కన్నూరుపాలెం వేబ్రిడ్జిలో దోపిడీ | Robbery in Way bridge | Sakshi
Sakshi News home page

కన్నూరుపాలెం వేబ్రిడ్జిలో దోపిడీ

Aug 24 2015 4:21 PM | Updated on Aug 30 2018 5:27 PM

విశాఖ జిల్లా కసీంకోట మండలం కన్నూరుపాలెం గ్రామంలో ఉన్న సరుగుడు వేబ్రిడ్జిలో ఆదివారం రాత్రి దోపిడీ జరిగింది.

విశాఖపట్నం (కసీంకోట) : విశాఖ జిల్లా కసీంకోట మండలం కన్నూరుపాలెం గ్రామంలో ఉన్న సరుగుడు వేబ్రిడ్జిలో ఆదివారం రాత్రి దోపిడీ జరిగింది. దీనికి సంబంధించి సోమవారం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. అప్పలనాయుడు అనే వ్యక్తికి చెందిన ఈ వేబ్రిడ్జిలో రాత్రి సమయంలో ఐదుగురు వ్యక్తులు దోపిడీకి పాల్పడ్డారు.

వేబ్రిడ్జిలో పనిచేసే వ్యక్తిని కట్టేసి కౌంటర్‌లో ఉన్న రూ.2.7 లక్షల నగదుతోపాటు, 2 తులాల బంగారం దోచుకెళ్లారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను వారం రోజుల్లో పట్టుకుంటామని పోలీసులు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement