ప్రధాన వార్తలు

ఇది కదా హ్యూమన్ స్పిరిట్ .. ఓ వైపు పెళ్లి.. మరో వైపు అంత్యక్రియలు
కౌలాలంపూర్: నేటి సమాజంలో మంటగలుస్తున్న మానవత్వానికి మచ్చుతునక ఈ ఉదంతం. జూలై 5న మలేషియాలోని నెగెరి సెంబిలాన్ రాష్ట్రంలోని టంపిన్ పట్టణంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వైపు భారతీయ కుటుంబం వివాహ వేడుకను నిర్వహిస్తుండగా, అదే వీధిలో చైనా కుటుంబం 94 ఏళ్ల మహిళకు అంత్యక్రియలు నిర్వహించింది.చైనా కుటుంబానికి చెందిన వాంగ్ అనే రాజకీయ నాయకుడు తన తల్లి మరణాన్ని ‘జాయ్ఫుల్ ఫ్యూనరల్’గా పేర్కొన్నారు. అంటే, వృద్ధాప్యంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మరణించడం చైనా సంస్కృతిలో శుభంగా భావిస్తారు. అయితే, తన తల్లి మరణంతో వాంగ్ భారతీయ కుటుంబాన్ని సంప్రదించారు. ‘రాత్రి ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు ఉండవు. మీరు మీ వేడుకను కొనసాగించవచ్చు అని వారికి భరోసా ఇచ్చారు. దీంతో భారతీయ కుటుంబం పెళ్లి వేడుక ఘనంగా నిర్వహించింది. సంగీతాన్ని తగ్గించి, అతిథులను అంత్యక్రియల ప్రదేశానికి దూరంగా వాహనాలు పార్క్ చేయమని సూచించింది.ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇది నిజమైన మలేషియన్ స్పిరిట్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. సాంస్కృతిక భిన్నత్వం ఉన్నా.. పరస్పర గౌరవం, సానుభూతి ఎలా మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్తాయో ఇది ఒక అద్భుత ఉదాహరణగా నిలిచిందని కామెంట్లు చేస్తున్నారు.

సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్ను హైకోర్టుకు సుప్రీం కోర్టు తిప్పి పంపించింది. అరెస్టు నుంచి రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్పై గురువారం.. సుప్రీంకోర్టు విచారణ జరిపింది.హైకోర్టు తమ వాదన వినకుండానే ముందస్తు బెయిల్ ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదించారు. దాంతో కేసును ఏపీ హైకోర్టు మరోసారి విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అరెస్టు నుంచి రక్షణను సుప్రీంకోర్టు పొడిగించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

సచిన్కు చోటు లేదు!.. ఈ లిస్టులో టాప్-5లో ఉన్న క్రికెటర్లు వీరే!
టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య టెస్టు సిరీస్.. క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలైన సంప్రదాయ ఫార్మాట్ మజాను అందిస్తోంది. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్లో ఇప్పటికి మూడు పూర్తయ్యాయి.అయితే, ఈ మూడు టెస్టులు ఆఖరిదైన ఐదో రోజు వరకు ఉత్కంఠగా సాగడం ఒక విశేషమైతే.. అన్నింటిలోనూ ఫలితం కూడా తేలడం మరో విశేషం. లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మ్యాచ్ను టీమిండియా నుంచి లాగేసుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ఇక ఎడ్జ్బాస్టన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన టీమిండియా సారథి శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)లతో అదరగొట్టి.. భారత్కు ఏకపక్ష విజయం అందించాడు. ఎడ్జ్బాస్టన్లో తొలిసారి టీమిండియా గెలుపు జెండా ఎగరవేయడంలో కీలక పాత్ర పోషించి ఈ అవార్డు అందుకున్నాడు.అయితే, లార్డ్స్ టెస్టులో మాత్రం ఆతిథ్య జట్టు మరోసారి పైచేయి సాధించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇటు బ్యాట్తో.. అటు బంతితో రాణించి.. జట్టును గెలిపించుకున్నాడు. తద్వారా 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. ఇలా మూడు టెస్టుల్లో ఒక్కొక్కరు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు.మరి టెస్టు ఫార్మాట్లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న క్రికెటర్ల జాబితాలో టాప్-5లో ఉన్నది ఎవరో తెలుసా?!.. సంప్రదాయ క్రికెట్లో అత్యధిక పరుగుల వీరుడి (15921)గా ఉన్న టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ మాత్రం ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.జాక్వెస్ కలిస్సౌతాఫ్రికా లెజెండరీ ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్ టెస్టుల్లో అత్యధికంగా 23 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. తన కెరీర్లో 166 టెస్టు మ్యాచ్లు ఆడిన కలిస్.. 13289 పరుగులు చేశాడు. ఇందులో 45 శతకాలు, రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి.ముత్తయ్య మురళీధరన్శ్రీలంక స్పిన్ దిగ్గజం టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్ల వీరుడు (800). అతడు తన కెరీర్లో 133 టెస్టులాడి 19 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.వసీం అక్రంపాకిస్తాన్ ఐకానిక్ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ తన కెరీర్లో 104 టెస్టులు ఆడి.. 414 వికెట్లు కూల్చాడు. తన నిలకడైన బౌలింగ్తో ఈ స్వింగ్ సుల్తాన్ పదిహేడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.షేన్ వార్న్ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేర్ వార్న్. అంతర్జాతీయ క్రికెట్లో 145 టెస్టులు ఆడిన వార్న్.. 708 వికెట్లు పడగొట్టాడు. అతడి ఖాతాలోనూ పదిహేడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఉన్నాయి.కుమార్ సంగక్కరశ్రీలంక మాజీ కెప్టెన్, స్టైలిస్ లెఫ్టాండ్ బ్యాటర్ కుమార్ సంగక్కర తన కెరీర్లో 134 టెస్టు మ్యాచ్లు ఆడాడు. నిలకడైన ప్రదర్శనలతో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ ప్రధాన పిల్లర్గా పేరొందిన సంగక్కర పదహారు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సంగక్కర టెస్టుల్లో 38 సెంచరీలు, 11 డబుల్ సెంచరీల సాయంతో 12400 పరుగులు సాధించాడు. అ న్న ట్లు చెప్పనే లేదు కదూ! సచిన్ తన కెరీర్లో పద్నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. చదవండి: భారత ఓపెనింగ్ జోడీ ప్రపంచ రికార్డు

రష్యన్ మహిళను వెతికి పట్టుకోండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భర్తతో విడాకుల కేసు పెండింగ్లో ఉన్న సమయంలో ‘కస్టడీ డీల్’లో ఉన్న ఐదేళ్ల పిల్లాడితో కనిపించకుండా పోయిన రష్యాకు చెందిన మహిళను వెంటనే వెతికి పట్టుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు. కొన్నేళ్ల క్రితం రష్యాకు చెందిన మహిళ విక్టోరియా బసూను భారత్కు చెందిన సైకత్ బసూ వివాహం చేసుకోగా, ప్రస్తుతం వారి మధ్య విడాకుల కేసు ఢిల్లీ సాకేత్ కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ సమయంలో విక్టోరియా బసూ కనిపించకుండా పరారైయినట్లు భర్త సైకత్ బసూ ఫిర్యాదు చేశాడు. తన భార్య పిల్లాడిని తీసుకుని పరారైనట్లు సైకత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిలో భాగంగా విచారణ చేపట్టిన ధర్మాసనం సదరు మహిళను వెంటనే పట్టుకోవాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో రష్యన్ మహిళ వెంట పెట్టుకుని తీసుకుని పోయిన ఆమె కుమారుడ్ని వెంటనే ట్రేస్ అవుట్ చేయాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. ఇందులో ఎటువంటి జాప్యం లేకుండా త్వరతగతిన పిల్లాడి ఆచూకీని ఛేదించాలని స్పష్టం చేసింది. ఆపై పిల్లాడిని తండ్రి సైకేత్కు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం.. పిల్లాడితో పాటు కనిపించకుండా పోయిన విక్టోరియా బసూ పాస్పోర్ట్ సీజ్ చేయాలని ఆదేశించింది. ఎయిర్పోర్ట్, నావీ పోర్ట్ల్లో అధికారులు ఆ మహిళపై ఓ కన్నేసి ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది ధర్మాసనం. అదే సమయంలో ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. విక్టోరియా బసూ ఎక్కడ ఉందో తెలియదంటూ ఆమె తరఫు న్యాయవాది తెలిపిన క్రమంలో.. సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ‘ ‘ఆమె ఎక్కడ ఉందో మీకు తెలుసు. మీరు మాతో ఆటలు ఆడాలనుకుంటున్నారా?, మీ దగ్గరికి మళ్లీ వస్తాం.. మీరు కాస్త ఆగండి’ అని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఆమెకు రష్యా ఎంబాసీ అధికారి సాయం చేశారు..తన భార్య పారిపోవడానికి భారత్లో ఉన్న రష్యన్ ఎంబసీ ప్రతినిధి సాయం చేశారని సైకేత్ కోర్టుకు తెలిపారు. విడాకుల కేసు ప్రోసిడింగ్స్లో ఉండగా ఢిల్లీలోని రష్యన్ ఎంబసీ నుంచి ఆమె పారిపోయిందని భర్త తెలిపారు. ఎంబసీ వెనుక గేటు నుంచి ఆమె వెళ్లిపోయిందని, రష్యన్ ఎంబసీ అధికారి ఆమెకు సాయం చేశారని భర్త ఆరోపిస్తున్నాడు. లగేజీ పట్టుకుని మరీ వెళ్లిన ఆమెను సదరు అధికారి పంపించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. రష్యన్ ఎంబాసీ అధికారి ఆమెకు సాయం చేయడం తాను చూశానన్నాడు. అ అధికారి ఇళ్లు సోదా చేయడానికి అనుమతి కోరండిరష్యన్ రాయబార కార్యాలయ అధికారితో సంబంధం ఉందని బాధిత భర్త చేసిన ఆరోపణను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది; ఆమె గుర్తించబడకుండా భవనంలోకి ప్రవేశించడానికి సహాయం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఎవరు అనేది అస్పష్టంగా ంది. ఢిల్లీలోని ఈ అధికారి ఇంటిని సోదా చేయడానికి అనుమతి కోరాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది సుప్రీంకోర్టు.విడాకుల కేసు పెండింగ్లో ఉన్న కారణంగా ఆ పిల్లాడు మూడు రోజులు తల్లి దగ్గర ఉండాలనేది కస్టడీ డీల్. దీనిలో భాగంగా మే 22వ తేదీన పిల్లాడిని తీసుకుంది. అదే తాను పిల్లాడిని చివరిసారి చూడటమని కోర్టుకు తెలిపాడు భర్త సైకేత్. భార్య విక్టోరియా బసూ.. జూలై 7 నుంచి పిల్లాడితో సహా కనిపించకుండా పోయిందని సైకేత్ బసూ కోర్టుకు తెలిపారు.

‘వాగ్దానాలకు అతీలేదు గతి లేదు.. మందు కావాలని మాత్రం ఆలోచించారు’
పశ్చిమ గోదావరి జిల్లా: కూటమ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలకు చేసిన పాలనకు పొంతన లేదని వైఎస్సార్సీపీ ఉయగోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్. బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. జిల్లాలోని ఉండి నియోజకవర్గం ఇంచార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో బాబు షూరిటీ -మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళి కృష్ణంరాజు, కన్వీనర్ ఉమాబాల, మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ చిన్నమిల్లి వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు బొత్స మాట్లాడుతూ.. ‘ కూటమి నేతల మెడలు వంచి పాలన చేయించాలనే ఉద్దేశంతోనే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టాము. ఐదు కోట్ల మందిపై ప్రమాణం చేసి భవిష్యత్తు గ్యారెంటీ అంటూ బాండ్లు ఇచ్చారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇచ్చిన వాగ్దానాలను కూటమీ ప్రభుత్వం నెరవేర్చలేదు. మూడు సిలిండర్లని ఒక సిలిండర్ ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీల గురించి అడిగితే నాలికమందం అంటున్నాడు చంద్రబాబు. చంద్రబాబు మాయగాడు.. మాయగాడికి తోడు ఒక మోసగాడు తోడయ్యాడు. ఎప్పుడు ఎన్నికల్లో గెలిచిన ప్రజలను మోసం చేయడమే వారి ఉద్దేశం. ప్రజలకు ఐదువేళ్లు నోట్లోకి వెళ్లడం కావాలి.. మందు కాదు. చంద్రబాబు ప్రజలకు మందే కావాలని ఆలోచించాడు. రైతులకు పెట్టుబడి సాయం ఇప్పటి వరకు ఇవ్వలేదుచంద్రబాబు 100 అబద్ధాలు ఆడితే లోకేష్ 200 అబద్దాలు ఆడుతున్నాడు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలకు అతీలేదు గతి లేదు. అడిగితే ఒకరేమో నాలికమందమని ఇంకో ఆయన ఏమో తాటతీస్తాను మక్కెలు ఇరగ కొడుతాను అంటున్నాడు. ఐదు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు మానేశారు ఈ రాష్ట్రంలో.. ఇది వాస్తవం. ఆడబిడ్డ నిధి 1500.. ఎప్పటినుండి ఇస్తారు. P-4 పేరుతో అభివృద్ధి పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు.’ అని బొత్స మండిపడ్డారు.

‘నిమిషకు న్యాయపరమైన సాయం అందిస్తున్నాం’
న్యూఢిల్లీ: యెమెన్లో చివరి నిమిషంలో మరణశిక్ష వాయిదా పడ్డ కేరళ నర్సు నిమిష కేసు అంశానికి సంబంధించి భారత విదేశాంగ శాఖ స్పందించింది. నిమిష కేసులో అవసరమైన న్యాయ సహాయాన్ని అందిస్తున్నామని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం ప్రయత్నాలే వల్లే నిమిష మరణశిక్ష వాయిదా పడిందని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. నిమిష తరఫున లాయర్ను కూడా నియమించినట్లు ఆయన తెలిపారు. సదరు లాయర్ ఆ ఫ్యామిలీతో రెగ్యులర్గా ఫాలో చేస్తూ అందుబాటులో అవసరమైన సలహాలు ఇస్తున్నారన్నారు. అలాగే యెమెన్ అధికారులతో కూడా లాయర్ టచ్లో ఉంటూ కేసుకు సంబంధించిన విషయాల్ని చూసుకంటున్నారని రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.కాగా, యెమెన్లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఆమె మరణ శిక్షను వాయిదా వేస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. యెమెన్ సనా జైలులో బుధవారం(జూలై 16వ తేదీ) మధ్యాహ్నాం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో మరణశిక్ష వాయిదా పడింది.2008లో కుటుంబ ఆర్థిక అవసరాల కోసం యెమెన్ వెళ్లిందామె. 2011లో భారత్కు వచ్చి వివాహం చేసుకుంది. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఆ తర్వాత ఆమె మళ్లీ యెమెన వెళ్లింది. అక్కడి చట్టాల ప్రకారం.. తలాబ్ అబ్దో మహ్దీ అనే వ్యక్తితో కలిసి క్లినిక్ తెరిచింది. అయితే తలాబ్ తనను వేధించాడంటూ ఆమె 2016లో పోలీసులను ఆశ్రయించింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో తలాబ్ వద్ద చిక్కుకున్న తన పాస్పోర్టును దొంగలించేందుకు అతనికి మత్తుమందిచ్చింది. ఓవర్డోస్ కావడంతో అతను మరణించాడు. శవాన్ని ఓ వాటర్ ట్యాంకర్లో పడేసి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కింది. 2020లో ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి.

'మూడేళ్లుగా గోసపడ్డ కోటన్న.. నిల్చోలేడు, కూర్చోలేడు, నడవలేడు'
తండ్రిగా, విలన్గా, విలక్షణ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, కామెడీ విలన్గా.. తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao). సినీ చరిత్రలో తనకంటూ ఓ పేజీ లిఖించుకున్న ఆయన జూలై 13న ఇక సెలవంటూ వీడ్కోలు తీసుకున్నారు. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేసిన నటుడు బాబూమోహన్.. కోటగారు ఇక లేరన్న విషాదాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.చివరిరోజుల్లో తీవ్రబాధ..తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాబూ మోహన్ (Babu Mohan) మాట్లాడుతూ.. ఇద్దరం ఆర్టిస్టులమే అయినా మాకు తెలియకుండానే అన్నదమ్ములమైపోయాం. ఏరా, ఎక్కడున్నావ్? వారమైంది, ఒకసారి రారా అని పిలిచేవారు. అవును, వెళ్లి చూడాలనుకునేవాడిని. కానీ ఇప్పుడా బంధం తెగిపోయింది. పాపం, కోటన్న చివరి రోజుల్లో కాలి నొప్పితో బాధపడ్డాడు. బాత్రూమ్లో కాలి జారి కిందపడటం.. నొప్పి ఉన్న కాలికే మళ్లీ గాయం కావడంతో చాలా ఇబ్బందిపడ్డాడు. నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు. రెండు, మూడు సంవత్సరాల నుంచి అదే గోస.అలాంటి మరణమే నాకూ రావాలి ఒక విషయంలో మాత్రం దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూర్తిగా మంచానపడి, సపర్యలు ఎంతకాలం చేయాలని ఇంట్లోవాళ్లే అసహ్యించుకునే స్థాయికి భగవంతుడు ఆయన్ని తీసుకెళ్లనివ్వలేదు. కోటన్న నిద్రలోనే కన్నుమూశాడు. అలాంటి చావే నాకూ కావాలి. నీలాంటి మరణమే నాకూ ఇవ్వమని ఆ దేవుడికి చెప్పమని కోటన్నను వేడుకుంటున్నాను. మా ప్రయాణం ఎలా మొదలైందంటే.. బొబ్బిలి రాజా మూవీతో మా కాంబినేషన్ మొదలైంది. మామగారు చిత్రంతో బాగా ఫ్రెండ్సయ్యాం. చనిపోవడానికి ఒకరోజు ముందే..సెట్లో నాకు గోరుముద్దలు తినిపించేవాడు. అన్న చనిపోవడానికి ఒకరోజు ముందే ఫోన్ చేసి మాట్లాడాను. షూటింగ్ మొదలైంది, మళ్లీ చేస్తానని కాసేపాగి కాల్ చేశా.. అప్పుడు అన్న నిద్రపోయాడని చెప్పారు. సరే, మళ్లీ నిద్రలేచాక ఫోన్ చేయమన్నాను. తర్వాతి రోజు తెల్లవారుజామున 5 గంటలకు కోటన్న చనిపోయారని ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రాగానే నాకు కన్నీళ్లు ఆగలేదు అంటూ బాబూ మోహన్ ఏడ్చేశాడు.చదవండి: జబర్దస్త్ పవిత్రకు ప్రపోజ్ చేసిన ప్రిన్స్ యావర్.. అబ్బో!

ఇంగ్లండ్తో నాలుగో టెస్టు.. టీమిండియాకు భారీ షాక్
లార్డ్స్ టెస్టులో హార్ట్ బ్రేకింగ్ ఓటమి తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్తో మరో రసవత్తర పోరుకు టీమిండియా సిద్దమైంది. మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా తమ సన్నాహాకాలను ప్రారంభించింది. గురువారం ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం నెట్స్లో భారత ఆటగాళ్లు చెమటోడ్చారు.అర్ష్దీప్కు గాయం..!అయితే ఈ మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ చేతి వేలికి గాయమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ రిపోర్ట్లో పేర్కొంది. బంతి చేతి వేలికి తాకడంతో రక్తం కూడా వచ్చినట్లు తెలుస్తోంది.దీంతో అతడి చేతి వేలికి ఫిజియో టేప్ వేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్డెష్కాట్ కూడా ధ్రువీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన అర్ష్దీప్.. టెస్టుల్లో మాత్రం ఇంకా భారత్ తరపున ఆడలేదు.ఇంగ్లండ్ టూర్కు ఎంపికైనప్పటికి తొలి మూడు టెస్టులకు బెంచ్కే పరిమితమయ్యాడు. ఒకవేళ నాలుగో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇస్తే.. అర్ష్దీప్కు తుది జట్టులోకి చోటు దక్కే అవకాశముంది. కానీ ఇంతలోనే అర్ష్దీప్ గాయపడడం టీమ్మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. మరోవైపు లార్డ్స్ టెస్టులో గాయపడిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫిట్నెస్పై ఇంకా క్లారిటీ లేదు.చదవండి: సిరాజ్ 3 సిక్సర్లతో గెలిపిస్తాడని అనుకున్నా!.. జోకులు ఆపండి: అశ్విన్

‘మా అన్న చనిపోతే పవన్ కనీసం పలకరించలేదు’
తిరుపతి జిల్లా: తన అన్న హత్య చేసిన కేసులో తమకు న్యాయం జరగాలని మరొకసారి స్పష్టం చేసింది శ్రీనివాసులు అలియాస్ రాయుడు సోదరి కీర్తి. ఈరోజు(గురువారం జూలై 17) శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసిన కీర్తి.. తమకు న్యాయం జరగాలని కోరడంతో పాటు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు రక్షణ కల్పించాలి కోరాం. చిన్న చిన్న విషయాలకు పవన్ కల్యాణ్ స్పందిస్తారు, మా అన్న చనిపోతే కనీసం పలకరింపు లేదు. పవన్ కళ్యాణ్ దగ్గరికి అయినా మమ్మల్ని తీసుకువెళ్ళండి. హత్య జరిగిన తర్వాత మాకు రూ. 30 లక్షలు ఆఫర్ చేశారు. మేము డబ్బులకు లొంగే వాళ్ళము కాదు, మాకు న్యాయం జరగాలి. సోషల్ మీడియాలో మా అన్నపై ఏవో విష ప్రచారం చేస్తున్నారు. ఈ కేసులో చాలా మంది ఉన్నారు..వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి’ అని డిమాండ్ చేసింది. కాగా, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, రాయుడు హత్యపై అటు జనసేన అధినేత పవన్కళ్యాణ్, ఇటు కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక, తన మనవడు రాయుడు హత్యపై రాజేశ్వరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘నా మనవడిని ఏం చేయవద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నాను. కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా చంపేశారు. హత్యకు ముందు ఐదుసార్లు పంచాయితీ జరిగింది. ఏ మాత్రం కనికరం లేకుండా నా మనవడిని హత్య చేశారు’ అని రాజేశ్వరమ్మ కన్నీటి పర్యంతమైంది.‘అయ్యా పవన్.. నా మనవడి కోసం కాళ్లు పట్టుకున్నా సామీ’

పోస్టాఫీసుల్లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లన్నీ ఫ్రీజ్
చిన్న మొత్తాల పొదుపు పథకాల (ఎస్సీఎస్) ఖాతాలకు తపాలా శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది. వీటికి అనుగుణంగా లేని ఖాతాలను మూసివేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మెచ్యూరిటీ పీరియడ్ ముగిసిన తర్వాత మూడేళ్లు దాటినా కూడా క్లోజ్ చేయని ఖాతాలను అధికారులు ఇప్పుడు స్తంభింపజేయనున్నారు.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (టీడీ), పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) వంటి చిన్న పొదుపు పథకాల ఖాతాలకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.మూడేళ్ల మెచ్యూరిటీ తర్వాత కూడా క్లోజ్ చేయని స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలను స్తంభింపజేస్తూ తపాలా శాఖ జూలై 15న ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్వెస్టర్ల సొమ్మును కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం, ఇన్ యాక్టివ్, మెచ్యూరిటీ తీరిపోయిన పొదుపు పథకాల అకౌంట్లను ఖాతాదారులు అధికారికంగా పొడిగించుకోకపోతే పోస్టాఫీస్ ఇప్పుడు సంవత్సరానికి రెండుసార్లు గుర్తించి స్తంభింపజేస్తుంది.డిపాజిటర్లు కష్టపడి సంపాదించి పొదుపు చేసుకున్న డబ్బుకు భద్రతను మరింత పెంచడానికి ఈ ఫ్రీజింగ్ యాక్టివిటీని సంవత్సరానికి రెండుసార్లు నిరంతర చక్రంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఏటా జనవరి 1, అలాగే జూలై 1న రెండు సార్లు ఈ ప్రక్రియ జరగనుంది. ఈ తేదీల నుంచి 15 రోజుల్లో ఇలాంటి ఖతాలను గుర్తించడం, స్తంభింపజేయడం పూర్తవుతుంది. ఏటా జూన్ 30, డిసెంబర్ 31 నాటికి మూడేళ్ల మెచ్యూరిటీ పూర్తి చేసుకున్న ఖాతాలను గుర్తించి స్తంభింపజేస్తామని తపాలా శాఖ తెలిపింది.మెచ్యూరిటీ తీరిన తమ పొదుపు పథకాల ఖాతాలు స్తంభింపజేయకుండా ఉండటానికి, ఖాతాదారులు డిపాజిట్ పథకాన్ని అధికారికంగా పొడిగించడానికి అభ్యర్థనలను సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ పొడిగింపు వద్దనుకుంటే ఖాతా మూసివేతకు దరఖాస్తు చేయాలి. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి అన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన కొద్ది రోజులకే ఈ నిబంధనలు వచ్చాయి.
ఈ ఫోటోలోని టాలీవుడ్ కమెడియన్ ఎవరో గుర్తు పట్టారా?
విలన్లు క్లైమాక్స్లోనే అరెస్ట్ అవుతారు: సీఎం రేవంత్
వీకెండ్లో చిల్ అవ్వండి.. ఓటీటీల్లో ఒక్కరోజే 16 చిత్రాలు!
ఇది కదా హ్యూమన్ స్పిరిట్ .. ఓ వైపు పెళ్లి.. మరో వైపు అంత్యక్రియలు
పాకిస్తాన్తో టీ20 సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
హీరో రానా మెచ్చిన టాప్-5 సినిమాలు.. ఒక్క తెలుగు సినిమా లేదుగా!
నాలుగో టెస్టులో రిషబ్ పంత్ ఆడుతాడా? కీలక్ అప్డేట్ ఇచ్చిన కోచ్
‘నిమిషకు న్యాయపరమైన సాయం అందిస్తున్నాం’
Telangana phone tapping case: బండి సంజయ్కు సిట్ నోటీసులు
‘వాగ్దానాలకు అతీలేదు గతి లేదు.. మందు కావాలని మాత్రం ఆలోచించారు’
ఇంత బరితెగింపా.. గుంపులో ఎవరూ చూడలేదనుకున్నారా?
నేను బతికుండగానే కొడుకు చనిపోవాలని కోరుకున్నా: సీనియర్ నటుడు
42 ఏళ్ల లారీడ్రైవర్తో డిగ్రీ విద్యార్థిని వివాహేతర సంబంధం..!
సెకెండ్ ఇన్నింగ్స్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం
హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం
తేజేశ్వర్ కేసులో మరో ట్విస్ట్
ఇలాంటి మాటల వల్లే 'జబర్దస్త్' నుంచి వెళ్లిపోయా: అనసూయ
ఒక్కరోజులోనే ఓటీటీలోకి హిట్ సినిమా.. ఇదేం విడ్డూరం
ఈ రాశి వారు వ్యాపారాలు విస్తరిస్తారు.. ఆకస్మిక ధనలాభం
వైద్యుల కాపురంలో ‘బుట్టబొమ్మ’ చిచ్చు
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు బద్దలు
అత్తింట్లో ఏ సమస్యాలేదు...కానీ బిడ్డను పట్టుకుని మరీ..!
రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక గంట మ్యూజిక్ వినండి చాలు!
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాల్లో అనుకూలత
లేదంటే 50 రోజుల్లో మిమ్మల్ని నోబెల్కి నామినేట్ చేయమని అసలు విషయం చెప్పేద్దాం!
అమెరికా స్టోర్లో రూ. లక్ష కొట్టేసిన భారత మహిళ, అరెస్ట్ : నెట్టింట చర్చ
ఇది శాంపిల్ మాత్రమే. బాగా ప్రాక్టీస్ చెయ్!
సాక్షి కార్టూన్ 16-07-2025
అందులో కూర్చుంటే అహంకారం పెరుగుతుందని అలా నిలబడే పాలన చేస్తున్నారు!
ఈ ఫోటోలోని టాలీవుడ్ కమెడియన్ ఎవరో గుర్తు పట్టారా?
విలన్లు క్లైమాక్స్లోనే అరెస్ట్ అవుతారు: సీఎం రేవంత్
వీకెండ్లో చిల్ అవ్వండి.. ఓటీటీల్లో ఒక్కరోజే 16 చిత్రాలు!
ఇది కదా హ్యూమన్ స్పిరిట్ .. ఓ వైపు పెళ్లి.. మరో వైపు అంత్యక్రియలు
పాకిస్తాన్తో టీ20 సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
హీరో రానా మెచ్చిన టాప్-5 సినిమాలు.. ఒక్క తెలుగు సినిమా లేదుగా!
నాలుగో టెస్టులో రిషబ్ పంత్ ఆడుతాడా? కీలక్ అప్డేట్ ఇచ్చిన కోచ్
‘నిమిషకు న్యాయపరమైన సాయం అందిస్తున్నాం’
Telangana phone tapping case: బండి సంజయ్కు సిట్ నోటీసులు
‘వాగ్దానాలకు అతీలేదు గతి లేదు.. మందు కావాలని మాత్రం ఆలోచించారు’
ఇంత బరితెగింపా.. గుంపులో ఎవరూ చూడలేదనుకున్నారా?
నేను బతికుండగానే కొడుకు చనిపోవాలని కోరుకున్నా: సీనియర్ నటుడు
42 ఏళ్ల లారీడ్రైవర్తో డిగ్రీ విద్యార్థిని వివాహేతర సంబంధం..!
సెకెండ్ ఇన్నింగ్స్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీ.. మళ్లీ అదే తరహా విధ్వంసం
హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం
తేజేశ్వర్ కేసులో మరో ట్విస్ట్
ఇలాంటి మాటల వల్లే 'జబర్దస్త్' నుంచి వెళ్లిపోయా: అనసూయ
ఒక్కరోజులోనే ఓటీటీలోకి హిట్ సినిమా.. ఇదేం విడ్డూరం
ఈ రాశి వారు వ్యాపారాలు విస్తరిస్తారు.. ఆకస్మిక ధనలాభం
వైద్యుల కాపురంలో ‘బుట్టబొమ్మ’ చిచ్చు
ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు బద్దలు
అత్తింట్లో ఏ సమస్యాలేదు...కానీ బిడ్డను పట్టుకుని మరీ..!
రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక గంట మ్యూజిక్ వినండి చాలు!
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాల్లో అనుకూలత
లేదంటే 50 రోజుల్లో మిమ్మల్ని నోబెల్కి నామినేట్ చేయమని అసలు విషయం చెప్పేద్దాం!
అమెరికా స్టోర్లో రూ. లక్ష కొట్టేసిన భారత మహిళ, అరెస్ట్ : నెట్టింట చర్చ
ఇది శాంపిల్ మాత్రమే. బాగా ప్రాక్టీస్ చెయ్!
సాక్షి కార్టూన్ 16-07-2025
అందులో కూర్చుంటే అహంకారం పెరుగుతుందని అలా నిలబడే పాలన చేస్తున్నారు!
సినిమా

బాహుబలి టీమ్కు రానా రిప్లై.. నేను అదే చేయనిచ్చేవాడినన్న ప్రభాస్!
టాలీవుడ్లో పదేళ్ల తర్వాత బాహుబలి పేరు మార్మోగిపోతోంది. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి.. మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీ రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుందని రాజమౌళి ప్రకటించారు. ఇటీవల బాహుహలి టీమ్ అంతా పదేళ్ల తర్వాత సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.దీంతో ఈ సినిమాపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా బాహుబలి టీమ్ ప్రశ్నకు హీరో రానా రియాక్ట్ సమాధానమిచ్చారు. కట్టప్ప బాహుబలిని చంపకపోయుంటే ఏం జరిగి ఉండేది? అని బాహుబలి టీమ్ ప్రశ్నించింది. ఇది చూసినా రానా.. నేను చంపేసేవాడిని అంటూ ఆ ట్వీట్కు బదులిచ్చాడు.తాజాగా రానా రిప్లైకి.. రెబల్ స్టార్ ప్రభాస్ సైతం స్పందిచాడు. రానా ఇచ్చిన ఆన్సర్ను పోస్ట్ చేస్తూ ప్రభాస్ రిప్లై ఇచ్చారు. 'రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా కోసం.. నేను అదే చేయనిచ్చేవాడినిలే భళ్లా' అంటూ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సరదా చర్చ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాను 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

వామ్మో.. బిగ్బాస్ దివి బోల్డ్ లుక్.. ప్రియుడితో ప్రియాంక జైన్ చిల్!
బిగ్బాస్ బ్యూటీ దివి బోల్డ్ లుక్..యూఎస్లో చిల్ అవుతోన్న బిగ్బాస్ బ్యూటీ ప్రియాంకజైన్..మోనికా సాంగ్ మూడ్లోనే బుట్టబొమ్మ పూజా హెగ్డే..ఇటలీలో బాలీవుడ్ భామ మలైకా అరోరా చిల్..కేరళ అడవుల్లో ప్రకృతిని ఆస్వాదిస్తోన్న నటి అభినయ.. View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Divi (@actordivi)

ఆస్పత్రిలో విజయ్ దేవరకొండ.. ఎందుకంటే?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఆస్పత్రిపాలయ్యాడు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయన వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కొత్త చిత్రం కింగ్డమ్ (Kingdom Movie). గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూలై 31న రిలీజ్ కానుంది. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూనర్ ఫోర్ సినిమాస్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. మరోవైపు విజయ్కు బాలీవుడ్ మూవీలో విలన్గా నటించే ఆఫర్ వచ్చింది. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న డాన్ 3 చిత్రంలో విలన్ పాత్ర కోసం రౌడీ హీరోను సంప్రదించారు. అయితే ఈ ఆఫర్కు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.చదవండి: థగ్ లైఫ్.. ఈ సినిమా ఎందుకు చేశావని తిట్టారు: బాలీవుడ్ నటుడు

'మా ఇద్దరినీ విడదీసేయండి'.. ఆసక్తిగా సార్ మేడమ్ ట్రైలర్!
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవసే ఏస్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన మరోసారి.. డిఫరెంట్ రోల్తో అలరించనున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం సార్ మేడమ్. ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్గా నిత్యామీనన్ కనిపించనుంది. పాండిరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఈనెల 25 థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా సార్ మేడమ్ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో నిత్యామీనన్, విజయ్ సేతుపతి భార్యభర్తలుగా నటించారు. ట్రైలర్ చూస్తే భార్య, భర్తల కోణంలోనే ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలను ఫన్నీగా తెరపై చూపించనున్నట్లు అర్థమవుతోంది. ఓవరాల్గా ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో యోగి బాబు కీలక పాత్ర పోషించారు.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

సిరాజ్ 3 సిక్సర్లతో గెలిపిస్తాడని అనుకున్నా!.. జోకులు ఆపండి: అశ్విన్
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ ఓ సస్పెన్ష్ థ్రిల్లర్ సినిమా ను తలపించింది. ఇరు జట్ల ఆటగాళ్ల తమ విరోచిత పోరాటాలతో అభిమానులకు అసలు సిసలైన టెస్టు క్రికెట్ మజాను అందించారు. ఆఖరివరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో విజయం ఇంగ్లండ్ జట్టునే వరించింది.ఈ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైనప్పటికి రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్లు తమ పోరాటాలతో కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి నేను వున్నా అంటూ జడేజా బ్యాటింగ్ చేసిన తీరు.. అతడికి టెయిలాండర్లు(జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్) సహకరించిన విధానం గురుంచి ఎంతచెప్పుకొన్నతక్కువే.విజయానికి 22 పరుగులు కావాల్సిన సమయంలో సిరాజ్ క్లీన్ బౌల్డ్ కావడంతో కోట్లమంది భారత అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. ఆఖరి వికెట్గా వెనుదిరిగిన సిరాజ్ సైతం మైదానంలోనే భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే లార్డ్స్ టెస్టులో ఓటమిపై టీమిండియా స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ ఆశ్విన్ తాజాగా స్పందించాడు. మ్యాచ్ ఆఖరి రోజు ఆట సందర్భంగా తన తండ్రితో జరిగిన సంభాషణ గురించి ఆశ్విన్ వివరించాడు. సిరాజ్ మూడు సిక్సర్లు కొట్టి మ్యాచ్ను గెలిపిస్తాడని నమ్మకంతో తన తండ్రి ఉన్నట్లు ఆశ్విన్ వెల్లడించాడు."లార్డ్స్ టెస్టులో భారత్ పోరాడి ఓడింది. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం అద్బుతమైన స్పెల్ను బౌల్ చేశాడు. ఓవైపు అలసిన శరీరంతో మైదానంలో పోరడాతూనే స్టోక్స్ తన బౌలింగ్ను కొనసాగించాడు. ఆఖరి రోజు ఆటను మా నాన్న నేను కలిసి టీవీలో వీక్షించాము.సిరాజ్ మూడు సిక్సర్లు బాది మ్యాచ్ను ఫినిష్ చేస్తాడని మా నాన్న నాతో అన్నారు. వెంటనే నేను జోకులు ఆపండి అని ఆయనతో అన్నాను. అదేవిధంగా స్టోక్స్ను కూడా ఆయన ప్రశంసించారు. రెండు ఎండ్స్ నుంచి అద్బుతంగా బౌలింగ్ చేశాడని ఆయన కొనియాడారు.తొలి ఇన్నింగ్స్లో కంటిన్యూగా 9.2 ఓవర్ల స్పెల్ను బౌలింగ్ చేసిన స్టోక్సీ.. రెండో ఇన్నింగ్స్లో 10 ఓవర్ల మ్యాచ్ విన్నింగ్ స్పెల్ను వేశాడు. అతడు 13-140 కిం కి.మీ. వేగంతో బౌలింగ్ చేశాడు. ఓవైపు భారత తరపున జడేజా అడ్డుగోడలా నిలిచి తన పోరాటాన్ని కొనసాగిస్తుంటే.. మరోవైపు స్టోక్స్ కూడా ఇంగ్లండ్ తరపున అదే పనిచేశాడు" అని తన యూట్యూబ్ ఛానల్లో జడ్డూ పేర్కొన్నాడు.చదవండి: అత్యధికసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’లు అందుకుంది వీరే

సచిన్కు చోటు లేదు!.. ఈ లిస్టులో టాప్-5లో ఉన్న క్రికెటర్లు వీరే!
టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య టెస్టు సిరీస్.. క్రికెట్ ప్రేమికులకు అసలు సిసలైన సంప్రదాయ ఫార్మాట్ మజాను అందిస్తోంది. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ (Anderson- Tendulkar Trophy)లో భాగంగా ఇరుజట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్లో ఇప్పటికి మూడు పూర్తయ్యాయి.అయితే, ఈ మూడు టెస్టులు ఆఖరిదైన ఐదో రోజు వరకు ఉత్కంఠగా సాగడం ఒక విశేషమైతే.. అన్నింటిలోనూ ఫలితం కూడా తేలడం మరో విశేషం. లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మ్యాచ్ను టీమిండియా నుంచి లాగేసుకుని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ఇక ఎడ్జ్బాస్టన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన టీమిండియా సారథి శుబ్మన్ గిల్ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161)లతో అదరగొట్టి.. భారత్కు ఏకపక్ష విజయం అందించాడు. ఎడ్జ్బాస్టన్లో తొలిసారి టీమిండియా గెలుపు జెండా ఎగరవేయడంలో కీలక పాత్ర పోషించి ఈ అవార్డు అందుకున్నాడు.అయితే, లార్డ్స్ టెస్టులో మాత్రం ఆతిథ్య జట్టు మరోసారి పైచేయి సాధించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇటు బ్యాట్తో.. అటు బంతితో రాణించి.. జట్టును గెలిపించుకున్నాడు. తద్వారా 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. ఇలా మూడు టెస్టుల్లో ఒక్కొక్కరు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు.మరి టెస్టు ఫార్మాట్లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న క్రికెటర్ల జాబితాలో టాప్-5లో ఉన్నది ఎవరో తెలుసా?!.. సంప్రదాయ క్రికెట్లో అత్యధిక పరుగుల వీరుడి (15921)గా ఉన్న టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ మాత్రం ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.జాక్వెస్ కలిస్సౌతాఫ్రికా లెజెండరీ ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్ టెస్టుల్లో అత్యధికంగా 23 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. తన కెరీర్లో 166 టెస్టు మ్యాచ్లు ఆడిన కలిస్.. 13289 పరుగులు చేశాడు. ఇందులో 45 శతకాలు, రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి.ముత్తయ్య మురళీధరన్శ్రీలంక స్పిన్ దిగ్గజం టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్ల వీరుడు (800). అతడు తన కెరీర్లో 133 టెస్టులాడి 19 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.వసీం అక్రంపాకిస్తాన్ ఐకానిక్ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ తన కెరీర్లో 104 టెస్టులు ఆడి.. 414 వికెట్లు కూల్చాడు. తన నిలకడైన బౌలింగ్తో ఈ స్వింగ్ సుల్తాన్ పదిహేడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.షేన్ వార్న్ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేర్ వార్న్. అంతర్జాతీయ క్రికెట్లో 145 టెస్టులు ఆడిన వార్న్.. 708 వికెట్లు పడగొట్టాడు. అతడి ఖాతాలోనూ పదిహేడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఉన్నాయి.కుమార్ సంగక్కరశ్రీలంక మాజీ కెప్టెన్, స్టైలిస్ లెఫ్టాండ్ బ్యాటర్ కుమార్ సంగక్కర తన కెరీర్లో 134 టెస్టు మ్యాచ్లు ఆడాడు. నిలకడైన ప్రదర్శనలతో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ ప్రధాన పిల్లర్గా పేరొందిన సంగక్కర పదహారు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సంగక్కర టెస్టుల్లో 38 సెంచరీలు, 11 డబుల్ సెంచరీల సాయంతో 12400 పరుగులు సాధించాడు. అ న్న ట్లు చెప్పనే లేదు కదూ! సచిన్ తన కెరీర్లో పద్నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. చదవండి: భారత ఓపెనింగ్ జోడీ ప్రపంచ రికార్డు

బీసీసీఐ పెన్షన్.. సచిన్, యువీకి ఎంతంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రస్తుతం అమలు చేస్తున్న సెంట్రల్ కాంట్రాక్టుల గురించి అడిగితే క్రికెట్ లవర్స్ ఈజీగా చెప్పేస్తారు. ఎన్ని గ్రేడులు ఉన్నాయ్, ఏ గ్రేడ్కు ఎంత జీతం వస్తుందనే వివరాలు సగటు క్రికెట్ అభిమానులకు కరతలామలకం. కానీ పెన్షన్ గురించి అడిగి చూడండి.. చాలా తక్కువ మంది మాత్రమే కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతారు. రిటైర్ అయిన మాజీ ఆటగాళ్లు, అంపైర్లకు బీసీసీఐ ప్రతినెలా పెన్షన్ ఇస్తుంటుంది.టీమిండియాకు అందించిన సేవలను గుర్తించి వారికి కృతజ్ఞత తెలిపేందుకు, రిటైర్ అయిన తర్వాత అండగా నిలిచేందుకు పెన్షన్ పథకాన్ని బీసీసీఐ (BCCI) అమలు చేస్తోంది. 2022, జూన్లో ఈ పథకాన్ని సవరించడంతో మాజీ ఆటగాళ్లు, అంపైర్లకు పెన్షన్ ద్వారా వచ్చే మొత్తం గణనీయంగా పెరిగింది. ఉన్నత శ్రేణి, దిగువ శ్రేణితో పాటు ఫస్ట్క్లాస్ మాజీ ఆటగాళ్లకు ఇచ్చే పెన్షన్లో కూడా పెరుగుదల చోటు చేసుకుంది.అదే కొలమానంటీమిండియా (Team India) తరపు ఎన్ని మ్యాచ్లు ఆడారు, ఎన్నేళ్ల పాటు జట్టులో ఉన్నారనే అంశాలతో పాటు టెస్ట్ మ్యాచ్ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడా లేదా అనే దాని ఆధారంగా మూడు కేటగిరీలుగా బీసీసీఐ విభజించింది. ఉన్నత శ్రేణిలో ఉన్న క్రికెటర్లకు నెలకు రూ. 70 వేలు, దిగువ శ్రేణిలోని వారికి రూ. 60 వేలు, ఫస్ట్క్లాస్ మాజీ ఆటగాళ్లకు రూ. 30 వేలు పెన్షన్ అందిస్తోంది.900 మందికి పెన్షన్సవరించిన పెన్షన్ పథకం ప్రస్తుతం దాదాపు 900 మంది రిటైర్డ్ క్రికెటర్లు, అంపైర్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. 2022 సవరణ తర్వాత వారిలో దాదాపు 75% మంది పెన్షన్లలో 100% పెరుగుదల కనిపించింది. ఉన్నత శ్రేణి పెన్షన్ అందుకుంటున్న వారిలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు ఉన్నారు. అంటే సచిన్కు బీసీసీఐ నుంచి ప్రతినెల రూ. 70 వేలు పెన్షన్ అందుతోంది. తక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడిన యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్లు దిగువ శ్రేణిలో ఉన్నారు. వీరికి నెలకు రూ.60 వేలు పెన్షన్ వస్తోంది. దేశవాళీ క్రికెట్ ఎక్కువ ఆడిన వినోద్ కాంబ్లి (Vinod Kambli) ఫస్ట్-క్లాస్ కేటగిరీలో నెలకు రూ.30 వేలు పెన్షన్ తీసుకుంటున్నాడు.చదవండి: బీసీసీఐ నుంచి వచ్చే నిధులు మళ్లించారువిలువైన గుర్తింపుసంపన్నులైన సచిన్, యువీ లాంటి స్టార్ ఆటగాళ్లకు పెన్షన్ అవసరమే లేదు. రిటైర్ అయిన తర్వాత కాంట్రాక్టులు, ఎండార్స్మెంట్ల ద్వారా ఇప్పటికీ కోట్లు సంపాదిస్తున్నారు. అయితే బీసీసీఐ నుంచి పెన్షన్ తీసుకోవడం వారు గౌరవంగా భావిస్తున్నారు. తమ సేవలకు దక్కిన విలువైన గుర్తింపుగా దీన్ని పరిగణిస్తున్నారు. క్రీడా జీవితానికి ముగింపు పలికిన ఎందరో ఆటగాళ్లకు మలి దశలో బీసీసీఐ ఇచ్చే పెన్షన్ ఆదరువుగా నిలుస్తోంది. చివరి రోజుల్లో గౌరప్రదమైన జీవితం గడిపేందుకు దోహదం చేస్తోంది.

లార్డ్స్లో టర్నింగ్ పాయింట్ అదే.. లేదంటే విజయం భారత్దే: రహానే
మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని ఆతిథ్య ఇంగ్లండ్ భావిస్తుంటే.. టీమిండియా మాత్రం ప్రత్యర్దిని మట్టికర్పించి సిరీస్ను సమం చేయాలని కసితో ఉండి.లార్డ్స్ టెస్టులో అనుహ్యంగా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైన గిల్ సేన, నాలుగో టెస్టులో తమ తప్పిదాలను సరిదిద్దుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మెనెజ్మెంట్కు మాజీ కెప్టెన్ అజింక్య రహానే కీలక సూచన చేశాడు.మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు అదనపు ఫాస్ట్ బౌలర్తో బరిలోకి దిగాలని రహానే అభిప్రాయపడ్డాడు. లార్డ్స్ టెస్టులో టీమిండియా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడింది. నితీశ్ కుమార్ పేస్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఉన్నాడు."లార్డ్స్ టెస్టులో టీమిండియా ఓడిపోవడం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే తొలి ఇన్నింగ్స్లో మాత్రం భారీ స్కోర్ను సాధించే అవకాశాన్ని భారత్ కోల్పోయింది. రాబోయే మ్యాచ్లో భారత్ అదనంగా ఓ ఫాస్ట్ బౌలర్ను ఆడిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఓ టెస్టు మ్యాచ్ను గెలవాలంటే ప్రత్యర్ధి జట్టులోని 20 వికెట్లను పడగొట్టాలి. ప్రస్తుతం భారత బ్యాటింగ్ యూనిట్ మెరుగ్గానే రాణిస్తున్నారు. కాబట్టి ఎక్స్ట్రా ఓ బౌలర్ జట్టులో ఉండాలన్నది నా అభిప్రాయం. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో కూడా 40 పరుగులకు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి పటిష్ట స్థితిలో కన్పించింది. కానీ ఆ సమయంలో కరుణ్ నాయర్ ఎల్బీ రూప్లో ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆ వికెట్తో మ్యాచ్పై ఇంగ్లండ్ పట్టుబిగించింది. ప్రత్యర్ధి బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. ఎలాగైనా గెలవాలన్న కసి వారిలో కన్పించింది. ఫీల్డింగ్లో కూడా వందకు వంద శాతం ఎఫక్ట్ పెట్టారు" అని రహానే తన యూట్యూబ్ ఛానలో పేర్కొన్నారు.చదవండి: ఫిట్గా లేకుంటే.. ఒక్క మ్యాచ్ కూడా ఆడకు: భారత మాజీ క్రికెటర్ ఫైర్
బిజినెస్

ఎరువుల కోసం రైతన్న పడిగాపులు
వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలుస్తోంది. దేశంలో అధిక జనాభా జీవనోపాధి వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, క్రిమిసంహారకాల వాడకం పెరుగుతుండడం వల్ల సాగుభూమి క్రమంగా సారం కోల్పోతుందని చాలా నివేదికలు చెబుతున్నాయి. పంటల దిగుబడి పెంచాలంటే సహజ ఎరువులు వాడాలని అధికారాలు ఎంత ఊదరగొడుతున్నా అందుకు సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడంతో ఆ లక్ష్యం నీరుగారుతోంది. రైతులు ఏ పంట వేసినా దాదాపు యూరియా వాడకం తప్పనిసరైంది. కానీ సాగుకు సరిపడా యూరియా తయారీలో యాంత్రాంగాలు జాప్యం చేస్తున్నాయనే వాదనలున్నాయి. అందుకు కొన్ని కారణాలను కింద తెలియజేశాం.యూరియా పంట దిగుబడి పెంచడంలో, ఆహార భద్రతను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వాలు తరచు దీని తయారీ ప్లాంట్లను స్థాపించడంలో లేదా ఇప్పటికే ఉన్న వాటిలో ఉత్పాదకతను విస్తరించడంలో గణనీయమైన జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయి. దాంతో రైతులకు పంట సమయానికి ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు తప్పడంలేదు. ఈ ఏడాది ఎంత మొత్తంలో ఎరువులు అవసరం అవుతాయో ముందే నిర్ధారించుకున్న ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ఎరువులు తయారు చేయాల్సి ఉంటుంది. లేదా దిగుమతి చేసుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వ గోదాముల్లో ఎరువులు నిల్వ ఉంచి అవసరాలకు తగ్గట్టుగా వెంటనే సరఫరా చేసే వ్యవస్థగా ఏర్పాటు చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎరువుల తయారీలో, వాటి సరఫరాలో జాప్యానికి చాలానే కారణాలున్నాయి.ఆర్థిక పరిమితులుయూరియా తయారీ అనేది మూలధన ఆధారిత ప్రక్రియ. కొత్తగా ఎరువుల కర్మాగారాన్ని నిర్మించడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. దాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకురావడానికి చాలా ఏళ్లు పట్టవచ్చు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే పరిమిత ఆర్థిక వసతులతో పోరాడుతున్నాయి. ఫలితంగా ఇటువంటి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం కష్టమవుతుంది. అడపాదడపా బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయించిన మొత్తం నుంచి ఇలాంటి ప్రాజెక్ట్లకు నిధులు వెచ్చించడంలేదు.నిర్మాణ వ్యయంతోపాటు యూరియా తయారీకి భారీగా సబ్సిడీ ఇస్తున్నారు. భారత్ వంటి దేశాల్లో రైతులు యూరియాను దాని వాస్తవ ఉత్పత్తి వ్యయంలో కొంత ధరలకే కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని ప్రభుత్వం రాయితీలతో పూడుస్తోంది. దేశీయంగా ఉత్పాదకతను పెంచితే అందుకు అనుగుణంగా ప్రైవేట్ కంపెనీలకు అధిక సబ్సిడీ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వాలకు భారం.పరిపాలనా, నియంత్రణ అవరోధాలుకొన్నిసార్లు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ బ్యూరోక్రటిక్ నిబంధనల కారణంగా యూరియా ప్రాజెక్టుల అమలుకు చాలా ఆలస్యం అవుతుంది. భూసేకరణ, పర్యావరణ అనుమతులు పొందడం, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు రావడం, కఠిన నిబంధనలు పాటించడం వంటి చర్యలతో ఏళ్లకుఏళ్లు ఈ ప్రక్రియ వాయిదా పడుతోంది. అంతేగాక రసాయనాలు, ఎరువులు, పర్యావరణం, పెట్రోలియం (గ్యాస్ సరఫరా కోసం), ఫైనాన్స్ వంటి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం లోపిస్తుంది. ఏదైనా విభాగంలో ఆలస్యం జరిగితే మొత్తం ప్రాజెక్టు పురోగతి ఆగిపోతుంది.దిగుమతులపై ఆధారపడటంస్వల్పకాలిక వ్యవసాయ అవసరాలను తీర్చడానికి అనేక ప్రభుత్వాలు దేశీయ ఉత్పాదకతపై పెట్టుబడులు పెట్టడానికి బదులుగా యూరియాను దిగుమతి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. ఇది మరింత ఖర్చుకు దారితీస్తుంది. అయితే కొత్తగా ప్రాజెక్ట్ స్థాపించి సరఫరా చేయడానికి బదులుగా ఇది సరళమైన విధానంగా కూడా కనిపిస్తుంది. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు మరింత పెరుగుతున్నాయి.అయితే, ఎరువుల దిగుమతిపై ఆధారపడటం దీర్ఘకాలిక బలహీనతలను సృష్టిస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆంక్షలు లేదా ధరల అస్థిరత కారణంగా ఏదైనా ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడినప్పుడు అసలు సమస్య గుర్తుకొస్తుంది. ఇది దేశీయ వ్యవసాయ ఉత్పాదకతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.ముడిసరుకు సరఫరాలో హెచ్చుతగ్గులుయూరియా ఉత్పత్తి సహజ వాయువు లభ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీన్ని ఫీడ్స్టాక్గా ఉపయోగిస్తారు. అనేక దేశాల్లో సహజ వాయువు కొరత ఉంది. ఒకవేళ దిగుమతి చేసుకోవాలన్నా ఖరీదుతో కూడుకుంది. సహజవాయువు సమృద్ధిగా ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా యూరియా ఉత్పత్తిని ఆర్థికంగా లాభదాయకం చేయవచ్చు. గ్యాస్ సరఫరాలో అంతరాయాలు లేదా అననుకూల ధరల ఒప్పందాలు ఉత్పత్తిని నిలిపేస్తున్నాయి. కొత్త ప్లాంట్ ఏర్పాటును ఆలస్యం చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఎస్బీఐకి డబ్బు అవసరం.. నిధుల సమీకరణ షురూప్రత్యామ్నాయాలుప్రభుత్వాలు సంప్రదాయ యూరియా వాడకానికి దూరంగా నేల ఆరోగ్యం, పర్యావరణ సుస్థిరతపై అవగాహన పెంపొందించే ప్రయత్నాలను మరింత పెంచాలి. నానో యూరియా, బయో ఫెర్టిలైజర్స్, సేంద్రియ ఎరువులు వాడకం వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించేలా రైతు సమావేశాలు ఏర్పాటు చేయాలి. యూరియా వాడకంతో పోలిస్తే ఖర్చులు తగ్గుతూ దిగుబడి స్థిరంగా ఉన్నా రైతులు ఇలాంటి ప్రత్యామ్నాయాలవైపు చూసే అవకాశం ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత సాయంతో సంప్రదాయ యూరియాపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించేందుకు మార్గాలేమిటో అధికారులు, పరిశోధకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.

ఎస్బీఐకి డబ్బు అవసరం.. నిధుల సమీకరణ షురూ
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నిధుల సమీకరణకు తెరతీసింది. షేరుకి రూ.811.05 ఫ్లోర్ ధరలో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ని చేపట్టింది. తద్వారా రూ.25,000 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. అయితే ఫ్లోర్ ధరకంటే 5 శాతం డిస్కౌంట్లో క్విప్ను పూర్తి చేసే వీలున్నట్లు తెలియజేసింది. షేరు తాజా ధర రూ. 831.55తో పోలిస్తే ఫ్లోర్ ధర సైతం 2.5 శాతం తక్కువకావడం గమనార్హం! వీటికితోడు రుణ సెక్యూరిటీల(బాండ్లు) జారీ ద్వారా మరో రూ. 20,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో దేశీ ఇన్వెస్టర్లకు బాండ్లను ఆఫర్ చేయనున్నట్లు తెలియజేసింది. వెరసి రూ.45,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. ఈ ఏడాది మే నెలలో ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ.25,000 కోట్ల సమీకరణకు ఎస్బీఐ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్లో బ్యాంక్ వాటాదారులు సైతం ఇందుకు ఆమోదముద్ర వేశారు. కాగా.. ఎస్బీఐ ఇంతక్రితం 2017–18లో క్విప్ ద్వారా రూ. 15,000 కోట్లు సమకూర్చుకున్న విషయం విదితమే! భవిష్యత్తులో రుణ వృద్ధికి, మూలధన వ్యయానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయని అధికారులు తెలిపారు.రిలయన్స్ సంస్థలు సైతంరిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు వివిధ మార్గాలలో రూ.9,000 కోట్లు సమీకరించేందుకు తాజాగా అనుమతించింది. దీనిలో భాగంగా ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ సంబంధ క్విప్ లేదా క్విబ్ తదితరాల ద్వారా రూ.6,000 కోట్లు సమకూర్చుకోనుంది. అంతేకాకుండా ఒకేసారి లేదా దశలవారీగా మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా మరో రూ.3,000 కోట్లు సమీకరించనుంది. ఇందుకు ప్రయివేట్ ప్లేస్మెంట్ లేదా ఇతర విధానాలను ఎంచుకోనుంది. రిలయన్స్ పవర్ బోర్డు వివిధ మార్గాలలో రూ. 9,000 కోట్లు సమీకరించేందుకు తాజాగా అనుమతించింది. దీనిలో భాగంగా ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ సంబంధ క్విప్ లేదా క్విబ్ తదితరాల ద్వారా రూ. 6,000 కోట్లు సమకూర్చుకోనుంది. అంతేకాకుండా ఒకేసారి లేదా దశలవారీగా మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా మరో రూ.3,000 కోట్లు సమీకరించనుంది. ఇందుకు ప్రయివేట్ ప్లేస్మెంట్ లేదా ఇతర విధానాలను ఎంచుకోనుంది.

కొత్త టెక్నాలజీతో ఫ్యాన్లు ఆవిష్కరణ
ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ బీఎల్డీసీ టెక్నాలజీతో నడిచే వీ-గార్డ్ కొత్త ఎయిర్ విజ్ సిరీస్ సీలింగ్ ఫ్యాన్లను ఆవిష్కరించినట్లు తెలిపింది. వీటిలో స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. హైస్పీడ్ ఎయిర్ ఫ్లోతో కేవలం 35 వాట్ల విద్యుత్ వినియోగంతో ఇవి పనిచేస్తాయని చెప్పింది. 4/8 గంటల ఆటో-ఆఫ్ టైమర్తో రిమోట్ ఆపరేట్ సదుపాయం ఉందని పేర్కొంది.ఎయిర్ విజ్ సిరీస్లో భాగంగా విభిన్న వేరియంట్లను పరిచయం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎయిర్విజ్ లైట్, ఎయిర్విజ్ ప్రైమ్, ఎయిర్విజ్ ప్లస్, ఎయిర్విజ్ ఎన్లను ఆవిష్కరించింది. వేరియంట్ను అనుసరించి ప్రత్యేక ఫీచర్లు ఉన్నట్లు చెప్పింది. వీటిని వీ-గార్డ్స్ రూర్కీ ఫెసిలిటీలో రూపొందిస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: రూ.19,500 విలువైన సబ్స్క్రిప్షన్ ఉచితం!ఈ సందర్భంగా వీ-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మిథున్ చిట్టిలపల్లి మాట్లాడుతూ..‘ఎయిర్ విజ్ బీఎల్డీసీ(బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్-ఏసీ మోటార్లను ఉపయోగించే సంప్రదాయ ఫ్యాన్ల మాదిరిగా కాకుండా, బీఎల్డీసీ ఫ్యాన్లు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ద్వారా నియంత్రించబడే శాశ్వత మాగ్నెట్ మోటార్ను ఉపయోగిస్తాయి) ఫ్యాన్ను ఆవిష్కరించడం సంస్థ ప్రయాణంలో కీలక మైలురాయిని సూచిస్తుంది. వృద్ధి, ఇన్నోవేషన్పరంగా ఫ్యాన్ కేటగిరీ మా వ్యాపారానికి చాలా ముఖ్యం. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా బీఎల్డీసీ సాంకేతికత చాలా అవసరం’ అన్నారు.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు(Today Gold Rate) ఊగిసలాడుతున్నాయి. నిన్న తగ్గిన పసిడి ధరలు బుధవారంతో పోలిస్తే గురువారం మళ్లీ స్వల్పంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ

సిరికాకొలనులో సీత..!
గుణశేఖర్ ‘రామాయణం’ గుర్తుందా? రాముడుగా జూ. ఎన్టీఆర్తోపాటు సీతగా.. స్మితామాధవ్ ప్రేక్షక మనసులను కట్టిపడేసింది! సినిమాల్లో కనిపించకపోయినా.. నాట్యంతో, గానంతో కళాభిమానులను అబ్బురపరుస్తూనే ఉంది!ఇటీవల ‘సిరికాకొలను చిన్నది’ నృత్యరూపకంతో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్ వాసి స్మిత గురించి మరిన్ని విషయాలు, విశేషాలు ఆమె మాటల్లోనే.. ‘‘నిజానికి.. వేటూరి సుందర రామ్మూర్తి ‘సిరికాకొలను చిన్నది’ రేడియో డ్రామాను కె. విశ్వనాథ్గారు సినిమాగా తీయాలనుకున్నారట. ఎందుకనో కుదరలేదట. 2019 ఎండింగ్లో ఆయన ఆ స్క్రిప్ట్ను నాకు ఇచ్చి నన్ను చేయమన్నారు. కోవిడ్ రావడంతో ఆ ప్రాజెక్ట్ లేట్ అయింది. నేను చేసిన ఆ నృత్యరూపకానికి చాలా ప్రశంసలు అందాయి. కె. విశ్వనాథ్గారు ఉండి ఉంటే చాలా మురిసిపోయేవారు. నా ప్రదర్శనకు వాళ్ల అబ్బాయి వాళ్లంతా వచ్చారు.. సంతోషమేసింది. విశ్వనాథ్గారున్నప్పుడు చేయలేకపోయాననే బాధ మాత్రం ఉంది. వారంటే నాకు చాలా అభిమానం, గౌరవం. వారి సినిమాల్లో నటించాలనే ఆసక్తి, ఆలోచన వచ్చేప్పటికే ఆయన సినిమాలు తగ్గించేసుకున్నారు. నా పెర్ఫార్మెన్సెస్ చాలా వాటికి వచ్చారు. కళ పట్ల నాకున్న కమిట్మెంట్ను మెచ్చుకునేవారు. నాకు ఊహ తెలిసేప్పటికల్లా భరతనాట్యం, కర్ణాటక సంగీతం క్లాసెస్లో ఉన్నాను. ఒకరకంగా చెప్పాలంటే మాది కళల నేపథ్యం ఉన్న కుటుంబం. మా అమ్మమ్మ, నానమ్మ పాడేవారు. అమ్మ (హేమ) పాడుతారు.. వీణా వాయిస్తారు. అన్నయ్య సిద్ధార్థ వీణ, వయొలిన్ నేర్చుకున్నాడు. అయితే మా ఇంట్లో ఆర్ట్ని ప్రొఫెషన్గా తీసుకుంది మాత్రం నేనే! భరతనాట్యంలో నా గురువు రాజేశ్వరీ సాయినాథ్, సంగీత గురువు లలితమ్మ.తాతగారి వల్లే సీత.. నా అరంగేట్రం గురించి పత్రికలో వచ్చిన కథనాన్ని చదివి, నా గురించి వాకబు చేసి మా ఇంటికి వచ్చారు నిర్మాత, కవి ఎమ్మెస్ రెడ్డి. ‘మేము తీయబోయే ‘రామాయణం’ సినిమాలో మీ అమ్మాయిని సీతగా అనుకుంటున్నాం.. మీకు సమ్మతమేనా’ అని నాన్నగారిని అడిగారు. దాని మీద మా ఇంట్లో పెద్ద చర్చే జరిగింది. మా తాతగారే చొరవ తీసుకుని ‘మంచి అవకాశం... పంపించండి’ అని తేల్చేశారు. అలా తాతగారి వల్లే ఆ సినిమాలో సీతగా నటించాను. రామాయణం తర్వాతా, హీరోయిన్గానూ చాలా అవకాశాలే వచ్చాయి. కానీ ఇటు డాన్స్ అండ్ మ్యూజిక్, చదువు, అటు సినిమాలు.. బ్యాలెన్స్ చేసుకోవడం కుదరలేదు. అందుకే సినిమాల మీద దృష్టి పెట్టలేదు. నేను చదువులో కూడా క్వయిట్ గుడ్. లా (ఉస్మానియా యూనివర్సిటీ)లో గోల్డ్మెడలిస్ట్ని. కర్ణాటిక్ మ్యూజిక్, భరతనాట్యం(మద్రాస్ యూనివర్సిటీ)లో మాస్టర్స్ చేశాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశాను. వీలున్నప్పుడల్లా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్తుంటాను భరతనాట్యం అండ్ కర్ణాటిక్ మ్యూజిక్లో. బాలినీస్ డాన్స్ కూడా నేర్చుకున్నాను. అనేక రకాల అంశాలలోమన దేశానికి, ఇండోనేషియాకు ఉన్న సంబంధం వల్ల నాకు ఆ దేశపు బాలినీస్ డాన్స్ అంటే ఆసక్తి పెరిగింది. అందుకే బాలీ (ఇండోనేషియా)వెళ్లి..కొన్నాళ్లుండి ఆ డాన్స్ నేర్చుకుని వచ్చాను.అండర్ ప్రివిలేజ్డ్కు ఫ్రీగా.. ఇరవై ఏళ్ల కిందటే అంటే కాలేజ్ డేస్లోనే ‘వర్ణా ఆర్ట్స్ అకాడమీ’ పేరుతో డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ చేశాను. దాదాపు వంద మంది స్టూడెంట్స్ ఉంటారు. అందులో అండర్ప్రివిలెజ్డ్ పిల్లలూ ఉన్నారు. వాళ్లందరికీ ఫ్రీగానే నేర్పిస్తాను. అయితే మిగతా పిల్లలెవరికీ వాళ్లు అండర్ ప్రివిలెజ్డ్ అని తెలియనివ్వం. అందరూ ఈక్వలే! ఎవరి ఆత్మవిశ్వాసమూ దెబ్బతినకూడదు కదా! అంతేకాదు మా ఆర్ట్స్కూల్కి అన్ని మతాలకు చెందిన పిల్లలూ వస్తుంటారు. అందరికీ అంతే శ్రద్ధతో నేర్పిస్తాం. చాలామంది దర్శకులూ వస్తుంటారు చైల్డ్ ఆర్టిస్ట్ల కోసం. 24 క్రాఫ్ట్స్తో కూడిన సినిమా అంటే నాకు ముందునుంచీ క్రేజే! ఇప్పుడు నాకు తగ్గ పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను.స్త్రీల సమస్యలు కళ ద్వారా.. ‘సిరికాకొలను చిన్నది’ కంటే ముందు కూడా తమిళ్, సంస్కృత నృత్యరూపకాలు చాలా చేశాను. పర్సనల్గా ఫీలై.. నాకు నచ్చితే సబ్జెక్ట్, భాషా భేదాలు చూడను. ‘సిరికాకొలను చిన్నది’ కోసం చాలా కష్టపడ్డాను. ఎన్నో హార్డిల్స్ ఎదురయ్యాయి. ‘ఇంత కష్టపడ్డం అవసరమా?’అనడిగారు శ్రేయోభిలాషులు చాలామంది. అవసరమే! ఎందుకంటే అంతలా కనెక్ట్ అయ్యాను ఆ ప్రాజెక్ట్తో. అలా నచ్చితే వెనక్కి తగ్గను. నేనెప్పుడూ ఓల్డ్ ఇన్ ద న్యూ.. న్యూ ఇన్ ద ఓల్డ్ని చూస్తాను. ఈ కోవలోనే మహిళలు, పిల్లలకు సంబంధించి అంశాలనూ నాకొచ్చిన కళద్వారా ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మేనేజ్మెంట్ స్కూల్స్ నా ్ర΄ోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాయి. ఆ ప్రోగ్రామ్స్లోనూ వాళ్ల సమస్యలను రామాయణ, మహాభారతాల్లో ఉన్న స్టోరీస్కి అనుసంధానించి ప్రదర్శిస్తుంటాను. సమాజానికి కళలు అవసరం.. కళలకు సమాజం అవసరం. కళలు ఒత్తిడిని జయించేలా చేస్తాయి. అయితే దానికి పోటీని చేర్చకూడదు. పోటీ వల్ల సాంత్వన స్థానంలోస్ట్రెస్ చేరుతుంది. అందుకే ఒకటే చెబుతాను కళలు గురువులు నేర్పుతారు సంస్కారం మాత్రం పేరెంట్సే నేర్పాలి. పిల్లలను పిల్లలుగానే ఉండనివ్వాలి. వాళ్ల బాల్యాన్ని లాక్కోకూడదు’’ అని ముగించారు స్మితామాధవ్.తాతను అమెరికా పంపిన నానమ్మ.. మా నాన్న (పీబీ మాధవ్) వాళ్లు అయిదుగురు తోబుట్టువులు. వాళ్ల చిన్నప్పుడే ఏదో ఆరోగ్య సమస్యతో మా తాత (పీబీ కృష్ణస్వామి)గారు చూపుకోల్పోవడంతో ఆయన చేస్తున్న క్లర్క్ జాబ్ కూడా పోయింది. అప్పుడు మా నానమ్మ (సుగంధ కృష్ణస్వామి) తన నగలన్నీ అమ్మి.. తాతగారిని అమెరికా పంపించారు బ్రెయిలీలో టీచర్ ట్రైనింగ్ కోసం. ఆయన అమెరికా నుంచి వచ్చేసరికి నానమ్మ కూడా తన పిల్లలతో పాటు చదువుకొనసాగించి, ట్యూషన్స్ చెబుతూ కుటుంబాన్ని పోషించింది. తనూ ఎం.ఎ. ఎం.ఈడీ. చేసింది. తాతగారు ఇండియా వచ్చేసమయానికే కేంద్రప్రభుత్వం డెహ్రాడూన్లో బ్లైండ్ స్కూల్ను స్టార్ట్ చేసింది. దేశంలో అదే ఫస్ట్ బ్లైండ్ స్కూల్. దానికి తాతగారే ప్రిన్సిపల్. మా నానమ్మ దూరదృష్టికి నిదర్శనం అది. – సరస్వతి రమ(చదవండి: World Emoji Day: సరదా మాత్రమే కాదు.. స్త్రీ సాధికారత కూడా..!)

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం-విశిష్ఠత
శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ హయగ్రీవుడిని రహస్యంగా భావించే సహస్రనామాలను తనకు ఉపదేశించమని అగస్త్య మహర్షి అభ్యర్థిస్తాడు. హయగ్రీవుడు శ్రీ లలితా సహస్రనామాలకు గల అనంత శక్తి కారణంగా దానిని యోగ్యులైన పుణ్యాత్ములకు మాత్రమే తెలియజేయ వలసి ఉంటుందని, అతనికి శ్రీ లలితా సహస్రనామ మూలాన్ని ఉపదేశిస్తాడు.దీనికి స్వరకర్తలు వసిని మొదలైన వాగ్దేవతలు. శ్రీ లలితా దేవి ఆజ్ఞపై వసినీ మొదలైన వాక్ దేవతలు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రాన్ని రచించారు. వారు రహస్య మంత్రాలతో కూడిన వేయి నామాలను కూర్చారు. శ్రీ లలితా దేవి ఆస్థానంలో మొదటి సారిగా వాక్ దేవతలు సకల దేవతలు మంత్రిణి, దండిని ఇతర శ్రీ మాత అనుచరుల సమక్షంలో ఈ సహస్రనామాన్ని పఠించారు.శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం విని ముగ్ధురాలైన అమ్మ వారు తన భక్తులను అనుగ్రహించేందుకు ఈ విధముగా ప్రకటించింది ‘ఈ నామాలను ఎవరు అనుసరిస్తారో/ ఆచరిస్తారో.. ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర నామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో, వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగ క్షేమాలను నేనే స్వయంగా చూసుకుంటాను‘ అని. కాబట్టి ఈ స్తోత్రం అమ్మ వారి పూర్ణానుగ్రహం తప్ప మరొకటి కాదు.శ్రీ మాత స్వయంగా చెప్పినట్లు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అన్ని రకాల సమస్యలను నయం చేసే శక్తివంతమైన పరిష్కారం.ఈ స్తోత్రం చివరలో బ్రహ్మాండ పురాణంలో స్తోత్రం ఉనికి గురించిన ప్రకటన ఉంది. ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీలలితా రహస్య నామ సాహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణం 36వ అధ్యాయం ‘లలితోపాఖ్యానం‘లో ఉంది. ఇందులో శ్రీ లలితాదేవిని సకల శక్తిస్వరూపిణిగాను, సృష్టిస్థితిలయాధికారిణిగాను వర్ణించారు. ఈ స్తోత్రం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణం చేసేవారు చాలా మంది ఉంటారు. అయితే ఇందులో ఉన్న అమ్మవారి నామాలను అర్థం చేసుకొని వాటిని ధ్యానంలో ప్రత్యక్షంగా అనుభూతి చెందుతూ అనన్యమైన భక్తి శ్రద్ధలతో పారాయణం చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు.మీరు జాగ్రత్తగా గమనిస్తే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మన సూక్ష్మ శరీరంలో ఉన్న వివిధ శక్తి కేంద్రములు లేదా చక్రముల వద్ద శక్తి స్వరూపిణి అయిన అమ్మ వారు ఏ విధంగా విరాజిల్లుతుంటారో వర్ణించబడి ఉంటుంది. ఈ చక్రములన్నీ మన శరీరంలోనే ఉంటాయి. అంటే అర్థము మన దేహము లోనే విభిన్న చక్రాలలో విభిన్న రూపాలలో అమ్మవారు కొలువై ఉంటారు.ఇప్పుడు విద్యుత్ శక్తి వలన ఎలాగయితే మన చుట్టూ ఉన్న ఫ్యాన్ లు, లైట్ లు, ఎ.సి.లు వంటి అనేక విద్యుత్ ఉపకరణాలు పని చేస్తూ ఉంటాయో, అదే విధంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి శక్తి వలన మానవుని సూక్ష్మ శరీరంతో పాటు అండ పిండ బ్రహ్మాండముతో నిండిన ఈ చరాచర జగత్తు మొత్తం నడుస్తుంది.– డా. పి. రాకేష్(సహజ యోగ సంస్థాపకురాలు, శ్రీ మాతాజీ నిర్మలా దేవి ప్రవచనాల ఆధారంగా)

సరదా మాత్రమే కాదు.. స్త్రీ సాధికారత కూడా..!
కాస్త సరదా కోసం’ అన్నట్లుగా కనిపించే ఇమోజీలు ఇప్పుడు సామాజిక విషయాలపై కూడా దృష్టి పెడుతున్నాయి.స్త్రీ సాధికారత, శక్తికి పెద్ద పీట వేస్తున్నాయి...‘వంద మాటలేల... ఒక ఇమోజీ చాలదా!’ అనుకోవడం వల్ల ఇమోజీలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. వరల్డ్ ఆన్లైన్ పాపులేషన్లో 90 శాతం మంది ఇమోజీలను ఉపయోగిస్తున్నారు. సరదా సమయాలలో, భావోద్వేగ ప్రతీకలుగా ఉపయోగించే ఇమోజీలను స్త్రీ సాధికారత, శక్తిని ప్రతిబింబించే ప్రతీకలుగా తీర్చిదిద్దే ధోరణి పెరిగింది.‘వైవిధ్యమైన కెరీర్లో మహిళలు’ అనే అంశాన్ని ప్రతిబింబించేలా ఇమోజీలు వచ్చాయి. స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, బోట్ రైడింగ్... ఇలా వివిధ ఆటల్లో మహిళల శక్తిసామర్థ్యాలను ప్రతిఫలించే ఇమోజీలు వచ్చాయి. ‘స్టెమ్’ కెరీర్లలో రాణించడానికి అమ్మాయిలకు కావాల్సింది ఏమిటి? అని చెప్పే ఇమోజీలు, సాంకేతికరంగంలో మహిళలు సత్తా చాటుతున్నారు అని చెప్పే ఇమోజీలు వచ్చాయి.మహిళల సమస్యలను ప్రతిబింబించే ఇమోజీలు...కరోనా కల్లోల సమయంలో స్త్రీలపై ఒత్తిడి, గృహహింస బాగా పెరిగింది. సంస్థలు, ఇతరుల నుంచి సహాయం తీసుకోవడం కూడా కష్టంగా ఉన్న సమయం అది. ఆ కల్లోల పరిస్థితికి అద్దం పట్టేలా ‘వయొలెన్స్ ఆన్ ఉమెన్ అండ్ గర్ల్స్’ ఇమోజీ వచ్చింది. కోవిడ్ సమయంలో హెల్త్, సోషల్ కేర్ వర్కర్లుగా మహిళలు ముందు వరుసలో ఉండి పనిచేశారు. ప్రాణాలను లెక్క చేయకుండా వృత్తి నిబద్ధత చాటుకున్నారు. వారి వృత్తి నిబద్ధత మాట ఎలా ఉన్నా వేతనాలు, నాయకత్వ స్థానాలకు సంబంధించి మహిళలపై వివక్ష కనిపించింది. ఈ సమస్యను గురించి చెప్పే ఇమోజీ... జెండర్ పే గ్యాప్.కోవిడ్ కాలంలో విద్యాసంస్థలు మూతపడడం వల్ల చాలామంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ వైపు వెళ్లారు. అయితే సరైన సదు΄ాయాలు లేక΄ోవడం, పేదరికం వల్ల అబ్బాయిలతో ΄ోల్చితే అమ్మాయిలు ఆన్లైన్ ఎడ్యుకేషన్లో వెనకబడి΄ోయారు. దీని గురించి చెప్పే ఇమోజీ... డిజిటల్ జెండర్ డివైడ్. కోవిడ్ కల్లోలం మహిళల ఆదాయం, జీవనోపాధిని బాగా దెబ్బతీసింది. ఎకనామిక్ యాక్టివిటీ లేకుండా పోయింది. దీని గురించి చెప్పే ఇమోజీ... ఇన్ఫార్మల్ వర్క్ అండ్ ఇన్స్టేబిలిటీ.పీరియడ్స్కు సంబంధించి మహిళలు ఎదుర్కొనే సమస్యలపై ‘పీరియడ్ పావర్టీ అండ్ స్టిగ్మా’ ఇమోజీ వచ్చింది. కోవిడ్ సమయంలో పురుషులతో పోల్చితే ఫిమేల్ హెల్త్కేర్ వర్కర్లు ఇన్ఫెక్షన్, అనారోగ్యం బారిన పడ్డప్పటికీ ప్రాణభయంతో వెనకడుగు వేయలేదు. అయినప్పటికీ విధాన నిర్ణయాలలో వారికి తగిన ప్రాతినిధ్యం లభించలేదు. ఈ విషయాన్ని చెప్పే ఇమోజీ... అండర్ రిప్రెజెంటేషన్ యాజ్ లీడర్స్ ఇన్ హెల్త్.బ్రెస్ట్ ఫీడింగ్ ఇమోజీటెక్నికల్ ఆర్గనైజేషన్ యూనికోడ్ కన్షార్టియం తొలిసారిగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇమోజీని తీసుకువచ్చింది. ఇది ఇమోజీ లైబ్రరీలో భాగం అయింది. ట్విట్టర్(ఎక్స్)లాంటి సామాజిక మాధ్యమాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలాంటి సందర్భాలలో ప్రత్యేక ఇమోజీలు తీసుకువచ్చాయి.కొన్ని సంవత్సరాల క్రితం...‘పెళ్లికూతురు ఇమోజీలు తప్ప వివిధ వృత్తులకు సంబంధించిన మహిళల ఇమోజీలు కనిపించవు. ఇమోజీ ప్రపంచంలో లింగ వివక్ష కనిపిస్తుంది’ అనే విమర్శలు ఉండేవి. ఇలాంటి విమర్శల నేపథ్యంలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడానికి, స్త్రీ సాధికారతకు అద్దం పట్టే ఇమోజీలకు పట్టం కట్టే ప్రయత్నం జరుగుతోంది. మార్పు మంచిదే కదా! (చదవండి: నీట్, యూపీఎస్సీలలో ఓటమి..ఇవాళ రోల్స్ రాయిస్లో రూ. 72 లక్షలు..)

ఎండుకొబ్బరి ఎక్కువకాలం తాజాగా...
మరింత రుచికోసం కూరలు, స్వీట్లలో ఎండుకొబ్బరిని వినియోగిస్తుంటాం. దీనికోసం కొబ్బరిని ఇంట్లో నిల్వచేసుకుంటూ ఉంటాం. కానీ కొద్దిరోజులకే కొబ్బరిచిప్ప లోపల బూజులాగా రావడం, కొన్నిసార్లు లోపల తెల్లగా ఉన్నప్పటికీ చేదుగా మారడం జరుగుతుంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే ...మార్కెట్ నుంచి తెచ్చిన ఎండు కొబ్బరి చిప్పలను శుభ్రంగా గుడ్డతో తుడిచి, గంటసేపు ఎండలో ఆరబెట్టాలి. ఆరిన చిప్పలను ఉప్పునీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఇప్పుడు కొద్దిగా కొబ్బరి నూనెను వేళ్లతో తీసుకుని చిప్పకు రాసి నిమిషం పాటు రుద్దాలి. ఈ చిప్పలను రెండురోజుల పాటు ఎండలో ఉంచి ఆ తర్వాత కవర్లో మూటకట్టాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి. టేబుల్ స్పూను పటిక పొడిని కప్పు నీటిలో కలపాలి. పటిక కరిగిన తరువాత ఈ నీటిలో చిన్న గుడ్డను ముంచి కొబ్బరి చిప్పల లోపలా బయటా తుడవాలి. అలా తుడిచిన చిప్పలను ఎండలో ఆరబెట్టి, కవర్లో వేసి ఉంచాలి. ఈ మూటను గాలిచొరబడని డబ్బాలో నిల్వచేస్తే ఎక్కువ రోజులు చిప్పలు తాజాగా ఉంటాయి. (చదవండి: హీరో మాధవన్ వెయిట్లాస్ జర్నీ..! వ్యాయమాలు చేయకుండా జస్ట్ 21 రోజుల్లో..)
ఫొటోలు
అంతర్జాతీయం

ఇజ్రాయెల్ ఓ క్యాన్సర్ కణితి: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
అమెరికా, ఇజ్రాయెల్లపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ నేరాల్లో అమెరికా భాగస్వామి అంటూ విరుచుకుపడ్డారు. టెల్ అవీవ్ను క్యాన్సర్ కణితిగా ఆయన అభివర్ణించారు. వాషింగ్టన్ చెప్పినట్లు నడుచుకుంటుందంటూ మండిపడ్డారు. కాగా, ఇజ్రాయెల్తో యుద్ధం తర్వాత అయతుల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు బయటకు రాగా.. జూలై 5న టెహ్రాన్లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో తొలిసారిగా కనిపించారు. ఇరాన్-ఇజ్రాయెల్లలో 12 రోజుల పాటు జరిగిన వైమానిక దాడుల కారణంగా ఖమేనీ సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగి.. మరోవైపు అమెరికాతో అణు చర్చలు జరపనున్న వేళ సుప్రీం లీడర్ తీవ్ర స్థాయిలో స్పందించడం సంచలనం రేపుతోంది. అమెరికా, ఇజ్రాయెలతో గొప్పగా పోరాటం చేశామన్న ఖమేనీ.. మళ్లీ ఎలాంటి దాడులు జరిగినా దీటుగా బదులిచేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందంటూ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇటీవల 12 రోజుల యుద్ధాన్ని ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రారంభించింది.. కానీ విఫలమైంది’’ అంటూ ఖమేనీ తీవ్ర ఆరోపణలు చేశారు.12 రోజుల పాటు జరిగిన తీవ్ర యుద్ధంలో జోక్యం చేసుకున్న అమెరికా.. ఇరాన్లో అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో వందల మంది మరణించారు. ఇజ్రాయెల్ తన వైమానిక దాడులతో ఇరాన్లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ ప్రతిగా మిస్సైల్ దాడులు చేసి, అమెరికా స్థావరాలపై కూడా దాడి చేసింది.

ప్రాణం తీసిన అన్నాబెల్లె బొమ్మ!?
అన్నాబెల్లె.. ది కంజూరింగ్ సిరీస్ సినిమాలు చూసిన వాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు. అయితే సినిమాటిక్ ప్రపంచంలో ఈ బొమ్మ ఎలా ఉన్నా.. వాస్తవ ప్రపంచంలో మాత్రం దీని రూపురేఖలు మరోలా ఉంటాయి. అయితే ఈ బొమ్మతో స్టంట్లు చేయబోయి ఓ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అనూహ్యంగా ప్రాణం పొగొట్టుకున్నారు.అమెరికాలో కనెక్టికట్ స్టేట్లోని న్యూఇంగ్లండ్ సొసైటీ ఫర్ సైకిక్ రీసెర్చ్(NESPR) వాళ్లు.. డెవిల్స్ ఆన్ ది రన్ పేరుతో టూర్లు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో భయానక వస్తువులుగా ముద్రపడినవాటి గురించి వివరించడం ఈ షో ఉద్దేశం. ఇందులో భాగంగా.. అన్నాబెల్లె ఒరిజినల్ బొమ్మతో డాన్ రివెరా(54) అనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ స్టంట్లు చేస్తున్నాడు. అయితే అనూహ్యంగా ఈ పర్యటనలోనే ఆయన కన్నుమూశారు.పెన్సిల్వేనియా గెట్టిస్బర్గ్ సమీపంలో.. జులై 13న తాను బస చేసిన హోటల్ గదిలో విగత జీవిగా ఆయన పడి కనిపించాడు. సీపీఆర్ చేసినా ఆయనలో చలనం లేదు. మృతికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. బహుశా గుండెపోటుతో ఆయన మరణించి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఆయన చనిపోయిన టైంలో ఆ బొమ్మ హోటల్ గదిలో లేదు. బయట తాళం వేసి ఉన్న ఓ వ్యాన్లో బొమ్మ కనిపించింది. దానిని ఎవరు అక్కడ ఉంచారనేది తేలాల్సి ఉంది. దీంతో బొమ్మను ఆయన చావుకు ముడిపెట్టి చర్చ నడిపిస్తున్నారు. డాన్ రివెరా(dan Rivera) మృతిపై ఇప్పటికైతే అనుమానాలు నెలకొన్నాయి. అటాప్సీ(శవపరీక్ష) నివేదిక వస్తేనే ఈ మృతి మిస్టరీ వీడేది. ఎన్ఈఎస్పీఆర్ అనే సంస్థను ప్రముఖ డీమనాలజిస్టులు(దెయ్యాలు, భూతాలు, ఆత్మలపై పరిశోధనలు చేసేవారు), పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు ఎడ్, లారాయిన్ వారెన్లు స్థాపించారు. డాన్ రివెరా.. గతంలో అమెరికా సైన్యంలో పని చేశారు. ఎన్ఈఎస్పీఆర్తో చాలాకాలంగా ఆయనను అనుబంధం ఉంది. లారాయిన్ వారెన్కు ముఖ్యశిష్యుడు కూడా. అంతేకాదు.. గతంలో ఓ చానెల్లో మోస్ట్ హంటెడ్ ప్లేసెస్ అనే కార్యక్రమంలోనూ ఈయన పాల్గొన్నారు. అదే సమయంలో నెట్ఫ్లిక్స్ ‘28 డేస్ హాంటెడ్’ అనే సిరీస్లోనూ కనిపించారు. చాలాకాలంగా అన్నాబెల్లె బొమ్మను ఈయనే చూసుకుంటున్నారు. టిక్టాక్లో ఆ బొమ్మ షార్ట్ వీడియోస్ కూడా విశేషంగా ఆదరణ దక్కించుకున్నాయి. ఈ విషాదంపై ఎన్ఈఎస్పీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే డెవిల్స్ ఆన్ ది రన్ మాత్రం ఆగదని స్పష్టం చేసింది. పైగా ఈ బొమ్మతో ఇప్పటిదాకా ప్రాణాలు పోయిన దాఖలాలు లేవని చెబుతున్నారు.కొన్నాళ్ల కిందట లూసియానా టూర్లో అన్నాబెల్లె బొమ్మ కనిపించకుండా పోయిందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటిని రివెర కొట్టిపారేశారు. బొమ్మ సురక్షితంగానే ఉందని ప్రకటించారు. అసలు అన్నాబెల్లే బొమ్మ The Conjuring సినిమాల్లో చూపించిన పోర్సలిన్ బొమ్మ కాదు. నిజ జీవితంలో ఇది రాగ్గెడీ అన్న్ అనే క్లాత్ డాల్, ఎర్ర రంగు నూలతో చేసిన జుట్టుతో ఉంటుంది. కానీ, దీని వెనుక ఉన్న కథ చాలా భయానకంగా ఉంటుంది. 1970లో.. ఈ బొమ్మను లారా క్లిఫ్టన్, డియర్డ్రె బెర్నార్డ్ అనే ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులకు బహుమతిగా ఇచ్చారు. మొదట ఇది సాధారణ బొమ్మలా అనిపించినా, కొద్దిరోజుల్లో దానంతట అదే కదలడం మొదలైందట. దీంతో వాళ్లు ఓ నిపుణుడ్ని సంప్రదించగా, ఈ బొమ్మలో అన్నాబెల్లే హిగ్గిన్స్ అనే చిన్న అమ్మాయి ఆత్మ ఉందని చెప్పారు. పైగా HELP US, HELP CAL అనే రాతలతో ఉన్న పేపర్లు ఆ ఇంట్లో ప్రత్యక్షమయ్యాయి. పెన్సిల్ కూడా లేని ఇంట్లో అవి కనిపించడంతో అంతా భయపడిపోయారు. ఆ సమయంలోనే.. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు వారెన్ దంపతుల వద్దకు బొమ్మ చేరింది. వాళ్లు దానిని తమ ఇంటి బేస్మెంట్లోని కలెక్షన్లో దాచారు. అదే తర్వాత వారెన్ ఆకల్ట్ మ్యూజియంWarren Occult Museumగా మారింది. ఈ మ్యూజియంలో శిలువ(Cross), పవిత్ర నీరు(Holy Water)తో అన్నాబెల్లె బొమ్మను ఓ గ్లాస్ కేస్ లో బంధించారు. అక్కడ “Touch not!” అనే హెచ్చరిక కూడా ఉంది. మరికొన్ని కలెక్షన్లు కూడా అక్కడ ఉన్నాయి. మ్యూజియం అమెరికాలోని కనెక్టికట్ స్టేట్లోని మోన్రో నగరంలో ఉంది. అయితే.. 2019లో Lorraine Warren మరణం తర్వాత మ్యూజియం శాశ్వతంగా మూసివేయబడింది. మ్యూజియం Tony Spera (వారెన్ల అల్లుడు) ఆధ్వర్యంలో ఉంది. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో లేదు, కానీ NESPR పారానార్మల్ ఈవెంట్స్లో కొన్ని వస్తువులను ప్రదర్శిస్తోంది. అందులో ది ఫేమస్ హాంటెడ్ డాల్గా పేరున్న అన్నాబెల్లె కూడా ఉంది. వారెన్ దంపతుల ఇన్వెస్టిగేషన్ల స్ఫూర్తితోనే కంజూరింగ్ సినిమాలు తెరకెక్కాయి.Annabelle Handler Dan Rivera Dies Suddenly During Haunted Tour, RIP #annabelle #annabelledoll #edwarren #lorrainewarren #paranormal #riristea #rivetsoro pic.twitter.com/6Ya3WM6K03— Rivet Soro (@Rivet_Soro) July 15, 2025

ఇండోనేషియా తోవలో భారత్: వాణిజ్య ఒప్పందంపై ట్రంప్
వాషింగ్టన్: అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటన చేశారు. అమెరికా-ఇండోనేషియా వాణిజ్య ఒప్పందం మార్గంలోనే భారత్ పయనిస్తున్నదని అన్నారు. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు లేదా ఏకపక్ష సుంకాలను ఎదుర్కోనేందుకు ట్రంప్ నిర్ణయించిన ఆగస్టు ఒకటి గడువుకు ముందే దీనిపై భారత్- అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.ఇండోనేషియాతో తాను ప్రకటించిన వాణిజ్య ఒప్పందం మాదిరిగనే భారత్ కూడా ఇదే మార్గంలో పనిచేస్తున్నదని, ఇది అమెరికా, భారత మార్కెట్లకు అత్యధిక లబ్ధి చేకూరుస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా- ఇండోనేషియా వాణిజ్య ఒప్పందం ప్రకారం అమెరికాలోకి దిగుమతులపై 19 శాతం సుంకం ఉంటుంది. అయితే అమెరికా నుండి ఇండోనేషియాకు ఎగుమతులపై ఎటువంటి సుంకం ఉండదని వాషింగ్టన్లో ట్రంప్ ప్రకటించారు. భారత్ కూడా ఇదే మార్గంలో పనిచేస్తోందని, భారత్తో ఇదే విధమైన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామన్నారు.ఆగస్టు 1 నాటికి ఒప్పందం కుదుర్చుకోకపోతే 35 శాతం వరకు సుంకాలు విధిస్తామని ట్రంప్ యూరోపియన్ యూనియన్కు లేఖలు పంపారు. అమెరికా- భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఒకవేళ ఇండోనేషియా ఒప్పందాన్ని ప్రతిబింబిస్తే, భారతదేశ ఎగుమతులపై 19 శాతం సుంకం ఉండనుంది అలాగే యూఎస్ నుండి దిగుమతులపై ఎటువంటి సుంకం ఉండదని తెలుస్తోంది.

బిష్ణోయ్ గ్యాంగ్కు టెర్రర్ ట్యాగ్?.. కెనడాలో పెరుగుతున్న ఒత్తిడి
ఒట్టావా: కెనడాతో సహా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..హింస, దోపిడీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు, పలు హత్యలకు పాల్పడుతున్నదని కెనడియన్ నేత డేనియల్ స్మిత్ పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ అంతర్జాతీయ నేర నెట్వర్క్ కలిగివున్నదని, అందుకే ఈ గ్యాంగ్కు టెర్రర్ ట్యాగ్ ఇవ్వాలని ఆయన ఒక సోషల్ మీడియా పోస్ట్లో కోరారు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యం నేరపూరితమైనదని, హింసాత్మకమైనదని స్మిత్ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ ముఠా కార్యకలాపాలకు ఎటువంటి హద్దులు లేవని, దీనికి దేశంలో స్థానం ఉండకూడదని అన్నారు. బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా అధికారికంగా గుర్తించడం ద్వారా, దాని ఆటలు ఇకపై సాగవని , ప్రాంతీయ స్థాయి చట్ట అమలు సంస్థల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడదని స్మిత్ పేర్కొన్నారు. కాగా బిష్ణోయ్ నెట్వర్క్లో కీలకంగా భావిస్తున్న గోల్డీ బ్రార్పై చర్యలు తీసుకోవాలని భారత్ ఎప్పటినుంచో కెనడాను కోరుతూ వస్తోంది. The Lawrence Bishnoi Gang is a transnational criminal network responsible for violence, extortion, drug trafficking and targeted killings, including here in Canada. Its reach is global, and its intent is criminal and violent.We know that gang activity knows no boundaries and… pic.twitter.com/wYwdAx3pfT— Danielle Smith (@ABDanielleSmith) July 15, 2025గత జూన్లో బ్రిటిష్ కొలంబియా నేత డేవిడ్ ఎబీ కెనడాకు ఇదేవిధమైన అభ్యర్థన చేశారు. ఈ ముఠా అల్బెర్టా, ఒంటారియో ప్రాంతంలోని దక్షిణాసియా ప్రజలపై పలు నేరాలకు పాల్పడిందని డేవిడ్ ఎబీ ఆరోపించారు. ఇదే సమయంలో సర్రే మేయర్ బ్రెండా లాక్ ఈ పిలుపుకు మద్దతునిచ్చారు. బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తే, కెనడియన్ చట్ట అమలు సంస్థలకు వ్యవస్థీకృత నేర నెట్వర్క్లతో పోరాడేందుకు అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
జాతీయం

తొమ్మిదేళ్ల చిన్నారికి గుండెపోటు?
జైపూర్: దేశంలో ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా రాజస్థాన్లో ముక్కుపచ్చలారని తొమ్మిదేళ్ల చిన్నారి గుండెపోటుతో ప్రాణాలొదిలింది. ఈ ఉదంతం గుండెపోటు మరణాలపై మరోమారు ఆందోళనను రేకెత్తించింది.ప్రాచీ కుమావత్.. వయసు తొమ్మిదేళ్లు.. సికార్లోని దంతా పట్టణంలో 4వ తరగతి చదువుతోంది. ఎంతో ఆరోగ్యంగా కనిపించే ఈ చిన్నారి పాఠశాల విరామ సమయంలో భోజనానికి కూర్చుంది. టిఫిన్ డబ్బా తెరుస్తూ స్పృహ కోల్పోయింది. వెంటనే అక్కడున్న ఉపాధ్యాయులు బాధితురాలిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లారు. ఆ చిన్నారిని బతికించేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేశారు. వైద్యుల పరీక్షలో ఆ చిన్నారికి పల్స్ అందలేదు.. రక్తపోటు పడిపోయింది. ఊపిరి ఆగిపోయింది. ఇవన్నీ గుండెపోటు లక్షణాలని వైద్యులు గుర్తించారు.జలుబు కారణంగా ప్రాచీ రెండు మూడు రోజులుగా పాఠశాలకు హాజరు కాలేదని ఆదర్శ్ విద్యా మందిర్ స్కూల్ ప్రిన్సిపాల్ నంద్ కిషోర్ తివారీ మీడియాకు తెలిపారు. తిరిగి ఆ చిన్నారి పాఠశాలకు వచ్చినప్పుడు ఆరోగ్యంగానే ఉందని, ఉదయం ప్రార్థనలు, అసెంబ్లీలో కూడా పాల్గొన్నదని, భోజన సమయంలో స్పృహ కోల్పోయిందని తెలిపారు. వెంటనే సీపీఆర్ ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని, తరువాత దంతాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకువెళ్లామని నందకిశోర్ వివరించారు.కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జి డాక్టర్ డాక్టర్ ఆర్కె జాంగిద్ మీడియాతో మాట్లాడుతూ బాధిత చిన్నారిని బతికించేందుకు దాదాపు గంటన్నర పాటు ప్రయత్నించామని తెలిపారు. తరువాత మెరుగైన వైద్యం కోసం సికార్లోని జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే పోస్ట్మార్టం నిర్వహించకుండా ఆ చిన్నారి గుండెపోటుతో మృతిచెందిందని ఖచ్చితంగా నిర్ధారించలేమని, ఆ చిన్నారికి పుట్టుకతోనే గుండె జబ్బు ఉండే అవకాశం ఉందని, దానిని తల్లిదండ్రులు గుర్తించకపోయి ఉండవచ్చని డాక్టర్ జాంగిద్ అన్నారు.

సర్పంతో ఆటలాడితే అంతే
భోపాల్: నాగ పామును మెడకు చుట్టుకొని, బైక్ నడుపుతూ సాహసం చేయబోయిన ఓ వ్యక్తి అదే పాము కాటు వేయడంతో మృతిచెందాడు. మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాధితుడిని దీపక్ మహావర్గా గుర్తించారు. పాముతో బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీపక్ స్థానిక జేపీ కాలేజీలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు. పాములను పట్టడంలో నేర్పరిగా పేరుంది. వేలాది పాములను రక్షించి, సురక్షిత ప్రాంతాల్లో వదిలేశాడు. ఇటీవల నాగు పామును పట్టుకున్నాడు. దాన్ని అందరికీ చూపించాలని భావించాడు. అందుకే మెడకు చుట్టుకొని బైక్ నడిపాడు. కానీ, పాము అతడిని కాటు వేసింది. దీపక్ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆలస్యంగా తీసుకురావడంతో రక్షించలేకపోయామని డాక్టర్లు చెప్పారు. దీపక్ భార్య గతంలోనే మృతిచెందారు. అతడికి రౌనక్, చిరాగ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రుల మరణంతో వారు అనాథలుగా మారిపోయారు.

Air India crash probe: ‘ఇంధన స్విచ్లలో ఇబ్బందే లేదు’
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో గత నెలలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన దరిమిలా, ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మర విచారణ జరుపుతున్నాయి. ఇదే కోవలో ఎయిర్ ఇండియా కూడా వ్యవస్థీకృత లోపాలపై పరిశీలన జరుపుతోంది. తాజాగా ఎయిర్ ఇండియా తమ బోయింగ్ 787-8 విమానాలలోని ఇంధన నియంత్రణ స్విచ్ (ఎఫ్సీఎస్) లాకింగ్ మెకానిజానికి సంబంధించిన ముందు జాగ్రత్త తనిఖీలను నిర్వహించింది.ఈ నేపధ్యంలో ఇంధన నియత్రణ స్విచ్లతో ఎటువంటి సమస్యలు లేవని టాటా యాజమాన్యంలోని ఎయిర్లైన్ అధికారులు స్పష్టం చేశారు. పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)బోయింగ్ విమాన నమూనాల ఎప్సీఎస్ను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన దరిమిలా ఎయిర్ ఇండియా ఈ తనిఖీలను నిర్వహించింది. బోయింగ్ నిర్వహణ షెడ్యూల్ ప్రకారం అన్ని బోయింగ్ 787-8 విమానాలలో పరిశీలనలు చేశారు.తమ ఇంజనీరింగ్ బృందం ఎస్సీఎస్ లాకింగ్ మెకానిజంపై ముందు జాగ్రత్త తనిఖీలను పూర్తి చేసింది. వాటిలో ఎటువంటి సమస్యలు లేవని అధికారులు తెలిపారు. లాకింగ్ ఫీచర్తో సహా ఇంధన నియంత్రణ స్విచ్ డిజైన్ అన్ని బోయింగ్ విమాన నమూనాలలో ఒకే తరహాలోనే ఉంటుందని, అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8లో కూడా ఇదే తరహా స్విచ్ ఉందని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.

వర్షాకాల సమావేశాల్లో 8 కొత్త బిల్లులు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో 8 కొత్త బిల్లులు ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియోహెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్(సంరక్షణ, నిర్వహణ) బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్(సవరణ) బిల్లు, మణి పూర్ వస్తువులు, సేవల పన్ను(సవరణ) బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే ఇన్కం ట్యా క్స్–2025ను కూడా ప్రవేశపెట్టే అవకాశం కనిపి స్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21వ తేదీ దాకా మొత్తం 21 రోజులపాటు జరుగు తాయి. రాఖీ పౌర్ణమి, స్వాతంత్య్ర దినో త్సవం సందర్భంగా రెండు రోజులు సెలువులు ప్రకటించారు.
ఎన్ఆర్ఐ

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో సుమారు 900 మంది భక్తులతో ఈ వేడుకు ఘనంగా జరిగింది. అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మొదటి నుంచి చివరి వరకు సాంప్రదాయభరితంగా, సాంస్కృతిక ఘనతతో కొనసాగిన ఈ కార్యక్రమంలో తెలుగు కుటుంబాలు, కార్మిక సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కాళికా అమ్మవారికి వేపచెట్టు రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరించి, దీపం వెలిగించిన బోనాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. మట్టి కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాలను తలపై మోస్తూ, డప్పులు, పోతురాజులు, ఆటగాళ్లతో ఆలయానికి తరలివచ్చారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని నిర్వాహకుడు బోయిన సమ్మయ్య తెలిపారు.బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైన సాంప్రదాయక పండుగ అని, తక్కువ సమయంలో పెద్ద ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిచారంటూ సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అభినందించారు. ఈ ఏడాది సమాజం సువర్ణోత్సవాలను కూడా ప్రకటించారు. కార్మిక సోదరులు పెద్దఎత్తున హాజరయినందుకు ఉపాధ్యక్షులు పుల్లన్నగారి శ్రీనివాసరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు కురిచేటి జ్యోతీశ్వర్ రెడ్డి స్పాన్సర్ వజ్ర రియల్ఎస్టేట్కు అభినందనలు తెలిపారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సింగపూర్ తెలుగు సమాజం, అరసకేసరి దేవస్థానం సభ్యులకు, ఆహుతులకు, హాజరైన భక్తులు అందరికీ గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కోశాధికారి ప్రసాద్, ఉపకోశాధికారి ప్రదీప్, ఉపాధ్యక్షులు నాగేష్, మల్లిక్, కార్యదర్శి స్వాతి, కమిటీ సభ్యులు గోపి కిషోర్, జనార్ధన్, జితేందర్, భైరి రవి, గౌరవ ఆడిటర్లు ప్రీతి, నవత తదితరులు ఈ వేడుకలో భాగం పంచుకున్నారని, తెలుగు వారంతా బోనాల స్ఫూర్తితో పాల్గొని మన ఐక్యతను చాటారని నిర్వాహకులు పేర్కొన్నారు.

ట్రంప్కు మరో షాక్.. రాజీనామా యోచనలో కాష్ పటేల్!
ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో విభేదాలతో ఎలాన్ మస్క్ డోజ్ను వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాష్ పటేల్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కాష్ పటేల్(కశ్యప్ ప్రమోద్ పటేల్) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ.. కాష్ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డాన్ రాజీనామా చేసిన వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని కాష్ భావిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినోఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం.. ఎఫ్బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్ఐబీకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలోనే కాష్ పటేల్ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే.. కాష్ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. పామ్ బాండీ‘‘ఈ దర్యాప్తులో పామ్ బాండీ ఉండాలని కాష్ పటేల్ కూడా కోరుకోవడం లేదు. బాండీ మరికొన్ని పత్రాలను విడుదల చేయకపోవడంపైనా ఎఫ్బీఐ వర్గాల్లో తీవ్ర అసహనం నెలకొంది. అందుకే బోంగినో గనుక వీడితే ఆయన కూడా ఎఫ్బీఐని వీడే అవకాశం ఉంది’’ అని ఓ ప్రముఖ జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎఫ్బీఐకి, డీవోజే(డిపార్ట్మెంట ఆఫ్ జస్టిస్)కు నడుమ పొసగట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ట్రంప్ అనుచరురాలు లారా లూమర్ సైతం ధృవీకరించడం గమనార్హం. పారదర్శకత లోపించిందనేది ప్రధాన ఆరోపణతో ఎఫ్బీఐ వర్గాలు బాండీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాయంటూ లూమర్ తెలిపారు. ఈ క్రమంలో బాండీని.. బ్లోండీ అంటూ ఆమె ఎద్దేవా చేయడం గమనార్హం. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే.. ఎప్స్టీన్ ఫైల్స్లో.. ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని ఫిబ్రవరిలో ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీవోజే-ఎఫ్బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలో.. ఎలాంటి ఆధారాల్లేవని, కేసును ముగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాండీ మాటమార్చి.. తన గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఎలాన్ మస్క్ సైతం ఈ వ్యవహారంపై ట్రంప్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఈ వ్యవహారంపై తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎఫ్బీఐ వర్సెస్ జ్యూడీషియల్ డిపార్టెమెంట్ వ్యవహారంపై వైట్హౌజ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) ఉద్యమకారులు సైతం ఈ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.కశ్యప్ పూర్వీకులు భారత్లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్గా వివిధ హోదాల్లో సేవలందించారు. ఆ సమయంలోనే ట్రంప్కు ఆయన దగ్గరయ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎఫ్బీఐ 9వ డైరెక్టర్గా కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పామ్ బాండీ కాష్తో ప్రమాణం చేయించగా.. భగవద్గీత మీద చేయి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు.

యూఎస్కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్!
కూటి కోసం కోటి తిప్పలు..ఇది సగటు మనిషి ఆలోచన. మెరుగైన జీవితం కోసం డాలర్ డ్రీమ్స్ ఎందరివో. విదేశాలకు వెళ్లాలి. డాలర్లలో సంపాదించాలి అనేది లెక్కలేనంతమంది భారతీయు యువతీ యువకుల ఆశ, ఆశయం. కానీ డాలర్ డ్రీమ్స్ ఇపుడు మసక బారుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది భారతీయ టెకీలు నివసించే అమెరికాలోరోజు రోజుకీ మారుతున్న పరిణామాలు భారతదేశానికి తిరిగి పయనమయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డిట్లో అమెరికాలో ఉంటున్న ఒక యువజంట పోస్ట్ వైరల్గా మారింది. ఈ జంట గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. వీరి ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారు, ఇది వారికి ఏ దేశంలోనైనా నివసించడానికి, పని చేయడానికి వెసులుబాటునిస్తుంది. కుమారుడికి కూడా అమెరికా పౌరసత్వం ఉంది. ముగ్గురు సభ్యుల ఫ్యామిలీ ఇండియాకు తిరిగి రావాలని ప్లాన్ చేస్తోంది. ‘‘మేం ఇద్దం 30ల్లో ఉన్నాం. టెక్నాలజీ, ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నాం. ఒక ముగ్గురు సభ్యులున్న కుటుంబం ఇండియాలో బతకాలంటే రూ. 25 కోట్లు సరిపోతాయా... రిటైర్ మెంట్ తరువాత పిల్లలను పెంచుకుంటూ, హ్యాపీగా జీవించాలి అసలు ఎంత కావాలి దయచేసి తెలపండి’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇండియాకు వెళ్లాక కొంతకాలం విరామం తీసుకోవచ్చు. ఆ తరువాత ఇంట్రస్ట్ను బట్టి ఉద్యోగాలు వెదుక్కుంటాం. కానీ అది మా జీవితాలను ప్రభావితం చేయకూడదని పేర్కొన్నారు. దాదాపు 5.5 మిలియన్ల డార్లు (సుమారు రూ. 47.21 కోట్లు) ఉన్నాయంటూ తమ ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అందించారు.రెడ్డిటర్లు ఈ పోస్ట్పై స్పందించారు. అది మీరుండే నగరం, ఇల్లు,అలవాట్లు, జీవన శైలిసహా అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని కొందరు సాధారణంగా భారతీయ నగరంలో జీవించడానికి రూ. 25 కోట్లు సరిపోతాయని మరి కొందరు చెప్పగా, టైర్ 2 స్మార్ట్/బాగా అభివృద్ధి చెందిన నగరంలో నివసిస్తుంటే ప్రామాణిక ఖర్చులు అద్దె, ఆహారం, కొన్ని అవసరమైన వస్తువులు సహా 75 వేల రూపాయలు సరిపోతాయి. సొంత ఇల్లు ఇంకా మంచిది. పిల్లవాడికి ఒక మాదిరి స్కూలు ఫీజు నెలకు 30-50 వేలు చాలు. నికరంగా ఒక స్టాండర్డ్ లైఫ్కి నెలకు 2 లక్షలు బేషుగ్గా సరిపోతాయి రెండు మూడేళ్ల తరువాత ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటే చాలు అని ఒకరు వివరించారు. (Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!)ముగ్గురే కాబట్టి ఇక్కడ సౌకర్యవంతంగా బతకాలంటే జీవనశైలి బట్టి నెలకు కనీసంగా రూ. 4 లక్షలు, గరిష్టంగా రూ. 8 కోట్లు సరిపోతాయని లెక్కలు చెప్పారు. మరో యూజర్ ఏమన్నారంటే.. "నేను ఇటీవల భారతదేశంలో (ముఖ్యంగా బెంగళూరులో) కొంత సమయం గడిపాను. US కి దగ్గరగా జీవించాలనుకుంటే ఇండియాచాలా ఖరీదైనది. US సబర్బన్ లాంటి, బెంగళూరులోని ఆదర్శ్, బ్రిగేడ్ లేదా ప్రెస్టీజ్ వంటి కొన్ని ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీలు 2000 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కానీ మీరు ఇంతకంటే చవగ్గా కూడా బతకొచ్చు. కాబట్టి మూడు మిలియన్ డాలర్లు సరిపోతాయా లేదా అనేది మీమీదే ఆధారపడి ఉంటుదని మరొకరు వ్యాఖ్యానించారు.అంతేకాదు “ఇండియాలో ట్రాఫిక్, దుమ్ము, కాలుష్యం, అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, వేడి, నీటి కొరత లాంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.” అని మరో రెడ్డిటర్ వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!

లండన్లో వైభవంగా 'టాక్' బోనాల జాతర వేడుకలు
లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల కుయుకే నలుమూలల నుండి సుమారు 2000కి పైగా ప్రవాసీయులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. వ్యాఖ్యాతలుగా ఉపాధ్యక్షులు సురేష్ బుడగం, కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్ పర్సన్ గణేష్ కుప్పాల, కార్యదర్శి శైలజా జెల్ల వ్యవహరించారు. ముఖ్య అతిదులుగా పార్లమెంటరీ అండర్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ (మైగ్రేషన్ & సిటిజన్ షిప్) సీమా మల్హోత్రా, మాజీ ఎంపీ వీరేంద్రశర్మ, హౌంస్లౌ నగర మేయర్ అమీ క్రాఫ్ట్, అతిదులుగా కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఉదయ్ ఆరేటి ఎంపీ కంటెస్టెంట్ ఉదయ్ నాగరాజు, స్థానిక కౌన్సిలర్లు ప్రభాకర్ ఖాజా, అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, బంధన చోప్రా పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, యూకే తెలుగు బిజినెస్ ఛాంబర్ డైరెక్టర్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం అందరికీ బోనాలు (Bonalu) శుభాకాంక్షలు తెలిపారు. టాక్ కార్యక్రమాలు గొప్పగా ఉన్నాయని అభినందించారు. మన రాష్ట్ర పండగని మరింత వైభవంగా తెలంగాణలో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.టాక్ సంస్థ అద్యక్షులు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న తెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో బాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు సంస్థను నడిపిస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ సంస్థ ద్వారా ఆడబిడ్డలందరు బోనాలతో సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన ఉత్సాహాన్ని నింపిందంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సంస్థ భవిష్యత్తు కార్యక్రమాలను ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి వివరించారు.ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ బోనాల జాతర ఇంతటి విజయం సాదించడం సంతోషంగా ఉందని తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం తన సహకారం వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించుకోవడం సంతోషమన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ నవీన్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు -బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు.బోనాల జాతర వేడుకల విజయానికి కృషి చేసిన సహకరించిన స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి, టాక్ కార్యవర్గానికి, స్థానిక సంస్థలకు, అతిధులకు, అలాగే హాజరై ప్రోత్సహించిన ఎన్నారై మిత్రులకు టాక్ అడ్వైజరీ చైర్మన్ మట్టా రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే మాజీ అధ్యక్షులు, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈవెంట్ స్పాన్సర్స్ అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో సత్కరించింది.ఈ కార్యక్రమంలో, పవిత్ర, సత్య చిలుముల, మట్టా రెడ్డి, సురేష్ బుడగం, రాకేష్ పటేల్, సత్యపాల్ రెడ్డి పింగిళి, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లా రెడ్డి, గణేష్ పాస్తాం, శ్రీకాంత్, నాగ్, శ్రీధర్ రావు, శైలజ,స్నేహ, విజయ లక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్వేత శ్రీవిద్య, నీలిమ, పృద్వి, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరిగౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, జస్వంత్, మాడి, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమా, తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

నాతో రాకపోతే చంపేస్తా..
హైదరాబాద్: తనతో కలిసి ఉండకపోతే చంపేస్తానని ఓ యువతిని బెదిరించడమే గాక తరచూ ఆమె పనిచేస్తున్న చోటుకు వెళ్లి వేధింపులకు గురిచేస్తుండడంతో మనస్తానికి గురైన బాధితురాలు ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..సూర్యాపేట జిల్లా, వట్టికం మన్పహాడ్ గ్రామానికి చెందిన బానోతు రంగమ్మ హౌస్కీపింగ్ పనిచేస్తూ శ్రీకృష్ణానగర్లో తన కుమార్తె రేణుక (20)తో కలిసి ఉంటోంది. రేణుక సమీపంలోని ల్యాండ్ రిడ్జ్లో పని చేసేది. రెండేళ్ల క్రితం ఆమెకు చల్లా వినయ్కుమార్ అనే యువకుడితో పరిచయం కావడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే డ్రగ్స్కు అలవాటు పడిన వినయ్కుమార్ ఆవారాగా తిరుగుతూ రేణుక జీతాన్ని బలవంతంగా లాక్కునేవాడు. దీంతో ఆమె అతడిని దూరం పెట్టింది. ఈ నెల 9న రేణుక డ్యూటీకి వెళ్లింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో వినయ్కుమార్ రేణుక పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్లి ఆమెతో పాటు అక్కడ పనిచేస్తున్న దివ్య అనే యువతిని కూడా బలవంతంగా లాక్కొచ్చి రేణుక స్కూటీ పైనే వారిని ఎక్కించుకుని వెళ్తుండగా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డారు. మద్యం మత్తులో ఉన్న వినయ్కుమార్ బైక్ నడుపుతుండడంతో కేసు నమోదు చేసిన పోలీసులు బైక్ను సీజ్ చేశారు. ఇంటికి వెళ్లిన రేణుకను బైక్ విషయమై తల్లి ప్రశి్నంచగా రిపేర్కు ఇచ్చానని తల్లికి అబద్దం చెప్పింది.దీంతో మనస్తాపానికి లోనైన ఆమె ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురి ఆత్మహత్యకు వినయ్కుమార్ కారణమని తల్లి రంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు.

కదులుతున్న కారులో మహిళపై గ్యాంగ్రేప్
జైపూర్: రాజస్తాన్లోని అల్వార్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏడుగురు దుండగులు ఓ మహిళను అపహరించి, సామూ హిక అత్యాచారానికి పాల్పడ్డారు. కారులో ప్రయాణిస్తూ ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారు. 11 రోజులపాటు బాధితురాలిని నిర్బంధించారు. చివరకు రోడ్డు పక్కన వది లేసి వెళ్లిపోయారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదు ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 24న రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళను ముగ్గురు వ్యక్తులు అపహరించారు. బొలేరో వాహనంలో బలవంతంగా ఎక్కించి తీసుకెళ్లారు. వాహనంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన మహిళపై దాడికి దిగారు. నోట్లో గుడ్డలు కుక్కారు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మరో నలుగురు ఉన్నారు. 11 రోజులు అక్కడే నిర్బంధించారు. ఏడుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలిని నగ్నంగా మార్చి అభ్యంతకరంగా వీడియోలు చిత్రీకరించారు. పోలీసులకు చెబితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని హెచ్చరించారు. రూ.3 లక్షల ఇస్తామని, నోరు మూసుకోవాలని చెప్పారు. అపస్మారక స్థితికి చేరిన బాధితురాలిని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. స్థానికుల సాయంతో ఆమె తన ఇంటికి చేరుకున్నారు.

కూతురి గొంతు నులిమి చంపేసిన తల్లిదండ్రులు
ఒంగోలు టౌన్: క్షణికావేశానికి గురైన తల్లిదండ్రులు కుమార్తె గొంతు నులిమి చంపేయడం సంచలనం సృష్టించింది. ఒంగోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ముంగమూరు రోడ్డులోని విలేకరుల కాలనీ 1వ లైనులో నివశించే పల్నాటి రమేష్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురికి వివాహం చేసి అత్తారింటికి పంపించారు. చిన్న కుమార్తె తనూష (23) డిగ్రీ చదివి హైదరాబాద్లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసింది. కొద్దిరోజులుగా ఒంగోలులోనే తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఒంగోలుకు చెందిన పెళ్లయి పిల్లలున్న ఒక వ్యక్తిని తనూష ప్రేమించింది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో తనూషకు, తల్లిదండ్రులు రమేష్, లక్ష్మికి మధ్య మంగళవారం రాత్రి వివాదం జరిగింది. క్షణికావేశానికి గురైన రమేష్, లక్ష్మి తనూష గొంతును బలంగా నులిమారు. ఊపిరాడని తనూష ప్రాణం వదిలింది. కాసేపటికి తేరుకున్న రమేష్, లక్ష్మి భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ తెలియకుండా కుమార్తె మెడకు చున్నీ బిగించి ఫ్యానుకు వేలాడదీశారు.రాత్రి 11.30 గంటల సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుందని, కరెంటు లేకపోవడంతో సకాలంలో తాము గమనించలేదంటూ సీన్ క్రియేట్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగప్రవేశం చేసిన పోలీసులు తనూష మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. తల్లిదండ్రుల వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన తీరులో విచారణ జరపగా.. అసలు విషయం బయటపడింది. సీఐ విజయకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బెజవాడలో జంట హత్యలు
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): విజయవాడ నగరంలో పట్టపగలు ఇద్దరు వ్యక్తులను ఓ రౌడీషీటర్ హత్య చేశాడు. మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవపడి.. ఇద్దరిని కత్తితో పొడిచి చంపేశాడు. విజయవాడ గవర్నర్పేటలోని అన్నపూర్ణ థియేటర్ సమీపంలో రౌడీషీటర్ జమ్ము కిశోర్, ఎం.రాజు(37), గాదె వెంకట్(25) మూడు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. కిశోర్, రాజు విజయవాడకు చెందిన వారు కాగా.. గాదె వెంకట్ విజయనగరానికి చెందిన వ్యక్తి. బుధవారం మధ్యాహ్నం ముగ్గురూ తమ గదిలో ఫుల్గా మద్యం సేవించారు. ఆ సమయంలో డబ్బుల విషయమై ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాజు, వెంకట్ను కిశోర్ కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రాజు, వెంకట్ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకుసమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కిశోర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కిశోర్పై ఎనిమిది కేసులు ఉన్నట్లు వెల్లడించారు. 2001లో హత్య కేసుతో తొలిసారి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కిన కిశోర్పై అదే ఏడాది రౌడీషీట్ తెరిచినట్లు తెలిపారు.