానీ ఇరు జట్లు ఐసీసీ టోర్నీలైన వన్డే, టి20 వరల్డ్ కప్లు, చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ మ్యాచ్లలో తలపడుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ప్రకటనలో కొత్తగా పేర్కొన్న అంశం ఏమీ లేదు. అయితే దీనికే మరింత స్పష్టతనిస్తూ అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేసింది. సరిహద్దు దేశాల మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో క్రీడా సంబంధాల విషయంలో కేంద్రం వీటిని ప్రకటించింది. ‘క్రీడలకు సంబంధించి పాకిస్తాన్తో ఎలా వ్యవహరించాలనే విషయంపై ప్రభుత్వం తమ విధానాన్ని వెల్లడిస్తోంది. ఇరు జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఉండవు. మన జట్టు అక్కడికి వెళ్లి ఆడేందుకు లేదా ఆ జట్టు ఇక్కడికి వచ్చే ఆడేందుకు కూడా అనుమతించేది లేదు. అయితే పలు ఇతర జట్లతో ముడిపడి ఉన్న టోర్నీల విషయంలో ఆయా క్రీడల అంతర్జాతీయ సంఘాల నిబంధనలను, మన ఆటగాళ్లను కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. భారత్ పెద్ద ఈవెంట్ల వేదికగా మారుతున్న అంశాన్ని కూడా చూడాలి. కాబట్టి ఇలాంటి ఈవెంట్లలో పాక్ ఆడుతున్నా సరే మన జట్టు పాల్గొనవచ్చు. భారత్ ఆతిథ్యం ఇచ్చే ఇలాంటి టోర్నీల్లో కూడా పాకిస్తాన్ ఆడేందుకు అభ్యంతరం లేదు’ అని కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనలో పేర్కొంది. అధికారుల కోసం వీసా సడలింపులు... భవిష్యత్లో కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్ కూడా నిర్వహించాలని ఆశిస్తున్న నేపథ్యంలో మన దేశానికి అత్యుత్తమ వేదికగా గుర్తింపు రావాలని కూడా కేంద్రం భావిస్తోంది. అందుకే వివిధ క్రీడా ఈవెంట్ల సమయంలో వీసాలు జారీ చేసే విషయంపై కూడా ప్రకటనలో వివరంగా పేర్కొంది. ‘క్రీడాకారులు, అధికారులు, సాంకేతిక సిబ్బందితో పాటు అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులకు వారి అధికారిక పర్యటన సమయం, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వీసాలు జారీ చేస్తాం. ఇది గరిష్టంగా ఐదేళ్లు ఉంటుంది. టోర్నీల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి వచ్చే అధికారులకు ఇబ్బంది లేకుండా తమ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఇది ఉపకరిస్తుంది’ అని కేంద్రం వెల్లడించింది.

IPL 2026: సీఎస్కేలోకి పృథ్వీ షా..? వీడియో చూసి ఫిక్స్ అయిపోయిన అభిమానులు
ముంబై యువ ఓపెనర్ పృథ్వీ షా గత కొంతకాలంగా బ్యాడ్ రీజన్స్ వల్ల వార్తల్లో నిలిచాడు. ఫామ్ లేమి, వివాదాలు, ఫిట్నెస్ సమస్యల కారణంగా ముంబై దేశవాలీ జట్లలో స్థానం కోల్పోయాడు. ఐపీఎల్ 2025 వేలంలోనూ అమ్ముడుపోలేదు.టీమిండియా తరఫున అరంగేట్రం టెస్ట్లోనే సెంచరీ చేసి, భవిష్యత్ తారగా కీర్తించబడిన షా.. స్టేటస్ ఇచ్చిన కిక్కు తలకెక్కడంతో కొద్ది రోజుల్లోనే అదఃపాతాళానికి పడిపోయాడు.ఈ క్రమంలో తొలుత ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయాడు. ఆతర్వాత విజయ్ హజారే ట్రోఫీకి కూడా ఎంపిక కాలేదు. ముంబై విజేతగా నిలిచిన ముస్తాక్ అలీ టోర్నీలో భాగమైనా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు.ముంబై తరఫున అవకాశాలు రావని భావించిన షా.. ఇటీవలే మహారాష్ట్రకు మకాం మార్చాడు. బుచ్చిబాబు టోర్నీలో అరంగేట్రం ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు. కొత్త ప్రయాణాన్ని సెంచరీతో ప్రారంభించడంతో పృథ్వీ షా 2.0 వర్షన్ అని జనం అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే, బుచ్చిబాబు టోర్నీని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. పృథ్వీ షా చెన్నై వేదికగా ఛత్తీస్ఘడ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేశాడు. ఈ సెంచరీ తర్వాత చాలామంది అభిమానుల్లాగే ఐపీఎల్ ఫ్రాంచైజీ సీఎస్కే కూడా షాను ప్రశంసించింది. First 💯 for Maharashtra in Chennai✅Shaw makes it special 💛#WhistlePodu #BuchiBabu pic.twitter.com/o5zGZA2MlU— Chennai Super Kings (@ChennaiIPL) August 21, 2025తమ అధికారిక సోషల్మీడియా ఖాతాలో షా మాట్లాడుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో షా చెన్నైతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాడు. అతనికి చెన్నై అంటే చాలా ప్రత్యేకమని చెబుతాడు.ఈ వీడియోలో షా మాట్లాడిన తీరు, సీఎస్కే యాజమాన్యం అతనికి ప్రత్యేకంగా ఇచ్చిన ఎలివేషన్ చూస్తే వారి మధ్య ఏదో జరిగిందన్న విషయం స్పష్టమవుతుంది. సాధారణంగా సీఎస్కే యాజమాన్యం ఎప్పుడూ, తమ వాడు కాని ఏ ఆటగాడికి ఇంత హైప్ ఇవ్వదు. ఇవ్వలేదు. అలాంటిది సీఎస్కే షాను ప్రత్యేకించి ప్రమోట్ చేయడం చూస్తే, వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం వీరి మధ్య డీల్ కుదిరిందా అని అనిపించకమానదు. సీఎస్కే హ్యాండిల్లో షా వీడియో చూసిన తర్వాత అభిమానులు ఈ విషయాన్ని నిర్దారించుకున్నారు. ఒకవేళ ఇదే జరిగితే షా వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆయుశ్ మాత్రేతో కలిసి సీఎస్కే ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడు.
బిజినెస్

కొత్త కారు కొనే ప్లాన్ ఉందా?: భవిష్యత్తుకు ఎలాంటి మోడల్ బెస్ట్
కొన్నేళ్ళకు ముందు పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. పరిస్థితులు మార్పులు.. ఉద్గారప్రమాణాలు అమలులోకి రావడం వల్ల.. డీజిల్ కార్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. పెట్రోల్ కార్లు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ కార్లు, సీఎన్జీ కార్లు, హైబ్రిడ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో కొనుగోలుదారులు.. కార్ల కొనుగోలు విషయంలో కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఈ కథనంలో కొత్త కారు కొనుగోలు చేసేటప్పుడు ఇంధన రకానికి సంబంధించి పరిగణించవలసిన కొన్ని అంశాలను తెలుసుకుందాం.పెట్రోల్ కార్లుమీరు పెట్రోల్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లయితే.. ఇందులో విభిన్న ధరల వద్ద కార్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ కార్లు ఇతర కార్లతో పోలిస్తే కొంత తక్కువ ధర వద్ద లభిస్తాయి. అంతే కాకుండా దేశంలో పెట్రోల్ పంపులు కూడా లెక్కకు మించి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పెట్రోల్ కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. రోజువారీ వినియోగానికి, దూర ప్రయాణాలకు కూడా ఇవి ఉపయోగపడతాయి.డీజిల్ కార్లుడీజిల్ కార్లు ఒకప్పుడు విరివిగా అందుబాటులో ఉండేవి. బీఎస్6 ఉద్గార ప్రమాణాలు అందుబాటులోకి వచ్చిన తరువాత వీటి సంఖ్య చాలా వరకు తగ్గింది. పొల్యూషన్ కారణంగా ఢిల్లీ వంటి నగరాల్లో పాత డీజిల్ కార్లను కొన్నాళ్ళు నిషేధించారు. భవిష్యత్తులో డీజిల్ కార్ల ఉత్పత్తిని కూడా కంపెనీలు బాగా తగ్గించే అవకాశం ఉంది. డీజిల్ కార్ల ధరలు కూడా పెట్రోల్ కార్ల ధరల కంటే ఎక్కువ. వీటిని కూడా రోజువారీ వినియోగనికి, దూర ప్రయాణాలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు.ఎలక్ట్రిక్ కార్లుప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి కారణం.. ఈవీలపై జీఎస్టీ తగ్గింపు. ఈవీల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో సబ్సిడీ అందించింది. అయితే ఇప్పుడు ఈవీల వినియోగానికి ప్రధాన సమస్య.. ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ సంఖ్యలో అందుబాటులో లేకపోవడమే. వీటి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటోంది. నగర ప్రయాణాల కోసం ఈవీలను ఎంచుకోవచ్చు. కానీ దూర ప్రాంతాలకు వెళ్ళడానికి లేదా మారుమూల ప్రాంతాల్లో ఉపయోగించాలనుకుంటే మాత్రం ఛార్జింగ్ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: జనరల్ మేనేజర్కు ఖరీదైన బైక్ గిఫ్ట్ ఇచ్చిన సీఈఓసీఎన్జీ కార్లుపెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే.. సీఎన్జీ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఈ కార్లు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రస్తుత మార్కెట్లో సీఎన్జీ రీఫ్యూయలింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. కంపెనీలు తమ సీఎన్జీ కార్లలో మంచి బూట్ స్పేస్ కూడా అందిస్తున్నాయి. ధర సాధారణ కార్ల కంటే కొంత ఎక్కువగానే ఉంటుంది.హైబ్రిడ్ కార్లుభారతదేశంలో ప్రస్తుతం మైల్డ్ హైబ్రిడ్ కార్లు, స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. హైబ్రిడ్ టెక్నాలజీ మంచి ఇంధన సామర్త్యాన్ని అందిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు పెట్రోల్ కార్ల కంటే కూడా 10 కిమీ ఎక్కువ పరిధిని అందిస్తాయి. అంతే కాకుండా ఇవి కాలుష్య కారకాలను కూడా తక్కువగానే విడుదల చేస్తాయి. వీటి ధరలు సాధారణ పెట్రోల్ కార్ల కంటే ఎక్కువగా ఉంటాయి.

కొత్త ఫోన్ సేల్ షురూ.. రూ.10 వేలకే లేటెస్ట్ 5జీ మొబైల్
టెక్నో తన లేటెస్ట్ చౌకైన 5జీ మొబైల్ ఫోన్ టెక్నో స్పార్క్ గో 5జీని ఇటీవల భారత్ లో లాంచ్ చేసింది. నెక్స్ట్ జనరేషన్ కనెక్టివిటీని కోరుకునే యూజర్ల కోసం ఎంట్రీ లెవల్ 5జీ ఆప్షన్గా కంపెనీ ఈ ఫోన్ను తీసుకొచ్చింది. కొత్త 5జీ మొబైల్ ఫోన్కు అప్గ్రేడ్ అవ్వాలనుకునేవారి కోసం టెక్నో స్పార్క్ గో 5 జీ మంచి సేల్ ఆఫర్లు, డిస్కౌంట్లతో కొనుగోలుకు అందుబాటులో ఉంది.ఫోన్ ధర, లభ్యత, సేల్ ఆఫర్లుటెక్నో స్పార్క్ గో 5జీ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999 కాగా, స్కై బ్లూ, ఇంక్ బ్లాక్, టర్కోయిస్ గ్రీన్, హెరిటేజ్ ప్రేరేపిత బికనీర్ రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆగస్ట్ 21 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్ లో తొలి సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడి, డెబిట్ కార్డులపై 5% క్యాష్ బ్యాక్ సహా లాంచ్ ఆఫర్లను పొందవచ్చు. దీంతోపాటు భీమ్ యాప్ ద్వారా చేసే చెల్లింపులపై రూ.30 వరకు ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది.స్పెసిఫికేషన్లు, ఫీచర్లుటెక్నో స్పార్క్ గో 5జీ స్మార్ట్ఫోన్లో 6.76 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 670 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది.మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది.50 మెగాపిక్సెల్ ఏఐ అసిస్టెడ్ ప్రైమరీ రియర్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించారు.టెక్నోకు చెందిన "నో నెట్ వర్క్ కమ్యూనికేషన్" ఫీచర్ ను కూడా ఈ హ్యాండ్ సెస్టో ఇంటిగ్రేట్ చేశారు. ఇది మొబైల్ సర్వీస్ లేకపోయినా టెక్నో ఫోన్ల మధ్య కాల్స్, సందేశాలకు వీలు కల్పిస్తుంది.డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఈ ఫోన్లో ఉంది. ఇందు కోసం ఐపీ 64 రేటింగ్ ను కలిగి ఉంది.కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్లో 5జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.భద్రత కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అమర్చారు.

స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్
ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్.. ఈ-కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆధార్ను ఉపయోగించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీన్నిబట్టి చూస్తే.. భారతదేశంలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.స్టార్లింక్ ఇప్పటికే టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT).. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) నుంచి భారతదేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి కావలసిన అనుమతిని పొందింది. అయితే జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా టెక్నాలజీ.. మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వంటి కొన్ని ఆన్-ది-గ్రౌండ్ సన్నాహాలు ఇంకా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని కూడా త్వరలోనే పూర్తి చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను కంపెనీ పూర్తి చేస్తోంది.స్టార్లింక్ భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత కొత్త కస్టమర్ల ఆన్బోర్డింగ్ ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా.. వేగవంతమైన, మరింత సురక్షితమైన సేవలను అందించడానికి ప్రస్తుతం యూఐడీఏఐతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్పష్టమవుతోంది.స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఈకేవైసీ చేసుకున్న యూజర్లు హైస్పీడ్ ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు. ఇది గృహాల్లో వినియోగించడానికి, సంస్థల్లో ఉపయోగించడానికి కూడా అనుకూలంగా ఉంటుందని.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.భారతదేశంలో స్టార్లింక్ ధరలుస్టార్లింక్ హార్డ్వేర్ ధర రూ.30,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుందని అంచనా. ఇందులో శాటిలైట్ డిష్ & వై-ఫై రౌటర్ ఉన్నాయి. అయితే నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్లు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. యూజర్లు 25 Mbps నుంచి 220 Mbps మధ్య ఇంటర్నెట్ వేగాన్ని ఆస్వాదించవచ్చు. ధరలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.ఇదీ చదవండి: రెండేళ్లకే మస్క్ కంపెనీ వీడిన 16 ఏళ్ల కుర్రాడుస్టార్లింక్ సేవలను ప్రారంభ దశలో 20 లక్షల కనెక్షన్లకు మాత్రమే పరిమితం చేశారు. అయితే పరికరాల సరఫరా కోసం భారతి ఎయిర్టెల్ & రిలయన్స్ జియోలతో ఒప్పందం కుదుర్చుకుంది. మారుమూల ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో స్టార్లింక్ శాటిలైట్ సేవలను ప్రారంభించనున్నారు.

ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ను నిషేధిస్తూ తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం ఆమోదం తెలిపింది. ఓ వైపు విపక్షాలు చర్చకు పట్టుబట్టినా ఉభయ సభల్లో ఎలాంటి చర్చలేకుండానే ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. నిన్నటి పార్లమెంట్ సెషన్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ రంగంపై ఆధారపడిన వారిలో సామూహిక నిరుద్యోగం పెరుగుతుందనే భయాలు నెలకొన్నాయి. వీటిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అభివృద్ధి చెందుతున్న భారతదేశ డిజిటల్, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ఈ-స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉద్భవిస్తాయని పేర్కొంది.ఏమిటీ బిల్లు? అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్(సట్టా, పోకర్, రమ్మీ, కార్డ్ గేమ్స్)తోపాటు ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్లైన్ లాటరీలను నిషేధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. డబ్బులు పెట్టి ఆన్లైన్లో ఆడే క్రీడలపై నిషేధం అమలవుతుంది. ఆన్లైన్ గేమ్లకు ప్రచారం చేసినవారు కూడా నేరస్తులే. ఇలాంటి గేమ్ల్లో ఒకరి నుంచి మరొకరికి ఆన్లైన్లో నగదు బదిలీలకు వీలు కల్పించిన బ్యాంక్లు లేదా ఆర్థిక సంస్థలను సైతం శిక్షిస్తారు. ఆన్లైన్ గేమ్ను ఏ రూపంలో నిర్వహించినా, ప్రోత్సహించినా, ప్రచారం చేసినా నేరమే. అంటే కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా చేసినా నేరంగా పరిగణిస్తారు. సోషల్ మీడియా లేదా పత్రికలు లేదా టీవీల్లో ప్రచారం చేసినా శిక్ష తప్పదు. నైపుణ్యం లేదా అదృష్టం(చాయిప్)పై ఆధారపడిన ఏ గేమ్ అయినా నిషిద్ధమే. మన దేశంలోనే కాకుండా.. దేశ సరిహద్దుల్లో లేదా విదేశీ గడ్డపై నుంచి గేమ్లను నిర్వహించినా దోషులే అవుతారు. ఈ బిల్లు ప్రకారం.. ఆన్లైన్ గేమ్ల్లో పాల్గొన్నవారిని దోషులుగా కాకుండా బాధితులుగానే పరిగణిస్తారు. డబ్బుతో సంబంధం లేదని ఈ–స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమ్స్కు కొన్ని నియంత్రణలను బిల్లు సూచిస్తోంది. సమాజంలో అశాంతి తలెత్తకుండా చూడాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బిల్లులో పొందుపర్చారు. డిజిటల్ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకొనేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డబ్బు ప్రమేయం లేని ఈ–స్పోర్ట్స్ చట్టబద్ధమే అవుతాయి. ఇందుకోసం కేంద్ర క్రీడల శాఖ కొన్ని మార్గదర్శకాలు, ప్రమాణాలు రూపొందించాలని బిల్లులో సూచించారు. విద్యా, సాంస్కృతిక విలువలను పెంపొందించడానికి, నైపుణ్యాభివృద్ధికి, సమాజంలో ప్రజల మధ్య అనుసంధానానికి ఆన్లైన్ సోషల్ గేమ్స్ను ప్రోత్సహించవచ్చు. ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలి. ఈ–స్పోర్ట్స్కు సంబంధించి శిక్షణ, పరిశోధనలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. మానసికోల్లాసం, నైపుణ్యాభివృద్ధి కోసం సోషల్, ఎడ్యుకేషన్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఆన్లైన్ గేమ్లను వర్గీకరించడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి రూ.50 కోట్లతో జాతీయ స్థాయిలో గేమింగ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రతిఏటా రూ.20 కోట్లు కేటాయిస్తారు. ఎలాంటి గేమ్ అనేది ఈ అథారిటీ నిర్ణయిస్తుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది.
ఫ్యామిలీ

మనసుంటే భూపంపిణీ చేయొచ్చు!
భారతదేశంలో నూటికి 65 శాతం పైగా ప్రజలు గ్రామీణప్రాంతంలో నివసిస్తున్నారు. భూమిని కలిగి ఉండటం రైతు కుటుంబానికి సామాజిక హోదాను కల్పిస్తుంది. కానీ 78 సంవత్సరాల ‘స్వాతంత్య్రం’ తర్వాత కూడా గ్రామీణ ప్రాంతంలో భూమి లేని నిరుపేదలు అత్యధికంగా ఉన్నారు. గ్రామాల్లోని సుమారు 10 కోట్ల కుటుంబాలకు, అంటే గ్రామాల్లోని దాదాపు 56 శాతం కుటుంబాలకు సాగు భూమి అనేది లేదు. 1970 దశకంలో ప్రజల, ముఖ్యంగా గిరిజన ప్రజల పోరాటం ఫలితంగా భూమి సమస్య ప్రధాన ఎజెండాగా ముందుకు వచ్చింది. రాష్ట్రాల వారీగా భూసంస్కరణల చట్టాలు వచ్చాయి. 1972లో జరి గిన ముఖ్యమంత్రుల సమావేశంలో జాతీయ స్థాయిలో ఒకే సీలింగ్ విధానాన్ని రూపొందించారు. ఈ సీలింగ్ ద్వారా 67 లక్షల ఎకరాల మిగులు తేలింది. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం ఫలితంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో 1972లో భూ సంస్కరణల చట్టం చేయబడి 1973లో అమల్లోకి వచ్చింది. భూ సంస్కరణల చట్ట ప్రకారం మొదట 18 లక్షల ఎకరాలను మిగులు భూమిగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించింది. సవరణలతో కుదిస్తూ చివరికి 7.9 లక్షల ఎకరాల మిగులు భూమి ప్రకటించి, అందులో 6.47 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకుని, 5.82 లక్షల ఎకరాలను లక్షా 79 వేల మందికి పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. చట్టంలో ఉన్న లొసుగు లను ఉపయోగించుకొని భూస్వాములు, ధనిక రైతులు సీలింగ్లోకి రాకుండా తమ భూములను కాపాడుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ సుమారు 51 లక్షల ఎకరాలను మాత్రమే 57.8 లక్షల పేద రైతులకు పంపిణీ చేయడం జరిగింది. భూ సంస్కరణల చట్టాల వల్ల భూ సంబంధాల్లో మౌలికమైన మార్పులు జరగలేదు. కొద్ది మంది వద్దే భూమి ఇంకా కేంద్రీకరించ బడి ఉంది. 2020 జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం, 84%గా ఉన్న చిన్న, సన్నకారు రైతులు హెక్టార్ కన్నా తక్కువ భూమిని కలిగి ఉన్నారు. కేవలం 4.9% ఉన్న భూస్వాముల వద్ద 32% సాగు భూమి ఉంది. రాష్ట్రాల వారిగా కూడా భూకేంద్రీకరణలో వ్యత్యాసాలు ఉన్నాయి. పంజాబ్, బిహార్ రాష్ట్రాల్లో 10%గా ఉన్న భూస్వాముల వద్ద 80 శాతం భూమి ఉంది. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో 55% భూమి 10%గా ఉన్న భూస్వాముల వద్ద ఉంది. భారతదేశంలో ఒక పెద్ద భూ కామందు ఒక సన్నకారు రైతు కన్నా 45 రెట్లు ఎక్కువ భూమిని కలిగి ఉన్నారు. దేశంలో భూ సంస్కరణలు అమలు జరిపారనీ, భూస్వామ్య విధానం లేదనీ, దాని అవశేషాలు మాత్రమే ఉన్నాయనీ, పంచ టానికి ఇంకా భూములు లేవనీ కొందరు చేస్తున్న వాదనలు వాస్తవ విరుద్ధం. భూ కామందుల వద్దే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల వద్ద, మత సంస్థల వద్ద లక్షలాది ఎకరాల భూమి ఉంది. ఆ భూము లను ప్రభుత్వం పంపిణీ చేయగలిగినప్పుడే పేదలందరికీ భూమి లభిస్తుంది. 10 నుండి 12 ఎకరాల సీలింగ్ విధించి భూ సంస్కర ణలు అమలు జరిపితే లక్షల కొద్ది భూములను పేదలకు పంపిణీ చేయవచ్చు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణ పేదలు భూమి కోసం సంఘటితం కావాలి. – బొల్లిముంత సాంబశివరావురైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

'మంజుమ్మెల్ గర్ల్'..! ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ ఆమె..
కొచ్చిలో రద్దీగా ఉండే వీధిలోకి ఓ ఆటో రిక్షా రయ్.. మని వచ్చి ఆగింది. అప్పుడే ఓ పోలీస్ వ్యాన్ కూడా అదే మలుపు వద్ద ఆగింది. అందులో నుంచి కానిస్టేబుల్ ఆటోలోకి చూస్తూ ‘ఏయ్ అబ్బాయి, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా?’ అని అడిగాడు. ‘సర్, నేను అబ్బాయి కాదు, అమ్మాయిని...’ అంటూ తన వద్ద ఉన్న లైసెన్స్ చూపించింది.ఆమె కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మంజుమ్మెల్కు చెందిన అలీషా జిన్సన్. ఆమె వయసు 18. ‘మంజుమ్మెల్ గర్ల్’గా ఆ ఏరియాలో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా నడుపుతోంది. ఆమె ఎర్నాకుళంలోనే కాదు కేరళ మొత్తంలో ఆటో నడిపే అతి పిన్న వయస్కురాలిగా పేరొందింది. ఆమె ఆటో నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కేరళ విద్యామంత్రి శివన్ కుట్టి దృష్టికి వచ్చింది. దీంతో ఆయన రాష్ట్ర టాక్సీ, ఆటో బుకింగ్ యాప్ అయిన కేరళ సవారీకి అలీషాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. అలీషా డ్రైవర్ సీట్లో కూర్చోవడానికి చాలానే కష్టపడింది. 16 ఏళ్ల వయసులో కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు స్కూల్ చదువు మానేసింది. అదే సంవత్సరంలో క్లీనింగ్ సర్వీసెస్ కంపెనీ యజమాని అయిన ఆమె తండ్రి గిన్సన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కొన్ని నెలల తేడాతో తల్లి షిజా నిమోనియాతో ఆసుపత్రి పాలైంది, అది క్షయవ్యాధిగా మారింది. దీంతో ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గిపోయింది. ఉన్న ఏకైక ఆస్తి క్లీనింగ్ సిబ్బందిని తీసుకెళ్లడానికి ఉంచిన ఆటోరిక్షా. ‘నాన్నకు ప్రమాదం జరిగి, మంచం పట్టడం, అమ్మ ఆసుపత్రి పాలవడంతో నేను ఈ డ్రైవింగ్నే ఎంపిక చేసుకున్నాను. ఆటోయే నాకు జీవనాధారం అయ్యింది. మొదట్లో పనివాళ్లను చేరవేయడానికి ఆటో ఉపయోగపడింది. కొత్త భవనాలు, ఫర్నీచర్ క్లీనింగ్ వంటి పనుల్లో పాల్గొన్నాను. ఒకరోజు పొరుగున ఉండే వ్యక్తి తన సరుకులను చేరవేయడానికి ఆటో కావాలని అడిగాడు. నా తండ్రి నన్ను ఆటో తీసుకెళ్లమన్నాడు. ఆ రోజు నేను ఛార్జీల రూపంలో రూ.700 సంపాదించాను. అది నేను ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తం. దీంతో నా పూర్తి సమయం ఆటో నడపడానికే నిశ్చయించుకున్నాను.రాత్రి డ్రైవింగ్... నెలవారీ వాయిదా కట్టడానికి రూ.13,000 అవసరం అవడంతో సాయంత్రం ఊబర్లోకి లాగిన్ అయ్యేది. దీంతో రాత్రి డ్రైవింగ్ మొదలయ్యింది. కొన్నిసార్లు తెల్లవారుజాము 2 గంటల వరకు ఆటో నడుపుతూనే ఉండేది. ఏ టైమ్ అయినా సంకోచం లేకుండా నడపడం చేస్తూనే ఉంది. కట్ చేసిన జుట్టు, డ్రెస్సింగ్ చూసేవాళ్లకు ఆమె టీనేజ్ అబ్బాయిలా కనిపిస్తుంది. ‘ఒకసారి ఒక వ్యక్తి ఆటో ఆపి, నాకు ఆటో డ్రైవింగ్ చేయడానికి ఇచ్చినందుకు మా నాన్నను తిట్టాడు. నా లైసెన్స్ వారికి చూపించాల్సి వచ్చింది’ అని నవ్వుతూ చెబుతుంది అలీషా. తన సోదరుడి ఖాకీ చొక్కాను యూనిఫామ్గా మార్చుకుంది. తెలియని వ్యక్తులు ఎవరైనా సరే వారితో మాటలకు దూరంగా ఉంటుంది.చదువుకు అంతరాయం... అలీషా రోజూ తన ఇల్లు మంజుమ్మెల్ నుండి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలియం వరకు సైకిల్పై వెళ్లి, చదువుకునేది. రోజూ ఈ ప్రయాణం చేయలేక స్కూల్కు రెగ్యులర్గా వెళ్లలేకపోయేది. దీంతో పదవ తరగతితోనే చదువు ఆగిపోయింది. ఓ ప్రైవేట్ కాలేజీలో పన్నెండవ తరగతి వరకు చదివింది. ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా పూర్తిచేసి, టెక్స్టైల్ వ్యాపారాన్ని నడిపింది. ఇప్పుడు ఈ రంగంలోనే ఇగ్నో ద్వారా బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తోంది.గుర్తించిన ప్రభుత్వం... కేరళ సవారీ యాప్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రభుత్వం ఆమెకు ఒక జ్ఞాపికను బహూకరించింది. మంజుమ్మెల్ గర్ల్ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొంత ఆదాయాన్ని పొందుతోంది. తన ఆటోకు కూడా అదే పేరు పెట్టుకుంది. ఆమె సోదరుడు జాషువా తన తండ్రి ప్రమాదం తర్వాత బెంగళూరులో తన చదువును వదిలేసి క్లీనింగ్ కంపెనీని నడుపుతున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులిద్దరూ కోలుకోవడంతో కుటుంబం కొత్త వెంచర్ కోసం ప్లాన్ చేస్తోంది. పద్దెనిమిదేళ్ల వయసులో అలీషా తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడానికి, అప్పులను తీర్చడానికి సొంత జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఒక మార్గాన్ని వెతుక్కుంది. విదేశాలలో భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటోంది.

పెళ్లి రోజు: మాజీ మంత్రి ఆర్కే రోజా ఇంట్రస్టింగ్ పోస్ట్
మాజీ మంత్రి, వైసీపీనేత ఆర్కే రోజా (R K Roja) తమ వివాహ వార్షికోత్సవం సందర్బంగా విశాఖ పట్టణంలోని సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. భర్త రోజా ఆర్కే సెల్వమణి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా తన వివాహ బంధంపై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ను షేర్ చేశారు. రోజా ఇన్స్టా పోస్ట్ ❝మణి ఎదలో…రోజా పూదోట…అదే నింగి, అదే నేల…అదే దివి, అదే భువి…అదే నీరు, అదే గాలి…నింగిలో మార్పు, నేలలో మార్పు జరిగినా...పంచభూతాల సాక్షిగా,మనువాడిన మణి నీఎదమది తోటలో ప్రతీ రోజూవికసించే రోజానైనీ వెంట…నీ జంటగానిలిచాను...!!మన 34 ఏళ్ళ ప్రయాణంనా జీవితానికి అందమైన కానుక...ప్రతీ క్షణం తోడుగా, బలంగా,ప్రేమగా నన్ను నిలిపినమీకెప్పటికీ రుణపడిఉంటాను..❜దీంతో వైసీపీ శ్రేణులు, అభిమానులు ఈ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఆగస్టు 21న రోజా, దర్శకుడు సెల్వమణి వివాహం జరిగింది. వీరికి ఇరువురు సంతానం, ఒక కొడుకు, ఒక కూతురు.ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంత

డిజైన్ డెమోక్రసీ..!
ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ ఉత్పత్తులకు సంబంధించిన పాపులర్ ప్రదర్శన డిజైన్ డెమోక్రసీ వచ్చేనెల 5న నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించిన నిర్వాహకులు ఎక్స్పో వివరాలను వెల్లడించారు. ఇందులో 120కి పైగా ప్రముఖ బ్రాండ్లు, 80పైగా పేరొందిన స్పీకర్లు పాల్గొంటారని, 15 వేలకుపైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 3 రోజుల ప్రదర్శనలో చర్చలు, ఆవిష్కరణలు.. వంటివి ఉంటాయన్నారు. ఫర్నిచర్, లైటింగ్, ఫ్లోరింగ్, గృహోపకరణాలు, వంటగది, బాత్, డెకర్ ఉపకరణాలు ఫైన్ఆర్ట్, క్రాఫ్ట్ వంటి వాటి ఎంపికలో నగర వినియోగదారుల అభిరుచులను కొత్తస్థాయికి ఇవి చేరుస్తాయన్నారు. సమావేశంలో సహ వ్యవస్థాపకులు శైలజా పట్వావరీ, మల్లికా శ్రీవాస్తవ్, క్యూరేటర్ అర్జున్ రతి పాల్గొని మాట్లాడారు.విద్యార్థి ప్రతిభ..ఎఫ్డీడీఐ–హైదరాబాద్ విద్యార్థులు చదువుతోపాటు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ వినూత్న ఆలోచనలతో వివిధ వస్తువుల తయారీకి శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఎఫ్డీడీఐలోని ఎల్ఎల్పీడీకి చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి జీవా ప్రోటోటైప్ ఉత్పత్తిగా కుట్టులేని నాణెం పౌచ్కు రూపకల్పన చేశారు. రావి(పీపాల్) ఆకు రూపం, ఆకృతి నుంచి ప్రేరణ పొంది ఆకుపచ్చ రంగులో కృత్రిమ తోలు, గుండు సూది, షూలేస్ను ఉపయోగించి కుట్లు లేకుండా ఈ పౌచ్ను తయారు చేశాడు. జీవాను ఎఫ్డీడీఐ –హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ తేజ్లోహిత్రెడ్డి, ఫ్యాకల్టీ ప్రతినిధులు వేణుగోపాల్, గోఫ్రాన్, రుచిసింగ్, హుస్సేన్, రాంబాబు అభినందించారు. – రాయదుర్గం (చదవండి: నయా ట్రెండ్.. గణేశుడికి గ్రాండ్ వెల్కమ్!)
ఫొటోలు


#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్ ఫాదర్.. 'చిరంజీవి' బర్త్డే స్పెషల్ (ఫోటోలు)


హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి శ్రియా శరణ్ (ఫొటోలు)


మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)


బలగం బ్యూటీ కొత్త సినిమా.. గ్రాండ్గా పూజా కార్యక్రమం (ఫోటోలు)


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగచైతన్య దంపతులు (ఫోటోలు)


Happy Anniversary : వరాహ లక్ష్మి నర్సింహ స్వామి వారి సేవలో మాజీ మంత్రి రోజా (ఫొటోలు)


‘బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్’ ఈవెంట్లో షారుఖ్ ఫ్యామిలీ సందడి (ఫొటోలు)


‘కన్యాకుమారి’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


సీనియర్ నటి.. కానీ టీనేజీ అమ్మాయిలా కనిపిస్తూ (ఫొటోలు)


కమెడియన్ రాకేశ్ కూతురి 1st బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
అంతర్జాతీయం

భారత్లో లైంగిక హింసపై పాక్ మాట్లాడటం సిగ్గు చేటు
న్యూయార్క్: జమ్మూకశ్మీర్లో లైంగిక హింస జరిగిందంటూ ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ తిప్ప కొట్టింది. తమ దేశంలో మైనారిటీ మహిళలపై జరుగుతున్న నేరాలపై స్పందించని పాక్. భారత్పై మాట్లాడటం సిగ్గుచేటని ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్త ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ వ్యాఖ్యానించారు. మహిళలపై నేరాలకు సంబంధించి ఆ దేశానికే దారుణమైన రికార్డు ఉందని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో సంఘర్షణ సంబంధిత లైంగిక హింసపై మంగళవారం జరిగిన బహిరంగ చర్చలో పున్నూస్ మాట్లాడారు.ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే నైతికత పాకిస్థాన్కు లేదని స్పష్టం చేశారు. ‘1971లో పూర్వపు తూర్పు పాకిస్తాన్లో లక్షలాది మంది మహిళలపై పాకిస్తాన్ సైన్యం పాల్పడిన లైంగిక హింస నేరాలకు ఎలాంటి శిక్ష వేయకపోవడం సిగ్గు చేటు. ఆ దేశంలో మైనారిటీ వర్గాల్లో మహిళలు, బాలికలు నేటికీ అపహరణకు గురవుతున్నారు. అక్రమ రవాణా జరుగుతోంది. బలవంతపు వివాహాలు, మత మారి్పడులను ఎదుర్కొంటున్నారు. ఈ నేరాలకు పాల్పడేవారు ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నట్లు నటించడం విడ్డూరంగా ఉంది. పాక్ ద్వంద్వ వైఖరి, కపటత్వం స్పష్టమవుతున్నాయి’అని ఆయన వ్యాఖ్యానించారు. ఘర్షణ సంబంధిత లైంగిక హింస, దారుణమైన చర్యలకు పాల్పడేవారిని న్యాయం ముందు నిలబెట్టాలని పున్నూస్ డిమాండ్ చేశారు.మహిళల రక్షణకు భారత్లో ప్రత్యేక వ్యవస్థలు అంతేకాదు.. మన దేశంలో, ప్రపంచ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో లింగ ఆధారిత హింసను ఎదుర్కోవడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన వెల్లడించారు. లైంగిక దోపిడీ, దురి్వనియోగ బాధితుల కోసం యూఎన్ సెక్రటరీ జనరల్ ట్రస్ట్ ఫండ్కు విరాళాలు అందించిన మొదటి దేశాల్లో భారతదేశం ఒకటని గుర్తు చేశారు. ఇటువంటి నేరాలను నివారించడానికి యూఎన్తో స్వచ్ఛంద ఒప్పందంపై 2017లోనే భారత్ సంతకం చేసిందన్నారు. 2007లో లైబీరియాకు మొదటి పూర్తి మహిళా పోలీసు యూనిట్ను మోహరించిందని, ఐక్యరాజ్యసమితి కార్యకలాపాలకు మహిళా బృందాలను పంపుతూనే ఉందని పున్నూస్ ఎత్తి చూపారు. దేశీయంగా మహిళలను రక్షించడానికి భారత్ ప్రత్యేక వ్యవస్థలను సృష్టించిందని పున్నూస్ చెప్పారు. వీటిలో మహిళల భద్రత కోసం 1.2 బిలియన్ డాలర్లను నిర్భయ నిధికి కేటాయించిదని చెప్పారు.పాక్లో 24 వేల మంది కిడ్నాప్.. పాకిస్తాన్లో గతేడాది 24 వేలమందికి పైగా కిడ్నాప్కు గురయ్యారని సస్టైనబుల్ సోషల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 2024 నివేదిక వెల్లడించింది. అంతేకాదు 5వేల మందిపై అత్యాచారం, 500 హానర్ కిల్లింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. సింధ్ ప్రావిన్స్లోని చాలా మంది హిందూ మైనారిటీ బాలికలకు బలవంతంగా వివాహం చేస్తున్నారని, మత మారి్పడి చేస్తున్నారని పేర్కొంది.

అల్బనీస్ బలహీనమైన నాయకుడు
జెరూసలేం: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంతోనీ అల్బనీస్ ఇజ్రాయెల్కు ద్రోహం చేశారని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఆ్రస్టేలియాలోని యూదు సమాజాన్ని ఆ దేశం వదిలేసిందన్నారు. బలహీనమైన రాజకీయ నాయకుడిగా ఆయనను చరిత్ర గుర్తుంచుకుంటుందని విమర్శించారు. ఆ్రస్టేలియన్ యూదు సంఘం (ఏజేఏ) నిర్వహించిన కార్యక్రమానికి హాజరవ్వాలన్సిన ఇజ్రాయెల్ నేత సిమ్చా రోత్మన్ వీసాను ఆస్ట్రేలియా రద్దు చేసింది.విభజన రాజకీయాలు చేస్తున్నవారిపై తమ ప్రభుత్వం కఠినమైన వైఖరి తీసుకుంటుందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి టోనీ బర్క్ ప్రకటించారు. ‘మీరు ద్వేషం, విభజన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఆస్ట్రేలియాకు వస్తున్నట్లయితే.. మీరు ఇక్కడికి రావడం మాకు ఇష్టం లేదు’అని బర్క్ స్పష్టం చేశారు. దీంతో రోత్మన్ సమావేశంలో వర్చువల్గా పాల్గొని, ప్రసంగిస్తారని ఏజేఏ తెలిపింది. యూదు సమాజం టోనీ బర్క్కు, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్కు తలవంచదని ప్రకటించింది. ఈ పరిణామాల పట్ల నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తీసుకోనుఅయితే.. నెతన్యాహు వ్యాఖ్యలపై బర్క్ బుధవారం స్పందించారు. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు ఆ్రస్టేలియా ప్రకటించినందుకే ఆయనకు ఆగ్రహం వస్తోందన్నారు. ఇక.. బలమైన నాయకుడంటే.. ఇతర దేశాలపై దాడులు చేసేవారు, ఇతర దేశాల్లో ప్రజలను ఆకలితో చంపేవారు కాదని, దాడులు, హత్యలతో ఒక దేశాధ్యక్షుడి బలాన్ని అంచనా వేయలేమని ఎద్దేవా చేశారు. నెతన్యాహు వ్యాఖ్యలపై ప్రధాని అల్బనీస్ సైతం స్పందించారు. వాటిని వ్యక్తిగతంగా తీసుకోనన్నారు. తాను ఇతర దేశాల నాయకులను గౌరవంగా చూస్తానని, దౌత్యపరంగా వారితో సంభాíÙస్తానని హుందాగా చెప్పుకొచ్చారు. అయితే ఇజ్రాయెల్ మితవాద నేతల వీసాలను ఆ్రస్టేలియా రద్దు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో పార్లమెంటును విడిచిపెట్టిన నాయకురాలు, ఇజ్రాయెల్ మాజీ న్యాయ మంత్రి అయెలెట్ షేక్డ్కు కూడా వీసా నిరాకరించారు. నెతన్యాహుతో ఘర్షణ పడేవారే అసలైన నాయకుడు నెతన్యాహు వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ విమర్శించారు. అంతేకాదు.. ఆయన వ్యాఖ్యలను ఆ్రస్టేలియా నాయకునికి బహుమతిగా అభివరి్ణంచారు. ‘రాజకీయంగా అత్యంత విషపూరిత నాయకుడైన నెతన్యాహుతో ఘర్షణ పడేవారే ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రపంచంలో అసలైన నాయకుడు. ఆ్రస్టేలియా ప్రధానమంత్రికి ఈ బహుమతిని ఇచ్చారు’అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు.పాలస్తీనాకు మద్దతు ఇవ్వడంతో.. పాలస్తీనా దేశాన్ని యూఎన్లో ఉన్న 193 సభ్య దేశాల్లో 147 దేశాలు గుర్తించాయి. యూకే, ఫ్రాన్స్, కెనడాలు కూడా ఆ దేశాల జాబితాలో చేరాయి. ఆ తర్వాత ఆ్రస్టేలియా సైతం పాలస్తీనాకు మద్దతు ఇచి్చంది. ఆ సమయంలో ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ ‘అమాయక ప్రజలపై యుద్ధ చూపుతున్న ప్రభావాన్ని నెతన్యాహు పట్టించుకోవడం లేదు. సహాయ పంపిణీ కేంద్రాల చుట్టూ ప్రజలు ఆహారం, నీటి కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు’అన్నారు. అప్పటినుంచి ఆయా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ప్రతిస్పందనగా, నెతన్యాహు మూడు దేశాల నాయకులపై దాడిని ప్రారంభించారు. కెయిర్ స్టార్మర్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, మార్క్ కారీ్నలు.. సామూహిక హంతకులు, రేపిస్టులు, శిశువుల హంతకులు, కిడ్నాపర్ల పక్షాన నిలుస్తున్నారని ఆరోపించారు.

రష్యా చమురుతో భారత సంపన్న కుటుంబాలే లాభపడుతున్నాయి
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల అంశంపై అమెరికా మరోసారి స్పందించింది. ఈ క్రమంలో భారతీయ బిలియనీర్లపై అక్కసు వెల్లగక్కింది. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఎన్బీసీ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో ఏకంగా ఓ పత్రికలో వ్యాసం రాశారు. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాల్లో భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యాతో కొనసాగుతున్న చమురు వాణిజ్యం.. ఈ కుటుంబాలకే భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో.. ఆంక్షలనూ లాభార్జనగా మార్చుకున్నారు అని ఆరోపించారాయన.2022 కంటే ముందు.. ఉక్రెయిన్ సంక్షోభం కంటే ముందు రష్యా నుంచి భారత్ 1 శాతం కంటే తక్కువ చమురును కొనుగోలు చేసేది. ఇప్పుడది 42 శాతానికి చేరి ఉండొచ్చు. భారత దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు రష్యా ఆయిల్ను రీసెల్లింగ్ చేసుకుంటున్నాయి. తద్వారా.. 16 బిలియన్ డాలర్ల అదనపు లాభాలను(ఒక లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు) పొందుతున్నాయి. అందుకే భారత్పై సుంకాలను పెంచే ప్రణాళిక రూపొందించాం. ఇవి సెకండరీ టారిఫ్లుగా ఉండొచ్చు అని బెసెంట్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో గతవారం ఓ ప్రముఖ పత్రిక కాలమ్లో భారతదేశంలోని చమురు వ్యాపారులపై తీవ్ర విమర్శలు చేశారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లు భారతదేశపు ‘‘బిగ్ ఆయిల్’’ లాబీ లాభాపేక్ష వల్ల జరిగాయని.. దేశీయ అవసరాల కోసం కాదని అందులో పేర్కొన్నారు. ఆ కథనంలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఎగుమతులపై 50% టారిఫ్లు విధించారు. ఇందులో సగం శిక్ష రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించబడనుంది. భారత్ మాత్రం తక్కువ ధర ఉన్న చోట నుంచి చమురు కొనుగోలు చేయడం తమ హక్కు అని పేర్కొంటూ, ఈ అదనపు టారిఫ్లను అసమంజసమైనవిగా చెబుతోంది. కానీ.. చరిత్రపరంగా చూస్తే.. భారత్ రష్యా చమురును ఎక్కువగా దిగుమతి చేసుకోలేదు. ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడేది. కానీ 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై $60-పెర బ్యారెల్ ధర పరిమితి విధించడంతో.. భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. ఇది అమెరికాకూ తెలుసు. ..ఇక చైనాపై సెకండరీ టారిఫ్లు విధించకపోవడానికి ఓ కారణం ఉంది. అది భారత్ కంటే ఎక్కువగా రష్యా చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే 2022 ముందు 13% ఉండగా, ఇప్పుడు 16%కి పెరిగింది. పైగా చైనా వివిధ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవడమే కాకుండా.. విక్రయిస్తోంది కూడా. అందుకే అమెరికా చైనాపై అదనపు టారిఫ్లు విధించలేదు అని అన్నారాయన.

బ్రిటిష్ రాయల్ నేవీలో తొలి హిందూ గురువుగా భాను అత్రి
లండన్: బ్రిటిష్ రాయల్ నేవీ తొలిసారిగా హిందూ గురువును నియమించింది. హిందూ ధర్మ సిద్ధాంతాల ద్వారా నావికా సిబ్బందికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేసేందుకు ఈ నియామకం చేపట్టారు. క్రైస్తవుడు కాని వ్యక్తిని ఈ విధంగా ఎంపిక చేసిన తొలి సందర్భం ఇది. బ్రిటిష్ రాయల్ నేవీలో నియమితులైన 148 మంది కొత్త అధికారులలో భాను అత్రి ఒకరు.భాను అత్రి (39) భారత్లోని హిమాచల్ ప్రదేశ్కు చెందిన యువకుడు. ప్రస్తుతం బ్రిటన్లోని ఎసెక్స్లో నివసిస్తున్నారు. లండన్లో ఒక ఆలయ నిర్వహణలో ఆయనకు దీర్ఘకాల అనుభవం ఉంది. భాను అత్రి తాజా నియామకం కోసం ఆరు వారాల అధికారిక శిక్షణ పొందారు. ఇందులో భాగంగా నాలుగు వారాల యుద్ధనౌక హెచ్ఎంఎస్ ఐరన్ డ్యూక్లో సముద్ర మనుగడ శిక్షణ, మూడు వారాలపాటు హిందూ గురువుగా శిక్షణ పొందారు తాను నౌకాదళంలో మొదటి హిందూ గురువుగా ఎంపిక కావడం కావడం ఆనందంగా ఉందని అత్రి అన్నారు. सोलन ज़िला के गढ़खल निवासी भानु अत्री जी को ब्रिटेन की रॉयल नेवी में हिंदू चैप्लेन (पादरी) के रूप में चयनित होने पर हार्दिक बधाई एवं शुभकामनाएँ।भानु अत्री जी पहले भारतीय हैं, जिन्हें ब्रिटेन की रॉयल नेवी में यह गौरवपूर्ण दायित्व मिला है। उनकी यह उपलब्धि हिमाचल के साथ-साथ पूरे… pic.twitter.com/cVRabMesBW— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 18, 2025భాను అత్రిని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అభినందించారు. బ్రిటన్ రాయల్ నేవీలో హిందూ గురువుగా ఎంపికైనందుకు భాను అత్రికి సీఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భాను అత్రి హిమాచల్తో పాటు దేశం గర్వించే స్థాయికి ఎదిగారన్నారు. 1986 సెప్టెంబర్లో జన్మించిన భాను అత్రి.. నల్వాలోని సరస్వతి నికేతన్ సీనియర్ సెకండరీ స్కూల్ నుండి ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత, సోలన్లోని సంస్కృత కళాశాల నుండి శాస్త్రి విద్యను పూర్తి చేసి, ఢిల్లీలో జ్యోతిష్య పట్టా పొందారు. 2009లో లండన్ చేరుకున్న అత్రి అక్కడ ఆలయ పూజారిగా బాధ్యతలు చేపట్టారు. భాను అత్రి తండ్రి రామ్ గోపాల్ అత్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు. భాను అత్రి తల్లి లీనా అత్రి గృహిణి. భాను అత్రి తన భార్య, పిల్లలతో పాటు లండన్లో ఉంటున్నారు.
జాతీయం

కొంప ముంచింది ఆ ఇద్దరే.. 30 రోజులు జైల్లో ఉంటే నేతల పదవి ఊస్టింగ్..
సాక్షి,న్యూఢిల్లీ: తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ ఏకధాటిగా 30 రోజులుగా కస్టడీలో గడుపుతున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి,కేంద్ర రాష్ట్రమంత్రులను పదవి నుంచి తొలగించేలా కేంద్రం మూడు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్రం ఈ వివాదాస్పద బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టేందుకు ఇద్దరు నేతలు కారణమని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా ఇద్దరు? వాళ్లు ఏం నేరం చేశారు.గతేడాది ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో జైలు శిక్షను అనుభవించారు. జైలు నుంచి పరిపాలన కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి సంగతి అటుంచితే.. లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంతో,తీవ్రమైన నేరాలకు పాల్పడి నెలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రజాప్రతినిధుల్ని పదవుల్ని తొలగించేలా కేంద్రం చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ గతేడాది జూన్లో అరెస్టయ్యారు.జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జైలు శిక్షను అనుభవించారు. జైలు శిక్షను అనుభవించే సమయంలో సీఎం పదవికి రాజీనామా చేయలేదు.ఆ సమయంలో ఈ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం భావించింది. కానీ ఆ సమయంలో చట్టాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షాలపై కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని అపవాదు వస్తుందనే ఉద్దేశ్యంతో వేచి చూసి ధోరణిని అవలంభించింది. కొంత కాలం తర్వాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడంతో వివాదాస్పద చట్టం మరుగున పడింది. మళ్లీ ఇన్నాళ్లకు అదే చట్టాన్ని అమలు చేసేలా లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రేరేపించిన మరో కేసు తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ కేసు. డీఎంకే పార్టీలో నాలుగు సార్లు సెంథిల్ బాలాజీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తమిళనాడు మాజీ రవాణాశాఖ మంత్రి, ఉద్యోగాల పేరుతో లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. 2023లో ఆయనను అరెస్ట్ చేసింది. దాదాపు 14 నెలలు జైల్లో ఉన్న తర్వాత 2024 సెప్టెంబర్ 26న బెయిల్ మంజూరైంది. సెంథిల్ బాలాజీ అరెస్టయి జైలు శిక్షను అనుభవిస్తున్న సమయంలో ఎలాంటి శాఖ లేకపోయినా మంత్రిగా కొనసాగారు. ఇదే విషయంలో మద్రాస్ హైకోర్టు బాలాజీపై తీవ్ర విమర్శలు చేసింది. శాఖ లేకుండా మంత్రిగా కొనసాగడం అంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నం కావడంతో తన పదవికి రాజీనామా చేశారు.బెయిల్ తర్వాత అన్నాడీఎంకేలో చేరి సెంథిల్ బాలాజీ మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.బెయిల్ ఇచ్చిన మరుసటి రోజు మీరు మంత్రిగా ప్రమాణం చేశారు. ఇప్పుడు సీనియర్ కేబినెట్ మంత్రిగా ఉన్నారు. సాక్షులు ప్రభావితం అవుతారనే అభిప్రాయం రావచ్చు’అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలా తప్పులు చేసి 30రోజుల పాటు జైలు శిక్షను అనుభవించిన నేతల పదవులు కోల్పోయేలా బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేసినట్లు సమాచారం.

ఠాక్రే కజిన్స్కు ఫస్ట్ షాక్! ఆ మర్నాడే..
దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత.. ఠాక్రే సోదరులు ఒక్కటి కావడం తెలిసిందే. ఈ కలయికతో మహా రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ, రెండు నెలలు తిరగకుండానే ఈ కజిన్స్కు తొలి షాక్ తగిలింది.ఉద్దవ్ శివసేన(Shivsena UBT)- మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS)కూటమి తొలి పరీక్షలోనే ఫెయిల్ అయ్యింది. ముంబై బెస్ట్ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఈ ఎన్నికలు త్వరలో జరగబోయే ముంబై కీలక మున్సిపల్ ఎన్నికలకు వార్మప్ మ్యాచ్గా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. దీంతో ‘‘ఠాక్రే బ్రాండ్ ఫ్లాప్’’ అంటూ బీజేపీ ఎద్దేవా చేస్తోంది. ‘‘ఇది కేవలం సహకార ఎన్నిక మాత్రమే కాదు, ఒక్కసారి విడిపోయిన ఠాక్రే సోదరులు మళ్లీ కలిసిన తర్వాత వారి రాజకీయ పునరాగమనానికి ఇది ఒక పరీక్ష. బీజేపీ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో విజయవంతంగా దూసుకుపోతున్న నేపథ్యంలో.. ఈ మొదటి అడ్డంకినే ఠాక్రేలు దాటలేకపోయారు’’ అక్కడి మీడియాలో విశ్లేషణ జరుగుతోంది. అయితే..ఈ ఫలితాలు వెలువడిన మరుసటిరోజే మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ను అధికార నివాసం వర్ష బంగ్లాకు వెళ్లి కలిశారు. సుమారు గంటన్నరపాటు ఇద్దరూ చర్చించుకున్నారు. దీంతో ఉద్దవ్కు రాజ్ హ్యాండిస్తారా? అనే ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే.. కాసేపటికే ఊహాగానాలకు రాజ్ ఠాక్రే తెర దించారు. ఇది రాజకీయ భేటీ ఎంతమాత్రం కాదని, నగర అభివృద్ధికి సంబంధించిన విషయాలపై సీఎంతో చర్చించినట్లు మీడియాకు తెలిపారు.గ్రేటర్ ముంబైను వర్షాలు ముంచెత్తడం, అదే సమయంలో నగరంలో ట్రాఫిక్ జామ్ పెరిగిపోతుండడం లాంటి అంశాలపైనే చర్చించినట్లు తెలిపారు. ‘‘పావురాలు, ఏనుగులు అంటూ అవసరం లేని విషయాలపై ముంబైని అధికార యంత్రాంగం ఎటో తీసుకుని పోతోంది. ఇరుకు రోడ్లలో వర్షాల వల్ల పడుతున్న కష్టాల గురించి సీఎంకు వివరించా. రోడ్ల విస్తరణ తద్వారా ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే అంశాల గురించి చర్చించా.. అంతే’’ అని రాజ్ ఠాక్రే తెలిపారు. ఈ భేటీలో నగర పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో హిందీ భాషను బలవంతంగా ప్రవేశపెడుతున్నారంటూ రాజ్ ఠాక్రే బీజేపీకి దూరం జరిగి.. సోదరుడు ఉద్దవ్ ఠాక్రేకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ కలిసి జులై 5వ తేదీన ముంబైలో ఆవాజ్ మరాఠీచి అనే కార్యక్రమం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫడ్నవిస్ ప్రభుత్వం హిందీ భాష అమలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోగా.. అయినాకూడా ఆ అపూర్వ కలయిక కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఫడ్నవిస్ వల్లే తాము ఒక్కటయ్యామని, మరాఠీ గౌరవం పేరిట తాము ఇకపై కలిసే పోరాడతామంటూ ప్రకటించారు కూడా.

‘ఏ తప్పూ చేయకున్నా.. రాజీనామా చేస్తున్నా’
కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పాలక్కడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్(35) రాజీనామా చేశారు. ఆయనపై వరుసగా లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం మధ్యాహ్నాం ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. అయితే..రాజీనామా చేయాలంటూ ఏఐసీసీ నుంచి ఒత్తిళ్లు వస్తునన్నట్లు ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. కానీ, తనను రాజీనామా చేయాలని ఎవరూ కోరలేదని ఆయన చెబుతున్నారు. ‘‘దేశ రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా నేను ఇప్పటిదాకా ఎలాంటి తప్పు చేయలేదు. నా మీద ఇప్పటిదాకా ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. నా రాజీనామా ఎవరూ కోరలేదు. అయినప్పటికీ నా పదవికి నేను రాజీనామా చేస్తున్నా. ఏ తప్పు చేయకపోయినా నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలేనని నిరూపించేందుకు ఈ రాజీనామా. నాకు మద్దతుగా నిలవడం కాంగ్రెస్ కార్యకర్తల పని కాదు. వాళ్లను ఆ పని చేయమని నేను కోరే రకమూ కాదు. నా నిర్దోషిత్వాన్ని నేను నిరూపించుకుంటా. ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం నాతో సహా ప్రతీ ఒక్కరి బాధ్యత’’ అని ఆదూర్ నివాసంలో మీడియా ప్రతినిధులకు ఆయన తెలిపారు.మలయాళ నటి రిని ఆన్ జార్జ్ సంచలన ఆరోపణలతో ఇవాళ కేరళ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఓ యువ ఎమ్మెల్యే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అసభ్యంగా తనకు సందేశాలు పంపించాడని, హోటల్కు రమ్మంటూ ఒత్తిడి చేశాడని, ఈ వ్యవహారంపై అతని పార్టీకి ఫిర్యాదు చేస్తానని చెబితే చేసుకోమని సమాధానామిచ్చాడని తెలిపింది. తనలాగే చాలామంది బాధితులు ఉన్నారంటూ ఆమె మీడియాకు తెలిపింది. ఈ క్రమంలో.. రాహుల్ మమ్కూటథిల్ పేరు తెర మీదకు వచ్చింది. అయితే ఆమె తనకు మంచి స్నేహితురాలని, తన పేరేం చెప్పలేదు కదా అని అంటూనే.. బహుశా వేరేవరో ఆమెను వేధించి ఉంటారని మీడియాతో అన్నాడు. ఈలోపే.. మలయాళీ రైటర్ హనీ భాస్కరన్ ఏకంగా రాహుల్ మమ్కూటథిల్ పేరుతో ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు. దీంతో దుమారం రేగింది. అధికార సీపీఐ(ఎం) కూటమి ఎల్డీఎఫ్, బీజేపీలు కాంగ్రెస్పై విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో వ్యవహారం హైకమాండ్కు చేరడంతో.. రాహుల్ మమ్కూటథిల్ను రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ కోరినట్లు అక్కడి మీడియా చానెల్స్లో ప్రముఖంగా కథనాలు వచ్చాయి.చిన్నవయసులోనే పలు వ్యాపారాల్లో రాణించిన రాహుల్ మమ్కూటథిల్.. 2006లో కేరళ స్టూడెంట్స్ యూనియన్తో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. జిల్లా అధ్యక్షుడు, ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహించాడు. కిందటి ఏడాది పాలక్కడ్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

మన గడ్డపై నుంచి మన రాకెట్లో అంతరిక్షంలోకి...
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరింత వేగంతో దూసుకెళ్లడం ఖాయమని భారత వ్యోమగామి, భారత వైమానిక దళం గ్రూప్ కెపె్టన్ శుభాంశు శుక్లా ఉద్ఘాటించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) వెళ్లి, విజయవంతంగా తిరిగి వచి్చన శుక్లా ఇటీవల స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయన గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మన వ్యోమగామి మన గడ్డపై నుంచి మన సొంత రాకెట్, మన సొంత క్యాప్సూల్లో అంతరిక్షంలోకి వెళ్లడం తథ్యమని, త్వరలోనే అది సాకారమవుతుందని పేర్కొన్నారు. ఐఎస్ఎస్ మిషన్ ద్వారా వెలకట్టలేని అనుభవం సొంతం చేసుకున్నానని తెలిపారు. శిక్షణ ద్వారా నేర్చుకున్నదాని కంటే ఇది ఎంతో మెరుగైనదని అన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మన దేశం అద్భుతంగా కనిపించిందని, సారే జహాసే అచ్ఛా అని వ్యాఖ్యానించారు. యాక్సియోమ్–4 మిషన్ ద్వారా గడించిన అనుభవం మన గగన్యాన్ మిషన్కు ఎంతగానో తోడ్పడుతుందని శుభాంశు శుక్లా పేర్కొన్నారు. ఐఎస్ఎస్ యాత్రలో భాగంగా గత ఏడాది కాలంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. శుక్లా ఇంకా ఏం చెప్పారంటే... ఈ విజయం భారతీయులదే‘‘ఎంత శిక్షణ పొందామన్నది ముఖ్యం కాదు. రాకెట్లో కూర్చున్న తర్వాత ఇంజన్ను మండించాక విభిన్నమైన అనుభూతి కలుగుతుంది. శిక్షణలో అలాంటిది పొందలేం. ఐఎస్ఎస్ యాత్రలో నేను పొందిన అనుభూతిని, అనుభవాన్ని మాటల్లో చెప్పలేను. రాకెట్ ఐఎస్ఎస్ వైపు దూసుకెళ్లడం మొదలయ్యాక.. కొన్ని సెకండ్లపాటు ఆ రాకెట్ వెనుక నేను పరుగెడుతున్నట్లు భావించా. నేను నిజంగా రాకెట్లో ప్రయాణిస్తున్నట్లు తెలియడానికి కొంత సమయం పట్టింది. నమ్మశక్యం కాని అనుభవం సొంతమైంది. నాకు అన్ని విధాలుగా మద్దతు ఇచి్చన మన ప్రభుత్వానికి, ఇస్రోకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఐఎస్ఎస్ యాత్ర సఫలం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. తామే స్వయంగా ఈ యాత్రలో పాల్గొంటున్నట్లు భారతీయులంతా భావించారు. నాకు అన్ని వేళలా అండగా నిలిచారు. నేను క్షేమంగా తిరిగిరావాలని ప్రారి్థంచారు. నా విజయం ప్రజలందరికీ చెందుతుంది’’ అని శుభాంశు శుక్లా స్పష్టంచేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొచ్చిన మొట్టమొదటి భారతీయుడిగా శుక్లా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. Met with the Hon PM today. Last time I spoke to him virtually was from Orbit with this same flag in the background on the @iss. I cannot describe how proud I felt that day representing Bharat and today when I was speaking to the PM @narendramodi Like I said this is just the first… pic.twitter.com/TsKGZmG8Ya— Shubhanshu Shukla (@gagan_shux) August 18, 2025శుక్లాకు నేను లక్ష్మణుడిని: ప్రశాంత్ శుభాంశు శుక్లా రాముడైతే తాను లక్ష్మణుడిని అని గగన్యాన్ మిషన్లో భాగస్వామి అయిన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్ చెప్పారు. మీడియా సమావేశంలో ఆయన కూడా మాట్లాడారు. శుక్లా వయసులో తన కంటే చిన్నవాడైనప్పటికీ తనకు అన్నగానే భావిస్తానని అన్నారు. ఈ రాముడికి లక్ష్మణుడిగా ఉండడం తనకు ఇష్టమని తెలిపారు. రామ లక్ష్మణులకు మొత్తం వానరసేన అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఇస్రోలో తామంతా ఒక బృందంగా కలిసి పనిచేస్తున్నామని వివరించారు. అది ఫెంటాస్టిక్ టీమ్ అన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఇస్రోను 1969లో స్థాపించారని, గత పదేళ్లుగా ఎన్నో విజయాలు సాధిస్తున్నామని చెప్పారు. గతంలో అంతరిక్ష ప్రయోగాల్లో మూసధోరణి ఉండేదని, దాన్ని బద్ధలు కొట్టామని పేర్కొన్నారు. ఇప్పుడు మనమే ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా మారామని తెలిపారు. రాజ్నాథ్ సింగ్తో శుక్లా భేటీ వ్యోమగామి శుభాంశు శుక్లా గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. తన అంతరిక్ష ప్రయాణం గురించి శుక్లా వివరించారు. శుక్లా ప్రస్థానం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆయన విజయాలు మనకు గర్వకారణమని వివరించారు.
ఎన్ఆర్ఐ

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం
తెలుగునాట నాట్స్ సేవా కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని మొల్లమాంబ వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. గత ఎనిమిదేళ్లుగా వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను శ్రీహరి మందాడి ప్రశంసించారు. మొల్లమంబ వృద్ధాశ్రమానికి నాట్స్ తన వంతు చేయూత అందిస్తుందని శ్రీహరి భరోసా ఇచ్చారు. కన్న తల్లిదండ్రులను ఎవరూ విస్మరించకూడదని శ్రీహరి అన్నారు. పేద వృద్ధులకు మానవత్వంతో సాయం చేయడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.. అమెరికాలో నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని, ముఖ్యంగా పేదల ఆకలి బాధలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తుందని శ్రీహరి తెలిపారు.

తెలుగు విద్యార్ధుల కోసం నాట్స్ రోబోటిక్ వర్క్ షాప్
అమెరికాలో ఉండే తెలుగు విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మేరీల్యాండ్ విభాగం ఆన్లైన్ ద్వారా రోబోటిక్ వర్క్ షాప్ నిర్వహించింది. ప్రైమరీ, హైస్కూల్ విద్యార్ధులకు రోబోటిక్, అంతర్జాతీయంగా నిర్వహించే ఫస్ట్ లెగో లీగ్ పోటీలపై అవగాహన కల్పించింది. రోబోటిక్స్ నిపుణులు అలోక్ కుమార్ ఎన్నో విలువైన అంశాలను ఈ వర్క్ షాప్లో తెలిపారు. అలాగే విద్యార్దుల ప్రశ్నలకు ఎంతో ఓపికగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. విద్యార్ధుల్లో రోబోటిక్స్ పై ఆసక్తి పెరిగేలా ఈ వర్క్ షాప్ జరిగింది. మేరీల్యాండ్ నాట్స్ విభాగం నిర్వహించిన ఈ ఆన్లైన్ వర్క్ షాప్కి మేరీల్యాండ్తో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, డెలావేర్, ఫ్లోరిడా రాష్ట్రాల నుంచి తెలుగు విద్యార్ధులు పాల్గొన్నారు. రోబోటిక్స్పై అవగాహన పెంచుకున్నారు. నాట్స్ నాయకులు రవికిరణ్ తుమ్మల, కిరణ్ మందాడిలు ఈ వర్క్షాపు మద్దతు ఇచ్చినందుకు నాట్స్ మేరీ ల్యాండ్ విభాగం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వర్క్ షాప్ నిర్వహణలో నాట్స్ మేరీ ల్యాండ్ చాప్టర్ కో ఆర్డినేటర్ వకుల్ మోర్, జాయింట్ కోఆర్డినేటర్ విశ్వ మార్ని, మేరీల్యాండ్ నాట్స్ మహిళా విభాగం నాయకురాలు హరిణి నార్ల, కల్చరల్ టీం అధ్యక్షురాలు సువర్ణ కోనగల్లలు కీలక పాత్ర పోషించారు. రోబోటిక్ వర్క్ షాప్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు.

ఆటిజం బాధితులకు అండగా నాట్స్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగునాట అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో స్పర్శ్ స్పెషల్ స్కూల్ ఫర్ ఆటిజం చిల్డ్రన్కు నాట్స్ మద్దతు ఇస్తుంది. తాజాగా నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, నాట్స్ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారెలు ఈ ఆటిజం పాఠశాలను సందర్శించారు. ఆటిజం పిల్లలకు తమ వంతు సాయం అందించేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆటిజం పిల్లల మానసిక వికాసానికి నాట్స్ చేయూత అందిస్తుందని నాట్స్ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ తెలిపారు. గతంలో ఆటిజం ఆన్ వీల్స్ అనే వాహనాన్ని నాట్స్ ఈ పాఠశాలకు అందించింది.

బ్రూనై తెలుగు సంఘం 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బ్రూనై దారుస్సలాంలో భారత హైకమిషన్ నిర్వహించిన 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బ్రూనై తెలుగు సంఘం, గర్వంగా పాల్గొంది.ఈ వేడుకల్లో సంఘానికి చెందిన పిల్లలు దేశభక్తి గీతాలకు నృత్యాలు, భారత మాత వేషధారణ, ప్రేరణాత్మక ప్రసంగాలు, ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. భారత హైకమిషనర్ శ్రీ రాము అబ్బగాని గారు భారత గౌరవనీయ రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని వాచించారు మరియు కొత్తగా ప్రారంభించిన భారత హైకమిషన్ భవనంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు వెంకట రమణ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు: ఈ చారిత్రాత్మక వేడుకలో భాగం కావడం మా గర్వకారణం. ఇది మన చిన్నారుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా, భారతదేశం మరియు బ్రూనై దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తుందన్నారు. భారతీయ సాంస్కృతిక సంపదను విదేశాల్లో ప్రోత్సహించే సాంస్కృతిక, విద్యా సామాజిక కార్యక్రమాలలో బ్రూనై తెలుగు సంఘం చురుకుగా పాల్గొంటూనే ఉందని తెలిపారు.
క్రైమ్

డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం.. ఆనవాళ్లు లేకుండా కాల్చేసి!
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతదేహం లభ్యం కావడం కలకలం సృష్టించింది. తనిఖీలో భాగంగా ఆమైపె అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా కోవేరహట్టి గ్రామానికి చెందిన వర్షిత (19) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. ఆమె పట్టణంలోని ప్రభుత్వ మహిళల డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం బీఏ డిగ్రీ చదువుతూ ఇక్కడ ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో ఉంటోంది. అయితే, వర్షిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది. గుర్తుతెలియని దుండగులు ఆమెను దారుణంగా హత్య చేసి గుర్తించడానికి వీలు లేకుండా పెట్రోలు పోసి దహనం చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో వర్షం మొదలవడంతో మంటలు ఆరిపోగా మృతదేహం సగం కాలిపోయింది.అనంతరం, హత్యకు గురైన యువతి మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో యువతి చేతికి వేయించుకొన్న టాటూ ఆధారంగా వర్షితగా గుర్తించారు. ఇక, ఈ కేసులో ఆమెతో స్నేహంగా ఉంటున్న చేతన్ అనే యువకుడిని అరెస్టు చేశారు. పూర్తి విచారణ తర్వాత మాత్రమే అసలు విషయాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. తమ కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు కాగా బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.కర్ణాటకలో నిరసనలు..మరోవైపు.. యువతి హత్యను ఖండిస్తూ చిత్రదుర్గలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. వివిధ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి పట్టణ వీధుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

పుట్టినరోజునే నూరేళ్లు
సిరిసిల్లటౌన్: పుట్టినరోజున ఇంట్లో అమ్మ ఆశీస్సులు పొంది, దోస్తులతో ఆనందంగా గడుపొచ్చన్న యువకుడిని విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కబళిచింది. స్థానికులు తెలిపిన వివరాలు..తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్కు చెందిన కొమ్ము మైసయ్య–నవీన దంపతులు సిరిసిల్ల నెహ్రూనగర్లో నివాసం ఉంటున్నారు. మైసయ్య ఉపాధి కోసం గల్ఫ్లో ఉండగా..భార్య నవీన ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. వీరికి లక్ష్మీనారాయణ ఉరఫ్ లక్కీ(20), నిఖిల్, శ్వేత సంతానం. కొద్దిరోజులు హైదరాబాద్లో పనిచేసిన లక్ష్మీనారాయణ ఇటీవలే సిరిసిల్లకు వచ్చి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నాడు. వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు గణేశ్ ప్రతిమను తీసుకురావడానికి లక్ష్మీనారాయణ సోమవారం ఫ్రెండ్స్తో ఆర్మూర్ వెళ్లాడు.పుట్టినరోజే కానరాని లోకాలకు..మంగళవారం తన పుట్టినరోజు కావడంతో దోస్తులతో కలిసి అప్పటికే ఆర్డర్ ఇచ్చిన 15 అడుగుల వినాయక ప్రతిమను తీసుకొచ్చి వేడుకలు జరుపుకోవాలని లక్కీ, ఫ్రెండ్స్ నిశ్చయించుకున్నారు. సోమవారం రాత్రి వర్షంలో ఇబ్బందులు ఎందుకని ఫ్రెండ్స్ అందరూ ఆర్మూర్లోనే పడుకున్నారు. మంగళవారం ఉదయం సిరిసిల్లకు వినాయక విగ్రహంతో ప్రయాణమయ్యారు. కామారెడ్డి జిల్లా ఆరెపల్లి గ్రామ స్టేజీ వద్ద హైటెన్షన్ కరెంటు తీగలకు గణపతి విగ్రహానికి అమర్చిన ఇనుప పైపులు తగిలి లక్ష్మీనారాయణ, సాయి అనే ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే షాక్తో పడిపోయారు. స్నేహితులు, స్థానికులు వెంటనే వారికి సీపీఆర్ చేయగా, సాయి మెలకువలోకి రాగా, లక్ష్మీనారాయణ అలానే పడిపోయాడు. వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మరో గంట సమయం గడిస్తే సిరిసిల్లకు చేరేవారు. కాగా, లక్కీ, సాయిలకు కాళ్లకు చెప్పులు లేకపోవడంతో షాకు తగిలినట్లు ఫ్రెండ్స్ చర్చించుకుంటున్నారు. పుట్టినరోజునే లక్కి జీవితం విషాదాంతంగా ముగియడం సిరిసిల్లలో తీరని విషాదం నింపింది.

నైట్ డ్యూటీకి భర్త.. ప్రియుడితో భార్య..
కర్ణాటక: మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత నమ్మకం, విశ్వాసం అనే వారధిపై జీవితాంతం సుఖంగా సాగాల్సిన దాంపత్య ప్రయాణానికి మధ్యలోనే బ్రేకులు పడుతున్నాయి. అగ్నిగుండం సాక్షిగా కలిసి ఏడడుగులు నడిచినప్పుడు చేసుకున్న బాసలు చెదిరిపోతున్నాయి. భవిష్యత్ కోసం కన్న కలలు చెదిరిపోతున్నాయి. కుటుంబ కలహాలు, అనైతిక సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చురేపుతున్నాయి. ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి. ఫలితంగా ఆ కుటుంబంలోని చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ తాలుకాలో గడిచిన ఐదు నెలల కాలంలో చిన్నచిన్న విషయాలు, అనైతిక సంబంధాల అనుమానాలతో ఏడుగురు మహిళలు తమ భర్తల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. తల్లులు హత్యకు గురవ్వడం, తండ్రులు జైలుకు వెళ్లడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. 2025 జనవరి నుంచి జూన్ వరకు ఆనేకల్ తాలూకా సూర్యాసిటీ, ఆనేకల్, ఎల్రక్టానిక్సిటీ, హెబ్బగోడిల పోలీస్స్టేషన్ల పరిధిలో ఒక్కో హత్య చోటు చేసుకోగా ఆత్తిబెలి పోలీసు స్టేషన్ పరిధిలో రెండు హత్యలు జరిగాయి. వివిధ ప్రాంతాలనుంచి ఉపాధి కోసం ఆనేకల్ తాలూకాకు వలస వచ్చి ఉంటున్న కుటుంబాల్లో ఈ దారుణాలు జరిగాయి. అక్రమ సంబంధాలు, భార్యలపై అనుమానాలు, మద్యం సేవనం తదితర కారణాలతో ఈ హత్యోదంతాలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. భార్య తల నరికి స్టేషన్కు వెళ్లిన భర్త ఆనేకల్ తాలూకా చందాపుర సమీపంలోని హిలలీగ గ్రామంలో జూన్ 8న ఓ వ్యక్తి తన భార్య తలను నరికి దానిని కవరులో పెట్టుకోని సూర్యా సిటీ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. భార్య మరోవ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో కడతేర్చినట్లు అంగీకరించాడు. నిందితుడు హెబ్బగోడిలోని పారిశ్రామిక వాడలోని ప్రైవేటు కంపెనిలో పని చేస్తూ ఐదేళ్ల క్రితం ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. తాను రాత్రి విధులకు వెళ్లిన సమయంలో భార్య మరొకరితో గడిపేదని, ఈ ఘటనను జీర్ణించుకోలేక భార్యను కడతేర్చినట్లు భర్త పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఏప్రిల్ 5న ఎల్రక్టానిక్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో బాగేపల్లికి చెందిన మహిళను భర్త అనుమానంతో హత్య చేశాడు. మార్చి 28వ తేదిన ఆనేకల్ తాలుకా జిగణి పోలీసు స్టేషన్పరిధిలో మహిళ హత్యకు గురైంది. జనతా కాలనీకి చెందిన మహిళకు ఓ వ్యక్తితో వివాహమైంది. కుటుంబ కలహాలతో ఆమె పుట్టినింటికి చేరింది. భర్త వెళ్లి కాపురానికి రావాలని భార్యను కోరగా ఆమె నిరాకరించింది. దీంతో చాకు తీసుకొని భార్య గొంతు కోసి హత్య చేసి అనంతరం తానూ ఆత్మహత్యా యత్నం చేశాడు. మార్చి 18వ తేన అత్తిబెలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న రాచమానహళ్లిలో భార్య శీలంపై అనుమానంతొ భర్త బార్యను హత్య చేశాడు. మార్చి 4న ఆనేకల్ పోఈసు స్టేషన్ పరిధిలోని గుడ్నళ్లిలో మహిళ హత్యకు గురైంది. దంపతులు మద్యం మత్తులో వాదులాడుకున్నారు. ఓ దశలో భర్త భార్యను హత్య చేశాడు.పిబ్రవరి 16న సర్జాపుర సమీపంలో తిగళ చౌడదేనహళ్లి గ్రామంలో మానసిక దివ్యాంగురాలు హత్యకు గురైంది. భర్త తన భార్యను నిర్మాన దశలోఉన్న భవనంపైకి తీసుకెళ్లి కిందకు తోసి హత్య చేశాడు.ఫిబ్రవరి 6న హెబ్బగోడి పోలీసు స్టేషన్ పరిధిలో బిడ్డ కళ్ల ముందు ఓ వ్యక్తి తన భార్యను చాకుతో పొడిచి హత్య చేశాడు. భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లి హత్యకు గురవ్వడం, తండ్రి జైలుకు వెళ్లడంతో వారి సంతానం అనాథగా మారింది. కౌన్సిలింగ్ కేంద్రాలు, మహిళా పోలీస్స్టేషన్లు అవసరం ఆనేకల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలనుంచి ప్రజలు ఉపాధి కోసం ఇక్కడకు వలస వస్తుంటారు. ఇటీవల దంపతుల మధ్య గోడవలు, అక్రమ సంబంధాలతో హత్యలు రుగతున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా వివాదాల పరిష్కారానికి కౌన్సెలింగ్ కేంద్రాలు, మహిళా పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

తన భర్త సంసారానికి పనికిరాడని..!
చెన్నై: చెన్నై, ఆలందూర్లో పిల్లలు లేరనే విరక్తితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చెన్నై ఆలందూరుకు చెందిన కోటేశ్వరి (30)కి, తిరుచ్చి జిల్లా కూవియలూరుకు చెందిన వినోద్కు రెండేళ్ల క్రితం పెళ్లయింది. గత రెండేళ్లుగా పిల్లలు లేకపోవడంతో కోటేశ్వరి వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందింది. అయితే వైద్య నివేదికలో కోటేశ్వరికి ఎలాంటి లోపాలు లేవని తేలింది. దీంతో కోటేశ్వరి తన భర్త వినోద్ను వైద్య చికిత్సకు రమ్మని పిలిచినప్పుడు, అతను రాలేదు. దీంతో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీనితో మనస్తాపం చెందిన కోటేశ్వరి మంగళవారం తెల్లవారుజామున ఇంట్లోని బాత్రూంలో దుపట్టాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
వీడియోలు


విద్యాశాఖ మొద్దునిద్ర.. డిగ్రీ అడ్మిషన్ ప్రాసెస్ ను పట్టించుకోని కూటమి సర్కార్


భూమన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు.. BR నాయుడుపై మహిళా ఉగ్రరూపం


TV5 Midnight Masala.. లైవ్ లో BR నాయుడు బాగోతం బట్టబయలు చేసిన కారుమూరి


శ్రీకాంత్ పెరోల్.. అడ్డంగా బుక్కైన హోంమంత్రి అనిత.. సాక్షి చేతిలో సంచలన ఆధారాలు


గోవింద నామస్మరణ చేయాల్సిన చోట.. బూతులా..! దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త


Chiranjeevi Birthday: విశ్వంభర గ్లింప్స్ రిలీజ్


టీడీపీ ఎమ్మెల్యేల అసభ్య ప్రవర్తన, బూతులపై కేబినెట్లో చర్చ


15 నెలలుగా కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు.. ఇక మేం ఎలా పని చేయాలి?


పల్నాడు జిల్లా గరికపాడులో టీడీపీ నేత బరితెగింపు


Hero Vijay Thalapathy: TVK పార్టీ భారీ బహిరంగ సభ