'రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు' | Sitaram yechury takes on Chandrababu naidu | Sakshi

'రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు'

Nov 14 2014 2:13 PM | Updated on Aug 18 2018 6:18 PM

'రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు' - Sakshi

'రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు'

రాజధాని నిర్మాణానికి చాలా చోట్ల రైతులు తమ భూములు ఇచ్చేందుకు సిద్దంగా లేరని సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి తెలిపారు.

గుంటూరు: రాజధాని నిర్మాణానికి చాలా చోట్ల రైతులు తమ భూములు ఇచ్చేందుకు సిద్దంగా లేరని సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి తెలిపారు. రాజధాని నిర్మించే ప్రాంతాలలో ఆయన పర్యటించారు. అనంతరం శుక్రవారం గుంటూరులో సీతారాం ఏచూరి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాజధానికి భూముల సమీకరణ అంశంలో చంద్రబాబు ప్రభుత్వానికి స్పష్టత లేదని ఆరోపించారు.

ఎన్నికల ముందు అన్ని ఫ్రీగా ఇస్తానని చెప్పిన బాబు ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. అప్పుడు రుణాలు మాఫీ చేస్తానని... ఇప్పుడు బాండ్లను రైతుల చేతిలో పెట్టడం దారణమని సీతారం ఏచూరి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement