ప్రధాన వార్తలు

QR కోడ్తో బాబు మోసాలను నిలదీద్దాం.. ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు
సాక్షి,గుంటూరు: ఏపీలో ఏడాదిగా కూటమి పాలనలో.. టీడీపీ, ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడే పల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు.రాష్ట్రంలో దిగజారిన లాండ్ ఆర్డర్, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోంది. చంద్రబాబు అరాచక పాలనకు వ్యతిరేకంగా మే4న ప్రజలు, వైఎస్సార్పీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్లా. కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య నా రెంటపాళ్ల పర్యటన జరిగింది. అయినా విజయవంతమైంది. మా పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? మొన్నటి పొదిలి పర్యటనలో 40వేల మందిపై రాళ్లేసే ప్రయత్నం చేశారు. రైతులు సంయమనం పాటించారు. అయినా కేసులు పెట్టారు. రైతుల సమస్యల గురించి ఎవరూ మాట్లాడకూడదు. సంఘీభావం తెలపకూడదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భయం.. ఎందుకు?చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ఓ టీవీ ఛానెల్లో చంద్రబాబు అహంకార మాటలు వినండి. ప్రతిపక్షను భూస్థాపితం చేస్తారట. ప్రశ్నిస్తున్న వ్యక్తిని భూస్థాపితం చేస్తారా?. ఏడాది కాలంలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో చంద్రబాబు పాలనపై అసహనం పెరిగింది. ఆ అసహనాన్ని డైవర్ట్ చేస్తూ వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై, నేతలపై కేసులు పెడుతున్నారు. టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి అరెస్ట్ నిజంగా అశ్చర్యకరం. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని గన్మెన్ను బలవంతం చేశారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనందుకు గన్మెన్పై దాడి కూడా చేశారు. తనపై జరిగిన దాడిని గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీకి గన్మెన్ లేఖ రాశారు. మరో గన్మెన్ను ప్రలోభాలకు గురిచేసి వారికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు.. అరెస్టులు చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకును కేసులో ఇరికించారు. సొంత నియోజవకర్గంలో గెలవలేని వ్యక్తి. చంద్రగిరిలో ఇబ్బంది ఉండకూడదనే చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకొచ్చాం. మళ్లీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. సురేష్ భార్యపైనా కేసులు పెట్టారు. వల్లభనేని వంశీపై 11 కేసులు పెట్టారు. జోగి రమేష్ కొడుకు, కాకాణిపై తప్పుడు కేసులు. కృష్ణమోహన్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డిపైనా అక్రమ కేసులు పెట్టారు. కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్నినాని, వైవి సుబ్బారెడ్డి,ఆయన కుమారుడిపై తప్పుడు కేసులు. దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే,అంబటి రాంబాబు, విడదల రజినిపై తప్పుడు కేసులు దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పైనా అక్రమ కేసులు. బూచేపల్లి శివప్రసాద్రెడ్డిపై, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్, గోరంట్ల మాధవ్పై కేసులు. ఇలా వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొమ్మినేని ఏం పాపం చేశారు.. చంద్రబాబూ?సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏం పాపం చేశారు? ఏం చేశారని కొమ్మినేనిని అరెస్ట్ చేశారు?టీవీ డిబెట్లో అనలిస్ట్ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం? గతంలో కేఎస్ఆర్ ఉద్యోగాన్ని చంద్రబాబు ఊడగొట్టించారు. కేఎస్ఆర్ అరెస్ట్ అక్రమమేనన్న సుప్రీంకోర్టు.. తనకున్న విచక్షణాధికారాల్ని ఉపయోగించి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలించింది. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టులాంటిది. మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా?మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా అని వైఎస్ జగన్ ప్రెస్మీట్లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు కేరాఫ్గా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలోని ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ నేతలు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాలిస్తే ఈ విషయం బయటకొచ్చింది. కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వకుండా భయపెట్టారు. కనీసం చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదా? న్యాయం చేయాలనే తపన చంద్రబాబుకు లేదు. న్యాయం వైపు నిలిచే వ్యక్తి చంద్రబాబు కాదు. మరో ప్రాంతంలో ఇంటర్ గిరిజన బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. తర్వాత బాలిక శవమై కనిపించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. టీడీపీ నేత.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటిప్రజల కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది. 32లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్లను మంజూరు చేసి 10లక్షల ఇళ్లు పూర్తి చేశాం. చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించ్చాం. మహిళలపై ఎవరికి గౌరవం ఉంది?. మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటి.కరెంట్ బిల్లుల బాదుడే.. బాదుడు15వేల కోట్లు కరెంట్ బిల్లుల బాదుడు,గవర్నమెంట్ స్కూళ్లు కాలేజీ కాలేజీల్ని నిర్విర్యం చేశాడు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల పేరిట బాదుడే బాదుడే. రేషన్ వెహికల్స్ వాహనాల్ని తీసేశాడు. రేషన్ ద్వారా ఇచ్చే పప్పు దాన్యాల్ని ఎగనామం పెట్టాడు. ఫలితంగా పప్పు దాన్యాల రేట్లు పెంచి బాదుడే బాదుడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. సుమారు 3లక్షలపై చీలూకు ఉద్యోగాల్ని తొలగించారు.ప్రభుత్వ ఉద్యోగుల సంగతి సరేసరిపంటలకు సరైన మద్దతు లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏమైనా ఒరిగిందా అంటే? అదీ లేదు. వచ్చీ రాగానే పీఆర్సీ అన్నారు. పీఆర్సీని ఆపేశారు. ఈ జులై 1వ తారీఖుతో కలిసి నాలుగు డీఏ ఇవ్వాలి. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 20 వేలకోట్ల వరకు ఆపేశారు. చంద్రబాబు పెట్టిన తాకట్టు.. చంద్రబాబు తాను అబద్ధమాడుతూ.. తానెప్పుడూ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడం లేదన్నాడు. మద్యం ఆదాయం తాకట్టుపెట్టడం లేదు. కానీ 4-4-2025 నాడు విడుదల చేసిన జీవో 69 కింద ఏపీఎండీసీ కింద 436 మినరల్ ప్రాజెక్ట్ను తాకట్టు పెట్టారు. వాటి విలువ 191,000 కోట్లు రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి ప్రెస్మీట్లో రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో, బాండలను అందరూ రెడీగా పెట్టుకోవాలి. చంద్రబాబు తన పాలన గురించి తెలుసుకునేందుకు మీ ఇంటికి ఎమ్మెల్యేలు, ఇతర నేతల్ని పంపిస్తున్నారు. నేతలు వచ్చినప్పుడు మ్యానిఫెస్టో, బాబుష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో బాండును అందించారు. ఆ బాండు, ఎన్నికల మ్యానిఫెస్టో చూపిస్తూ ఎంత వరకు ఎన్నికల హామీలు నెరవేర్చారో అడగండి. అప్పుడైనా చంద్రబాబుకు ఎన్నికల హామీలు నెరవేర్చుతారో చూడాలి. ఒకవేళ మీ వద్ద ‘బాబు మ్యానిఫెస్టోని గుర్తు తెచ్చుకుంటూ’ అనే పేరుతో చంద్రబాబు మ్యానిఫెస్టోను డౌన్లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్ను వైఎస్సార్సీపీ అందుబాటులోకి తెస్తుంది’ అని అన్నారు. ప్రభుత్వంపై ఫైట్ చేయండి. రాష్ట్ర ప్రజల తరుఫున వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.

చంద్రబాబు.. ‘సాక్షి’పై దాడులు విచ్చలవిడి రౌడీయిజం కాదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో సాక్షి ఆఫీసులే టార్గెట్గా టీడీపీ నేతలు దాడులు చేశారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. టీడీపీ సహా కూటమి నేతలు సాక్షి కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించారు. ఇది విచ్చలవిడి రౌడీయిజం కాదా?. వీటన్నింటికీ చంద్రబాబు, ప్రభుత్వమే కారణం కాదా?. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తప్పుడు సంప్రదాయమే కదా?. ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ఏం పాపం చేశారని అరెస్ట్ చేశారు. అనలిస్ట్ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం?. గతంలో కేఎస్ఆర్ ఉద్యోగాన్ని కూడా చంద్రబాబు ఊడగొట్టించారు. ఆయనపై పగతోనే ఇదంతా చేశారు. పత్రికల గొంతు నులుపే కార్యక్రమం ధర్మమేనా?. సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపచెల్లుమనిపించినట్టు కాదా?. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు రాతలు రాసిన వారిపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తారా?. ఇది విచ్చలవిడి రౌడీయిజం కాదా?. వీటన్నింటికీ చంద్రబాబు కారణం కాదా?. పక్కా ప్లన్, ఓ ప్రణాళికతో సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కుట్ర జరిగింది. సాక్షి ఆఫీసులపై టీడీపీ నేతలు ధ్వంసం చేసినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది. ఈరోజు సాక్షి టార్గెట్గా దాడులు చేశారు. రేపటి రోజున మరొకరిపై దాడులు చేస్తారా?. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తప్పుడు సంప్రదాయమే కదా? ఇది ఇలాగే కొనసాగితే ఎలా?. భవిష్యత్ ప్రజలు బతుకుతారా?. ప్రజాస్వామ్యం అనేది ఏపీలో ఉందా?. చంద్రబాబుకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు కాదా?. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బుద్ది తెచ్చుకోవాలి. ‘సాక్షి’ ఆఫీసులపై దాడులు చేసింది వీరే..శ్రీకాకుళంలో మెట్ట శైలజ-టీడీపీ అధ్యక్షురాలుమెండ దాసు నాయుడు- టీడీపీ నాయకులు.విశాఖలో.. ముక్కా శ్రావణి.. టీడీపీ కార్పొరేటర్. అనంత లక్ష్మి.. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు.తూర్పుగోదావరి.. నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి(అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే).బతూలు బాలరామకృష్ణ.. జనసేన ఎమ్మెల్యే. విజయవాడలోగద్దె అనురాధ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య గద్దె క్రాంతి టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు. మంగళగిరిలో.. కంభంపాటి శిరీష ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్.అనంతపురంలో.. స్వప్న.. టీడీపీ మహిళా వింగ్ స్టేట్ సెక్రటరీ. సంగా తేజస్వినీ.. టీడీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ.కడపలో.. బొజ్జా తిరుమలేష్.. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రెసిడెంట్. తిరుపతి.. ఆర్సీ మునికృష్ణ.. తిరుపతి డిప్యూటీ మేయర్. కోడూరి బాలసుబ్రహ్మణ్యం.. టీడీపీ అధికార ప్రతినిధి.

న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మకు భారీ ఎదురుదెబ్బ
సాక్షి,ఢిల్లీ: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. కాలిన నోట్ల కట్టల వ్యహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ అత్యున్నత న్యాయస్థానానికి సిఫార్స్ చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఈ ఏడాది మార్చి నెలలో ఆయన అధికారిక నివాసంలో వెలుగులోకి వచ్చిన రూ.500 నోట్ల కట్టల వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. తాజాగా త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసి రిపోర్టును సుప్రీంకోర్టుకు అందించింది. కాలిన నోట్ల కట్టలు జస్టిస్ వర్మ,అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని గుర్తించింది. ఇదే వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ 55 మంది సాక్షులను విచారించి, జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసి, మొత్తం 64 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను మొదటగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసింది. నివేదికలో కీలకమైన విషయాలను పరిశీలిస్తే..త్రిసభ్య విచారణ కమిటీ తన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా పేజీ 60లో: “ 30 తుగ్లక్ క్రెసెంట్లో ఉన్న స్టో రూమ్లో భారీ ఎత్తున నగదు ఉన్నట్లు గుర్తించాం. నగదు ఉన్న ప్రదేశం ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వర్మ అధికారిక నివాసం…”పేజీ 59లో: “... స్టోరుమ్లోకి వెళ్లేందుకు జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకే ఉన్నది. ఎవరు అనుమతి లేకుండా లోపలికి వెళ్లలేరు. మా విచారణలో తేలింది.”మార్చి 14న జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్న సమయంలో స్టోరూంలో తగలబడిన నోట్లను గుర్తించారు. ఓ సాక్షి చెప్పిన ప్రకారం.. “లోపలికి వెళ్లగానే ఏటు వైపు చూసినా, రూ.500 నోట్ల కట్టలు నేలపై పడి ఉన్నాయి. ఇది నా జీవితంలో నేను చూసిన పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు పేర్కొంది. కమిటీ నివేదిక ప్రకారం, ఈ రకమైన పెద్ద మొత్తంలో నోట్లను అక్కడ ఉంచడం అనుమానాస్పదం. జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా అక్కడ ఉంచడం అసంభవం’. జస్టిస్ వర్మ కుమార్తె దియా వర్మ, ప్రైవేట్ సెక్రటరీ రాజీందర్ కార్కీ పాత్రలను కూడా కమిటీ పరిశీలించింది. ఈ ఇద్దరూ అగ్నిమాపక సిబ్బందిని నగదు విషయం చెప్పొద్దని’ చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.దీంతో పాటు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కుమార్ చేసిన ఆరోపణలు, దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం, జస్టిస్ వర్మను తొలగించే ప్రక్రియ ప్రారంభించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి’ అని కమిటీ తేల్చింది.దేశంలో ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. సుప్రీం త్రిసభ్య కమిటీ సిఫార్సుతో జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జస్టిస్ వర్మ మాత్రం కాలిన నోట్ల కట్టల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, నిరుపయోగంగా ఉండే స్టోరూంలో ఇతరులు సైతం ప్రవేశించే అవకాశం ఉందని వాదిస్తున్నారు.

అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?
ఓ వైపు బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ రూ.లక్షను (10 గ్రాములకు) చేరుకుంటే ఇంకో వైపు మరో విలువైన లోహం వెండి కూడా రికార్డుల మోత మోగిస్తోంది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య తీవ్ర ఘర్షణల నేపథ్యంలో వెండి, బంగారం ధరల ర్యాలీ కొనసాగింది. ముఖ్యంగా వెండి ధర గత ఆల్టైమ్ గరిష్టం రూ.1,08,100ను అధిగమించింది. ఢిల్లీ మార్కెట్లో రూ.1,000 పెరిగి రూ.1,08,200 స్థాయికి చేరుకుంది. మరోవైపు 99.9 శాతం స్వచ్ఛత బంగారం రూ.1,00,710 స్థాయిని తాకింది. రూ.540 లాభపడింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో 2012 ఫిబ్రవరి తర్వాత మొదటిసారి 37 డాలర్లను వెండి అధిగమించింది.ఈ నేపథ్యంలో ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మాటలపై అటు ఇన్వెస్టర్లతో పాటు ఇటు సామాన్య జనంలోనూ చర్చ సాగుతోంది. అమ్మో బంగారం అంత పెరిగింది... ఇంత పెరిగింది.. అని చర్చించుకుంటున్న జనం ఇప్పుడు పెరుగుతున్న వెండి ధరలను చూసి నోరెళ్లబెడుతున్నారు. ఆర్థిక అంశాల్లో ఎప్పటికప్పుడు తన అంచనాలను వెల్లడించే రాబర్ట్ కియోసాకి ఇటీవల వెండి గురించి సంచలన అభిప్రాయం ప్రకటించారు. కిలో వెండి ధర రూ.2 లక్షలకు చేరొచ్చని కియోసాకి అభిప్రాయపడ్డారు.👉 ఇదిగో ఈ ఖర్చులే జేబులు ఖాళీ చేసేది! ఇటీవలి ఆర్థిక అస్థిరత, స్థిరమైన ఆస్తులకు పెరుగుతున్న డిమాండ్ గురించి ప్రస్తావిస్తూ కియోసాకి వెండిని దాని పారిశ్రామిక ఉపయోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా ఉదహరిస్తూ "నేడు ప్రపంచంలోనే భలే మంచి బేరం" అని అభివర్ణించారు. అంటే వెండి ఇప్పుడే కొనుక్కోండి.. రాబోయే రోజుల్లో కొనడం కష్టమవుతుందున్న భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎంసీఎక్స్లో కిలో వెండి ధర రూ.1.06 లక్షలుగా ఉండగా, వెండి ఇప్పటికే గత ఏడాదిగా అద్భుతమైన లాభాలను చవిచూసింది.ఆర్థిక విశ్లేషకులు ఆచితూచి ఆశావహంగా ఉన్నారు. కొంతమంది కియోసాకి అంచనాను తీవ్రమైనదిగా భావిస్తుండగా, మరికొందరు ఆయనతో ఏకీభవిస్తున్నారు. ఇందుకు ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన సాంకేతికతలలో పెరిగిన వెండి వినియోగం, అలాగే పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను ఎత్తి చూపుతున్నారు. వెండి జోరు నిజమే కానీ ఏకంగా రూ.2 లక్షలకు చేరుతుందా అన్నదానిపై ‘దీనికి కొన్ని తీవ్రమైన కారణాలు ఉండవచ్చు' అని ముంబైకి చెందిన కమోడిటీస్ స్ట్రాటజిస్ట్ మీరా దేశ్ పాండే అన్నారు.

ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో
జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం 787-8 డ్రీమ్లైనర్ బోయింగ్ తీవ్ర విషాదాన్ని నింపింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే విమానాశ్రయానికి సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ ప్రాంతంలో కూలిపోవడంతో భోజనం తింటున్న విద్యార్థులు నలుగురు చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ వార్త తెలియగానే, అహ్మదాబాద్ నివాసి రాజు పటేల్ మానవత్వాన్ని చాటుకున్న వైనం నెట్టింట పలువుర్ని ఆకట్టుకుంటోంది. ఆయన ప్రదర్శించిన చొరవ, నిజాయితీ ప్రశంసలు దక్కించుకుంటోందిఅహ్మదాబాద్ నివాసి రాజు పటేల్ (56) విమానం కూలిపోయిన సమయంలో భారీ పేలుడు శబ్దాన్ని విని ఉలిక్కి పడ్డారు. అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. హా హా కారాలు వినపడుతున్నాయి. ఇది విన్న నరాజు పటేల్ వెంటనే స్పందించారు. తన వద్ద పనిచేస్తున్న సిబ్బందితో కలిసి ఆయన పరుగున ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. కానీ అప్పటికే అదుపు చేయలేని రీతిలో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడి ఉన్నారు. ఇంతలో సహాయ దళాలు అక్కడికి చేరుకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న కొద్దిమందిలో రాజు, దట్టమైన పొగ, పెరుగుతున్న మంటలు, కేకలు, అరుపులు వినిపిస్తున్నా గందర గోళ పడలేదు. స్థానికులు ఇచ్చిన బట్టలు, చాపలను ఉపయోగించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమయం వృథా చేయకుండా, గాయపడ్డవారిని వీలైనంత వేగంగా అంబులెన్స్లలోకి ఎక్కించి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. దీంతో పటేల్ బృందం సేవలను చూసిన రెస్క్యూ అధికారులు, వారిని రాత్రి 9 గంటల వరకు సహాయక చర్యల్లో కొనసాగమని కోరడం గమనార్హం.అంతేకాదు సంఘటనా స్థలం శిథిలాల నుండి రూ. 60 వేల నగదు, 70 తులాల (బంగారం, హారాలు, గాజులు, మంగళసూత్రాలు, ఉంగరాలు, ) బంగారు ఆభరణాలను వెలికితీశారు. ఇంకా విదేశీ కరెన్సీ, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఐడి కార్డులు, వెండి వస్తువులను సేకరించి వాటిని జాగ్రత్తగా, నిజాయితీగా పోలీసులకు తిరిగి ఇచ్చారు.‘‘మొదటి 15 నుండి 20 నిమిషాల వరకు, తొందరగా దగ్గరికి చేరుకోలేకపోయాము. మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి, కానీ మొదటి అగ్నిమాపక దళం , 108 అంబులెన్స్లు వచ్చిన తర్వాత,సహాయం చేయడానికి ముందుకు సాగాం’’ అన్నారు రాజు. సమయానికి స్పందించడంతో పాటు, ఎంతో ధైర్య సాహసాన్ని ప్రదర్శించి ఆయన చేసిన సేవలతో పాటు తాను సేకరించిన వస్తువులను ఎంతో నిజాయితీగా అధికారులకు అప్పగించడం నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది.మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమైన రాజు పటేల్, బృందానికి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు. ఆపద సమయాల్లో ఆదుకున్నవాడే మానవుడు మహనీయుడు అని పేర్కొంటున్నారు.

ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత తుదిజట్టు ఇదే!
ఇంగ్లండ్తో తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన తుదిజట్టు (భారత్)ను ప్రకటించాడు. కేఎల్ రాహుల్ (KL Rahul)- యశస్వి జైస్వాల్లను ఓపెనింగ్ జోడీగా ఎంపిక చేసుకున్న అశూ.. జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్కు స్థానం ఇచ్చాడు. అదే విధంగా.. చెన్నై బ్యాటర్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తాడని పేర్కొన్నాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ తమ తొలి సిరీస్లో పరస్పరం తలపడనున్నాయి. ఇరుజట్ల మధ్య శుక్రవారం నుంచి మొదలయ్యే ఈ సిరీస్లోని తొలి టెస్టుకు లీడ్స్ వేదిక. ఈ మ్యాచ్తో శుబ్మన్ గిల్ (Shubman Gill) టీమిండియా టెస్టు కెప్టెన్గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.అశూ ప్లేయింగ్ ఎలెవన్ ఇదేఇక వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ లీడ్స్ టెస్టుకు భారత తుదిజట్టుపై తన అంచనా తెలియజేశాడు. సాయి సుదర్శన్తో పాటు కరుణ్ నాయర్కు కూడా తన జట్టులో చోటిచ్చాడు.‘‘కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ’’ అంటూ ఇంగ్లండ్తో తొలి టెస్టుకు తాను ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్ను అశూ వెల్లడించాడు.అందుకే కరుణ్కే ఓటుఅయితే, ఆరో స్థానం కోసం కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ మధ్య పోటీ ఉందని.. తాను మాత్రం ఫామ్ దృష్ట్యా కరుణ్కే ఓటు వేస్తానని అశూ తెలిపాడు. ఇక బుమ్రా అందుబాటులో లేనిపక్షంలో బౌలింగ్ ఆప్షన్ కోసం శార్దూల్ను ఎనిమిదో స్థానంలో ఆడించాలని సూచించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా అశూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.అత్యధిక వికెట్లు తీసేది అతడే!అదే విధంగా.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇంగ్లిష్ పేసర్ క్రిస్ వోక్స్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలుస్తాడని అశూ జోస్యం చెప్పాడు. లేదా షోయబ్ బషీర్ హయ్యస్ట్ వికెట్ టేకర్ అవుతాడని పేర్కొన్నాడు.టీమిండియా నుంచి బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడటం లేదు కాబట్టి అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదని చెప్పాడు. అయితే, సిరాజ్కు మాత్రం ఆ అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. పరుగుల వీరుడిగా పంత్!ఇక అత్యధిక పరుగులు వీరుడిగా రిషభ్ పంత్ నిలుస్తాడని అంచనా వేసిన అశూ.. ఇంగ్లండ్ నుంచి జో రూట్, బెన్ డకెట్ల పేర్లు కూడా కొట్టిపారేయలేమన్నాడు. కాగా భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. గెలిచిన కెప్టెన్కు పటౌడీ మెడల్ అందిస్తారు.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు అశ్విన్ ఎంపిక చేసిన భారత తుదిజట్టుకేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.భారత్తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ ప్రకటించిన తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’

ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
"పుష్ప" సినిమాలో, హీరో పుష్పరాజ్ ఇంటిపేరు కోసం, ఇంటి పేరు లేకపోవడంతో తను ఎదుర్కొన్న అవమానాలపై పోరాడతాడు. తన పేరు ముందు ఇంటి పేరు రావడం కోసం, జీరో నుండి హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. ఫైనల్గా తనను వెతుక్కుంటూ ఆ ఇంటిపేరు తన గుమ్మం ముందు వాలుతుంది. ఒకరకంగా ఎన్టీఆర్ పరిస్థితి కూడా పుష్పరాజ్ కథకు దగ్గరగా ఉంటుంది. తారక్ను అభిమానించే వారికి ఈ విషయం తెలుసు కూడా! తాజాగా ఇదే అంశం గురించి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) పలు విషయాలు పంచుకున్నారు.దూరం పెరిగింది..సీనియర్ ఎన్టీఆర్ కూతురు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తారక్ (Jr NTR)ను చిన్నతనంలోనే నందమూరి ఫ్యామిలీకి ఎందుకు దూరం పెట్టారో ఇలా చెప్పారు. ' జూనియర్ ఎన్టీఆర్ను చిన్నతనంలోనే దూరం పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. దానిని పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. కారణాలు అయితే ఉన్నాయి. కొంచెం దూరం పెరిగింది. కానీ, ఇప్పుడు అందరం కలిసే ఉంటున్నాం' అని ఆమె చెప్పారు.(చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు)తారక్ మనసులో ఏముంది?ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి కూడా పురందేశ్వరి మాట్లాడారు.' రాజకీయాల్లోకి తారక్ రావాలనుకుంటే వస్తారు. అతనిది ఇంకా చిన్న వయసు. అలాంటప్పుడు పాలిటిక్స్లోకి తారక్ రావాల్సిన అవసరం ఉందా..? అనేది మనం ప్రశ్నించుకోవాలి. అయితే, రాజకీయాల గురించి తారక్ మనసులో ఏముంది..? అనేది నాకు తెలియదు. ఈ విషయం గురించి ఎప్పడు కూడా చర్చించలేదు' అన్నారు.తారక్తో ఇబ్బంది లేదుగతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమె మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తారక్ తన పిల్లలతో రెగ్యులర్గా టచ్లో ఉంటాడని పురందేశ్వరి చెప్పారు. తను నటించిన సినిమా విడుదలైతే తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటానని ఆమె అన్నారు. తనను జూ. ఎన్టీఆర్ అత్తా అనే పిలుస్తాడని, తనతో ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె పలుమార్లు పంచుకున్నారు.చదవండి: వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్

Air India crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. దెబ్బతిన్న బ్లాక్ బాక్స్
సాక్షి,ఢిల్లీ: ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ (Air India Boeing 787-8 Dreamliner) విమాన ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 12న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి గల కారణాల్ని వెలికి తీసే బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.అయితే, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దెబ్బతిన్న బ్లాక్ బాక్స్ నుంచి వివరాల్ని సేకరించేందుకు కేంద్రం అమెరికాకు తరలించినట్లు సమాచారం. తాజా బ్లాక్ బాక్స్ పరిణామంపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.ఏప్రిల్ 12న అహ్మదాబాద్ నుంచి ఎయిరిండియా 787 డ్రీమ్లైనర్ విమానం 242 మందితో లండన్ బయల్దేరింది. కానీ, ఆ విమానం నేల మీద నుంచి పైకి లేచిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఘోరమైన తప్పు ఏదో జరిగింది. విమానంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. అందులో నుంచి ఒక మేడే కాల్ వెళ్లింది. అంతలోనే రద్దీగా ఉండే మేఘానీనగర్ బీజే మెడికల్ కాలేజీ ప్రధాన క్యాంపస్పై కప్పు మీద ఆ విమానం కూలిపోయి (air india crash video) అగ్ని గుండంలా మారింది. విమానంలోని మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ తప్ప మిగిలిన వారందరినీ అగ్ని దహించివేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారితో పాటు బీజే మెడికల్ కాలేజీ క్యాంపస్లో బాధితుల్ని కలుపుకొని మొత్తం 270 మంది మరణించినట్లు తెలుస్తోంది.ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు బాధిత కుటుంబ సభ్యుల డీఎన్ఏ ఆధారంగా మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతదేహాలను డీఎన్ఏతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ వైద్యులు మృతదేహాల్ని ఎనాలసిస్ చేసి మొత్తం 208 మృతదేహాల్ని గుర్తించారు. అలా ఇప్పటి వరకు (ఏప్రిల్ 18) ఉన్న సమాచారం ప్రకారం.. 170 మృతదేహాల్ని డీఎన్ఏతో గుర్తించారు. వారిలో యూకే, ఫోర్చుగల్,కెనడాతో పాటు ప్రమాదంలో మరణించిన మరో ఆరుగురు మృత దేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు.

ఇరాన్ దెబ్బ అదుర్స్.. ఇజ్రాయెల్కు భారీ ఎదురుదెబ్బ
టెహ్రాన్/టెవీ అవీవ్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు వైపుల నుంచి బాంబు దాడులు పీక్ స్టేజ్ చేరుకున్నాయి. ఇజ్రాయెల్పూ ఇరాన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణుల కారణంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసమైంది. ఇజ్రాయెల్లోని ఆసుపత్రులు, స్కూల్స్, నివాస ప్రాంతాల్లోకి ఇరాన్ క్షిపణులు దూసుకెళ్లాయి. దీంతో, భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది.తాజాగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. టెలీ అవీవ్, రామత్గాన్, హోలోన్, బెర్జీబా నగరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దీంతో, భయానక వాతావరణం నెలకొంది. బీర్షెబాలోని సోరోకా ఆసుప్రతిపై ఇరాన్ దాడి చేయడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. అనంతరం, ఆసుపత్రిలో ఉన్న పేషంట్స్, వైద్యులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. అత్యవసర బృందాలు స్పందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలు వైరల్గా మారాయి.మరోవైపు.. ఇజ్రాయెల్లోని హోలోన్ ప్రాంతంలో నివాసాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. ఈ క్రమంలో పలువురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. దక్షిణ ఇజ్రాయెల్లోని ప్రధాన, అతిపెద్ద ఆసుపత్రిపై ఇరాన్ దాడులు చేయడంతో భారీ నష్టం జరిగిందని చెప్పుకొచ్చింది. ఇజ్రాయోల్ రాజధాని టెలి అవీవ్లోని బహుళ అంతస్తు భవనాలపై క్షిపణి దాడులు జరగడంతో అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. 🚨 🚨 🚨 SOROKA HOSPITAL IN ISRAEL HIT BY IRANIAN BALLISTIC MISSILE pic.twitter.com/xK2HBPSeeV— Breaking911 (@Breaking911) June 19, 2025అంతకుముందు.. ఇరాన్ సైనిక సామర్థ్యం అణ్వస్త్ర స్థాయికి చేరకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులతో దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్ బుధవారం తన బాంబుల కుంభవృష్టిని కురిపించింది. ఇరాన్లోని 40 కీలక ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. యురేనియం శుద్ధి ప్రక్రియలో కీలకమైన సెంట్రీఫ్యూజ్లను తయారుచేసే కర్మాగారంపై భీకరస్థాయిలో మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాన్ సాయుధశక్తిని నిర్వీర్యం చేసేందుకు క్షిపణుల ఉత్పత్తి ఆయుధ ప్లాంట్లపైనా ఇజ్రాయెల్ వందల కొద్దీ డ్రోన్లను ఎక్కుపెట్టింది.🚨The recent rocket barrage by the Iranian regime hit a hospital in Southern Israel By the order of Khamenei, who specifically instructed to aim for civilian populations and hospitals.And you still ask why we don’t want them to have nuclear weapons…👇 pic.twitter.com/m2CuAxeFcn— Voice From The East (@EasternVoices) June 19, 2025ఇరాన్ అంతర్గత భద్రత శాఖ ప్రధాన కార్యాలయంపైనా యుద్ధవిమానాలు దాడులు చేశాయి. ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ భూభాగాలపై క్షిపణులను పేలుస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. ఇరాన్ జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 24 మంది చనిపోయారు. బుధవారం తమవైపు దూసుకొచ్చిన 10 క్షిపణులను నేలకూల్చామని ఇజ్రాయెల్ పేర్కొంది. జవాదాబాద్లో అత్యాధునిక ఎఫ్–35 యుద్ధవిమానాన్ని ఇరాన్ సేనలు పేల్చేశాయి. దాదాపు రూ.140 కోట్ల విలువైన హెర్మెస్ డ్రోన్నూ నేలకూల్చాయి. అత్యంత శక్తివంతమైన ఫతాహ్ హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ ప్రకటించింది. అయితే తమదేశంలో శుక్రవారం నుంచి ఇప్పటిదాకా 15,871 చోట్ల నిర్మాణాలు, దాదాపు 1,300 వాహనాలు, 1,633 ఆస్తులు నాశనమయ్యాయని ఇజ్రాయెల్ బుధవారం ఒప్పుకుంది.ఇరాన్లో భయానక నిశ్శబ్దం ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసంకావడంతో ఎప్పుడు ఎటు నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్ ప్రజల్లో కనిపించాయి. చాలా నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, ఆఫీస్లు, స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. సురక్షిత ప్రాంతాలకు నిత్యావసర సామగ్రితో వలసవెళ్లేవాళ్లు తప్పితే రోడ్లపై ఇంకెవరూ కనిపించట్లేదు. ఇజ్రాయెల్లో కాస్తంత భిన్నమైన వాతావరణం కని్పంచింది. ఇరాన్ను సుదూరంగా ఉన్న ఇజ్రాయెల్ పట్టణాల్లో పౌరసంచారాన్ని స్థానిక యంత్రాంగం అనుమతించింది. ‘‘ మా ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకోవడమే ఇరాన్పై విజయానికి ప్రబల నిదర్శనం’’ అని ఇజ్రాయెల్ రక్షణమంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’ అన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యంగా నెరవేరేదాకా ఇరాన్తో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేశారు.

‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
మీరట్: మధ్యప్రదేశ్లోని మీరట్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్లు వివాహమయ్యాక హనీమూన్ కోసం మేఘాలకు వెళ్లారు. అక్కడ వారిద్దరూ అదృశ్యమయ్యారు. కొద్దిరోజులకు ఒక లోయలో రఘువంశీ మృతదేహం లభ్యమయ్యింది. ఇంతలో సోనమ్ తాను భర్తను హత్య చేశానంటూ పోలీసులకు లొంగిపోయింది. పోలీసుల దర్యాప్తులో సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా హస్తం ఈ హత్య కేసులో ఉందని తేలింది. కేసు దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.సోనమ్ తన వివాహానికి ముందు, ఆ తరువాత సంజయ్ వర్మ అనే వ్యక్తికి 200 కి పైగా కాల్స్ చేయడాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో సోనమ్కు సంజయ్ వర్మతోనూ సంబంధం ఉందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కేసు దర్యాప్తు చేస్తున్న మేఘాలయ పోలీసులు.. సంజయ్ వర్మ మరెవరో కాదని, సోనమ్ ప్రేమికుడు రాజ్ కుష్వాహానే అని తేల్చారు. సోనమ్.. రాజ్ నంబర్ను ‘సంజయ్ వర్మ’ పేరుతో సేవ్ చేసింది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఉండేందుకు అలా చేసిందని పోలీసులు భావిస్తున్నారు. సోనమ్, సంజయ్ల మధ్య 39 రోజుల వ్యవధిలో 239 కాల్స్ నడిచాయి. అయితే సంజయ్ మొబైల్ నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్లో ఉందని పోలీసులు చెబుతున్నారు. తాజాగా సోనమ్ సోదరుడు గోవింద్ తనకు సంజయ్ అనే వ్యక్తితో పరిచయం లేదన్నారు. మేఘాలయ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘డొక్కు బస్సుల్లో పంపిస్తారా?’.. ఇరాన్ విద్యార్థుల ఆగ్రహం
జై షా, బీసీసీఐతో మాట్లాడాను.. వారికి నేనే చెప్పాను: సచిన్ టెండుల్కర్
జగన్ జన సునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం: భూమన
నేరుగా ఓటీటీకి స్టార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో
అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?
Donald Trump: అబ్బా.. ఏం గుండెరా వాడిది!
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కీలక నిర్ణయం!
న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మకు భారీ ఎదురుదెబ్బ
థగ్ లైఫ్ బ్యాన్.. కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీం సీరియస్!
నెలకు రూ.10,000 జీతం.. సెకండ్ హ్యాండ్ ఫోన్
పెళ్లికి మంచి రోజులు లేవని రూంకు తీసుకెళ్లి..!
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి
రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలలో పురోగతి
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
ఏపీలో అమ్మకు కష్టాలు (చిత్రాలు)
అది సరే! ఇక్కడ లక్షలాది మంది రోడ్డెక్కొద్దని ఎవరు చెప్పాలి సర్..!
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
సాక్షి కార్టూన్ 18-06-2025
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
నా భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంటావా!
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
జై షా, బీసీసీఐతో మాట్లాడాను.. వారికి నేనే చెప్పాను: సచిన్ టెండుల్కర్
జగన్ జన సునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం: భూమన
నేరుగా ఓటీటీకి స్టార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఎయిరిండియా విషాదం : మానవత్వం చూపించిన రియల్ హీరో
అమ్మో.. ఆయన మాటలు నిజమౌతాయా?
Donald Trump: అబ్బా.. ఏం గుండెరా వాడిది!
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ కీలక నిర్ణయం!
న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మకు భారీ ఎదురుదెబ్బ
థగ్ లైఫ్ బ్యాన్.. కర్ణాటక ప్రభుత్వంపై సుప్రీం సీరియస్!
నెలకు రూ.10,000 జీతం.. సెకండ్ హ్యాండ్ ఫోన్
పెళ్లికి మంచి రోజులు లేవని రూంకు తీసుకెళ్లి..!
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి
రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలలో పురోగతి
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
అది సరే! ఇక్కడ లక్షలాది మంది రోడ్డెక్కొద్దని ఎవరు చెప్పాలి సర్..!
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
సాక్షి కార్టూన్ 18-06-2025
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
నా భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంటావా!
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
సినిమా

ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
"పుష్ప" సినిమాలో, హీరో పుష్పరాజ్ ఇంటిపేరు కోసం, ఇంటి పేరు లేకపోవడంతో తను ఎదుర్కొన్న అవమానాలపై పోరాడతాడు. తన పేరు ముందు ఇంటి పేరు రావడం కోసం, జీరో నుండి హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. ఫైనల్గా తనను వెతుక్కుంటూ ఆ ఇంటిపేరు తన గుమ్మం ముందు వాలుతుంది. ఒకరకంగా ఎన్టీఆర్ పరిస్థితి కూడా పుష్పరాజ్ కథకు దగ్గరగా ఉంటుంది. తారక్ను అభిమానించే వారికి ఈ విషయం తెలుసు కూడా! తాజాగా ఇదే అంశం గురించి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) పలు విషయాలు పంచుకున్నారు.దూరం పెరిగింది..సీనియర్ ఎన్టీఆర్ కూతురు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తారక్ (Jr NTR)ను చిన్నతనంలోనే నందమూరి ఫ్యామిలీకి ఎందుకు దూరం పెట్టారో ఇలా చెప్పారు. ' జూనియర్ ఎన్టీఆర్ను చిన్నతనంలోనే దూరం పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. దానిని పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. కారణాలు అయితే ఉన్నాయి. కొంచెం దూరం పెరిగింది. కానీ, ఇప్పుడు అందరం కలిసే ఉంటున్నాం' అని ఆమె చెప్పారు.(చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు)తారక్ మనసులో ఏముంది?ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి కూడా పురందేశ్వరి మాట్లాడారు.' రాజకీయాల్లోకి తారక్ రావాలనుకుంటే వస్తారు. అతనిది ఇంకా చిన్న వయసు. అలాంటప్పుడు పాలిటిక్స్లోకి తారక్ రావాల్సిన అవసరం ఉందా..? అనేది మనం ప్రశ్నించుకోవాలి. అయితే, రాజకీయాల గురించి తారక్ మనసులో ఏముంది..? అనేది నాకు తెలియదు. ఈ విషయం గురించి ఎప్పడు కూడా చర్చించలేదు' అన్నారు.తారక్తో ఇబ్బంది లేదుగతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమె మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తారక్ తన పిల్లలతో రెగ్యులర్గా టచ్లో ఉంటాడని పురందేశ్వరి చెప్పారు. తను నటించిన సినిమా విడుదలైతే తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటానని ఆమె అన్నారు. తనను జూ. ఎన్టీఆర్ అత్తా అనే పిలుస్తాడని, తనతో ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె పలుమార్లు పంచుకున్నారు.చదవండి: వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్

'మమ్ముట్టి' ఆరోగ్యంపై వచ్చిన రూమర్స్ నిజమే : రాజ్యసభ ఎంపీ
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్పై తన స్నేహితుడు, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ పలు వ్యాఖ్యలు చేశారు. మమ్ముట్టి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. కానీ, చిన్న ఆనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని ఆయన పేర్కొన్నారు. మమ్ముట్టి గత కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్నారని కథనాలొచ్చాయి. దీంతో ఆయన టీమ్ గతంలోనే అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది.రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఇలా చెప్పారు. 'మమ్ముట్టి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారనేది నిజం. కానీ, కేవలం చిన్న ఆరోగ్య సమస్యకు మాత్రమే చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన బాగానే ఉన్నారు, నేను ఇప్పుడే అతనితో ఫోన్లో మాట్లాడాను. మేము చాలా సంవత్సరాలుగా స్నేహితులం, కానీ మేము ఎప్పుడూ వ్యక్తిగత విషయాలను చర్చించే రకం కాదు. ఇటీవల రోజుల్లో, మేము అలాంటి విషయాలను కూడా పంచుకుంటున్నాము. ఆయన పూర్తి సంతోషంతో ఉన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. త్వరలో సినిమా సెట్లో ఆయన్ను చూస్తారు.' అని ఆయన చెప్పారు.మమ్ముట్టి, మోహన్లాల్లు నటిస్తోన్న మహేష్ నారాయణన్ సినిమా మొదటి షెడ్యూల్ శ్రీలంకలో ప్రారంభమైంది. ఈ మల్టీస్టారర్ మలయాళ చిత్రంలో ఇద్దరు పెద్ద స్టార్స్ మమ్ముట్టి, మోహన్లాల్ నటిస్తున్నారు. ఈ మూవీకి తాత్కాలికంగా ఎంఎంఎంఎన్ (మమ్ముట్టి, మోహన్లాల్, మహేష్ నారాయణన్) అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార, దర్శనా రాజేంద్రన్ కూడా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్లోనే మమ్ముట్టి కాస్త అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సినిమా షూటింగ్ నుండి విరామం తీసుకున్నారు. త్వరలో ఆయన మళ్లీ సెట్స్లో అడుగుపెట్టనున్నారు.

నటుడు 'ఆర్య' వ్యాపార కార్యాలయాల్లో ఐటీ సోదాలు
కోలీవుడ్ నటుడు ఆర్య నివాసం, వ్యాపార సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) ఆకస్మిక దాడులు చేసినట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆర్య నటుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా.. ఇటీవల సంతానం నటించిన హర్రర్ మూవీ డిడి నెక్స్ట్ లెవెల్ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే.. అయితే, ఈ ఉదయం చెన్నైలోని అన్నా నగర్లోని తను నిర్వహిస్తున్న 'సీ షెల్' హోటల్తో పాటు మరికొన్ని వ్యాపార కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు చేసింది. ఆర్య వ్యాపారాలు చేస్తూ.. పన్ను చెల్లించకుండా ఉన్నారని సమాచారం రావడంతో అధికారులు తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.ఆర్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆపై నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. చెన్నైలోని అన్నా నగర్, వేలచెరి, కొట్టివాకం, కిల్పాక్ వంటి ప్రాంతాల్లో తనకు సంబంధించిన ‘సీ షెల్’ రెస్టారెంట్ల కార్యాలయాలు, శాఖల్లో తనిఖీలు చేశారు. అయితే, ఆర్య కూడా స్పందించారు. ‘సీ షెల్’ రెస్టారెంట్ చైన్ను గతంలోనే కేరళకు చెందిన వ్యాపారి కున్హి మూసాకు విక్రయించినట్లు ఆయన చెప్పారు. కానీ, ఐటీ అధికారులు ఈ అంశం గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

పారితోషికం తీసుకొని చాలా నష్టపోయా : శేఖర్ కమ్ముల
‘‘నా కెరీర్లోని మ్యూజికల్, లవ్స్టోరీ చిత్రాలు బ్లాక్బస్టర్స్గా నిలిచాయి. దీంతో నా పై ఓ మార్క్ పడింది. కానీ కథకు ఏం కావాలో అదే చేశాను. ‘లీడర్’ చాలా నిజాయితీగా చెప్పిన కథ. ఈ కథలో లవ్స్టోరీ, మంచి పాటలు పెట్టాలనుకోలేదు. ‘హ్యాపీడేస్’ కాలేజ్ స్టోరీ కాబట్టి కాలేజీ స్టోరీలానే ట్రీట్ చేశాను. ‘కుబేర’ సినిమా కూడా అంతే. ఈ కథకు కావాల్సిందే చేశాను. చెప్పాలంటే... నేను కథను డైరెక్ట్ చేయడం కాదు... కథే నన్ను డైరెక్ట్ చేస్తుంటుంది’’ అని అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. (చదవండి: నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్ కమ్ముల)ధనుష్, నాగార్జున హీరోలుగా నటించిన చిత్రం ‘కుబేర’. రష్మికా మందన్నా, జిమ్ సర్భ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రేపు విడుదల కానున్న సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో శేఖర్ కమ్ముల చెప్పిన విశేషాలు. ⇢ ‘కుబేర’ సినిమా ముంబై నేపథ్యంలో సాగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను చిత్రీకరించాం. ఒక సూపర్ రిచ్ ప్రపంచం, ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం... ఇలా రెండు విభిన్నమైన ప్రపంచాలను ప్రేక్షకులు చూస్తారు. తనకి ఏమీ వద్దని, ఏ ఆశ లేని ఒక బెగ్గర్, ఈ ప్రపంచంలోని అన్నీ తనకే కావాలనుకునే ఒక బిలియనీర్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే... బెగ్గర్ వర్సెస్ బిలియనీర్. ఈ తరహా కథలను చెప్పినప్పుడు పేదవారే గెలుస్తుంటారు. కానీ అది ఎలా ప్రజెంట్ చేశాం అన్నది ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎమోషనల్ థ్రిల్లర్గా ఉంటుందీ సినిమా. ⇢ ‘మనం, ఊపిరి’ వంటి సినిమాల్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నాగార్జునగారు నటించారు. ‘కుబేర’లో కూడా ఆయన కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమాలోని పాత్రలో ఆయన ఇమిడిపోయిన తీరు అద్భుతం. ఇక ఈ చిత్రంలోని దేవా పాత్రలో ధనుష్ సూపర్గా నటించారు. ధనుష్ బెగ్గర్గా కనిపిస్తారు. దేవా పాత్రలో ధనుష్గారిని తప్ప ఆడియన్స్ మరొకరిని ఊహించలేరు. రష్మికా మందన్నా తన యాక్టింగ్తో ఆడియన్స్ను సర్ప్రైజ్ చేస్తుంది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్కు తెలుగు రాకపోయినా తెలుగు డైలాగ్స్ను బట్టీ పట్టి మరీ చక్కగా చెప్పారు. నా గత చిత్రాలతో పోలిస్తే నా మార్క్ ‘కుబేర’ సినిమాలో పదింతలు ఎక్కువగా ఉంటుంది. ⇢ నా పాతికేళ్ల జర్నీని చూసుకున్నప్పుడు ఎమోషనల్గా అనిపిస్తుంది. నా స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకుని సినిమాలు తీసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. కానీ ఎక్కడా ఎదురు దెబ్బలు తగలలేదు. అది నా అదృష్టం. సినిమాల లాభాల విషయంలో కూడా నాకింత పర్సంటేజ్ కావాలని ఎప్పుడూ అడగను.. పారితోషికం తీసుకుంటానంతే. దీని వల్ల చాలా నష్టపోయాను. అయినా బాధలేదు. ప్రేక్షకుల ప్రేమే నాకు ముఖ్యం. నా కథలన్నీ నా జీవితంలో నేను చూసిన, నాకు తారసపడిన వ్యక్తుల జీవితాల్లోనివారివే. ఇక ‘లీడర్’కు సీక్వెల్ ఆలోచన ఉంది. కానీ ఇప్పటి రాజకీయ వ్యవస్థలో, ప్రజల్లో మార్పులొచ్చాయి. ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ను పట్టుకోవాలి. ఇక నానీతో చేసే సినిమాకు వర్క్ జరగాల్సి ఉంది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత తుదిజట్టు ఇదే!
ఇంగ్లండ్తో తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన తుదిజట్టు (భారత్)ను ప్రకటించాడు. కేఎల్ రాహుల్ (KL Rahul)- యశస్వి జైస్వాల్లను ఓపెనింగ్ జోడీగా ఎంపిక చేసుకున్న అశూ.. జట్టులో ఒకే ఒక్క స్పిన్నర్కు స్థానం ఇచ్చాడు. అదే విధంగా.. చెన్నై బ్యాటర్ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేస్తాడని పేర్కొన్నాడు.ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ తమ తొలి సిరీస్లో పరస్పరం తలపడనున్నాయి. ఇరుజట్ల మధ్య శుక్రవారం నుంచి మొదలయ్యే ఈ సిరీస్లోని తొలి టెస్టుకు లీడ్స్ వేదిక. ఈ మ్యాచ్తో శుబ్మన్ గిల్ (Shubman Gill) టీమిండియా టెస్టు కెప్టెన్గా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.అశూ ప్లేయింగ్ ఎలెవన్ ఇదేఇక వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ లీడ్స్ టెస్టుకు భారత తుదిజట్టుపై తన అంచనా తెలియజేశాడు. సాయి సుదర్శన్తో పాటు కరుణ్ నాయర్కు కూడా తన జట్టులో చోటిచ్చాడు.‘‘కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ’’ అంటూ ఇంగ్లండ్తో తొలి టెస్టుకు తాను ఎంపిక చేసిన ప్లేయింగ్ ఎలెవన్ను అశూ వెల్లడించాడు.అందుకే కరుణ్కే ఓటుఅయితే, ఆరో స్థానం కోసం కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్ మధ్య పోటీ ఉందని.. తాను మాత్రం ఫామ్ దృష్ట్యా కరుణ్కే ఓటు వేస్తానని అశూ తెలిపాడు. ఇక బుమ్రా అందుబాటులో లేనిపక్షంలో బౌలింగ్ ఆప్షన్ కోసం శార్దూల్ను ఎనిమిదో స్థానంలో ఆడించాలని సూచించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా అశూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.అత్యధిక వికెట్లు తీసేది అతడే!అదే విధంగా.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇంగ్లిష్ పేసర్ క్రిస్ వోక్స్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలుస్తాడని అశూ జోస్యం చెప్పాడు. లేదా షోయబ్ బషీర్ హయ్యస్ట్ వికెట్ టేకర్ అవుతాడని పేర్కొన్నాడు.టీమిండియా నుంచి బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడటం లేదు కాబట్టి అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదని చెప్పాడు. అయితే, సిరాజ్కు మాత్రం ఆ అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. పరుగుల వీరుడిగా పంత్!ఇక అత్యధిక పరుగులు వీరుడిగా రిషభ్ పంత్ నిలుస్తాడని అంచనా వేసిన అశూ.. ఇంగ్లండ్ నుంచి జో రూట్, బెన్ డకెట్ల పేర్లు కూడా కొట్టిపారేయలేమన్నాడు. కాగా భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసిన విషయం తెలిసిందే. గెలిచిన కెప్టెన్కు పటౌడీ మెడల్ అందిస్తారు.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు అశ్విన్ ఎంపిక చేసిన భారత తుదిజట్టుకేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.భారత్తో తొలి టెస్టుకు ఇంగ్లండ్ ప్రకటించిన తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’

క్రికెట్ మ్యాచ్ సందర్భంగా విచిత్ర పరిస్థితి
ఇటీవల జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా విచిత్ర పరిస్థితి నెలకొంది. సానుకూల వాతావరణం కారణంగా మ్యాచ్ వాయిదా పడింది. సాధారణంగా సానుకూల వాతావరణంలో క్రికెట్ మ్యాచ్లు సజావుగా సాగుతాయి. ప్రతికూల వాతావరణం ఉంటేనే మ్యాచ్లు వాయిదా పడటం కాని, రద్దు కావడం కాని జరుగుతుంది. అయితే ఈ ఉదంతంలో పరిస్థితి భిన్నంగా ఉంది. సానుకూల వాతావరణం ఉన్నా మ్యాచ్ వాయిదా పడింది.ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ టోర్నీలో కెంట్ స్పిట్ఫైర్స్, గ్లోసెస్టర్షైర్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో కెంట్ నిర్దేశించిన లక్ష్యాన్ని గ్లెసెస్టర్షైర్ ఛేదిస్తుండగా భారీగా ఎండ కాసింది. సూర్య కిరణాలు నేరుగా ఆటగాళ్ల కళ్లపై పడ్డాయి. దీంతో మ్యాచ్ను పాక్షికంగా వాయిదా వేశారు. ఎనిమిది నిమిషాల తర్వాత ఎండ ప్రభావం తగ్గడంతో మ్యాచ్ను తిరిగి ప్రారంభించారు.అనుకూలమైన వాతావరణం ఉన్నా మ్యాచ్ వాయిదా పడ్డ విషయం తెలిసి ఉపఖండంలోని క్రికెట్ అభిమానులు అవాక్కయ్యారు. భారత్ లాంటి దేశాల్లో ఎంత ఎండ ఉంటే మ్యాచ్లు అంత సజావుగా సాగుతాయి. ఎండ తీవ్రత 45 డిగ్రీల వరకు ఉన్నా ఉపఖండపు దేశాల్లో క్రికెట్ మ్యాచ్కు అనుకూలమైన వాతావరణంగానే పరిగణిస్తారు.అయితే ఇంగ్లండ్ లాంటి దేశాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఇంగ్లండ్లో ఎండలు ఎక్కువగా ఉండవు. ఈ వాతావరణానికి అలవాటు పడ్డ ఆటగాళ్లు, కొద్దిపాటి ఎండకే బెంబేలెత్తిపోతుంటారు. ఉపఖండంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోడం చాలా సార్లు చూసుంటాము.మ్యాచ్ విషయానికొస్తే.. కెంట్పై గ్లోసెస్టర్షైర్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్.. ఫించ్ (42), బిల్లింగ్స్ (38), ముయేయే (33) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన గ్లోసెస్టర్షైర్.. జాక్ టేలర్ (54 నాటౌట్), ఓలివర్ ప్రైస్ (41 నాటౌట్) రాణించడంతో మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ..!
భారత క్రికెట్ జట్టు రేపటి నుంచి (జూన్ 20) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ను (2025-27) ప్రారంభిస్తుంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ రేపటి నుంచి మొదలవుతుంది. ఈ సిరీస్లోని తొలి టెస్ట్ హెడింగ్లేలోని లీడ్స్లో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్ ఇదివరకే తుది జట్టును ప్రకటించింది. భారత్ కూడా తుది జట్టుపై క్లారిటీ ఇచ్చేసింది. రోహిత్, విరాట్, అశ్విన్ల రిటైర్మెంట్ తర్వాత యంగ్ ఇండియా ఎదుర్కోబోయే తొలి అగ్నిపరీక్ష ఇదే.ఈ సిరీస్తో శుభ్మన్ గిల్ టీమిండియా కెప్టెన్గా తన ప్రస్థానాన్ని మొదలుపెడతాడు. భారత తుది జట్టులో చాలా మార్పులకు అవకాశం ఉంది. యువ ఆటగాడు సాయి సుదర్శన్ అరంగేట్రం దాదాపుగా ఖరారైపోయింది. బ్యాటింగ్ స్థానాలపై కూడా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ నిన్నటి ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చాడు. నాలుగో స్థానంలో గిల్, ఐదో ప్లేస్తో తను బ్యాటింగ్కు దిగుతామని పంత్ వెల్లడించాడు.ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్.. వన్డౌన్లో సాయి సుదర్శన్ పేర్లు కూడా దాదాపుగా ఖరారైపోయాయి. ఆరో స్థానంపై కూడా టీమిండియా మేనేజ్మెంట్కు నిన్నటి వరకు ఎలాంటి అనుమానం లేకుండింది. 8 ఏళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఈ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని మేనేజ్మెంట్ సూచనప్రాయంగా వెల్లడించింది.The incident where Karun Nair got hit at the nets by a delivery from @prasidh43 @RohanDC98 #ENGvsIND #Headingley pic.twitter.com/xGMsiSF8PA— RevSportz Global (@RevSportzGlobal) June 18, 2025అయితే నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్లో టీమిండియాకు ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తుంది. దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి టీమిండియా తలుపులు తట్టిన కరుణ్ నాయర్ నెట్స్ గాయపడ్డాడని ప్రచారం జరుగుతుంది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్ను ఎదుర్కోబోయి కరుణ్ పక్కటెముకల్లో దెబ్బ తగిలించుకున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఒకవేళ నిజంగానే కరుణ్ గాయపడినట్లైతే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలనట్లవుతుంది. కరుణ్ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించి జోరుమీదున్నాడు. అతని గాయం తీవ్రమైందైతే తుది జట్టులో అతని స్థానం గల్లంతైనట్లే. ఇది టీమిండియా బ్యాటింగ్ కూర్పును భారీగా ప్రభావితం చేస్తుంది. ఆరో స్థానం కోసం మేనేజ్మెంట్ మరో ఆప్షన్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్థానం కోసం ప్రత్యామ్నాయ ఆటగాడిగా ధృవ్ జురెల్ అందుబాటులో ఉన్నప్పటికీ.. అతను మ్యాచ్ కోసం సిద్దంగా ఉండకపోవచ్చు. కరుణ్కు ప్రత్యామ్నాయంగా ఆల్రౌండర్తో ముందుకు వెళ్లాలనుకుంటే కూడా వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉన్నాడు. కరుణ్ గాయం తీవ్రమైందైతేనే ఈ ఈక్వేషన్స్ అన్నిటికీ ఆస్కారం ఉంటుంది. సోషల్మీడియాలోని మరో వర్గం కరుణ్ గాయాన్ని కొట్టిపారేస్తుంది. అతని గాయం తీవ్రమైంది కాదని అంటుంది. తొలి టెస్ట్లో కరుణ్ తప్పక ఆడతాడని చెబుతుంది. ఈ విషయమై మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇంగ్లండ్తో తొలి టెస్టుకు భారత తుది జట్టు (అంచనా).. యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ/అర్షదీప్ సింగ్టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.

’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’
ఇంగ్లండ్తో టెస్టులకు టీమిండియా సన్నద్ధమైంది. లీడ్స్ వేదికగా స్టోక్స్ బృందంతో గిల్ సేన శుక్రవారం నుంచి టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. కాగా ఈ సిరీస్తో కరుణ్ నాయర్ (Karun Nair) దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేయనుండగా.. సాయి సుదర్శన్ తొలిసారి జట్టులో చోటు దక్కించుకున్నాడు.ముకేశ్ కుమార్కు మొండిచేయిమరోవైపు.. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే, పేసర్ ముకేశ్ కుమార్కు మాత్రం ఈ ప్రధాన జట్టులో స్థానం లభించలేదు. ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన అనధికారిక తొలి టెస్టులో ముకేశ్ మూడు వికెట్లు తీశాడు.జట్టులోకి హర్షిత్ రాణాఆ తర్వాత అతడిని రెండో అనధికారిక టెస్టు నుంచి తప్పించారు. అదే విధంగా ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లోనూ అతడిని ఆడించలేదు. అదే సమయంలో.. మరో యువ ఆటగాడు, ‘ఎ’ జట్టులో ఉన్న హర్షిత్ రాణాను మాత్రం కవర్ ప్లేయర్గా ప్రధాన జట్టులో చేర్చారు. ఇంగ్లండ్ లయన్స్తో ఆడిన మ్యాచ్లో అతడి గొప్పగా లేకున్నా యాజమాన్యం అతడికి అవకాశం ఇవ్వడం గమనార్హం.కర్మ ఎవరినీ వదిలిపెట్టదుఈ నేపథ్యంలో ముకేశ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ‘‘కర్మ కచ్చితంగా తిరిగి వస్తుంది. అయితే, అందుకోసం మనం వేచి చూడాల్సి ఉంటుంది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. మొత్తం తిరిగి ఇచ్చేస్తుంది. చేసినదానికి అనుభవించకతప్పదు’’ అని ముకేశ్ కుమార్ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.కాగా టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్.. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్గా ఉన్నపుడు.. ఆ జట్టు పేసర్ హర్షిత్ రాణా ప్రతిభను గుర్తించి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాను జాతీయ జట్టు కోచ్గా వచ్చిన తర్వాత రాణాను టీమ్లోకి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఇంగ్లండ్ పర్యటనలోనూ రాణాకు ప్రమోషన్ రావడం వెనుక గౌతీ ఉన్నాడని.. అతడి కోసం ముకేశ్పై వేటు పడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో ముకేశ్ కుమార్ ఇలా కర్మ తిరిగి వస్తుందంటూ పోస్ట్ పెట్టడం విశేషం. కాగా ఢిల్లీకి చెందిన హర్షిత్ రాణా టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఐదు వన్డేల్లో పది వికెట్లు, ఒక టీ20లో మూడు వికెట్లు తీశాడు. రెండు టెస్టు మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. బెంగాల్ పేసర్ ముకేశ్ కుమార్ మూడు టెస్టుల్లో ఏడు, ఆరు వన్డేల్లో ఐదు, పదిహేడు టీ20లలో కలిపి 20 వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు భారత్ ‘ఎ’తో వార్మప్ మ్యాచ్ ఆడిన టీమిండియా లండన్ నుంచి రైలులో లీడ్స్కు చేరుకుంది. ఇక ఐదు టెస్టుల కోసం ఎంపిక చేసిన 18 మంది సభ్యుల భారత జట్టులో లేని హర్షిత్ రాణాను.. సుదీర్ఘ సిరీస్కు ముందు జాగ్రత్తగా జట్టులో చేర్చారు. రిజర్వ్ ఆటగాడిగా కాగా 23 ఏళ్ల పేసర్ ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక టెస్టులు ఆడేందుకు భారత్ ‘ఎ’ జట్టుతో వచ్చాడు. కాంటర్బరీలో జరిగిన తొలి అనధికారిక మ్యాచ్ కూడా ఆడి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.ఈ నేపథ్యంలో రిజర్వ్ ఆటగాడిగా హర్షిత్ రాణా అందుబాటులో ఉంచామని, జట్టుతో పాటే లీడ్స్కు వచ్చాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 20 నుంచి ఇక్కడే భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతుంది. చదవండి: ‘సచిన్, గంభీర్, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’
బిజినెస్

9 లక్షలకు ఫ్లెక్సీ స్టాఫ్
భారత ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఫ్లెక్సిబుల్ స్టాఫ్(సంస్థలకు అనుకూలంగా అవసరం మేరకే నియమకం అయ్యే ఉద్యోగులు) విధానం కీలకంగా మారుతోంది. సంస్థలు ఈ ఫ్లెక్సీ స్టాఫ్ను ప్రధాన శ్రామిక శక్తిగా స్వీకరించడంతో ఏటా 15 శాతం వృద్ధి చెందుతున్న గిగ్ ఎకానమీలో 2030 నాటికి 9 లక్షల మంది నిపుణులు చేరుతారని ఒక నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశ ఐటీ / ఐటీఈఎస్ రంగంలో 3,90,000 ఫ్లెక్సీ స్టాఫ్ ఉన్నారు. ఇది ఈ రంగంలోని మొత్తం 5.8 మిలియన్ల నిపుణుల్లో 7 శాతం అని టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కెరియర్నెట్ నివేదికలో తెలిపింది. ‘ది రైజ్ ఆఫ్ ఫ్లెక్సీ స్టాఫింగ్: అవుట్లుక్ ఫర్ ఇండియా ఐటీ / ఐటీఈఎస్ టాలెంట్ ల్యాండ్ స్కేప్’ పేరుతో రిపోర్ట్ తయారు చేసింది.2030 నాటికి ఈ ఫ్లెక్సీ స్టాఫ్ రెండింతలు పెరిగి 9,00,000కు చేరుకుంటుందని, 15 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్)తో వృద్ధి చెందుతుందని నివేదిక అంచనా వేసింది. రియల్ టైమ్ హైరింగ్ డేటా, మార్కెట్ రీసెర్చ్, ఇండస్ట్రీ ట్రెండ్స్ ఆధారంగా కెరియర్నెట్ ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం భారత్ గ్లోబల్ ఆఫ్షోరింగ్ హబ్ కావడంతో ఐటీ/ ఐటీఈఎస్ సెక్టార్లో ఫ్లెక్సీ వర్కర్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. డిజిటల్ యాక్సిలరేషన్, ప్రపంచ ఆర్థిక మార్పుల మధ్య ఫ్లెక్సీ స్టాఫింగ్ నియామకం పెరుగుతుందని, స్పెషలైజేషన్, స్కేలబిలిటీకి మద్దతు ఇచ్చేందుకు ఈ నమూనాను చాలా కంపెనీలు అనుసరిస్తున్నట్లు కెరియర్నెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నీలభ్ శుక్లా తెలిపారు.ఇదీ చదవండి: పీఎస్యూల డీలిస్టింగ్ సరళతరంఐటీ/ఐటీఈఎస్ శ్రామిక శక్తిలో 25 శాతంతో ఫ్లెక్సీ స్టాఫ్ నియామల్లో బెంగళూరు దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ 15 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పుణె, చెన్నై సహా ఇతర ప్రధాన నగరాలు మొత్తం వాటాలో సుమారు 10 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఫ్లెక్సీ ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల్లో 20 శాతం మంది ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:40 సమయానికి నిఫ్టీ(Nifty) 18 పాయింట్లు లాభపడి 24,831కు చేరింది. సెన్సెక్స్(Sensex) 49 ప్లాయింట్లు పెరిగి 81,497 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.09బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.54 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.39 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.03 శాతం తగ్గిందినాస్డాక్ 0.13 శాతం పుంజుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

పీఎస్యూల డీలిస్టింగ్ సరళతరం
ప్రభుత్వ రంగ సంస్థలు స్వచ్ఛందంగా డీలిస్ట్ అయ్యేందుకు వెసులుబాటు కల్పించేలా నిబంధనలను సడలించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రమోటర్ షేర్హోల్డింగ్ 90 శాతానికి చేరితేనే డీలిస్టింగ్ విజయవంతమైనట్లవుతుంది. దీని కోసం షేరు కనీస ధరను 60 రోజుల సగటు రేటు, గత 26 వారాల్లో గరిష్ట ధర తదితర అంశాల ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు. అయితే, బుక్ వేల్యూ తక్కువగా ఉన్నా లేక ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా గానీ మార్కెట్లో రేటు చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ విధానంతో డీలిస్టింగ్ ప్రక్రియ పీఎస్యూలకు చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది.ఈ నేపథ్యంలోనే 90 శాతం పైగా ప్రభుత్వ వాటాలున్న పీఎస్యూల స్వచ్ఛంద డీలిస్టింగ్కి సంబంధించి కనీస ధరను లెక్కించే విధానాన్ని, మూడింట రెండొంతుల మంది పబ్లిక్ షేర్హోల్డర్లు ఆమోదం తెలపాలన్న నిబంధనను సడలించాలని సెబీ భావిస్తోంది. మరోవైపు, కేవలం భారతీయ ప్రభుత్వ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేసే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) పాటించాల్సిన నిబంధనలను సడలించాలని చైర్మన్ తుహిన్ కాంత పాండే సారథ్యంలో జరిగిన రెండో బోర్డు మీటింగ్లో నిర్ణయించింది. స్టార్టప్ వ్యవస్థాపకులకు ఊరట..పబ్లిక్ ఇష్యూకి వెళ్లాలనుకునే అంకుర సంస్థల వ్యవస్థాపకులకు ఊరటనిచ్చే ప్రతిపాదనకు సెబీ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఐపీవో ప్రాథమిక పత్రాలను దాఖలు చేయడానికి కనీసం ఒక్క ఏడాది ముందు కేటాయించిన ఎసాప్స్ను (ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు) వారు అట్టే పెట్టుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐపీవోకెళ్లే సమయంలో ఎసాప్స్ సహా ఇతరత్రా షేర్ల కేటాయింపు రూపంలో ప్రయోజనాలేవీ అంకురాల ప్రమోటర్ల వద్ద ఉండకూడదు. ఒకవేళ ఉంటే, వాటిని ఐపీవోకి ముందుగానే విక్రయించాలి.ఇదీ చదవండి: ‘ఆరు నెలల్లో అంతా తేల్చేస్తాం..’విదేశాల నుంచి భారత్కు తమ ప్రధాన కార్యాలయాన్ని మార్చుకోవాలనుకుంటున్న సంస్థలకు తాజా సడలింపు ఉపయోగపడనుంది. అటు ఎన్ఎస్ఈఎల్ పేమెంట్ సంక్షోభంలో ఎన్ఫోర్స్మెంట్ చర్యలు ఎదుర్కొన్న నిర్దిష్ట స్టాక్ బ్రోకర్ల కోసం సెటిల్మెంట్ స్కీమును ప్రవేశపెట్టినట్లు సెబీ తెలిపింది. ఈ స్కీమును ఎంచుకోవడం ద్వారా తమపై ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు వారికి వీలుంటుంది. ఇక, ఐపీవో పత్రాల ఫైలింగ్కు ముందు కీలక మేనేజ్మెంట్ సిబ్బంది, ప్రస్తుత ఉద్యోగులు, డైరెక్టర్లు దగ్గర షేర్లు డీమ్యాట్ రూపంలో ఉండాలనే ప్రతిపాదనకు కూడా సెబీ ఆమోదముద్ర వేసింది.

హిందుస్తాన్ జింక్లో వాటా విక్రయించిన దిగ్గజ కంపెనీ
అనిల్ అగర్వాల్ గ్రూప్ దిగ్గజం వేదాంతా తాజాగా మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్లో మైనారిటీ వాటా విక్రయించింది. బుక్బిల్డ్ పద్ధతిలో సంస్థాగత ఇన్వెస్టర్లకు హిందుస్తాన్ జింక్లో 1.6 శాతం వాటాకు సమానమైన 66.7 మిలియన్ షేర్లను అమ్మినట్లు వేదాంతా పేర్కొంది. డీల్ విలువను రూ.3,028 కోట్లుగా వెల్లడించింది. కంపెనీ వ్యూహాత్మక కార్యకలాపాలపై ఇన్వెస్టర్లకున్న విశ్వాసాన్ని తాజా లావాదేవీ ప్రతిఫలిస్తున్నట్లు పేర్కొంది.ప్రస్తుత ఏడాది(2025–26)కి కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 7 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు అంగీకరించినట్లు మరో ప్రకటనలో స్టాక్ ఎక్స్ఛేంజీలకు వేదాంతా సమాచారమిచ్చింది. ఇందుకు ఈ నెల 24(మంగళవారం) రికార్డ్ డేట్గా ప్రకటించింది. కాగా.. వేదాంతా వివిధ బిజినెస్ విభాగాలను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే ప్రణాళికలు అమలు చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా సమీకరించిన నిధులను రుణభారాన్ని తగ్గించుకోవడం ద్వారా బ్యాలన్స్ షీట్ పటిష్టతకు వినియోగించే వీలుంది. తద్వారా ఆర్థిక సౌలభ్యతతోపాటు.. స్వతంత్ర కంపెనీలుగా ఏర్పాటుకానున్న వివిధ బిజినెస్ల వృద్ధి ప్రణాళికలకు మద్దతు లభించనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: ‘ఆరు నెలల్లో అంతా తేల్చేస్తాం..’ఈ ఏడాది సెప్టెంబర్లోగా విభిన్న బిజినెస్లను ప్రత్యేక కంపెనీలుగా విడదీయనున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. విడదీత తదుపరి వేదాంతా అల్యూమినియం, వేదాంతా ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంతా పవర్, వేదాంతా స్టీల్ అండ్ ఫెర్రస్ మెటీరియల్స్, వేదాంతా బేస్ మెటల్స్, వేదాంతా లిమిటెడ్ పేరుతో ఆరు సంస్థలుగా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు వివరించింది.
ఫ్యామిలీ

టెంట్ చూస్తే చాలు.. గుండెల్లో గుబులు...ఏం చేయాలి?
నాకొక చిత్రమైన సమస్య ఉంది. ఎక్కడైనా సరే ఇంటి ముందు టెంట్ వేసి ఉంటే నాకు విపరీతంగా భయం వేస్తుంది. ఆ ఇంట్లో ఎవరైనా చనిపోయారేమో అని ముందు అనిపించి, తర్వాత మా అమ్మమ్మకి ఏదైనా అవుతుందేమో, తనకేమైనా అయితే నేను ఒంటరి వాణ్ణి అయిపోతా అని భయం వేస్తుంది. ఎవరైనా గృహ ప్రవేశం, పెళ్ళి కోసం టెంట్ వేసుకున్నా నాకు మాత్రం నెగటివ్ ఆలోచనలు వచ్చి ఒళ్ళంతా చెమటలు, గుండెదడ, కళ్ళు తిరగడంలాంటివి అవుతాయి. ఇలా అయినప్పుడు నేను కూడా చనిపోతానేమో అన్నంత భయం కలుగుతుంది. ఈ భయం వల్ల నేను నా ఫ్రెండ్స్, ఇంకా చుట్టాల ఫంక్షన్స్కి వెళ్ళడమే మానేశాను. ఎక్కడైనా టెంట్ వేసి ఉంటే అటు వైపు వెళ్ళలేను. అందరూ హేళన చేస్తారని బయటకు చెప్పుకోలేను. దయచేసి ఈ సమస్య నుండి ఎలా బయట పడాలో తెలుపగలరు!– నాగరాజు, బద్వేల్ నాగరాజు గారు, చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని కోల్పోవడం అనేది మీ మెదడు పైన బాగా ప్రభావం చూపినట్లుంది. దాని వల్ల ‘టెంట్’కి మీ మెదడు ‘నెగటివ్ కండిషనింగ్’ (Negative conditioning) కి గురి అయింది. దీని వల్ల ఎక్కడ టెంట్ కనపడినా మీ మెదడు విపరీతమైన ఆందోళనకి ప్యానిక్ అటాక్సికి గురి అవుతుంది. వైద్య పరిభాషలో దీన్ని ‘స్పెసిఫిక్ ఫోబియ్’ లేదా ‘టిసింటో ఫోబియా’ అంటారు. మీకు టెంట్ అంటే భయం ఉన్నట్లే కొందరికి కుక్క లేదా పిల్లి అంటే భయం ఉంటుంది. ఇంకొందరు లిఫ్ట్ అంటే భయపడతారు... అన్ని సందర్భాల్లో కూడా నిజానికి భయం అవసరం లేదు. కానీ ఫోబియాలో ఇలాంటి మాములు విషయాలే విపరీతమైన భయానికి ఆందోళనకి గురి అయ్యేలా చేస్తాయి. మీరు ఒక సైకియాట్రెస్ట్ని కానీ, క్వాలిఫైడ్ క్లినికల్ సైకాలజిస్ట్ని కానీ కలిస్తే కౌన్సిలింగ్ కొన్ని రిలాక్సేషన్ పద్దతులు మరియు ‘ఎక్స్ పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్‘ అనే మానసిక చికిత్స విధానం ద్వారా మీ సమస్య నుండి బయట పడేస్తారు. అలాగే ‘వర్చువల్ రియాలిటీ’ అనే అత్యాధునిక వైద్య విధానం కూడా అన్ని రకాల ఫోబియాస్ నుండి బయట పడేలా సహాయం చేస్తుంది. కొన్ని రకాల మందులు వాడడం వల్ల మీకు తొందరగా ఉపశమనం దొరికి మీరు థెరపీలో మరింత మెరుగ్గా పాల్గొనగలుగుతారు.డా. -ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడమీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com

Murugan పళని మురుగన్కి ప్రణామాలు!
తమిళనాడులో శివమహాదేవునికి, ఆ స్వామి మహితపరివారమైన అర్థాంగి పార్వతీదేవి, పెద్దకుమారుడు గణేశుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యులకు ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి అత్యంత విశిష్టమైనవి.. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి విషయానికి వస్తే చిన్న స్వామి అయిన ఈ ముద్దు మురిపాల ముగ్ధమోహన స్వామికి ఘనమైన చరిత్రే ఉంది. సుబ్రహ్మణ్యుని పేర్ల విషయానికి వస్తే... కుమార, కుమరన్, కుమార స్వామి, స్కంద, షణ్ముఖ, షణ్ముగం, శరవణ, శరవణన్, గుహ, గుహన్ మురుగ, మురుగన్ – ఇలా ఎన్నో పేర్లున్నాయి. తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామికి గల వైభవ ఆలయాలలో’పళని’ (Arulmigu Dhandayuthapani Swamy) ప్రముఖమైంది. ఈ పుణ్యనామానికి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. శివదేవుడు ఒక సందర్భంలో తన కుమారులైన గణేశుని, కుమారుని పిలిచి, యావత్తు విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో, వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెప్పాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావడానికి బయల్దేరుతాడు. తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసిన వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి, విశ్వరూపులైన తన తల్లి, తండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భుత ఫలాన్ని పొందుతాడు. త్వరత్వరగా విశ్వప్రదక్షిణం పూర్తి గావించుకొని వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి జరిగిన సంగతి తెలుసుకొని అలుగుతాడు. అది చూసి శివదేవుడు జాలిపడి ’అన్నయ్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత! నీవే ఒక అద్భుత ఫలానివి ‘ఫలం – ని’ నీ పేరిట ఒక సుందర మహిత పుణ్యక్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను, అది నీ స్వంత క్షేత్రం, అక్కడికి వెళ్లి నివాసం ఉండు’ అంటూ కుమారుని బుజ్జగించాడు. దీంతో వైభవమైన ‘పళని’ రూపుదిద్దుకుంది. అది కుమారుని విశిష్ట నివాస క్షేత్రమయింది!మురుగన్ కొండపళనిలోని మురుగన్ ఆలయం సహజ సిద్ధమైన ప్రకృతి శోభలతో విలసిల్లే కన్నుల పండుగైన కొండపై నిర్మితమైంది! దీనిని ‘మురుగన్ కొండ’ అని కూడా అంటారు. ఆలయ సందర్శనకు 659 మెట్లను ఎక్కవలసి ఉంది. అంత శక్తి లేని వారి కోసమై ‘ఏరియల్ రోప్ – వే’ ఏర్పాటు చేయబడింది. గిరి ప్రదక్షిణ కోసమై కొండ చుట్టూరా చక్కని రోడ్డు వేయబడింది. సాధారణంగా భక్తులు ముందు గిరిప్రదక్షిణ చేసి ఆ తర్వాత కొండ ఎక్కుతారు!ఇదీ చదవండి: Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకతప్రకృతి దృశ్యాలుమెట్లన్నీ ఎక్కి కొండపై భాగం చేరగానే చుట్టూరా కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మనసును పులకింపజేస్తాయి. మొట్టమొదట మనకు మనోహరమైన రాజగోపురం దర్శనమిస్తుంది. గోపుర ద్వారం గుండా కాస్త ముందుకు వెలితే వరవేల్ మండపం కనిపిస్తుంది. ఈ మండప స్తంభాలు అత్యంత సుందరమైన శిలాచిత్రాలతో మంత్రముగ్ధులు గావిస్తాయి. ఈ మండపం తర్వాత నవరంగ మండపం ఉంది. ద్వారం వద్ద ద్వార΄ాలకుల విగ్రహాలు ఆకర్షణీయంగా మలచబడ్డాయి.విశిష్టమైన విగ్రహంగర్భగుడిలో ప్రతిష్టితమైన కమనీయ కుమారస్వామి విగ్రహం 18 మంది సిద్ధులలో ప్రముఖుడైన భోగార్ పర్వవేక్షణంలో రూపొందింపబడిందని, ఇది ఔషధ గుణాలు కలిగిన అపురూప విగ్రహమని చెబుతారు. దీనిని ’నవ పాషాణం’ అనే విశేషమైన శిలను మలచి తయారు చేశారని, ఇందులో శక్తిమంతమైన మూలికా పదార్థాలను నిక్షిప్తం గావించారని అంటారు. ఈ విగ్రహం విశిష్టత ఏమంటే, స్వామి పూజల సందర్భంగా ధూప, దీప సమర్పణల సమయాలలో వెలువడే ఉష్ణానికి విగ్రహంలోని సునిశితమైన మూలికా పదార్థం క్రియాశీలమై ఒక విధమైన వాయువులను వెలువరిస్తుందని, వాటిని పీల్చిన వారికి కొన్నివ్యాధులకు సంబంధించిన దోషాలు హరించుకు పోతాయని ఆరోగ్యవంతులవుతారని చెబుతారు!.మూలస్థానంలో కొలువు దీరిన కుమారస్వామి భక్తజన సంరక్షకుడుగా, కోరిన వరాలు ప్రసాదించే కొండంత దేవుడుగా అపురూప దివ్య దర్శనభాగ్యాన్ని అందజేస్తారు. కృత్తికా సూనుడైన కుమారునికి ప్రతి నెల కృత్తికా నక్షత్రం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆషాఢ కృత్తిక సందర్భంగా విశేష వైభవ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.బోగర్ సిద్ధుని సమాధిఈ పళని కొండలో బోగర్ సిద్ధుని సమాధి, ప్రత్యేక గర్భగుడి ఉన్నాయి. ఇక్కడి స్వామివారి విగ్రహం చిలుక బొమ్మను కలిగి ఉంటుంది. ఇక్కడి స్వామిని కీర్తిస్తూ ‘‘తిరుపుగళ్’’ అనే పాటలను అరుణగిరినాథుడు రచించాడు. అంతేకాదు, తన పాటలతో చిలుక రూపంలో కుమారస్వామితో ఉండే వరం పొందాడని భక్తుల విశ్వాసం. పళని కొండకు వెళ్లే దారిలో ఇడుంపన్ మందిరం ఉంది. తెల్లవారుజామున ఇక్కడ పూజలు చేసిన తర్వాతే, కొండపై ఉన్న కుమారస్వామికి పూజలు చేస్తారు. – డి.వి.ఆర్

Jagannath Yatra 2025 : మూడు రథాలు, ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత
Jagannath Yatra 2025 జగన్నాథ రథయాత్ర 2025 ఒడిశాలోని పూరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జగన్నాథ రథయాత్రను ప్రతి భారతీయుడు కనీసం ఒక్కసారైనా చూసి తరించాలని భావించే ఆధ్యాత్మిక సందర్భం. దేశ, విదేశాల నుంచీ ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భక్తులు జగన్నాథ రథయాత్రను చూసి తరిస్తారు. ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర ఎప్పుడు జరుగుతుంది.ఉత్సవ విగ్రహాలకు బదులుగా సాక్షాత్తు గర్భగుడిలో ఉండే విగ్రహమూర్తులేప్రత్యేకంగా తయారు చేసిన మూడురథాల్లో (జగన్నాథుడు, బలభద్రుడు , సుభద్ర దేవి) యాత్ర ద్వారా ఒడిశాలోని పూరి వీధుల గుండా ఊరేగడం ఇక్కడి విశేషం. ఈ ఉత్సవంలో ఒవేలాది మంది భక్తులు లాగుతున్న మూడు భారీ చెక్క రథాలు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, గొప్ప రథయాత్ర. అందుకేబ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం లాంటి పురాణాలలో సైతం ఈ రథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Sudarsan pattnaik (@sudarsansand) జగన్నాథ రథయాత్ర చరిత్ర 5 వేల సంవత్సరాల నాటిదనీ, ప్రస్తుత రూపం 12వ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగ రాజు ప్రస్తుత జగన్నాథ ఆలయాన్ని నిర్మించినప్పుడు రూపుదిద్దుకుందని చెబుతారు. ప్రతి సంవత్సరం కొత్త కలపతో రథాన్ని తయారు చేయడం ఈ రథయాత్ర మరో ప్రత్యేకత. ఈ యాత్రలో రథం తాడును లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పక్ష రెండవ రోజు నుండి పూరీ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం జగన్నాథ రథయాత్ర జూన్ 27 ప్రారంభమవుతుంది. ఈ యాత్రకు ముందు అనేక శుభ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనాయి.. రథం నిర్మాణం నుండి స్నాన పూర్ణిమ వరకు, జగన్నాథుడు, బలభద్రుడు ,సుభద్రలను 108 కలశాలతో స్నానం చేస్తారు. దీని తరువాత, జూన్ 26న గుండిచ ఆలయం శుభ్రం చేయబడుతుంది. గుండిచ ఆలయం అనేది దేవుని అత్తగారిల్లు. రథయాత్రలో భాగంగా జగన్నాథుడు తన అత్త ఇంటికి వెళ్లి, ఆమరుసటి రోజు అంటే జూన్ 27న రథయాత్రను నిర్వహిస్తారు. ఈ రోజున, భగవంతుడు శ్రీమందిర్ నుండి మూడు గొప్ప రథాలలో గుండిచ ఆలయానికి బయలుదేరుతాడు. రథయాత్ర తొమ్మిది రోజుల పాటు కొనసాగిన తిరుగు ప్రయాణం, బహుద యాత్ర జూలై 5న సాగుతుంది. ఈ సందర్భంలో జగన్నాథుడు మళ్ళీ సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రతో కలిసి శ్రీమందిర్కు బయలుదేరుతాడు.ప్రతి రథానికి ఒక ప్రాముఖ్యత ఉంది.నందిఘోష (జగన్నాథుని రథం)"విశ్వ ప్రభువు" అయిన జగన్నాథుడు మూడు రథాలలో అత్యంత గొప్పదైన నందిఘోష రథంలో స్వారీ చేస్తాడు. దాని పేరు సూచించినట్లుగా, అది కదిలేటప్పుడు ఆనందకరమైన శబ్దం చేస్తుంది. మూడు రథాలు వరుసలో ఉన్నప్పుడు అతని రథం ఎల్లప్పుడూ కుడి వైపున ఉంచుతారు.తాళధ్వజ (బలభద్ర ప్రభువు రథం)జగన్నాథుని అన్నయ్య అయిన బలభద్రుడు తాళధ్వజ రథంలో ప్రయాణిస్తాడు. "తలధ్వజ" అనే పేరు దాని జెండాపై ఉన్న తాళ వృక్షాన్ని సూచిస్తుంది. బలరాముడి రూపంగా పరిగణించబడే బలభద్రుడు ఈ రథంలో స్వారీ చేస్తాడు. అతని రథం సాధారణంగా ఊరేగింపులో ఎడమ వైపున ఉంచుతారు.దర్పదలన (సుభద్రాదేవి రథం)అతి చిన్నదైనప్పటికీ అత్యంత అలంకరించబడిన రథం జగన్నాథుడు మరియు బలభద్రుని సోదరి అయిన సుభద్ర దేవికి చెందినది. "దర్పదలన" అనే పేరుకు "గర్వాన్ని నాశనం చేసేది" అని అర్థం, దేవత తన భక్తుల నుండి అహాన్ని ఎలా తొలగిస్తుందో చూపిస్తుంది. పండుగ సమయంలో సుభద్ర దేవి రథాన్ని ఆమె సోదరుల రథాల మధ్య ఉంచుతారు. ఆమె స్త్రీ దైవిక శక్తిని సూచిస్తుంది . మహిళా భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారు.ప్రతి రథం కోసం దాదాపు 1,000 చెక్క ముక్కలను ఉపయోగిస్తారు. నిర్మాణానికి దాదాపు రెండు నెలలు పడుతుంది. విశేషమేమిటంటే, ఈ భారీ నిర్మాణాలు ఎటువంటి లోహపు మేకులు లేదా ఫాస్టెనర్లు లేకుండా తయారు చేస్తారు. "మహారాణులు" అని పిలువబడే కళాకారుల తరతరాలుగా అందించబడిన సాంప్రదాయ కలపడం పద్ధతులను ఉపయోగించి వీటిని రూపొందిస్తారు. శ్రీ జగన్నాథునికి లేహ్య సేవఈ రథయాత్రకు సంబంధించిన రథాల తయారీ దాదాపు తుది దశకు చేరుకుంది. అలాగే ఆ యాత్రంలోభాగంగా జన్నాథునికి లేహ్య సేవ ఘనంగా నిర్వహించారు. స్నాన పూర్ణిమనాడు భారీ స్నానం చేసిన తర్వాత శ్రీ జగన్నాథుడు, అతని తోబుట్టువులు అస్వస్థతకు గురయ్యారు. వారు త్వరగా కోలుకోవడానికి ఆలయ రాజ ఆయుర్వేద వైద్యుల మార్గదర్శకత్వంలో వివిధ రకాల మూలికా ఔషధాలతో చికిత్స కొనసాగిస్తున్నారు. దేవతలు ప్రస్తుతం అనవసర మండపంపై కొలువు దీరి గోప్య సేవలు పొందుతున్నారు. ఈ సేవల్లో ప్రత్యేకంగా తయారుచేసిన నూనెలు, మూలికా ఔషధాలు వాడతారు. ఈ సమయంలో స్థానిక మూలికలు మరియు వేర్లతో తయారు చేసిన ఔషధాలు, పండ్ల రసాలు మూల విరాట్లకు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో మంగళ వారం ఒస్సా లగ్గి (తైల పూత) ఉపచారంతో సేవలు అందించారు. సుధ సువారో సేవక వర్గం తయారు చేసిన ఒస్సా అనే ప్రత్యేక వైద్యాన్ని దేవతలకు అందజేశారు. మంగళ వారం అపరాహ్న ధూపం తర్వాత దేవతలకు ఒస్సా లగ్గి నిర్వహణ సన్నాహాలు ప్రారంభించారు. దైతపతి సేవకులు రాత్రి పూట ఈ చికిత్స నిర్వహించారు.

షీ జాబ్స్.. సీత యాప్
‘కుటుంబ వారసత్వంగా కోట్ల ఆస్తి వచ్చినా.. నీకు నువ్వు రుపాయైనా సంపాదించుకుంటేనే ఆర్థిక స్వాతంత్య్రం’ అన్న మాటను నమ్ముతారు స్వాతి నెలభట్ల! అది వాళ్ల నాన్న చెప్పిన సత్యం.. ప్రోత్సహించిన మార్గం! దాన్నే ఆశయంగా మలచుకుని ప్రయాణం సాగించిన ఆమె.. నేడు వందల మంది మహిళలకు ఉ పాధి భరోసాగా నిలిచారు! దాని పేరే ‘సీత ( SITHA).. షి ఈజ్ ద హీరో ఆల్వేస్)’ సర్వీస్ అండ్ ప్రోడక్ట్స్ యాప్! స్వాతి, ‘సీత’ వివరాలు...స్వాతి సొంతూరు కడప. తండ్రి దుర్గాప్రసాద్ .. జర్నలిస్ట్. తల్లి సుజాత.. రిటైర్డ్ ఎమ్మార్వో. ఆడవాళ్లకు ఆర్థిక స్వాతంత్య్రం చాలా అవసరమని చెబుతూ కూతురిలో ఆంట్రప్రెన్యూర్ ఆలోచనలను రేకెత్తించి, ఆ దిశగా ప్రోత్సహించారు తండ్రి. ఆమె టీనేజ్లోనే తండ్రి చని పోవడంతో, సింగిల్ పేరెంట్గా తల్లి సాగించిన పోరాటమూ స్వాతికి స్ఫూర్తి అయింది. ఆ ఇద్దరి ప్రభావంతోనే స్వాతి ఆంట్రప్రెన్యూర్గా ఎదిగి ప్రతిష్ఠాత్మక ‘అర్న్స్ట్ అండ్ యంగ్ విన్నింగ్ విమెన్ ఆంట్రప్రెన్యూర్’ అవార్డ్నూ గెలుచుకున్నారు. చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేయగానే ఉద్యోగం, పెళ్లి, బాబు.. వెంటవెంటనే జరిగి పోయాయి. బాబుకు ఆటిజం అని తేలడంతో మంచి ట్రీట్మెంట్ కోసం అమెరికా షిఫ్ట్ అయ్యారు. ప్రయత్నం.. విజయంఅక్కడికి వెళ్లాకే అసలు పోరాటం మొదలైంది. నిలకడైన ఉద్యోగం వెదుక్కునే ప్రయత్నం, ఇంటి పని, పిల్లాడి బాధ్యత ఈ మల్టీటాస్కింగ్లో ఫ్లెక్సిబులిటీ ఉండేది కాదు. ఇంకోవైపు ఆంట్రప్రెన్యూర్ కల. అప్పుడే బలంగా అనిపించింది స్వాతికి.. తనే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే టైమ్ ఫ్లెక్సిబులిటీ దొరకడమే కాదు.. ఆశా నెరవేరుతుంది కదా అని! కసరత్తు మొదలుపెట్టింది. ఆమె శ్రమను చూసినవాళ్లంతా ‘ఎందుకీ కష్టం? హాయిగా ఇంట్లో ఉండి బాబును చూసుకోక’అంటూ సలహా ఇచ్చారు. ఆశయానికి తన పరిస్థితులను సాకుగా చూ పాలనుకోలేదు స్వాతి. అందుకే చిరునవ్వుతోనే వాళ్లకు బదులిచ్చి, ఐటీ కంపెనీ పెట్టారు.. పిల్లాడిని చూసుకుంటూ! ఆ కంపెనీ ఇతర ఉద్యోగులనూ తీసుకునే స్థాయికి చేరుకోగానే మహిళలనే ముఖ్యంగా పెళ్లి, పిల్లలతో బ్రేక్ పడి మళ్లీ వర్క్ చేయాలనుకుంటున్న వాళ్లను, తనలా స్పెషల్ నీడ్స్ పిల్లలున్న తల్లులను అ పాయింట్ చేసుకోసాగారు. ఇన్నాళ్లుగా వాళ్లంతా అవకాశం కోసం వేచి ఉన్నారేమో.. జాయిన్ అవగానే ఫైర్ చూపించడం మొదలుపెట్టారు. వాళ్ల డెడికేషన్ చూశాక స్వాతికి అనిపించింది.. ఇలాంటి వాళ్లు ఇంకెంతమంది ఉండొచ్చో.. రకరకాల కారణాలతో కెరీర్లో గ్యాప్ వచ్చి, మళ్లీ వర్క్ చేయాలన్న పట్టుదలతో! వాళ్లందరి కోసం ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలని! స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ తల్లులకూ అందులో స్పేస్ కల్పించాలని! అనుకున్నదే తడవుగా ‘షీ జాబ్స్’ పోర్టల్ స్టార్ట్ చేశారు. స్పెషల్ నీడ్స్ పిల్లల తల్లులకు పలు సంస్థల్లో ప్రత్యేకమైన కోటా కోసమూ సంస్థల సిబ్బందితో చర్చలు సాగించారు. అలా ముందుకు వెళ్తున్న సమయంలోనే ఆమెకు లేడీ టైలర్స్, పెయింటర్స్, కుక్స్ ఇలా రకరకాల పనులు చేసే మహిళల దగ్గర్నుంచి మెయిల్స్ రాసాగాయి.. తాము చేయదగ్గ పనులేమైనా ఉన్నాయా అంటూ! అవి ఆమెకు కొత్త ఐడియాను ఇచ్చాయి. చదువు, టెక్నాలజీకి అతీతంగా మహిళలకు ఎన్నో నైపుణ్యాలుంటాయి. వాళ్లకూ ఒక వేదిక కావాలి కదా అని! అదే ‘సీత ( ఐఖీఏఅ)’గా రూపుదిద్దుకుంది. ముగ్గులు పెట్టడం మొదలు కుట్లు అల్లికలు, మెహెందీ డిజైన్స్, వంటల నుంచి ట్యూటరింగ్, కంటెంట్ రైటింగ్ దాకా అన్ని రకాల ఉ పాధికి ఇది ప్లాట్ఫామ్ అయింది. ఇందులో సేవలే కాదు ఉత్పత్తులనూ పెట్టుకోవచ్చు అమ్మకానికి.నాకు ఫెయిల్యూర్ అంటే భయం లేదు. జడ్జ్ చేయడాన్నీ పట్టించుకోలేదు. లక్ష్యం మీదే డిసిప్లిన్డ్గా ఫోకస్ చేశాను. మా ఫ్యామిలీ చాలా స పోర్ట్ చేసింది. నేను నిలదొక్కుకున్నాక నా భర్త రాజేశ్ ఉద్యోగం మానేసి మా బాబును చూసుకుంటున్నారు. ఒకవేళ నాకు ఫ్యామిలీ స పోర్ట్ దొరక్క పోయినా నేననుకున్నది సాధించేదాన్ని. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే.. చేజ్ యువర్ ప్యాషన్!’– స్వాతి నెలభట్ల – సరస్వతి రమ
ఫొటోలు
అంతర్జాతీయం

ఉగ్రవాదులను పెంచిపోషించే దేశాలకు నిధులు,రుణాలా..?
కనానాస్కిస్: తమ పొరుగుదేశం పాకిస్తాన్ ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రంగా మారిపోయిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పాక్ పాలకులు ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లపై స్పందించకుండా కళ్లు మూసుకొని ఉంటే మానవత్వానికి ద్రోహం చేయడమే అవుతుందని తేలి్చచెప్పారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం కెనడాలో జీ7 కూటమి సదస్సులో ‘ఇంధన భద్రత’ అంశంపై ప్రధాని మోదీ ప్రసంగించారు. సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్న పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి ప్రతి భారతీయుడి ఆత్మ, గుర్తింపు, గౌరవంపై జరిగిన ప్రత్యక్ష దాడేనని తేలి్చచెప్పారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చే ఏ దేశమైనా తగిన మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. ముష్కర మూకలను అంతం చేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండొద్దని ఉద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని పోషకులను, ఉగ్రవాద బాధితులను ఒకే గాటన కట్టడం, ఒకేలా పరిగణించడం ఏమిటని నిలదీశారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... నిజంగా నిజాయతీగా పని చేస్తున్నామా? ‘‘ఉగ్రవాదం మానవత్వానికి బద్ధశత్రువు. ప్రజాస్వామ్య విలువలు పాటించే అన్ని దేశాలనూ ఉగ్రవాదం వ్యతిరేకిస్తోంది. ఉగ్రవాద భూతాన్ని సమూలంగా నాశనం చేయాలంటే ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి. అన్ని దేశాలు ఐక్యంగా ఉంటేనే అనుకున్నది సాధించగలం. దురదృష్టవశాత్తూ మా పొరుగుదేశం ఉగ్రవాదులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారిపోయింది. ప్రపంచ శాంతి, సౌభాగ్యాల కోసం.. ఉగ్రవాదులకు అండగా నిలిచే దేశాలను శిక్షించాలి. అలాంటి దేశాలను జవాబుదారీగా మార్చాలి. కానీ, వాస్తవ పరిస్థితి మరోలా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు నిధులు, రుణాలు ఇచ్చి సత్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉగ్రవాదంపై పోరాటంలో మనం నిజంగా నిజాయతీగా పని చేస్తున్నామా? ఉగ్రవాదం మన ఇంటి తలుపు తట్టినప్పుడు మాత్రమే ఉగ్రవాదానికి అసలైన అర్థాన్ని తెలుసుకుంటామా? ఉగ్రవాదులను ఎగదోస్తున్న వారిని, ఉగ్రవాద బాధితులను ఒకేలా చూడడం ఏమిటి? మన అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీయత కోల్పోతున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో నిర్ణయాత్మక చర్యలు అవసరం. ఇంధన భద్రత మన బాధ్యత భవిష్యత్తు తరాల కోసం ఇంధన భద్రత సాధించడమే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సవాలు. ఇంధన భద్రత సాధించడం కేవలం ప్రాధాన్యత మాత్రమే కాదు.. పౌరుల పట్ల మన బాధ్యత కూడా. ఇంధనం రంగంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాలి. కలిసి పనిచేయాలి. ‘నేనొక్కడినే కాదు.. మనమంతా’ అనే స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభాలు, అనిశి్చత పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇంధన సరఫరా లేక గ్లోబల్ సౌత్ దేశాలు నష్టపోవాల్సి వస్తోంది. వాటిపై అధిక భారం పడుతోంది. ఆయా దేశాల్లో ఆహార, ఇంధన, ఎరువులతోపాటు ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతున్నాయి. తయారీ, రవాణా రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. కృత్రిమ మేధ(ఏఐ)ను ప్రపంచ సౌభాగ్యం కోసం ఒక శక్తిగా మార్చాలి. డీప్ఫేక్స్ పెద్ద ముప్పుగా మారుతున్నాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఏఐతో సృష్టించే కంటెంట్లో వాటర్మార్క్ ఉండేలా చర్యలు తీసుకోవాలి’’ అని ప్రధాని మోదీ సూచించారు. జీ7 దేశాల అధినేతలతో మోదీ చర్చలు కెనడాలో జీ7 సదస్సు సందర్భంగా కూటమి దేశాల అధినేతలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టెక్నాలజీ, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉగ్రవాదంపై పోరాటంతోపాటు ప్రపంచానికి ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారంపై చర్చించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే–మ్యూంగ్, ఫ్రాన్స్ అధినేత ఇమ్మానుయేల్ మాక్రాన్, బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షీన్బామ్ పార్దో, జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డసిల్వా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ. యూరోపియన్ కౌన్నిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తదితరులతో మోదీ భేటీ అయ్యారు. క్రొయేషియా ప్రధాని ప్లెంకోవిచ్తో చర్చలు ప్రధాని మోదీ కెనడా పర్యటన ముగించుకొని బుధవారం క్రొయేషియా చేరుకున్నారు. జాగ్రెబ్ ఎయిర్పోర్టులో క్రొయేషియా ప్రధానమంత్రి అండ్రెజ్ ప్లెంకోవిచ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. క్రొయేషియాలో పర్యటిస్తున్న మొట్టమొదటి భారత ప్రధానమంత్రి మోదీయే కావడం విశేషం. ట్విట్టర్లో పోరాటం సాగిస్తున్నారా? కెనడాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, ప్రధాని మోదీ మధ్య సరదా సంభాషణ జరిగింది. ‘‘ఈరోజుల్లో మీరు ట్విట్టర్లో పోరాటం సాగిస్తున్నారా? ట్విట్టర్లో మీరు చాలా చురుగ్గా ఉంటున్నారు’’ అని మాక్రాన్ ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి. మాక్రాన్, మోదీ సైతం బిగ్గరగా నవ్వేశారు. ఇటీవల వియత్నాం పర్యటనకు వెళ్లినప్పుడు విమానం దిగే సమయంలో మాక్రాన్ను ఆయన భార్య బ్రిగెట్టా నెట్టివేసినట్లు వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇలాంటివి జరిగేటప్పుడు తలుపులు మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలి అని మాక్రాన్కు సలహా ఇచ్చారు. ఈ ఉదంతాన్ని గుర్తుచేస్తూ మోదీ సరదాగా వ్యాఖ్యానించారు. మోదీ–మాక్రాన్ సంభాషణ పట్ల సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మోదీ నవ్వుతూ మాట్లాతూనే మాక్రాన్కు గట్టిగా చురక అంటించారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

‘భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. ఐలవ్ పాకిస్తాన్’
వాషింగ్టన్: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే భారత్-పాక్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఊదరగొట్టిన ట్రంప్ తాజాగా మరోసారి అదే పాటపాడారు. భారత్-పాకిస్తాన్ సీజ్ఫైర్లో అమెరికా జోక్యం చేసుకోలేదని ప్రధాని మోదీ ప్రకటన చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘యుద్ధాన్ని నేనే ఆపా.. ఐలవ్ పాకిస్తాన్.రెండు న్యూక్లియర్ దేశాలు కావడంతో యుద్ధాన్ని ఆపాను. మోదీ గొప్ప వ్యక్తి ఆయనతో రాత్రి మట్లాడా. గత రాత్రే భారత్ - అమెరికా ట్రేడ్ గురించి ఆయనతో మాట్లాడాను’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

తలదూర్చితే చావుదెబ్బ తప్పదు.. ట్రంప్కు ఖమేనీ వార్నింగ్!
తెహ్రాన్: హెచ్చరికలు,అల్టిమేట్టంలు ఆఖరికి చంపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు బెదిరింపులకు దిగినా సరే వెనక్కి తగ్గబోమని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ(83) ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ భీకర దాడుల్లో ఖమేనీ తన సన్నిహితులతో పాటు సైన్యంలో కీలక పాత్రపోషిస్తున్న అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో ఖమేనీ లొంగిపోవాలని నెతన్యాహు,ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఆ బెదిరింపులకు తానేమి లొంగిపోనని, కాదు కూడదని ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో తలదూర్చాలని చూస్తే కోలుకోలేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు.ఎక్స్ వేదికగా ఖమేనీ ఏమన్నారంటే?ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోకూడదు. కాదు కూడదని సైనిక పరంగా జోక్యం చేసుకుంటే మాత్రం అమెరికాను కోలుకోలేని విధంగా దెబ్బకొడతామని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ గురించి ఖమేనీ స్పందించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అవివేకంతో ఇరానియన్లు తనకు లొంగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ ఎవరికో (ఇజ్రాయెల్ దేశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ) భయపడి తమను బెదిరిస్తే.. తాము బెదిరిపోమని పునరుద్ఘాటించారు. పదేపదే అమెరికా కవ్వింపు చర్యలకు దిగితే ప్రస్తుతం ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ ఎదుర్కొంటున్న హానికంటే ఎక్కువ హాని అమెరికా ఎదుర్కొవాల్సి ఉంటుందని ఇరాన్ అమెరికాకు చేయబోయే నష్టం గురించి హెచ్చరించారు. The US entering in this matter [war] is 100% to its own detriment. The damage it will suffer will be far greater than any harm that Iran may encounter.— Khamenei.ir (@khamenei_ir) June 18, 2025ఖమేనీని చంపే ఉద్దేశం మాకు లేదు.. కానీ సుప్రీం లీడర్ అనే వ్యక్తి ఎక్కడ దాక్కున్నాడో మాకు ఖచ్చితంగా తెలుసు. అతని ఆచూకీ పెద్ద కష్టమేమీ కాదు. అతను అక్కడ సురక్షితంగా ఉన్నాడు. ప్రస్తుతం మేం అతన్ని చంపే ఉద్దేశంతో లేము. ఖమేనేని చంపితే మా వారిపై దాడులు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నాకు ఓపిక నశిస్తున్నది. ఖమేనీ భేషరతుగా లొంగిపోతే మంచిది. మా సహనాన్ని పరీక్షించొద్దు. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ట్రంప్ ట్వీట్పై ఖమేనీ పైవిధంగా స్పందించారు.

ఇజ్రాయెల్-స్ట్రైకర్.. ఇరాన్ ఫతా ఎంత డేంజరో తెలుసా?
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్ ప్రజల పట్ల కనికరం చూపించే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. ఈ క్రమంలోనే శక్తివంతమైన హైపర్సోనిక్ మిస్సైల్స్ను ప్రయోగించినట్లు ప్రకటించారాయన. మరోవైపు.. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా ‘ఫతా-1 మిస్సైల్స్’ను ప్రయోగాన్ని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఈ క్షిపణి అంత శక్తివంతమైందా? దాని సామర్థ్యం ఏపాటిదో ఓ లుక్కేద్దాం. ఫతా(Fattah) హైపర్సోనిక్ మిస్సైల్.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నట్లు ఇరాన్ ప్రకటించుకుంది. అయితే ఈ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే హైపర్సోనిక్ క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేయడం చాలా క్లిష్టమైన పని. ఇరాన్ గతంలో రష్యా, చైనా వంటి దేశాలతో రక్షణ రంగంలో పరస్పర సహకారం కొనసాగించింది. బహుశా ఈ దేశాల భాగస్వామ్యంతోనే ఫతాను రూపొందించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తుంటారు. అయితే.. ఈ క్షిపణి అభివృద్ధితో అమెరికా, రష్యా, చైనా తర్వాత హైపర్సోనిక్ క్షిపణి కలిగిన నాలుగో దేశంగా ఇరాన్ నిలిచింది. అలాగని ఇజ్రాయెల్ మీదకు ఫతా హైపర్సోనిక్ మిస్సైల్స్ను ఇరాన్ ప్రయోగించడం ఇప్పుడే తొలిసారేం కాదు!. కిందటి ఏడాది అక్టోబర్ 1వ తేదీన జరూసలేం మీదకు ఈ క్షిపణలను ప్రయోగించినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇటు ఇరాన్, అటు ఇజ్రాయెల్ ఈ ప్రచారంపై ఇప్పటిదాకా మౌనం వీడలేదు. అయితే తాజాగా మాత్రం ఇరాన్ అధికారిక ప్రకటనతో వీటి ప్రయోగం జరిగిందన్న విషయం వెలుగు చూసింది. హైపర్సోనిక్ అనే పదాన్ని సాధారణంగా అత్యంత వేగమైన రవాణా వ్యవస్థకు ఉపయోగిస్తుంటారు. ఆ తర్వాతి కాలంలో అది యుద్ధ రంగానికి అన్వయించడం మొదలుపెట్టారు. హైపర్ సోనిక్ మిస్సైల్స్ అంటే.. అత్యాధునికమైన క్షిపణులు అని అర్థం. ఇవి శబ్ధ వేగం కంటే అధిక రెట్లతో ప్రయాణిస్తాయి. అత్యంత వేగంతో ప్రయాణించడం వల్ల శత్రుదేశాలు గుర్తించడంగానీ, మార్గంమధ్యలోనే నాశనం చేయడంగానీ చాలా కష్టం. ఫతాను 2003లో ఇరాన్ ఆవిష్కరించింది. దీనికి ఆ పేరు పెట్టింది ఇరాన్ సుప్రీం ఖమేనీనే. దీని పొడవు 12 మీటర్లు. 1,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఇది చేధించగలదు. సుమారు 200 కేజీల పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. శబ్ద వేగం కంటే 13 నుంచి 15 రెట్లు అధికంగా ఇది ప్రయాణించగలదు. అంటే దాదాపు గంటకు 16,000–18,500 కిలోమీటర్లు వేగం ఉంటుందన్నమాట. ఇది హైపర్సోనిక్ గ్లైడ్ వెహికిల్ (HGV), హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ (HCV) లక్షణాలను కలిగి ఉంది. కానీ, ఫతా సామర్థ్యానికి సంబంధించిన సరైన వివరాలను ఇరాన్ ఇప్పటిదాకా వెల్లడించకపోవడం గమనార్హం. కాకుంటే.. ఐరన్ డోమ్, ఆరో లాంటి అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్న ఇజ్రాయెల్కు సైతం ఈ క్షిపణి అంతు చిక్కదు. అందుకే ఇరాన్ దీనిని ముద్దుగా ఇజ్రాయెల్-స్ట్రైకర్ అని అభివర్ణిస్తుంటుంది. ఇజ్రాయెల్ మాత్రమే కాదు.. హిందూమహాసముద్రంలో సంచరించే అమెరికా యుద్ధ నౌకలను కూడా ఇది ఆనాశనం చేయగలదని ఇరాన్ తరచూ ధీమాగా చెబుతుంటుంది. తాజా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల గగన తలాలను పూర్తిగా ఇరాన్ తమ స్వాధీనంలోకి తెచ్చుకోగలిగిందంటే మాత్రం.. అందుకు ఫతాలాంటి హైపర్సోనిక్ మిస్సైల్ కారణం.
జాతీయం

కశ్మీర్లో రాజకీయ దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఉప ఎన్నికలకు ముందే రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మిత్రపక్షాలైన నేషనల్ కాన్ఫరెన్స్– కాంగ్రెస్ కూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయి. బడ్గాం, నగ్రోటా అసెంబ్లీ నియోజకవర్గాలలో జరుగనున్న ఉప ఎన్నికలు ఒమర్ ప్రభుత్వానికి సమస్యలను పెంచాయి. నగ్రోటా ఉప ఎన్నికలో పోటీ చేయడంపై రెండు రాజకీయ పార్టీలు దాదాపుగా ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ స్థానం నుంచి పోటీకి అటు నేషనల్ కాన్ఫరెన్స్, ఇటు కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేవు. నగ్రోటాలో రెండు పార్టీల మధ్య ఎటువంటి ఒప్పందం కుదరకపోతే కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సీట్లపై ఇప్పుడు బీజేపీ దృష్టి సారించింది. నిజానికి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఒమర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీని తరువాత, కాంగ్రెస్ కూడా నేషనల్ కాన్ఫరెన్స్తో ఘర్షణ మూడ్లో ఉంది. కాంగ్రెస్ నాయకులు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా అంశంపై గళం విప్పుతూ, ముఖ్యమంత్రిని కూడా బెదిరిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్కు 41 సీట్లు ఉన్నాయి. ఇది కాకుండా, ప్రభుత్వానికి ఆరుగురు కాంగ్రెస్, ఏడుగురు స్వతంత్రులు, ఒక సీపీఐ(ఎం) ఎమ్మెల్యే మద్దతు ఉంది. మిత్రపక్షాల మద్దతుదారుల సంఖ్యతో కలిపి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వానికి 55 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ నగ్రోటా ఉప ఎన్నిక బరి నుంచి వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు. అందువల్ల ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో నేషనల్ కాన్ఫరెన్స్ తన అభ్యరి్థని నిలబెడితే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొనే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంటే, ఒమర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల సంఖ్య 49కి తగ్గుతుంది. మరోవైపు నగ్రోటా స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ వల్ల బీజేపీకి ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించింది. కాగా బడ్గాం స్థానంలోనూ కమలదళం తన అభ్యరి్థని నిలబెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు ఇక్కడ ప్రధాన పోటీ నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీల మధ్యే ఉండేది. అయితే అమర్నాథ్ యాత్ర తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నగ్రోటా, బడ్గాంల్లో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ రెండు సీట్లు ఖాళీగా ఉండి ఆరు నెలలు అయ్యింది. అయితే ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే ఆరు నెలల తర్వాత ఏదైనా సీటును ఖాళీగా ఉంచవచ్చు. ఆరు నెలల వ్యవధి తర్వాత కూడా ఒక సీటును ఖాళీగా ఉంచడానికి ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

వార్షిక ఫాస్టాగ్ పాస్ అందుబాటులోకి
సాక్షి, న్యూఢిల్లీ: వార్షిక ఫాస్టాగ్ ఆఫర్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న వాణిజ్యయేతర, ప్రైవేట్ వాహనదారుల టోల్ప్లాజా కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పాస్తో ముందుకొచ్చింది. గరిష్టంగా 200 ట్రిప్పులకు అనుమతిస్తూ వార్షిక ఫాస్టాగ్ ఆఫర్ను తీసుకొస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ప్రకటించారు. కార్లు, జీప్లు, వ్యాన్ల వంటి వాణిజ్యయేతర ప్రైవేట్ వాహనాలకు మాత్రమే ఈ వార్షిక ఫాస్టాగ్ పాస్ వర్తిస్తుంది. కావాలనుకున్న వాహనదారులు మాత్రమే వార్షిక పాస్ను కొనుగోలుచేయాల్సి ఉంటుంది. వార్షిక పాస్ అనేది పూర్తిగా స్వచ్ఛందం. ఒకవేళ ఈపాస్ను వాణిజ్య వాహనాలకు ఉపయోగించాలని చూస్తే ముందస్తు సమాచారం లేకుండానే వాళ్ల పాస్ను ప్రభుత్వం రద్దు చేయనుంది. ఎప్పటి నుంచి అమల్లోకి?ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్క రించుకుని ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఈ ఫాస్టాగ్ ఆఫర్ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తారు. ఎలా వసూలు చేస్తారు?టోల్ప్లాజాను దాటిన ప్రతి ఒక్కసారి ఒక ట్రిప్పుగా లెక్కగడతారు. ఉదాహరణకు మనం ప్రయాణంలో నాలుగు టోల్ప్లాజాలను దాటితే నాలుగు ట్రిప్పులు పూర్తయినట్లు లెక్కిస్తారు. ఈ లెక్కన వార్షిక ఫాస్టాగ్ పాస్ అనేది 200 సార్లు మాత్రమే పనిచేస్తుంది. 200 సార్లు పూర్తికాకపోతే ఏడాదంతా ఈ పాస్ పనిచేస్తుంది. ఈ రెండింటితో ఏది ముందుగా ముగిస్తే దానిని ఫాస్టాగ్కు తుదిగడువుగా పరిగణిస్తారు. ఉదాహరణకు నవంబర్కల్లా 200 ట్రిప్పులు అయిపోతే ఆ ఏడాదికి యాన్వల్ పాస్ ముగిసినట్లే. మళ్లీ యాన్వల్ పాస్ కావాలంటే ఆ తర్వాత వెంటనే కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పటికే పాస్ ఉంటే మళ్లీ కొనాలా?ఇప్పటికే సాధారణ ఫాస్టాగ్ ఉంటే మళ్లీ కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ వార్షిక ఫాస్టాగ్ పాస్ కొంటే ప్రస్తుతం యాక్టివేషన్లో ఉన్న కార్డుకే ఆ ఆఫర్ కొనసాగింపుగా ఉంటుంది. విడిగా కొనాల్సిన పనిలేదు.ఎక్కడెక్కడ పని చేస్తుంది?దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయరహదారులు, జాతీయ ఎక్స్ప్రెస్ వేలపై ఉన్న టోల్ప్లాజాల వద్ద కొత్త పాస్ పనిచేస్తుంది. అయితే రాష్ట్ర రహదారులు(ఎస్హెచ్)లు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగాల నిర్వహణలో ఉన్న టోల్ప్లాజాల వద్ద మాత్రం అదనంగా వాహనదారులు యూజర్ ఫీజు కట్టాల్సి రావొచ్చు.ఎక్కడ నుంచి కొనొచ్చు?రాజ్మార్గ్ యాత్రా యాప్లో త్వరలో సంబంధిత ఫాస్టాక్ కొనుగోలు లింక్ను అందుబాటులోకి తేనున్నారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ), రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ(ఎంఓఆర్టీహెచ్) అధికారిక వెబ్సైట్లలోనూ ఈ లింక్ను పెట్టనున్నారు.కొత్త పాస్ ఖచ్చితంగా తీసుకోవాలా?ప్రస్తుతమున్న, ఇప్పటికే అందుబాటులో ఉన్న పాస్ల వ్యవస్థ యథావిధిగా కొనసాగుతుంది. వార్షిక పాస్ తీసుకోవ డమనేది వాహనదారుల స్వచ్ఛంద నిర్ణయం. పాత ఫాస్టాగ్లు సైతం కొనసాగుతాయి.

ఒక్కమాటే..మంత్రము
మనం ఆన్లైన్లో ఏదైనా కొనాలన్నా.. ఆహారం ఆర్డర్ చేయాలన్నా.. బైక్/కారు బుక్ చేయాలన్నా.. ఏ భాషలోనైనా సమాచారం కావాలన్నా.. ఇకమీదట ఫోన్లో టైప్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. నేరుగా ఏం కావాలో ‘మాట’ మాత్రంగా చెప్తే చాలు.. పని జరిగిపోతుంది. దేశంలోని అన్ని భాషలనూ అర్థం చేసుకుని, ఆయా భాషల్లో సేవలు అందించే ‘వాయిస్ ఏఐ’ రోజులు వస్తున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన ‘ఇండియా ఏఐ మిషన్’ జోరందుకుంది. రోజువారీ పనులను చక్కబెట్టుకోడానికీ ‘వాయిస్ ఏఐ’ అనే కృత్రిమ మేధ మనకోసం ‘కార్యేషు కమాండర్’లా సిద్ధం కాబోతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్దేశంలో ప్రస్తుతం ఉన్న 90 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామాల్లో.. ఇంగ్లీష్ వ్యాప్తి తక్కువగా ఉంటుంది. డిజిటల్ అక్షరాస్యత ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఈ ప్రాంతాల్లోని వారు వాయిస్ కమ్యూనికేషన్ ద్వారా తమ పనులు చక్కబెట్టేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా టెక్స్›్టను టైప్ చేయటానికి ఇష్టపడని, లేదా టైప్ చేయటం రాని వారి కోసం ఒక సరళమైన, స్పష్టమైన ‘వాయిస్ ఇంటరాక్షన్’ విధానాన్ని వృద్ధి చేసేందుకు భారతీయ కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ కంపెనీలు కృషి చేస్తున్నాయి.చెబితే చాలు... చేసి పెడుతుంది!రైతులు, గ్రామీణ వ్యాపారులు, గిగ్ వర్కర్లు, గృహిణులు సహా ఆన్లైన్ వినియోగదారులందరూ ఈ వాయిస్ ఎఐతో ఇంటర్నెట్ వాడకం స్వరూపాన్నే మార్చేయబోతున్నారని భారతీయ వాయిస్ ఏఐ స్టార్టప్ కంపెనీలు చెబుతున్నాయి. రైతులు ఇప్పటికే తమ ఫోన్లో ఒక్క మాట కూడా చదవకుండానే, ఒక్క బటన్ కూడా నొక్కకుండానే పంటల బీమా, క్రెడిట్ అర్హత, వాతావరణ పరిస్థితులకు తట్టుకునే వ్యవసాయ విధానాల సమాచారం తెలుసుకుంటున్నారు. జ్ఞాని.ఏఐ ప్రయోగాత్మకంగా ఇటీవలే దేశంలోని 120 గ్రామాలలో 15 వేల కంటే ఎక్కువ మంది రైతులకు ఈ విధానంలో సమాచారాన్ని అందించింది. ఒక బాట్ (సాఫ్ట్వేర్ అప్లికేషన్) ద్వారా వారికి 3 నిమిషాల వాయిస్ కాల్ వచ్చింది. ఇది వాళ్ల స్థానిక భాష, యాసలోనే వాళ్లకు కావాల్సిన సూచనలూ, సలహాలూ అందించడం విశేషం.నాలుగు కంపెనీల ఎంపిక‘ఇండియా ఏఐ మిషన్’ కింద భారత ప్రభుత్వం రూ.10,372 కోట్ల పంచ వర్ష బడ్జెట్ కేటాయింపులతో ‘సర్వమ్’, సోకెట్ ల్యాబ్స్, జ్ఞాని.ఏఐ, గాన్.ఏఐ అనే నాలుగు స్టార్టప్ కంపెనీలను ఎంపిక చేసింది. ప్రాథమిక వాయిస్ ఏఐ మోడళ్లను, అత్యాధునిక లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎమ్) తయారుచేసే బృహత్తర బాధ్యతలను వీరికి అప్పగించింది. ‘సర్వమ్’ ఏఐ.. 10 భారతీయ భాషల్లో శిక్షణ పొందిన వ్యవస్థను రూపొందించింది. ఇది గణితం, కోడింగ్, బహుభాషా అవగాహన వంటి అనేక ప్రక్రియలను సులభంగా చేయగలదు. జ్ఞాని.ఏఐ 12 భారతీయ భాషలు సహా మొత్తం 40 ప్రపంచ భాషలను గుర్తించి సేవలు అందిస్తుంది. సోకెట్ ల్యాబ్స్ భారతీయ భాషలకు అనుగుణంగా ‘ప్రజ్ఞ–1బి’ అనే ప్రాథమికమైన ఏఐ మోడల్ని (ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ మాదిరిగా) రూపొందించింది. గాన్.ఏఐ అనేది ఇన్స్టంట్ ఏఐ వీడియోలు తయారుచేస్తుంది.‘భారత్లోనే తయారవ్వాలి – భారతదేశ అభివృద్ధికే పనిచేయాలి.. ఇదే ఇండియా ఏఐ మిషన్ ప్రధాన ఉద్దేశం’ అని కంపెనీల ఎంపిక సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ‘స్వదేశీ వాయిస్’ సవాళ్లు!భారతీయ స్టార్టప్లు నేటికీ పాశ్చాత్య డేటాసెట్లపై శిక్షణ పొందిన ఓపెన్ ఏఐ, డీప్గ్రామ్ వంటి నమూనాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇవి భారతీయ భాషలు, అందులోని యాసలు, పేర్లు లేదా స్థానిక సూక్ష్మాంశాలను తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి. ఈ అంతరాన్ని తగ్గించడానికి, అందుకు అవసరమైన సాంకేతికను సాధించేందుకే కేంద్రం ‘ఇండియా ఏఐ మిషన్’కు శ్రీకారం చుట్టింది.భవిష్యత్తంతా మాటలదే..!గూగుల్ నివేదిక ప్రకారం స్మార్ట్ ఫోన్ వాడేవారిలో 60 శాతం భారతీయులు వాయిస్ అసిస్టెంట్ల ద్వారా సంభాషిస్తున్నారు. ‘వాట్ కన్సల్ట్’ నివేదిక ప్రకారం నెట్ సేవల్ని పొందే భారతీయుల్లో 76 శాతం మందికి స్పీచ్, వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీపై అవగాహన ఉంది. దీన్ని బట్టి, మాతృభాషలో స్మార్ట్ఫోన్తో మాట కలిపి దైనందిన పనుల్ని చక్కబెట్టుకునే అలవాటు దేశ ప్రజల్లో ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ఆంగ్ల భాష లేదా ఇతర భాషలలో ఉండే ఆప్షన్లను ఫోన్లో చేతి వేళ్లతో నొక్కటం ద్వారా ముందుకు సాగే ‘గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్’ (జి.యు.ఐ.) విధానానికి ఉన్న పరిమితులకు పరిష్కారంగా వచ్చిన ఈ ‘వాయిస్ ఏఐ’దే భవిష్యత్తంతా అని నిపుణులు అంటున్నారు.2022లో మొత్తం ఏఐ స్టార్టప్లలో 702 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడితే.. అందులో సుమారు 437 మిలియన్ డాలర్లు సంభాషణాపరమైన / వాయిస్ ఏఐ స్టార్టప్లలో పెట్టారు.ఎవరెవరు ఏమేం చేస్తారంటే..కొత్తగా తయారుచేయబోయే ఈ ఏఐ మోడళ్ల స్థాయిని వాటిలో ఉండే పారా మీటర్ల ఆధారంగా అంచనా వేస్తారు. ఎన్ని ఎక్కువ పారామీటర్లు ఉంటే అంత శక్తిమంతమైన మోడల్ అన్నమాట. సర్వమ్ ఏఐ రూపొందించిన సర్వమ్: ఎమ్, 2,400 కోట్ల పారామీటర్లు ఉండే మోడల్. ఇది భారతీయ భాషలన్నింటిలోనూ శిక్షణ పొందింది. స్టార్టప్లకు చేయూత నివ్వడం, సీసీటీవీ కెమెరాల్లాంటి భారతదేశంలో తయారయ్యే ఏఐ హార్డ్వేర్ వంటి వాటిని ప్రోత్సహించడం వంటి అదనపు బాధ్యతలు దీనికి అప్పగించింది ప్రభుత్వం. సోకెట్ ఏఐ: ఇది భారత దేశ మొట్ట మొదటి ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ను తయారుచేస్తుంది. 12,000 కోట్ల పారామీటర్లతో అనేక భారతీయ భాషల్లో పనిచేసే దీన్ని ఆరోగ్య సంర క్షణ, విద్య, రక్షణ రంగాల్లో వాడతారు. జ్ఞాన్ ఏఐ: 1,400 కోట్ల పారామీటర్లతో రూపొందించే ఈ వాయిస్ మోడల్ వివిధ భారతీయ భాషలను అర్థం చేసుకోగలదు. రియల్ టైమ్లో కూడాస్పందించగలదు. కేవలం మాటలతోనే స్మార్ట్ఫోన్లో పనులు చేయాలనుకునేవారి కోసం స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్లు, టూల్స్ను ఇది తయారుచేస్తుంది.

‘కబుర్ల దేవత’ కేంద్ర బాల సాహిత్య పురస్కారం
ఢిల్లీ: బాల సాహిత్య, యువ పురస్కారాలను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. 24 భాషల్లో ఉత్తమ రచనలను ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. తెలుగు భాషకు సంబంధించి గంగిశెట్టి శివకుమార్ రచించిన 'కబుర్ల దేవత' (స్టోరీ) పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం లభించింది. సాహిత్య యువ పురస్కారానికి ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల ఎంపికైంది.భారతీయ భాషల్లో సాహిత్య రంగంలో పలు పుస్తకాలను ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు జ్యూరీ సభ్యులు సిఫారసు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ నేతృత్వంలోని సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అవార్డు గ్రహీతల వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది డోగ్రీ భాషకు సంబంధించి యువ పురస్కారాన్ని ప్రకటించలేదు. 23 భాషల్లో ప్రచురితమైన పుస్తకాలకు మాత్రమే యువ పురస్కారాలను ప్రకటించింది.
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

పీక్స్కు టీడీపీ ఫేక్ ప్రచారం
ప్రత్తిపాడు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దుష్ప్రచారంలో టీడీపీ చెలరేగిపోతోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగితే, దాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెట్టి పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోంది. బుధవారం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు సమీపంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ప్లంబర్ చీలి సింగయ్య (53)ను టాటా సఫారీ (ఏపీ 26 సిఈ 0001) వాహనం ఢీకొంది. దీని వెనుక చాలా దూరంలో జగన్ కాన్వాయ్ వస్తోంది. ఇదే అదునుగా పచ్చ మీడియా రెచ్చిపోయింది.ఈ ప్రమాదాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. అంతటితో ఆగక టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ స్పష్టత ఇచ్చారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠితో కలిసి మధ్యాహ్నం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గుంటూరు ఏటుకూరు రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు, దానికంటే 50 మీటర్ల ముందు టాటా సఫారీ వాహనం తగిలి వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) గాయపడ్డాడు. అతన్ని 108 అంబులెన్స్లో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అయితే అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు’ అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామన్నారు.కాగా, సింగయ్య ప్రమాదం బారిన పడటాన్ని గమనించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయన్ను రోడ్డు పక్కకు తీసుకొచ్చారు. సింగయ్యకు భార్య లూర్థు మేరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాస్తవం ఏమిటో తెలిశాక కూడా టీడీపీ ట్విటర్ ఖాతా నుంచి ఆ తప్పుడు పోస్టును తొలగించకపోవడం గమనార్హం.

మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ఎన్కౌంటర్
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సాక్షి, పాడేరు : ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవా రుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక నేతలు సహా ము గ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కింటుకూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బల గాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మావోయి స్టుల కు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకు న్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్, అలి యాస్ బిర్సు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, ఏఓబీ జోనల్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు మరణించారు. వీరిలో రవి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. అరుణ ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య. ఈమెది విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. గాజర్ల రవి, అరుణపై పోలీస్ రివార్డులున్నాయి. మావో యిస్టులకు సంబంధించిన పలు కీలక సంఘటనల్లో వీరు పాల్గొన్నట్లు పోలీస్ కేసులు నమోదయ్యాయి. అంజుది ఛత్తీ స్గఢ్ అని తెలిసింది. కాగా సంఘటన స్థలంలో పలు ఏకే–47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సేఫ్జోన్ అని..: ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యాన్ని పోలీస్ బలగాలు జల్లెడపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరు స ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో పాపికొండలు, అభయార ణ్యంలోని కొండమొదలు, కింటుకూరు ప్రాంతాలను సేఫ్జోన్గా భావించిన మావోయిస్టులు ఇక్కడకు వచ్చినట్లు భావిస్తున్నారు. సుమారు ఆరునెలల క్రితమే పది మంది మావోయిస్టులు కింటుకూరు అటవీ ప్రాంతానికి వచ్చినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం వై. రామవరం–కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.అరుణ అలియాస్ అరుణక్క..వెంకటలక్ష్మి చైతన్య అలియాస్ అరుణ, అలియాస్ అరుణక్క (55) మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. 20 ఏళ్ల వయస్సు లోనే మావోయిస్టు ఉద్యమం బాటపట్టారు. అమె తమ్ముడు గోపి అలియాస్ ఆజాద్ కూడా 2006లో అక్క మార్గంలోనే ఉద్యమంలో చేరాడు. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ మృతిచెందారు. అరుణక్క మావోయిస్టు పార్టీలో ఏఓబీ స్పెష ల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉంటూ మహిళా విభాగాల్లో 30 ఏళ్లుగా కీలకంగా వ్యవహరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి భార్య చనిపోవడంతో అరుణక్కను రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవ రిలో ఒడిశా–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చలప తి మరణించారు. భర్త మరణంతో అరుణ కుంగిపోలేదు. అనేక ఎన్కౌంటర్ల నుంచి ఆమె తప్పించుకున్నారు. పోలీసుల నిర్బంధం తీవ్రంగా ఉండడంతో ఇటీవల కాలంలో రంపచోడ వరం అటవీ ప్రాంతాన్ని సేఫ్జోన్గా మార్చుకుని తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఆరుగురు మావోయిస్టులు భద్ర త ఉన్నప్పటికీ ఎన్కౌంటర్లో బలయ్యారు. ఆమెకు భద్రతగా ఉన్న అంజూ కూడా మృతిచెందారు. ఇక అరుణక్కపై ఏపీలో రూ. 20 లక్షల రివార్డు ఉంది. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన ఘటనలో అరుణక్క పాల్గొన్నట్లు పోలీసులు కేసు నమోదుచేశారు. కొద్ది రోజుల క్రితమే పట్టుకుని..నా కుమార్తెను పోలీసులు కొద్ది రోజుల క్రితమే పట్టుకుని బంధించి ఇప్పుడు హతమార్చారు. దీన్ని ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాం. గతంలో నా కుమారుడు ఆజాద్ను బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం .– లక్ష్మణరావు, అరుణక్క తండ్రిఅగ్రనేతగా ఎదిగి.. శాంతి చర్చల్లో పాల్గొని..సాక్షి ప్రతినిధి, వరంగల్/టేకుమట్ల: మావోయిస్టు అగ్రనేత, శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్ మృతితో ఆయన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాడిక ల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) నుంచి అజ్ఞాతవాసంలోకి వెళ్లిన రవి.. దళ సభ్యుడిగా మొదలు పెట్టి కేంద్ర కమిటీ వరకు ఎదిగారు. విద్యార్థి దశనుంచే ఉద్యమాలపై ఆసక్తితో విప్లవాల బాట పట్టారు. 1985–86 సంవత్సరంలో వరంగల్లోని ఐటీఐలో చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై ఆర్ఎస్యూలో పనిచేశారు. తన అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ అప్పటికే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. 1992లో పూర్తిస్థాయిలో ఉద్యమంలోకి వెళ్లారు. 1994–98 మధ్య ఏటూరునాగారం దళ సభ్యుడిగా, మహాదేవ పూర్లో కమాండర్గా పని చేశారు. 1994లో లెంకలగడ్డలో మందుపాతర పేల్చి ఏడుగురు పోలీసులను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నారు. 1998లో ఎన్టీఎస్జెడ్సీ సభ్యుడిగా నియమితుల య్యారు. 2000 సంవత్సరంలో ఖమ్మం – కరీంనగర్ – వరంగల్ (కేకే డబ్ల్యూ) కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2001లో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్పై జరిగిన దాడిలో పాల్గొన్నట్టు సమాచారం ఉంది. 2002 సంవత్సరంలో మహాదేవపూర్ కమాండర్గా పనిచేస్తున్న స్వరూప అలియాస్ జిలానీ బేగంను వివాహం చేసుకోగా ఆమె ఏవోబీలోని రామగూడలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయింది. 2007లో ఆంధ్ర ఒడిశా బోర్డర్కు బదిలీ అయిన రవి.. అక్కడ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూనే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శాంతి చర్చల ఎజెండా రూపకల్పనలో కీలకపాత్రగాజర్ల రవి 2004లో శాంతి చర్చల ప్రతినిధిగా వ్యవహరించారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల కు మేధావులు జరిపిన సంప్రదింపులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు చర్చల ప్రతినిధులుగా జనశక్తి పార్టీ నుంచి వెంకటేశ్ అలియాస్ రియాజ్, మావోయిస్టు పార్టీ నుంచి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గౌతమ్ అలియాస్ సుధాకర్లతో పాటు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ల రవి కూడా పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. రవి అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ (మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యుడు) 2008 ఏప్రిల్ 2న ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందగా, ఆయన తమ్ముడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉంటూ అనారోగ్యంతో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.రవి మృతిపై జిల్లా పోలీసులు బుధవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వెలిశాలకు తీసుకువచ్చి గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎన్కౌంటర్పై అనుమానాలు.. నా సోదరుడి మరణంపై అనుమానాలున్నాయి. ఇప్పటివరకు మృతదేహాల ఫొటోలను విడుదల చేయలేదు. పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు మధ్యాహ్నం వరకు సమాచారమివ్వలేదు. ఇది ఎన్కౌంటరో?.. పట్టుకుని కాల్చి చంపారో? ఏదైనా విష ప్రయోగం చేసి ఉండొచ్చు. – మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్

ప్రేమను పెద్దలు అంగీకరించలేదని..
వర్గల్(గజ్వేల్): తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదన్న మనస్తాపంతో ప్రేమ జంట బలవన్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన మంగళవారం వర్గల్ మండలం అవుసులోనిపల్లిలో చోటుచేసుకున్నది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెక్కల ఆంజనేయులు, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు కల్పన(18) ఉంది. కల్పన ఇంటర్మీడియట్ చదివి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఉప్పరి మల్లేశం, మంజుల దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శివకుమార్ (21) ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన కల్పన, శివకుమార్ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. కుటుంబీకులు వారి ప్రేమను అంగీకరించలేదు. మరోవైపు కూతురు వివాహం కోసం సంబంధం కుదుర్చుకునే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ నేపథ్యంలో తమ ప్రేమ విఫలమైందని కల్పన, శివకుమార్ మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం ఉదయం శివకుమార్ తన వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ విషయం తెలిసిన కొద్ది వ్యవధిలోనే కల్పన తన ఇంట్లో పైకప్పు పైపునకు చున్నీతో ఉరివేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గజ్వేల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు.

కసాయి కూతురు.. ప్రియుడితో కలిసి కన్నతండ్రినే కడతేర్చింది
సాక్షి, మహబూబాబాద్: కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని ఆ తండ్రి భయపడ్డాడు. ఆమె ప్రేమ వ్యవహారం తెలిసి ‘వద్దూ.. బిడ్డా’ అని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపు ఆమెకు నచ్చలేదు. తండ్రిపైనే కోపం పెంచుకుంది. ప్రియుడిని రప్పించి ఆ తండ్రినే హతమార్చింది. మరిపెడ మండలం జండాల తండాలో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళ్తే.. దారావత్ కిషన్ తన కూతురు ఓ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని తెలిసి మందలించాడు. దీంతో తన ప్రియుడిని రప్పించిన ఆమె.. తండ్రిని కట్టేసి చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన కిషన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ తండ్రి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కూతురి ఘాతుకం పట్ల స్థానికులు రగిలిపోతున్నారు. అయితే ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని సమాచారం.