Amaravati Lands
-
చంద్రబాబు ప్రభుత్వ భూ దాహం.. మరో 44,676 ఎకరాలు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దల భూ దాహం తీరడం లేదు. రైతులు కాళ్లావేళ్లా పడుతున్నా హృదయం కరగడం లేదు! ఇప్పటికే రాజధాని పేరుతో అమరావతిలో ఏకంగా 53 వేలకుపైగా ఎకరాలను తీసుకోగా ఇప్పుడు మరో 44 వేల ఎకరాలకుపైగా భూమిని హస్తగతం చేసుకునేందుకు టీడీపీ కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. వెరసి దాదాపు లక్ష ఎకరాలను అమరావతి నిర్మాణం కోసం వినియోగించనున్నట్లు స్పష్టమవుతోంది. నాలుగు మండలాల పరిధిలో... రాజధాని పేరుతో ఏటా మూడు వాణిజ్య పంటలు పండే ఎంతో సారవంతమైన భూములను రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా గతంలోనే 34,568 ఎకరాలను టీడీపీ సర్కారు తీసుకుంది. ఇది కాకుండా ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 53,749 ఎకరాలను రాజధాని కోసం ఇప్పటికే సమీకరించారు. అయితే ఇది ఇంకా సరిపోదంటూ రాజధాని విస్తరణ పేరుతో మరో 44,676 ఎకరాలను సమీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కసరత్తు ప్రారంభించింది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో వేల ఎకరాలను సమీకరించే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ‘రియల్’ వ్యాపారిలా మారిపోయి... రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి వేల ఎకరాలను తీసుకుని ఐదేళ్ల పాటు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలక్షేపం చేశారు. తమ నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దని పేద రైతులు వేడుకున్నా కనికరించలేదు. మూడు వాణిజ్య పంటలు పండే ప్రాంతంలో రాజధాని కోసం వేల ఎకరాలు తీసుకోవడాన్ని పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. రైతులు ఇచి్చన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ హ్యాపీ నెస్ట్, తాత్కాలిక భవనాలంటూ కాలం గడిపారు. వరద ముప్పు తప్పించే పనులు చేపట్టాలన్న ప్రపంచబ్యాంకు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా విస్తరణ అవసరాల పేరుతో మరో 44,676 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ లేదా నెగోíÙయేటెడ్ సెటిల్మెంట్స్ లేదా భూసేకరణ చట్టం ద్వారా సమీకరించాలని టీడీపీ కూటమి సర్కారు భావిస్తోంది. భవిష్యత్తు అవసరాల పేరుతో మూడు పంటలు పండే సారవంతమైన వేలాది ఎకరాలను స్వా«దీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్టేడియాలు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్లు పేరుతో రాజధాని విస్తరణ అంటూ వేలాది ఎకరాలపై కన్నేసింది. అసలు రాజధాని నిర్మాణమే ప్రారంభం కాకపోగా భవిష్యత్ విస్తరణ పేరుతో మళ్లీ వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకునే యత్నాలపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. ఇప్పటికే రాజధాని ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని, దాని నుంచి అమరావతిని కాపాడేందుకు ప్రాజెక్టులు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ షరతు విధించాయి. రాజధాని నిర్మాణ ప్రాంతంలో వరద ముప్పు తగ్గించేందుకు 1,995 ఎకరాల్లో రూ.2,750 కోట్లతో పనులు చేపట్టాల్సిందిగా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అలాంటి చోట రాజధాని విస్తరణ పేరుతో 44,676 ఎకరాలను సమీకరించడం అంటే ఏకంగా లక్ష ఎకరాలను రైతుల నుంచి లాక్కోవటమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో బలంగా వ్యక్తం అవుతోంది. రాజధాని ప్రాంతంలో సారవంతమైన తమ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. తమ జీవనోపాధి దెబ్బ తింటుందని, మూడు పంటలు పండే భూములను లాక్కోవడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం భూ దాహం తీరడం లేదు. -
అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణ
సాక్షి, గుంటూరు: అమరావతి కోసం మరో భారీ భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. 44,676 ఎకరాలను సీఆర్డీఏ సమీకరించనుంది. మూడు పంటలు పండే భూముల్ని ప్రభుత్వం మళ్ళీ సమీకరించనుంది. ఇప్పటికే 54 వేల ఎకరాలు సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం.. 54 వేల ఎకరాల్లో ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదు.గత ఆ భూములు ఉంటుండగానే మళ్లీ 44,676 ఎకరాలు భూముల సమీకరణకు సిద్ధమైంది. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల్లో కొత్తగా భూ సమీకరణ చేయనుంది. 11 గ్రామాల్లో 44,676 ఎకరాలు భూములను ప్రభుత్వం సమీకరించనుంది.కాగా, రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకే ప్రభుత్వ పెద్దలు భూములు కాజేసిన సంగతి తెలిసిందే. ఆశ్రిత పక్షపాతం.. అవినీతి.. అధికార దుర్వినియోగం.. వెరసి అమరావతిని చంద్రబాబు అక్రమాల పుట్టగా మార్చేశారు. అడ్డగోలు నిర్ణయాలతో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాజధాని ఇక్కడా.. అక్కడా అంటూ లీకులిచ్చి స్కాములకు బీజం వేశారు.రాజధాని ఎంపిక నుంచి భూముల కొనుగోళ్లు, భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్), ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారం వరకు ఏది తవ్వినా టన్నుల కొద్దీ అవినీతి పుట్ట బద్దలైంది. అమరావతిని అక్రమాల అడ్డాగా మార్చేసిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. -
రేవంత్ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా?
హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే సుప్రీంకోర్టు ధర్మాసనం చెట్ల నరికివేత విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వందల ఎకరాల్లో పచ్చదనంపై గొడ్డలివేటు పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ వేత్తలు, కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థలు ఏపీలో సుమారు 33 వేల ఎకరాలలో ఏటా మూడేసి పంటలు పండే పచ్చటి భూములను బీడులుగా మార్చి పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నా స్పందించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది.దేశ ప్రధానితోపాటు, న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాలలో పని చేసిన వారిలో కొందరు కూడా అమరావతి పేరుతో సాగుతున్న పర్యావరణ విధ్వంసానికి సహకరించే విధంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. రాష్ట్రాన్ని బట్టి, నేతలను బట్టి, పార్టీలను బట్టి వ్యవస్థలు స్పందిస్తున్నాయా అన్న సందేహం రావడానికి ఇలాంటి ఘట్టాలు ఆస్కారం ఇస్తుంటాయి. కంచ గచ్చిబౌలి భూముల మీద స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనమే, పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా అసంతృప్తి తెలిపింది. ఈ రెండు ఉదంతాలకు సంబంధం ఉందో, లేదో తెలియదు. అయితే, రేవంత్ చేసిన తప్పిదం వల్ల దాని ప్రభావం న్యాయ వ్యవస్థపై పడి ఉండవచ్చా అన్నది కొందరి డౌటు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఈ స్థాయిలో ఇలాంటి కేసులు తనంతట తానే తీసుకున్నట్లు కనిపించలేదు. అన్ని కేసుల్లోనూ కింది కోర్టుల్లో విచారణ జరుగుతుండగా ఇలా స్పందిస్తుందా? అన్నది కొందరి ప్రశ్న.తెలంగాణ ప్రభుత్వం తొందరపాటు, సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధుల నిరసనలు, బీజేపీ, బీఆర్ఎస్ల విమర్శల హోరు, కేంద్ర ప్రభుత్వం జోక్యం, తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యంపై విచారణ, స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి రావడం వంటి పరిణామాలను విశ్లేషించుకుంటే అన్ని వ్యవస్థలలో ఉన్న మంచితోపాటు లోపాలు కూడా కనిపిస్తాయని చెప్పాలి. కంచ గచ్చిబౌలిలోని ఈ 400 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చింది. దాంతో రేవంత్ సర్కార్కు కొత్త ఆలోచనలు వచ్చాయి. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని అమ్మడమో, లేక లీజు పద్దతిపై ఆయా సంస్థలకు కేటాయించడమో, ఇతర అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడమో చేయాలని తలపెట్టి ఆ దిశగా పావులు కదిపింది.అయితే, ఇక్కడే రేవంత్ అనుభవరాహిత్యం వల్ల దెబ్బతిన్నారు. నిజంగానే ఆయన అక్కడ అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో ఉంటే వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండాలి. దానికి ముందు ఈ భూమిని అధీనంలోకి తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలను పసికట్టి ఉండాలి. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో భాగమా? కాదా? ఎవరికి భూములపై హక్కులు ఉన్నాయన్న దానిపై న్యాయపరంగా అభిప్రాయం తీసుకుని ఉండాల్సింది. ఆ తర్వాత తదుపరి చర్యలకు వెళ్లి ఉంటే ఎలా ఉండేదో గాని, అలా కాకుండా, వేగంగా సెలవు దినాలలో పెద్ద సంఖ్యలో జేసీబీలను పంపించి చెట్లు కొట్టి, నేల చదును చేయించడంతో వివాదానికి అవకాశం ఇచ్చినట్లయింది. ఈ భూముల అమ్మకం ద్వారా కనీసం రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కొందరైతే ఇంకా ఎక్కువే వస్తుందని అంటారు. దీంతో ప్రభుత్వ కష్టాలు తీరుతాయని ఆశించి ఉండవచ్చు. సుమారు రెండు దశాబ్దాల పాటు కోర్టులలో ప్రభుత్వమే ఈ భూమిపై పోరాడింది కనుక తమవే అన్న అభిప్రాయం వచ్చినప్పటికీ భవిష్యత్ పరిణామాలపై ఒక అంచనాకు రావడంలో విఫలమైందని అనిపిస్తుంది.1975లో రాష్ట్ర ప్రభుత్వమే 2300 ఎకరాలు కేటాయించినా, సెంట్రల్ యూనివర్శిటీకి అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయలేదు. అయినా వారు వాడుకున్న భూమి పోను మిగిలినది ప్రభుత్వ అధీనంలోనే ఉందట. 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఈ భూమిని ‘ఐఎమ్జీ భారత’ అకాడమి అనే ప్రైవేటు సంస్థకు కేటాయించింది. ఆ సంస్థకు భూమిని బదలాయించే నిమిత్తం 2004 ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం 534 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్శిటీ నుంచి బదలాయించారు. ఈ మేరకు రికార్డులు ఉన్నాయని మీడియా కథనం. అందులో యూనివర్శిటీ రిజిస్ట్రార్ సంతకం కూడా ఉండడం గమనార్హం. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఆపద్ధర్మ సీఎం హోదాలో ఈ భూమిని ఇలా బదలాయించినా ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఏ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు రాలేదు. పైగా ఈ భూమిలో 400 ఎకరాలు పొందిన ప్రైవేటు సంస్థ రెండు దశాబ్దాలుగా ఆ భూమి తనదే అంటూ కోర్టులలో వ్యాజ్యాలు సాగించినా ఏ వ్యవస్థ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించదు.ఇక, 2006లో ఆనాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ భూమి విషయాన్ని పరిశీలించి ఇది ప్రైవేటు వ్యక్తులకు లాభం చేసేందుకే చంద్రబాబు సర్కార్ కేటాయించిందని అభిప్రాయపడి దానిని రద్దు చేసింది. అయినా కోర్టులో అది ప్రభుత్వ భూమి అని ఇంతకాలం పోరాడాల్సి వచ్చింది. ఒక వేళ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఐఎంజీ సంస్థ ఏవైనా నిర్మాణాలు చేపట్టి ఉంటే ఏమై ఉండేది అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. అప్పుడు కూడా ఈ భూమిలో చెట్లు ఉన్నాయి కదా!. అలాంటి ఖాళీ భూమిలోనే కదా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. అప్పుడు పర్యావరణ సమస్యలు రావా? ఇక్కడ రేవంత్ సర్కార్ కరెక్ట్ గా చేసిందా? లేదా? అన్నది చర్చ కాదు. కానీ, పరిణామాలన్నిటిని విశ్లేషించినప్పుడు ఇలాంటి సందేహాలు వస్తాయి కదా!. సుప్రీంకోర్టు ఈ భూమి ప్రభుత్వానిదే అని తేల్చిన తర్వాత ఈ భూమిని అభివృద్ది చేయడం కోసం మౌలిక వసతుల కల్పన సంస్థకు అప్పగించింది. ఈ పనులు చేయడం కోసం ఇదే భూమిని తాకట్టు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ ద్వారా పదివేల కోట్ల అప్పు కూడా తీసుకుందట. మార్కెట్లో బాండ్లు, వివిధ బ్యాంకులు, ఆర్ధిక సంస్థల ద్వారా ఈ రుణాలు సేకరించి, వడ్డీ కట్టడం కూడా ఆరంభమైందని కథనం.ఈ భూమిని యూనివర్శిటీకే ఇవ్వాలని, అక్కడ ప్రహరి గోడ కట్టించడం వల్లే వృక్షాలు పెరిగాయని చెబుతూ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగడం, తదుపరి విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ ఎంటర్ అవ్వడంతో అది పెద్ద దుమారంగా మారింది. ఈలోగా కేంద్రం కూడా స్పందించి ఈ భూమిపై నివేదికను కోరింది. తెలంగాణ హైకోర్టు కూడా విచారణ చేపట్టి నోటీసులు జారీ చేసింది. ఇంతలో సుమోటోగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని చెట్లు కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులు ఆపాలని ఆదేశించింది. దీంతో విద్యార్దులు తామే గెలిచామని సంబరాలు చేసుకుంటే, రేవంత్ సర్కార్కు పెద్ద షాక్ తగిలినట్లయింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఇప్పుడు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. కాగా అక్కడ పర్యావరణ అనుకూల పార్కు ఏర్పాటు చేస్తామని, యూనివర్శిటీ కూడా అదే భూమిలో ఉంది కనుక దానిని ఫ్యూచర్ సిటీకి తరలిస్తామని కొత్త కండీషన్ పెట్టడం విశేషం. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ ద్వారా కల్పిత వీడియోలు సృష్టించారని తెలంగాణ సర్కార్ ఇప్పుడు వాపోతున్నా పెద్దగా ఫలితం ఉంటుందా అన్నది సందేహం.కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావని రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సీఎంకు సంయమనం పాటించడం తెలియదా అని ప్రశ్నించింది. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజునే ఆయన అనవసర వివాదంలో చిక్కుకున్నారని అనుభవజ్ఞులు అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థను సవాల్ చేసేలా ఆయన మాట్లాడడం వారికి ఎలా నచ్చుతుంది. గతంలో ఫిరాయింపులపై కోర్టులు గట్టి చర్యలు తీసుకోలేదన్నది ఆయన అభిప్రాయం కావచ్చు. అయినప్పటికీ శాసనసభలో అలా మాట్లాడి దెబ్బతిన్నారు. ఆ క్రమంలో ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం గందరగోళంగా మారింది. విశేషం ఏమిటంటే యూనివర్శిటీకి చెందిన భూములలో కొంత భాగం ఆక్రమణలకు గురైందని చెబుతున్నారు. తన అధీనంలో ఉన్న భూములను ఏం చేయాలన్నది నిజానికి ప్రభుత్వ అభీష్టం ప్రకారం జరగాలి. అయితే స్థానిక ప్రజలు పర్యావరణ వేత్తలు, యూనివర్శిటీ విద్యార్ధులు చేస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయాలు చేసి ఉండవచ్చు. అవేవి జరగలేదు. దానిని సహజంగానే విపక్షాలు తమకు అనుకూలంగా మలచుకుంటాయి.ప్రభుత్వ ఆస్తులు, భూములు అమ్మడం కొత్త కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల కారణం చూపి అమ్ముతున్నారు. తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వం కూడా పలు చోట్ల భూములను అమ్మి వేల కోట్ల ఆదాయం పొందింది. ఇప్పుడేమో బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తాము అధికారంలోకి వస్తే ఈ భూములను యూనివర్శిటీకి అప్పగిస్తామని చెబుతున్నారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ సర్కార్ భూముల అమ్మకాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పుడు ఆయన అదే బాటలో ఉన్నారు. ఇదంతా ఒక గేమ్గా మారింది. ప్రతిపక్షంలో ఉంటే ఒకరకం, అధికారంలోకి వస్తే మరో రకంగా వ్యవహరిస్తున్నారు.ఇక ఏపీ సంగతి కూడా చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. కృష్ణానది పక్కన 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించి రాజధాని కడుతున్నారు. అది పర్యావరణానికి నష్టమని పలువురు చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్కడ భూమి స్వభావ రీత్యా మామూలు వ్యయం కన్నా ఒకటిన్నర రెట్ల అధికంగా నిర్మాణ ఖర్చు అవుతుందట. రిషికొండపై జగన్ ప్రభుత్వం మంచి భవనాలు నిర్మిస్తే, ప్యాలెస్లని ప్రచారం చేసిన తెలుగుదేశం, జనసేన నేతలు ఇప్పుడు అమరావతిలో అంతకన్నా పెద్ద ప్యాలెస్లు నిర్మించాలని తలపెట్టారు. వాటికి మాత్రం ఐకాన్ భవనాలని, అదని, ఇదని బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు స్వయంగా కృష్ణా నది తీరాన నదీ చెంత సీఆర్జెడ్ నిబంధనలతో నిమిత్తం లేకుండా ఒక భవనంలో నిర్మిస్తున్నా ఏ వ్యవస్థ ఆయన జోలికి వెళ్లలేకపోయింది.రిషికొండపై అంతా కలిపి 400 కోట్లతో భవనాలు నిర్మిస్తే తప్పట. అదే అమరావతిలో ఏభై వేల కోట్ల అప్పులు తెచ్చి మరీ ప్యాలెస్లు నిర్మిస్తే రైటట. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యవస్థలే లేవా?. రాజధాని కోసం ఎంత భూమి అవసరమో అంత తీసుకోవచ్చు. అలా కాకుండా మహానగరం నిర్మిస్తామంటూ శివరామకృష్ణన్ నివేదికకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఇలా చేస్తుంటే ఏమనాలి?. తెలంగాణకు ఒక న్యాయం, ఏపీకి ఒక న్యాయం ఉంటుందా?. ఇదంతా మన ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థతో సహా వివిధ వ్యవస్థలలో ఉన్న లోపమా?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సిండికేటు లూటీ!
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు కాజేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు తమకు సన్నిహితులైన కాంట్రాక్టర్లతో సిండికేట్ను ఏర్పాటు చేసి రాజధాని నిర్మాణ పనులను అధిక ధరలకు కట్టబెడుతున్నారు. మొన్న.. రూ.10,696.79 కోట్ల వ్యయంతో 37 ప్యాకేజీల కింద రాజధాని ముంపు నివారణ, రహదారుల నిర్మాణంలో మిగిలిన పనులకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏడీసీఎల్) నిర్వహించిన టెండర్లలో సిండికేట్ బాగోతం బట్టబయలైంది. నేడు.. రూ.16,463.83 కోట్ల వ్యయంతో 22 ప్యాకేజీల కింద భూసమీకరణ ద్వారా భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు లేఅవుట్ల అభివృద్ధి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్.. మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్ అధికారులకు బంగ్లాల నిర్మాణ పనులకు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ఖరారు చేసిన టెండర్లలోనూ ప్రభుత్వ పెద్దల లాలూఛీ బాగోతం మరోసారి బట్టబయలైంది. ఏడీసీఎల్, సీఆర్డీఏ రెండు కలిసి రూ. రూ.27,160.62 కోట్ల కాంట్రాక్టు విలువతో 59 ప్యాకేజీల కింద పనులకు టెండర్లు పిలిచాయి. ఈ పనులను రూ.28,209.62 కోట్లకు సిండికేట్లోని ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వ పెద్దలు పంచి పెట్టారు. కాంట్రాక్టు విలువ కంటే సగటున 3.94 నుంచి 4.34 శాతం అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై రూ.1,049 కోట్లు భారం మోపారు. అదే రివర్స్ టెండరింగ్ విధానం అమల్లో ఉండి ఉంటే కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి కనీసం 8 శాతం తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చేవారని.. దీనివల్ల ఖజానాకు రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల మేర ఆదా అయ్యేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సిండ్ఙికేటు’ రాజ్యం..!రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలవక ముందే సన్నిహిత కాంట్రాక్టు సంస్థలతో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరిపారు. ఆ కాంట్రాక్టర్లతో సిండికేట్ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 2014–19 మధ్య షాపూర్జీ పల్లోంజీ కాంట్రాక్టు సంస్థ నుంచి ముఖ్యనేత తరఫున కమీషన్లు వసూలు చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సాక్ష్యాధారాలతో పట్టుబడిన అధికారే ఇప్పుడూ ప్రభుత్వ పెద్దల తరఫున సిండికేట్ కాంట్రాక్టర్లతో చక్రం తిప్పుతున్నారు. సిండికేట్లోని కాంట్రాక్టర్ల ప్రతిపాదన మేరకే వారికి అధికంగా పనులు కట్టబెట్టేందుకు వీలుగా బిడ్ కెపాసిటీని 2 ఎన్ఎన్–బీ నుంచి 3 ఏఎన్–బీకి పెంచుతూ ఫిబ్రవరి 10న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయించారు. అంతకు ముందే అంచనాలను ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి, సిండికేట్ కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్ జారీ చేయడానికి వీలుగా జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాన్ని కూడా రద్దు చేశారు. కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్డానికి వీలుగా రివర్స్ టెండరింగ్ విధానానికి కూడా మంగళం పాడారు. తమ అక్రమాలకు అడ్డొచ్చే వ్యవస్థలు.. విధానాలను అన్నింటినీ రద్దు చేశాకే రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు.పూలింగ్ లేఅవుట్ల అభివృద్ధికి రూ.14,887.64 కోట్లు..భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పథకం కింద రాజధానికి రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. ఆ పథకం కింద రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలి. అందుకు రహదారులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం వంటి కనీస సదుపాయాలు కల్పించడం ద్వారా లేఅవుట్లను అభివృద్ధి చేయాలి. రాజధానికి భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వడానికే 17 వేల ఎకరాలు భూమి అవసరం. ఇందులో లేఅవుట్ల అభివృద్ధి పనులకు 18 ప్యాకేజీల కింద సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఈ పనులన్నింటినీ కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకే సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. రూ.14,887.64 కోట్లకు ఆ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించారు. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ తదితర పన్నుల రూపంలో కాంట్రాక్టర్లకు అదనంగా ఇస్తామని సీఆర్డీఏ చెప్పిన మొత్తాన్ని కూడా కలిపితే ఈ పనుల వ్యయం రూ.17 వేల కోట్లకు చేరుతుంది. అంటే ఎకరం భూమిలో లేఅవుట్ అభివృద్ధి చేయడానికే సగటున రూ.కోటి చొప్పున వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలే చెబుతున్నాయి. వాస్తవానికి అత్యాధునిక సదుపాయాలతో లేఅవుట్ను అభివృద్ధి చేయడానికి ఎకరానికి రూ.50 లక్షలకు మించి వ్యయం కాదని స్పష్టం చేస్తున్నారు. ఇక సీఆర్డీఏ ద్వారా ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగుతూ చేపట్టిన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్.. మంత్రులు, జడ్జీలకు బంగ్లాలు.. ఐఏఎస్లకు బంగ్లాల నిర్మాణ పనులను నాలుగు ప్యాకేజీల కింద కాంట్రాక్టర్లకు అప్పగించారు.– ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన కృష్ణారెడ్డికి చెందిన మేఘా సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లే అవుట్లు అభివృద్ధి చేసేందుకు సంబంధించిన ఐదు ప్యాకేజీల పనులను కట్టబెట్టారు. ఈ పనుల విలువ రూ.5,608.7 కోట్లు.– ఈనాడు కిరణ్ సోదరుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి నాలుగు పనులను ప్రభుత్వ పెద్దలు అప్పగించారు. ఈ పనుల విలువ రూ.2,813.66 కోట్లు.– బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్లకు సంబంధించి ఎనిమిది ప్యాకేజీల పనులను అప్పగించారు. వీటి విలువ రూ.3,945.47 కోట్లు.– ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఏవీ రంగరాజు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఎన్సీసీ సంస్థకు హ్యాపీ నెస్ట్తోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణం, ఓ ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ పని అప్పగించారు. వీటి విలువ రూ.3,438.21 కోట్లు.– మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆయన తరఫున ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన కనకమేడల వరప్రసాద్కు చెందిన కేఎమ్వీ ప్రాజెక్ట్స్కు ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనులు కట్టబెట్టారు.– సీఎం చంద్రబాబుతో ఆది నుంచి సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ అభివృద్ధి చేసే ఒక ప్యాకేజీ పనిని అప్పగించారు.ఎనిమిది సంస్థలకే పనులన్నీ..రాజధాని అమరావతిలో వరద మళ్లింపు, రహదారుల అభివృద్ధి పనులను 37 ప్యాకేజీల కింద చేపట్టేందుకు రూ.15,095.02 కోట్లతో ఏడీసీఎల్కు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇక ల్యాండ్ పూలింగ్ స్కీం కింద లేఅవుట్ల అభివృద్ధి, హ్యాపీనెస్ట్, మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్ అధికారుల బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణ పనులను 22 ప్యాకేజీల కింద చేపట్టడానికి రూ.22,607.11 కోట్లతో సీఆర్డీఏకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ రెండూ మొత్తం 59 ప్యాకేజీల కింద పనులకు టెండర్లు పిలిచాయి. వాటన్నింటినీ సిండికేట్లోని ఎనిమిది సంస్థలే దక్కించుకున్నాయి. ఎన్సీసీ సంస్థ రూ.6,124.08 కోట్లు, బీఎస్సార్ ఇన్ఫ్రా రూ.6,216.47 కోట్లు, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ రూ.6,031.79 కోట్లు, మేఘా రూ.7,022.38 కోట్లు, ఎమ్వీఆర్ ఇన్ఫ్రా (నారా లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ భరత్ సన్నిహితుడికి చెందిన సంస్థ)కు రూ.796.04 కోట్లు, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే కృష్ణయ్యకు చెందిన బీఎస్పీసీఎల్కు రూ.779.82 కోట్లు, ఎల్ అండ్ టీ సంస్థకు రూ.809.88 కోట్లు, కేఎమ్వీ ప్రాజెక్ట్స్కు రూ.429.23 కోట్ల విలువైన పనులను కట్టబెట్టబెట్టారు.నీకింత.. నాకింత..సీఆర్డీఏ, ఏడీసీఎల్ 59 ప్యాకేజీల కింద పనులకు పిలిచిన టెండర్లను ప్రభుత్వం ఆమోదించింది. ఆ పనులను రూ.28,209.62 కోట్లకు ఎనిమిది కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వ పెద్దలు పంచి పెట్టారు. ఆ పనులను అప్పగిస్తూ సీఆర్డీఏ, ఏడీసీఎల్ వాటితో ఒప్పందం చేసుకున్న వెంటనే కాంట్రాక్టు విలువలో పది శాతం అంటే రూ.2,820.96 కోట్లను ఆ సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెబుతాయి. అందులో 8 శాతం అంటే.. రూ.2,256 కోట్లను ప్రభుత్వ పెద్దలు తొలి విడత కమీషన్లుగా రాబట్టుకోనున్నారు. ఇందుకోసమే గత ప్రభుత్వం రద్దు చేసిన మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని పునరుద్ధరించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. సిండికేట్ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసే బాధ్యతను గతంలో ఆదాయపు పన్ను శాఖకు చిక్కిన అధికారికే ప్రభుత్వ పెద్దలు అప్పగించినట్లు చర్చ సాగుతోంది. -
‘అమరావతిలో వేల ఎకరాల్ని అమ్ముతాం.. అప్పులు తీరుస్తాం’: నారాయణ
సాక్షి,విజయవాడ : అమరావతి భూములపై ఏపీ పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ (Ponguru Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి వేల ఎకరాల భూముల్ని సేకరించింది. వాటిలో నాలుగువేల ఎకరాలు అమ్మేయనున్నట్లు తెలిపారు.భూములు ధర పెరిగాక రైతుల నుండి సేకరించిన భూముల్లో 4 వేల ఎకరాలు అమ్ముతాం. రైతులకు అభివృద్ధి చేసిన తర్వాత ప్లాట్ లను తిరిగి ఇస్తాం. రైతులు భూములు అమ్మిన డబ్బులతో అప్పులు తీరుస్తాం’ అని వ్యాఖ్యానించారు. -
‘అసైన్డ్’ దోపిడీకి రాజముద్ర!. అమరావతిలో పేదల భూములు కాజేసిన పచ్చ ముఠాలకు ‘రిటర్నబుల్ ప్లాట్లు. సీఆర్డీఏకు చంద్రబాబు సర్కారు ఆదేశం
-
అమరావతికి కేంద్రం ఇచ్చేది గ్రాంట్ కాదు అప్పే
-
బాబూ.. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ సరిపోదా?.. మళ్లీ ఐకానిక్ అసెంబ్లీ అవసరమా చంద్రబాబు అని ప్రశ్నించారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వేయాల్సిన అవసరం ఏముంది?. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు లేకపోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం అని ఘాటు కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 2014-19లో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు తన మనసులోని కొన్ని అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మార్పులేమీ రాలేదు. చంద్రబాబు చెప్పిన పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా ఉండాల్సిందే. చంద్రబాబు, పవన్.. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి.ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా హైదరాబాద్ డెవలప్ కాలేదు.. ఐటీ వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందలేదు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వేయాల్సిన అవసరం ఏముంది?. మేం నెత్తీ నోరూ మొత్తుకున్నా వినకుండా 33 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. 33వేల ఎకరాలు తీసుకుని ఏం లాభం.. అక్కడ ముళ్ల చెట్లు పెరిగాయి. ఇప్పుడు లక్షలు ఖర్చు చేసి ఆ పొలాల్లోని చెట్లను తొలగిస్తున్నారు. అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు లేకపోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం. చంద్రబాబు తక్షణమే ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని ఐరన్ ఓర్ గనులను విశాఖ స్టీల్ ప్లాంట్కు కేటాయించాలి. ముందు రాష్ట్రం చేయాల్సిన పని చేస్తే.. అప్పుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావచ్చు.విజయవాడ-విశాఖ మధ్య మెట్రో రైల్ వేస్తానని హడావుడి చేశాడు.. కానీ జరిగిందేమీ లేదు. అమెరికాలో కూడా లేని హైపర్ లూప్ రైలును తెస్తానని ప్రకటించడం చూస్తే నవ్వొస్తోంది. చెన్నై-బెంగుళూరు-హైదరాబాద్-అమరావతిని కలిపి బుల్లెట్ రైలు వేయాలంటున్నాడు. నాది కాకపోతే ఢిల్లీ దాకా దొర్లాలనీ వెనకటికి ఎవడో చెప్పినట్లుంది చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు ఇలాంటి అనవరమైన ఆలోచనలను మానుకోవాలని కోరుతున్నాను. ఐకానిక్ హైకోర్టు బిల్డింగ్ కట్టాలన్న ఆలోచన విరమించుకోండి. అలాగే, అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ సరిపోదా.. మళ్లీ ఐకానిక్ అసెంబ్లీ అవసరమా?. ఐకానిక్ భవనాలకు బదులు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయండి. ఉచిత ఇసుక అన్నావ్.. ప్రయోజనం ఎవరికి చేకూరుతుందో మీకూ రిపోర్టులు వస్తున్నాయ్ ఒక్కసారి పరిశీలించండి. అవినీతి చేస్తే ఎన్టీఆర్ మంత్రులను కూడా సహించలేదు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే రెండోసారి తప్పులు జరగవు’ అంటూ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబు గేమ్.. అమరావతి నుంచి పేదలు ఔట్
సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు పొలిటికల్ గేమ్లో అమరావతిలోని పేదలకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధానిలో ఆర్-5 జోన్ నుంచి ఇళ్లు పొందిన పేదలను పంపేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు వేరే ప్రాంతాల్లో స్థలం ఇస్తామన్నారు.కాగా, చంద్రబాబు పెత్తందారీ పాలనలో పేదలకు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. అమరావతి నుంచి పేదలు వెళ్లిపోవాలని చంద్రబాబు హుకుం జారీ చేశారు. రాజధానిలో ఆర్-5 జోన్ నుండి ఇళ్లు పొందిన పేదలను పంపేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. వారికి వేరే స్థలాలు ఇవ్వాలని సూచించారు.ఈ సందర్భంగా చంద్రబాబు.. ఆర్-5 జోన్లోని లబ్ధిదారులకు వాళ్ల ప్రాంతాల్లోనే స్థలాలు ఇస్తాం. లబ్ధిదారుల కోసం భూమిని సేకరించాలి. లేదంటే భూసేకరణ చేయాలి. లేకుంటే టిడ్కో ఇళ్లు అయినా ఇస్తాం అని చెప్పుకొచ్చారు. ఇక, అమరావతి భూములపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగానే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక, ఇదే సమయంలో అమరావతి రోడ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతి రోడ్లన్నీ పీపీపీ మోడల్లో చేపట్టాలి. పీపీపీ పద్దతిలో రోడ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలి. ప్రైవేటుకు ఇస్తే రోడ్ల నిర్వహణ వారే చేస్తారు. గుంతలు ఏర్పడితే వారే పూడుస్తారు. అమరావతిలో ప్రత్యేకంగా పీపీపీ విభాగం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. -
మళ్లీ సింగపూర్ కంపెనీలకే అమరావతి!
సాక్షి, విజయవాడ: అమరావతిని మళ్లీ సింగపూర్ కంపెనీలకే కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. అమరావతి విషయంలో సీఆర్డీఏ తొలి సమావేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. సింగపూర్తో మళ్లీ చర్చిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్లో సింగపూర్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్బ్ కంపెనీలను మళ్లీ తేవాలని తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవినీతి మోడల్గా గతంలో సింగపూర్ ఒప్పందంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అవినీతి కేసుల్లో జైలుకి వెళ్లిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఒప్పందం చేసుకున్నారు. .. ఈశ్వరన్ దోపిడీపై ఆయన్ను సింగపూర్ ప్రభుత్వం జైలుకి పంపింది. భూమి, నిధులు మనవి లాభాలు సింగపూర్ కంపెనీలవి అన్నట్లు ఉండేది. ఇదే సింగపూర్ సీడ్ క్యాపిటల్ ఒప్పందం సీక్రెట్. 58 శాతం వాటా సింగపూర్ కంపెనీలదే ఉంది. 1691 ఎకరాలను మళ్లీ సింగపూర్ కంపెనీలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీడ్ క్యాపిటల్ డెవలపర్గా మళ్లీ సింగపూర్ కంపెనీలనే తేవాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. .. స్విస్ ఛాలెంజ్ పేరుతో గ్లోబల్ టెండర్లు లేకుండానే ప్రభుత్వం కట్టబెట్టింది. స్విస్ ఛాలెంజ్ ఎంపికపై గతంలోనే మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తప్పుపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఏపీ ఐడీఐ చట్టానికి విరుద్ధమని ఐవైఆర్ అభ్యంతరం తెలిపారు. రూ. 66 వేల కోట్ల దోపిడీ మోడల్ అంటూ గతంలోనే ఆరోపణలు చేశారు. అదే సింగపూర్ మోడల్కి మళ్లీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
బాబు భూ దోపిడీ ఖజానా!
సాక్షి, అమరావతి: ‘‘ఏ’’ అంటే.. అమరావతి అని వక్కాణిస్తున్న సీఎం చంద్రబాబు.. రాజధాని ముసుగులో తన అవినీతి, అరాచకాలకు కేంద్రంగా చేసుకున్నారు! బరితెగించి తాను పాల్పడిన అవినీతికి అక్షయపాత్రలా మార్చారు! నాటి తెల్ల దొరలే తెల్లబోయేలా వ్యవహరించారు! బ్రిటిష్ పాలకుల సామ్రాజ్యవాద దోపిడీని మరిపిస్తూ టీడీపీ పెద్దలు సాగించిన భూ దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం అమరావతి... బడుగులు, పేదలకు స్థానం లేకుండా చంద్రబాబు సృష్టించుకున్న నయా జమిందారీ వ్యవస్థకు నిదర్శనం అమరావతి! పచ్చ రాబందులు గుప్పిట పట్టిన రూ.లక్షల కోట్ల విలువైన భూ ఖజానా అమరావతి! దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ దోపిడీకి మౌనసాక్షి అమరావతి!! ఈ భూ బాగోతాలు, తన నిర్వాకాలను కప్పిపుచ్చి మభ్యపెట్టేందుకే తాజాగా అమరావతిపై శ్వేతపత్రం అంటూ మరో డ్రామాకు చంద్రబాబు తెర తీశారు.మోయలేని భారం మోపుతూ...రాజధానిగా అమరావతి ఎంపిక చేసిన ప్రాంతం ఇటు విజయవాడ కాదు.. అటు గుంటూరూ కాదు. మూడు పంటలు పండే సారవంతమైన పంట పొలాల్లో నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతుందని చంద్రబాబు అండ్ కో కట్టిన లెక్కలే చెబుతున్నాయి. ఒక్క ఎకరాలో కనీస మౌలిక వసతుల కల్పనకు (బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) రూ.2 కోట్లు వ్యయం అవుతుందని, మొత్తం రాజధాని ప్రాంతం అభివృద్ధి చేయడానికి రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చువుతుందని అప్పట్లోనే అంచనా వేశారు. ఏటా ఆ వ్యయం పెరగడమే కానీ తగ్గదు. విభజన అనంతరం రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత భారీగా నిధులు ఖర్చు చేయడం సాధ్యమయ్యే పని కాదని నిపుణులు చేసిన హెచ్చరికలను చంద్రబాబు పట్టించుకోలేదు. తాజాగా భారీగా నిధులు అవసరమంటూనే.. వివరాలు సేకరిస్తామని చెబుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన మూడు వారాల్లోనే రూ.7 వేల కోట్లు అప్పు చేసిన టీడీపీ ప్రభుత్వం.. సంపదను ఎలా సృష్టించి రాజధాని నిర్మాణం చేస్తుందనే ప్రశ్నకు జవాబు లేదు.భూములు లాక్కుని గాలి మేడలు..!అమరావతి వేదికగా చంద్రబాబు సాగించిన భూ దందాను అప్పట్లోనే నిపుణుల నుంచి సామాన్యుల వరకూ అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. ఏడాదికి మూడు పంటలు పండే భూములను నాశనం చేయవద్దని పర్యావరణవేత్తలు అభ్యంతరం చెప్పారు. జీవనాధారమైన తమ భూములను కొల్లగొట్టవద్దని బడుగు, బలహీనవర్గాలు, పేద రైతులు వేడుకున్నారు. వారి విన్నపాలను బేఖాతర్ చేస్తూ చంద్రబాబు భారీ భూదోపిడీకి తెరతీశారు. అసైన్డ్ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకుని పరిహారం ప్రకటించుకున్నారు. 2014–19 మధ్య రాజధాని పేరిట అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం చేయని దురాగతం లేదు. అదిగో రాజధాని.. అల్లదిగో అమరావతి..! అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. అంతకుముందు పక్కా పన్నాగంతో రాజధాని అక్కడ.. ఇక్కడ అంటూ పలు ప్రాంతాల పేర్లను తెరపైకి తెచ్చి సామాన్యులను బురిడీ కొట్టించారు. మరోవైపు ముందస్తుగా తాము భూముల కొనుగోలు చేసిన అమరావతిలో బినామీ మాఫియాను వ్యవస్థీకృతం చేశారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని.. ఆకాశ హరŠామ్యల నగరం అంటూ గాలిలో మేడలు కట్టి రైతుల కాళ్ల కిందున్న భూమిని కాజేశారు.పచ్చ దండు దురాక్రమణ..దేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద భూ దోపిడీకి చంద్రబాబు బరి తెగించారు. రాజధాని ప్రచారంతో మాయాజాలం... భూసమీకరణ ముసుగులో దోపిడీ... అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, లంక భూముల స్వాహా... ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి మలుపులు... అస్మదీయులకు యథేచ్ఛగా భూ పందేరాలు... ఇలా ఒకటేమిటి ఎన్ని రకాలుగా భూదోపిడీకి పాల్పడవచ్చో అన్ని విద్యలూ ప్రయోగించారు. అమరావతిపై చంద్రబాబు ‘పచ్చ దండు’ దండయ్రాత చేసి రూ.లక్షల కోట్ల విలువైన భూముల దురాక్రమణకు పాల్పడింది. చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై వాలిపోయారు. చంద్రబాబు, లోకేశ్తోపాటు నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగుంట మురళీమోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు.. ఇలా పచ్చ దండు అంతా అమరావతిలో భూములను కొల్లగొట్టింది. అన్యాయంగా, ఏకపక్షంగా విభజనకు గురై కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆదిలోనే హంసపాదులా అభివృద్ధికి గండి కొట్టారు. తాత్కాలిక రాజధాని భవనాల పేరుతో కనికట్టు చేశారు.మభ్యపుచ్చే యత్నాలు..నాడు ఐదేళ్లలో భూముల దోపిడీకి పాల్పడటం మినహా టీడీపీ పెద్దలు రాజధాని కట్టిందీ లేదు.. అభివృద్ధి చేసిందీ లేదు. చంద్రబాబు బృందం సాగించిన భూ దోపిడీ ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో పూర్తి ఆధారాలతోసహా బట్టబయలైంది. సీఐడీ న్యాయస్థానాల్లో చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. ఇక న్యాయ విచారణ ప్రక్రియ కొనసాగితే చంద్రబాబుకు యావజ్జీవ ఖైదు ఖాయమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి రాగానే చంద్రబాబు సరికొత్త కుట్రలకు పన్నాగం పన్నుతున్నారు. అమరావతిలో తన భూ బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు శ్వేతపత్రం పేరుతో డ్రామాకు తెరతీశారు. రాజధాని నిర్మాణానికి తాను ఏం చేస్తానో చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసంతో ఊదరగొట్టారు. రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. కానీ అమరావతి పేరిట చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన దోపిడీ దాచేస్తే దాగేది కాదు. ఇప్పటికే పూర్తి ఆధారాలతో సహా చార్జిషీట్ల రూపంలో నిక్షిప్తమైందన్నది నిఖార్సైన నిజం. -
అమరావతి కలిపింది ఇద్దరినీ..
సాక్షి, అమరావతి : ప్రపంచంలో అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది ఐదో స్థానం.. అలాంటి దేశానికి మంత్రిగా ఉండి భారీ అవినీతికి బరితెగించి సింగపూర్ ప్రతిష్టకు మాయని మచ్చ తీసుకొచి్చన అమాత్యుడు ఈశ్వరన్.. అతనికి మన అమరావతి రింగ్ మాస్టర్ బినామీ బాబు జతకలిశారు. ఇంకేముంది రాజధాని పేరుతో ప్రజలకు గ్రాఫిక్స్ చూపించి అందినంత దోచేశారు. తోడుదొంగలు ఇద్దరూ కలిసి అమరావతిలో స్టార్టప్ ఏరియా అంటూ ఏకంగా 1,400 ఎకరాలను కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. పాపం పండి ఇద్దరి బాగోతం బట్టబయలైంది. స్కిల్ స్కామ్ కేసులో ‘రాజధాని ఫైల్స్’ సూత్రధారి చంద్రబాబు, సింగపూర్లో అవినీతి అభియోగాలతో ఈశ్వరన్ అరెస్టయ్యారు. వీరిద్దరి అవినీతి లింకులు కలిసింది మాత్రం అమరావతిలోనే.. అవినీతి ‘ఆట’లో ఈశ్వరన్ వాటా.. సింగపూర్లో భారీ ఎత్తున అవినీతికి బరితెగించిన ఆ దేశ మంత్రి ఈశ్వరన్ ఆట కట్టింది. ఫార్ములా వన్ రేసింగ్ కాంట్రాక్టులో ఈశ్వరన్ అక్రమాలకు పాల్పడ్డారని సింగపూర్ అవినీతి నిరోధక విభాగం కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’(సీపీఐబీ) నిగ్గు తేలి్చంది. ఈ కేసులో నేరం రుజువైతే కనీసం ఏడేళ్లు శిక్ష పడవచ్చు. సింగపూర్కు ఫార్ములా వన్ కార్ రేసింగ్ ముసుగులో ఆయన ముడుపులు స్వీకరించారని ఆ దేశ అవినీతి నిరోధక విభాగం నిగ్గు తేలి్చంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్, సింగపూర్ పర్యాటక విభాగం మధ్య కాంట్రాక్టు రూపంలో ఆయన ముడుపులు తీసుకున్నారు. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ రేసింగ్, ఫుట్బాల్ మ్యాచ్లు, మ్యూజికల్ షోస్, బ్రిటన్లో హ్యారీపోటర్ షోలకు భారీ సంఖ్యలో టికెట్లు యథేచ్ఛగా విక్రయించారని వెల్లడైంది. సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ నిర్వాహకుడు ఓంగ్ బెంగ్ సంగ్తోపాటు ఈశ్వరన్ను గతేడాది జూలై 12న సీపీఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సీపీఐబీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈశ్వరన్ అవినీతిని నిగ్గు తేలుస్తూ 27 అభియోగాలతో చార్జ్షిట్లు దాఖలు చేసింది. మంత్రి హోదాలో భారీ ముడుపులు తీసుకున్నట్లు 24 అభియోగాలు, అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్నారని రెండు అభియోగాలు, న్యాయ విచారణకు అడ్డంకులు కల్పించారని ఒకటి ఉంది. చంద్రబాబు ‘స్కిల్’తో కటకటాలకు ఈశ్వరన్ తోడు దొంగ చంద్రబాబు స్కిల్ స్కామ్లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రూ.5 వేల కోట్ల మేర అసైన్డ్ భూముల కుంభకోణం, రూ.2 వేల కోట్ల మేర ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు, రూ.10 వేల కోట్ల ఇసుక కుంభకోణం, రూ.6,500 కోట్ల మద్యం కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం కేసుల్లో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సెక్షన్ 17 ఏ ప్రకారం తన అరెస్ట్ అక్రమమన్న చంద్రబాబు వాదనను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. ఆయనపై కేసు కొట్టివేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. రూ.66 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ స్టార్టప్ ఏరియా 20 ఏళ్ల పాటు సింగపూర్ కన్సార్షియం ఆ«దీనంలో ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణకు నియమించిన మేనేజ్మెంట్ కమిటీలో చంద్రబాబు కుటుంబసభ్యులు, బినామీలే ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఏమైనా న్యాయ వివాదాలుంటే లండన్ కోర్టును ఆశ్రయించాలన్నారు. స్టార్టప్ ఏరియాలో ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా తేల్చారు. స్టార్టప్ ఏరియా అభివృద్ధి తరువాత అంతర్జాతీయ సంస్థలకు ఎకరా రూ.25 కోట్ల చొప్పున విక్రయించవచ్చని అంచనా వేశారు. 20 ఏళ్లలో ఎకరా విలువ రూ.50 కోట్లకు చేరుతుందని చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఆ ప్రకారం ...సింగపూర్ కన్సార్షియం గుప్పిట్లో 1,320 ఎకరాలు (1,070 + 250) ఉంటాయి. ఆ 1,320 ఎకరాలను రూ.50 కోట్ల చొప్పున విక్రయిస్తే రూ.66 వేల కోట్లు ఆర్జించే అవకాశముంది. బాబుతో కలిసి అభాసుపాలు కృష్ణా నదీ తీరాన స్టార్టప్ కేంద్రం అంటూ రూ.66 వేల కోట్ల పన్నాగాన్ని చంద్రబాబు, ఈశ్వరన్ రక్తి కట్టించారు. అమరావతి ప్రాంతంలో అతి పెద్ద వాణిజ్య కేంద్రంగా 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని బాబు ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ప్రభుత్వ ఖర్చుతో మౌలిక సదుపాయాలు కలి్పంచి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేశాక దానిని బినామీల పేరిట హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నారు. ఇందులో సింగపూర్కు చెందిన అసెండాస్ కంపెనీని తెరపైకి తెచ్చారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమని నమ్మించి, తనకు సన్నిహితుడైన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓ ప్రైవేటు కంపెనీ అసెండాస్ను తెరపైకి తెచ్చారు. స్విస్ చాలెంజ్ విధానంలో ప్రాజెక్టుల ఖరారును గతంలో సుప్రీంకోర్టు తప్పుపట్టినా.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ను తన బినామీ కంపెనీకి కట్టబెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానాన్ని చంద్రబాబు అనుసరించారు. గ్లోబల్ టెండర్లు లేకుండానే ఏకపక్షంగా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్షియానికి అప్పగించారు. ఆ 1,691 ఎకరాల్లోని 371 ఎకరాల్లో ప్రభుత్వం రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. సింగపూర్ కన్సార్షియం అసెండాస్కు ప్రభుత్వం 250 ఎకరాలను ఉచితంగా ఇస్తుంది. మిగిలిన 1,070 ఎకరాలను ప్లాట్లుగా విభజించి వేలం ద్వారా విక్రయిస్తారు. ఎకరా కనీస ధర రూ.4 కోట్లుగా నిర్ణయించారు. 1,070 ఎకరాల విలువ రూ.4,280 కోట్లుగా లెక్కతేల్చారు. నిధులు సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వానికి అందులో 42 శాతం వాటా, కేవలం పర్యవేక్షించే సింగపూర్ కంపెనీకి 58 శాతం వాటా దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. -
మనవాళ్ల కోసం ఎకరాకు పదివేలు.. రాజధాని ప్రాంతంలో సేకరణ
‘‘మనకు ఇదే ఆఖరి అవకాశం.... ఇప్పుడు తప్పితే మరెప్పుడూ రాలేం.. ఈసారి మనం ప్రాణాలకు తెగించి పోరాడాలి.. అవసరమైతే చందాలు ఇవ్వాలి.. విరాళాలు ఇవ్వాలి.. భోజనాలు పెట్టాలి.. ఆస్తులైనా అమ్మాలి... మనవాళ్లను మన పార్టీని మనం కాపాడుకోవాలి.. లేదంటే మన పార్టీతో బాటు మన పెద్దరికాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి.’’ ఇదీ అమరావతి ప్రాంతంలో భూములున్న రైతులు.. చంద్రబాబు సామాజికవర్గం మోతుబరుల్లోని అభిప్రాయం. అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినవాళ్లు.. అమరావతి కారణంగా భూముల ధరలు పెరిగి అమాంతం కోటీశ్వరులు అయినవాళ్లు.. వ్యాపారాలు చేసి పోగేసిన వాళ్లు.. వీళ్లంతా ఎక్కువమంది టీడీపీ సానుభూతిపరులుగా ఉన్నారు. గతంలో రాజధాని పేరిట బాగా లబ్ధిపొందిన ఈ వర్గం వారు 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడంతో హతాశులయ్యారు. ఇక కొందరైతే భారీగా భూముల ధరలు పెరుగుతాయని అప్పులు తెచ్చిమరీ భూములుకొన్నవాళ్ళు ఆ మేరకు ధరలు పెరగకపోవడం... రాజధాని కుంభకోణాలు బయటపడడంతో ఆ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం... కోర్టు కేసుల్లో కొన్ని భూములు చిక్కుకోవడంతో తమ కలలు కల్లలయ్యాయని కలవరపడ్డారు. ఆ నష్టాన్ని పూరించుకోవాలని, మళ్ళీ రాజధాని పేరిట లబ్ధిపొందాలని సర్వదా ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ ఐదేళ్లు గడిచాక అసెంబ్లీ ఎన్నికలకు సమయం వచ్చింది. దీంతో ఇప్పుడు వాళ్లంతా ఏకమయ్యారు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి ఉన్నవాళ్లు కనీసం రూ. 10 వేలు టీడీపీకి విరాళం ఇవ్వాలని .. ఆ మేరకు ఎంత ఎక్కువ భూమి ఉంటె అంత మొత్తంలో డబ్బులు జమచేసి టీడీపీకి విరాళంగా ఇవ్వాలని, టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని తీర్మానించారు. ఈమేరకు గ్రామాలూ.. వార్డులు.. మండలాలవారీగా చంద్రబాబు సామాజికవర్గం ప్రజలు.. వ్యాపారులు రైతులు కూడా ఎకరానికి కనీసం పదివేలు ఖచ్చితంగా ఇవ్వాలన్న నిబంధన విధించి ఆ మేరకు పని చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే గ్రామ.. మండలాల వారీగా కమిటీలు వేసి వసూళ్లు చేపడుతున్నారు. అందరం ఐక్యంగా ఉండాలని, ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ గెలిస్తే తెలుగుదేశానికి పుట్టగతులు ఉండవని, అందుకే ఖచ్చితంగా టీడీపీని గెలిపించుకునే బాధ్యత తామే తీసుకోవాలని తీర్మానించారు. ఈ క్రమంలో వారి వారి స్థాయిని బట్టి చందాలు రెడీ చేస్తున్నారు. ఇక ఇక్కడ భూములు కొనేసి ప్రవాసాంధ్రులు , అమెరికాలోని తానా(TANA) సంఘం సభ్యులు... వారి బంధుమిత్రులు సైతం ఈ బాధ్యతల్లో యాక్టివ్ గా పాల్గొనేలా చూస్తున్నారు. విదేశాల్లోని యువత, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు.. సాఫ్ట్ వేర్, ఇతర వృత్తుల్లోని వాళ్ళను సైతం ఈ చందాల కార్యక్రమంలో చేర్చుకుని టీడీపీ కోసం అందరం పని చేయాల్సిన అవసరాన్ని వాళ్లకు పదేపదే చెబుతున్నారు. ///సిమ్మాదిరప్పన్న /// -
సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ కరపత్రాలను ప్రజలకు అందజేసిన వెల్లంపల్లి
-
రాజధాని ‘ఫెయిల్స్’.. బాబు ‘భ్రమరావతి’
ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవి కావు... అని చెబుతున్నట్లే రియాలిటీకి ఏ మాత్రం సంబంధం లేకుండా వచ్చిన రాజధాని ఫైల్స్ను చంద్రబాబు భుజానికి ఎత్తుకుంటున్నాడు. కనీసం అమరావతికి దగ్గర్లో ఉన్న గుంటూరు థియేటర్స్కు కూడా ప్రేక్షకులు పోవడం లేదు. సినిమా రన్ కాగానే ఎంతమంది ఉన్నారో చూస్తే పట్టుమని పదిమంది కూడా థియేటర్లో కనిపించడం లేదు. ఈ సినిమా తెలుగుదేశం తమ్ముళ్లకే కాదు కనీసం అమరావతి రైతులకు కూడా కనెక్ట్ కాలేదని దీంతోనే తేలిపోతుంది. అందుకే చంద్రబాబు నాయుడు తాజాగా ఈ ఫెయిల్స్ సినిమా చూడండి. అందులో మన హరికథలు బాగా చెప్పామంటూ డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ♦అమరావతి భూముల ఇష్యూలో నిత్యం పచ్చ మీడియాలో వచ్చే కథనాలే ఒక చోటుకు చేర్చి ప్రజల మీదికి ఈ సినిమాను వదిలాడు చంద్రబాబు. వాస్తవాలను మరచి అసత్యాలు, అబద్దాలను చేర్చి వెండితెర సాక్షిగా సరికొత్త విషప్రయోగాన్ని చంద్రబాబు ప్రయోగించాడు. అమరావతి రైతులు నష్టపోయిందే చంద్రబాబు వల్ల.. ఆ విషయాన్ని దాచి అమరావతిలోని తన పెత్తందార్లతో ఉద్యమాన్ని నడిపించాడు. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు, ఆయన బ్యాచ్ పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిందని, రాజధాని ప్రకటన సమాచారం ముందే తెలుసుకుని భూములు కొనుగోలు చేసి అక్రమాలకు తెగించారని రాష్ట్రం అంతటా తెలుసు. మరీ ఈ ఫెయిల్స్ సినిమాలో ఇవి ఎందుకు కనిపించలేదు చంద్రబాబు..? ఒకసారి ఆ జ్ఞానం లేని డైరెక్టర్ గారిని అడగాల్సింది. అసలు భూముల పేరుతో అమరావతిలో కుట్రలకు, దారుణాలకు తెర లేపింది చంద్రబాబు కాదా..? ఎల్లో మీడియాలో రోజూ వచ్చే కథనాలే నిజం అనేలా ఇలా మళ్లీ సినిమా పేరుతో ప్రజలపై రుద్దడం ఎందుకు. ♦ వాస్తవానికి ఈ సినిమా చుట్టూ రైతుల భూముల గురించే ఉంది. కానీ రాజధాని నిర్మాణ వైఫల్యంపై ఎందుకు ఫోకస్ చేయలేదు. అలా చేస్తే అది చంద్రబాబుకూ వ్యతిరేకం అవుతుంది కాబట్టి.. చంద్రబాబు 5 ఏళ్ల పాటు గ్రాఫిక్స్లతో కాలం గడిపి అమరావతిలో తనకు సంబంధించిన వారికే భూములు కట్టబెట్టి తన చూట్టూ ఇన్నర్ రింగ్రోడ్డు మాదిరి ఒక కోటరీనే ఏర్పరుచుకున్నాడు. ఇవన్నీ తెలుసుకున్న జనాలు ఆయన్ను ఓడగొట్టడంతో ఆ కోట కాస్త బద్దలైంది. అప్పటి నుంచి అమరావతి భూములపై ఎల్లో మీడియా చెప్పే కథలే ఈ రాజధాని ‘ఫెయిల్స్’లో అతుకులబొంతలా ఉన్నాయి. ♦ అమరావతి ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టింది టీడీపీ పెద్దలే అన్న విషయం ఈ ఫెయిల్స్ సినిమా డైరెక్టర్కు గుర్తుకు రాలేదేమో... చంద్రబాబుతో మొదలు పెడితే లోకేశ్,నారాయణ , గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు ఇలా చాంతాడంత లిస్ట్ ఉంది. అమరావతి ప్రకటనకు ముందు వీళ్లకు అక్కడ భూములు ఉన్నాయా..? ఉన్నాయని ఒక్కరైతుతో అయిన చెప్పించగలరా..? అమరావతి పేద రైతుల ఆశలపై నీళ్లు చల్లింది చంద్రబాబు అని అక్కడున్న వారందరికీ తెలుసు. అమరావతి పేద రైతులను చంద్రబాబు మంచి చేసి ఉంటే అదే ప్రాంతంలో నారా లోకేష్ ఎందుకు దారుణంగా ఓడిపోతాడు.. మళ్లీ ఈసారి ఎక్కడ పోటీ చేస్తాడో ఆయనకే క్లారిటీ లేదు. వీళ్ల మోసాల గురించి ప్రతి అమరావతి పేద రైతుకు తెలుసు.. అందుకే వారి వెంట పెత్తందార్లు మాత్రమే ఉద్యమం పేరుతో నడిచారు. ఇవన్నీ ఈ రాజధాని ఫెయిల్స్ సినిమాలో ఎందుకు లేవో చెప్పగలరా..? ♦టీడీపీ సర్కార్ అధికారంలోకి రాగానే చంద్రబాబు ఇచ్చిన లీకుల మేరకు ఆయన, ఆయన బినామీలు, మంత్రుల బినామీల ద్వారా రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున భూముల్ని తక్కువ ధరకు కాజేశారు. జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ 31, 2014 మధ్య జరిగిన రిజిస్ట్రేషన్లు పరిశీలించాక.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా 4,069.94 ఎకరాలను కొల్లగొట్టారు. ఇదంతా ఎలా జరిగిందో సినిమాలో చూపించాల్సింది. ♦ మాజీ మంత్రి నారాయణ.. తన వద్ద పనిచేసే అవుల మునిశంకర్, రాపూరు సాంబశివరావు, పొత్తూరి ప్రమీల, కోతపు వరుణ్కుమార్ల పేర్లతో 55.27 ఎకరాల భూమిని కొన్నారు. నాటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరిట 38.84 ఎకరాల భూమి.., అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తన బినామీ సంస్థ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు సన్నిహితుడైన వేమూరు రవికుమార్ ప్రసాద్ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గోష్పాద గ్రీన్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ ట్రెండ్స్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ పేరిట 62.77 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. భూసమీకరణ ద్వారా రైతుల నుంచి తీసుకున్న భూముల కేటాయింపులోనూ టీడీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడింది. రాజధాని ప్రాంతంలో 850 ఎకరాల భూములను సన్నిహితుల సంస్థలకు చంద్రబాబు ధారాదత్తం చేసినట్లు లెక్కలున్నాయి. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. ♦ రాజాధాని ఫైల్స్లో శివరామకృష్ణ కమిటీతో పాటు కాగ్ ప్రస్తావనే లేదు.. కానీ వారికి నచ్చిన నారాయణ కమిటీ రిపోర్ట్ను మాత్రం కళ్లకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్.. అసలు అమరావతి గురించి శివరామకృష్ణ కమిటీ కీలకమైన అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. వాటిని పట్టించుకోకుండా బాబుగారి ఇన్నర్ గేమ్ను వెండితెరపై చూపించే ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డాడు డైరెక్టర్. ♦రాజధాని అమరావతి రాష్ట్రంపై అంతులేని భారీ ఆర్థిక భారాన్ని మోపుతుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక హెచ్చరించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తక్షణంతో పాటు భవిష్యత్తులోనూ మోయలేని ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ గుదిబండే అని కాగ్ హెచ్చరించింది. అంతేకాకుండా అమరావతిలో పేదలు, రైతులకు కౌలు చెల్లింపుల్లోనూ అక్రమాల జరిగాయని గుర్తించింది. అంతేకాకుండా అమరావతి విషయంలో శివరామకృష్ణ కమిటీ కీలంకంగా వ్యవహరించింది. ఏపీలో ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదని శివరామకృష్ణ కమిటీ తేల్చింది. ప్రభుత్వ వ్యవస్థలను ఒకేచోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్రంలో రాజధానిని, అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలని తెలిపింది. విజయవాడ-గుంటూరు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి-నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వ వ్యవస్థలను వికేంద్రీకరించాలని కోరింది. రాజధానిని రెండు పట్టణాల మధ్య పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయని హెచ్చరించింది. ఇవన్నీ సినిమాలో చూపించకుండా నారాయణ కమిటీ గురించి మాత్రమే చెబితే ఎలా డైరెక్టర్ అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ♦ అమరావతి గ్రామాలలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందన్నది పచ్చి నిజం. ఈ విషయం చిన్నపిల్లవాడికి కూడా తెలుసు. ఇంతటి దారుణమైన పాపానికి ఒడిగట్టిన చంద్రబాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతటి సూపర్ హిట్ భాగాన్ని సినిమా కథలో ఎందుకు చెప్పలేదు. చంద్రబాబు హయాంలో దళితుల నుంచి అసైన్డ్ భూములను వారికి కొంత ధర చెల్లించో, భయపెట్టో, లేక రకరకాల సందేహాలు రేపి దళితేతరులు స్వాధీనం చేసుకున్నారన్నది నిఖార్సైన వాస్తవం. 2015 ప్రారంభం నుంచి రాజధాని నిర్మాణం పేరుతో భూసమీకరణ ప్రారంభించారు. అప్పుడు పట్టా భూములకే పరిమితం అయ్యారు. కానీ 2016 ఫిబ్రవరిలో అసైన్డ్ భూములను కూడా తీసుకుంటామని జీఓ 41 తెచ్చారు. ♦ఈ మధ్యకాలంలోనే పలువురు టీడీపీ నేతలు, ఇతర వ్యక్తులు ఈ భూములను 95 శాతం వరకు కొనుగోలు చేశారు. వారికి ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నది నిజం కాదా..? సినిమాలో ఇవన్నీ ఎందుకు లేవు. ఇలా అమరావతి భూముల విషయంలో చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన మోసాల గురించి చెప్పుకుంటూ పోతే 100 అసలైన రాజధాని ఫైల్స్ సినిమాలు తీయవచ్చు అనేది నిజం. సినిమా పేరుతో అసలు నిజాలు దాచి వదిలితే నమ్మే రోజులు పోయాయని ఈ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తెలిసినట్లు లేదు. అందుకే ఇప్పుడు ఆ సినిమాను నెటిజన్లు ట్రోల్ చేస్తూ నవ్వుకుంటున్నారు. డైరెక్టర్ భానుతో పాటు చంద్రబాబుకు వీటికి సమాధానం చెప్పగలరా? ►అసలు రాజధాని ఎక్కడ పెట్టమని కేంద్రం చెప్పింది? ►ప్రభుత్వ భూములు ప్రకాశం జిల్లాలో ఉన్నాయని చెప్పినా.. బాబు ఎందుకు వినలేదు? ►కృష్ణా నది తీరం పంటలకు అనువైన భూమి, రాజధాని కట్టడం వల్ల కాంక్రీట్ జంగిల్గా మారుతుందని చెప్పినా పెడచెవిన ఎందుకు పెట్టారు? ►కృష్ణా నదిని ఆక్రమించి కట్టిన కరకట్ట ఇంట్లో బాబు ఎందుకు ఉంటున్నాడు? ►క్విడ్ ప్రో కోలా ఎక్కడ రాజధాని వస్తుందో ముందే తన పార్టీ నేతలకు చెప్పించి భూములు ఎలా కొనిపించాడు? ►పొలాలు ఇవ్వని రైతుల పంటలు తగులబెట్టిందెవరు? ►ఇంత చేస్తే బాహుబలి సినిమాలోలా గ్రాఫిక్స్ భ్రమరావతిని ఎందుకు చూపించారు? ►ఇంకెన్నాళ్లు రాజధాని పేరు చెప్పి మోసం చేస్తారు? -
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారు.. చివరకు
'అమరావతి రాజదాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది.. ఇదంతా తనకు అంతర్జాతీయగా ఉన్న పలుకుబడివల్లే .."అని 2014-2019 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పదే, పదే చెప్పుకున్న మాటలు. ఆయనకు మాటలకు తగినట్లే సింగపూర్ దేశ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ తరచు అమరావతి రావడం, చంద్రబాబుతో ముచ్చట్లు పెట్టుకోవడం, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ ను ఆరంభించడానికి ఒప్పందం చేసుకోవడం గమనించిన పలువురు నిజంగానే ఏపీ మీద, ఎపి రాజధాని మీద అభిమానంతోనే సింగపూర్ మంత్రి తరచు వస్తున్నారేమోలే అని అనుకునేవారు. కాని అప్పట్లోనే నిశితంగా పరిశీలన చేసే కొందరు మాత్రం ఇందులో ఏదో మోసం ఉందని అనేవారు. వారి మాటలను తోసిపుచ్చుతూ వారిని అమరావతి యజ్ఞాన్ని పాడుచేసే రాక్షసులు మాదిరి అని చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శిస్తుండేవారు. ఈశ్వరన్ లాగానే బిడిశెట్టి అనే మిత్రుడు కూడా చంద్రబాబుకు ఉన్నారు. ✍️ ఆయనకు కూడా ఏదో మెడికల్ హబ్ పెడతారని చెప్పి అమరావతిలో వంద ఎకరాల భూమిని తక్కువ ధరకు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. విశేషం ఏమిటంటే చంద్రబాబు మిత్రులు ఇద్దరూ అవినీతి , హవాలా కేసులలో చిక్కుకోవడం. ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కి సింగపూర్ లో అరెస్టు అవడం తదుపరి మంత్రి పదవిని కోల్పోవడం జరిగింది. బిడి శెట్టిని దుబాయి జైలులో అక్కడి ప్రభుత్వం పెట్టింది. మరో ఆసక్తికరపరిణామం ఏమిటంటే ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, రాజదాని కేసులు మొదలైనవాటిలో ఇరుకున్నారు. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయి 53 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ముగ్గురు మిత్రులు అవినీతి ఊబిలో ఉన్నారన్నమాట. సింగపూర్ లో ఈశ్వరన్ పై మొత్తం 27 అభియోగాలు వచ్చాయి. ✍️చంద్రబాబుకు సన్నిహితులైన ఈశ్వరన్ ,బిడి శెట్టి వంటివారు అరెస్టు అవడంంతో తెలుగుదేశం పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. వీరి అరెస్టుపై చంద్రబాబు స్పందించలేదు. కనీసం ఈశ్వరన్ కు సానుభూతి కూడా తెలపలేదు. అదే వైసిపికి సంబంధించినవారికి తెలిసినవారెవరైనా ఇతర దేశాలలో కేసులలో చిక్కితే ఇదే చంద్రబాబు కొండెక్కి అరిచేవారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ కేసులలో కొందరు అధికారులను పెడితే అదంతా జగన్ తో సంబంధాల వల్లే అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు తన మిత్రుల అరెస్టుపై కిక్కురుమనలేకపోతున్నారు. ఈశ్వరన్, శెట్టిల పై వచ్చిన అవినీతి కేసుల గురించి ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు కుక్కిన పేల మాదిరి నోరు మెదపలేదు. సింగపూర్ దేశ ప్రభుత్వం వారు మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇస్తున్నారని కూడా అప్పట్లో చంద్రబాబు ప్రచారం చేశారు. ✍️తీరా చూస్తే అది అసత్యమని ఆ తర్వాత తేలింది. సింగపూర్ కు చెందిన కొన్ని ప్రైవేటు కంపెనీలతో కన్సార్టియమ్ ఏర్పాటు చేసి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ తయారు చేయాలని సంకల్పించారు. మామూలుగా అయితే దానిని తప్పు పట్టనక్కర్లేదు. కాని అవేదో సింగపూర్ దేశ ప్రభుత్వ కంపెనీలే వచ్చి ఈ వెంచర్ ను ఆరంభిస్తున్నట్లు చంద్రబాబు చెబుతుండేవారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు బాకాలు ఊదుతుండేవి. తీరా చూస్తే అవి ప్రైవేటు కంపెనీలని తదుపరి వెల్లడైంది. సింగపూర్ ప్రభుత్వంతో ఆ సందర్భంలో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అందరిని విస్తుపరచింది. సింగపూర్ కంపెనీలు 300 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడితే, ఏపీ ప్రభుత్వం సుమారు 5600 కోట్ల రూపాయల మేర వ్యయం చేసి ఆ వెంచర్ కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి అంగీకరించింది. ✍️ కంపెనీతో ఏదైనా తేడా వస్తే లండన్ కోర్టులో తేల్చుకోవాలన్న కండిషన్ పెట్టారు. స్విస్ చాలెంజ్ పద్దతిన ఈ వెంచర్ కు భూమి కేటాయించినట్లు అప్పట్లో ప్రకటించారు. దీనిపై అప్పట్లో హైకోర్టు తప్పుపడితే, మళ్లీ చట్టాన్ని మార్చి మరీ తాము అనుకున్న స్కీమును చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసింది. విశేషం ఏమిటంటే 300 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీకి 56 శాతం వాటా ఇచ్చి, ఏపీ ప్రభుత్వం మాత్రం మైనర్ వాటాదారుగా ఒప్పుకోవడం. ఈ వ్యవహారంపై ఎందరు అభ్యంతరం చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు. ఏకంగా 1600 ఎకరాల భూమిని ఇందుకోసం కేటాయించారు. ✍️నిజానికి ఇలాంటి స్కీములు అమలు చేయడానికి ముందుగా వాస్తవ పరిస్థితిని సర్వే చేసి డిమాడ్ నిర్ణయించుకుంటారు. అవేవి లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేయడం అంటే, చుట్టుపక్కల ఉన్న తమ భూముల విలువలను పెంచుకోవడానికే అన్నది బహిరంగ రహస్యం. ఈ వివాదాస్పద నిర్ణయం పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చే టైమ్ కి చంద్రబాబు ప్రభుత్వం ఓటమిపాలైంది. కొత్తగా వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని విషయాలను పరిశీలించడంతో ,తమ లొసుగులు బయటపడుతున్నాయని భావించిన సింగపూర్ కంపెనీల కన్సార్షియం తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోతామని ప్రభుత్వానికి తెలియచేసింది.దాంతో ఆ కధ ముగిసింది. చంద్రబాబు,ఈశ్వరన్ కలిసి చేపట్టిన రియల్ ఎస్టేట్ వెంచర్ భాగోతం అంతా బట్టబయలైంది. ఆ తర్వాత కాలంలో ఈశ్వరన్ పై అవినీతి కేసులు వచ్చాయి. ✍️సింగపూర్ దేశం ఇలాంటి అవినీతి వ్యవహారాలను అసలు అంగీకరించదు.అందువల్లే ఆయనను పదవినుంచి తప్పించడమే కాకుండా ఆ కేసుల విచారణకుఆదేశాలు ఇచ్చారు. ఈ నేపధ్యంలో చంద్రబాబుకు సింగపూర్ లో కూడా బినామీ లావాదేవీలు ఉన్నాయని, వాటికి ఈశ్వరన్ సహకారం ఉండి ఉంటుందని, అందువల్లే ఆయనకు ఏపీలో లాభం చేకూర్చే యత్నం చేశారని వివిధ రాజకీయ పక్షాలు ఆరోపిస్తుంటాయి. ఈశ్వరన్ కు సంబంధించిన అన్ని లావాదేవీలను పరిశీలిస్తే ఇలాంటి స్కామ్ లు ఏవైనా ఉంటే బయటపడవచ్చన్న భావన కూడా ఉంది. అమరావతి రాజధానిని ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్ గా చంద్రబాబు మార్చారనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం ఉండదు. ✍️ అవసరం లేకపోయినా 34 వేల ఎకరాల భూమి సేకరించడం, వారికి ఏటా సుమారు 250 కోట్ల రూపాయల కౌలు చెల్లించవలసి రావడం, వారికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వడానికి లక్ష కోట్ల రూపాయల వ్యయం చేయాల్సి ఉండడం ..ఇవన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాని ఫలితంగానే అమరావతి ప్రాంతంతో సహా రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు భోగి మంటలు వేసుకుని, మళ్లీ అమరావతిలోనే లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. తద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాల ప్రజలకు నష్టం చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. ✍️రాష్ట్ర ప్రజల సొత్తు అంతటిని ఒక్క అమరావతిలోనే ఖర్చు చేస్తామని చంద్రబాబు, పవన్ లు చెబితే మళ్లీ ఇతర ప్రాంతాలలో వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి కుల రాజధాని అని, ఇక్కడ శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చినవారెవరైనా నివసించే పరిస్థితి ఉందా అని అడిగేవారు.కాని ఆశ్చర్యంగా ఏ రకమైన ఒప్పందం కుదిరిందో తెలియదు కాని చంద్రబాబు తో ఆయన కూడా మిలాఖత్ అయిపోయారు. ✍️ఇన్ సైడ్ ట్రేడింగ్ ,అస్సైన్డ్ భూముల స్కామ్ మొదలైనవి ఉండనే ఉన్నాయి. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కు అమరావతి అవినీతితో కూడా ఏమైనా సంబంధం ఉందా? చంద్రబాబుకు, ఆయనకు మద్య ఉన్న లావాదేవీలు ఏమిటి? అన్నవాటిపై విచారణ జరగలేదు. మొత్తం మీద అమరావతి అంటే అదొక అవినీతి కేంద్రం అన్న భావన ఏర్పడిన నేపధ్యంలో ఈశ్వరన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అలాగే శెట్టి గోల్ మాల్ వెల్లడైంది. వీటిపై చంద్రబాబు వివరణ ఇచ్చి, ఆ తర్వాత అమరావతి గురించి మాట్లాడితే జనం అప్పుడు ఆయన చెప్పిన మాటలలోని విశ్వసనీయత గురించి ఆలోచిస్తారు. లేకుంటే కచ్చితంగా ఈ అవినీతి ఊబిలో చంద్రబాబు బృందానికి కూడా ఏదో లింక్ ఉందని అనుమానిస్తారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
అక్రమాల పుట్ట ‘అమరావతి’
సాక్షి, అమరావతి: ఆశ్రిత పక్షపాతం.. అవినీతి.. అధికార దుర్వినియోగం.. వెరసి అమరావతిని మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పుట్టగా మార్చేశారు. అడ్డగోలు నిర్ణయాలతో అమరావతిని భ్రష్టు పట్టించారు. రాజధాని ఇక్కడా.. అక్కడా అంటూ లీకులిచ్చి స్కాములకు బీజం వేశారు. రాజధాని ఎంపిక నుంచి భూముల కొనుగోళ్లు, భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్), ప్రైవేట్ సంస్థలకు కేటాయింపు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారం వరకు ఏది తవ్వినా టన్నుల కొద్దీ అవినీతి పుట్ట బద్ధలవుతోంది. అధికార రహస్యాలను బయటకు వెల్లడించనని, రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని, తన, పర బేధం చూడనని చేసిన ప్రమాణాన్ని (ఓత్ ఆఫ్ సీక్రసీ) ఉల్లంఘించి అమరావతిని అక్రమాల అడ్డాగా మార్చేసిన తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో ప్రజలు నివ్వెరపోతున్నారు. అమరావతిలో జరిగిన అసైన్డ్ భూముల స్కామ్ తాజాగా సీఐడీ దర్యాప్తులో బట్టబయలవడం, ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి భూముల కేటాయింపుల వరకు చోటు చేసుకున్న అక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గ ఉపసంఘం నుంచి సీఐడీ, ఈడీ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వరకు ఏ నివేదికను పరిశీలించినా అమరావతి అక్రమాల పుట్ట అని, చంద్రబాబు పర్యవేక్షణలోనే ఇవన్నీ జరిగాయని నిగ్గు తేలుతోంది. రాజధాని ముసుగులో సాగిన ఇన్సైడర్ ట్రేడింగ్ లబ్ధిదారులు గత సర్కారు పెద్దలు, మాజీ మంత్రులు, టీడీపీ నేతలే అన్నది జగమెరిగిన సత్యం. ఈ జాబితాలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ నరేంద్ర, చంద్రబాబు కరకట్ట నివాసం యజమాని లింగమనేని రమేష్, లంకా దినకర్, కంభంపాటి రామ్మోహన్రావు, పుట్టా మహేష్ యాదవ్ తదితరులున్నారు. అమరావతి భూ కుంభకోణాన్ని మంత్రివర్గ ఉపసంఘం తవ్వి తీయడం తెలిసిందే. ఉపసంఘం నివేదికతో రంగంలోకి సీఐడీ మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశించింది. రాజధాని పేరుతో లీకులు ఇచ్చి కారుచౌకగా భూములు కొట్టేసి ఆ తర్వాత ల్యాండ్ ఫూలింగ్తో ఆర్థికంగా లబ్ధి పొందిన అక్రమార్కుల జాబితాను సీఐడీ రూపొందించింది. రాజధాని ప్రకటనపై ముందస్తు సమాచారంతో క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్లో తక్కువ ధరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేసినట్లు నివేదికలో పేర్కొంది. రూ.కోట్లు విలువైన భూములను పేద వర్గాలు (797 మంది తెల్లకార్డుదారులు) కొనుగోలు చేయడం వెనుక బినామీలు టీడీపీ నాయకులేనని నిగ్గు తేల్చింది. నిజమైన పేదలే అయితే వారికి అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? ఒకవేళ డబ్బున్న వారైతే తెల్లకార్డులు ఎలా పొందారు? అనే కోణంలో విచారించిన సీఐడీ అధికారులు ఆదాయ పన్ను శాఖ, రెవెన్యూ యంత్రాంగం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లకు నివేదికలు అందించడంతో ఆయా విభాగాలు తమదైన రీతిలో విచారణ సాగించాయి. అక్రమాల చిట్టా... చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బినామీ వేమూరి రవికుమార్ కుటుంబం పేరుతో 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు. లింగమనేని రమేష్ తన భార్య, బంధువుల పేర్లతో భూములు కొన్నారు. మాజీ మంత్రి నారాయణ తన సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణకుమార్ పేర్లతో 55.27 ఎకరాలు కొనుగోలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ బినామీ పేర్లతో 68.6 ఎకరాలు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరుతో 37.84 ఎకరాలు, మాజీ మంత్రి రావెల కిశోర్బాబు మైత్రీ ఇన్ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు నిర్థారణ అయ్యింది. బినామీలకు భారీ లబ్ధి చేకూర్చేలా.. టీడీపీ నేతలు, వారి బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు సర్కారు రాజధాని సరిహద్దులను కూడా మార్పు చేసినట్లు సీఐడీ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారించింది. భూ కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. బినామీలు, నేతల భూములకు ప్రయోజనం చేకూర్చేలా రాజధానిని ఏర్పాటు చేశారని తేటతెల్లమైంది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు తేలింది. 4,070 ఎకరాల భూములను ఇన్సైడర్ ట్రేడింగ్లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఎదుర్కోలేక అడ్డుకునే ప్రయత్నాలు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి తాజాగా సీఐడీ నమోదు చేసిన అసైన్డ్ భూ కుంభకోణం వరకు దర్యాప్తును ఎదుర్కొనేందుకు చంద్రబాబు అండ్కోకు ధైర్యం లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వ్యవస్థల ద్వారా దర్యాప్తును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్లో టీడీపీ పెద్దలతోపాటు వారికి మద్దతుగా నిలిచిన ప్రముఖుల గుట్టు రట్టు కావడంతో సీఐడీ, ఏసీబీ, సిట్ దర్యాప్తులను గతేడాది అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. చదవండి: పేదలను బెదిరించారు..‘అసైన్డ్’ కాజేశారు -
అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్
-
ప్రభుత్వ భూములూ మింగేశారు!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు అమరావతిలో సాగించిన భూదోపిడీలో తవ్వుతున్న కొద్దీ కొత్త అక్రమాలు గుట్టలు గుట్టలుగా బయట పడుతున్నాయి. అసైన్డ్ భూములే కాకుండా ప్రభుత్వ భూములనూ వదల్లేదు. చంద్రబాబు, పి.నారాయణ, లోకేశ్ త్రయం బినామీల పేరిట కొల్లగొట్టిన భూముల జాబితా చాంతాడులా సాగుతోంది. అసైన్డ్ రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే వారి భూములను రాజధాని కోసం టీడీపీ సర్కారు తీసుకుంటుందని బెదిరించి రూ.3,370 కోట్ల విలువైన 617 ఎకరాలను కొల్లగొట్టిన కుంభకోణాన్ని ‘సాక్షి’ ఇప్పటికే బట్టబయలు చేయడం తెలిసిందే. అయితే అసైన్డ్ రైతులే కాకుండా అమరావతిలోని ప్రభుత్వ భూములను సైతం తమ బినామీల పేరిట నమోదు చేసి చంద్రబాబు బృందం భూదోపిడీకి పాల్పడటం ‘సాక్షి’ పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా 328 ఎకరాల ప్రభుత్వ భూమిని 522 మంది బినామీల పేరిట హస్తగతం చేసుకున్నారు. అనంతరం భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.760.25 కోట్లను కాజేశారు. చంద్రబాబు, నారాయణ, లోకేశ్ అసైన్డ్ భూ దోపిడీలో ఆ అవినీతి పర్వం ఇదిగో ఇలా ఉంది.... రెండు కేటగిరీలుగా వర్గీకరించి.. రాజధాని పేరుతో అమరావతి పరిధిలో సర్వే చేయించిన చంద్రబాబు, నారాయణ దృష్టి ఆ ప్రాంతంలోని ప్రభుత్వ భూములపై పడింది. అసైన్డ్ భూములను 1 నుంచి 4 కేటగిరీల కింద విభజించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి తీసుకోగా ఎవరి ఆధీనంలోనూ లేని ప్రభుత్వ భూములను దక్కించుకునేందుకు మరో పన్నాగం పన్నారు. ఆ ప్రభుత్వ భూములన్నీ గుర్తు తెలియని రైతుల ఆధీనంలో ఉన్నట్లు రికార్డుల్లో చూపించారు. వాటిని అసైన్డ్ భూముల జాబితాలో 5, 6 కేటగిరీల కింద పేర్కొన్నారు. అన్యాక్రాంతమైనప్పటికీ అభ్యంతరాలు లేని భూములను కేటగిరీ 5 కింద, అన్యాక్రాంతమై అభ్యంతరాలున్న భూములను కేటగిరీ 6 కింద చూపిస్తూ జీవో 41 జారీ చేశారు. ఆ భూములకు భూసమీకరణ ప్యాకేజీని ప్రకటించారు. కేటగిరీ 5 కింద భూములకు 500 చ.గజాల నివాస స్థలం, 100 చ.గజాల వాణిజ్య స్థలాన్ని ప్యాకేజీగా పేర్కొన్నారు. కేటగిరీ 6 కింద భూములకు 260 చ.గజాల నివాస స్థలాన్ని ప్యాకేజీగా ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు ఎకరా కంటే తక్కువ ఉన్న భూములకు కూడా కనీసం ఎకరా ప్యాకేజీ వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు. 328 ఎకరాలు... రూ.760.25 కోట్ల ప్యాకేజీ అనంతరం అసలు కథను తెరపైకి తెచ్చారు. అమరావతి పరిధిలో కేటగిరీ 5 కింద 237.60 ఎకరాలను గుర్తించారు. ఆ భూములన్నీ 295 మంది ఆధీనంలో ఉన్నట్టుగా చూపించారు. ఇక కేటగిరీ 6 కింద 90.52 ఎకరాలను చూపించారు. ఆ భూములు 227 మంది స్వాధీనంలో ఉన్నట్టుగా కనికట్టు చేశారు. వాస్తవానికి ఆ రెండు కేటగిరీల భూములు ఎవరి ఆధీనంలోనూ లేవు. కానీ ఆ భూములు 522 మంది తమ బినామీల ఆధీనంలో ఉన్నట్టుగా చూపించి భూసమీకరణ ప్యాకేజీని కొల్లగొట్టారు. అమరావతిలో ప్యాకేజీ ప్రకటించే నాటికి నివాస స్థలం చ.గజం రూ.30 వేలు, వాణిజ్య స్థలం చ.గజం రూ.50 వేలు చొప్పున మార్కెట్ ధర పలికింది. అమరావతి నిర్మాణం పూర్తయితే మార్కెట్ ధర మరింత పెరుగుతుంది. అప్పటి ధరనే తీసుకుంటే కేటగిరీ 5 కింద ఒక్కొక్కరికీ రూ.1.50 కోట్ల విలువైన నివాస స్థలం, రూ.50 లక్షలు విలువైన వాణిజ్య స్థలం వెరసి రూ.2 కోట్లు చొప్పున ప్యాకేజీ దక్కింది. ఆ ప్రకారం కేటగిరీ 5 కింద ఉన్న 295 మంది రూ.590 కోట్ల విలువైన స్థలాలను పొందారు. కేటగిరీ 6 కింద ఒక్కొక్కరికీ రూ.75 లక్షలు విలువైన నివాస స్థలం ఇచ్చారు. ఆ ప్రకారం 227 మందికి రూ.170.25 కోట్ల విలువైన స్థలాలు దక్కాయి. మొత్తం మీద కేటగిరీ 5, 6లలో రైతులుగా చూపించిన తమ బినామీలు 522 మంది ముసుగులో చంద్రబాబు, నారాయణ రూ.760.25 కోట్ల విలువైన స్థలాలను కొల్లగొట్టినట్లు స్పష్టమైంది. ఆ గ్రామాల్లో ఒక్కరూ లేరు అమరావతి భూదోపిడీపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తులో అసైన్డ్ భూకుంభకోణం ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ కార్యాలయాల్లో ఉన్న భూముల రికార్డులు, సీఆర్డీయే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించిన రైతుల జాబితాలను సిట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేటగిరీ 5, 6లలో చూపించిన 522 మంది రైతుల్లో ఒక్కరు కూడా అమరావతి గ్రామాల్లోనే లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించిన రైతులెవరూ లేరు. భూసమీకరణ ప్యాకేజీ కింద రాజధానిలో అత్యంత విలువైన స్థలాలను కాజేసేందుకే చంద్రబాబు ముఠా ఈ పన్నాగానికి పాల్పడిందన్నది ఆధారాలతోసహా నిర్ధారణ అయ్యింది. -
చంద్రబాబును జైల్లో విచారణ చేసేందుకు కోర్టు అనుమతి..!
-
చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న CID
-
చంద్రబాబు ప్లాన్ అట్టర్ప్లాప్.. ఆంధ్రజ్యోతి ఎంత పనిచేసింది!
ఇది అందరూ తెలుసుకోవలసిన విషయం. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక ప్రచారం చేశారు. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఒక ఎకరా అమ్మితే ఏపీలో వంద ఎకరాలు కొనవచ్చని. అంతలా తెలంగాణలో రేట్లు పెరిగిపోయాయని, ఏపీలో ధరలు దెబ్బతిన్నాయన్నది ఆయన చెప్పిన మాట. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయన ఈ అవకాశాన్ని వాడుకున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయనకు మద్దతు ఇచ్చే ఆంధ్రజ్యోతి దిన పత్రిక హైదరాబాద్లో హెచ్ఎండీఏ వేలంపాటలో విపరీతమైన రేట్లను కొందరు పెట్టడంపై ఒక కథనాన్ని ఇస్తూ అదంతా రియల్ ఎస్టేట్ మాఫియా పని అని, నిజానికి రేట్లు పెరిగినట్లు చూపి తమ భూముల విలువ పెంచుకునే కుట్ర అని వెల్లడించింది. అంతేకాక, గజం లక్ష రూపాయలకో, లేక ఎకరా వంద కోట్లకో పాట పాడినవారు చాలా మంది అసలు ఆ తర్వాత డబ్బులే చెల్లించడం లేదని తెలిపింది. కేవలం ఒక లక్ష రూపాయల డిపాజిట్ కట్టి ఈ తంతు సాగిస్తున్నారని తెలియచేసింది. తెలంగాణ ప్రాంతంలో ఈ కథనాన్ని ఇచ్చిన ఆ పత్రిక ఏపీలో మాత్రం ఇవ్వకుండా జాగ్రత్తపడింది. బాబు బూమ్ మాయ.. ఇక్కడ మాత్రం చంద్రబాబు చెప్పిన విషయానికి మాత్రం ప్రాధాన్యం ఇచ్చారు. దీనిని బట్టి ఒకటి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ మాఫియాలకు అనుకూలంగా ఉంటారని అనుకోవచ్చు కదా!. ఎందుకంటే అమరావతి రాజధాని గ్రామాల్లో అచ్చంగా ఇలాగే రియల్ ఎస్టేట్ కృత్రిమ బూమ్ కోసం చంద్రబాబు కృషి చేశారని అప్పట్లో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో రాజధాని గ్రామాలలో తెల్లవారేసరికి భూముల విలువ ఐదు నుంచి పది రెట్లు పెరిగిపోయాయి. అబ్బో అదంతా చంద్రబాబు ఘనతే అని ఆయనకు మద్దతు ఇచ్చే పత్రికలు, టీవీలు ఊదరగొట్టాయి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్పై ఆంధ్రజ్యోతి రాసిన ఈ కథనం చూస్తే కారణం ఏమైనా కానీ.. కొంత వాస్తవమే ఉన్నట్లు అనిపిస్తుంది. మేడిపల్లి అనే చోట జరిగిన హెచ్ఎండీఏ వేలంపాటలో నారాయణమూర్తి అనే వ్యక్తి గజం యాభై వేలకు ప్లాట్ కొన్నారట. ఆ తర్వాత ఆయన హెచ్ఎండీఏ ఆఫీస్కు వెళ్లి తన పక్క ప్లాట్ల వారి గురించి ఆరా తీశారట. అప్పుడు అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారట. తనతో పాటు ఆయా ప్లాట్లను వేలంలో అధిక ధరకు కొనుగోలు చేసినవారిలో ఎనభై శాతం అసలు డబ్బు చెల్లించలేదట. లక్ష రూపాయల డిపాజిట్ కూడా వదలుకోవడానికి సిద్దపడటంలో రహస్యం వారి ఆ చుట్టుపక్కల ఉన్న ఆస్తుల విలువను పెంచుకోవడానికి ప్రయత్నిస్తుండటమేనట. రియల్ ఎస్టేట్ ట్రిక్స్.. ఫ్రీలాంచ్ ఆఫర్ల పేరుతో తమ విల్లాలు, అపార్టుమెంట్లను అమ్ముకోవడానికి అత్యాశతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేలం మాఫియాగా మారారని ఆ పత్రిక రాసింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత సుమారు లక్ష ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చింది. దాంతో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ రంగం సబ్దుగా మారిందని, ఆ నేపథ్యంలోనే ఇలాంటి ట్రిక్కులను ప్లే చేస్తున్నారని మీడియా రాసింది. ఇంకో విశేషం ఏమిటంటే తెలంగాణలో 2023 మొదటి నాలుగు నెలల్లో గత ఏడాది కన్నా రిజిస్ట్రేషన్లు తగ్గాయట. ఆదాయం కూడా 150 కోట్లు తక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఈ రియల్ మాఫియాకు ప్రభుత్వ సహకారం కూడా ఉందని ఈ పత్రిక ఆరోపించింది. మార్కెట్ దెబ్బతిందన్న భావన కలగకుండా ఉండడానికి ప్రభుత్వం అలా చేస్తోందని రాశారు. మోకిలా అనేచోట హెచ్ఎండీఏ వేసిన ప్లాట్ల వేలంలో కూడా ఇలాగే స్కామ్ జరిగిందని మీడియా చెబుతోంది. ఒకే సంస్థకు చెందిన పదిహేను మంది అక్కడ గజం 35వేల రూపాయల వరకు వెళ్లవచ్చని అనుకుంటే అరవైఐదు వేల నుంచి లక్ష రూపాయలవరకు పెట్టారట. తీరా చూస్తే ఆ సంస్థకు ఆ పక్కనే 350 ఎకరాల భూమి ఉందట. హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త మందగించిందని, అంతర్జాతీయంగా ఉన్న ఆర్ధిక సంక్షోభం కొంత కారణమని, ఐటి రంగంలో ఉన్న ఒడిదుడుకులు తోడవుతున్నాయని.. ఇలా రకరకాల రీజన్స్ చెబుతూ కొంతకాలం క్రితం ఒక టీవీ చానల్ కూడా కథనాన్ని ఇచ్చింది. టీడీపీ మాఫియా పని.. ఇదే టైమ్లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఏ పరిణామం జరిగినా అదంతా తన ఘనతేనని చెప్పుకుంటారు. నిజానికి ఆయన ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం సీఎంగా ఉన్నారు. అప్పటికి, ఇప్పటికి ఎంతో తేడా వచ్చింది. ఆయన టైమ్లో మాదాపూర్ వరకు పూర్తి స్థాయిలో రోడ్డు కూడా లేదు. వైఎస్సార్ వచ్చాక దానిని పెద్ద ఎత్తున విస్తరించారు. ఆ విషయాలు పక్కనబెడితే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని గ్రామాలలో కూడా ఇలాంటి మాఫియా వారినే ప్రోత్సహించారన్న అభిప్రాయం కలగదా?. వెలగపూడి చుట్టుపక్కల రాజధాని అని ప్రకటించేలోపే ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగి తక్కువ ధరకు కొందరు టీడీపీ నేతలు భూములు కొన్నారని ఆరోపణ వచ్చింది. తదుపరి ఆ భూములను అధిక ధరలకు అమ్ముకుని కొందరు లాభ పడ్డారు. పది, పదిహేను లక్షల రూపాయల చొప్పున ఎకరా భూమి అమ్ముడు పోయిన పరిస్థితి నుంచి ఏకంగా ఎకరా ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలకు అమరావతి గ్రామాలలో వెళ్లింది. ఆనాటి మంత్రి నారాయణ, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పలుమార్లు ఎకరం నాలుగు కోట్ల వరకు పలుకుతోందని, అదంతా తమ ఘనత అని చెప్పుకునేవారు. అసలు రాజధానికి సంబంధించిన భవనాలే రాకముందే అంతంత ధర ఎలా వచ్చింది. ఆ చుట్టుపక్కలే, చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ కంపెనీ భూములు కొనడం, నారాయణ తన బినామీల పేరుతో భూములు కొనడం ఏమిటి?. అమరావతితో రియల్ దందా.. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అచ్చంగా మాఫియాలా మారారన్న విమర్శలు అప్పట్లో కూడా వచ్చాయి కదా?. చంద్రబాబు ప్రభుత్వం కొన్ని ప్రైవేటు సంస్థలకు చాలా తక్కువ ధరకు భూముల ఇచ్చి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మాత్రం ఎకరా నాలుగు కోట్ల రూపాయల ధర పెట్టడంలోని హేతుబద్దత ఏమిటన్న ప్రశ్నలుకూడా వచ్చాయి. అమరావతి గ్రామాలలో మాత్రమే రియల్ ఎస్టేట్ రేట్లు పెరగడానికి అప్పట్లో మిగిలిన ప్రాంతాన్ని గ్రీన్ జోన్గా ప్రకటించడం జరిగిందని చెబుతారు. దానివల్ల చాలా రాజధానియేతర గ్రామాలలో పొలాలు అమ్ముకోవడమే కష్టం అయ్యేది. ధరలు కూడా పడిపోయాయి. అయినా ఇప్పటికీ చంద్రబాబు అమరావతి మోడల్ గురించే ప్రచారం చేస్తుంటారు. లక్షల కోట్లు వ్యయం చేస్తేకానీ.. తయారు కాని అమరావతిని సంపద సృష్టించే నగరంగా ప్రచారం చేసుకుంటారు. ఏది ఏమైనా హైదరాబాద్లో అయినా, అమరావతి గ్రామాలలో అయినా కృత్రిమంగా విలువలు పెంచుకోవడంలో ఉన్న మతలబు ఇది అని తెలిసిన తర్వాత అంతా ముక్కున వేలేసుకోవలసిందే. అలాంటివాటిని తన ఘనతగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు గురించి ఏమనుకోవాలి?. కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్. -
సీఎం జగన్ గురించి ఎమోషనల్ అయిన లబ్దిదారురాలు
-
ఆ రోజులు పోయాయి.. ఇక మీ ఆటలు సాగవు
-
1400 ఎకరాల్లో... 47 వేల మందికి ఇళ్ల నిర్మాణాలు..!
-
ఈ నెల 24న అమరావతిలో పేదల ఇళ్ళకి శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
-
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలపై హైకోర్టులో విచారణ
-
కరకట్ట సాక్షిగా క్విడ్ ప్రో కో
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణం కచ్చితంగా క్విడ్ ప్రో కోనే అన్నది స్పష్టమైంది. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే అన్నది తేటతెల్లమైంది. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్లో భూములు దక్కాయని తేలిపోయింది. సీడ్ క్యాపిటల్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారులో ఏ–3 లింగమనేని రమేశ్ కుటుంబానికి నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం చేకూర్చినందుకే వారిద్దరికీ ఆ ఆస్తులు దక్కాయనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం పేర్కొంది. క్విడ్ప్రోకో అభియోగాలను కొట్టివేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం స్పష్టం చేసింది. చంద్రబాబు కరకట్ట నివాసం, నారాయణకు అమరావతిలో ఉన్న ప్లాట్లు, కౌలు, బ్యాంకులో ఉన్న నిధుల అటాచ్మెంట్కు అనుమతినిస్తూ తాజాగా ఇచ్చిన ఉత్తర్వులలో న్యాయస్థానం కీలక అంశాలను వెల్లడించింది. ఈ కుంభకోణంలో చంద్రబాబు, నారాయణ అంతా తామై నడిపిన వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. అంతా ఏ–1 చంద్రబాబే అమరావతి మాస్టర్ప్లాన్, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంతా నాటి సీఎం, ఈ కేసులో ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో సీఆర్డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరించిన చంద్రబాబుకు మాస్టర్ప్లాన్ గురించి మొత్తం ముందే తెలుసని న్యాయస్థానం స్పష్టం చేసింది. మాస్టర్ప్లాన్పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే అని పేర్కొంది. అంతేకాదు రాజధాని ఎంపిక, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో ఆయనకు పూర్తి భాగస్వామ్యం ఉందని తేల్చి చెప్పింది. అలైన్మెంట్ మూడుసార్లు మార్పు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్ప్రోకోకు పాల్పడటంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మూడుసార్లు మార్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టంచేసింది. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్రింగ్ అలైన్మెంట్లో మార్పులు చేశారని న్యాయస్థానం వెల్లడించింది. ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నది నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ కుటుంబానికి ఇన్నర్రింగ్ రోడ్డు తుది అలైన్మెంట్ను ఆనుకునే 168.45 ఎకరాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించారా లేదా అన్నదానితో దీనికి సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లేని ఇన్నర్రింగ్ రోడ్డుపై కేసులు పెట్టడం ఏమిటంటూ టీడీపీ నేతలు ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారు. అయితే ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేదని, లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్మెంట్ను ఖరారు చేసినట్లు న్యాయస్థానం వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైంది. టీడీపీ 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే అదే అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్రింగ్ రోడ్డును నిర్మించి లింగమనేని కుటుంబానికి భారీగా లబ్ధి కలిగించేదన్నది స్పష్టం. కరకట్ట కట్టడం.. క్విడ్ప్రోకో కిందే చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో ఏడేళ్లుగా నివసిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు. ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు నెరపలేదని న్యాయస్థానం వెల్లడించడం గమనార్హం. అంటే ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదన్నది స్పష్టం. కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవం అని దీంతో తేలిపోయింది. ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చారు. రాజధాని మాస్టర్ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. హెరిటేజ్ భూముల లావాదేవీలు గోప్యం లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేస్తున్నట్టు చూపిస్తున్న భూముల బాగోతం కూడా బట్టబయలైంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు లింగమనేని కుటుంబం భూములు అమ్మినట్టు ఎలాంటి లావాదేవీలను చూపించలేదని న్యాయస్థానం పేర్కొంది. రాజధాని ప్రాంతంలో లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి లావాదేవీలను చంద్రబాబు వెల్లడించలేదని వ్యాఖ్యానించింది. లోకేశ్దీ కీలక పాత్రే... క్విడ్ ప్రోకో కింద అమరావతిలో లింగమనేని కుటుంబం భూములను హెరిటేజ్కు బదలాయించడంలో నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారన్నది బట్టబయలైంది. లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. హెరిటేజ్ డైరెక్టర్గా లోకేశ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసంలోనే నివసించారు. అంటే లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించి క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్ క్రియాశీల పాత్ర పోషించారన్నది స్పష్టమైంది. కథ నడిపిన ఏ–2 నారాయణ అమరావతి మాస్టర్ప్లాన్, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందినట్లు స్పష్టమైంది. మాస్టర్ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని, అంతా ఆయన ఆధ్వర్యంలోనే సాగిందని న్యాయస్థానం వెల్లడించింది. నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్ క్యాపిటల్లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపింది. వారు తన కుటుంబ సభ్యులు, బంధువులు అనే విషయాన్ని నారాయణ గోప్యంగా ఉంచారని వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు సీఆర్డీయేకే భూసమీకరణ కింద ఇచ్చి 75,888 చ.గజాల ప్లాట్లు పొందారని తెలిపింది. ఆ భూములపై కౌలు కింద రూ.1.92కోట్లు కూడా పొందారని పేర్కొంది. అంతా క్విడ్ ప్రోకోనే.. అమరావతి మాస్టర్ప్లాన్, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పుల ద్వారా చంద్రబాబు, నారాయణ లింగమనేని రమేశ్తో క్విడ్ప్రోకోకు పాల్పడ్డారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో క్విడ్ప్రోకోకు పాల్పడలేదంటూ లింగమనేని రమేశ్ చేసిన వాదనను తోసిపుచ్చింది. ఈ కేసును కొట్టి వేయాలన్న ఆయన వాదనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరకట్ట నివాసం, సీడ్ క్యాపిటల్లో నారాయణ కుటుంబ సభ్యులకు కేటాయించిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేసేందుకు అనుమతినిచ్చింది. -
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ
-
అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
మోసాల నారా చంద్రబాబును మాత్రం నమ్మొద్దు: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: పేద లబ్ధిదారులకు అందించబోయే ఇళ్ల పట్టాలు.. మహిళల పేరు మీదే ఉండబోతున్నాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అయితే పేదలకు మంచి జరగకుండా అడ్డుకున్న చంద్రబాబునాయుడు అండ్ కోపై వెంకటపాలెం బహిరంగ సభ వేదికపై మండిపడ్డారు సీఎం జగన్. ఏపీలో అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ. 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల సంపద ఉంచాం. ఇళ్ల స్థలాలతో పాటు 5 వేల టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తున్నాం. సీఆర్డీఏ ప్రాంతంలోనే నాలుగు వందల కోట్ల ప్రభుత్వ వ్యయంతో ఐదు వేల ఇళ్లను నిర్మిస్తున్నాం. రూపాయికే అన్ని హక్కులతో టిడ్కో ఇళ్లు అందజేస్తున్నాం. గత ప్రభుత్వ పాలకులు ఎప్పుడైనా ఇలాంటి మంచి ఆలోచన చేశారా? అని సీఎం జగన్ సభా వేదిక నుంచి నిలదీశారు. నరకాసురుడినైనా నమ్మొచ్చుగానీ.. సీఎం చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని.. దొంగల ముఠా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే యత్నం చేసింది. చంద్రబాబు హయాంలో పేదలకు సెంటు భూమి ఇవ్వలేదు. ఇళ్ల స్థలాల విషయంలోనూ మోసమే చేశారు. 2014 నుంచి 2019 వరకు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. తన హయాంలో చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేశారు. ఎన్నికలు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారు. మళ్లీ మోసపూరిత ప్రేమ చూపడానికి బాబు సిద్ధమవుతున్నారు. గజ దొంగల ముఠా ఏకమవుతోంది. ఐదేళ్ల చంద్రబాబు పాలనంతా దోచుకో.. పంచుకో.. తినుకో మాత్రమే. గతంలో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి, అందర్నీ మోసం చేశాడు. ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ.. మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు. సామాజిక వర్గాలు మీద మోసపూరిత ప్రేమ చూపిస్తాడు. వారికోసమే మేనిఫెస్టో అని చంద్రబాబు అంటాడు. మోసం చేసేవాడ్ని ఎప్పుడూ కూడా నమ్మకండి. నరకాసురుడినైనా నమ్మొచ్చు కాని, నారా చంద్రబాబునాయుడ్ని మాత్రం నమ్మకూడదు అంటూ ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. మంచి చేసే ప్రభుత్వం ఇది కోవిడ్ కష్టకాలంలోనూ ఎక్కడా రాజీపడలేదు. అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం పని చేశా. కోవిడ్ సమయంలోనూ 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. నవరత్నాల్లోని ప్రతీ హామీని అమలు చేశాం. మ్యానిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించాం. ఇచ్చిన 98 శాతం హామీలను అమలు చేశాం. ఈ నాలుగేళ్లలో అవినీతి, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. డీబీటీ ద్వారా నేరుగా రూ. 2.11 లక్షల కోట్లు అందజేశాం. నాన్ డీబీటీతో మొత్తం రూ. 3 లక్షల కోట్లు అందించాం. ఇంత మంచి జరుగుతుంటే.. గజ దొంగల ముఠా చూడలేకపోతోంది. చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5.. వీళ్లకు తోడు దత్తపుత్రుడు గజదొంగల ముఠా ఏకమవుతోంది. పేదలకు మంచి చేయాలనే ఆలోచన వీళ్లకు లేదు. ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో ఒక్క రూపాయి అవినీతి, వివక్ష లేదు. మా అక్క చెల్ల్మెల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.11లక్షల కోట్లు జమచేశాం. అప్పుల వృద్ధిరేటు చూస్తే… గత ప్రభుత్వం కన్నా.. తక్కవే. మరి చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరగలేదు?. ఎందుకంటే.. వారికి మంచి చేసే ఉద్దేశం లేదు కాబట్టి. ఆ దొంగల ముఠా దృష్టిలో అధికారంలోకి రావడం అంటే.. దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి మాత్రమే. దారుణాలను వాళ్లు రాయరు, చూపరు, ప్రశ్నిస్తామన్న వాళ్లు ప్రశ్నించరు. ఇదీ చంద్రబాబు హయాంలో మాయ. ఈరోజు కులాల మధ్య యుద్ధం జరగడంలేదు, జరుగుతున్నది క్లాస్ వార్. ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపే పేదవాళ్లకు మంచి జరగకూడదని కోరుకుంటూ పెత్తందార్లు యుద్ధం చేస్తున్నారు. పేదవాడికి ఇళ్లస్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి యుద్ధం చేస్తారు. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదనలు చేశారు. జగన్ మాదిరిగా పాలన చేస్తే.. రాష్ట్రం శ్రీలంక పోతుందని ఎల్లోమీడియాలో రాస్తారు.. చూపుతారు. పేదల బ్రతులకు మారాలని పరితపిస్తున్న ప్రభుత్వం మనది అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఇదీ చదవండి: ఇది పేదల విజయం.. ఇక సామాజిక అమరావతి: సీఎం జగన్ -
ఇది పేదల విజయం.. ఇక సామాజిక అమరావతి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ‘‘దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టులకెక్కి అడ్డుకున్నారు. పేదల కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వమే న్యాయపోరాటం చేసింది. ఇది పేదల విజయం’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివర్ణించారు. శుక్రవారం అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. వెంకటపాలెం బహిరంగ సభ నుంచి సీఎం జగన్ ప్రసంగించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేదల కోసం న్యాయ పోరాటం చేశాం. విజయం సాధించాం. ఇప్పుడు రూ. ఏడు లక్షల నుంచి 10 లక్షల విలువ చేసే ఇంటి స్థలం.. అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుంది. మన అందరి అమరావతి అవుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నా అని ప్రసంగించారాయన. 👉 ఇవి ఇళ్ల పట్టాలే కాదు.. సామాజిక, న్యాయ పత్రాలు కూడా. సామాజిక అమరావతే.. మనందరి అమరావతి. 50, 793 మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తున్నాం. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో మొత్తం 25 లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. వారం పాటు ఇళ్ల పట్టాల పండు కార్యక్రమం ఉంటుందని, ఇళ్లు కట్టడానికి బీజం కూడా ఈ వారంలోనే పడుతుందని అని సీఎం జగన్ ప్రకటించారు. 👉 దివంగత మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా.. జులై 8వ తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే లే అవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయని, జులై 8వ తేదీ లోగా జియో ట్యాగింగ్ పూర్తి చేస్తామని తెలిపారాయన. 👉 ఇళ్ల నిర్మాణాలకు మూడు ఆప్షన్లు ఉంటాయని సీఎం జగన్ వెల్లడించారు. సొంతంగా ఇళ్లు కట్టుకుంటే.. రూ. లక్షా 80 వేలు బ్యాంకు ఖాతాల్లో వేస్తాం. రెండో ఆప్షన్లో నిర్మాణ కూలీ మొత్తాన్ని జమ చేస్తాం. ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుంది. స్టీల్, సిమెంట్, డోర్ ఫ్రేమ్లు సబ్సిడీపై అందిస్తాం. మెటీరియల్ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు అని సీఎం జగన్ ప్రకటించారు. -
ఇళ్ల పట్టాల పంపిణీ.. పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
-
చంద్రబాబు, ఎల్లో మీడియాకు మా తడాఖా ఏంటో చూపిస్తాం..
-
CM YS Jagan:పెత్తందారుల కుట్రలు చేధించి మరీ..
తాము మాత్రమే బాగుండాలనేది పెత్తందారుల తత్వం.. అందుకే న్యాయపరమైన అడ్డంకులు సృష్టించారు కోర్టులో కేసులు వేయించి.. పట్టాల పంపిణీ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారు పైగా అమరావతిలో పేదలకు స్థానంలేదని తక్కువచేసి మాట్లాడారు.. పేదలకు ఇళ్లిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వక్రభాష్యాలు చెప్పారు.. చివరకు.. ప్రభుత్వం ఇస్తున్న సెంటు స్థలాలను సమాధులని కూడా అవహేళన చేశారు. యెల్లో మీడియా సైతం ఆ కుటిల యత్నాలకు వంతపాడింది.. కానీ, ఇలాంటి ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రేలాపనలు చేసినా.. జగనన్న పట్టించుకోలేదు. విపత్కర పరిస్థితుల్లోనూ ఆ అంశంపైనే దృష్టి పెట్టారు. పేద అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలన్నది ఆయన అభిమతం. నిలువ నీడలేని వారికి సొంత గూడు ఇవ్వాలన్నదే ఆయన ఉద్దేశం. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఇవ్వాలన్నది జగనన్న లక్ష్యం. పేద కుటుంబాల భవిష్యత్తు బాగుండాలన్న కృతనిశ్చయంతో అడ్డంకులన్నీ అధిగమించారు. ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రతిపక్ష పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం జగన్ ఆగిపోలేదు. పేద కుటుంబాల ముఖాల్లో సంతోషం చూడాలనే ధృడ సంకల్పంతో ముందుకు సాగారు. ఫలితంగా.. అమరావతిలో 50,793 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరగనుంది. తుళ్లూరు(గుంటూరు) మండలం వెంకట పాలెంలో ఏర్పాటుచేసిన వేదిక నుంచి ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలను అందజేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. అదే సమయంలో పేద లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్నారాయన. విశేషం ఏంటంటే.. గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ఇళ్లకు సైతం మౌలిస వసతులను అందించింది జగనన్న సర్కార్. మొత్తంగా.. నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో అన్ని వసతులతో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా సీఎం జగన్ నేడు పంపిణీ చేయనున్నారు. పక్షపాత రహితంగా పంపిణీలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం.. ఏమైనా ఇబ్బందులుంటే 1902 టోల్ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చని లబ్ధిదారులకు సూచిస్తోంది కూడా. ఈ నిజాయితీ, నీతివంతమైన పాలనను ఏపీ ప్రజానీకం మెచ్చుకుంటోంది. అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీని హర్షిస్తూ.. ప్రజలు స్వచ్ఛందంగా భారీ ర్యాలీలు చేపట్టారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఇవ్వాలన్నది జగనన్న లక్ష్యం.. అందులో భాగంగా నేడు అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్. #YSRJaganannaIllaPattalu#YSRJaganannaColonies#CheppadanteIsthadanthe #CMYSJagan #APDC pic.twitter.com/JG00Yh2C63 — AP Digital Corporation (@apdigitalcorp) May 26, 2023 -
చంద్రబాబు ‘సమాధి’ వ్యాఖ్యలపై సీఎం జగన్ ఆవేదన
సాక్షి, కృష్ణా: దేవుడి యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లు.. పేదల ఇళ్ల పంపిణీని అడ్డుకునే యత్నం చేశారని చంద్రబాబు నాయుడు తీరుపై సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. పేదలకు పంచబోయే భూమిని సమాధులతో పోలుస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి మానవత్వం లేని, వికృత ఆలోచనలను ఉన్న వ్యక్తులకు మద్దతు ఇస్తారా? అంటూ సోమవారం మచిలీపట్నం బహిరంగ సభ ద్వారా ఏపీ ప్రజలను ఉద్దేశించి పిలుపు ఇచ్చారాయన. కొన్ని లక్షల కుటుంబాలకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇళ్లు లేదు. పేదవాడు పేదవాడిగా మిగిలిపోకూడదనేది మా ప్రభుత్వ ఆకాంక్ష. అందుకే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రెండేళ్ల కిందట నిర్ణయించాం. కానీ, చంద్రబాబు అండ్ దొంగల ముఠా దానిని అడ్డుకునే యత్నం చేసింది. అయినా అన్ని సమస్యలు, కోర్టు కేసులు అధిగమించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని తెలిపారు. పేదలకు ఏనాడూ సెంటు భూమి కూడా ఇవ్వని చంద్రబాబు నాయుడుకు.. వాళ్ల కష్టాలు ఎలా తెలుస్తాయని సీఎం జగన్ అన్నారు. అమరావతిలో 50 వేలమంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశామని, ఈ నెల 26వ తేదీన స్థలాల పంపిణీ ఉంటుందని మచిలీపట్నం బహిరంగ సభలో ఆయన ప్రకటించారు. పేదలు పాచిపనులే చేయాలంట.. చంద్రబాబు.. గతంలో ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని అన్నాడు. బీసీల తోకలు కత్తిరించాలని అన్నాడు. కోడలు మగ పిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అని అన్నాడు. మూడు రాజధానులు వద్దు అంటూ అన్ని ప్రాంతాల అభివృద్ధినే అడ్డుకున్నాడు. మూడు ప్రాంతాలమీదే దాడిచేశాడు. పేదలంటే చంద్రబాబుకు చులకన. బాబు కోరుకున్న అమరావతి ఎలాంటిదంటే.. అందులో పేదలు కేవలం పాచిపనులు చేయాలంట. రోజూవారీ పనులు చేసే కార్మికులుగా మాత్రమే ఉండాలట. వాళ్లెవరికీ అక్కడ ఇళ్లు ఉండకూడదట. అమరావతిలో వీళ్ల పొద్దుటే ఎంటర్ కావాలంట, పనులు చేసి తిరిగి వెనక్కి పోవాలంట. ఇంతకన్నా సామాజిక అన్యాయం ఎక్కడైనా ఉందా? ఇలాంటి దారుణమైన మనస్తత్వం ఉన్న రాక్షసులతో యుద్ధం చేస్తున్నామ’ని పేర్కొన్నారాయన. వారి వికృతఆలోచనలకు మద్దతు ఇవ్వగలమా? అని ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రశ్నించారు. ► టీడీపీకి గజదొంగల ముఠా తోడైంది. ఆ ముఠాకు దోచుకోవడం, పంచుకోవడం, దాచుకోవడం తప్ప ఏదీ తెలియదు. ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 వీళ్లందరికీ తోడు ఓ దత్తపుత్రుడు.. వీళ్లందరూ ఈ మహాయజ్ఞానికి అడ్డుపడుతూ వచ్చారు. అమరావతిలో ప్రభుత్వ డబ్బుతో గేటెట్ కమ్యూనిటీ కట్టుకోవాలనుకున్నారు. బినామీల పేరుతో భూములుగడించి లక్షల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించారు. పేదల ఇళ్లను దారుణంగా అడ్డుకుంటున ద్రోహి చంద్రబాబు. వీళ్లెవరూ పేదల వద్దకు వచ్చి మంచి చేశాం ఓట్లేయండిన అడిగే దమ్ములేదు. ► చంద్రబాబు పేదవాడికి సెంటు భూమి కూడా పంచలేదు. పేదలకు ఈ ప్రభుత్వం ఇళ్లస్థలాలు ఇస్తుంటే.. రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు కేసులు వేయించాడు. అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని సాక్షాత్తూ కోర్టులో కేసులు వేయించాడు. రూపం మార్చుకున్న అంటరాని తనానికి, నయా పెత్తందార్ల భావజాలానికి ప్రతీక ఈ చంద్రబాబు. ఇవన్నీ చేసిన చంద్రబాబు.. విశాఖ పట్నంలో అన్నమాలు బాధను కలిగిస్తున్నాయి. అమరావతి పరిధిలో ప్రతి పేదవాడికి 1.1 సెంటు భూమి ఇచ్చి, ఇల్లుకూడా ఉచితంగా కట్టించి ఇస్తే.. యాభైవేల మందికి కలలు సొంతం చేస్తుంటే.. దాన్ని ఈ గొప్ప పవిత్ర స్థలాన్ని చంద్రబాబు స్మశానంతో పోల్చాడు. పేదలకు తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సెంటు స్థలం ఇవ్వలేదు. కానీ మనం ఇస్తే.. వాటిని సమాధులతో పోలుస్తున్నాడు అని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ► ఈ ప్రభుత్వంలో లంచాలు, వివక్షకు తావు లేకుండా పథకాలు అందుతున్నాయి. డీబీటీ ద్వారా రూ. 2.10 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందించాం. నాన్ డీబీటీ ద్వారా రూ. 3 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించాం అని ప్రకటించారాయన. మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఫలానా మంచి పని చేశామని చెప్పుకోలేని పరిస్థితి వాళ్లది. వాళ్ల ఆలోచనలన్నీ.. కుళ్లు, కుతంత్రాలతో కూడుకున్నవే. అందుకే మంచి చేసిన మీ బిడ్డను(సీఎం జగన్ తనను తాను ఉద్దేశిస్తూ..) ఎన్నికల్లో గెలవడమే కష్టమంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం. పేదల తలరాతలను మార్చాలని నిర్ణయించామని, ఆ ఆలోచనలకు అండగా నిలబడమని కోరుతున్నాం. మీ బిడ్డ ప్రజలనే నమ్మకున్నాడు. మీకు మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలవండి అంటూ మచిలీపట్నం వేదిక ద్వారా ఏపీ ప్రజలను కోరారాయన. ఇదీ చదవండి: బందరుకు చంద్రబాబు చేసిన ద్రోహం ఎలాంటిదంటే.. -
పేదలపై పచ్చి విషం కక్కుతున్న బాబు అండ్ కో
-
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
-
పవన్ కల్యాణ్ ఆరోపణలు అర్ధరహితం: సజ్జల
సాక్షి, గుంటూరు: అమరావతిలో పేదల భూముల ఆర్5 జోన్ వివాదంతో సుప్రీం కోర్టుకు వెళ్లడం దారుణమైన విషయమని, అయినా కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్5 జోన్పై వివాదం తేవటం దారుణం. టీడీపీ శక్తులు పాతకాలపు అభిప్రాయాలతో కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్లటం మరీ బరితెగించిన విషయం. ప్రభుత్వం చేతికి వచ్చిన భూమిని ఎలా వినియోగించాలో ప్రభుత్వనే నిర్ణయం తీసుకుంటుంది. అసలు కోట్లు ఖర్చు పెట్టి పెద్దపెద్ద లాయర్లను పెట్టుకుని కోర్టులకు వెళ్లటం ఏంటి?. నిజంగా వాళ్లంతా రైతులా?. రియల్ ఎస్టేట్ వ్యాపారులే అలా చేయగలరు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. మా స్వర్గంలో మేమే ఉండాలి అనే అభిప్రాయంలో టీడీపీ ఉంది. పేదలు కూడా సొంత ఇళ్లతో ఆత్మగౌరవం కల్పించటానికి మేము ప్రయత్నిస్తున్నాం. కానీ, రైతుల పొట్ట కొట్టి వేల కోట్లు దండుకోవాలని వారు చూస్తున్నారు. అసలు ఏ ముఖం పెట్టుకుని పేదల దగ్గర రేపు ఓట్లు అడుగుతారు వాళ్లు. టీడీపీ నేతల లక్షల కోట్ల బిజినెస్ మీద దెబ్బ తగిలింది. రాజకీయ నేతలుగా కాదు కదా.. కనీసం మనుషులుగా కూడా టీడీపీ వారికి అర్హతలేదు. వాళ్ల నిజ స్వరూపం ఇప్పుడు మళ్ళీ బట్టబయలు అయింది. పేదలను మేము పట్టించుకునేదిలేదనేలాగ ఉంది వాళ్ల వ్యవహారం. రాష్ట్రంలో తొలిసారిగా కొత్తగా గ్రామాలనే క్రియేట్ చేస్తున్నాం. అందరికీ ఒకచోట స్థలాలు ఇస్తే ఓర్చుకోలేక పోతున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వితండవాదం చేస్తున్నారు. టీవీలో చర్చకు మాత్రమే పనికొచ్చేలా వారు మాట్లాడుతున్నారని అన్నారాయన. పవన్ కల్యాణ్ ఆరోపణలు అర్ధరహితం సీఎం జగన్ తెచ్చిన పథకాలు ఎవరికి ఉపయోగ పడ్డాయో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సజ్జల హితవు పలికారు. పవన్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని అన్నారాయన. కరోనా కష్టాలు వచ్చినా కూడా తాను చేయాలనుకున్న సంక్షేమాన్ని పేదల చెంతకు జగన్ తెచ్చారని గుర్తుచేశారాయన. మరోవైపు కమ్యూనిస్టులు కూడా వారి సిద్దాంతం ఏంటో తెలుసుకోవాలన్నారు సజ్జల. విద్యారంగం మీద ఎంత పెట్టుబడి పెడుతున్నామో తెలుసా?. ఇదంతా పేదలకు ఎంతగా ఉపయోగమో తెలుసుకోవాలి. జీవో నెంబర్ 01 అనేది ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే.. చంద్రబాబు తల ఎక్కడో పెట్టుకోవాలి. కందుకూరు, గుంటూరులో ప్రజల్ని చంపారు. జీవో కాదు.. దీనిమీద ఈసారి చట్టం తెస్తాం. ప్రజలను పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యం అని సజ్జల ఉద్ఘాటించారు. చంద్రబాబును ప్రజలు ఏనాడో రాజకీయంగా చెత్తబుట్టలో పడేశారన్న సజ్జల.. రానున్న రోజుల్లో చంద్రబాబు ఇంకా దారుణాలకు పాల్పడతారని, కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చు : సుప్రీం గ్రీన్ సిగ్నల్
సాక్షి, ఢిల్లీ: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బుధవారం తీర్పు వెలువరించింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ కె ఎం. జోసెఫ్ , జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఆర్5 జోన్లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. 👉 ఈ క్రమంలో.. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బెంచ్ తీర్పు సందర్భంగా పేర్కొంది. చట్టం ప్రకారమే ఐదు శాతం ఈడబ్ల్యూఎస్కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడే ఇళ్ల పట్టాలపై హక్కులుంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. 👉 విచారణ సమయంలో.. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘‘34వేల ఎకరాలలో 900 ఎకరాలు మాత్రమే పేదలకు కేటాయించాం. పది మంది రైతులు మాత్రమే ఇక్కడికి వచ్చారు. సి ఆర్ డి ఎ చట్టం లోని సెక్షన్.53.1డి ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదు అని వాదించారు. అలాగే.. ఆర్ - 5 జోన్ లో పట్టాలు ఇవ్వడాన్ని ఆపడానికి వారికి ఏ అధికారం ఉందని అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ఈ - సిటీ కి ఇబ్బంది ఎలా కలుగుతుందని వాదించారు. 👉 మరోవైపు సీఆర్డీఏ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు లేవని, చట్టం ప్రకారమే 5 శాతం ఈ డబ్లు ఎస్ కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వమే భూ సేకరణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఏపీ ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక -
అమరావతి భూములు.. సింగపూర్లో సంతర్పణ!
సాక్షి, అమరావతి: సింగపూర్ కంపెనీల ముసుగు తొలిగిపోవడంతో అమరావతి కేంద్రంగా సాగిన భూదందా విస్మయపరుస్తోంది. చంద్రబాబు సింగపూర్ పర్యటనలు.. ప్రైవేట్ కంపెనీలతో ఎంవోయూలు.. స్విస్ ఛాలెంజ్ ఒప్పందాల వెనుక తీగను లాగుతుంటే కరకట్ట ఇంట్లో అవినీతి డొంక కదులుతోంది. అమరావతి మాస్టర్ప్లాన్, సీడ్ క్యాపిటల్ పాన్ ఫైళ్లను తిరగేస్తుంటే బినామీల పేరుతో చంద్రబాబు, నారాయణ కొల్లగొట్టిన భూముల దస్త్రాలు బయటపడుతున్నాయి. సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణతో భూ దోపిడీ మొత్తం బయటపడుతోంది. కమిటీలో సింగపూర్ కంపెనీ ప్రతినిధి 2014 జూన్లో అధికారం చేపట్టగానే రాజధాని పేరిట చంద్రబాబు భారీ భూదోపిడీకి పన్నాగాన్ని రూపొందించారు. 2015 జూలైలో రాజధాని సలహా కమిటీని నియమించి పొంగూరు నారాయణ, సుజనా చౌదరి, గల్లా జయదేవ్తోపాటు సింగపూర్ కంపెనీ ప్రతినిధికి స్థానం కల్పించడం గమనార్హం. అంతర్జాతీయ కాంపిటీటివ్ బిడ్డింగ్కు వెళ్తున్నందున విదేశీ కంపెనీ ప్రతినిధిని సభ్యుడిగా నియమించడంపై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభ్యంతరం తెలిపినా చంద్రబాబు పట్టించుకోలేదు. సింగపూర్ కంపెనీకి రాజధాని ప్రాంత ఎంపిక బాధ్యతను అప్పగించడం ద్వారా భారీ భూదోపిడీకి అప్పుడే పథకం వేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనేబిలింగ్ యాక్ట్ను కూడా టీడీపీ సర్కారు ఉల్లంఘించింది. ఓపెన్ కాంపిటీషన్ ద్వారా డెవలపర్ను ఎంపిక చేయాలన్న నిబంధనను చంద్రబాబు ఖాతరు చేయలేదు. కేంద్రం అనుమతి లేదు.. టెండర్లూ లేవు 2014 నవంబరులో చంద్రబాబు సింగపూర్ పర్యటనలోనే భూదోపిడీకి స్కెచ్ వేశారు. ఆ వెంటనే డిసెంబరులో రాజధాని మాస్టర్ప్లాన్ రూపొందించేందుకు సింగపూర్ కంపెనీతో చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా ఎంవోయూ కుదుర్చుకుంది. విదేశీ కంపెనీతో చేసుకునే ఒప్పందాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. అయితే కేంద్రం అనుమతి లేకుండానే ఎంవోయూ కుదుర్చుకోవడం గమనార్హం. ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నట్లు అప్పటి సీఎం చంద్రబాబు బుకాయిస్తూ వచ్చారు. తద్వారా ఇతర కంపెనీలు పోటీకి రాకుండా నిరోధించారు. కానీ సంబంధిత శాఖల నోట్ ఫైల్స్లో ఎక్కడా సింగపూర్ ప్రభుత్వం అనే ప్రస్తావనే లేదు. చివరికి చంద్రబాబు ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది సింగపూర్ ప్రభుత్వంతో కాకుండా ఓ ప్రైవేట్ కంపెనీతో కావడం గమనార్హం. ఇక రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన సీడ్ క్యాపిటల్ ఎంపిక కోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లానర్ను చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా ఎంపిక చేసింది. అందుకోసం కనీసం టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టలేదు. సింగపూర్కే చెందిన కంపెనీలను మాస్టర్ డెవలపర్గా ఎంపిక చేయాలని ఎంవోయూలో స్పష్టం చేశారు. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించే కంపెనీ, సీడ్ క్యాపిటల్ మాస్టర్ డెవలపర్ ఎవరన్నది చంద్రబాబు ముందుగానే నిర్ణయించేశారు. 2015 జనవరిలోనే అమరావతి మ్యాపులు.. రాజధానిలో కీలకమైన సీడ్ క్యాపిటల్ ప్రాంతం ఎంపికలో చంద్రబాబు తన పన్నాగాన్ని అమలులోకి తెచ్చారు. విజయవాడ–గుంటూరు–తెనాలి– మంగళగిరి(వీజీటీఎం) పరిధిలోని జోనింగ్ మ్యాపులన్నీ 2015 జనవరిలోనే సింగపూర్ మాస్టర్ డెవలపర్కు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ ప్రభుత్వం అప్పగించేసింది. ఆ మ్యాపుల్లో పేర్కొన్న ప్రాంతాల్లోనే రాజధాని, సీడ్ క్యాపిటల్ను ఎంపిక చేయాలని చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా నదికి అభిముఖంగా ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం గ్రామాల పరిధిలో సీడ్ క్యాపిటల్ను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. అంటే రాజధాని, సీడ్ క్యాపిటల్ ఏ మండలాలు, గ్రామాల పరిధిలో రానున్నాయో చంద్రబాబు, నారాయణ, వారి బినామీలకు ముందుగానే తెలుసన్నది స్పష్టమైంది. అనంతరం సింగపూర్ కంపెనీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ను 2015 జూలైలో ప్రభుత్వానికి సమర్పించి కథ ముగించింది. పచ్చ ముఠా గుప్పిట్లో సీడ్ క్యాపిటల్ 2015 జనవరిలోనే సీడ్ క్యాపిటల్ ఎక్కడ రానుందో తెలిసిన చంద్రబాబు, నారాయణ తమ బినామీలను రంగంలోకి దింపారు. ఆ ప్రాంతంలో అతి తక్కువ ధరకు భూములను భారీగా కొనుగోలు చేశారు. సీఐడీ దర్యాప్తులో ఈ బినామీ లావాదేవీలు వెలుగులోకి వస్తున్నాయి. నారాయణ తన బినామీలు, బంధువుల పేరిట 65.50 ఎకరాలు కొనుగోలు చేసినట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. నారాయణ భార్య రమాదేవి, అల్లుడు డైరెక్టర్లుగా ఏర్పాటైన ఎన్స్పైరా కంపెనీ నుంచి నిధులను తమ బంధువులు, బినామీల ఖాతాల్లోకి మళ్లించారు. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును బినామీగా పెట్టుకుని కూడా నారాయణ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. ఆ విధంగా కొనుగోలు చేసిన 65.50 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. అందుకు ప్రతిగా ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ కింద సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో అత్యంత విలువైన 75,888 చదరపు గజాల స్థలాలు పొందారు. పూలింగ్ ప్యాకేజీ కింద ఏటా సీఆర్డీఏ ఇప్పటివరకు చెల్లించిన రూ.1.92 కోట్ల కౌలు మొత్తం ఎన్స్పైరా ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇదే రీతిలో చంద్రబాబు బినామీలు, సన్నిహితులు సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భారీగా భూములు గుప్పిట పట్టారు. దీనిపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలో మరిన్ని బినామీ లావాదేవీలు బహిర్గతం కానున్నాయి. స్విస్ ఛాలెంజ్ ముసుగులో 1,691 ఎకరాల దోపిడీ తమ దోపిడీకి మార్గం సుగమం చేసేలా రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారం సవరణలు చేసింది. ఓపెన్ కాంపిటీషన్ విధానాన్ని పక్కనపెట్టేసి స్విస్ చాలెంజ్ విధానంలో సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఒప్పందం చేసుకుంది. కౌంటర్ చాలెంజ్కు ఇతర కంపెనీలకు అవకాశం లేకుండా చేసి సింగపూర్ కంపెనికి స్విస్ ఛాలెంజ్ కింద ఏకపక్షంగా కట్టబెట్టేసింది. సీడ్ క్యాపిటల్ అంచనా వ్యయం రూ.3,137 కోట్లు కాగా నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం అందులో 25 శాతం అంటే రూ.784 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు బిడ్డింగ్ అర్హత ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కనీసం రూ.2 వేల కోట్ల టర్నోవర్ ఉండటాన్ని అర్హతగా నిర్ణయించడం గమనార్హం. తద్వారా ఇతర కంపెనీలు ఏవీ పోటీకి రాకుండా కట్టడి చేసింది. ఇక సీడ్ క్యాపిటల్ కింద 1,691 ఎకరాల్లో నిర్మాణాలను సింగపూర్ కంపెనీకి కాంట్రాక్టు అప్పగించారు. కానీ అందులో సింగపూర్ కంపెనీ నిర్మించేది కేవలం 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనం మాత్రమే. అంటే మిగిలిన భూమి అంతా సింగపూర్ కంపెనీకే అప్పగించేశారు. ఆ ప్రకారం ఆ భూమిని ప్లాట్లు వేసుకుని అమ్ముకునే హక్కు కల్పించారు. సింగపూర్ కంపెనీ ముసుగులో చంద్రబాబు, ఆయన బినామీలు భూములను కాజేసేందుకే ఈ పథకం వేశారు. ‘ఇన్నర్’ మెలికలు గత సర్కారు పెద్దల ఆదేశాలతో ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్లో కీలక మార్పులు జరిగాయి. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజాలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ రూపొందించారు. సింగపూర్కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ ద్వారా రూపొందించిన అమరావతి మాస్టర్ప్లాన్లోనే ప్రతిపాదిత ఇన్నర్రింగ్ రోడ్ డిజైన్ను చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే చేర్చింది. అంటే అప్పటికే ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ ఎలా ఉండాలన్నది నిర్ధారణ అయిపోయింది. సీఆర్డీఏ ద్వారా తాము ఖరారు చేసిన అలైన్మెంట్నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా తెరపైకి తెచ్చి ఆమోదించారు. కంతేరు, కాజాలో లింగమనేని కుటుంబానికి 355 ఎకరాలున్నాయి. ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఆనుకుని హెరిటేజ్ ఫుడ్స్కు ఒకచోట 9 ఎకరాలు, మరో చోట నాలుగు ఎకరాలు ఉండటం గమనార్హం. పాపాల్లో పవన్కూ భాగం జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కూడా ఈ ఇన్నర్రింగ్ రోడ్డు అవినీతి పాపంలో చంద్రబాబు వాటా కల్పించారు. కాజా వద్ద ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్కు సమీపంలో పవన్కల్యాణ్కు 2.4 ఎకరాలున్నాయి. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్కు ఇవ్వడం గమనార్హం. అమాంతం పెరిగిన విలువ ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు తరువాత ఎకరం రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే రూ.54 కోట్లకు చేరుతుందని తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో నాలుగు ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. ఇది కూడా చదవండి: బాబు చెప్తే ఎవరికి విడాకులు ఇవ్వమన్నా ఇస్తాడు.. పవన్ గాలి తీసేసిన సీఎం జగన్ -
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు బాబు.. మొన్నటివరకు విర్రవీగారు.. ఇప్పుడేమైంది..
ఇంతకాలం తెలుగుదేశం నేతలు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి, టీవీ 5 వంటి మీడియా సంస్థలు ఏమని అంటుండేవి? ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి వెంట్రుక కూడా పీకలేరని, వారేమిటి? స్వయంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లు కూడా ఏం పీకుతారు? అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంటారు. పైగా ఎదురు డబాయించడం. వాళ్లను బ్యాన్ చేస్తా! వీళ్లను బ్యాన్ చేస్తా? నేను గెలిచాక పోలీసుల సంగతి చూస్తా! జగన్కు ట్రీట్మెంట్ ఇస్తా అంటూ ఇష్టారీతిన బెదిరించడం చంద్రబాబుకు అలవాటైంది. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబే అంతలా మాట్లాడుతుంటే, అధికారంలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిస్సహాయంగా చూస్తూ ఉంటారా? ఈ సరికే అనేక కేసులలో చంద్రబాబు అండ్ కో ఏ రకంగా నిందితులో జగన్ అసెంబ్లీలోనే తెలియచెప్పారు. అప్పట్లో చంద్రబాబుకు న్యాయ వ్యవస్థలో ఉన్న బలం ఆధారంగా కేసులు ముందుకు వెళ్లకుండా నెగ్గుకు రాగలిగారు. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా! అప్పుడప్పుడు ఆయనకు కూడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయన పై వచ్చిన అవినీతి అభియోగాల మీద విచారణకు వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా తమను ఏమీ పీకలేరని టీడీపీ నేతలు సవాల్ చేస్తూ వచ్చారు. అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ అవినీతి ఆరోపణల నిగ్గు తేల్చడానికి నడుం బిగించింది. రాజధాని భూములలో క్విడ్ ప్రోకో జరిగిందని చెబుతున్న కేసులో ఆస్తుల జప్తునకు సిఐడీకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో టీడీపీ నేతలు గగ్గోలు పెట్టడం ఆరంభించారు. అమ్మో! ఇంకేముంది ఇదంతా రాజకీయ వేధింపే అంటూ ప్రచారం ఆరంభించారు. వారికి మద్దతు ఇచ్చే పత్రిక ఒకటి జగన్ టీడీపీ నేతలను వేటాడమన్నారని ఏకంగా కథనాన్ని రాసింది. మరో టీడీపీ పత్రిక చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇల్లును జప్తు చేశారని పేర్కొంది. అదేదో చంద్రబాబుకు సంబంధం లేని భవంతి అని జనం అనుకోవాలన్నది వారి తాపత్రయం కావచ్చు. అసలు ప్రభుత్వం చేసిన అభియోగం ఏమిటి? రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేని రమేష్కు ప్రభుత్వపరంగా లాభం చేసి, ప్రతిఫలంగా చంద్రబాబు ఆయనకు చెందిన ఇంటిని పొందారన్నది ఆరోపణ. దీనినే క్విడ్ ప్రోకో అంటారు. గతంలో ఒక వ్యక్తిగా జగన్ పరిశ్రమలు పెడితే, వాటిలో ఎవరైనా పెట్టుబడులు పెడితేనే చంద్రబాబు బ్యాచ్ క్విడ్ ప్రోకో అంటూ ఆరోపించేది. దానికి సోనియాగాంధీ కూడా తోడై అక్రమ కేసులు పెట్టి ఆయనను నెలల తరబడి జైలులో ఉంచారు. మరి చంద్రబాబు ఏకంగా కొందరికి అనుచిత లబ్ది చేకూర్చి ఒక భవంతిని తీసుకుంటే ఏమనాలి? బహుమతి అని వినసొంపైన పేరు పెట్టినా, దానినే లంచం అని కూడా అంటారు కదా! ఈ ఇంటికి సంబంధించి చంద్రబాబు ఎన్నిసార్లు ఎన్నిరకాలుగా మాట్లాడారు? ఒకసారి ఇది ప్రభుత్వ భవనం అని, పూలింగ్ లో వచ్చిందని, తను సీఎంను కనుక అందులో ఉంటున్నానని అన్నారు. ఈ ఒక్క భవనాన్ని మాత్రమే ఉంచుతామని, మిగిలిన నదీతీర భవనాలను తొలగించి టూరిజం అభివృద్ది చేస్తామని కూడా ఆయన చెప్పారు. ఆయన పదవీకాలంలో ఆ పనిచేయలేదు. నిజానికి అసలు ఆయన ఉంటున్న కట్టడమే అక్రమ నిర్మాణం. నదీ తీర ప్రాంత నిబంధనలను ఉల్లంఘించిన కట్టడం. గతంలో ఒకసారి పెద్ద ఎత్తున వరదలు వస్తే అప్పటి టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నదిలో పడవలో తిరుగుతూ ఈ అక్రమ కట్టడాలన్నిటిని తమ ప్రభుత్వం కూల్చి వేస్తుందని చెప్పారు. ఈ కట్టడాల వల్ల నది ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని చెప్పారు. కానీ ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబే అందులో నివాసానికి దిగేసరికి ఎక్కడివారక్కడ నోరు మూసుకోవలసి వచ్చింది. హైదరాబాద్లో ఓటుకు నోటు కేసులో నుంచి బయటపడడానికి రాత్రికి, రాత్రే చంద్రబాబు విజయవాడకు వెళ్లిపోయిన తర్వాత జరిగిన పరిణామం ఇది. పర్యావరణవేత్లలు చెప్పినా, అధికారులు చెప్పినా, అదే అక్రమ కట్టడంలో ఉండడానికి చంద్రబాబు ఇష్టపడ్డారు. అప్పట్లోనే చంద్రబాబు ఈ ఇంటిని తీసేసుకున్నారని ప్రచారం జరిగేది. ఇంటి యజమాని లింగమనేని రమేష్ కూడా తాను ప్రభుత్వానికి ఇచ్చేశానని ప్రకటించారు. అది చంద్రబాబు క్విడ్ ప్రోకో కింద బహుమతిగా పొందారని, కోట్ల రూపాయల విలువైన ఆ భవంతిని ఆయన అలా పొందడం చట్ట విరుద్దమని సీఐడీ కేసు పెట్టి , భవనాన్ని జప్తు చేసింది. లింగమనేని రమేష్కు చంద్రబాబు ఏ రకంగా ఉపయోగపడ్డారు? ముందస్తు సమాచారం ద్వారా రమేష్కు ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సహకరించారని, అమరావతి రాజధాని గ్రామాల చుట్టూరా రింగ్ రోడ్డు ప్లాన్ వేసినప్పుడు రమేష్ భూములు ప్రభుత్వ భూ సమీకరణలో పోకుండా అలైన్ మెంట్ లో మార్పులు చేశారని సీఐడీ ఆరోపణ. చంద్రబాబుకు కుటంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీకి చెందిన భూమి పోకుండా, రింగ్ రోడ్డు పక్కనే తమ భూమి ఉండేలా ప్లాన్ మార్చుకున్నారన్నది మరో అభియోగం. హెరిటేజ్ సంస్థ కూడా ముందస్తుగానే కంతేరు ప్రాంతంలో 14 ఎకరాల మేర కొనుగోలు చేసింది. అది అప్పట్లోనే వివాదాస్పదం అయింది. చంద్రబాబు అద్దెకు ఉంటున్నందునే ఆ ఇల్లు ను జప్తు చేశారన్నట్లుగా టీడీపీ మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఉత్త పుణ్యానికి చంద్రబాబు ఆ ఇంటిని పొందారన్నది ఆరోపణ. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది ప్రభుత్వ భవనమని చెప్పిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చాక అది ప్రైవేటు బిల్డింగ్ అని అసెంబ్లీలో చెప్పడం విశేషం. ప్రభుత్వ భవనం అయితే దానిని ప్రభుత్వానికి స్వాధీనం చేయవలసి ఉంటుంది. లేదా ప్రతిపక్ష నేత హోదాలో దానిలో ఉంటున్నానని చెప్పవచ్చు. అలాకాకుండా మళ్లీ లింగమనేనికి ఎలా వెళుతుంది? ఒకవేళ నిజంగానే లింగమనేని నుంచి అద్దెకు తీసుకుని ఉంటే, సంబందిత అద్దె లావాదేవీలు ఎందుకు చూపించలేదు? ఈ ప్రశ్నలకు చంద్రబాబు ఇంతవరకు జవాబు ఇవ్వలేదు. మాజీ మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం దొరకడం లేదు. ఆయన తరపున కొందరు టీడీపీ నేతలు మాత్రం యథా ప్రకారం ఇదంతా కక్ష అని విమర్శిస్తూ మాట్లాడారు. నారాయణ సమీప బంధువులు లేదా ఆయన విద్యా సంస్థలలో పనిచేసే సిబ్బంది పేరుతో ముందుగానే భూములు కొనుగోలు చేయించి, ఆ తర్వాత అధిక లాభం పొందాలని నారాయణ ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించినవారిని సీఐడీ విచారించింది. వారు తమ సాక్ష్యాలలో ఆ భూములు నారాయణవేనని వెల్లడించారట. తాజాగా ఈ లావాదేవీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు రెండున్నర ఎకరాల వాటా ఉందని వార్త వచ్చింది. చంద్రబాబు, పవన్ లు ఇద్దరికి లింగమనేని సన్నిహితుడు కావడం విశేషం. చంద్రబాబు ప్రభుత్వం మార్పు చేసిన అలైన్ మెంట్ కనుక అమలు అయి ఉంటే వేల కోట్ల రూపాయల లబ్ది వీరికి అక్రమంగా జరిగి ఉండేదని సీఐడీ అంచనా వేసింది. ఈ సందర్భంలో ఒక ఉదాహరణ చెప్పాలి. హైదరాబాద్లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి గాను భూ సేకరణ జరిగింది. ఆ టైమ్ లో తెలుగుదేశం నేతలు పలు ఆరోపణలు చేస్తుండేవారు. ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ తో పాటు కొందరు టీడీపీ నేతలకు చెందిన భూముల గుండా రింగ్ రోడ్డు వెళ్లిందని, తద్వారా వారికి నష్టం వాటిల్లేలా చేశారని ఈనాడు మీడియా కథనాలు ఇచ్చేది. అలాగే రామోజీరావుకు చెందిన కొంత భూమి కూడా పోయిందని అంటారు. దాంతో ఆయన ఆగ్రహానికి లోనై అవుటర్ రింగ్ రోడ్డులో గద్దలు అంటూ చెలరేగిపోయి బోలెడు స్టోరీలు ఇచ్చేవారు. అయినా ఆనాటి ప్రభుత్వం వాటిని ఎదుర్కొని అధికారుల సమావేశం ఏర్పాటు చేసి, అన్ని రాజకీయ పక్షాలను ఆహ్వానించి వారి సందేహాలను నివృత్తి చేసే యత్నం చేసింది. అప్పట్లో అన్ని స్టోరీలు రాసిన ఈనాడు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఇన్ సైడ్ ట్రేడింగ్ ,అలైన్ మెంట్ మార్పు, అస్సైన్డ్ భూముల కుంభకోణం వంటివాటికి మద్దతు ఇచ్చేలా వార్తలు ఇస్తుండడం విశేషం. ఇక ఈ కేసు ఏమవుతుందన్నది ఆసక్తికరం. ఎసీబీ న్యాయమూర్తికి ఈ జప్తు సమాచారం ఇచ్చి ఆయన అనుమతి పొంది ముందుకు వెళ్లవలసి ఉంటుంది. అయితే ప్రభుత్వం పెట్టిన 1944 నాటి చట్టం ప్రయోగిస్తారా అని టీడీపీ మీడియా వాపోతోంది. అందులో ఉన్న సెక్షన్ 3 వర్తించదని, కేసు నిలబడదని వాదిస్తోంది. చట్టం ఎప్పటిదైనా అది రద్దు కానంతవరకు అమలు అవుతుంది. మన దేశంలో ఉన్న క్రిమినల్ చట్టాలలో అత్యధికం స్వాతంత్రం రావడానికి పూర్వం నాటివేనన్న సంగతి మర్చిపోరాదు. చంద్రబాబు, లింగమేనేని, నారాయణలపై ఆరోపణలు చేస్తున్నా, అసలు రాజధానే నిర్మాణం కానప్పుడు, రింగ్ రోడ్డే లేనప్పుడు అవినీతి ఎలా అవుతుందని టీడీపీ మీడియా ప్రశ్నించింది. గత ప్రభుత్వం రూపొందించిన దాని ప్రకారం అమలు చేస్తే చంద్రబాబు తదితరులు లాభపడేవారా? కారా? అన్నది ఇక్కడ ప్రశ్న. దొంగతనం జరిగినా, సొత్తు ఏమీ దక్కలేదుగా అంటే చోరీ నేరం కాకుండా పోతుందా? అన్నది ఇక్కడ ప్రశ్న. కోర్టులో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తికరమైన విషయమే. జాతీయ స్థాయిలో సంచలనం రేపిన 2 జీ స్పెక్ట్రం , బొగ్గు గనుల స్కామ్ లలో కూడా ఊహజనిత నష్టాల ఆధారంగానే సీబీఐవారు కేసులు పెట్టారన్న సంగతి గుర్తుంచుకోవాలి. రాజధాని భూముల క్విడ్ ప్రోకో కేసులోనే కాకుండా అస్సైన్డ్ భూముల వ్యవహారంలో కూడా టీడీపీ నేతలు చిక్కుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చంద్రబాబు తో సహా టీడీపీ నేతల మూలాలను వైసీపీ ప్రభుత్వం పీకడం మొదలుపెట్టినట్లేనా! తెలుగుదేశం నేతలు ఇంతకాలం ఏం పీకుతారంటూ వేస్తున్న ప్రశ్న జవాబు లభిస్తున్నట్లేనా! -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ చదవండి: మలుపు తిప్పిన ముఠా! బాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్కూ వాటా -
టీడీపీ రైతులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల కేసుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఆర్-5 జోన్ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసును రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్కు బదిలీ చేయాలని పేర్కొంది. ఆర్-5 జోన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చదవండి: చంద్రబాబు బరితెగింపుకి నిదర్శనం ‘కరకట్ట నివాసం’: సజ్జల -
ఇచ్చిపుచ్చుకున్నారు.. చంద్రబాబు క్విడ్ ప్రో కో గుట్టురట్టు
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్టపై చంద్రబాబు నివాసం.. అమరావతిలో చంద్రబాబు క్విడ్ ప్రోకో కు ఓ మచ్చు తునకని నిగ్గు తేలింది. అమరావతిలోని సీడ్ క్యాపిటల్లో నారాయణ బినామీల పేరిట ఉన్న 75,888 చదరపు గజాల స్థలాలు టీడీపీ భూబాగోతానికి నిదర్శనమని నిర్ధారణ అయ్యింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో టీడీపీ పెద్దల అవినీతి బట్టబయలైంది. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనే చంద్రబాబు, నారాయణ, లింగమనేని, వారి బంధువులు, బినామీలు భారీ భూ దోపిడీకి బరితెగించారని ఆధారాలతో సహా వెల్లడైంది. చంద్రబాబు అండ్ గ్యాంగ్ అమరావతిలోని అవినీతి సామ్రాజ్యాన్ని సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బట్టబయలు చేసింది. దాంతో టీడీపీ ప్రభుత్వంలో అమరావతి కేంద్ర బిందువుగా ఏ–1 నారా చంద్రబాబు, ఏ–2 పొంగూరు నారాయణ యథేచ్ఛగా సాగించిన భారీ భూ దోపిడీపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిన అక్రమాలు, అవినీతిపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను నియమించడం సరైనదేనని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో తన అవినీతి బట్టబయలు కాకుండా చంద్రబాబు కొన్నేళ్లుగా అడ్డుకుంటున్న కుట్రలకు తెరపడింది. ఈ నేపథ్యంలో రాజధాని ల్యాండ్ పూలింగ్, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో పచ్చ ముఠా అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బాబు, నారాయణవి అక్రమ ఆస్తులే అక్రమ మార్గంలో సంపాదించిన ఆస్తులను అటాచ్ చేసేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పిస్తున్న క్రిమినల్ లా ఆర్డినెన్స్ ప్రకారం అనుమతించాలని సీఐడీ కోరింది. ఈ మేరకు అవినీతి నిరోధక చట్టం–1988 ప్రకారం లింగమనేని కుటుంబం క్విడ్ ప్రో కో కింద చంద్రబాబుకు ఇచ్చిన కరకట్ట నివాసం.. సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో నారాయణ బినామీల పేరిట పొందిన 75,888 చదరపు గజాల స్థలాలను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోమ్ శాఖ రెండు వేర్వేరు జీవోలు జారీ చేసింది. దాంతో సీఐడీ ఆ విషయాన్ని ఏసీబీ న్యాయస్థానానికి నివేదించి, ఆ ఆస్తులను అటాచ్ చేసేందుకు ఉపక్రమించనుంది. తదుపరి దశల్లో మరిన్ని కఠిన చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేస్తోంది. భారీ అవినీతికే ‘మాస్టర్ ప్లాన్’ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనే ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ భారీ అవినీతికి పునాది వేశారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే అప్పటి టీడీపీ ప్రభుత్వం, సింగపూర్కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజస్తో ఒప్పందం చేసుకుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెన్సీ ఎంపిక కోసం కనీసం టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టకుండా సింగపూర్ కంపెనీకి నామినేషన్ పద్ధతిలో అడ్డగోలుగా అప్పగించేశారు. దాంతో చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే మాస్టర్ ప్లాన్ను సింగపూర్ కంపెనీ రూపొందించింది. లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్, హెరిటేజ్ ఫుడ్స్, చంద్రబాబు బినామీలకు చెందిన భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా.. వారి భూముల వెలుపలి నుంచే ల్యాండ్ పూలింగ్ చేసేలా మాస్టర్ ప్లాన్ను ఖరారు చేశారు. అందుకు ప్రతిగా చంద్రబాబు కుటుంబానికి లింగమనేని కుటుంబం భారీగా ప్రతిఫలాన్ని ముట్టజెప్పింది. క్విడ్ ప్రోకో కిందే కరకట్ట నివాసం చంద్రబాబు, లింగమనేని క్విడ్ ప్రో కో కింద పరస్పరం భారీగా అవినీతికి పాల్పడినట్టు సిట్ నిర్ధారించింది. లింగమనేని కుటుంబ సభ్యుల భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా చేసినందుకు చంద్రబాబుకు భారీగా ముట్టజెప్పారు. ఇన్నర్రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములను హెరిటేజ్ ఫుడ్స్కు ‘అమ్మినట్టు’ ఇవ్వడంతో సరిపెట్టలేదు. లింగమనేని కృష్ణానది కరకట్ట మీద ఉన్న నివాసాన్ని కూడా చంద్రబాబుకు ఇవ్వడం గమనార్హం. పక్కా క్విడ్ ప్రో కోలో భాగంగానే కరకట్ట నివాసం చంద్రబాబుకు ఉచితంగా ఇచ్చేశారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. కరకట్ట నివాసంపై బాబు కట్టుకథలు కరకట్ట నివాసంపై న్యాయస్థానాన్ని, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జీతంతోపాటు హౌస్ రెంట్ అలవెన్స్ (ఇంటి అద్దె అలవెన్స్) కూడా తీసుకున్నారు. అంటే ప్రజాధనం నుంచి సీఎంగా ఇంటి అద్దె అలవెన్స్ తీసుకున్నారు. కానీ చంద్రబాబు 2017 నుంచి తాను ఉంటున్న కరకట్ట నివాసానికి అద్దెను లింగమనేని కుటుంబానికి చెల్లించినట్టు ఎక్కడా బ్యాంకు లావాదేవీలు లేవు. చంద్రబాబు నుంచి తీసుకున్న అద్దెకు లింగమనేని ఎక్కడా జీఎస్టీ చెల్లించనే లేదు. అంటే ఇంటి అద్దె అలవెన్స్ను ప్రజాధనం నుంచి తీసుకుంటున్న చంద్రబాబు.. తాను నివసిస్తున్న ఇంటికి మాత్రం అద్దె చెల్లించడమే లేదన్నది నిర్ధారణ అయ్యింది. క్విడ్ ప్రో కోలో భాగంగా ఆ నివాసం చంద్రబాబుకు లింగమనేని ఇచ్చారు కాబట్టే అద్దె చెల్లించలేదు. దేశ భక్తితో ఇచ్చారట! కరకట్ట నివాసంపై న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు లింగమనేని కూడా యత్నించారు. తాను దేశభక్తితోనే కరకట్ట నివాసాన్ని అప్పటి ప్రభుత్వం వాడుకునేందుకు ఉచితంగా ఇచ్చానని లింగమనేని రమేశ్ న్యాయస్థానానికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మరి ఉచితంగా ఇచ్చిన ఇంటికి చంద్రబాబు ప్రజాధనం నుంచి ఇంటి అద్దె అలవెన్స్ను ఎలా తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానమే లేదు. దేశభక్తితో ఉచితంగా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి గానీ చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఇవ్వడం ఏమిటి? ప్రభుత్వానికే ఉచితంగా ఇచ్చి ఉంటే.. చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోగానే ఆ ఇంటిని ఖాళీ చేయాలి. ఆ ఇంటిని ప్రభుత్వానికి అప్పగించాలి. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలి. ఆ నివాసం ప్రభుత్వానికి చెందుతుంది. కానీ 2019లో సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా చంద్రబాబు అదే కరకట్ట నివాసంలో ఉంటున్నారు. అంటే లింగమనేని దేశ భక్తితో ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారన్నది అవాస్తవం. క్విడ్ ప్రో కోలో భాగంగానే ఆయన చంద్రబాబుకు ఇచ్చారన్నది దీనినిబట్టి కూడా నిర్ధారణ అయ్యింది. లింగమనేని నుంచి హెరిటేజ్ ఫుడ్స్కు భూమి 2014లో లింగమనేని కుటుంబ సభ్యుల నుంచి హెరిటేజ్ ఫుడ్స్ 4 ఎకరాలను ‘కొనుగోలు చేసినట్టు’ చూపించడం గమనార్హం. అమరావతి ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూమినే హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసింది. ఆ పేరుతో ఆ భూమిని హెరిటేజ్ ఫుడ్స్కు బదలాయించారు. ఆ మేరకు అప్పట్లోనే నారా లోకేశ్ డైరెక్టర్గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రి కూడా అయిన లోకేశ్ అదే లింగమేని కుటుంబం ఇచ్చిన కరకట్ట మీద నివాసంలోనే నివసించారు. సీడ్ క్యాపిటల్లో వేళ్లూనుకున్న అవినీతి ► అమరావతిలో అత్యంత ప్రధానమైన సీడ్ క్యాపిటల్లో కూడా ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారు. ఎందుకంటే శాసనసభ, సచివాలయం మొదలైన ప్రధాన విభాగాలన్నీ కూడా సీడ్ క్యాపిటల్ పరిధిలోనే నిర్మించాలని నిర్ణయించారు. ► ఆ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరుగుతాయి కాబట్టి, సీడ్ క్యాపిటల్లో పూర్తిగా తమ వాటా భూములే ఉండేట్టుగా చంద్రబాబు, నారాయణ పన్నాగం పన్నారు. సింగపూర్ కంపెనీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వానికి 2015 జూలైలోనే సమర్పించింది. కానీ ఆ ప్లాన్ను బహిర్గతం చేయకుండా, ఆమోదించకుండా మూడు నెలలపాటు కాల యాపన చేశారు. ► ఆ సమయంలోనే నారాయణ తమ బినామీలు, బంధువులైన పొత్తూరి ప్రమీల, రాపూరి సాంబశివరావు, ఆవుల ముని శంకర్, వరుణ్ కుమార్ కొత్తప్ప పేరున సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో 65.50 ఎకరాలు కొనుగోలు చేశారు. అందుకోసం నారాయణ భార్య రమాదేవి, అల్లుడు డైరెక్టర్లుగా ఏర్పాటు చేసిన ఎన్స్పైరా కంపెనీ నుంచి నిధులను తమ బంధువులు, బినామీల ఖాతాల్లోకి మళ్లించారు. వారి పేరున సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. ► రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును బినామీగా పెట్టుకుని కూడా నారాయణ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. నారాయణ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బాం్యకు ఖాతాకు నిధులు బదిలీ చేశారు. ఆ నిధులతో ఆ కంపెనీ ఉద్యోగుల పేరున భూములు కొనుగోలు చేశారు. ► కేసు దర్యాప్తులో భాగంగా ఆ ఉద్యోగులను సిట్ అధికారులు ప్రశ్నించగా తాము నారాయణ బినామీలుగానే భూములు కొనుగోలు చేశామని వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా నారాయణ తమ బంధువులు, బినామీల పేరిట సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన 65.50 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. ► అందుకు ప్రతిగా ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ కింద సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో అత్యంత విలువైన 75,888 చదరపు గజాల స్థలాలు పొందారు. వాటిలో 7,620 చదరపు గజాలు, 8,880 చదరపు గజాలు, 6,550 చదరపు గజాలు, 25 వేల చదరపు గజాల స్థలాలు కూడా ఉన్నాయి. అవి నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానించి ఉండటం గమనార్హం. ► భవిష్యత్లో స్టార్ హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఇతర భారీ వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుకూలమైన విలువైన స్థలాలను పొందారన్నది స్పష్టమవుతోంది. పూలింగ్ ప్యాకేజీ కింద ఏటా సీఆర్డీఏ ఇప్పటి వరకు చెల్లించిన రూ.1.92 కోట్ల కౌలు మొత్తం ఎన్స్పైరా ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంటే ఆ భూములు కొనుగోలు చేసి సీఆర్డీఏకే ఇచ్చినట్టు పేర్కొన్న పొత్తూరి ప్రమీల, రా>పూరి సాంబశివరావు, ఆవుల ముని శంకర్, వరుణ్ కుమార్ కొత్తప్ప పూర్తిగా నారాయణ బినామీలేనన్నది నిర్ధారణ అయ్యింది. వారి భూముల వద్దే ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలో 75 మీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను రూపొందించడంలో చంద్రబాబు, నారాయణ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. వారి భూములను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ను రూపొందించారు. లింగమనేని కుటుంబం, హెరిటేజ్ ఫుడ్స్, నారాయణ విద్యా సంస్థల సమీపం నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా చంద్రబాబు, నారాయణ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. తమ భూముల నుంచి కాకుండా సామాన్య రైతుల భూముల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ను ఖరారు చేయడం గమనార్హం. అందుకోసం ముందుగానే ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వకుండా సీఆర్డీయే నిలుపుదల చేసింది. అంటే కన్సల్టెన్సీ సంస్థ అలైన్మెంట్ను రూపొందించకముందే చంద్రబాబు, నారాయణ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలా నిర్మించాలో నిర్ణయించేశారు. అప్పటికే నిర్ణయించిన అలైన్మెంట్ను ఖరారు చేసేందుకే ఓ కన్సల్టెన్సీని నియమించి కనికట్టు చేశారు. చదవండి: దిగజారుడు పాత్రికేయానికి మరో మచ్చుతునక వాస్తవానికి విజయవాడలోని కామినేని ఆస్పత్రి వద్ద ఉన్న తాడిగడప– ఎనికేపాడు మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని కన్సల్టెన్సీ సంస్థ ఎస్టీయూపీ అలైన్మెంట్ను రూపొందించింది. అలా నిర్మిస్తే నారాయణ విద్యా సంస్థలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూముల మీదుగా రోడ్డును నిర్మించాల్సి వస్తుంది. దీనిపై అప్పటి సీఆర్డీయే వైస్ చైర్మన్గా ఉన్న నారాయణ సీఆర్డీయే సమావేశంలోనే అధికారులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తాడిగడపకు 3 కి.మీ. దూరంగా తూర్పు వైపు నుంచి పెనమలూరు– నిడమానూరు మీదుగా ఇన్నర్రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ను మార్పించారు. -
పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీకి అభ్యంతరం ఏంటి?
సాక్షి, తాడేపల్లి: అమరావతిలో చంద్రబాబు తనవారికే ప్రయోజనం చేకూర్చారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసైన్డ్ రైతుల పట్ల చంద్రబాబు దారుణంగా ప్రవర్తించారన్నారు. ‘‘అమరావతిలో పేదలు ఉండడానికి వీలు లేదని కోర్టుకు వెళ్లారు.. అమరావతిలో అందరూ ఉండాలని సీఎం జగన్ కోరుకుంటున్నారు. నిన్న కోర్టు తన తీర్పుతో చంద్రబాబు కళ్లు తెరిపించింది. చంద్రబాబు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి. పేదల పక్షాన సీఎం జగన్ పోరాటం చేస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే టీడీపీకి అభ్యంతరం ఏంటి?. పేదలంటే తెలుగుదేశానికి ఎందుకంత కడుపుమంట. తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కవర్గానికైనా న్యాయం చేశారా?’’ అంటూ ఎంపీ సురేష్ ప్రశ్నించారు. ‘‘జీవో45ని సమర్థిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సంతోషిస్తున్నాం. అమరావతిలో 50వేల పైచిలుకు ప్లాట్లు ఇచ్చేలా జగన్ నిర్ణయానికి అడ్డుపడ్డారు. టీడీపీ నేతల చెంప చెల్లుమనిపించేలా తీర్పు వచ్చింది. చంద్రబాబు అసైన్డ్ భూముల్ని స్మశానల పక్క, వాగులో, వంకల్లో ఇచ్చారు. చంద్రబాబు అంబేద్కర్ విగ్రహాన్ని సైతం వరదల్లో మునిగిపోయే ప్రాంతంలో పెట్టాలని చూశారు. సీఎం జగన్ మాత్రం విజయవాడ నడిబొడ్డున పెట్టారు. సీఎం జగన్కి కావాల్సింది ప్రజా రాజధాని.. రియల్ ఎస్టేట్ రాజధాని కాదు’’ అని నందిగం సురేష్ అన్నారు. చదవండి: ఓటమిలో టీడీపీ రికార్డు.. 50 నియోజకవర్గాల్లో హ్యాట్రిక్ పరాజయం! ‘‘అమరావతిలో పేదలు, దళితులు, బీసీలు ఉంటే మురికి కూపంగా మారుతుందని అభివృద్ధి జరగదంటూ కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పుతోనైనా చంద్రబాబు మారాలి. పేదల పట్ల ఇంత వివక్ష సరికాదు. రాష్ట్రంలోని పేదలపాలిట దరిద్రం చంద్రబాబు. ఆయనను రాష్ట్రంలోని పేదలంతా తరిమికొడతారు. టీడీపీ వస్తే అమరావతి నుండి పేదలను బయటకు పంపిస్తామని అచ్చెన్నాయుడు మాట్లాడటం సరికాదు. టీడీపీలోని దళితనేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి’’ అని ఆయన హితవు పలికారు. చంద్రబాబుకు, జగన్కు నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రాష్ట్రం మొత్తం బాగుండాలని జగన్ అనుకుంటే, తన సామాజిక వర్గం మాత్రమే బాగుండాలని చంద్రబాబు అనుకుంటున్నారు. దేవుడే ప్రత్యక్షమై మారమని చెప్పినా చంద్రబాబు మారడు. అణగారిన జాతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలందరి తరపున సీఎం జగన్కు కృతజ్ఞతలు. గుంటూరు, విజయవాడలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చాం’’ అని ఎంపీ సురేష్ పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే: మంత్రి కాకాణి -
చంద్రబాబు అండ్ కో కి సుప్రీం షాక్
-
సీట్ కు అమరావతి కేసు..పచ్చ నేతల గుండెలో గుబులు
-
అవినీతి మొత్తం బయటకు తీస్తాం.. అరెస్టులు కూడా జరుగుతాయి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జరిగిన అవినీతి మొత్తం బయటకు తీస్తామని తెలిపారు. సిట్ దర్యాప్తుతో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. కచ్చితంగా అరెస్టులు కూడా జరుగుతాయని అన్నారు. సుప్రీంకోర్టులోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ విజయం దక్కిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. విధానపరమైన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం కలిగిస్తే తప్పేనని పేర్కొన్నారు. గతంలో జరిగిన తప్పులను తప్పకుండా సమీక్ష చేయాల్సిందేనని తెలిపారు. రాష్ట్ర సంపదకు నష్టం కలిగించే కుట్రలను బయటకు తీస్తామన్నారు. టీడీపీ హయాంలో తప్పు చేయకపోతే వారికి భయమెందుకని ప్రశ్నించారు. చదవండి: సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట స్కిల్ డెవలప్మెంట్ స్కాంలోనూ చంద్రబాబు హస్తం ఉందని సజ్జల పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ స్కాంకు రాజధాని పేరు పెట్టారని.. అమరావతి పేరు చెప్పి దోచుకోవాలనుకున్నారని మండిపడ్డారు. అరచేతిలో స్వర్గం చూపించి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలిక నిర్మాణాల్లోనూ అవినీతికి పాల్పడ్డరన్నారు. టీడీపీ హయాంలో దేశంలోనే అతిపెద్ద భూ కంభకోణం జరిగిందన్నారు. నిజనిజాలను బయటకు తీసేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాజధాని పేరుతో చంద్రాబాబు ముఠా దోచుకున్నారని సజ్జల దుయ్యబట్టారు. తప్పు చేయకపోతే స్టే కోసం కోర్టులకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ సహా చంద్రబాబు ముఠాకు ఎందుకంత భయమని అన్నారు. టీడీపీ హయాంలో అక్రమాలపై సిట్ ఏర్పాటు జరిగిందని, సిట్ దర్యాప్తుపై స్టే తెచ్చుకుంటే అందులో ఏదో మతలబు ఉన్నట్లేనని అన్నారు. టీడీపీ నేతల్లో ఒకవైపు భయం, మరోవైపు అహంకారం కనిపిస్తోందన్నారు. సిట్ ఏర్పాటు కక్ష సాధింపు కానే కాదని స్పష్టం చేశారు. చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక -
‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక
సాక్షి, గుంటూరు: అమరావతి రాజధాని నిర్మాణం పేరిట జరిగిన భూ కుంభకోణంపై సమగ్ర నివేదికను ఏపీ మంత్రి వర్గ ఉప సంఘం రూపొందించింది. అయితే.. రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కోనుగోళ్లు జరిగాయని, క్యాపిటల్ సిటీ, రీజియన్ లో భూముల కొనుగోళ్లు అదీ బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేపట్టినట్టు నివేదికలో వెల్లడైంది. రాజధాని దొంగలపై కేబినెట్ సబ్ కమిటీ రూపొందించిన ఆ నివేదికలో సంచలన విషయాలు వెల్లడి కాగా.. ఈ నివేదిక సాక్షి చేతికి దొరికింది. టీడీపీ నేతలు, బినామీలకు మేలు చేసేలా రాజధాని సరిహద్దుల నిర్ణయం జరిగింది. అలాగే.. లంక, పోరంబోకు,ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాల గుర్తించింది కేబినెట్ సబ్ కమిటీ. లేండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారణ కావడంతో పాటు భూ కేటాయింపుల్లోనూ భారీ అక్రమాలకు పాల్పడింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. 1977 అసైన్డ్ భూముల చట్టంతో పాటు 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారణ అయ్యింది. ఇన్ సైడర్ ట్రేడింగ్పై పక్కా ఆధారాలు బినామీలు, నేతల భూములకు మేలు చేసేలా రాజధాని ఏర్పాటుకై చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం తీవ్ర కృషి చేసింది. ఇందుకోసం తెల్లరేషన్కార్డు ఉన్నవాళ్లను బినామీలుగా ఉపయోగించుకున్నారు టీడీపీ నేతలు. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరగ్గా.. 4 వేల 70 ఎకరాల భూములను ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొనుగోళ్లు చేశారు వాళ్లు. టీడీపీ నేతలు, ప్రముఖులు రాజధాని భూ కుంభకోణం నివేదికలో అసలు దొంగత పేర్లను సైతం మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. ఇందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు, చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ రావు, పుట్టా మహేష్ యాదవ్ పేర్లను నివేదికలో పేర్కొంది ఉప సంఘం. నారా లోకేష్ బినామీ వ్యవహారం.. నారా లోకేష్ బినామీ భూముల వ్యవహారాన్ని మంత్రివర్గ ఉప సంఘం బయటపెట్టింది. వేమూరి రవి కుమార్ కుటుంబం పేరుతో భారీగా భూముల కొనుగోళ్లు జరిగినట్లు గుర్తించింది. సుమారు 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు తేలింది. 👉 అలాగే.. భార్యా, బంధువుల పేర్లతో భూములు కొనుగోలు చేశాడు చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్. 👉 ఇక మాజీ మంత్రి నారాయణ బినామీ దందాను నివేదిక బయటపెట్టింది. సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణ కుమార్ పేర్లతో 55. 27 ఎకరాలు భూముల్ని మాజీ మంత్రి నారాయణ కొనుగోలు చేశారు. 👉 బినామీ పేర్లతో 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్. 👉 ఇక గుమ్మడి సురేష్ పేరుతో 38.84 ఎకరాల భూమి కొన్నాడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. 👉 మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు మైత్రీ ఇన్ ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు బట్టబయలైంది. 👉 పేర్లు, రికార్డులు, ఆధారాలతో సహా నివేదిక సమర్పించింది మంత్రి వర్గ ఉప సంఘం ఆ జీవో టీడీపీ నేతల కోసమే.. టీడీపీ నేతల కోసం సిఆర్డీయే పరిధి మార్చేసింది చంద్రబాబు హయాంలోని టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు సంక్షేమ పథకాలకు, జీవోలకు అడ్డుపుడుతున్న ఇదే పచ్చ నేతల కోసం.. అప్పట్లో జీవో జారీ చేసింది బాబు సర్కార్. 👉 సీఆర్డీయే పరిధిలో 524.545 ఎకరాల భూముల కోసం సరిహద్దులు మార్పు చేసింది. అలాగే నటుడు.. ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడి సంస్థ వీబీసీ కెమికల్స్ కు భూముల కేటాయింపు చేసింది. జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 498 ఎకరాల కేటాయించి.. భూములు కేటాయించాక సిఆర్డీయే పరిధి మారుస్తూ జీవో జారీ చేసింది. 👉 ఇక.. సత్తెనపల్లి మండలంలో దూళిపాళ్లలో కోడెల శివప్రసాద్(దివంగత మాజీ స్పీకర్)కు భూములు ఉన్నాయి. మొవ్వ మండలం పెద ముట్టేవి, చిన ముట్టేవిలో లింగమనేనికి భూములు ఉన్నాయి. భూముల్ని కేటాయించాక పరిధి మారుస్తూ 207 జీవో విడుదల చేసింది టీడీపీ ప్రభుత్వం. ఇక కొనకంచిలో యలమంచిలి శివలింగ ప్రసాద్ భూముల కోసం సీ ఆర్డీయే సరిహద్దుల్లో మార్పులు చేసింది. సంస్థల కేటాయింపుల్లోనూ.. వివిధ సంస్థలకు కేటాయించిన భూముల్లోనూ అక్రమాలను గుర్తించింది ఏపీ కేబినెట్ సబ్ కమిటీ. ఆ వివరాలను నివేదికలో పొందుపరిచింది. ఐదు ప్రైవేట్ సంస్థలకు 850 ఎకరాల భూమిని అక్రమంగా కేటాయించినట్లు తేలింది. అలాగే.. సింగపూర్ తో ఒప్పందంలోనూ లోపాలను గుర్తించిన మంత్రివర్గ ఉప సంఘం.. మొత్తంగా టీడీపీ హయాంలో జరిగిన భూ దందాను, అక్రమాలను సమగ్రమైన నివేదిక ద్వారా ప్రభుత్వానికి సమర్పించింది. ఇదీ చదవండి: చంద్రబాబు హయాం అవినీతిపై సిట్ దర్యాప్తునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ -
అమరావతి పేదల ఇళ్ల స్థలాల కేసులో సుప్రీం సానుకూలత
సాక్షి, ఢిల్లీ: గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పేదలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న సీఎం జగన్ సంకల్పాన్ని అడ్డుకునే టీడీపీ యత్నానికి కోర్టులో బ్రేకు పడింది. ఈ కేసులో సుప్రీం కోర్టు సానుకూలత ప్రదర్శించింది. ‘మీ 35 సెంట్ల భూమి నుంచి పేదలకు స్థలం ఇస్తున్నారా?. 75 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంటి?’ అంటూ పిటిషనర్పై సుప్రీం కోర్టు సీరియస్ అయినట్లు సమాచారం. అలాగే.. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్టే ఇవ్వాలన్న పిటిషన్ను విచారణకు నిరాకరించింది సుప్రీం. ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు స్పష్టం చేసింది. దీంతో చేసేది లేక పిటిషన్ను ఉపసంహరించుకున్నాడు టీడీపీ సానుభూతిపరుడు శివ. అమరావతి రాజధాని ప్రాంతాల్లో వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. ఈ ప్రయత్నాలను టీడీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అమరావతిలో పేదలకు స్థానం లేదని కోర్టుల ద్వారా అడ్డుపడే ప్రయత్నం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల ఇవ్వాలన్న జీవో పై స్టే ఇవ్వాలని అడిగారు. మీకు ప్లాట్లు ఇస్తున్నప్పుడు దీన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు అని సుప్రీం కోర్టు అడిగింది. పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. పేదలకు సెంట్ భూమి ఇస్తే ఎందుకు కడుపు మంట. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, గత్యంతరం లేక పిటిషన్ విత్ డ్రా చేసుకున్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం పేదలకు 5శాతం ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇస్తుంది అని అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తెలిపారు. చట్టం ప్రకారం పేదలకు అయిదు శాతం ఇవ్వాల్సిందే. కానీ గత ప్రభుత్వం దీన్ని విస్మరించింది. అయితే వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో 45 ద్వారా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. మాస్టర్ ప్లాన్ సవరణ చేసి ఆర్-5 జోన్ ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారమే వీటిని ఇచ్చారు అని ఏపీ ప్రభుత్వ స్పెషల్ జీపీ కాసా జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అమరావతి కేసులో మంచి నిర్ణయం జరిగింది. పేదలకు ఇళ్ల ఇవ్వకుండా చేసిన ప్రయత్నాలు నెరవేరలేదు. వైఎస్ జగన్ పేదల కోసం తీసుకున్న నిర్ణయాలు సఫలపవుతయి అని అడ్వకేట్ జానకీ రామయ్య పేర్కొన్నారు. -
రాజధాని అందరిదీ.. అందులో అందరూ ఉండాలి: ఏపీ హైకోర్టు
అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించేందుకు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల కలెక్టర్లకు భూమిని బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్ కు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 45ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం సీజే జస్టిస్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా.. రాజధాని అందరిదీ అని, అందులో అందరూ ఉండాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. కౌంటర్ను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నా ప్రధాన న్యాయమూర్తి.. తదుపరిఇ విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేశారు. కాగా, సీఆర్డీఏ చట్ట నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో పేదలకు నివాసాలు కల్పించేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31న జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. -
పేదలకిచ్చే స్థలాలపై అమరావతి రైతుల పిటిషన్లు
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ చట్ట నిబంధనల ప్రకారం రాజధాని ప్రాంతంలో పేదలకు నివాసాలు కల్పించేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31న జారీ చేసిన జీవో 45ను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలైన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్ విచారణ జరిపారు. విచారణ సందర్భంగా ఇదే అంశానికి సంబంధించిన వ్యాజ్యాలను ఇప్పటికే ప్రధాన న్యాయమూర్తి (సీజే) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోందని, మంగళవారం విచారణకు అదనపు ఏజీ అందుబాటులో ఉంటారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. అదనపు ఏజీ కార్యాలయం సైతం త్రిసభ్య ధర్మాసనం ముందు ఇదే అంశానికి సంబంధించిన వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నందున, తాజా వ్యాజ్యాలను కూడా త్రిసభ్య ధర్మాసనమే విచారించడం సబబుగా ఉంటుందంటూ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి కార్యాలయం రాతపూర్వకంగా కోర్టు ముందు మెమో దాఖలు చేసింది. తాజా వ్యాజ్యాలను ఇప్పటికే త్రిసభ్య ధర్మాసనం ముందున్న వ్యాజ్యాలతో జత చేయాలని అదనపు ఏజీ ఆ మెమోలో కోర్టును కోరారు. ద్విసభ్య ధర్మాసనం విచారణకు ఆదేశాలిచ్చిన సీజే అటు ఏజీ వాదనలను, ఇటు ఏఏజీ మెమోను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రాయ్ సైతం ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనమే విచారించడం మేలని అభిప్రాయపడ్డారు. అయితే, తమ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు కోరడంతో.. ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు వచ్చే విషయంలో తగిన నిర్ణయం తీసుకునేందుకు కేసు ఫైళ్లను (సీజే) ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ ఈ వ్యాజ్యాలను సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్మిశ్రా ముందుంచింది. వీటిని పరిశీలించిన సీజే మంగళవారం ద్విసభ్య ధర్మాసనం విచారణకు వేయాలని ఉత్తర్వులిచ్చారు. దీంతో ఈ వ్యాజ్యాలపై మంగళవారం సీజే జస్టిస్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. -
‘టీడీపీ, కొన్ని దుష్టశక్తులు మూడు రాజధానులను అడ్డుకుంటున్నాయి’
సాక్షి, అమరావతి: ‘మాకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు ఎన్నికలు కావాలి. ఎన్నికలు వస్తే ఏదో అయిపోతానని ఆయన కలలు కంటున్నాడు. ఏమీ కాడు. ఇప్పుడు కొంతైనా ఆశతో బతుకుతున్నాyý ు. ఎన్నికల తర్వాత అదీ ఉండదు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్నన్ని సీట్లు కూడా ఆ పార్టీకి రావు. వాపును చూసి బలుపనుకుంటున్నాడు. ఎన్నికలయ్యాక చంద్రబాబు తుస్సుమంటాడు’ అని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పాలన, అధికార వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం అభివృద్ధి సాధించగలుగుతుందన్నది తమ పార్టీ విధానమని చెప్పారు. తమ పార్టీ తొలి నుంచీ మూడు రాజధానులకే కట్టుబడి ఉందని, ఎప్పుడైనా తమది అదే నినాదమని స్పష్టం చేశారు. రేపటి నుంచే మూడు రాజధానులు అమల్లోకి రావాలన్నది తన డిమాండ్ అని, ఆ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభ్యర్థిస్తున్నానని తెలిపారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని న్యాయ పరమైన చిక్కుల వల్ల విశాఖ నుంచి పాలన ఆలస్యమవుతోందన్నారు. టీడీపీ, కొన్ని దుష్ట శక్తులే మూడు రాజధానుల ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయని.. తుదకు న్యాయం, నిజమే గెలుస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానుల నినాదం వినిపిస్తామని చెప్పారు. కర్నూలు న్యాయ రాజధానిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. తాము చట్టం, రాజ్యాంగం ప్రకారమే ముందుకు వెళ్తామన్నారు. మంత్రి బొత్స ఇంకా ఏమన్నారంటే.. మా ప్రభుత్వంపై పెరిగిన నమ్మకం అమరావతిలో ఉద్యమ స్ఫూర్తి అంటే ఏంటి? టెంట్లు వేసుకుని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడమా? అక్కడ ఒకరిద్దరు రైతులు తప్ప మిగతా వారంతా చంద్రబాబు బినామీలు. బీజేపీ నేత సత్యకుమార్పై దాడి మాకేం అవసరం? మా పార్టీపై రాజకీయంగా బురదజల్లే ప్రయత్నాలవి. అమరావతిలో రాజధాని నిర్మాణం పేరిట రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని, జాతి సంపదను గోతుల్లో పోయమంటే ఎలా? అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామంటే అభ్యంతరం ఎందుకు? పేదలు, సామాన్యులు అక్కడ ఉండకూడదనడం ఎంత వరకు సబబు? దేశ చరిత్రలో ఎక్కడా లేనంతగా క్యాలెండర్ ప్రకారం సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. మా ప్రభుత్వంపై ప్రజలకు మరింత నమ్మకం, భరోసా పెరిగింది. వారి ఆర్థిక పరిస్థితులు బాగు పడుతున్నాయి. ఇలాంటప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆతృత మా పార్టీకి ఎందుకు ఉంటుంది? ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమికి నేనే బాధ్యత వహిస్తున్నా. ఓటమిపై పరిశీలన చేసుకొని, లోటుపాట్లుంటే సరి చేసుకుంటాం. దశాబ్దాలుగా మార్గదర్శి అక్రమాలకు పాల్పడుతోంది. ఇన్నాళ్లూ దాని యాజమాన్యం తప్పించుకుంది. ప్రస్తుతం మరిన్ని అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఇక తప్పించుకోవడం సాధ్యం కాదు. -
తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా: సీఐడీ విచారణలో నారాయణ తీరు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం హయాంలో జరిగిన అమరావతి భూముల కుంభకోణం కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ సీఐడీ విచారణకు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. అసైన్డ్ భూములు, బినామీ పేర్లతో భూములు కొనుగోలు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ రూపొందించడంలో అక్రమాలపై సీఐడీ అధికారులు ఎంత గుచ్చి గుచ్చి అడిగినా నారాయణ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదని సమాచారం. తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా అనే రీతిలో నారాయణ వ్యవహరించారని తెలిసింది. ఈ మేరకు సీఐడీ అధికారులు నారాయణ, ఆయన భార్య పి.రమాదేవి, నారాయణ విద్యా సంస్థల ఆర్థిక వ్యవహారాల కోసం ఏర్పాటు చేసిన ఎన్ స్పైరా సంస్థలో కీలక స్థానంలో ఉన్న పొత్తూరి ప్రమీల అనే ఉద్యోగిని హైదరాబాద్లో సోమవారం వేర్వేరుగా విచారించారు. నారాయణ విద్యా సంస్థలు, ఎన్ స్పైరా సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాలకు నిధుల బదలాయింపుపై సీఐడీ అధికారులు నారాయణను ప్రశ్నించారు. ఇక ఆ నిధులతో బినామీల పేరిట అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన రికార్డులు చూపిస్తూ పలు ప్రశ్నలు వేశారని తెలుస్తోంది. అలాగే నారాయణ బినామీల పేరిట కొనుగోలు చేసిన భూముల సమీపంలోనే స్టార్టప్ సిటీ వచ్చేలా సీఆర్డీఏ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిన ఉదంతంపైన కూడా వివరాలు అడిగారు. ఆ సమయంలో మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ మాస్టర్ ప్లాన్ను ప్రభావితం చేశారని అభియోగాలు ఉన్నాయి. అలాగే నారాయణ విద్యా సంస్థలు, చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, వారి సన్నిహితుడు లింగమనేని కుటుంబానికి చెందిన సంస్థల భూముల విలువ అమాంతం పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చేలా నారాయణ అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై కూడా సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ నారాయణ ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. సీఐడీ విచారణకు ఏమాత్రం సహకరించకూడదని ఆయన ముందుగానే ఓ నిర్ధారణకు వచ్చినట్టుగా వ్యవహరించారని సమాచారం. అలాగే నారాయణ భార్య రమాదేవి, పొత్తూరి ప్రమీల కూడా విచారణకు ఏమాత్రం సహకరించ లేదు. నారాయణ కుమార్తెను ఇంటి వద్దే విచారించండి అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై నమోదు చేసిన కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ నారాయణ కుమార్తె సింధూర, ఆమె భర్త పునీత్, అతడి సోదరుడు వరుణ్ కుమార్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ బాబీలు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం విచారణ జరిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, సింధూరను ఆమె ఇంటి వద్దే ఈ నెల 20న విచారించాలని సీఐడీని ఆదేశించారు. అలాగే అదే రోజున సీఐడీ ముందు హాజరు కావాలని పునీత్, వరుణ్లకు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఇక అంజనీ కుమార్ను అదే రోజున న్యాయవాది సమక్షంలో విచారించాలని సీఐడీకి సూచించారు. -
అమరావతి భూముల కుంభకోణం: నారాయణను ప్రశ్నించిన సీఐడీ
సాక్షి, హైదరాబాద్: అమరావతి రాజధాని భూముల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను సీఐడీ అధికారులు విచారించారు. ఈ మేరకు హైదరాబాద్లోని నారాయణ నివాసానికి చేరుకున్న అధికారులు.. ఆయనను ప్రశ్నించారు. నారాయణ సతీమణి, ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ యజమానిని కూడా సీఐడీ అధికారులు ప్రశ్నించారు. కూకట్పల్లి లోధా అపార్ట్మెంట్లో మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో ఏపీ సీఐడీ అధాకారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. నారాయణ సంస్థల నుంచి రామకృష్ట సంస్థలోకి నిధుల మళ్లించినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. అధికారుల దర్యాప్తులో బినామీల పేర్లపై అమరావతిలో అసైన్డ్ భూముల కోనుగోలు చేసినట్లు తేలింది. ఈ దందాలో నారాయణ అప్పటి మంత్రులు, వారి బినామీలు ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి అక్రమంగా అసైన్డ్ భూముల కొనుగులు చేసినట్లు గుర్తించారు. ల్యాండ్ పూలింగ్ కింద ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఈ భూముల కొనుగోలు జరిగాయని, టీడీపీ ప్రభుత్వంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి మందడం, వెలగపూడి రాయపూడి, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేసినట్లు బయటపడింది. 150 ఎకరాల అసైన్డ్ భూముల అక్రమ కొనుగోలుపై దర్యాప్తు 150 ఎకరాల అసైన్డ్ భూముల అక్రమ కొనుగోలుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. రాజధాని పరిసరాల్లో 65. 50 సెంట్ల భూమి నారాయణ కొనుగోలు చేశారు. ఆవుల ముని శంకర్ పేరు మీ 4.2 కోట్ల విలువగల భూమి నారాయణ కొనుగోలు చేశారు. 2017 జూన్, జూలై, ఆగస్టులలో భూములు నారాయణ కొనుగోలు చేశారు. వీటితో పాటు పొట్టూరి ప్రమీల పేరు మీద, రావూరి సాంబశివరావు పేరు మీద భూములు కొనుగోలు చేశారు. ఈ భూముల కొనుగోలు సందర్భంగా ముగ్గురి అకౌంట్లలోకి భారీగా నిధులు మళ్లించారు. దీనిలో భాగంగా గతంలో నారాయణ కుమార్తెలు శరాని, సింధూర ఇళ్లలో సైతం సీఐడీ సోదాలు నిర్వహించింది. ఈ మేరకు బ్యాంకు లావాదేవీలు, మణి కూటింగ్ పోన్ కాల్స్ రికార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. తమవారికి లాభం చేకూరేలా అలైన్మెంట్ డిజైన్లు నారాయణ మార్చారు. నారాయణ ఎడ్యుకేషన్ సొపైటీ, నారాయణ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్, రామనారాయణ ట్రస్టు ద్వారా 17. 5 కోట్ల నిధులు మళ్లించారు. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు సైతం భారీగా నిధుల మళ్లించి, ఆ నిధులను అసైన్డ్ భూమి రైతులకు చెల్లించారు. చదవండి: సాత్విక్ కేసు: రోజు స్టడీ అవర్లో జరిగింది ఇదే.. పోలీసుల రిపోర్ట్ -
అమరావతి భూముల దర్యాప్తులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: అమరావతి భూముల దర్యాప్తులో సీఐడీ చేతికి కీలక ఆధారాలు లభించాయి. హైదరాబాద్లోని నారాయణ కూమార్తెలు, బంధువుల ఇళ్లల్లో జరిపిన సోదాల్లో ఆడియో క్లిప్ లభించింది. నారాయణ, ఆయన కుమార్తె మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. ఇందులో మనీ రూటింగ్ ఎలా చేయాలో కుమార్తెకు నారాయణ వివరించినట్లు సమాచారం. దీని ప్రకారమే మనీ రూటింగ్... తద్వారా అమరావతిలో భూములు కొనుగోలు జరిగినట్లు ఆడియో క్లిప్ ద్వారా తెలుస్తోంది. కాగా, మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యుల నివాసాల్లో రెండో రోజు ఏపీ సీఐడీ అధికారుల సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మీనాక్షి బాంబుస్, కొండాపూర్లోని కోళ్ల లగ్జరియా విల్లాస్లోని నారాయణ, ఆయన కుమార్తెల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు అధికారులు. అమరావతి భూముల కొనుగోళ్లకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసుల దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి. -
నారాయణ సంస్థలపై సీఐడీ దాడులు.. సంచలన విషయాలు వెలుగులోకి!
ఆంద్రప్రదేశ్ మాజీ మంత్రి, ప్రముఖవిద్యా సంస్థల అధినేత పి.నారాయణకు చెందిన సంస్థలపై సీఐడీ అధికారులు చేసిన దాడులలో సంచలన విషయాలే వెలుగులోకి వచ్చినట్లు కనిపిస్తుంది. నిజానికి ఎప్పుడో వీరు కనిపెట్టి ఉండాల్సింది. అయినా న్యాయపరమైన చిక్కులు, తెలుగుదేశం పార్టీకి ఉన్న మేనేజ్ మెంట్ స్కిల్స్ నేపథ్యంలో సీఐడీ స్లో గా వెళుతోందనినుకోవాలి. చాలా కాలం క్రితమే రాజధాని భూముల కుంభకోణంపై కేసులు నమోదు అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కూడా కేసు పెట్టినా, దానిని ముందుకు తీసుకువెళ్లడానికి పోలీసులు వెనుకాముందాడుతున్నారని చెప్పాలి. ఆయనకు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. తాజాగా నారాయణకు చెందిన ఎన్స్పైర్ అనే సంస్థలో పోలీసులు సోదాలు జరపగా, ఆయన నడుపుతున్న షెల్ కంపెనీల బాగోతం కూడా బయటపడిందట. రెండు కంపెనీల పేరుతో సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఎన్ స్పైర్లో పెట్టారట. అక్కడ నుంచి ఆ డబ్బు నారాయణ బంధువుకు చెందిన రామకృష్ణ హౌసింగ్కు బదలాయించారు. ఇదంతా అస్సైన్డ్ భూముల కొనుగోలులో వెచ్చించారట.. ఇదంతా బ్లాక్ మనీగా భావిస్తున్నారు. అస్సైన్డ్ భూముల క్రయవిక్రయాలు చెల్లవు. ఆ పాయింట్ ఆధారంగా నారాయణ బినామీలు పెద్ద ఎత్తున బలహీనవర్గాలను భయపెట్టి ఉండాలి. ఆ తర్వాత తాము ఇంత మొత్తం ఇస్తామని చెప్పి వారికి ఆశ కల్పించి ఆ భూములను పొందారన్నది సమాచారం. తదుపరి ఆ భూముల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు తెచ్చారు. తద్వారా అస్సైన్డ్ భూములు వారు స్వాధీనం చేసుకోగలిగారు. దీనిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసు విచారణ చేపట్టిన సిఐడికి పలు సంచలన విషయాలు తెలిశాయి. ఇందులో పెద్ద ఎత్తున నల్లధనం వెచ్చించారని కనుగొన్నారు. నిజానికి అమరావతి రాజధానిని రియల్ ఎస్టేట్ వెంచర్ మోడల్ లోనే ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్లింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఎకరా పది లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ఉండేది. పచ్చటి పొలాలు ఉన్న భూములు. ఏడాదికి మూడు పంటలు పండుతాయి. అలాంటి భూములలో రాజధాని పెట్టవద్దని కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటి స్పష్టంగా సూచించినా, చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా భూ సమీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరదీశారు. అందులో భాగంగా ప్రభుత్వ భూమి ఇరవై ఏకరాలతో పాటు ప్రైవేటు భూములు ముప్పై మూడు వేల ఎకరాలు సమీకరించారు. అందుకు ప్రతిఫలంగా సంబంధిత రైతులకు వారి అర్హతను బట్టి ఎకరాకు యాభై వేల రూపాయల కౌలు, 1450 గజాల వరకు స్థలం కేటాయింపు వంటివి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఒప్పందం ఆధారంగా అనేక మంది రైతులు తమకు వచ్చే ప్లాట్లను ముందుగానే అమ్ముకున్నారు. కొంతమంది తమ పొలాలను అమ్ముకోగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి వారు ప్లాట్లు పొందడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం రోడ్లు,డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చవలసి ఉంటుంది. ఇందుకోసం లక్షల కోట్ల రూపాయలను వ్యయం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినది కాదు. స్థోమతకు మించిన పని . రాజధాని కి సంబందించిన కార్యాలయాలు అది కూడా అసెంబ్లీ, సచివాలయం వంటివి తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించారు. ఇదిలా ఉండగా, రాజదాని గ్రామాలలో భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇన్ సైడ్ ట్రేడింగ్ తో పలువురు టిడిపి నేతలు ఈ భూములను ముందుగానే కొనుగోలు చేసి లాభాలు పొందడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా వీరిలో అత్యధికులు నల్లధనాన్నే ఎక్కువగా వెచ్చించారు. ఒక పక్క ఎకరా భూమి కోటి రూపాయల నుంచి నాలుగు కోట్ల రూపాయలకు పెరిగిందని ఘనంగా చంద్రబాబు, మంత్రి నారాయణ వంటివారు చెబుతుండేవారు. అంటే దాని అర్దం ఏమిటి? ఒకపక్క రాజధాని గ్రామాలలో భూముల రిజిస్ట్రేషన్ విలువ గజం ఐదువేల రూపాయలు కాగా, మార్కెట్ విలువ మాత్రం నలభై,ఏభై వేలకు ఉండేది. దాంతో సుమారు ముప్పైవేల నుంచి ముప్పై ఐదు వేల మేర బ్లాక్ మనీని చెల్లించి భూములు కొన్నారన్నమాట. పైగా భూములు అమ్మిన రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడానికి వీలుగా కేంద్రాన్ని ఒప్పించారు. ఈ మొత్తం ప్రాసెస్ కొన్ని వేల కోట్ల నల్లధనం చలామణి అయిందని అంచనా. ఆ విషయాలు అన్నీ అప్పుడే అందరికి తెలుసు. చంద్రబాబు అప్పట్లో మోదీ ప్రభుత్వం నియమించిన నల్లధనం వ్యతిరేక కమిటీకి ఆధ్వర్యం కూడా వహించారు. చిత్రం ఏమిటంటే అమరావతిలో మొత్తం నల్లధనం వ్యాపారాన్ని ఆయనే ప్రోత్సహించారు. ఇప్పుడు సిఐడి విచారణలలో ఆధార సహితంగా బయటకు వస్తున్నాయి. ఒక్క నారాయణకు చెందిన షెల్ కంపెనీలే ఈ అస్సైన్డ్ భూములలో వెయ్యి కోట్ల నల్లధనం ఖర్చు చేసిందని అంచనా. ఈ లెక్కన మొత్తం జరిగిన లావాదేవీలలో ఎన్నివేల కోట్ల నల్లధనం చలామణి అయి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇంతలో ప్రభుత్వం మారడంతో మొత్తం కధ అడ్డం తిరిగింది. వైసిపి ప్రభుత్వం అమరావతి భూ సమీకరణలో , ఇన్ సైడ్ ట్రేడింగ్ లో పెద్ద స్కామ్ లు జరిగాయని కేసులు పెట్టడం, టిడిపి నేతలు కోర్టు నుంచి రక్షణ పొందడం జరిగింది. గత మూడేళ్లుగా ఇక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన టీడీపీ నేతలకు ఇది జీర్ణించుకోలేని విషయంగానే ఉంది. దానికి తోడు ఈ నల్లధనం వ్యవహారం ముందుకు వస్తే అది ఎటువైపు దారితీస్తుందన్న భయం వారిలో ఉంది. దానికి తగ్గట్లే నారాయణ సంస్థల బినామీ బాగోతాన్ని సిఐడి కనుగొంది. ఈ కేసు ముందుకు వెళుతుందా? లేక యధాప్రకారం కోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటారా అన్నది చూడాల్సిందే. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ -
‘అసైన్డ్’ ప్లాట్లు అమ్ముతాం! అమరావతిలో పచ్చ గ్యాంగ్ నయా దందా
సాక్షి, అమరావతి: ‘ప్లాట్లు అమ్ముతాం బాబూ.. అమరావతిలో ప్లాట్లు అమ్ముతాం.. కొంత తక్కువ ధరకే ఇస్తాం.. మంచి అవకాశం.. త్వరగా వచ్చి కొనుగోలు చేయండి.’ ఇదీ అమరావతి పరిరక్షణ సమితిలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు నేతల తాజా నినాదం. ఇందులో విశేషం ఏముందీ అంటారా.. అక్కడే ఉంది అసలు గుట్టు. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వం సమీకరించిన భూముల్లో వారికి సంబంధించిన భూమి ఒక్క సెంటు కూడా లేదు. కానీ ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినట్టుగా కనికట్టు చేసి ప్లాట్లు పొందారు. ఈ బండారం సీఐడీ దర్యాప్తుతో బట్టబయలు అవుతుండటంతో గుట్టు చప్పుడు కాకుండా ఆ ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకునే యత్నాల్లో నిమగ్నమయ్యారు. అమరావతిలో మరో కొత్త భూదందాకు తెరతీశారు. ఇదీ ఉద్యమ నేత తీరు.. ఆయన అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమనేత. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు కనుసన్నల్లో అమరావతి ఉద్యమాన్ని నడుపుతున్నారు. అమరావతిలో ఆయనకున్న 20 ప్లాట్లను ఒక్కొక్కటిగా అమ్మకానికి పెడుతున్నారు. ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతుల జాబితాలో ఆయన పేరే లేదు. కానీ అసైన్డ్ రైతుల పేరిట అక్రమంగా ఆయనకు గత ప్రభుత్వం 20 ప్లాట్లు కేటాయించింది. రిజిస్టర్ సేల్ డీడ్ కింద వాటిని ఆయన పేరిట రిజస్టర్ చేశారు. అవన్నీ తుళ్లూరు మండలం మందడం పరిధిలోనివే కావడం గమనార్హం. సర్వే నంబర్లు 199, 133, 131, 242, 236, 321, 308, 307, 268, 295, 408, 296, 413, 465తో ఉన్న ఆ ప్లాట్లను ఆయన విక్రయించేందుకు యత్నిస్తుండటం అమరావతిలో చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూములన్నీ పలువురి రైతుల పేరిట ఉన్నాయి. కానీ సీఆర్డీయే రికార్డుల్లో మాత్రం అమరావతి పరిరక్షణ సమితి నేత పేరిట నమోదు కావడం గమనార్హం. ఆ భూముల కొనుగోలుకు ఆసక్తి కనబరిచిన కొందరు సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సంప్రదించడంతో అసలు విషయం వెలుగుచూసింది. వెంకటపాలెంలో సర్వే నంబరు 295/10, 296/5, మందడంలో సర్వే నంబరు 454/3సీ, కురగల్లులో సర్వే నంబరు 500/1లో ఉన్న ప్లాట్లు కూడా విక్రయించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. 964 ఎకరాల అసైన్డ్ భూములు కొల్లగొట్టారు అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో కూడిన కోర్ క్యాపిటల్ ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ పెద్దలు అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. సీఐడీ దర్యాప్తులో ఈ బండారం మొత్తం బయటపడింది. అమరావతిలో 2014 వరకు అసైన్డ్ భూములు ఎవరి పేరుతో ఉన్నాయి? 2016లో భూ సమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో పేర్కొన్న పేర్లు ఏమిటన్నది పరిశీలించినప్పుడు టీడీపీ భూ బాగోతం గుట్టు రట్టయింది. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్ భూముల హక్కుదారుల జాబితాలో ఉన్న రైతుల పేర్లకు, సీఆర్డీఏకు భూములిచ్చిన వారుగా పేర్కొన్న జాబితాలోని పేర్లకు ఎక్కడా పొంతనే లేదు. బడుగు, బలహీన వర్గాల రైతుల స్థానంలో టీడీపీ పెద్దల బినామీలు, సన్నిహితుల పేర్లు కనిపించాయి. ఇలా 29 గ్రామాల పరిధిలో 964.88 ఎకరాలకు సంబంధించి భూ హక్కుదారుల పేర్లను గల్లంతు చేశారు. వాటిలో బడుగు, బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూములు 636.75 ఎకరాలున్నాయి. వాటిలో అత్యధిక భాగం టీడీపీ పెద్దలు తమ బినామీల పేరిట కొల్లగొట్టారు. అనంతరం ఆ భూములను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినట్టుగా చూపించి ప్లాట్లు తీసుకున్నారు. బినామీలుగా ఉన్నందుకు కొందరు అనుయాయులకు కూడా కొన్ని ప్లాట్లు కేటాయించారు. వారిలో టీడీపీ మంత్రుల వ్యక్తిగత సహాయకులు, అమరావతి ప్రాంతంలో ఆ పార్టీ కార్యకర్తలు మొదలైన వారు ఉన్నారు. ప్రస్తుతం వారే అక్రమంగా పొందిన అసైన్డ్ ప్లాట్లను విక్రయించేందుకు యత్నిస్తున్నారు. ఆ ప్లాట్లను ఎలా విక్రయిస్తారన్నది తాడేపల్లి, మంగళగిరిలో హాట్ టాపిక్గా మారింది. సీఐడీ దర్యాప్తుతో బెంబేలు అమరావతి అక్రమాలపై సీఐడీ దరా>్యప్తుతో అసైన్డ్ దొంగలు కలవరపడుతున్నారు. మొత్తం వ్యవహారం నిగ్గు తేలితే తాము అక్రమంగా పొందిన ప్లాట్ల కేటాయింపును రద్దు చేస్తారని వారు ఆందోళన చెందుతున్నారు. దాంతో ఆ ప్లాట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ నిర్వహిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నవారే తమ ప్లాట్లను విక్రయించేందుకు యత్నిస్తుండటం గమనార్హం. భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని న్యాయస్థానం చెప్పింది. దాంతో బోగస్ అమరావతి రైతు ఉద్యమ నేతలకు ఝలక్ ఇచ్చినట్లయింది. గుర్తింపు కార్డులు లేకపోవడంతో పాదయాత్ర నిలిపివేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్నది స్పష్టత లేదు. దాంతో తాము అక్రమంగా పొందిన ప్లాట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేసి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. భూమి చూపించకుండానే కేవలం సేల్ డీడ్ పత్రాలను చూపించి ప్లాట్ల విక్రయాల దందాకు తెరతీశారు. తుళ్లూరు, మందడం, ఉద్దండరాయునిపాలెం, కురగల్లు, పెనుమాక, నవులూరు తదితర గ్రామాల్లో అక్రమంగా పొందిన అసైన్డ్ ప్లాట్లను విక్రయించేందుకు లావాదేవీలు జోరందుకున్నాయి. -
రాజధాని భూములను ఇతర అవసరాలకు వాడకూడదు
సాక్షి, అమరావతి: రాజధాని కోసం ఇచ్చిన భూములను ఆ ప్రయోజనం కోసం కాకుండా, ఇతర అవసరాలకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని అమరావతి రైతుల తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు బుధవారం హైకోర్టుకు నివేదించారు. రాజధాని నిర్మాణం కోసం ఉపయోగించాల్సిన భూములను ఇతరులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం మాస్టర్ ప్లాన్కు విరుద్ధమని అన్నారు. సీఆర్డీఏ చట్ట సవరణ ద్వారా రాజధానిలో రాజధానేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. మధ్యంతర ఉత్తర్వుల జారీ వ్యవహారంలో రైతుల తరఫు న్యాయవాదుల వాదనలు ముగియడంతో ప్రభుత్వం, సీఆర్డీఏ వాదనల నిమిత్తం హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను సవాలు చేస్తూ అమరావతి రైతు సంఘాలు వేర్వేరుగా వేసిన పిటిషన్లు, ఇళ్ల స్థలాలు కేటాయించకుండా యథాతథస్థితి కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ వేసిన అనుబంధ పిటిషన్లపై జస్టిస్ దుర్గాప్రసాదరావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున బి.ఆదినారాయణరావు, కారుమంచి ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే తగిన పరిహారం చెల్లించి భూ సేకరణ ద్వారా కేటాయించాలే తప్ప, రాజధాని కోసం తామిచ్చిన భూముల్లో స్థలాలు ఇవ్వడానికి వీల్లేదని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ద్వారా రాజధాని నగరాన్ని మురికివాడగా మార్చకూడదన్నదే తమ వాదనని తెలిపారు. -
తెలీదు.. గుర్తు లేదు: సీఐడీ విచారణలో ఇదే ‘నారాయణ’ మంత్రం
సాక్షి, అమరావతి/హైదరాబాద్: టీడీపీ హయాంలో అమరావతిలో భూ కుంభకోణాల కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత పి.నారాయణను సీఐడీ అధికారులు హైదరాబాద్లో శుక్రవారం విచారించారు. అమరావతిలో ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారులో టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణలతో పాటు మొత్తం 14 మందిపై కొన్ని నెలల క్రితం సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో నారాయణను ఆయన నివాసంలో విచారించేలా న్యాయస్థానం ఇటీవల అనుమతిచ్చింది. దాంతో సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించింది. కాగా, సీఐడీ విచారణకు నారాయణ ఏమాత్రం సహకరించలేదని సమాచారం. సీఐడీ అధికారులు ఏం అడిగినా ‘తెలియదు.. గుర్తు లేదు’ అంటూ సమాధానం దాటవేసేందుకు యత్నించారని తెలిసింది. ఈ కేసులో నారాయణను మరికొన్నిసార్లు విచారించాలని సీఐడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో నారాయణకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని సీఐడీ అధికారులు దాఖలు చేసిన పిటీషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఇటూ అటూ బాబు బినామీలే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో టీడీపీ పెద్దలు యథేచ్ఛగా సాగించిన భూ దోపిడీలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కూడా ప్రధానమైంది. అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ.. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో భారీగా భూ దోపిడీకి పాల్పడ్డారన్నది సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ను ముందుగానే మాస్టర్ ప్లాన్లో చేర్చిన విషయాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. ఆ రోడ్డు అలైన్మెంట్ను డిజైన్ చేసేందుకు ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించినట్టు కథ నడిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలా నిర్మించనున్నారో ముందుగానే తెలిసిన చంద్రబాబు, నారాయణలు తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట భారీగా భూములు కొన్నారు. ముందుగానే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు డ్రాఫ్ట్ ప్లాన్ను చంద్రబాబు నేతృత్వంలో నిర్వహించిన సమీక్షలో ఆమోదించారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడుతామని చేసిన పదవీ స్వీకార ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించి, వారి బినామీలకు అక్రమంగా భారీ ప్రయోజనం కలిగించారు. దాంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. సీఐడీ అధికారులు మంగళగిరి, పెదకాకాని, తాడికొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది. సీఆర్డీఏ ఫైళ్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు, ఇతర ఆధారాలను సీఐడీ విభాగం సేకరించి కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి: Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు -
ప్రభుత్వ అధికారాలపై విచారిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం మారిన తర్వాత ఏర్పడిన నూతన ప్రభుత్వం గత సర్కారు నిర్ణయాలపై దర్యాప్తు చేసే అంశంపై లోతుగా విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. అమరావతి భూముల విషయంలో గత ప్రభుత్వ నిర్ణయాలపై దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటుచేసే అధికారం తర్వాత వచ్చిన ప్రభుత్వానికి గవర్నమెంట్కు లేదన్న ఏపీ హైకోర్టు ఆదేశాలు సవాల్చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. \ అసలు ఇది సీబీఐకి రిఫర్ చేయాల్సిన అంశమని తెలిపారు. అమరావతి భూములపై పలు నోటిఫికేషన్లు ఇచ్చామని, సిట్ ఏర్పాటుచేశామని, పోలీసు నోటీసులు కూడా ఇచ్చామని, అయినా హైకోర్టు మూడు డాక్యుమెంట్లు విస్మరించి సిట్ దర్యాప్తు నిలిపివేసిందన్నారు. రాజకీయ కక్షలు ఉన్నప్పటికీ వాస్తవాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేయడం సమంజసమేనని జగన్నాథరావు కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయాన్ని సింఘ్వి ఉటంకించారు. రాష్ట్రంలో కేబినెట్ సబ్ కమిటీ లోతుగా పరిశీలించి కొన్ని సిఫార్సులు చేసిందని ఆ మేరకే సిట్ ఏర్పాటైందన్నారు. కానీ, సిట్ దర్యాప్తునకు దురుద్దేశాలు ఆపాదిస్తూ హైకోర్టు దర్యాప్తు నిలిపివేసిందన్నారు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి దర్యాప్తు ఆదేశాలిచ్చే అధికారం ఎందుకు ఉండదని ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్ర దర్యాప్తు సంస్థలపై హైకోర్టుకు అనుమానముంటే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించొచ్చుగా అని తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులనే హైకోర్టు తప్పు పట్టిందని, హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చి విచారణ కొనసాగించేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఈ సమయంలో గత ప్రభుత్వ నిర్ణయాలపై సక్సెసర్ గవర్నమెంట్ దర్యాప్తు అనేది లార్జర్ ఇంట్రెస్ట్ అని ధర్మాసనం వ్యాఖ్యానించి బుధవారం విచారణ చేపడతామని పేర్కొంది. జాబితాలో టాప్ ఆఫ్ ద బోర్డుగా ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అంతమంది వాదనలు వినడం మా ప్రాక్టీసు కాదు.. అనంతరం.. కొన్ని డాక్యుమెంట్లు సమర్పిస్తామని ప్రతివాది వర్ల రామయ్య తరఫు న్యాయవాది తెలిపారు. ఈ సమయంలో.. ఇది క్వశ్చన్ ఆఫ్ లాకు సంబంధించిన అంశమని, వాస్తవాలు కనిపెట్టే అథారిటీ కాదని, తామేమీ సీబీఐ కానీ, సిట్ కానీ కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ తర్వాత.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తాను హైకోర్టులో ఒరిజినల్ రిట్ పిటిషనర్నని చెప్పారు. దీంతో.. ఎవరో ఒక న్యాయవాది వాదనలే వింటామని ధర్మాసనం స్పష్టంచేసింది. పది మంది ప్రతివాదులు ఉంటే పది మంది న్యాయవాదుల వాదనలు వినడం తమ ప్రాక్టీస్ కాదని పేర్కొంది. ప్రతివాదుల తరఫున ఎవరు వాదిస్తారో నిర్ణయించుకోవాలని సూచించింది. నవంబరు 16న తిరిగి విచారిస్తామంటూ ధర్మాసనం తెలిపింది. -
అమరావతి అసైన్డ్ భూముల కేసులో సాక్షులకు టీడీపీ బెదిరింపులు
సాక్షి, అమరావతి: ఇంటి గుట్టు రట్టు లంకకు చేటు తెచ్చిందని ఆనాడు రావణుడు నేలకొరుగుతూ వాపోయాడు. అమరావతి భూదందా గుట్టు రట్టవడం టీడీపీకి చేటు అంటూ ఇప్పుడు చంద్రబాబు చుర్రుబుర్రులాడుతున్నారు. అమరావతిలో రూ.4,000 కోట్ల అసైన్డ్ భూములు కొల్లగొట్టిన దందా బట్టబయలు కావడంతో సీఐడీ కేసులు నమోదు చేసింది. టీడీపీ నేతలు ఆ భూములు ఎలా కొల్లగొట్టారో కొందరు సాక్షులు సీఐడీకి వివరంగా చెప్పడంతో చంద్రబాబు గొంతులో వెలక్కాయ పడినట్లయింది. టీడీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఈ కేసులో సాక్షుల వాంగ్మూలం కాపీలు దక్కించుకోవడమే కాకుండా .. వాటి ఆధారంగా సాక్షులను బెదిరిస్తున్నారు. చంద్రబాబు, నారాయణ ఒత్తిడితోనే అసైన్డ్ జీవో అమరావతిలో అసైన్డ్ భూములు కొల్లగొట్టిన పచ్చ గద్దల కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు పలువురు ఉన్నతాధికారులు, ఇతర కీలక వ్యక్తులను విచారించారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలు, వారి బినామీలు అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయభ్రాంతులకు గురి చేసి అసైన్డ్ భూములు కొల్లగొట్టిన వైనంపై ప్రధానంగా దృష్టిసారించారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఏకంగా 964 ఎకరాలను అసైన్డ్ భూముల చట్టానికి విరుద్ధంగా హస్తగతం చేసుకున్నారు. ఆ తరువాత అసైన్డ్ భూములకు కూడా భూసమీకరణ కింద ప్యాకేజీ ప్రకటిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసింది. దాంతో ఏకంగా రూ. 4 వేల కోట్ల విలువైన 964 ఎకరాలు చంద్రబాబు బినామీలు, అస్మదీయుల గుప్పిట్లోకి చేరాయి. అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ఆనాటి ఉన్నతాధికారులు ఎంతగా చెప్పినా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ససేమిరా అన్నారు. వారిద్దరి ఒత్తిడితోనే ఉన్నతాధికారులు జీవో 41 జారీ చేశారు. ఇదే విషయాన్ని ఆ ఉన్నతాధికారులు, ఇతర కీలక వ్యక్తులు సీఐడీ దర్యాప్తులో వెల్లడించారు. ఈ మేరకు సెక్షన్ 164 కింద వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. దాంతో చంద్రబాబు సాగించిన భూదందా అధికారికంగా బట్టబయలైంది. ఈ కేసు విచారణ న్యాయస్థానంలో కొనసాగుతోంది. టీడీపీ చేతిలో వాంగ్మూలం కాపీలు.. సాక్షులపై ఒత్తిళ్లు రోజురోజుకు వ్యవహారం ప్రతికూలంగా మారుతుండటంతో అసైన్డ్ భూముల కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు అండ్ కో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ కేసులో సాక్షులను లక్ష్యంగా చేసుకున్నారు. సీఐడీకి సాక్షులు సెక్షన్ 164 కింద ఇచ్చిన వాంగ్మూలం ప్రతులను నిబంధనలకు విరుద్ధంగా సంపాదించారు. వీటిలో సాక్షులు వెల్లడించిన వాస్తవాలతో చంద్రబాబు బ్యాచ్కు ముచ్చెమటలు పడుతున్నాయి. దాంతో సాక్షులపై ఒత్తిళ్లు, పరోక్ష బెదిరింపులకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘మనం మనం’ ఒకటి కదా అంటూ బతిమాలుతూనే, బెదిరింపులకూ పాల్పడుతున్నట్లు సమాచారం. తమ వర్గాల ద్వారా వేర్వేరు మార్గాల్లో ఒత్తిళ్లు తీవ్రతరం చేశారు. దాంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాము ఇచ్చిన వాంగ్మూలం కాపీలు టీడీపీ చేతుల్లోకి పోవడంతో అసైన్డ్ భూముల కేసులో కీలక సాక్షులు ఆందోళన చెందుతున్నారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ ఎంతకైనా తెగిస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. చదవండి: మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్.. ఇదీ మన ఘనత -
అమరావతిలో అందరికీ ఆవాసం
సాక్షి, అమరావతి: సామాన్యులకూ ఇకపై అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం చట్ట ప్రకారం కల్పించింది. అక్కడ బయటి వారు నివసించకుండా న్యాయ వివాదాలతో అడ్డుకుంటున్న విపక్షాల కుట్రలను ఛేదిస్తూ మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని 5 గ్రామాల్లో 900.97 ఎకరాలను ఆర్–5 జోన్గా చట్ట ప్రకారం ఏర్పాటు చేసింది. ఆర్థికంగా వెనుకబడ్డ ప్రజలంతా ఎలాంటి ఆంక్షలు లేకుండా గృహాలను నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. ఈ మేరకు కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఇనవోలు గ్రామాలను కొత్త జోన్ పరిధిలోకి తెచ్చింది. 2020లోనే ఈ ప్రాంతంలో సామాన్యులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా విపక్షాలు న్యాయ వివాదాలు సృష్టించాయి. చట్ట ప్రకారమే 5 శాతం సీఆర్డీఏ చట్టం 2014 సెక్షన్–53 (డి) ప్రకారం మొత్తం విస్తీర్ణంలో ఐదు శాతం భూమిని ల్యాండ్ పూలింగ్ కింద పేదల నివాసాలకు కేటాయించవచ్చు. అందుకోసం స్థానిక సంస్థలు లేదా ప్రత్యేకాధికారుల అనుమతితో మాస్టర్ ప్లాన్ లేదా జోనల్ డెవలప్మెంట్ ప్లాన్కు తగినట్లుగా మార్పులు చేయవచ్చు. ఆ ప్రకారమే ఆర్–5 జోన్ ఏర్పాటు కానుంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు 15 రోజులు గడువిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, కాలుష్య రహిత కార్యకలాపాలు లాంటి వాటిని పది అంతర్గత జోన్లుగా పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో పాటించే నిబంధనలను గెజిట్లో పొందుపరిచింది. పేదలకు మేలు జరిగితే సహించని ‘ఈనాడు’ నిరుపేదలు, ఆర్థికంగా వెనుబడినవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను అందచేసింది. సొంతిల్లు లేనివారు ఉండరాదనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాలు, పట్టణాలు, పంచాయితీల్లో సైతం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తెచ్చింది. ఆయా ప్రాంతాల్లో సొంతిల్లు లేనివారు దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడైనా నిబంధనల మేరకు స్థలం కేటాయించేలా ఉత్తర్వులిచ్చింది. ఇదే విధానాన్ని అమరావతి ప్రాంతంలోనూ అనుసరించనుంది. శాసన రాజధానిలో సామాన్యులు సైతం కాలు మోపేలా అవకాశం కల్పిస్తుంటే సహించలేని ‘ఈనాడు’ విషం కక్కుతోంది. సీఎం జగన్ పేదల పక్షపాతి పేదలు నివసించలేని రాజధాని అందరి రాజధాని ఎలా అవుతుంది? రాజధాని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ సీఆర్డీఏ చట్టానికి సవరణ చేయడం అభినందనీయం. అన్ని వర్గాలకు చోటు కల్పించినప్పుడే అది అందరి రాజధాని అవుతుంది. ముఖ్యమంత్రి జగన్ ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటానని మరోసారి నిరూపించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను అడ్డుకుంటే అది మూర్ఖత్వమే. – రేటూరి కిషోర్, సీనియర్ న్యాయవాది (మంగళగిరి) సామాజిక న్యాయం అంటే ఇదీ.. రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలు నివసించేదిలా ఉండాలి. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని అనడం ఒక్క వర్గం ప్రజలపై వివక్ష చూపడమే అవుతుంది. సీఎం జగన్ ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ చట్ట సవరణ చేయడం గొప్ప పరిణామం. సామాజిక న్యాయం అంటే ఇదీ. – మునగాల మల్లేశ్వరరావు, రాజకీయ నేత, మంగళగిరి అన్ని వర్గాలుండాలి ప్రజా రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలుండాలి. కోటీశ్వరుడి నుంచి కూటి కోసం తిప్పలు పడే వారి వరకు అందరికీ చోటివ్వాలి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలో అన్ని వర్గాల ప్రజలున్నారు. అమరావతిలో మాత్రం పేదలు వద్దని టీడీపీ నేతలు అనడం అన్యాయమే. ఆర్–5 జోన్ ఏర్పాటు మంచి నిర్ణయం. – వై.జయరాజు, న్యాయవాది (కర్నూలు) గొప్ప విషయం.. అమరావతి ప్రాంతంలో బయటివారు నివాసాలు ఏర్పాటు చేసుకోరాదని టీడీపీ కోర్టుల్లో కేసులు పెట్టింది. రాష్ట్రంలో ప్రజలు ఎక్కడైనా స్వేచ్ఛగా స్థలం కొని ఇల్లు కట్టుకునేలా జగనన్న ప్రభుత్వం అవకాశం కల్పించింది. సీఎం జగన్ గొప్ప పని చేశారు. ప్రతిపక్షం కోర్టులకు వెళ్లడం సిగ్గుచేటు. – రామాంజనేయులు, డీసీసీబీ డైరెక్టర్, బ్రహ్మసముద్రం సముచిత నిర్ణయం పేదల కోసం సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రాంతం ఏదైనా అన్నిచోట్లా అందరికీ జీవించే హక్కు ఉంటుంది. ఆర్థిక స్తోమతను బట్టి ఫలానా వ్యక్తులు మాత్రమే ఉండాలనడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకుంది. – ఏలూరి సుబ్రహ్మణ్యం, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కాకినాడ పేదల పక్షపాతి అర్హులైన పేదలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించడం సరైన నిర్ణయం. దీన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కోర్టులకెక్కి అడ్డుకుంది. పేదలకు న్యాయం చేకూర్చాలనే దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ముందడుగు వేశారు. పేదల పక్షపాతిగా మరోసారి రుజువు చేసుకున్నారు. – కాపు రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్(రాయదుర్గం) హర్షిస్తున్నాం.. అమరావతిని ఒక సామాజిక వర్గానికే పరిమితం చేస్తూ టీడీపీ సర్కారు సీఆర్డీఏ చట్టంలో పలు నిబంధనలు పెట్టి స్వార్ధపూరితంగా వ్యవహరించింది. సీఎం జగన్ 900.97 ఎకరాలను పేదల నివాసానికి కేటాయించడం హర్షించదగ్గ విషయం. పేద ప్రజలకు మేలు చేసే అమరావతిలో మరిన్ని సంస్కరణలు తేవాలి. – చింతా కృష్ణయ్య, సీనియర్ న్యాయవాది, ధర్మవరం తప్పిదాన్ని సరిదిద్దారు.. రాజధాని ప్రాంతంలో పేదలకు చోటు కల్పించకుండా కులవాదులు అంతా ఏకమయ్యారు. పేదలకు స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందని కోర్టుల్లో కేసులు వేశారు. చారిత్రక తప్పిదాన్ని సీఎం జగన్ సరిచేశారు. పేదలు, బడుగులకు 900 ఎకరాలు కేటాయించడం గొప్ప విషయం. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ఇది దారి తీస్తుంది. – మాదిగాని గురునాథం, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు (విజయవాడ) (తుళ్లూరులో ముడు రాజధానుల శిబిరం నిర్వాహక నాయకులు) సామాజిక సమత్యులత సాకారం అమరావతిలో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే సీఎం జగన్ పేదలకు 900 ఎకరాలకుపైగా కేటాయించటం సంతోషకరం. ఇకపై పేదలు, మధ్య తరగతి, సామాన్య వర్గాలు సైతం అమరావతి మా రాజధాని అనే చెప్పుకునేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. సామాజిక సమతుల్యత స్పష్టంగా కనిపిస్తోంది. –– పోలూరి వెంకటరెడ్డి, బార్ అసోసియేషన్, మాజీ అధ్యక్షుడు అణగారిన వర్గాలకు పెద్దపీట.. అణగారిన వర్గాలకు పెద్దపీట వేసేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతం. టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం, దోపిడీ కోసమే వేలాది ఎకరాలను లాక్కున్నారు. కనీసం సాగు భూమిని వదిలివేయాలన్న ఆలోచన కూడా లేకుండా భూ దాహంతో వ్యవహరించారు. రాజధాని అంటే సంపన్న వర్గాలకే కాకుండా అణగారిన వర్గాలకు కూడా చోటు కల్పించాలి. ––– చెన్నంశెట్టి చక్రపాణి (విశ్రాంత ఎస్పీ, న్యాయవాది) -
గన్ షాట్ : ఫేక్ యాత్రకు బ్రేక్
-
రైతుల ముసుగులో నకిలీలు
-
అమరావతి అసైన్డ్ అక్రమాలు.. పచ్చ గద్దల కొత్త చిట్టా
వడ్డాది శ్రీనివాస్ ఊరందరిదీ ఒక దారైతే, ఉలిపికట్టెది మరోదారన్న సామెత చంద్రబాబుకు, ఆయన పచ్చ గ్యాంగ్కు అతికినట్లు సరిపోతుంది. ఏమీ లేని అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని వారు మాత్రమే డిమాండ్ చేస్తుండగా.. యావత్ రాష్ట్ర ప్రజలంతా అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ మూడు రాజధానులకు జై కొడుతున్నారు. న్యాయమైన వీరందరి ఘోషను ఏమాత్రం వినిపించుకోని బాబు అండ్ కో ఎందుకు ఇంతగా ఒక్క అమరావతి కోసమే పట్టుపట్టిందంటే వాస్తవాలు విస్తుగొలుపుతున్నాయి. భూ సమీకరణకు అవతల కారుచౌకగా కొట్టేసిన భూములను కాపాడుకునేందుకే ఈ తాపత్రయమని స్పష్టమవుతోంది. ఆ భూములను బంగారు బాతుగా మార్చుకునే అవకాశం చేజారిపోతోందన్న భయం వారిని బెంబేలెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసైన్డ్ భూములను ఎల్లో గ్యాంగ్ కాజేసే నాటికే ఆ ప్రాంతంలో ఎకరం రూ.కోటి పలుకుతోంది. ప్రభుత్వం లాక్కుంటే ఏమీ ఇవ్వదనే ఆందోళనతో అసైన్డ్ రైతులు తమ భూములను చంద్రబాబు బినామీలకు విక్రయించారు. ఆ తర్వాత వాటిని టీడీపీ నేతలే ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదైంది. ప్రభుత్వ పోరంబోకు భూములను కూడా టీడీపీ నేతలే భూ సమీకరణ కింద ఇచ్చినట్టు రికార్డుల్లో పొందుపరిచారు. ఈ కుట్ర అంతా 2014 జూన్ నుంచి 2015 డిసెంబర్లోగా పూర్తి చేశారు. ఆ తర్వాత తాపీగా అసైన్డ్ భూములకు కూడా పరిహారం చెల్లిస్తామంటూ 2016 ఫిబ్రవరి 17న గత సర్కారు జీవో 41 జారీ చేసింది. ఇలా టీడీపీ పెద్దలు ఏకంగా 964 ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. నాటి సీఎం చంద్రబాబు అధికారికంగా వెల్లడించిన ప్రకారమే అభివృద్ధి చేసిన తర్వాత అమరావతిలో భూముల విలువ ఎకరా కనీసం రూ.4 కోట్లు. అంటే వారు సొంతం చేసుకున్న అసైన్డ్ భూముల విలువ ఏకంగా రూ.4 వేల కోట్లు! అప్పటికే రాజధాని ఎక్కడ వస్తుందో వారికి ముందే తెలుసు కాబట్టి చంద్రబాబు, టీడీపీ నేతలు అమరావతిలో భూ సమీకరణ పరిధికి అవతల వేలాది ఎకరాలను బినామీల పేరిట కొనుగోలు చేశారు. వాటి విలువ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అసైన్డ్ భూముల దోపిడీ వాటికి అదనం. అమరావతిలో టీడీపీ నేతలు కొల్లగొట్టిన అసైన్డ్ భూములు (మార్క్ చేసినవి) 964 ఎకరాల అసైన్డ్ భూములు కొల్లగొట్టారు అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో కూడిన ప్రాంతాన్ని కోర్ క్యాపిటల్గా చంద్రబాబు సర్కారు మాస్టర్ ప్లాన్లో ప్రకటించింది. అదే ప్రాంతంలో ఎల్లో గ్యాంగ్ అసైన్డ్ భూములను కాజేసింది. 2014 వరకు అసైన్డ్ భూములు ఎవరి పేరుతో ఉన్నాయి? 2016లో భూ సమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో పేర్కొన్న పేర్లు ఏమిటి? అనే విషయంపై అధికారుల దర్యాప్తులో బండారం మొత్తం బయట పడింది. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్ భూముల హక్కుదారుల జాబితాలో ఉన్న రైతుల పేర్లకు, సీఆర్డీఏకు భూములిచ్చిన వారుగా పేర్కొన్న జాబితాలోని పేర్లకు ఎక్కడా పొంతనే లేదు. ఆ స్థానంలో టీడీపీ పెద్దల బినామీలు, సన్నిహితుల పేర్లు కనిపించాయి. ఇలా 29 గ్రామాల పరిధిలో 964.88 ఎకరాలకు సంబంధించి భూ హక్కుదారుల పేర్లను గల్లంతు చేశారు. అందులో 20 గ్రామాల పరిధిలో బడుగు, బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూములు 636.75 ఎకరాలున్నాయి. ఇక ప్రభుత్వ పోరంబోకు భూములను కూడా వదల్లేదు. ఏకంగా 328.13 ఎకరాల ప్రభుత్వ భూములను టీడీపీ పెద్దలు తమ బినామీల ఆధీనంలో ఉన్నట్లుగా రికార్డులు తారుమారు చేశారు. 2014 నాటి రెవెన్యూ రికార్డుల్లో సర్వే నంబర్లతో సహా ఉన్న వివరాలకు, భూ సమీకరణ కింద తీసుకున్నట్లు సీఆర్డీఏ రికార్డుల్లో ఉన్న వివరాలు సరిపోలడం లేదు. ఆ భూములన్నీ అసైన్డ్ జాబితాలోని 3, 4 కేటగిరీల కిందకు వస్తాయి. వెరసి టీడీపీ పెద్దలు ఏకంగా 964.88 ఎకరాల అసైన్డ్ భూములను కాజేశారు. ఇదిగో.. దందా ఇలా.. ►అమరావతి పరిధిలోని వెంకటపాలెం రెవెన్యూ సర్వే నంబరు 295/10తో ఉన్న 1.02 ఎకరాల అసైన్డ్ భూమి రికార్డుల ప్రకారం గొర్రెముత్తు కాంతారావు అనే రైతు పేరిట 2015 వరకు ఉంది. కానీ ఆ భూమిని భూ సమీకరణ కింద ఇచ్చినట్లుగా సీఆర్డీఏ రికార్డుల్లో బడే ఆంజనేయులు పేరుతో ఉంది. అందుకు ప్రతిగా రాజధానిని అభివృద్ధి చేసిన తర్వాత ఎకరాకు 800 గజాల కమర్షియల్ స్థలం, 200 గజాల నివాస స్థలాన్ని బడే ఆంజనేయులుకు ఇస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. అసైన్డ్ భూమి హక్కుదారు కాంతారావు కాగా, సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది మాత్రం బడే ఆంజనేయులతో కావడం గమనార్హం. ►అమరావతిలోని మందడంలో ‘454/3సీ’ సర్వే నంబరుతో 1.50 ఎకరాల అసైన్డ్ భూమి పిల్లి వెంకయ్య అనే రైతుకు అసైన్ చేసినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. అదే భూమిని గుమ్మడి సురేశ్ భూ సమీకరణ కింద ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదైంది. ఎకరాకు 800 గజాల కమర్షియల్ స్థలం, 200 గజాల నివాస స్థలం గుమ్మడి సురేశ్కు ఇస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. అసైన్డ్ భూమి హక్కుదారు వెంకయ్య కాగా, సీఆర్డీఏ నుంచి అభివృద్ధి చేసిన భూమిని పొందేది గుమ్మడి సురేశ్. సీఆర్డీఏ రికార్డుల్లో ఇలాంటి చిత్రాలెన్నో కనిపిస్తాయి. వీరంతా పాత్రధారులు కాగా, అసలు సూత్రధారులు టీడీపీ పెద్దలే. ►వెంకటపాలెంలో సర్వే నంబరు 296/5తో ఉన్న 0.94 ఎకరాల అసైన్డ్ భూమి అన్నూరి హేమలత అనే రైతు పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కానీ ఆ భూమిని భూ సమీకరణ కింద కొట్టి కృష్ణ దొరబాబు ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేశారు. ►కురగల్లు సర్వే నంబరు 500/1తో ఉన్న 0.72 ఎకరాలు కత్తిపోగు కోటేశ్వరరావు పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఈ భూమిని శీలం శ్రీను అనే వ్యక్తి ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో ఉంది. ఇదే గ్రామంలో సర్వే నెం 501/1తో ఉన్న 0.80 ఎకరాల అసైన్డ్ భూమి బుల్ల కోటమ్మ పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉండగా, గడిపర్తి శ్రీను సీఆర్డీఏకు ఇచ్చినట్లు నమోదైంది. పాదయాత్ర అసలు గుట్టు ఇదే.. అమరావతిలో బినామీల పేరిట అసైన్డ్ భూములను కాజేసిన టీడీపీ నేతలు భూ సమీకరణ పరిధికి అవతల కూడా వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. వాటిలో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ, ఆయన సన్నిహితుడు లింగమనేని రమేశ్, బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ కుటుంబం, పి.నారాయణ, పరిటాల సునీతలతోపాటు టీడీపీ హయాంలో మంత్రులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు చెందిన వేలాది ఎకరాలున్నాయి. ఆ భారీ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం కోసమే మూడు రాజధానుల విధానాన్ని చంద్రబాబు అండ్ కో వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ రైతుల ముసుగులో పెత్తందారులు, రియల్ ఎస్టేట్ సిండికేట్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ, సీఆర్డీఏ రికార్డుల సాక్షిగా బట్టబయలైంది. ఓ బ్రాహ్మణుడు పాల కోసం మేకను కొనుక్కొని వెళ్తుంటే దారిలో ముగ్గురు దొంగలు ఒకరి తర్వాత ఒకరు అటకాయించి అది మేక కాదు.. కుక్క అని నమ్మబలుకుతారు. ముగ్గురూ అదే మాట చెప్పడంతో ఆయన తన వెంట ఉన్నది కుక్కేనని భ్రమించి మేకను వదిలేసి వెళ్లిపోతాడు. ఇదే అదనుగా కాచుకున్న ఆ ముగ్గురు దొంగలు మేకను అపహరిస్తారు. ఈ కథ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. సరిగ్గా అదే రీతిలో గత ప్రభుత్వ హయాంలో పచ్చ దొంగలు అమరావతిపై గద్దల్లా పడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతులను భయాందోళనలకు గురిచేసి.. అసైన్డ్ భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములను కాజేశారు. అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం రాదంటూ రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల ద్వారా బెదిరించి కారుచౌకగా కొట్టేశారు. ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి జపం చేస్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకుంటూ మూడు రాజధానులపై విషం చిమ్ముతున్నారు. -
అమరావతి పాదయాత్రకు బ్రేక్
-
బిగ్ క్వశ్చన్ : ఇప్పటికైనా పాదయాత్రలో ఓవర్ యాక్షన్ తగ్గిస్తారా ..?
-
KSR కామెంట్ : అమరావతి దారుణాలను ఏనాడూ రాయని ఎల్లో మీడియా
-
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు చట్టసవరణకు గవర్నర్ ఆమోదం
-
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు చట్టసవరణకు గవర్నర్ ఆమోదం
సాక్షి, అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఉద్ధేశించిన చట్టసవరణలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. అర్హులైన పేదలకు అమరావతిలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చట్ట సవరణ చేశారు. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, ఆర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. పాలకవర్గంతోపాటు ప్రత్యేక అధికారి కూడా నిర్ణయం తీసుకునేలా సీఆర్డీఏ చట్ట సవరణ చేశారు. మాస్టర్ ప్లాన్లో మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని వారికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ఈ చట్ట సవరణ చేశారు. చదవండి: ఆ భూములపై రైతులకు అన్ని హక్కులు కల్పిస్తున్నాం: సీఎం జగన్ -
బిగ్ క్వశ్చన్ : చంద్రబాబు డైరెక్షన్ ... పవన్ కళ్యాణ్ యాక్షన్
-
జగనన్న ప్రగతి రథసారథి.. చంద్రబాబు రియల్టర్ల వారధి
సాక్షి, తణుకు: ప.గో.జిల్లా తణుకు నియోజకవర్గంలోకి ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. తణుకు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ గో బ్యాక్ ఫేక్ యాత్రికులారా అంటూ వివిధ నినాదాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అమరావతి పేరుతో టీడీపీ, చంద్రబాబు అండ్ కో చేస్తున్న కుతంత్రాలపై ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేశారు. తణుకు నియోజకవర్గంలోని పోస్టర్లలో నినాదాలు ఇలా ఉన్నాయి.. ► రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్రాస్టేట్ ముద్దు ► జగన్ ది స్టేట్ గురించి ఆలోచన.. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ గురించి ఆలోచన ► జగన్ కోరుకొనేది అందరి అభివృద్ధి.. చంద్రబాబు కోరుకునేది అస్మదీయుల అభివృద్ధి ► జగన్ ది సమైక్యవాదం.. చంద్రబాబుది భ్రమరావతి నినాదం ► జగన్ ది అభివృద్ధి మంత్రం.. చంద్రబాబు ది రాజకీయ కుతంత్రం ► రాష్ట్రం కోసం జగన్ ఆరాటం.. 29 గ్రామాల కోసం బాబు నకిలీ పోరాటం ► మూడు రాజధానులకు ప్రజా ఆమోదం.. చంద్రబాబు అండ్ కో రియల్టర్లకు ఖేదం ► జగనన్న ప్రగతి రథసారథి.. చంద్రబాబు రియల్టర్ల వారధి ► చంద్రబాబు పార్టీ షేక్ పాదయాత్ర ఫేక్ ► అన్ని ప్రాంతాల అభివృద్ధి జగనన్న ఆకాంక్ష.. అయిన వారు బాగు కోసమే వికేంద్రీకరణకు బాబు వివక్ష ► వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య వివక్ష వద్దు ► హైదరాబాద్ ప్రయోగం అన్యుల పాలు.. అమరావతి ప్రయోగం చంద్రబాబు అండ్ కోకే మేలు -
అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ
-
పాలకొల్లులో అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ
-
పొలిటికల్ కారిడార్ : అమరావతి పాదయాత్రలో పాల్గొనేవారికి రోజుకు రెండు వేలు
-
అమరావతి రైతుల పేరుతో జరిగే యాత్రను నిలిపివేస్తే మంచిది : మంత్రి గుడివాడ అమర్నాథ్
-
బిగ్ క్వశ్చన్ : గో బ్యాక్ భ్రమరావతి పేరుతో ఫ్లెక్సీలు
-
పొలిటికల్ కారిడార్ : ఉత్తరాంధ్ర నేతలకు చంద్రబాబు బెదిరింపులు
-
ఏ ఒక్క వర్గానికో మేలు చేసే ప్రభుత్వం మాది కాదు : బొత్స సత్యనారాయణ
-
అభివృద్ధి అంతా ఒకేచోట ఉండిపోతేనే ఉద్యమాలు : చెల్లుబోయిన
-
KSR కామెంట్ : ఉత్తరాంధ్రలో వ్యక్తమవుతున్న వ్యతిరేకత
-
తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: పాదయాత్ర ముసుగులో టీడీపీ చేస్తోంది రియల్ ఎస్టేట్ యాత్ర అని ప్రజలు గ్రహించాలని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన బొత్స.. ‘విశాఖ వచ్చి రాజధాని వద్దు అంటే ఆ ప్రాంత ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు. పాదయాత్రను రైతుల ముసుగులో టీడీపీ చేస్తోంది. అది రియల్ ఎస్టేట్ యాత్ర అని తెలుసుకోవాలి. లాండ్ పూలింగ్లో భూములు ఇవ్వడం ఇది మొదటిసారి కాదు కదా? పోలవరంకు ఇస్తే త్యాగం చేసినట్లు. అమరావతిలో భూములు ఇచ్చిన వారికి మంచి పరిహారం ఇచ్చాం. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి మా ప్రభుత్వం విధానం. రైతులకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ముందుకెళ్తాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత లెక్కలు తీస్తే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉంది. ఐదు లక్షల కోట్లు మట్టిలో పోసి తగలెయ్యాలా? 10 వేల కోట్లతో విశాఖ అభివృద్ధి చెందతుంది. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకు అనేక ప్రాజెక్టులు తెచ్చాను.’ అని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదీ చదవండి: సీఎం జగన్ స్పీచ్ ముందు ఆ నిరసనలకు విలువే లేకుండా పోయింది -
తగ్గిన సీఆర్డీఏ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్డీఏ) ఎన్టీఆర్ , గుంటూరు జిల్లాల పరిధిలోని నాలుగు టౌన్షిప్ లలో ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలను భారీగా తగ్గించింది. గతంలో నిర్ణయించిన ధరలు అధికంగా ఉండడంతో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో అధికారులు ఆ ప్లాట్లకు అమ్మకపు ధర, అభివృద్ధి చార్జీలను వేర్వేరుగా విభజించారు. అందులో అమ్మకపు ధరకే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేలా మార్పు చేశారు. ప్లాట్ ధరలో నికర ధర 60 శాతంగా, అభివృద్ధి చార్జీలు 40 శాతంగా నిర్ణయించారు. ప్లాట్ నికర ధర 60 శాతానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతయితే అంత చెల్లిస్తే సరిపోతుంది. గతంలో ప్లాట్ ధర మొత్తానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఇది కొనుగోలుదారులకు భారంగా ఉండేది. దీంతో ఈ మార్పు చేశారు. పైగా, నికర ధరను ప్లాట్ పొందిన మూడు రోజుల్లో పది శాతం మాత్రమే చెల్లించాలి. మిగిలిన నికర ధర, అభివృద్ధి చార్జీలను ఏడాదిలో నాలుగు వాయిదాలుగా చెల్లించే అవకాశం కూడా కల్పించింది. కొనుగోలుదారులు ఒప్పందం కుదిరిన 5 నెలల లోపు మొత్తం ప్లాట్ ధరను ఒకేసారి చెల్లిస్తే అదనంగా 5 శాతం రాయితీ కూడా సీఆర్డీఏ ప్రకటించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు చేసినట్లు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. నగరం మధ్యలో, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉన్న ఈ ప్లాట్లను ఇప్పుడు సామాన్యులు సైతం కొనేలా మార్పులు చేశామని, సులభమైన వాయిదా పద్ధతుల్లో నగదు చెల్లించేందుకు కూడా అవకాశం కల్పించినట్టు చెప్పారు. ఫోన్ ఓటీపీ ద్వారా ప్లాట్ల కొనుగోలుకు పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. విజయవాడ పాయకాపురం టౌన్షిప్, ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్, తాడేపల్లి–మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని అమరావతి టౌన్షిప్, తెనాలి చెంచుపేటలో నివాస, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మొత్తం 424 ప్లాట్లు ఉన్నాయి. ప్లాట్లు, ధరల వివరాలు సోమవారం నుంచి ఆన్లైన్లో ఉంటాయని, ఆసక్తి గలవారు https:// konugolu.ap.gov.in,, లేదా https://crda.ap.gov.in వెబ్సైట్లో అక్టోబర్ 10వ తేదీలోగా వన్టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు 10 శాతం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్లాట్లకు అక్టోబర్ 13న ఈ–వేలం నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు 0866–2527124 నంబర్లో సంప్రదించవచ్చని చెప్పారు. ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా వచ్చే మొత్తాన్ని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధికి వెచ్చిస్తామని తెలిపారు. -
కోట్ల ఖర్చుతో పాదయాత్ర చేసేది రైతులేనా?
రాజధాని భూ కుంభకోణాలపై ఏపీ ప్రభుత్వం మళ్లీ దృష్టి సారించినట్లుగా ఉంది. ఒక వైపు రాజధాని అమరావతి రైతుల పేరుతో పాదయాత్ర, మరో వైపు అమరావతి లో అస్సైన్డ్ భూముల లావాదేవీల స్కామ్ లో అరెస్టులతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అమరావతి గ్రామాలలోనే అన్ని సంస్థలు, అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, తద్వారా తమ ఆస్తుల విలువ మరిన్ని కోట్లు పలకాలని కోరుకుంటున్నవారు పాదయాత్ర చేపట్టడం విశేషమే. గతంలో ఎప్పుడైనా ఎవరైనా సమస్యలలో ఉన్నవారు ఆందోళనలకు దిగుతుండేవారు. కానీ ప్రస్తుతం ఏపీలో మాత్రం కోటీశ్వరులైన వారు, తమ భూముల విలువ మరిన్ని కోట్లు పలికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారు కోట్లు ఖర్చు చేసి పాదయాత్ర చేయగలుగుతున్నారు. నిజంగానే భూములు రాజధానికి ఇవ్వడం త్యాగమైతే, వారు కోట్లు ఖర్చు చేసి పాదయాత్రలు చేయగలరా? బౌన్సర్లను పెట్టుకుని నడవగలరా? తమకు ఆది, బెంజ్ వంటి కారులు ఉంటే ఏమిటని డిబేట్లలో ఏ మాత్రం భేషజం లేకుండా మాట్లాడగలరా? ప్రభుత్వం ఏటా ఈ రైతులకు ఎకరా ఏభై వేల రూపాయల చొప్పున కౌలు చేల్లిస్తోంది. వారికి కాణి ఖర్చు లేదు. రిస్కు లేదు. పొలం వెళ్లకుండానే కౌలు పొందుతున్నారు. అంతవరకు అభ్యంతరం లేదు. కాకపోతే వారు రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు అనుగుణంగా డిమాండ్లు పెట్టి ఉద్యమం చేస్తున్నామని చెప్పడం, వారిది మహోద్యమమని, ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు ప్రచారం చేయడం , తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనసేన వంటి పార్టీలు వారికి మద్దతు ఇవ్వడం అంతా తమాషాగా ఉంది. దేశం అంతటా బీజేపీ, కాంగ్రెస్లు తీవ్ర వైరుధ్యంతో ఉన్నా, ఏపీలో మాత్రం ఈ విషయంలో అలయ్ భలయ్ నడుపుతున్నాయి. బీజేపీ పొడ అంటేనే గిట్టదని చెప్పే వామపక్షాలవారు ఏపీలో మాత్రం వారితో కలిసి చేతులెత్తుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ముప్పైనాలుగు వేల ఎకరాలు సమీకరిస్తున్నప్పుడు ఈ విపక్షాలన్నీ తీవ్రంగా విమర్శించేవి. ఇన్ని వేల ఎకరాల భూమి ఎందుకు అని ప్రశ్నించేవి. అస్సైన్డ్ భూములను కొందరు నేతలు, దళారులు దోచేస్తున్నారని చెప్పేవి. రాజధాని అంతా స్కామ్ గా మార్చారని అనేవారు. చివరికి ప్రధాని మోడీ అంతటి ఆయన వచ్చి పోలవరం, అమరావతిలను చంద్రబాబు ఎటిమ్ లాగా చేసుకున్నారని ఆరోపించారు. కాని చిత్రంగా ఇప్పుడు వీరంతా తెలుగుదేశం పార్టీ వాదనను బలపరుస్తూ, పాదయాత్రకు సంఘీభావం చెబుతున్నారు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా ససేమిరా అంటున్నారు. అసలు మొత్తం రాజధాని అంతా వెళ్లిపోతున్నట్లుగా వీరు ప్రచారం చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, రాయలసీమలో సెక్రటేరియట్, సి.ఎమ్. ఆఫీస్ పెట్టాలని..ఇలా వివిధ డిమాండ్ లు చేసిన బీజేపీ ఇప్పుడు నాలుక మడతేసింది. సీపీఐ రామకృష్ణ అనంతపురం లో 2018లో ఒక సభలో మాట్లాడుతూ , అన్నిటిని అమరావతిలోనే ఏర్పాటు చేస్తే మరి మిగిలిన ప్రాంతం సంగతేమిటని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతాలను పట్టించుకోరా అని నిలదీశారు. కాని అదే రామకృష్ణ, తమ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణతో కలిసి చంద్రబాబు విధానాలకు మద్దతు ఇస్తూ పాదయాత్రకు సంఘీభావం చెబుతున్నారు. విభజన సమయంలో ఏపీ సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి, ప్రత్యేక హోదా గురించి ఎన్నడూ మాట్లాడని ఆమె తగుదునమ్మా అంటూ బయల్దేరి పాదయాత్రకు మద్దతు పలికారు. కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేషే స్వయంగా అమరావతి జేఏసీ నేత ఒకరితో అమరావతి కమ్మరావతిగా మారిందని అంటే వీరెవ్వరూ దానికి సమాధానం చెప్పలేకపోయారు. తెలుగుదేశం పార్టీ పన్నిన వ్యూహంలో వీరంతా చిక్కుకున్నారో, లేక టీడీపీ వెంట వెళితే ఏమైనా ఉపయోగం ఉంటుందని అనుకున్నారో తెలియదు కాని, వారు కూడా రాజధానిపై తమ అభిప్రాయాలను మార్చుకున్నారు. అభిప్రాయాలను చిత్తశుద్దితో మార్చుకుంటే తప్పు కాదు. కాని దానికి వివరణ ఇవ్వగలగాలి. శివరామకృష్ణన్ కమిటీ అమరావతి ప్రాంతంలో రాజధాని ఎందుకు వద్దన్న విషయాన్ని విస్మరించి వీరంతా కోట్ల వ్యయంతో సాగుతున్న పాదయాత్రను సపోర్టు చేస్తున్నారు. నిజంగానే రాజధాని రైతులకు ఏవైనా నష్టం జరుగుతుంటే కచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. అలాగే అక్కడ ఏ అభివృద్ది చేస్తారని ఎవరైనా ప్రశ్నిస్తే,అందుకు సమాదానం ఇవ్వాలి. కాని ఈ ఆందోళనకారులు కాని, ఈ రాజకీయ పక్షాలు కాని ఆ విషయం మాట్లాడడం లేదు. కేవలం ఏక వ్యాఖ్య డిమాండ్తో కధ నడుపుతున్నాయి. ఒకరకంగా ఇది ప్రభుత్వానికి అనుకూలంశంగా భావించాలి. అమరావతి గ్రామాల అభివృద్దికి సంబంధించి ప్రణాళికపై ముందుకు వెళ్లవలసిన పని లేకుండా విపక్షాలు చేస్తున్నాయి. అంతేకాదు. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా అబివృద్ది పని చేపట్టినా, అందుకు నిధుల సమీకరణకు ప్లాన్ చేసినా, వెంటనే కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకువస్తున్నారు. తాము తమ పరపతిని బాగా వాడుకోగలుగుతున్నామని, టీడీపీ కాని రైతుల ముసుగులో ఉన్న ఆందోళనకారులు కాని భావిస్తే అది వారి తెలివితక్కువతనం అవుతుంది. వీరు అబివృద్ది పనులను అడ్డుకునే కొద్ది ప్రభుత్వానికి ఆ మేరకు బాధ్యత తగ్గుతుందన్న సంగతి వీరు మర్చిపోతున్నారు. ఇక రాజధానిలో జరిగిన స్కామ్ల గురించి విపక్షాలు మాట్లాడకపోవడం కూడా గమనించదగిన అంశమే. సుమారు 1100 ఎకరాలు అస్సైన్డ్ భూమిని అప్పనంగా కాజేశారన్న అభియోగాలపై సిఐడి విచారణ చేసి పలువురిని అరెస్టు చేసింది. మాజీ మంత్రి పి.నారాయణ పై కూడా కేసు నమోదు చేసింది. వారికి నిర్ణీత నిబంధన కింద నోటీసులు ఇచ్చి కేసు దర్యాప్తు చేయాలని కోర్టు సూచించింది. సిఐడి కాని, మరే దర్యాప్తు సంస్థ అయినా, కోర్టులలో కేసుల పరిస్థితిని కూడా గమనంలోకి తీసుకుని ఇలాంటి విషయాలలో ముందుకు వెళ్లాలి.ఇది వేరే విషయం. ప్రస్తుతం బీజేపీలో ముఖ్యనేతగా ఉన్న మాజీ ఛీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు కొన్నేళ్ల క్రితం ఇది ఎవరి రాజధాని ?అని ప్రశ్నిస్తూ ఒక పుస్తకం రాశారు. అమరావతి పేరుతో 29 గ్రామాలలో ఆనాటి ప్రభుత్వం చేసిన దారుణాలనండి, సృష్టించిన వివాదాలన్నిటిని ఆయన అందులో పేర్కొన్నారు. ఆ పుస్తక ఆవిష్కరణ సభలో సీపీఎం నేత మధు మాట్లాడుతూ తాము రాజధాని ప్రాంతంలో పర్యటించామని, అస్సైన్డ్ భూముల కుంభకోణం అంతా, ఇంతాకాదని, దళితులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని వాపోయారు. అలాంటివారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఆ స్కామ్ లపై చర్య తీసుకుంటుంటే ఎంతవరకు మద్దతు ఇస్తున్నారో తెలియదు. తెలుగుదేశం పార్టీ కూడా ఈ స్కామ్ లపై పెద్దగా స్పందించకుండా జాగ్రత్తపడుతున్నట్లుగా ఉంది. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగలేదని వాదించే టీడీపీ కోర్టుల నుంచి ఆ విషయంలో రక్షణ పొందడంలో సఫలం అయింది. కాని అదే సమయంలో దళితుల భూములను టీడీపీ నేతలు, దళారులు అక్రమంగా లేదా భయపెట్టి కారు చౌకగా కొనుగోలు చేసిన స్కామ్ లపై నోరు మెదపడం లేదు. పాదయాత్రలో పాల్గొంటున్న రైతులు కాని, వారికి సంఘీబావం చెబుతున్న ఆయా రాజకీయ పక్షాల నేతలు కాని దళితుల భూముల గురించి మాట్లాడకపోవడం వైఫల్యం కిందకు రాదా? అమరావతి అంటేనే స్కామ్ అన్న అభిప్రాయాన్ని వారు ఇంతవరకు పూర్వపక్షం చేయలేకపోయారు. రైతుల పాదయాత్ర రోజునే ప్రభుత్వం ఈ స్కామ్ లను బయటపెట్డడం వ్యూహ త్మకమే కావచ్చు.కాని కేవలం స్కాముల కేసుల నుంచి తప్పించుకోవడానికి, అమరావతి పేరుతో రాజకీయ ప్రయోజనం పొందడానికి తెలుగుదేశం పార్టీ యత్నిస్తున్నప్పుడు వైసిపి ప్రభుత్వం ఈ మాత్రం ప్రతి వ్యూహం అమలు చేయలేదా? -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
శాసనసభలో ఈనాడుకు గట్టి కౌంటర్ ఇచ్చిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: అమరావతిలో భూముల ధరలపై ఎల్లోమీడియాలో వస్తున్న అబద్ధపు, భిన్న కథనాలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేశారు. సీఎం జగన్లో అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. 'అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని దుష్టచతుష్టయం అంటోంది. రాజధానిలో 5,020 ఎకరాలు.. ఎకరా రూ.20కోట్ల చొప్పున అమ్ముతామన్నారు. 5020 ఎకరాల అమ్మకం ద్వారా లక్ష కోట్లు వస్తే రాజధాని అభివృద్ధి చేస్తామన్నారు. ఎకరానికి రూ.20కోట్లు పెట్టి ఎవరైనా కొంటారా?. నిజంగా ఇంత ధరకు చంద్రబాబు కొంటారా?. రామోజీరావు కొంటారా? లేదంటే రాధాకృష్ణ కానీ టీవీ5 నాయుడు కానీ కొంటారా?. పైగా ఇదే ఎల్లో మీడియానే ఈ మధ్య రాజధానిలో ఎకరా రూ.10కోట్లు పెట్టి కొంటారా అంటోంది. ఎకరాకు రూ.20 కోట్లకు అమ్ముతామని మీరే అంటారు. తిరిగి రూ.10 కోట్లకు ఎవరు కొంటారని మీరే ప్రచారం చేస్తారు. రాజధాని భూములకు అంత ధర లేదు అని మీరు చెప్తున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ను ఎలా పూర్తి చేస్తారో ప్రజలకు తెలియజేయాలి. చదవండి: (సీఎం జగన్ సెటైర్లు.. 'పచ్చళ్లు అమ్మినా అది మావారే అయ్యుండాలి') అమరావతికి పెట్టే దానిలో కేవలం 10 శాతం విశాఖలో పెడితే చాలు ఎంతో అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం అని నేను ఎందుకు చెప్తున్నానంటే.. అక్కడ ఇప్పటికే అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. కొద్దిగా మెరుగులు దిద్దితే చాలు. నాకు అన్ని ప్రాంతాల ప్రజలు సమానమే. ఏపీలో అతిపెద్ద నగరం విశాఖపట్నం. మేం చేస్తామన్న విశాఖలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అమరావతిలో చంద్రబాబు చేయలేని దానిని మమ్మల్ని చేయమంటూ డ్రామాలాడుతున్నారు. పోనీ ఆయన కోరుకుంటున్న విజయవాడ ఆయన ఏం చేశాడని అడిగితే అదీ శూన్యం. అమరావతిలో బినామీ భూముల ధరలు పెరిగేందుకు విజయవాడ, మంగళగిరి అభివృద్ధిని అడ్డుకున్నారు. చంద్రబాబు కనకదుర్గ ఫ్లైఓవర్ను కూడా పూర్తి చేయలేకపోయారు. మేం వచ్చాక రెండు ఫ్లైఓవర్లు పూర్తి చేశాం. ఐదేళ్లు అధికారంలో ఉండి కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మించలేకపోయారు. మేం వచ్చాక రిటైనింగ్ వాల్ నిర్మించడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. చివరకు కరకట్టపై అక్రమ నివాసంలో ఉండి దాన్ని కూడా విస్తరించలేకపోయారు. స్వార్థ రాజకీయాల కోసం ఇంత దిగజారాలా?. అందరూ బాగుండాలని కోరుకుంటే అది సమాజం. ఇంటింటికీ, మనిషిమనిషికీ మంచి చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం' అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: (అశ్వనీదత్, రాఘవేంద్రరావు కోరుకున్న చోట భూములు: కొడాలి నాని) -
అశ్వనీదత్, రాఘవేంద్రరావు కోరుకున్న చోట భూములు: కొడాలి నాని
సాక్షి, అమరావతి: మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలనే సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదని.. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో గురువారం వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. 'సీఎం జగన్పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. వాళ్లకు రాష్ట్రాన్ని బాగుచేయాలనే ఉద్దేశం లేదు. చంద్రబాబు బినామీలు దళితులను భయపెట్టి అసైన్డ్ భూములను లాక్కున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టుకెళ్లి అడ్డుకున్నారు. అశ్వనీదత్, రాఘవేంద్రరావు వంటి వారికి కోరుకున్న చోట అమరావతిలో భూములిచ్చారు. చంద్రబాబు తనకు కావాల్సిన వారికి కారుచౌకగా భూములు కట్టబెట్టారు. అమరావతిలో ధనికులే ఉండాలా.. పేదలు ఉండొద్దా?. అమరావతిని కమరావతి, భ్రమరావతి చేసింది చంద్రబాబు కాదా?. అమరావతి ప్రకటించక ముందు ఎకరం రూ.50లక్షలు ఉంటే గ్రాఫిక్స్తో ఎకరం రూ.5కోట్లకు తీసుకెళ్లారు. అమరావతిలో టీడీపీ నేతలందరికీ భూములు ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లోని భూములు అమ్మి అమరావతిలో కొన్నారు. అమరావతిని చంద్రబాబు రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చారు. భూములుకొన్నవాళ్లే అమరావతి రాజధాని కావాలంటున్నారు. టీడీపీ నేతలకు రాష్ట్రాభివృద్ధి అవసరం లేదు.. స్వార్థ ప్రయోజనాలే కావాలి. దుర్మార్గులంతా కలిసి రోడ్లపైకి వచ్చారు. పాదయాత్ర రాజధాని కోసమా.. చంద్రబాబు కోసమా?. ఖమ్మంలో కార్పొరేటర్గా గెలవలేని రేణుకా చౌదరి అమరావతి గురించి మాట్లాడటమా?. ఒక్క ప్రాంతమే అభివృద్ధి అయితే.. మిగతా ప్రాంతాలు ఏం కావాలి?. ఓ నలుగురి చేతిలో చంద్రబాబు కీలుబొమ్మ అయ్యారు. 40 ఆలయాలు కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నారు' అంటూ కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (బీఏసీలో అచ్చెన్నాయుడికి సీఎం జగన్ ఆఫర్) -
నారాయణ స్వాహా.. బంధుగణంతో ‘అసైన్డ్’ మేత
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో టీడీపీ పెద్దల మరో భూబాగోతం బట్టబయలైంది. దళితులు, బలహీన వర్గాలకు చెందిన 1,110 ఎకరాల అసైన్డ్, లంక భూములను కొల్లగొట్టిన వ్యవహారం వెలుగు చూసింది. చంద్రబాబు సర్కారు అక్రమాల చిట్టాను సీఐడీ అధికారులు ఆధారాలతో సహా వెలికితీశారు. అసైన్డ్ భూముల దోపిడీ వ్యవహారంపై దుగ్గిరాలకు చెందిన వై.ప్రసాద్కుమార్ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసి చేపట్టిన దర్యాప్తులో మొత్తం అక్రమాల బండారం బయటపడింది. దళితులను బెదిరించి అసైన్డ్ భూములను కాజేయడంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు, బినామీగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణే కీలకంగా వ్యవహరించారు. రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నారాయణ తన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల పేరిట 169.27 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టినట్లు తేలింది. ఇందులో నారాయణతోపాటు మాజీ మంత్రి గంటా పాత్ర కూడా స్పష్టంగా వెలుగులోకి వస్తోంది. పలు సెక్షన్ల కింద కేసులు.. ఐదుగురి అరెస్టు అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్న కేసులో మాజీ మంత్రి పి.నారాయణను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అసైన్డ్ భూముల బదిలీ నిషేధిత చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు 409, 420, 506 తదితర సెక్షన్ల కింద సీఐడీ అధికారులు తాజాగా కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా వ్యవహరించిన నారాయణ సన్నిహితులైన ఐదుగురిని సీఐడీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. రామకృష్ణా హౌసింగ్ లిమిటెడ్ సిబ్బంది కొల్లి శివరామ్, గట్లెం వెంకటేశ్ను రాత్రి విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి దర్యాప్తు కొనసాగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరో ముగ్గురు నిందితులను విశాఖలో అరెస్టు చేసి విజయవాడ తరలించారు. పరిహారం రాదంటూ ఫలహారం.. టీడీపీ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించిన నారాయణ కనుసన్నల్లోనే భూ దందాలు జరిగాయి. ప్రధానంగా టీడీపీ పెద్దల కళ్లు అమరావతిలోని 1,100 ఎకరాల అసైన్డ్, పోరంబోకు, లంక భూములపై పడ్డాయి. అవన్నీ దళితులు, బలహీన వర్గాలకు చెందినవే. అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చట్ట విరుద్ధమని అప్పటి సీఆర్డీయే కమిషనర్, గుంటూరు కలెక్టర్లతోపాటు పలువురు అధికారులు నారాయణకు వివరించినా ఖాతరు చేయలేదు. వాటిని సొంతం చేసుకునేందుకు పక్కాగా పథకం వేశారు. రాజధాని కోసం అసైన్డ్ భూములను ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా తీసుకుంటుందని రెవెన్యూ, పురపాలక శాఖ అధికారుల ద్వారా ప్రచారం చేయించారు. నారాయణ ఆదేశాలతో అధికారులు గ్రామాల్లో పర్యటించి కేవలం పట్టా భూములకే సర్వేలు చేశారు. అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి సర్వే చేయడం లేదని అధికారులతో ప్రచారం చేయించారు. ఇదే అదనుగా నిరు పేదలైన దళితులు, బీసీల భయాందోళనలను సొమ్ము చేసుకునేందుకు నారాయణ తన సమీప బంధువైన కేవీపీ అంజని కుమార్ డైరెక్టర్గా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను రంగంలోకి దించారు. అసైన్డ్ భూములను తాము కొనుగోలు చేస్తామని, లేదంటే అవన్నీ ప్రభుత్వ పరమైపోతాయని రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు పేదలను నమ్మించారు. వారిని బెదిరించి అతి తక్కువ ధరకు వాటిని తమపరం చేసుకున్నారు. నారాయణ అందుకోసం రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహించారు. అసైన్డ్ భూములున్న వారికి నగదు చెల్లింపులు చేసి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) పొందారు. అనంతరం సేల్ డీడ్ల ద్వారా కథ నడిపించారు. ఇటు కాజేసి.. అటు లాగేసి! మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, సన్నిహితుల ద్వారా 89.90 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. రిజిస్ట్రేషన్ చట్టం 22–ఏ కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న వీటిని పకడ్బందీగా సొంతం చేసుకున్నారు. ఈ భూములు అమరావతిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం పరిధిలో ఉన్నాయి. నారాయణ వీటిని 84 సేల్ డీడ్ల ద్వారా తన బంధువులు, సన్నిహితులైన ధూళిపాళ్ల వెంకట శివ పానకాలరావు, ఆయన భార్య పద్మావతి, కోడలు డి.సృజన, లక్ష్మిశెట్టి సుజాత, లక్ష్మిశెట్టి సూర్య నారాయణ, అంబటి సీతారాము, లక్కాకుల హరిబాబు, లక్కాకుల పద్మావతి, చిక్కాల విజయ సారథి, పరుచూరి వెంకయ్య భాస్కరరావు, పరుచూరి వి.ప్రభాకరరావు (గంటా బంధువులు), కొండయ్య బాలసుబ్రహ్మణ్యం, భార్య కొండయ్య విజయ, కొండయ్య వెంకటేశ్ తదితరుల పేర్లతో కొనుగోలు చేశారు. నారాయణ తన బంధువులు, సన్నిహితులైన యాగంటి శ్రీకాంత్, కొల్లి శివరామ్, గుమ్మడి సురేశ్ పేరిట ఏకంగా 72 జీపీఏలు చేసి మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు అప్పటి సబ్ రిజిస్ట్రార్ ఏ.గోపాల్ నిరాకరించారు. ఆయనపై టీడీపీ పెద్దలు ఎంత ఒత్తిడి తెచ్చినా సమ్మతించలేదు. దీంతో అసైన్డ్ భూములపై తాము చేసుకున్న సేల్ డీడ్ల ఆధారంగానే ఆ భూములను నారాయణ బంధువులు హస్తగతం చేసుకున్నారు. అనంతరం ఆ అసైన్డ్ భూములను రాజధాని కోసం ప్రభుత్వం సమీకరించినప్పుడు వాటిని తామే సీఆర్డీయేకు ఇచ్చినట్లుగా చూపించారు. అందుకు ప్రతిగా రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు, వాణిజ్య స్థలాలు పొందే జాబితాలో తమ పేర్లు ఉండేలా చేసుకున్నారు. తద్వారా భూసమీకరణ కింద ఇచ్చిన భూములకు ప్రతిగా ఎకరానికి 800 గజాల నివాస స్థలం, వంద గజాల వాణిజ్య స్థలాన్ని రాజధాని ప్రాంతంలో తమకు వచ్చేటట్లు చూసుకున్నారు. వియ్యంకుడితో భూ విందు! అమరావతిలో టీడీపీ పెద్దలు కొల్లగొట్టిన 1,100 ఎకరాల్లో 169.27 ఎకరాల అసైన్డ్ భూములను మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన బంధువులు, సన్నిహితుల పేరిట దక్కించుకున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. అందులో 89.90 ఎకరాలను బంధువుల పేరిట నారాయణ కొల్లగొట్టగా మరో 79.45 ఎకరాలను ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమీప బంధువుల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి రూ.15 కోట్లు రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు బదలాయించి అసైన్డ్ భూములను కాజేసినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. కాగా 1,100 ఎకరాల అసైన్డ్, పోరంబోకు, లంక భూముల్లో మిగిలినవి టీడీపీ ముఖ్యులు, వారి కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్నాయి. వాటిపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. సీఐడీ అరెస్టు చేసిన ఐదుగురు నిందితులు ► కొల్లి శివరామ్, విజయవాడ (రామకృష్ణా హౌసింగ్ లిమిటెడ్ ఉద్యోగి) ► గట్లెం వెంకటేశ్, విజయవాడ (రామకృష్ణా హౌసింగ్ లిమిటెడ్ ఉద్యోగి) ► చిక్కాల విజయ సారథి, విశాఖపట్నం ► బడే ఆంజనేయులు, విశాఖపట్నం ► కొట్టి కృష్ణ దొరబాబు, విశాఖపట్నం గంటా కోటాలో మరో 79.47 ఎకరాలు అమరావతిలో మరో 79.47 ఎకరాల అసైన్డ్ భూములను కూడా నారాయణ తన వియ్యంకుడైన గంటా శ్రీనివాసరావు బంధువులు, సన్నిహితుల ద్వారా దక్కించుకున్నారు. బోరుపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నేలపాడు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలోని వివిధ సర్వే నంబర్లలో 79.47 ఎకరాలను 76 సేల్ డీడ్ల ద్వారా తమపరం చేసుకున్నారు. కొట్టి కృష్ణ దొరబాబు, గుమ్మడి సురేశ్, కొల్లి శివరామ్లు వాటిపై జీపీఏ ఒప్పందాలు చేసుకుని ఆ భూములు తమకు చెందినవని చూపారు. దళారీలు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, గుమ్మడి సురేశ్, సఫియుల్ రహమాన్, పొట్లూరి జయంత్, ఆల వెంకట సుబ్బయ్య, పిడపర్తి టిటుస్ బాబు, శీలం శ్రీనివాసరావు తదితరులు ఈ అసైన్డ్ భూములను నారాయణ తన బంధుగణం ద్వారా దక్కించుకోవడంలో పాత్ర పోషించారు. కాగా సీఐడీ అధికారులు అరెస్టు చేసిన కొట్టి కృష్ణ దొరబాబు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నమ్మిన బంటు కావడం గమనార్హం. టీడీపీ హయాంలో గంటా మంత్రిగా ఉండగా ఆయన్ను ఆంధ్రా వర్సిటీ దూరవిద్యా కేంద్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాంట్రాక్టు విధానంలో నియమించారు. జాగ్రఫీలో పీహెచ్డీ చేసిన ఆయన ఉద్యోగం పొందిన సమయంలో వర్సిటీలో అలాంటి కోర్సు లేకున్నా అవకాశం కల్పించారు. -
ధనస్వామ్యం దండయాత్ర!
మన స్వరాజ్యానికి మొన్ననే అమృతోత్సవం జరుపుకొన్నాం. స్వరాజ్యం సురాజ్యం కావాలంటే ప్రజలే ప్రభువులు కావాలని మన రాజ్యాంగం చాటి చెప్పింది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రిపబ్లిక్ డే కూడా మరో రెండేళ్లలో అమృతోత్సవం తలుపు తట్టబోతున్నది. ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడే ప్రజా ప్రభుత్వ పాలనే ప్రజాస్వామ్యమని అబ్రహాం లింకన్ చెప్పారు. అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగంలోని అన్ని అధికరణాల్లో అణువణువునా ఇదే స్ఫూర్తి ప్రవహించింది. ప్రజలందరి చేత ఎన్నికైన ప్రజా ప్రభుత్వం ప్రజలందరి కోసం పని చేయాలి. భారత రాజ్యాంగానికి హృదయంగా భావించే పీఠిక ఇదే విషయాన్ని మూడు ముక్కల్లో చెప్పింది. కొన్ని చారిత్రక కారణాల వలన సమాజంలోని విశాల జనబాహుళ్యానికి వెనకబాటు తనం వారసత్వంగా లభించింది. వారందరినీ ముందు వరసలో ఉన్నవారి సరసన నిలబెట్టడానికి ప్రభుత్వం పూనుకోవాలని రాజ్యాంగం ఆదేశిస్తున్నది. అప్పుడే సమాజంలోని ప్రజలందరి మధ్యన ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుంది. రాజ్యాంగ ఆదేశాలు అటకెక్కిన ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. డబ్బున్నవాడే ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాగలిగే దుస్థితికి ప్రజాస్వామ్యం దిగజారుతున్నది. విద్య అంగడి సరుకైన ఫలితంగా నాణ్యమైన విద్య కలవారి బిడ్డలకే రిజర్వయి పోయింది. పేద పిల్లలకు నాసిరకం చదువు తప్ప గత్యంతరం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా పరిపాలన చేయడానికి గతంలో ప్రయత్నాలు జరగకపోలేదు. ఈ సందర్భంగా కాలగమనంలోని ఒక కీలక ఘట్టాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. పి.వి. నరసింహారావు ఈ దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆర్థిక వ్యవస్థను సరళీకరించవలసిన అనివార్య పరిస్థితులు ఏర్ప డ్డాయి. ఈ కర్తవ్యాన్ని ఆయన వ్యక్తిగత శ్రద్ధతో నిర్వహించారు. క్రమంగా గ్లోబల్ ఎకానమీతో భారత ఆర్థిక వ్యవస్థ అనుసంధానం మొదలైంది. బహుళజాతి కంపెనీలు, వాటి గురుపీఠమైన ప్రపంచ బ్యాంకు రంగప్రవేశం చేశాయి. వారికి దేశంలో కమీషన్లు పుచ్చుకొని పనులు చేసిపెట్టగల రాజకీయ దళారుల అవసరం ఏర్పడింది. ప్రైవేటీకరణ జోరు పెరగడంతో గనులు, వనులు, సహజ వనరులపై పెత్తనానికి పెట్టుబడి దారులు పోటీపడ్డారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవారితో వారికి అవసరాలు పెరిగిపోయాయి. తమ ప్రయో జనాలకు అనుకూలంగా మెలిగే నాయకుల కోసం వారు అన్వేషించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆయనది సంక్షేమ ఎజెండా. పేదల అనుకూల ఫిలాసఫీ. స్వదేశీ విదేశీ పెట్టుబడి దారులకు పనికివచ్చే నాయకుడు కాదు. అదే సమయంలో హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లందరికీ ఎన్టీ రామారావు పట్ల విరక్తి కలిగింది. ఆయన లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం వారికి నచ్చలేదు. రాత్రికి రాత్రే తిరుగుబాటు చేశారు. కథ ఈ రకంగా ప్రచారంలోకి వచ్చింది. వాస్తవానికి ఎన్నికల కంటే రెండేళ్ల ముందుగానే ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. తిరుపతిలో లక్షమంది సమక్షంలో లక్ష్మీపార్వతిని భార్యగా ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభల్లో ఎన్టీఆర్తోపాటు లక్ష్మీపార్వతి కూడా పాల్గొని ప్రసంగించారు. అప్పుడు లేని ఆగ్రహం గెలిచిన తర్వాత ఏడాదిలోపే పార్టీ ఎమ్మెల్యేలకు కలగడం విడ్డూరమే. కానీ ఈ విడ్డూరమే చరిత్రగా నమోదైంది. అసలు జరిగింది వేరు. సరళీకరణతో అందివస్తున్న అవకాశాలను వేగంగా ఆక్రమించుకోవాలనుకునే స్వార్థపూరిత శక్తులకు చంద్రబాబులో ఒక నమ్మకమైన సేవకుడు కనిపించాడు. ప్రపంచ బ్యాంకు ఆకాంక్షల మేరకు లక్షలాది మంది రైతుల్ని వ్యవసాయ రంగం నుంచి తరిమేసేవాడు, విద్య – వైద్య రంగాలను కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించగలిగేవాడు, ప్రభుత్వ ఉద్యోగుల్ని కోతకోసేవాడు చంద్రబాబులో కనిపించాడు. మీడియాతో సహా సమస్త వ్యవస్థలూ చంద్రబాబుకు సహకరించాయి. నిశ్శబ్దంగా ఎన్టీఆర్ పదవీచ్యుతుడయ్యారు. నిస్సహాయంగా ఆయన మరణించారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ముఖ్య మంత్రిగా పనిచేసిన కాలం గుర్తున్నవారికి నాటి సామాజిక సంక్షోభం కూడా గుర్తుండే ఉంటుంది. పంట పొలాలు మరు భూములుగా మారడం గుర్తుండే ఉంటుంది. ఫ్యాక్టరీల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడానికి చీప్ లేబర్ దొరకాలంటే వ్యవసాయ రంగం నుంచి లక్షలాది మందిని బయటకు పంపాలి. అందువల్లనే ‘వ్యవసాయం దండగ’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించాడు. ప్రభుత్వ విద్యారంగాన్నీ, వైద్యరంగాన్నీ నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ వ్యాపారుల్ని ప్రోత్సహించాడు. ఫలితంగా పేదలు, రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. తాను అమలుచేస్తున్న విధానాలకు మద్దతుగా తన భావజాలాన్నీ, ఆలోచనల్నీ వివరిస్తూ ‘మనసులో మాట’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఆర్థిక రంగాన్ని మార్కెట్ శక్తులకు వదిలేయాలనేది ఆయన సిద్ధాంతం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వేగంగా పరిస్థితుల్ని చక్కదిద్ది, పెను సామాజిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించారు. మానవీయ అభివృద్ధి కోణాన్ని ఆవిష్కరించారు. అత్యున్నత స్థాయిలో సమాజాన్ని ప్రజాస్వామ్యీకరించడం కోసం, ప్రజాశక్తులను సాధికారం చేయడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆంధప్రదేశ్లో కొన్ని బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. ప్రజా సంక్షేమం, మానవీయ అభివృద్ధి విషయాల్లో ఆయన ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డిలను అధిగమించారు. ‘అధికారం అందరికీ – అభివృద్ధి అందరిదీ’ అనే దిశగా తన ప్రభుత్వ ప్రాథమ్యాలను ఆయన నిర్ధారించుకున్నారు. అధికార పీఠాలకు ఆమడదూరంలో ఉంటున్న అనేక సామాజిక వర్గాలను గుర్తించి వారి నుంచి ఎంపిక చేసిన వారికి వివిధ స్థాయుల్లో పదవులు కల్పించారు. ఆ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల దగ్గర్నుంచి రాష్ట్ర కేబినెట్ వరకు సింహభాగం పదవులను బలహీన వర్గాలకు కేటాయించారు. నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్టు పనుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ ఈ వర్గాలకే పెద్దపీట వేశారు. అన్ని విభాగాల్లో అన్ని స్థాయిల్లోనూ మహిళలకు అర్ధభాగం పదవులను కేటా యించారు. రాజకీయ సాధికారత దిశగా బలహీనవర్గాల ప్రజలు, మహిళలు వేసిన తొలి అడుగులివి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు దేశవిదేశాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తు న్నది. ఈ మూడేళ్లలో రెండేళ్ల కాలాన్ని కోవిడ్ కాటువేసినప్పటికీ సగటున ఒక్కో విద్యార్థి మీద వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున ఖర్చు చేసింది. ఇప్పుడు అదనంగా ఏటా 24 వేల రూపాయల విలువైన ‘బైజూస్’ కంటెంట్ను ఉచితంగా అందివ్వబోతున్నది. అన్ని వర్గాల నుంచి వచ్చే పిల్లలకు వారి ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అత్యంత నాణ్యమైన విద్యను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. ప్రపం చంతో పోటీ పడగల మెరుగైన మానవ వనరులను తీర్చి దిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రజారోగ్య వ్యవస్థ కొత్త పుంతలు తొక్కబోతున్నది. ప్రతి ఇంటినీ గడువు ప్రకారం ఒక ఫ్యామిలీ డాక్టర్ సందర్శించే దిశగా, ప్రతి వ్యక్తి ఆరోగ్య ప్రొఫైల్ కంప్యూటర్లో నిక్షిప్తమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటైంది. వ్యవసాయా భివృద్ధిలో రైతుకు అండగా నిలబడేందుకు ఏర్పాటుచేసిన ఆర్బీకే సెంటర్ల ప్రయోగాన్ని కళ్లారా చూసేందుకు నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధి బృందాలు ఏపీకి వస్తున్నాయి. ప్రజల సాధికారత, ప్రభుత్వ వ్యవహారాల పారదర్శకత, అధికార వికేంద్రీకరణ అనే మూడు అంశాలు సమాజ ప్రజా స్వామ్యీకరణ స్థాయిని నిర్ధారిస్తాయి. అత్యున్నత స్థాయి ప్రజా స్వామ్యీకరణ మన రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యం. ఉన్నత స్థాయి ప్రజాస్వామ్యీకరణ ఉన్నత స్థాయి ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని ఇప్పుడు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన జీఎస్డీపి గ్రోత్ రేట్ జాబితాలో అగ్రస్థానంలో నిలబడిన ఆంధ్రప్రదేశ్ ఇదే విషయాన్ని నిర్ధా రించింది. ప్రభుత్వ పథకాల అమలులో ఒక్క పైసా వృథా కాని విధంగా పారదర్శక పంపిణీ విధానాన్ని రూపొందించింది. అధికార వికేంద్రీకరణను గ్రామస్థాయికి తీసుకొనిపోయింది. గ్రామ సచివాలయాల ఏర్పాటు వికేంద్రీకరణలో చిట్టచివరి మెట్టు. ఈ వికేంద్రీకరణలో భాగంగానే రాష్ట్ర రాజధానిని కూడా విభిన్నమైన అభివృద్ధి దశల్లో ఉన్న మూడు భౌగోళిక ప్రాంతాల మధ్య విభజిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ చర్య ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి నిద్ర పట్టనీయడం లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబుకు వివిధ కారణాలు దోహదపడ్డాయి. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడం తన నైజమని అనేక సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితిలో ఆయనకు సంక్షోభం కనిపించింది. దాన్ని సొంత అవకాశంగా మలుచుకునే ప్రయత్నంలోనే ఐదేళ్ల పదవీకాలం గడిచిపోయింది. తనమీద నమ్మకంతో 34 వేల ఎకరాల భూమిని స్వయంగా రైతులు ల్యాండ్ పూలింగ్కు అప్పగించారని ఆయన చెప్పుకుంటారు. ఈ భూమిలో చాలా భాగాన్ని బాబు అనుయాయులు ముందుగానే కొనుగోలు చేసి రైతుల పేరుతోనే పూలింగ్కు అప్పగించారని, మిగిలిన రైతులను తప్పనిసరిగా ఇచ్చి తీరవలసిన పరిస్థితికి నెట్టివేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికంటే ముందుగానే పూలింగ్ ప్రాంతానికి వెలుపల వేలాది ఎకరాల భూమిని తన అనుయాయుల చేత, తన వర్గీయుల చేత కొనిపించారనీ, ఇది అక్షరాల ఇన్సైడర్ ట్రేడింగేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజధాని పేరుతో ప్రపంచంలోనే పెద్దదైన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ను ఆయన ప్లాన్ చేశారు. ఈ వెంచర్పై కళ్లు చెదిరే లాభాలు ఆర్జించడం కోసం తన వారి చేత వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టించినట్టు సమాచారం. ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’ అనే పేరు ఇప్పటికే ఈ వెంచర్కు స్థిరపడిపోయింది. మహిళా సాధికారతలో భాగంగా పేద వర్గాల మహిళల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలిచ్చింది. ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని తలకెత్తుకున్నది. అందులో భాగంగా రాజధాని ప్రాంతంలో కూడా ఒక 50 వేల మంది పేద వర్గాల మహిళలకు పట్టాలివ్వాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో గగ్గోలు పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లెక్కింది. పేద వర్గాలకు పట్టాలివ్వడం వల్ల సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వాదించింది. ఇది పక్కా రియల్ ఎస్టేట్ వెంచరే అన్న అంశాన్ని ఈ చర్య నిర్ద్వంద్వంగా నిరూ పించింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా పేదలకు పట్టాలివ్వాల్సిందేననీ, అందుకు అవసరమైన చట్ట సవరణలు చేయాలనీ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ మీడియా ఉలిక్కిపడ్డాయి. ఇప్పుడు రాజధాని రైతుల పేరుతో అమరావతి నుంచి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి దాకా ఒక పాదయాత్రను ప్రకటించారు. ‘ఇది పాదయాత్ర కాదు, విశాఖకు పాలనా రాజధానిని దూరం చేయడానికి సాగిస్తున్న దండయాత్ర’గా అక్కడి రాజకీయ నాయకులు, ప్రజలు పరిగణిస్తున్నారు. ‘జనాభాలో ఎనభై శాతంగా ఉన్న పేద వర్గాలకు చోటులేని ప్రాంతాన్ని రాజధానిగా మేం ఎలా అంగీకరిస్తామ’ని ఆ వర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పాదయాత్ర పేరుతో పేదవర్గాల ప్రయోజనాల మీద ధనస్వామ్యం దండయాత్ర చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ విజన్కు చంద్రబాబు ఆలోచనా విధానం పూర్తిగా వ్యతిరేకమైనది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆవిష్కృతుడైన క్రమం, ఆయనే వెల్లడించుకున్న ఆయన ఫిలాసఫీ, అమలు చేసిన కార్యక్రమాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు ఆయన వెన్నంటి ఉన్న మీడియా, ఇతర వ్యవస్థలతో బాబు స్నేహ సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎన్టీ రామారావును గద్దె దించేంతవరకు మాయోపాయాలకు, మంత్ర విద్యలకే పరిమితమైన బాబు కోటరీ మీడియా ఆ తర్వాత యెల్లో మీడియాగా అవతరించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేసరికి గోబెల్స్ క్షుద్ర విద్యను ఆవాహన చేసి జనం మెదళ్లను కలుషితం చేయడాన్ని అలవాటు చేసుకున్నది. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచీ యెల్లో మీడియా సంస్థలు విషసర్పాల అవతారం దాల్చాయి. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన దగ్గర్నుంచి ఈ మూడేళ్లలో విషం చిమ్మని రోజు లేదు. సకల జన సాధికారత కోసం జగన్మోహన్రెడ్డి చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగా జనంలో ఆయనకు పెరుగుతున్న ఆదరణను సహించలేకపోతున్నది. ఆయన మీదా, ఆయన కుటుంబ సభ్యుల మీదా నిందా ప్రచారాలకు దిగజారుతున్నది. వారి సొంత ప్రయోజనాల కోసం పెట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రైతాంగ పోరాటం అనే ముద్ర వేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ కుయుక్తులు ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమవుతున్నాయి. చంద్రబాబు, ఆయన పార్టీ, యెల్లో మీడియా ఆగడాల మీద, దుష్ప్రచారాల మీద బలహీన వర్గాల ప్రజలు అతి త్వరలో ప్రజాకోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేయబోతున్నారు. తమ బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం బోధనను వ్యతిరేకించినందుకూ, ‘అమ్మ ఒడి’పై దుష్ప్రచారం చేసినందుకూ అమ్మల సంఘం ఛార్జిషీటు సిద్ధ మవుతున్నది. బలహీన వర్గాల ఇళ్ల పట్టాలను కోర్టు ద్వారా అడ్డు కునే ప్రయత్నం చేసి నందుకు ఆ మహిళలంతా నేరారోపణ పత్రాన్ని రచిస్తున్నారు. రాజధాని ప్రాంతం నుంచి బలహీన వర్గాలను వెలివేస్తున్నందుకు ఆ వర్గాలు యెల్లో కూటమిపై అట్రాసిటీ అభియోగం చేయ బోతున్నాయి. ప్రజా కోర్టులో ఇక సందడే సందడి. ధనస్వామ్యం దండయాత్రలను పేదవర్గాలు చీల్చి చెండాడే సందడి. ‘ఇప్పుడు రాజధాని రైతుల పేరుతో అమరావతి నుంచి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి దాకా ఒక పాదయాత్రను ప్రక టించారు. ‘ఇది పాదయాత్ర కాదు విశాఖకు పాలనా రాజధానిని దూరం చేయడానికి సాగిస్తున్న దండ యాత్ర’గా అక్కడి రాజకీయ నాయకులు, ప్రజలు పరిగ ణిస్తున్నారు. ‘జనాభాలో ఎనభై శాతంగా ఉన్న పేద వర్గాలకు చోటులేని ప్రాంతాన్ని రాజధానిగా మేం ఎలా అంగీకరిస్తామ’ని ఆ వర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పాదయాత్ర పేరుతో పేదవర్గాల ప్రయోజనాల మీద ధనస్వామ్యం దండయాత్ర చేస్తున్నదని వారు ఆరోపి స్తున్నారు. జగన్ విజన్కు బాబు ఆలోచనా విధానం పూర్తిగా వ్యతిరేకమైనది. సీఎంగా చంద్రబాబు ఆవిష్కృ తుడైన క్రమం, ఆయనే వెల్లడించుకున్న ఆయన ఫిలా సఫీ, అమలుచేసిన కార్యక్రమాలు ఈ విషయాన్ని వెల్లడి స్తున్నాయి. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు ఆయన వెన్నంటి ఉన్న మీడియా, ఇతర వ్యవస్థలతో బాబు స్నేహ సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ను గద్దె దించేంతవరకు మాయోపాయా లకు, మంత్ర విద్యలకే పరిమితమైన బాబు కోటరీ మీడియా ఆ తర్వాత యెల్లోమీడియాగా అవతరించింది. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేసరికి గోబెల్స్ క్షుద్ర విద్యను ఆవాహన చేసి జనం మెదళ్లను కలుషితం చేయడాన్ని అలవాటు చేసుకున్నది. జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఏర్పడినప్పటి నుంచీ యెల్లో మీడియా సంస్థలు విష సర్పాల అవతారం దాల్చాయి. ఆయన సీఎంగా బాధ్యత లను స్వీకరించిన దగ్గర్నుంచి ఈ మూడేళ్లలో విషం చిమ్మని రోజు లేదు. సకల జన సాధికారతకోసం జగన్ చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగా జనంలో ఆయ నకు పెరుగుతున్న ఆదరణను సహించ లేకపోతున్నది.’ ‘చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం గుర్తున్నవారికి నాటి సామాజిక సంక్షోభం కూడా గుర్తుండే ఉంటుంది. పంట పొలాలు మరు భూములుగా మారడం గుర్తుండే ఉంటుంది. ఫ్యాక్టరీల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడా నికి చీప్ లేబర్ దొరకాలంటే వ్యవసాయ రంగం నుంచి లక్షలాది మందిని బయటకు పంపాలి. అందు వల్లనే ‘వ్యవసాయం దండగ’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపా దించి కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించాడు. ప్రభుత్వ విద్యారంగాన్నీ, వైద్యరంగాన్నీ నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ వ్యాపారుల్ని ప్రోత్సహించాడు. ఫలితంగా పేదలు, రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. తాను అమలుచేస్తున్న విధానాలకు మద్దతుగా తన భావ జాలాన్నీ, ఆలోచనల్నీ వివరిస్తూ ‘మనసులో మాట’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఆర్థిక రంగాన్ని మార్కెట్ శక్తులకు వదిలేయాలనేది ఆయన సిద్ధాంతం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజ శేఖరరెడ్డి వేగంగా పరిస్థితుల్ని చక్కదిద్ది, పెను సామా జిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించారు. మాన వీయ అభివృద్ధి కోణాన్ని ఆవిష్కరించారు. అత్యున్నత స్థాయిలో సమాజాన్ని ప్రజాస్వామ్యీక రించడం కోసం, ప్రజాశక్తులను సాధికారం చేయడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్లో కొన్ని బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. ప్రజా సంక్షేమం, మానవీయ అభివృద్ధి విషయాల్లో ఆయన ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డిలను అధిగమించారు. ‘అధికారం అందరికీ – అభివృద్ధి అందరిదీ’ అనే దిశగా తన ప్రభుత్వ ప్రాథమ్యాలను ఆయన నిర్ధారించుకున్నారు.’ వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిట్టల దొరలా మారి ప్రజలను, అమరావతి రైతులను కూడా మోసం చేస్తున్నాడు. కట్టలేనటువంటి రాజధానిని గ్రాఫిక్స్లో చూపించి మోసం చేశాడు. అందుకే ప్రజలు చంద్రబాబు పళ్లు రాలగొట్టారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు. కాగా, కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రైతులతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. అమరావతి రైతులకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే. వినేవాడుంటే చంద్రబాబు ఏదైనా చెప్తారు. గ్రాఫిక్స్తో ప్రజలను మభ్యపెట్టిన వ్యక్తి చంద్రబాబు. రాష్ట్ర ప్రజలు 23 సీట్లకే పరిమితం చేసినా బుద్ధి రాలేదు. అమరావతిని మహానగరాలతో పోల్చి చంద్రబాబు ఆశలు కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఎయిర్పోర్ట్ నిర్మించడమేంటి?. విశాఖ పరిపాలనా రాజధానిగా రాష్ట్రానికి ఎంతో సంపదను సృష్టిస్తుంది. 29 గ్రామాలున్న అమరావతి ఎక్కడ? 29 నియోజకవర్గాలున్న నగరాలెక్కడ?. ఈ విషయంలో ప్రభుత్వంపై బురదజలుతున్నారు. మూడు రాజధానులతోనే ఏపీ అభివృద్ధి చెందుతుంది. పరిపాలనా రాజధానిగా విశాఖ తథ్యం. విశాఖలో రూ. 10వేల కోట్లు ఖర్చుపెడితే రాష్ట్రానికి సంపద సృష్టిస్తుంది. మూడు రాజధానులకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంది. మాకు అమరావతి, కర్నూలు, విశాఖ అన్నీ సమానమే. 2024లోపే 3 రాజధానులపై బిల్లు పెడతాము. పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూలు జరిగి తీరుతాయి. రెచ్చగొట్టేందుకే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు. విశాఖలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి స్కామ్ చేసుకునే అవసరం చంద్రబాబుకే ఉంది. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని తెలిపారు. ఇది కూడా చదవండి: మూడు రాజధానులపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు -
అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభం
సాక్షి, అమరావతి: ల్యాండ్ పూలింగ్ కింద అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్ల అభివృద్ధికి ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) చర్యలు చేపట్టింది. రైతులకు కేటాయించిన స్థలాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఇటీవల పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆమేరకు సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. ఇక్కడ రైతులకు కేటాయించిన ప్లాట్లను 12 జోన్లుగా విభజించగా, వాటిలో జోన్–4లోని పిచ్చుకలపాలెం, తుళ్లూరు, అనంతవరం గ్రామాల్లో ఉన్న ప్లాట్లలో పనులు ప్రారంభించారు. సోమవారం పిచ్చుకలపాలెం వద్ద రహదారి నిర్మాణాన్ని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్పీఎస్ ప్లాట్లను పూర్తి కమర్షియల్ విధానంలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. జోన్–4లో మొత్తం 1358.42 ఎకరాల్లో 4,551 ప్లాట్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ.192.52 కోట్లతో రహదారులు, వంతెనలు, తాగు నీటి సరఫరా వ్యవస్థ, వరద నీటి కాలువలు, మురుగునీటి వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) వంటి మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. రైతులు కోరుకున్న విధంగా ప్లాట్లను తీర్చిదిద్దుతామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ అదనపు కమిషనర్ షేక్ అలీంబాషా, చీఫ్ ఇంజినీర్లు టి.ఆంజనేయులు, సీహెచ్ ధనుంజయ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శరవేగంగా అభివృద్ధి పనులు ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఆర్డీఏ అమరావతిలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా చేపడుతోంది. అసెంబ్లీ, సచివాలయాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గమైన కృష్ణా నది కరకట్ట రోడ్డును రూ.150 కోట్లతో విస్తరిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది నివాస సముదాయాల పనులు దాదాపు పూర్తయ్యాయి. నవంబర్ నాటికి వీటిని అందుబాటులోకి తెచ్చేలా పనులు చేస్తున్నారు. అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల సమీకరణకు చర్యలు చేపట్టామని వివేక్ యాదవ్ తెలిపారు. నిబంధనలకు లోబడి అమరావతి ప్రాంతంలో టౌన్షిప్లను అన్ని వసతులతో అభివృద్ధి చేసి ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయిస్తున్నట్టు చెప్పారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టి పూర్తిచేస్తామన్నారు. రైతులకు కౌలు డబ్బును కూడా సకాలంలో చెల్లిస్తున్నట్టు వివరించారు. -
అమరావతిపై ‘డబ్బుల్’ గేమ్!
చంద్రబాబు అధికారంలో ఉంటే... రామోజీరావు దృష్టిలో అదో నవ్యాంధ్ర. ఆ భూములన్నీ అత్యంత విలువైనవి. ఇక నారా వారైతే... అమరావతి ఓ సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్ట్.. మనం డబ్బులు ఖర్చు చేయడం కాదు.. అదే తిరిగి డబ్బిస్తుందని పదేపదే దబాయిస్తారు. అంతేకాదు!! మాయమాటలు చెప్పో... మభ్యపెట్టో అక్కడికి జాతీయ స్థాయి ప్రముఖుల్ని తీసుకురావటం... ఆ రోజున అక్కడ కట్టిన నాలుగైదు భవనాలను ఎల్లో మీడియా గ్రాఫిక్స్లో అత్యంత అద్భుతంగా చూపించటం... ఇదో స్కీమ్. దేశంలో భవిష్యత్తులో సింగపూర్తో పోటీపడగలిగే నగరం ఇదొక్కటేనంటూ చెలరేగిపోతారు. సరే! హైకోర్టు ఆదేశించింది కాబట్టి అక్కడి అభివృద్ధికి తక్షణం చేపట్టాల్సిన పనులకోసం ఓ 14 ఎకరాలను సీఆర్డీఏ విక్రయానికి పెడుతోంది. అంతే!!... ఆ భూములకు ఎకరాకు రూ.10 కోట్లు ఎవరిస్తారంటూ ‘ఈనాడు’ నిట్టూర్చింది. అమరావతి పేరెత్తితే పెద్దపెద్ద భవనాల గ్రాఫిక్ ఫోటోలు వేసే ‘ఈనాడు’... ఈ వ్యవహారంలో మాత్రం ఖాళీ భూములు వేసి... వీటినెవరు కొంటారంటూ రాగాలు తీసింది. ఇక చంద్రబాబు చెబుతున్న రైతులైతే ‘ఈ భూములెందుకు అమ్ముతారు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారట. అదీ రామోజీరావు పాత్రికేయం. ఔరా... నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే స్థాయిలో బరితెగిస్తే ఏమనుకోవాలి ఈ దౌర్భాగ్యపు పాత్రికేయాన్ని? అభివృద్ధి పనులు చేపట్టేలా.. అభివృద్ధి పనులు చేపట్టాలంటే ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా వనరులను సమకూర్చుకోవాలి. అలాంటప్పుడు అందుబాటులో ఉన్న భూముల ద్వారా నిధులు సమీకరిస్తే రైతులెందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తారు? వారికి కావాల్సింది అదే కదా? ఆ భూముల్ని వినియోగించుకోవడానికి ఇచ్చిన జీవోలు చీకటి జీవోలు ఎలా అవుతాయి. సాయంత్రం 6 తరవాత విడుదల చేసేవన్నీ చీకటి జీవోలేనా రామోజీరావు గారూ? మీ ఫిలిం సిటీలో 6 తరవాత జరిగేవన్నీ చీకటిపనులేనా? ఇవెక్కడి రాతలు? సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్టు అర్థం.. ఆ భూములు వినియోగించుకోవడమే అయినప్పుడు దాన్ని వ్యతిరేకించడమేంటి? నిజానికి అమరావతిలో విక్రయించగలిగే భూమి 5 నుంచి 6 వేల ఎకరాలు మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని మొత్తం అమ్మటం అసాధ్యం. కోర్టు ఆదేశాల ప్రకారం ఉన్నంతలో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం 14 ఎకరాలను వేలం వేయడానికి సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది. నవులూరులో 10 ఎకరాలు, సీడ్ యాక్సెస్ రోడ్డులో 4 ఎకరాలు. కానీ ప్రభుత్వానికి నిధులు రాకుండా అడ్డుకోవటమే ఏకైక పాలసీగా దిగజారిపోతున్న ‘ఈనాడు’, తెలుగుదేశం... దీన్లోనూ అడ్డం పడ్డాయి. భూములన్నీ అమ్మేస్తున్నారంటూ.. ఒకవైపు భూములెలా అమ్మేస్తారని ‘ఈనాడే’ ప్రశ్నించి.. దానికి ఒకరిద్దరు రైతుల పేర్లు తగిలించింది. మరోవైపు ఈ భూములకు ఎకరాకు రూ.10 కోట్లు ఎవరిస్తారంటూ దీర్ఘాలు తీసింది. ఏం! చంద్రబాబు అమ్మితేనే ఎకరానికి రూ.10 కోట్లు వస్తాయా? వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమ్మితే రావా? ఇదెక్కడి ఎల్లో నీతి? అసలు రాజధాని ప్రాంతంగా పేర్కొన్న మొత్తం భూములకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా రామోజీరావు గారూ? ఎకరానికి రూ.2 కోట్లు. రాజధాని కోసం సేకరించిన 54వేల ఎకరాలకూ మొత్తంగా అక్షరాలా లక్షా ఎనిమిది వేల కోట్లు కావాలి. అది కూడా మౌలిక వసతులకు మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం రాజధాని కోసం అంత ఖర్చుపెట్టగలదా? చంద్రబాబు ఐదేళ్లలో రాజధాని కోసం వ్యయం చేసింది రూ.3,500 కోట్లే కదా? అందులో 2000 కోట్లు అమరావతి బాండ్లపేరిట తెచ్చిన అప్పు.. మిగతాది కేంద్రం ఇచ్చినది.ఈ లెక్కన కొంత ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసినా... పూర్తికావటానికి 20 ఏళ్లు పడుతుంది. అప్పటికి ఇది 40 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదు. ఈ వాస్తవాలన్నీ తెలియనట్లుగా ఎందుకీ దిగజారుడు రాతలు. ఒకవైపు అభివృద్ధి పనులు చేయటం లేదనేదీ మీరే... మరోవైపు చేసేవాటిని అడ్డుకునేదీ మీరే. ఎప్పటికి పోతుంది ఈ ఎల్లో వైరస్!!? -
సీఆర్డీఏ నోటీసులు చట్ట విరుద్ధం
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినందుకు కేటాయించిన ప్లాట్లను రిజిస్టర్ చేసుకోవాలంటూ సీఆర్డీఏ కమిషనర్ జారీ చేసిన నోటీసులు చట్టవిరుద్ధమంటూ భూ యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం విచారణ జరిపారు. సీఆర్డీఏ కమిషనర్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్కి వాయిదా వేశారు. విజయవాడకు చెందిన కొండేటి గిరిధర్, ఆయన కుమారుడు అఖిల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్బాబు వాదనలు వినిపిస్తూ, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాతే ప్లాట్లను రిజిస్టర్ చేయాల్సి ఉందన్నారు. ప్లాట్ బదలాయింపు హక్కుతో సహా భూ సమీకరణ యాజమాన్య ధృవీకరణ పత్రాలను భూ యజమానులకు ఇవ్వాల్సిన బాధ్యత సీఆర్డీఏపై ఉందన్నారు. ఈ బాధ్యతలేవీ సీఆర్డీఏ నిర్వర్తించడంలేదని తెలిపారు. -
ఒప్పందం ప్రకారం అమరావతి రైతులకు ప్లాట్లు ఇస్తాం: మంత్రి బొత్స
-
ఒప్పందం ప్రకారం అమరావతి రైతులకు ప్లాట్లు ఇస్తాం: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: ఒప్పందం ప్రకారం అమరావతి రైతులకు ప్లాట్లు ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారం ఏపీ సచివాలయం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. అమరావతి రైతులకు నష్టం జరగదని తెలిపారు. తమ ప్రభుత్వానికి ఉన్న అధికారాలతోనే వికేంద్రీకణ చట్టాలు చేశామని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు ఆక్రోషంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజధానిపై చంద్రబాబు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? అని సూటిగా ప్రశ్నించారు. రాజధానిపై బయటే ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారం పోయిందని చంద్రబాబుకు కడుపుమంటని దుయ్యబట్టారు. అంబేద్కర్ నిర్ణయించిన రాజ్యాంగ ప్రకారం చట్టాలు ఉండాలని తాము మొదటి నుంచి చెప్తున్నామని అన్నారు. దాన్ని అధిగమించి ఎవరూ ఏమీ చేయరని, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారమే నడుస్తున్నామని తెలిపారు. ఎవరి పాత్ర ఎంతవరకు అనే దానిపై సభలో చర్చించామని, అభిప్రాయ బేధం ఉంటే చంద్రబాబు శాసనసభలో మాట్లాడవచ్చని అన్నారు. అందుకు భిన్నంగా బయట కూర్చుని ఎలా మాట్లాడతారు?అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ బద్దమైనవిగానే ఉంటాయని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల నిర్ణయం కోరుదామనుకుంటే.. తాము వద్దన్నామా? అని ప్రశ్నించారు. ప్రజల కోసం చేసే చట్టాల్లోకి ఎవరూ జోక్యం చేసుకోకూడదని అన్నారు. కోర్టు చెప్పినట్టుగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామనే ఇప్పటికీ అంటున్నాని తెలిపారు. -
రాజధాని రైతులను ప్రత్యేకవర్గంగా చూడాలంటే ఎలా?
సాక్షి, అమరావతి: రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక హక్కులున్నాయని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ తెలిపారు. రాజధాని రైతులను ప్రత్యేకవర్గంగా చూడాలని, వారిని ఇతరులతో పోల్చడానికి వీల్లేదని చెప్పారు. ఈ వాదనపై హైకోర్టు స్పందిస్తూ.. రాజధాని అన్నది ఏ వర్గానిదో కాదని, అది అందరిదీ అవుతుందని వ్యాఖ్యానించింది. అమరావతిని ప్రజల రాజధాని అని చెబుతున్నప్పుడు అది రాష్ట్ర ప్రజలందరిదీ అవుతుందే తప్ప కొద్దిమందిది ఎంత మాత్రం కాజాలదంది. కర్నూలు, విశాఖపట్నం కూడా అందరివీ అవుతాయని తెలిపింది. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులు తాము పోరాడాం కాబట్టి ఈ దేశం తమది అవుతుందని ఎలా చెప్పజాలరో, అలా రాజధానిని కూడా తమదని కొద్దిమంది చెప్పడానికి వీల్లేదని పేర్కొంది. రాజధానిని మనది అని ఎందుకు భావించరని ప్రశ్నించింది. దివాన్ తదుపరి వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. పిటిషనర్లలో ఒకరైన రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ రెండోరోజు మంగళవారం తన వాదనలను కొనసాగించారు. రాజధాని విషయంలో ఎన్నికల తరువాత ప్రభుత్వ తీరు మాత్రం మారిపోయిందన్నారు. రైతుల త్యాగాలకు ప్రభుత్వం విలువ లేకుండా చేస్తోందన్నారు. రాజధాని ప్రాంతంలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టు పూర్తికావడానికి చట్టంలో నిర్దిష్ట కాలవ్యవధి ఉందన్నారు. అయితే ప్రభుత్వ చర్యల వల్ల ఆ ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితిలేదన్నారు. చట్ట ప్రకారం చేయాల్సిందేదీ ప్రభుత్వం చేయలేదన్నారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం చట్టాన్ని అపహాస్యం చేసిందన్నారు. సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్న మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తామని అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏఎంఆర్డీఏ) చట్టంలో ప్రస్తావించారని, అయితే ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్కు తిలోదకాలిచ్చేందుకే మూడు రాజధానుల నిర్ణయాన్ని తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. అందులో భాగంగానే పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను తెచ్చారని దివాన్ పేర్కొన్నారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణ బుధవారానికి వాయిదా పడింది. -
వ్యక్తిగత ప్రయోజనాల పాదయాత్ర
చరిత్రలో ఎక్కడైనా సామాన్యుల సమస్యలపై పాదయాత్రలు జరుగుతుంటాయి. లేదా తమ సమస్యలు తీర్చాలని కోరుతూ పాదయాత్రలు చేయవచ్చు. దేశంలో ఈ తరహా పాదయాత్ర ఇదొక్కటే కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజ ధాని రైతుల పేరుతో కొంతమంది చేస్తున్న పాదయాత్ర చిత్రమైనదే. అందులోనూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ పేరు పెట్టడం కూడా విడ్డూరమే. రాజధానికి వీరు భూములు ఇచ్చిన మాట నిజమే కావచ్చు. అందుకు తగిన ప్యాకేజీ పొందుతున్నారు. ప్రతి ఏటా తప్పకుండా కౌలు తీసుకుంటున్నారు. మరో వైపు రాజధాని అనడంతో తెల్లవారేసరికల్లా ఎకరా పది, పదిహేను లక్షలున్న భూముల విలువ కోట్లకు ఎగబాకింది. 4 వేల ఎకరాలకు పైగా తెలుగుదేశం నేతలు లేదా వారికి సంబంధించినవారు ముందస్తు సమాచారం ఆధారంగా భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు రాజధానిలో నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపడ తామనీ, నవ నగరాలు నిర్మిస్తామనీ ప్రచారం చేసుకున్న ఆనాటి సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి అర్జెంట్గా లక్షా పదివేల కోట్ల రూపాయలు పంపించాలని వినతిపత్రం ఇచ్చారు. ఆ డబ్బు ఇవ్వలేదని అప్పట్లో మోదీపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఏపీలో దాదాపు అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతి రాజధానిలో లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేయడాన్ని వ్యతిరేకించారు. దాని ఫలితమే టీడీపీ ఇరవై మూడు సీట్లకు పరిమితం అవడం. అయినా చంద్ర బాబు తన రాజకీయం మానుకోలేదు. కొందరితో దీక్షలు అంటూ కొత్త అంకానికి తెరదీశారు. అంతా కలిపి వంద మంది కూడా లేకపోయినా దీక్షలు అదరహో అంటూ టీడీపీ మీడియా ప్రచారం సాగింది. విశాఖపట్నం నగరం అయితే రెడీమేడ్గా ఉంటుందనీ, ఒకే చోట లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం ఉండదనీ జగన్ భావించారు. హైదరాబాద్కు అది దీటుగా అవుతుందని తలపోశారు. తెలుగుదేశం పార్టీ గానీ, కొందరు ధనవంతులైన రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోరుతున్నట్లుగా 29 గ్రామాల పరిధిలోనే లక్ష కోట్లు ఖర్చు పెట్టడం సాధ్యమా, కాదా అని వైసీపీ ప్రభుత్వం ఆలోచించింది. ఆ డబ్బుతో కోట్ల మందిని కరోనా సమయంలో ఆదుకున్న సంగతి తెలిసిందే. కానీ అమరావతిలో రకరకాల రూపాలలో ఆందో ళనలు సాగిస్తున్న కొంతమంది మాత్రం చంద్రబాబునే ఇంకా సీఎంగా భావిస్తూ, ముఖ్యమంత్రి జగన్పై పరుష పదజాలంతో విమర్శలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఒకే రాజధాని ఉండాలన్న డిమాండ్తో ఇప్పుడు వీరితో చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారన్న భావన ఉంది. వీరు రాయలసీమలో కూడా పాదయాత్ర చేస్తారు. అక్కడ ప్రజలంతా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండుతో గతంలో ఆందోళనలు నిర్వహించారు. అది వారికి సెంటిమెంట్ కూడా. ఆ ప్రకారం జగన్ ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించింది. అటు ఉత్త రాంధ్రలోని విశాఖ, రాయలసీమలోని కర్నూలు అభి వృద్ధికి కూడా మూడు రాజధానుల నిర్ణయం ఉపయోగపడు తుందని ప్రభుత్వం భావించింది. అదే సమయంలో ప్రస్తుత అమరావతి గ్రామాలలో శాసన రాజధాని ఉండాలని ప్రతిపాదించింది. కానీ తెలుగుదేశం, మరికొన్ని పక్షాలు వ్యతిరేకించాయి. తమ భూములను కోట్ల రూపాయలకు అమ్ముకునే అవకాశం యధాతథంగా ఉండాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న ఆందోళన దేశంలో ఇదొక్కటే. ఈ మొత్తం క్రమంలో టీడీపీ గానీ, ఒక సామాజిక వర్గం గానీ మిగి లిన వర్గాలకు దూరం అవుతున్న సంగతిని గుర్తించలేక పోతున్నాయి. టీడీపీ కేవలం 29 గ్రామాల ప్రయోజనాలకే పరిమితం అయిందన్న భావన రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడింది. నిజానికి ఢిల్లీలో రైతుల ఆందోళన, ఎర్రకోటపై దాడి నేప థ్యంలో ఈ పాదయాత్రకు అనుమతి ఇవ్వరాదని ఏపీ పోలీస్ శాఖ భావించినా, హైకోర్టు వారు అనుమతి ఇవ్వా లని ఆదేశించారు. దీనివల్ల వచ్చే పరిణామాలతో కాకుండా, పౌరుల హక్కుల ఆధారంగా న్యాయస్థానం కొన్ని షరతు లతో ఈ ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు. మూడు రాజధానులు కోరుకునే వర్గాలకూ, పాదయాత్ర చేస్తున్నవారికీ మధ్య ఎక్క డైనా వివాదం వస్తే అది శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఇందులో తెలుగుదేశం పార్టీ ఏమైనా కుట్ర వ్యూహం అమలు చేస్తున్నదా అన్న సందేహాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఈ పాదయాత్ర జరిగే నలభై ఐదు రోజుల కాలం ఏపీ పోలీసులకు ఒక పరీక్షే. ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని భూతద్దంలో చూపించడానికి టీడీపీ మద్దతు మీడియా రెడీగా ఉంది. ప్రభుత్వాలు తమకు అనుగుణమైన నిర్ణయాలు చేస్తాయి. వాటిపై ఎన్నికలలో ప్రజాతీర్పు వస్తుంది. ఉదాహ రణకు 1994లో అధికారంలోకి వచ్చిన ఎన్.టి. రామారావు మద్య నిషేధం అమలు చేశారు. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని పునరుద్ధరించారు. ఆయనను పడదోసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు మద్య నిషేధం ఎత్తి వేశారు. పేదలకు పంపిణీ చేసే బియ్యం రేట్లు పెంచారు. కోట్ల మందికి సంబంధించిన నిర్ణయాలనే మార్చేసిన చంద్ర బాబు ఇప్పుడు జగన్ ప్రభుత్వ మూడు రాజధానులతో సహా అన్ని నిర్ణయాలకు వీలైనంతమేర అడ్డంకులు కలిగి స్తున్నారు. చంద్రబాబు ఉచిత విద్యుత్ సాధ్యపడదని వాదించేవారు. కానీ ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ ఇచ్చారు. 2014లో లక్ష కోట్ల రూపాయల మేర రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు చెప్పినట్లు చేయకపోగా రైతులకు అంత ఆశ పనికిరాదని అన్నారు. కానీ ఇప్పుడు రాజధానిని మూడుగా విభజించడం వల్ల ఏదో పెద్ద ప్రమాదం జరిగి పోతుందని కృత్రిమ ఉద్యమం సాగిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి అచ్చెన్నాయుడు తదితరులతో విశాఖలో కార్య నిర్వాహక రాజధాని వద్దనీ, రాయలసీమలో కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి తదితరులతో కర్నూలలో న్యాయ రాజధాని వద్దనీ చెప్పి పాదయాత్రలు చేయించి ఉంటే ఆయనకు ఎంతో కొంత చిత్తశుద్ధి ఉందని అనుకోవచ్చు. ఇదే ప్రాంతా నికి చెందిన ఎన్.జి. రంగా వంటి గొప్పనేత రైతాంగ సమ స్యలపై సుదీర్ఘ పాదయాత్ర చేస్తే, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఇదే ప్రాంతం నుంచి పాదయాత్ర జర గడం మారిన కాలమాన పరిస్థితులకు అద్దం పడుతుందా! వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
అమరావతి (ప్రైవేట్ లిమిటెడ్) కథలు!
‘‘విపణివీథి–తపోవనం/చాకిరేవు–శాసనసభ/సానికొంప– సాధుమఠం/మూత్రశాల–యాత్రాస్థలి/ఎచటైతేం? ఎచటైతేం? పోటీపడి కాటులాడ ఎచటైతేం?’’. ప్రజాకవి కాళోజీ రాసిన ఒక కవితలోని పంక్తులివి. ఆయన రాసిన వ్యంగ్యాన్ని టీడీపీ వాళ్లు ఆదర్శంగా మలుచుకున్నట్టున్నారు. గుడి, బడి, అసెంబ్లీ, గంజాయి... సందర్భం ఏదైనా కాట్లాడటమే ఎజెండాగా ఎంచు కున్నట్టున్నారు. అధికారం చేజారి మనోధృతి జావగారిన వేళ రచ్చబాట ఒక్కటే గత్యంతరమన్న ధోరణి ఆ పార్టీ కార్య క్రమాల్లో కనిపిస్తున్నది. ఎక్కడో ఒక ఆకతాయి గుడిమీద రాళ్లు విసిరితే, ఒక దగు ల్బాజీ విగ్రహాలు చోరీచేస్తే, గుడి బయట ఉన్న రథానికి ఎవడో ఒక దుండగీడు నిప్పుపెడితే ఆ పార్టీ పండుగ చేసుకున్నది. ప్రభుత్వానికి లంకె పెట్టి ప్రచారాన్ని మోగించింది. ఈ దెబ్బతో ప్రభుత్వాన్ని కూల్చివేయాలని కలలుగన్నది. తన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఘటనలు ఇంతకంటే ఎక్కువ జరిగాయన్న సంగతి పోలీసు రికార్డుల్లో ఉన్నప్పటికీ, ఆ పార్టీ లెక్క చేయలేదు. దేవాలయ భూములను, సత్రం భూములను ఆ పార్టీ నేతలే ఫలహారంలా ఆరగించిన దృష్టాంతాలను దాచి పెట్టింది. ప్రభుత్వమే స్వయంగా పూనుకొని బుల్డోజర్లను రంగంలోకి దించి ఒక్క విజయవాడలోనే 30 గుళ్లను నేలమట్టం చేసిన రికార్డు ఆ పార్టీదే. కానీ ఇప్పుడు రాద్ధాంతం కావాలి. రచ్చ జరగాలి. కాట్లాడుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలమీద ప్రచారం జరగనీయరాదు. ఇదే దాని సంకల్పం. అందుకు బీజేపీ, జన సేనలు యథాశక్తి సహకరించాయి. సహకరిస్తున్నాయి. గంజాయి ఎపిసోడ్ అటువంటిదే. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి దొంగ రవాణా పెద్దయెత్తున సాగుతున్నదని కేంద్ర ప్రభుత్వం 2017లోనే రాష్ట్రాన్ని హెచ్చరించింది. ఈ విషయాన్ని అప్పట్లోనే జాతీయ దినపత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి కూడా. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి అక్రమ రవాణా, లిక్కర్ మాఫియా, బెల్టు షాపుల మీద ఉక్కుపాదం మోపడానికి ఎస్ఈబీ పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. గంజాయి కోసమే ఒక ప్రత్యేక బెటాలియన్ను కేటా యించింది. దీంతో దొంగ రవాణాకు అడుగడుగునా కళ్లేలు పడుతున్నాయి. ఈ వార్తలను ఉటంకిస్తూ ఆంధ్రప్రదేశ్ గంజాయి రవాణాకు అడ్డాగా మారిందని తెలుగుదేశం పార్టీ లంకించుకున్నది – దొంగే... ‘దొంగా దొంగా’ అని అరిచినట్టు! మహిళల రక్షణకోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేపట్టనన్ని కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. ‘దిశ’ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దోషులకు సత్వరమే శిక్షలు పడేలా ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి కేంద్ర ఆమోదం లభించవలసి ఉన్నది. ‘దిశ’ యాప్ యువతులకు ఒక రక్షా బంధనంలా మారింది. 85 లక్షలమంది ఈ యాప్ను డౌన్ లోడ్ చేసుకున్నారు. చంద్రబాబు హయాంలో మహిళా అధి కారులకే రక్షణ లేని దుర్భర పరిస్థితిని ఈ రాష్ట్రం వీక్షించింది. శాసన సభ్యులే దుశ్శాసన పాత్రను పోషించిన దారుణాలను గమ నించింది. అప్పటి ప్రభుత్వ నేతలు రమ్య హత్యకేసు సంద ర్భంలో గురువిందలుగా మారిన గమ్మత్తయిన దృశ్యాన్ని కూడా రాష్ట్రం అవలోకించింది. మంచీ–చెడూ విచక్షణ లేదు. పాపపుణ్యాల బేరీజు లేదు. ప్రతి సందర్భం రచ్చ కోసమే! పోట్లగిత్తల్లా కాలు దువ్వడమే! బండబూతుల దండోపాయమే! తరతరాలుగా వెనకబాటు తనానికి గురై నిలువ నీడ కోసం పరితపిస్తున్న అభాగ్యులు లక్షల సంఖ్యలో మిగిలి ఉండడమే ఒక దారుణం. మన ప్రజాస్వామ్య వ్యవస్థ సాఫల్యతను శంకించవలసిన తరుణం. అటువంటి వారికి, అందులోనూ ఆడవారి పేరు మీద 30 లక్షల ఇళ్లు కట్టించే మహాయజ్ఞాన్ని ఈ ప్రభుత్వం ప్రారంభించింది. కేటాయింపులు పూర్తయ్యాయి. ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటున్నది. ఈ ప్రయత్నాన్ని తొలి నుంచీ అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ తెగ తంటాలు పడింది. దొంగ పేర్లతో కోర్టుకెక్కింది. వ్యాజ్యం నడిపింది. ఆడవాళ్ల పేరు మీద పట్టాలు ఇవ్వడం తప్పట! యుగ యుగాల అణచివేతకూ, అస్వతంత్రతకూ బలైన మహిళా లోకాన్ని సాధికారితం చేయకుండా ఏ రకంగా ఉద్ధరిస్తారో చెప్పవలసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉన్నది. రైతులకు భరోసా భద్రత కల్పించి వెన్నుదన్నుగా నిలపడం కోసం ఏర్పాటుచేసిన ఆర్బీకేలపై ఇప్పటివరకు ఒక్క మంచి మాట లేదు. విద్యా, వైద్య రంగాలను సమూల క్షాళన గావిస్తున్న ‘నాడు–నేడు’ కార్యక్రమంపై అభినందన లేదు. పోనీ దోషా లుంటే ఎత్తిచూపిందీ లేదు. ఎటువంటి జన శ్రేయోదాయక పనిని చేపట్టినా డైవర్షన్ స్కీమ్ను ఆశ్రయించడమే విపక్షం పనిగా పెట్టుకున్నది. దుష్ప్రచారమే ఆ డైవర్షన్. గోబెల్స్ సిద్ధాంత స్ఫూర్తితో ఒక రాద్ధాంతమే ఆ డైవర్షన్ స్కీమ్. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ వారు ఒక యాత్రను ప్రారంభించారు. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ అని దానికి నామకరణం చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఈ యాత్రలో పాల్గొంటున్నారనీ, తమకు న్యాయం చేయాలని ఏడుకొండల వాడిని వేడుకోవడానికి వెళ్తున్నారనీ ప్రక టించారు. అన్యాయం జరిగిందని భావించినప్పుడు ఎవరైనా సరే తమ హక్కుల కోసం జరిపే పోరాటాన్ని అభినందించవల సిందే. సానుభూతి చూపవలసిందే! ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కనీస ధర్మం. రాజధాని కోసం తాము భూములిచ్చామనీ, ఈ ప్రభుత్వం మూడు రాజధానులను తెర మీదకు తీసుకొచ్చి నందువలన తమకు అన్యాయం జరిగిందని ఈ ఆందోళన కారులు చెబుతున్నారు. ఇందులో నిజానిజా లేమిటి? రాజధాని భూసమీకరణ కోసం చంద్ర బాబు హయాంలో జరిగిందేమిటి? తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల రైతుల దగ్గర్నుంచి 34,281 ఎకరాల భూమిని రాజ ధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రభుత్వం సమీకరించింది. భూమినిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన లే–అవుట్లలో ప్లాట్లను కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పింది. రైతులిచ్చిన భూమిని అభివృద్ధిచేసి, సుమారు 130 కంపెనీలకు 1293 ఎకరాల భూమిని ఇచ్చేశారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కింద సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు 1691 ఎకరాలను కేటాయించారు. కొంత భాగాన్ని స్వాధీనం చేయడమూ జరిగింది. రైతులకు మాత్రం కాగితాలే దక్కాయి. అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వనే లేదు. భూ యజమానులకు వారి వాటాను దఖలుపరచకుం డానే వారి భూముల్లో వ్యాపారాన్ని ప్రారంభించడం ఏ చట్టం ప్రకారం, ఏ న్యాయం ప్రకారం, ఏ నైతిక సూత్రాల ప్రకారం సమ్మతమవుతుంది? పాదయాత్రగా బయల్దేరిన రైతు సోదరు లారా.. ఈ ప్రశ్నను మీరు చంద్రబాబుకు సంధించి ఉండవలసింది. రాజధాని ప్రాంతంపై బహిరంగ ప్రకటన రాకముందే భూ సమీకరణ ప్రాంతాన్ని ఆనుకొని ఉండే ప్రదేశాల్లో చంద్రబాబు అనుయాయులూ, బినామీలూ వేల ఎకరాలు కొనుగోలు చేశారు. ముందుగా లీక్ చేయడం వల్లనే వీరు కొనుగోళ్లు చేయ గలిగారు. రైతులిచ్చిన భూముల్లో రాజధాని ఏర్పడినట్లయితే ఈ ముఠా కొనుగోలు చేసిన వేల ఎకరాల భూముల వెల లక్ష కోట్లకు చేరి ఉండేది. సొమ్ము రైతులది, సోకు బినామీ వినా యకులది. ‘హెరిటేజ్ ఫుడ్స్’ పేరుతో కొనుగోలు చేసిన భూము లతోపాటు ఈ లక్ష కోట్ల ముఠాలో తెలుగుదేశం ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. భూసమీకరణ ప్రాంతంలో ఉండ వలసిన లింగమనేని రమేశ్ భూమి ఉన్నపళాన జారిపోయింది. కరకట్ట మీద ఉన్న ఆయన గెస్ట్హౌస్ చంద్రబాబు సొంతమైంది. ఈ వ్యవహారం మీకు అధర్మమని తోచలేదా రాజధాని ప్రాంత సోదరులారా? రాజధాని ప్రాంతంలో రైతులు సాగు చేసుకుంటున్న 2,200 ఎకరాల అసైన్డ్ భూములను తెలుగుదేశం నేతలు లాక్కున్నారు. ‘ప్రభుత్వం తీసుకుంటే మీకు పరిహారం ఇవ్వరు. మేము పది లక్షల దాకా ఇస్తామ’ని మభ్యపెట్టారు. వారి చేతుల్లో పప్పు బెల్లాలు పెట్టి లాక్కున్నారు. అసైన్డ్ భూముల కొనుగోలు చట్ట విరుద్ధం. అయినా బాబు ప్రభుత్వం ఆమోదించింది. కొనుగోలు చేసిన నాయకులకు పూలింగ్ ప్యాకేజీ ప్రకటించారు. పాపం ఆ దళిత రైతులు మీ భూములు దున్నినవారే. మీ పంట చేలను చెమట చుక్కలతో తడిపినవారే. వారికి జరిగిన అన్యాయం మీ మనసును కదిలించలేదా? ఇక సింగపూర్ యవ్వారం సంగతి. అక్కడున్న రెండు ప్రైవేట్ కంపెనీలను రంగంలోకి దించారు. వారితో ఒప్పందం చేసుకున్నారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికోసం 1691 ఎకరాలను ఈ కంపెనీలకు కట్టబెట్టారు. ఉచితంగానే సుమా!. ఆ భూమిని అభివృద్ధి చేయడానికి 5500 కోట్ల రూపాయలను ప్రభుత్వమే వారికి ఇవ్వాలి. రైతుల భూమిలో, ప్రభుత్వ సొమ్ముతో వారు అభివృద్ధి చేస్తారు. అలా చేసినందుకు మొత్తం భూమిలో 250 ఎకరాలను సదరు కంపెనీలకు కట్నంగా ఇస్తారు. రాజధాని కోర్ ఏరియాలో ప్రభుత్వ సొమ్ముతో అభివృద్ధి చేసిన రైతుల భూమి 250 ఎకరాలు వారి సొంతం. అధమపక్షం ఎకరా 10 కోట్లు వేసుకున్నా 2500 కోట్లు. ఇక మిగిలిన 1450 ఎకరాల్లో ఆ కంపెనీలు వ్యాపారం చేస్తాయి. వచ్చే ఆదాయంలో అమరా వతి అభివృద్ధి సంస్థకు మూడు దశల్లో కలిపి 450 కోట్లు ఇస్తారు. అధమపక్షం పదికోట్లేసుకున్నా 1450 ఎకరాలకు 14,500 కోట్లు, అందులో ప్రభుత్వ సంస్థకు 450 కోట్లు. పోను సింగపూర్ సంస్థ లకు మిగిలేది 14000 కోట్లు ప్లస్ 2500 కోట్లు. మొత్తం 16,500 కోట్లు. ఇది కనీస పక్షం లెక్క. ఇది ద్విగుణం, త్రిగుణం... అంతకుమించి కూడా అవ్వొచ్చు. ఎవరీ సింగపూర్ కంపెనీ వారు? ఎవరి తాతగారి బంధువులు? ఇన్ని వేలకోట్ల ప్రజా ధనాన్ని వారికి ఎందుకు కట్టబెట్టడానికి ప్రయత్నించి నట్టు? ఇందులో సింహభాగం సొమ్ము సింగపూర్లో చేరవలసిన వారి అకౌంట్కు చేరుతుందని కనిపెట్టడానికి కామన్సెన్స్ చాలదా? ఆందోళనకారులు ఈతరహా ఒప్పందాన్ని ఎప్పుడైనా ప్రశ్నిం చారా? రాజధాని వ్యవహారంలో ఆయనకు మద్ద తునిస్తున్న పార్టీలైనా ప్రశ్నించాయా? అధికారంలో ఉన్నవారు ప్రజాదరణ పొందలేకపోతే దిగి పోవలసి రావడం సహజం. కానీ చంద్రబాబుకు మాత్రం కోల్పోయిన అధికారం ఒక తొణికిన స్వప్నం. ఒక చేజారిన స్వర్గం. ఎందుకంటే, అదే అమరావతి మహిమ. ఈ ప్రాజెక్టులో ప్రజాశ్రేయస్సు కంటే ఆయన సౌభాగ్యమే ఎక్కువ. ఇది ప్రపంచంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్గా, ప్రపంచంలో అతిపెద్ద స్కామ్గా ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై పలువురు నిపుణులు వ్యాఖ్యానించారు. తొణికిన స్వప్నాన్ని, చేజారిన స్వర్గాన్ని మళ్లీ అందుకోవాలని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఆయన రెండంచెల వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. ఒకటి– వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్య క్రమాలపై చర్చ జరగకుండా వ్యతిరేక ప్రచారాన్ని నిరంతరంగా నిర్వహించడం. రెండు– వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ను ఎదు ర్కోవడానికి ఎన్ని శక్తులను ఏకం చేయవలసి ఉంటుందనే అంశంపై ట్రయల్స్ వేయడం. మొదటి అంచెను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల నుంచే ప్రారంభించారు. ఇప్పుడది అదుపుతప్పి ముఖ్యమంత్రి మీద వ్యక్తిగత దూషణల దాకా వెళ్లింది. రెండో వ్యూహంపై బద్వేల్, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఒక ప్రయోగం చేశారు. ముందుగా బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి ఆ పార్టీ అభ్యర్థే రంగంలో ఉండేలా పావులు కదిపారు. జనసేన అధికా రికంగా బీజేపీ మిత్రపక్షమే కనుక దాని మద్దతు లభించింది. టీడీపీ కార్యకర్తలే ఏజెంట్లుగా నిలబడ్డారు. బీజేపీ తీర్థం పుచ్చు కున్న తెలుగుదేశం నేతలు ఆదినారాయణరెడ్డి, సీఎం రమేశ్లు టీడీపీ ఓట్లు బీజేపీకి పడేలా చక్రం తిప్పారు. ఈ ప్రయోగం కొంతమేరకైనా ఫలించి ఉన్నట్లయితే చంద్రబాబులో ఆశలు చిగురించేవి. ఇంత చేసినా బద్వేల్లో ఉమ్మడి అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు. హుజూరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు బీజేపీకి దక్కడానికి తెరవెనుక చంద్రబాబు మంత్రాంగం చేశారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెబు తున్నారు. అటువంటి గట్టి ప్రయత్నం ఏదీ లేకపోతే గత ఎన్ని కల్లో 30 శాతం ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఒకటిన్నర శాతానికి పడిపోవడం అసంభవమని వారి వాదన. బీజేపీ కటాక్ష వీక్షణాల కోసమే చంద్రబాబు ఈ పని చేసిపెట్టారని చెబుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రెండంచెల వ్యూహానికి బీజేపీ తోడ్పాటు కావాలి. సాధారణ ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ఓట్లు లభించాయి. స్థానిక ఎన్నికల నాటికి 70 శాతం దాటాయి. బద్వేల్లో 76 శాతం ఓట్లు పడ్డాయి. ఆ ఓటు బ్యాంకు 50 శాతం కంటే తగ్గాలి. అందుకోసం దుష్ప్రచారం. అది అఖండ జ్యోతిలా ఆరకుండా మండుతూనే ఉన్నది. ఇరవై ఐదు శాతానికి పడి పోయిన తన ఓటు బ్యాంకు యాభై శాతం దాటాలి. ఎలా? అందుకే ఈ ట్రయల్ రన్స్. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఏసీబీ ఎఫ్ఐఆర్ కొట్టివేత
సాక్షి, అమరావతి: అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, మరికొందరిపై ఏసీబీ నమోదు చేసిన కేసును రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టేసింది. తనపై తప్పుడు ఫిర్యాదుచేసి వేధింపులకు గురిచేసినందుకుగాను తనకు పరిహారం ఇచ్చేలా ఆదేశాలివ్వాలంటూ దమ్మాలపాటి శ్రీనివాస్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యాజ్యంలో అలాంటి పరిహారం చెల్లింపునకు ఆదేశాలివ్వలేమని.. అయితే, పరిహారం కోసం, ఖర్చుల కోసం ఫిర్యాదుదారుణ్ణి కోరే స్వేచ్ఛను దమ్మాలపాటికి హైకోర్టు ఇచ్చింది. అదనపు ఏజీ ఎలాంటి రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన బాధ్యతలు, విధులు నిర్వర్తించరని.. రాజధాని ఎక్కడ ఉండాలన్న నిర్ణయంలో ఆయన పాత్ర ఉండదని హైకోర్టు స్పష్టంచేసింది. కాబట్టి రాజధాని విషయంలో ఆయన ఎలాంటి రహస్యాలను బహిర్గతం చేసే అవకాశం కూడా లేదని చెప్పింది. ఆయనిచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన నిందితులు భూములు కొనుగోలు చేశారనడం సరికాదని వ్యాఖ్యానించింది. అలాగే, దమ్మాలపాటి శ్రీనివాస్ ఎలాంటి నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడలేదని.. ఆయనపై ఏసీబీ చేసిన ఆరోపణలకు ఎలాంటి రుజువులు లేవని తెలిపింది. రాజధాని ఎక్కడ వస్తుందన్న సమాచారం ఎంతమాత్రం రహస్యం కాదని.. 2014 జూన్ నుంచి అది జన బాహుళ్యంలోనే ఉందని చెప్పింది. ఆస్తి సముపార్జన రాజ్యాంగ, న్యాయబద్ధ హక్కు అని, ఇది ఈ దేశ పౌరులందరికీ ఉందని హైకోర్టు తేల్చిచెప్పింది. నిర్ణీత మొత్తానికి స్వచ్ఛంధంగా భూములు అమ్మేవారి నుంచి భూములు కొనుగోలు చేయడం ఎంతమాత్రం నేరంకాదని.. అలా భూములు కొనుగోలు చేసిన పిటిషనర్లందరికీ కూడా ఎలాంటి నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టంచేసింది. వీరిని ఐపీసీ సెక్షన్–420 కింద, అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదని పేర్కొంది. భూములు అమ్మి ఎలాంటి నష్టానికి గురికాలేదని, ఇందులో ఎలాంటి కుట్రను కూడా ఆపాదించడానికి ఆస్కారంలేదని తెలిపింది. ఏ రకంగా చూసినా కూడా పిటిషనర్లపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ న్యాయ మౌలిక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు తేల్చిచెప్పింది. పిటిషనర్లపై ఎఫ్ఐఆర్ నమోదు న్యాయ ప్రక్రియ దుర్వినియోగమేనని.. అందుకే న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ ఈ ఎఫ్ఐఆర్ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గురువారం తీర్పు వెలువరించారు.. కేసు నేపథ్యం ఇదీ.. అమరావతి భూ కొనుగోళ్లపై సీబీఐ దర్యాప్తు కోరడంతో పాటు, దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక సమ్మతిని తెలియచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి గత ఏడాది మార్చి 23న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖను కొట్టేయాలని కోరుతూ దమ్మాలపాటి శ్రీనివాస్ గత ఏడాది సెప్టెంబర్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం పెండింగ్లో ఉండగానే, ఏసీబీ సెప్టెంబర్ 20న కేసు నమోదు చేయడంతో దమ్మాలపాటి హైకోర్టులో అత్యవసరంగా హౌస్మోషన్ రూపంలో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి భూ కుంభకోణంపై పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో వార్తలు రాయడంవల్ల తమ పరువుపోతోందని, అందువల్ల ఆ కుంభకోణానికి సంబంధించిన వార్తలు రాయకుండా వాటిని నియంత్రించాలని కోర్టును కోరారు. దమ్మాలపాటి కోరిన ఉత్తర్వులే కాకుండా ఏకంగా దర్యాప్తుతో సహా తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ఉత్తర్వులిచ్చారు. అమరాతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ఎటువంటి విషయాలను బహిరంగంగా ప్రచురించడం, ప్రసారం చేయడానికి వీల్లేదని పత్రికలను, టీవీలను, సోషల్ మీడియాను ఆదేశిస్తూ గ్యాగ్ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా, తమ పిటిషన్ను ఉపసంహరించుకుంటామని, హైకోర్టులోనే వాదనలు వినిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు, పిటిషన్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. నాలుగు వారాల్లో కేసు తేల్చాలని హైకోర్టుకు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసును కొట్టేయాలని కోరుతూ దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన సతీమణి నాగరాణి, సమీప బంధువులు నన్నపనేని సీతారామరాజు, నన్నపనేని లక్ష్మీనారాయణ, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గురువారం తన నిర్ణయాన్ని వెలువరించారు. -
ఆ ప్లాట్ల రద్దు విషయంలో తొందరపడొద్దు
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలో అసైన్డ్దారుల నుంచి భూములు కొనుగోలు చేసి, వాటిని భూ సమీకరణ కింద ఇచ్చిన వారికి అప్పటి ప్రభుత్వం కేటాయించిన నివాస, వాణిజ్య ప్లాట్లను రద్దు చేసే విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు ఆదేశించింది. కేటాయింపుల రద్దు కోసం జారీ చేసిన జీవో 316, తదనుగుణ నోటీసు విషయంలో తదుపరి చర్యలేవీ వద్దని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతి రాజధాని అవుతుందని ముందే తెలుసుకుని అప్పటి అధికార పార్టీకి చెందిన పలువురు వ్యక్తులు రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అసైన్డ్దారుల నుంచి నామమాత్రపు ధరకు భూములు కొనుగోలు చేశారు. వాటిని భూ సమీకరణ కింద ప్రభుత్వానికి స్వాధీనం చేసి అందుకు ప్రతిగా రాజధాని ప్రాంతంలో నివాస, వాణిజ్య ప్లాట్లు పొందారు. అసైన్డ్ భూముల విక్రయం చట్ట విరుద్ధం కావడంతో అలా భూములు కొని ప్లాట్లు పొందిన వారి ప్లాట్లను రద్దు చేసే నిమిత్తం ప్రభుత్వం జీవో 316 తీసుకొచ్చింది. ఈ జీవోను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన పెండ్యాల మరియదాసు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్లాట్ల రద్దు నిమిత్తం అధికారులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ విచారణ జరిపి, జీవో 316కు అనుగుణంగా ఎలాంటి తదుపరి చర్యలొద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. -
మా వాటా ఆస్తులు, నిధులు మాకు ఇచ్చేయండి
సాక్షి, అమరావతి: విభజన చట్టం ప్రకారం రావలసిన స్థిర, చరాస్తులను వెంటనే తమకు అప్పగించాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. తెలుగు అకాడమీకి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించిన నేపథ్యంలో తమకు రావలసిన నిధులు, ఆస్తులకు సంబంధించిన వాటాలను వెంటనే అప్పగించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలుగు అకాడమీని వేరుగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం నందమూరి లక్ష్మీపార్వతిని చైర్మన్గా నియమించడం తెలిసిందే. అకాడమీ కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తయ్యింది. ఉమ్మడి తెలుగు అకాడమీకి సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డిపాజిట్లు, ఇతర నిధులు, స్థిరాస్తులలో ఏపీకి రావలసిన వాటాకు సంబంధించి అకాడమీ అధికారులు తెలంగాణ అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీనిపై ఏపీ తెలుగు అకాడమీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఏపీ తెలుగు అకాడమీకి అనుకూలంగా తీర్పు వెలువరించింది. అకాడమీలోని నిధులను, భవనాలను ఇతర స్థిర, చరాస్తులను 58:42 నిష్పత్తిలో ఇరు రాష్ట్రాలు పంచుకోవాలని స్పష్టం చేసింది. దీనిపై తెలంగాణ అకాడమీ, ఆ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడా తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఏపీ అకాడమీకి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. -
ఎఫ్ఐఆర్ వెనుక దురుద్దేశాలు లేవు
సాక్షి, అమరావతి : అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంలో అప్పటి అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని దర్యాప్తు అధికారి టీవీవీ ప్రతాప్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. పోలీసులకు అందిన ఫిర్యాదులోని అంశాలు విచారణార్హమైన నేరానికి సంబంధించినవైతే, తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీరాల్సిందేనని చెప్పారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరడంతో పాటు, దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక సమ్మతిని తెలియచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి గత ఏడాది మార్చి 23న రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖను కొట్టేయాలని కోరుతూ దమ్మాలపాటి శ్రీనివాస్ గత ఏడాది సెప్టెంబర్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దమ్మాలపాటి కోరిన ఉత్తర్వులే కాకుండా ఏకంగా దర్యాప్తుతో సహా తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి (మీడియాను కూడా నియంత్రిస్తూ గ్యాగ్ ఆదేశాలు) ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నాలుగు వారాల్లో కేసు తేల్చాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, ఈ నెల 5 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఏసీబీ, తదితరులను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఏసీబీ తరఫున దర్యాప్తు అధికారి టీవీవీ ప్రతాప్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు. దర్యాప్తు జరగాల్సిందే.. సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్ట నిబంధనలకు అనుగుణంగా సదుద్దేశంతోనే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కౌంటర్లో వివరించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రోజునే దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించిందని, అధికరణ 226, సీఆర్పీసీ 482 కింద ఉన్న అధికారాలను, దర్యాప్తును హైకోర్టు అడ్డుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు తీర్పుల ద్వారా చెప్పిందన్నారు. 2014 జూలైలోనే ఎక్కడ రాజధాని రానుందో ప్రజలందరికీ తెలుసున్న వాదన వాస్తవం కాదని, 2014 డిసెంబర్ వరకు రాజధాని ఖరారు కాలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘అమరావతి భూముల అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయడం అన్నది ప్రభుత్వం పాలనాపరంగా తీసుకున్న నిర్ణయం. దానికీ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు ఎలాంటి సంబంధం లేదు. ఆస్తి కొనుగోలు చేసే హక్కుకు, చట్ట వ్యతిరేకంగా ఆస్తిని సమీకరించడానికి చాలా తేడా ఉంది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అనేక అంశాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది. అందువల్ల దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలి’ అని కోర్టును కోరారు. -
ఇలాంటి పాడి ఆవు అక్కడ వద్దా?
భూమి హైదరాబాద్కు నలువైపులా ఉండడం తెలంగాణ ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చింది. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరగడానికి ఇదే కారణం. అమరావతిలో లక్షల కోట్లు వెచ్చించి దాన్ని ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లా చంద్రబాబు మార్చకుండా ప్రభుత్వ భూములలో రాజధాని కట్టి, మిగిలిన అటవీ భూములను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసి ఉంటే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చి ఉండేది! అందుకే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రతిపాదించింది. విశాఖలో అసమానాభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకోవడం, అలాగే ఏపీలో ఉన్న మరికొన్ని నగరాలను సమాంతరంగా అభివృద్ధి చేయడం ద్వారా కేంద్రీకరణ లేకుండా చేసుకోవచ్చు. అంతేకాక, ఆ నగరాలను ఆదాయ వనరులుగా మార్చుకోవచ్చు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం ప్రభుత్వానికి పాడి ఆవులా ఉందని అనుకోవాలి. మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే ఒక్క హైదరాబాద్ నగరం ద్వారానే వచ్చే కొద్ది నెలల్లో ప్రభుత్వానికి సుమారు 20 వేల కోట్ల నుంచి 25 వేల కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని పత్రికలు ఈ మొత్తం 30 వేల కోట్లకుపైగానే ఉంటుందని కథనాలు ఇస్తున్నాయి. ఇలాంటి లావాదేవీలలో కచ్చితంగా ఇంత మొత్తం వస్తుందని చెప్పలేకపోయినా, భారీగానే ప్రభుత్వానికి ఆర్జన రానుందని అర్థం అవుతుంది. ప్రధానంగా అనధికార లే అవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ బాగా ఉపయోగపడవచ్చని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25.5 లక్షల దరఖాస్తులు ఎల్.ఆర్.ఎస్.కోసం వచ్చాయి. వీటిలో హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలలో లక్షకు పైగా ఒక్కోచోట నుంచి వచ్చాయి. హైదరాబాద్లో ప్రస్తుతం మార్కెట్ విలువలు ఎలా ఉన్నాయో తెలియంది కాదు. ప్రభుత్వం తొలుత పదివేల కోట్ల రూపాయల ఆదాయం దీనిద్వారా వస్తుందని అనుకుంటే, అంతా సజావుగా జరిగితే ఈ పద్దులో ఇరవైవేల కోట్ల రూపాయల పైగానే రావచ్చని చెబుతున్నారు. ఇక ఖాళీ స్థలాలపై పన్ను, రిజిస్ట్రేషన్ విలువల పెంపు వంటివి స్థూలంగా ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వం రింగ్ రోడ్లకు అత్యంత సమీపాన కోకాపేట వంటి ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా ఇప్పటికే 2,700 కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ భూముల అమ్మకంపై ప్రతిపక్షం విమర్శలు చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, ఆయన కుటుంబ సభ్యులపైనా పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం వాటిని ఖండించింది. అది వేరే కథ. హైదరాబాద్ వంటి రాజధాని తెలంగాణకు ఖజానా వంటిదని చెప్పాలి. ఎందుకంటే వాణిజ్య పన్నుల రూపేణా, మద్యం షాపుల ఎక్సైజ్ ఆదాయం ద్వారా, తాజాగా భూముల రెగ్యులరైజేషన్ , రిజిస్ట్రేషన్ వంటి వాటిని ప్రభుత్వం చేపట్టడం వల్ల ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పడూ చెబుతున్నట్లు తెలంగాణ ధనిక రాష్ట్రం అయిపోయినట్లో కాదో కాని, హైదరాబాద్ వరకు తీసుకుంటే ఆయన చెప్పింది చాలావరకు కరెక్టు అని అంగీకరించాలి. ఉమ్మడి ఏపీకి రాజధానిగా ఉన్న సమయంలో లక్షలాది మంది ఏపీ, తెలంగాణలోని హైదరాబాదేతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. అనేక మంది రకరకాల వ్యాపారాలు చేపట్టారు. దానికి తోడు ఐటీ పరిశ్రమ ఇక్కడ నిలదొక్కుకోవడానికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా భూమి హైదరాబాద్కు నలువైపులా ఉండడం కలిసి వచ్చింది. దేశంలో ఇలా నాలుగువైపులా విస్తరించే నగరాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కోకాపేట వంటి చోట్ల ఎకరం అరవైకోట్ల వరకు వెళ్లిందని అనుకోవచ్చు. అదే సమయంలో ప్రభుత్వ భూములు ఇలా అమ్మేస్తే భావితరాలకు, వారి అవసరాలకు భూములు ఎక్కడి నుంచి వస్తాయన్న ప్రశ్నను విపక్షాలు సంధిస్తున్నాయి. భూముల అమ్మకం కేసీఆర్తోనే మొదలు కాలేదు. హైకోర్టు కూడా ఈ భూముల అమ్మకాన్ని ఆపలేదు. ఆక్రమణలకు గురయ్యేకన్నా అమ్మడమే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. నిజంగానే కేసీఆర్ ప్రభుత్వ ఆలోచనలు వాస్తవరూపం దాల్చి ఒక్కసారిగా ముప్పైవేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరితే ప్రభుత్వం పంట పండినట్లే అనుకోవాలి. కరోనా సంక్షోభ సమయంలో పడిపోయిన ఆదాయాన్ని ఈ రకంగా సమకూర్చుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వానికి కలిసి వచ్చిన అదృష్టంగా అనుకోవచ్చు. ఇది హైదరాబాద్ కథ అయితే ఏపీలో అమరావతి పేరుతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల డబ్బు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని అప్పట్లో సంకల్పించారు. వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేశారు. దాన్ని ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లా మార్చారు. దానివల్ల ప్రభుత్వంకన్నా ప్రైవేటు వ్యక్తులకే అధికంగా మేలు కలిగింది. అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ ఒక మాట చెప్పేవారు. రైతుల నుంచి సమీకరించిన భూములలో ప్లాట్లు వేసి, మౌలిక వసతులు సమకూర్చి, ప్రభుత్వ అవసరాలకు వాడుకోగా ప్రభుత్వం అమ్ముకోవడానికి మిగిలేది పెద్దగా ఉండదని అనేవారు. పైగా అటవీభూములతో సహా సుమారు ఏభైవేల ఎకరాల మేర విస్తీర్ణం అభివృద్ధి కావాలంటే పాతిక, ముప్పై ఏళ్లు పట్టవచ్చన్నది ఒక అభిప్రాయం. చంద్రబాబు ఈ రియల్ ఎస్టేట్ మోడల్లో కాకుండా ప్రభుత్వ భూములలో రాజధాని కట్టి, మిగిలిన అటవీ భూములను అభివృద్ధి చేసి అమ్మే విధంగా ఏర్పాటు చేసుకుని ఉంటే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చి ఉండేదేమో! చంద్రబాబు తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అన్నిటినీ పరిశీలించి, ఒకే చోట లక్షల కోట్ల వ్యయం చేస్తే, మిగిలిన రాష్ట్రం అంతా అన్యాయం అవుతుందని భావించి మూడు రాజధానులను ప్రతిపాదించింది. వీటిలో తెలివైనది విశాఖ నగరాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేసుకోవడం. కోర్టుల ద్వారా ఇతరత్రా అడ్డంకులు రాకపోతే, విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అటు విజయనగరం శ్రీకాకుళం వైపు, ఇటు అనకాపల్లి, తుని వైపు బాగా విస్తరించే అవకాశం ఉంటుంది. దానికి తోడు ప్రభుత్వ భూములు కూడా గణనీయంగానే ఉన్నాయి. ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన పనిలేదు. అక్కడకు ఇప్పటికే ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డారు. ఇంకా పెద్ద సంఖ్యలో అక్కడకు తరలిస్తే, హైదరాబాద్ మాదిరే అది కూడా ఏపీకి మంచి ఆదాయ వనరు అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే పలు పరిశ్రమలు ఉన్నాయి. ఐటీతో సహా వివిధ రంగాల పరిశ్రమలు అక్కడకు వస్తే నగరం ఊపు అందుకుంటుంది. అయితే హైదరాబాద్లో అంతా కేంద్రీకరణ అవడం వల్ల కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. ఉదాహరణకు ఒక వైపు కోకాపేటలో భూముల విలువ కోట్ల రూపాయలకు పెరిగిందని సంతోషించే పరిస్థితి అయితే, మరో వైపు కాస్త భారీ వర్షాలు వస్తే వందల కాలనీలు వరదనీటిలో నానే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ధనిక ప్రాంతాలు పెరుగుతున్నాయని అనుకునే లోపే పేదవాడలు కూడా విస్తరిస్తున్నాయి. అదే సమయంలో కోకాపేట తదితర ప్రాంతాలలో సామాన్య, మధ్యతరగతి వారికి అవకాశాలు తగ్గిపోతుంటాయి. విశాఖలో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం, అలాగే ఏపీలో ఉన్న మరికొన్ని నగరాలను సమాంతరంగా అభివృద్ధి చేయడం ద్వారా కేంద్రీకరణ లేకుండా చేసుకోవచ్చు. అంతేకాక, ఆ నగరాలను ఆదాయ వనరులుగా మార్చుకోవచ్చు. హైదరాబాద్ వంటి నగరం లేకపోవడం ఏపీకి పెద్ద లోటే కావచ్చు కానీ విశాఖ, రాజమండ్రి, విజయవాడ–గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు వంటి నగరాలు ఉండటం కూడా ఉపయుక్తమే. కాకపోతే వాటిని సరైన దిశలో అభివృద్ధి చేసుకోగలిగితే ఏపీ కూడా హైదరాబాద్లాగా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు అప్పట్లో అంతా ఒకేచోట కేంద్రీకరించడానికి ప్రయత్నించి తప్పు చేశారు. జగన్ ప్రభుత్వం వికేంద్రీకరణకు ప్రయత్నిస్తుంటే చంద్రబాబు, ఇతరులు పదేపదే అడ్డుపడుతున్నారు. ఏపీలో ఉన్న నగరాలకు కొన్ని బలాలు ఉన్నాయి. వాటిని గుర్తించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తే తమిళనాడులో మాదిరి ఆయా నగరాలకు గుర్తింపు వస్తుంది. ఉదాహరణకు చెన్నై రాజధాని అయినా, కోయంబత్తూరు, సేలం, మదురై తదితర నగరాలు బాగా వృద్ధి చెందాయి. ఒక్కో నగరం ఒక్కో రంగంలో విశిష్టత పొందింది. ఈ అనుభవాలను అధ్యయనం చేసి ఏపీలోని నగరాలను కూడా తీర్చిదిద్దాలి. కాని విశాఖ అభివృద్ధికే ప్రతిపక్షం అడ్డుపడుతోంది. న్యాయ వ్యవస్థ ద్వారానో, మరో రకంగానో ప్రతి విషయంలో ఆటంకాలను సృష్టిస్తోంది. వీటన్నిటిని అధిగమించి జగన్ ప్రభుత్వం ముందుకు సాగాల్సి ఉంది. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
అమరావతి భూ కుంభకోణంపై 12న తుది విచారణ
సాక్షి, అమరావతి: అమరావతి భూ కొనుగోళ్ల వ్యవహారంలో ఏసీబీని సవాల్ చేస్తూ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఆగస్టు 5కల్లా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఆ కౌంటర్లో ఆగస్టు 12వ తేదీ లోపు రీజాయిండర్ దాఖలు చేయాలని దమ్మాలపాటిని ఆదేశించింది. ఈ వ్యాజ్యాన్ని నాలుగు వారాల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆగస్టు 12న తుది విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే అమరావతి భూ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన న్యాయవాది కె.శ్రీనివాస స్వామిరెడ్డిని ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ దమ్మాలపాటి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను న్యాయస్థానం అనుమతించింది. స్వామిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గురువారం ఉత్తర్వులిచ్చారు. ఏసీబీ కేసుపై దమ్మాలపాటి అత్యవసర పిటిషన్.. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక సమ్మతిని తెలియచేస్తూ కేంద్రానికి గతేడాది మార్చి 23న రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారు. దీనిని కొట్టేయాలని కోరుతూ దమ్మాలపాటి గతేడాది సెప్టెంబర్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా, ఇతర కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం పెండింగ్లో ఉండగానే.. ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో దమ్మాలపాటి హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి భూ కుంభకోణంపై పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో వార్తలు రాయడం వల్ల తమ పరువుపోతోందని తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించిన వార్తలు రాయకుండా నియంత్రించాలని కోర్టును కోరారు. ‘సుప్రీం’ ఆదేశాల ప్రకారం విచారిస్తాం.. తాజాగా గురువారం దమ్మాలపాటి పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా దమ్మాలపాటి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టు ఉత్తర్వుల గురించి న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ దృష్టికి తీసుకొచ్చారు. ఆ ఉత్తర్వులను న్యాయమూర్తి పరిశీలించారు. 4 వారాల్లో ఈ కేసును తేల్చాలని సుప్రీంకోర్టు చెప్పిందని, ఆ ఆదేశాలకు అనుగుణంగానే విచారణ జరుపుతానని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో న్యాయమూర్తి కౌంటర్ దాఖలుకు, ఆ కౌంటర్పై రీజాయిండర్ దాఖలుకు ఇరుపక్షాలకు నిర్ణీత గడువు విధించారు. ఆగస్టు 12న తుది విచారణ జరుపుతామని చెప్పారు. ఏసీబీ దాఖలు చేసిన కేసులో 13వ నిందితురాలిగా ఉన్న వెల్లంకి రేణుకాదేవి వ్యాజ్యాన్ని కూడా దమ్మాలపాటి పిటిషన్కు జత చేశారు. ఆ వ్యాజ్యంలో కూడా విచారణను ఆగస్టు 12కి వాయిదా వేశారు. చర్చనీయాంశమైన ‘గ్యాగ్’.. ఈ వ్యాజ్యాన్ని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి విచారించారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఏకంగా దర్యాప్తు, విచారణను నిలిపేశారు. ఈ కేసులో ఏ ఒక్కరిపైనా కఠిన చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించారు. అమరాతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన కేసు విషయాలను ప్రచురించడం, ప్రసారం చేయడానికి వీల్లేదని ఆదేశిస్తూ గ్యాగ్ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం ఇటీవల సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటామని, హైకోర్టులోనే స్టే ఎత్తివేత కోసం వాదనలు వినిపిస్తామని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. 4 వారాల్లో కేసును పరిష్కరించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. -
అమరావతి భూముల కేసును కొట్టేసిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూముల కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనం సోమవారం సుదీర్ఘంగా విచారించింది. చివరకు పిటిషన్లో యోగ్యతలు లేవని కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తన వాదనలు వినిపిస్తూ.. అధికారిక రహస్యాల ఉల్లంఘనకు సంబంధించిన సెక్షన్ 418ను హైకోర్టు విస్మరించిందని తెలిపారు. కొనుగోలుదారులకు భూములు ఎందుకు కొంటున్నారో తెలుసని అమ్మకందారులకు మాత్రం తెలియదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆస్తుల బదిలీ (టీపీ) చట్టం సెక్షన్ 55ను ప్రస్తావిస్తూ.. భూమి కొనుగోలు సమయంలో అమ్మకందారుడికి కొనుగోలుదారుడు ఎందుకు కొంటున్నారనే అంశాన్ని వివరించాల్సి ఉందన్నారు. హైకోర్టు అనేక అంశాలు విస్మరించిందని, నోటీసులు జారీ చేసి విచారణకు అనుమతి ఇవ్వాలని కోరారు. హైకోర్టు ప్రాథమిక దశలోనే దీనిని కొట్టేసిందని వివరించారు. హైకోర్టు తీర్పు ప్రతిని చదువుతూ.. భూములు కొనుగోలు చేయడం రాజ్యాంగ హక్కుగా హైకోర్టు పేర్కొందని, న్యాయమూర్తికి ఓ చీటింగ్ కేసులో రాజ్యాంగ హక్కు ఎలా కనిపించిందో అర్థం కాలేదన్నారు. ప్రైవేటు వ్యక్తుల భూముల కొనుగోళ్లు, అమ్మకాలలో క్రిమినల్ చట్టాలు ఎలా వర్తింపజేస్తారని హైకోర్టు ప్రశ్నించిందని, విచారణ చేసినప్పుడే కదా అవన్నీ బయటపడేదని దవే వాదించారు. ఇవన్నీ విస్మరించిన హైకోర్టు ప్రాథమిక దశలోనే కేసును కొట్టేసిందని పేర్కొన్నారు. రాజధాని ఆ ప్రాంతంలో వస్తుందన్న విషయాన్ని కప్పిపుచ్చి భూములు కొనుగోలు చేశారని ఫిర్యాదుదారుడు ఎస్.సురేష్ తరఫు సీనియర్ న్యాయవాది పారస్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఓ తెలుగు (సాక్షి కాదు), ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా అమరావతి భూముల స్పెక్యులేషన్కు తెరపడిందంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. సీఆర్డీఏ కూడా 2014 డిసెంబర్ 30న నోటిఫికేషన్ ఇచ్చిందని పారస్ తెలిపారు. ప్రతివాదుల తరఫు సీనియర్ న్యాయవాదులు శ్యాం దివాన్, సిద్ధార్థ లూత్రా కూడా వాదనలు వినిపించారు. వాదనల అనంతరం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ పిటిషన్ను కొట్టివేస్తున్నామని ధర్మాసనం ప్రకటించింది. -
అమరావతి భూ కుంభకోణం: దర్యాప్తును అడ్డుకోవడం తగదు
సాక్షి, న్యూఢిల్లీ : దర్యాప్తు ప్రాథమిక దశలో జోక్యం చేసుకోరాదంటూ 1952 నుంచి సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో రాజధాని భూముల కుంభకోణం కేసులో హైకోర్టు స్టే ఇచ్చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. భారీ కుంభకోణంపై ప్రభుత్వం దర్యాప్తు జరపాలనుకొంటే హైకోర్టు స్టే ఇవ్వడం సబబు కాదన్నారు. సిట్ దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చితే రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, లేదంటే అక్కడితో ముగిసిపోతుందని తెలిపారు. ఎఫ్ఐఆర్లో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయని చెప్పారు. రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ కొందరిపై సీఐడీ కేసులు కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘రాజధాని బహిరంగ రహస్యం అనడంలో తప్పేముంది?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. ‘ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఎంపికపై శివరామకృష్ణ కమిటీ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వం రాజధాని ఏర్పాటు నిమిత్తం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాలను సబ్ కమిటీ సూచించింది. అయితే ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది స్పష్టంగా నిర్ణయించలేదు. అనంతరం సీఆర్డీఏ చట్టం వచ్చింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో 25 గ్రామాలు రాజధాని ఏర్పాటు కోసం సేకరించాలని ప్రకటించారు. ప్రభుత్వంలోని కొందరు, వారి బంధువులు, సంస్థలు రాజధాని ఏర్పాటు కాకుండానే ఆ ప్రాంత బౌండరీల సమీపంలో రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారు. ఈ అంశంపై ప్రస్తుతం సిట్ దర్యాప్తు ప్రారంభించింది. అంతలో ఈ దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చింది’ అని వివరించారు. ఇతర కేసులపై ప్రభావం చూపుతోంది అనంతరం హైకోర్టు తీర్పులో ఏముందంటూ పరిశీలించిన ధర్మాసనం.. ఏ గ్రౌండ్స్తో సుప్రీంకోర్టుకు వచ్చారు.. హైకోర్టు దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టే ఇక్కడకు వచ్చారా? అని ప్రశ్నించింది. ‘రఫీఖ్ అహ్మద్భాయ్ పలివాలా వర్సెస్ గుజరాత్ కేసులో ప్రాథమిక దశలో ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయకుండా దర్యాప్తు అధికారి తగిన విధంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించి ఉండాలని జస్టిస్ సప్రే, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులో పేర్కొంది’ అని దుష్యంత్ దవే గుర్తు చేశారు. ‘భూ సేకరణ సమయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. తొలుత బిల్డర్లు రైతుల వద్దకు వెళ్లి మీ భూమి భూసేకరణలో పోతోందని చెప్పి తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత సదరు భూమి భూసేకరణ కాకుండా చూసుకుంటారు. ఈ పద్ధతి చాలా ఏళ్లుగా సాగుతోంద’ని దవే పేర్కొన్నారు. ఈ తరహా అంశంపై జస్టిస్ లలిత్ ధర్మాసనం క్రిమినల్ ప్రాసిక్యూషన్కు కూడా ఆదేశించిందని తెలిపారు. ‘అసలు చిక్కు ఏంటంటే ఈ కేసు ఇతర కేసులపై ప్రభావం చూపుతుంది అందుకే వాయిదా వద్దని ప్రతివాదులు కోరుతున్నారు. ఇతర కేసుల్లో కూడా ఆరోపణ ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వాన్ని దర్యాప్తు చేయనివ్వడం లేదు. క్రిమినల్ ఫిర్యాదుపై ప్రాథమిక దశలో హైకోర్టు అడ్డుకోరాదు’ అని పేర్కొన్నారు. ఇదే కోర్టులో మరో బెంచ్ వద్ద ఉన్న ఈ అంశానికి సంబంధించిన కేసుకు దీనిని జత చేయాలని దవే కోరగా, అది సివిల్ కేసు అంటూ ధర్మాసనం అంగీకరించలేదు. దవే వాదనలు ఇంకా ఇలా ఉన్నాయి. తొలుత దర్యాప్తు జరగాల్సిందే.. ►ఈ కేసును హైకోర్టు నేరుగా క్వాష్ చేసింది. ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వలేదు. రాజకీయ నేతలు, మరి కొందరు.. రైతులను మోసం చేసి, భూములు కొనుగోలు చేశారు. కొనుగోళ్లు పూర్తయ్యాకే ఆ ప్రాంతంలో రాజధాని వస్తుందని ప్రకటించారు. ►పంజాబ్ వర్సెస్ గురుదయాళ్ భూసేకరణ కేసులో కూడా సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తు చేయాలని పేర్కొంది. రాజకీయ పార్టీల నేతల బంధువులు, కొందరు అధికారులు, వారి వారి సంస్థల పేర్ల మీద రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ ప్రాంతానికి ఆనుకొని ముందస్తుగా భూములు కొనుగోళ్లు చేస్తే.. అలాంటి ఆరోపణలు దర్యాప్తునకు తగవా.. మీరే చెప్పండి. ►ఆరోపణలపై అధికారులను దర్యాప్తు చేయనివ్వాలి. ఏ పరిస్థితుల్లోనూ జోక్యం తగదని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. అధికారులు దర్యాప్తు చేసి మెటీరియల్ కోర్టు ముందు ఉంచితే, దాన్ని కోర్టు ఎగ్జామిన్ చేయాలి. -
అమరావతి భూకొనుగోళ్లపై సీబీఐ దర్యాప్తు అవసరం
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూ కొనుగోళ్ల వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్పై సీఐడీ విచారణ నిలిపేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం జస్టిస్ వినీత్శరణ్, జస్టిస్ దినేష్మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ధావన్ వాదనలు వినిపించారు. ‘కేసు హైకోర్టుకు పంపండి. దర్యాప్తు కొనసాగనీయండి. మేం చట్ట పరిధిలోనే ముందుకెళ్లాం. సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడూ దర్యాప్తును ఆపలేదు..’ అని ధావన్ పేర్కొన్నారు. దమ్మాలపాటి తరఫున సీనియర్ న్యాయవాది హరీష్సాల్వే వాదనలు వినిపిస్తూ.. పత్రాలు, ఎఫ్ఐఆర్ చదివితే అని చెబుతుండగా.. జస్టిస్ వినీత్శరణ్ జోక్యం చేసుకొని ఇరుపక్షాలు కోరితే వాటిని పరిశీలిస్తామని పేర్కొన్నారు. రాజీవ్ధావన్ హైకోర్టుకు పంపించాలని కోరుతున్నారు, మీ స్పందన ఏంటని ధర్మాసనం సాల్వేను ప్రశ్నించింది. ‘ఏడాది కాలంగా సుప్రీంకోర్టులో ఉంది.. పాలనాపరమైన కక్ష సాధింపే ఇది.. అక్కడికి ఇక్కడికి వెళ్లడానికి సిద్ధంగా లేము..’ అని సాల్వే చెప్పారు. హైకోర్టులో డీటైల్డ్గా విచారణ జరపవచ్చు ఈ సందర్భంగా జస్టిస్ శరణ్.. ఇరుపక్షాలు అంగీకరిస్తే సుప్రీంకోర్టే విచారణ చేపడుతుందని, దాన్నిబట్టి ముందుకెళ్తామని పేర్కొన్నారు. ధావన్ స్పందిస్తూ.. సాల్వే తన వ్యాఖ్యలు తనపైనే (పాలనపరమైన కక్ష సాధింపు) ప్రయోగించడం నచ్చిందన్నారు. సుప్రీంకోర్టులోనే విచారణ జరపాలని ఆదేశించేచోట తాను లేనని, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, హైకోర్టులో డీటైల్డ్గా విచారణ జరపొచ్చని చెప్పారు. ఒకవేళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆదేశాలివ్వాల్సివస్తే తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఆ ఆదేశాల్లో స్పష్టం చేయవచ్చన్నారు. ‘ఎస్సెల్పీ మేం దాఖలు చేశాం.. ఒకవేళ కేసు విచారణ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు చేపడితే అన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోవాలి. కానీ వారికి సుప్రీంకోర్టులో విచారణ జరగాలని లేదు’ అని ధావన్ పేర్కొన్నారు. ఒకవేళ ఎస్సెల్పీపైనే అయితే విచారణ చేపట్టాలని, ఎస్సెల్పీని కొట్టివేస్తే అప్పుడు హైకోర్టు విచారిస్తుందని సాల్వే పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసినరోజే న్యాయమూర్తి విచారించారని, ప్రభుత్వ వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదని ధావన్ చెప్పారు. న్యాయమూర్తులెవరనే దానిపై చర్చించదలచుకోలేదని, దర్యాప్తు కొనసాగనిస్తే అన్ని వాస్తవాలు బయటపడతాయని పేర్కొన్నారు. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నామని చెప్పారు. ఈ కేసులో ఓ న్యాయమూర్తి పర్యవేక్షణ ఉండాల్సిందేనన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం.. అప్లికేషన్ను విచారిస్తామని, కొంత విచారణ తమకూ అవసరమని పేర్కొంది. కేసు విచారణకు వచ్చే వారంలో ఓ తేదీని నిర్ణయిస్తామని తెలిపింది. దర్యాప్తు నిలిచిపోయిందని, హైకోర్టు కూడా విచారణ జరపడం లేదని ధావన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆగస్టులో విచారించాలని ధావన్ కోరారు. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేస్తూ జాబితాలో చివరిగా చేర్చాలని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. గతంలో ఈ పిటిషన్ను జస్టిస్ అశోక్భూషణ్, జస్టిస్ వినీత్శరణ్, జస్టిస్ ఎంఆర్షాలతో కూడిన ధర్మాసనం విచారించిన విషయం విదితమే. -
స్ట్రెయిట్ టాక్ విత్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి
-
ఆగస్టు 15 నుంచి క్లీన్ ఆంధ్రప్రదేశ్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద పీట వేస్తున్నారని, పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆగస్టు 15 నుంచి క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విజయనగరం మునిసిపల్ కార్యాలయంలో రూ.1.48 కోట్లతో నిర్మించిన రెండు, మూడు అంతస్తులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్లాప్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని నగర పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ద్వారా వాటి పరిధిలోని ప్రతి ఇంటికీ మూడేసి చొప్పున డస్ట్ బిన్లను పంపిణీ చేస్తామని వివరించారు. చెత్తను ఎప్పటికప్పుడు తరలించడానికి వీలుగా అదనంగా 5 వేల కొత్త వాహనాలను సమకూరుస్తామని చెప్పారు. కాగా, పట్టణాలు, నగరాల్లో కొత్త ఆస్తి పన్ను విధానంపై ప్రతిపక్షం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని బొత్స విమర్శించారు. అవినీతికి చెక్ పెట్టేందుకే కొత్త పన్ను విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అమరావతి దోషులను విడిచిపెట్టబోం అమరావతి భూ అక్రమాల్లో దోషులను విడిచిపెట్టేది లేదని మంత్రి బొత్స తేల్చిచెప్పారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ పెద్దలు మాట మార్చారన్నారు. కార్యక్రమంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పెనుమత్స సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ ఎం.హరిజవహర్లాల్, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అసైన్డ్ భూములు కొనుగోలు చేశారు’
సాక్షి, గుంటూరు: కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని ఆయన దగ్గర పనిచేసిన ప్రసాద్ తెలిపారు. బడాబాబులకు అసైన్డ్ భూములు కొనిపెట్టారని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ బినామీ కొల్లి శివరామకు కూడా భారీ స్థాయిలో భూములు కొని పెట్టారని తెలిపారు. దళిత రైతులు ఎదురు తిరుగుతారేమోనన్న భయంతో అసెన్డ్భూముల కొనుగోళ్ల వ్యవహారం మొత్తాన్ని వీడియో చేయించారన్నారు. 2015 జనవరి 1న భూ సమీకరణ మొదలు పెట్టగా, 2016 ఫిబ్రవరి వరకు అసైన్డ్ భూములను ల్యాండ్పూలింగ్కు తీసుకోలేదని వెల్లడించారు. ఈ ఏడాది కాలంలో అమరావతిలో అసెన్డ్భూములను పెద్దలు కొనేశారని చెప్పారు. టీడీపీ నేతలందరితోనూ కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డికి పరిచయాలున్నాయని, అలానే ఎవరెంత కొనుగోలు చేశారో చిట్టా అంతా బ్రహ్మానందరెడ్డి వద్ద ఉందన్నారు. అధికారులకు లంచాలు ఇచ్చి అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి యత్నించారని, మాకు తెలియకుండానే మా పేరుతో ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. ఇదే విషయాన్ని సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. -
పేదలు, దళితులను బెదిరించి భూసేకరణ
-
చంద్రబాబు రైతుల భూములు లాక్కున్నారు.. సాక్ష్యాలు ఇవిగో: ఎమ్మెల్యే ఆర్కే
-
దళితులను బెదిరించి భూములు లాక్కున్నారు: ఆర్కే
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో దళితులను బెదిరించి అసైన్డ్ భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని, ఈ వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కొందరు ఐఏఎస్ల పాత్ర ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వీడియో ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. దళితుల నుంచి అసైన్డ్ భూములను లాక్కున్నాకే గత సర్కారు ప్యాకేజీని ప్రకటించిందన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవీ... నిజాలు నిగ్గు తేల్చిన వీడియో.. దాదాపు 9 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో మంగళగిరికి చెందిన రియల్టర్ కొమ్మారెడ్డి (భూమిపుత్ర) బ్రహ్మానందరెడ్డి టీడీపీ పెద్దల ఆదేశాల మేరకు కొందరు రియల్టర్లను పిలిచి తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో దళితులు భూములు అమ్మకపోతే నష్టపోతారని ప్రచారం చేయించాడు. ఈ హెచ్చరికలతో ఆందోళనకు గురైన దళితులు భూములను తెగనమ్ముకున్నారు. డబ్బులు ముట్టినట్లు బాండ్ పేపర్ల మీద వారి సంతకాలు తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కట్టలు కట్టలు డబ్బులు తీసుకుని వెళ్లి ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది. రాజధాని ఎక్కడనేది ముందే తెలుసుకాబట్టి చంద్రబాబు ఈ పని చేయించారు. ఆయన బినామీలకు భూములు బదిలీ అయ్యాక ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సాంబశివరావు ఇందులో కీలక పాత్రధారి. రాజధాని గ్రామాల రెవెన్యూ రికార్డులన్నింటినీ దొంగతనంగా తరలించారు. అప్పటి గుంటూరు జిల్లా ఐఏఎస్ అధికారులు కోన శశిధర్, కాంతీలాల్ దండేల సహకారంతో ఈ భూములన్నింటినీ తమకు కావాల్సిన వారికి కట్టబెట్టారు. నాలుగైదు వేల ఎకరాల భూములను కొట్టేసి దళితుల నోట్లో మట్టికొట్టారు. ముందుగానే వారితో బాండు పేపర్ల మీద సంతకాలు తీసుకోవడం ఓ కుట్ర. ప్రభుత్వ భూములకు తప్పుడు రికార్డులు సృష్టించి అనుయాయులకు ప్యాకేజీ వచ్చేలా రూ.కోట్లు కొల్లగొట్టారు. రికార్డుల ట్యాంపరింగ్.. దళితులకు 1940 కన్నా ముందే ఇచ్చిన భూముల పట్టాలు వారి వద్దే ఉన్నాయి. ఆ రోజు నుంచీ వారు ఆ భూములను అనుభవిస్తున్నారు. బెదిరించి లాక్కున్న భూములన్నీ వారికి తిరిగి ఇప్పించాలి. మాజీ ఐఏఎస్ అధికారి సాంబశివరావు భూములకు హద్దులు లేకుండా చేశారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో కూర్చుని రికార్డులు మొత్తం ట్యాంపరింగ్ చేయించారు. దీంతో దళిత సోదరులు మోసానికి గురయ్యారు. చంద్రబాబు చెప్పిన తప్పుడు పనులను చేయలేదని అప్పట్లో ఐఏఎస్ అధికారి నాగులపల్లి శ్రీకాంత్ను తప్పించారు. క్యాట్లో కేసులు ఉన్న చెరుకూరి శ్రీధర్ను తీసుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలి. దోషులను శిక్షించాలి. దళితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కోరుతున్నా. -
అమరావతి భూ కుంభకోణం: కీలకసాక్షిగా చెరుకూరి శ్రీధర్
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో చెరుకూరి శ్రీధర్ కీలకసాక్షిగా మారుతున్నారు. కాగా ఆదివారం ఏపీ సీఐడీ అధికారులు శ్రీధర్ను విచారించగా రెవెన్యూ రికార్డుల మాయంపై వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. '' 2015లో ల్యాండ్ పూలింగ్కు ముందే 2014 అక్టోబర్లో తుళ్లూరు మండలం రెవెన్యూ రికార్డులను రహస్యంగా తెప్పించుకున్నారు. తిరిగి ఒరిజినల్స్ను తుళ్లూరు ఎమ్మార్వోకు ఇవ్వాల్సి ఉన్నా.. వాటిని గుంటూరు కలెక్టరేట్లోనే ఉంచారు. అనంతరం ఏపీ సీఆర్డీఏ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన గత ప్రభుత్వం రాజధాని నగర పరిధిని నిర్ణయించడం కోసం సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్.. గుంటూరు కలెక్టర్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహించారు. 2015 జనవరిలో ల్యాండ్ పూలింగ్ పథకం ప్రక్రియ పారంభమైంది. అసైన్డ్ భూముల సేకరణపై జీవో 41ని తీసుకొచ్చారు. మాజీమంత్రి నారాయణ పర్యవేక్షణలోనే ఇదంతా జరిగింది. ఏపీ అసైన్డ్ లాండ్ యాక్ట్ 1977కి విరుద్ధంగా ఉన్న అంశాలను.. మాజీ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లా. చట్ట వ్యతిరేకమని ముందే చెప్పినా నారాయణ వినిపించుకోలేదు. జీవో జారీకి ముందే కొన్ని ప్రతిపాదనలు.. చట్టానికి విరుద్ధంగా ఉన్నట్లు మంత్రి నారాయణకు తెలిపా.అధికారులు నిర్ణయాధికారులు కాదు.. మంత్రులు, ప్రభుత్వంలో ఉన్న ఇతర అధికారులు మాత్రమే.. నిర్ణయాలను అమలు చేస్తారని మంత్రి నారాయణ అన్నారు. ఆ ఆదేశాలతోనే భూముల వ్యవహారం జరిగింది.'' అని తెలిపారు. కాగా విచారణలో కీలక విషయాలు బయటపెట్టడంతో మాజీ మంత్రి నారాయణ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా కనిపిస్తుంది. హైకోర్టులో విచారణకు అనుమతి కోరుతూ సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. -
సీల్డ్ కవర్లో అందచేయండి
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అమరావతి భూ కుంభకోణంపై వ్యాఖ్యలు చేసినందుకు 2016లో గుంటూరు, అనంతపురం జిల్లాల్లో నమోదైన కేసులను మూసివేస్తూ మేజిస్ట్రేట్లు జారీ చేసిన ఉత్తర్వులను తప్పుబడుతూ మూసివేతపై సుమోటోగా విచారణ జరపాలన్న హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయానికి సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్లో తన ముందుంచాలని న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత శుక్రవారం రిజిస్ట్రీని ఆదేశించారు. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ తీసుకున్న నిర్ణయం వివరాలను పరిశీలించిన తరువాతే ఈ వ్యవహారంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. కేసుల మూసివేతపై సుమోటో విచారణ జరపాలని అడ్మినిస్ట్రేటివ్ కమిటీ వేటి ఆధారంగా నిర్ణయం తీసుకుందో వాటిని ఇప్పటి వరకు తమకు అందచేయలేదని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై జస్టిస్ లలిత స్పందిస్తూ ఒకవేళ ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేయాలని కోర్టు భావిస్తే అప్పుడు ఆ వివరాలను అందచేయడం జరుగుతుందని తేల్చి చెప్పారు. తదుపరి విచారణ ఎప్పుడు చేపట్టేది న్యాయమూర్తి స్పష్టతనివ్వలేదు. న్యాయ చరిత్రలో ఎన్నడూ లేదు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అమరావతి భూ కుంభకోణంపై వ్యాఖ్యలు చేసినందుకు 2016లో గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని వివిధ పోలీస్స్టేషన్లలో 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పోలీసులు విచారణ జరిపి ఆయా కోర్టుల్లో తుది నివేదికలు దాఖలు చేశారు. ఫిర్యాదుదారులు కూడా కేసులను మూసివేసేందుకు అభ్యంతరం లేదని తెలియచేయడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమోదైన 11 కేసులను మూసివేస్తూ ఆయా కోర్టుల మేజిస్ట్రేట్లు ఉత్తర్వులిచ్చారు. అయితే హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఈ మూసివేతను తప్పుపడుతూ సుమోటోగా విచారణ జరపాలని నిర్ణయం తీసుకుని, సుమోటో వ్యాజ్యాలను రోస్టర్ ప్రకారం సంబంధిత న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు రిజిస్ట్రీ సుమోటో రివిజన్ పిటిషన్లను జస్టిస్ లలిత ముందుంచారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ బుధవారం వాదనలు వినిపించి అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయం ఆధారంగా సుమోటో విచారణ సరికాదని, గతంలో న్యాయవ్యవస్థ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని కోర్టుకు నివేదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయాన్ని పరిశీలించిన తరువాతే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్ లలిత స్పష్టం చేశారు. కమిటీ నిర్ణయాలను తన ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. -
రాజధాని రైతుల వార్షిక కౌలు రూ.195 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి/తాడికొండ: రాజధాని భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు మొత్తం రూ.195 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కార్యదర్శి వై శ్రీలక్ష్మి బుధవారం ఉత్తర్వులిచ్చారు. 2020–21కి సంబంధించి రాజధాని రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు కోసం ఈ మొత్తాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం అమరావతిలో భూములిచ్చిన తమను చంద్రబాబు మోసం చేసినా ఇచ్చిన మాటకు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం అక్కున చేర్చుకుని 2021–22 ఏడాదికి రూ.195 కోట్లను విడుదల చేయడంపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి బుధవారం క్షీరాభిషేకం చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు తమ వద్ద 33 వేల ఎకరాలు తీసుకుని నిలువునా ముంచారని, ఇప్పుడు హైదరాబాద్లో చేరి 29 గ్రామాల్లో రైతు కుటుంబాలను రోడ్డున పడేశారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో బడా బాబులు, పారిశ్రామిక వేత్తలకు తమ భూములు దోచిపెట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తుళ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆలోకం సురేష్, భూములిచ్చిన రైతులు నాయుడు నాగేశ్వరరావు, తుమ్మూరు ప్రకాశ్రెడ్డి, సుంకర శ్రీను, గుంతల నాగేశ్వరరావు, గడ్డం జయరామ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు నిధులు విడుదల
-
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు నిధులు విడుదల
సాక్షి, అమరావతి : రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం కౌలు నిధులు విడుదల చేసింది. బుధవారం రూ.195 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
దమ్ముంటే చర్చకి రండి నందిగం సురేష్
-
'పక్కా ప్లాన్ ప్రకారమే భూముల్ని కొట్టేశారు'
సాక్షి, తాడేపల్లి : టీడీపీ నేతలు అసైన్డ్ భూములను పక్కా ప్లాన్ ప్రకారం కొట్టేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..చంద్రబాబు, ఆయన బినామీలు పేదల భూములను చౌకగా కొట్టేశారని, ల్యాండ్ పూలింగ్ నిబంధనలను మార్చి తమ వారికి లబ్ధి చేకూర్చారన్నారని మండిపడ్డారు. అన్యాయాన్ని కప్పి పుచ్చుకోవడానికి స్టింగ్ ఆపరేషన్ అంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ దళిత సోదరుడైతే చంద్రబాబు మోసం చేశాడని నా దగ్గరకు వచ్చాడో...అతన్ని టీడీపీ మీడియా భయపెట్టి అనుకూలంగా చెప్పించుకుంది. దాన్నో స్టింగ్ ఆపరేషన్ అని చెప్పుకుంటున్నారు . మేమంతా అప్పట్లోనే దళితులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాము. 1920లో బ్రిటిష్ ప్రభుత్వం వారికి డీకే పట్టాలు ఇచ్చారు. ఆ భూములను కూడా పక్కా ప్లాన్గా కొట్టేశారు. Pot, poa చట్టాలను అతిక్రమించి చంద్రబాబు ఏమి చేసాడో స్టింగ్ ఆపరేషన్లో తేల్చాల్సింది. ఇప్పుడు స్టే మీద ఉన్నాడు..మళ్లీ కేసు వచ్చేసరకి ఎదో చేయాలని ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు. అసైన్డ్ భూములు అమ్మకూడదు...కొనకూడదు..మరి ఎలా కొట్టేశారు. మీరు నిజంగా ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలని ఉంటే దళితులకు పెద్దపీట వేసి వారి భూములు వారికి ఉంచొచ్చు కదా. రాజధానిలో దళిత సోదరుడు ఉండకూడదని నీచంగా వ్యవహరించిన వ్యక్తులు చంద్రబాబు, నారాయణ బహిరంగ చర్చకు రండి. సైనికులకు ఇచ్చిన భూమి 10 ఎళ్ల తర్వాత సైనికుడి సొంతం అవుతుంది. దాన్ని కూడా చట్టాలని ఉల్లంఘించి మరీ కొట్టేశారు అని ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. 3 ఏళ్లలో సింగపూర్ తరహా అద్భుతమైన రాజధాని కడతాను అంటూ చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పాడని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. 'రాజధాని శంకుస్థాపనకు అగ్రవర్ణాలకు పట్టు వస్త్రాలు పెట్టి పిలిచారు. అదే దళిత ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పెరు కూడా శిలాపలకంపై లేదు. ఇప్పుడు కూడా దళితులను బెదిరిస్తూనే ఉన్నారు ఇవాళ రాజధాని రైతుల దుస్థితికి కారణం ఎవరు..? చంద్రబాబు కాదా..? మూడేళ్ళలో రాజధాని అని దండుకుని పక్కకెళ్లాడు.ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుని తండ్రి కొడుకులు ఇటువైపు ముఖం చూపడం లేదు. అన్నీ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి...దమ్ముంటే చర్చకి రండి..లేదంటే కేసును ధైర్యంగా ఎదుర్కోవాలి' అని నందిగం సురేష్ డిమాండ్ చేశారు. చదవండి : బెదిరించి అసైన్డ్ భూములను లాక్కున్నారు.. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీతో జనసేన కటిఫ్? -
టీడీపీ నేతలు అసైన్డ్ భూములను పక్కా ప్లాన్ ప్రకారం కొట్టేశారు
-
‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది..’
సాక్షి, తాడేపల్లి: అమరావతిలో టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని.. దళితులను బెదిరించి అసైన్డ్ భూములను లాక్కున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు, ఆయన బినామీలు పేదల భూములను చౌకగా కొట్టేశారని ధ్వజమెత్తారు.ల్యాండ్ పూలింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్గా అన్నారు. ‘‘భూములు కొన్న తర్వాత ల్యాండ్ పూలింగ్ నిబంధనలను మార్చి తమ వారికి లబ్ధి చేకూర్చారన్నారు. దానికి సంబంధించినదే 41 జీవో. దీనిలో చంద్రబాబు, నారాయణ పాత్ర కూడా ఉంది. దీనికి సంబంధించి సీఐడీ విచారణ చేస్తున్నారు. చంద్రబాబు తనకున్న అలవాటు ప్రకారం స్టే తెచ్చుకున్నారు. ఆయనకు రాజధాని మీద ప్రేమ లేదు.. వేల ఎకరాలు దోచుకునేందుకే ఇదంతా చేశారు. అక్కడి భూములు దోచుకునేందుకు ఆయన, ఆయన తాబేదార్లు వేసిన ప్లాన్ అమరావతి. స్టే వచ్చింది.. మా బాబు నిర్దోషి అని జబ్బలు చరుచుకుంటున్నారు. ఇప్పుడు కేసులు పెట్టడమే తప్పన్నట్లు, ఎవరినో బెదిరించి కేసు పెట్టినట్లు మాపై ఆరోపణలు చేస్తున్నారు. పేదలపై జరిగిన దాడిని కప్పిపుచ్చుకునేందుకు స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. జీవో 41 ద్వారా వాళ్ళ వారు లబ్ధి పొందారని మేము ప్రజలకు వివరించదలిచాం. చంద్రబాబు ఆలోచన మంచిదే అయితే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ లో అసైన్డ్ ల్యాండ్ గురించి ఎందుకు పెట్టలేదు..?. దళితుల నుంచి ఆయన అనుచరులు, బినామీలు కొన్నాక 2016లో యాక్ట్ ఎందుకు మార్చారని’’ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చదవండి: ‘త్వరలోనే చంద్రబాబు మరో బాగోతం..’ -
‘త్వరలోనే చంద్రబాబు మరో బాగోతం..’
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దళిత ద్రోహి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు.. దళితులను బెదిరించి అసైన్డ్ భూములను లాక్కున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దళితులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారన్నారు. 300 ఎకరాల దళితుల భూములను కాజేయడానికి ప్లాన్ చేశారని.. చంద్రబాబు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేస్తారంటూ ఆయన దుయ్యబట్టారు. దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే.. కోర్టుకెళ్లి అడ్డుకున్నారని.. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు అని మేరుగ నాగార్జున విమర్శించారు. రాజధాని ప్రాంతంలో 54 వేల మంది దళితులకు ఇళ్లపట్టాలు ఇస్తామంటే.. కోర్టుకు వెళతారా..? అని ప్రశ్నించారు. త్వరలోనే చంద్రబాబు మరో బాగోతం బయటకు రానుందన్నారు. అన్నీ ఆధారాలతో ఆయన దొంగ చేష్టలు బయటకు రానున్నాయని పేర్కొన్నారు. దళిత పక్షపాతిగా ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటని మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. చదవండి: ఏపీ చరిత్రలోనే ఇదో రికార్డు: ఎంపీ విజయసాయిరెడ్డి ‘అక్కడ జరిగింది.. నూటికి నూరు శాతం అక్రమాలే’ -
‘అక్కడ జరిగింది.. నూటికి నూరు శాతం అక్రమాలే’
సాక్షి, అమరావతి/హైదరాబాద్: అమరావతి భూముల విషయంలో నూటికి నూరు శాతం అక్రమాలేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మేడ్చల్లో మీడియాతో మాట్లాడుతూ, సీఐడీ విచారణలో బాధితులు అసలు నిజాలు వెల్లడించారని పేర్కొన్నారు. బాధితుల వాంగ్మూలాలను సీఐడీ అధికారులు రికార్డ్ చేశారని తెలిపారు. భూముల కేటాయింపులో అక్రమాల కేసుపై కోర్టు నాలుగు వారాల వరకు మాత్రమే స్టే ఇచ్చింది. ఫిర్యాదుదారులు, దళితులను టీడీపీ నేతలు భయపెడుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. చట్టాలను అతిక్రమించి చంద్రబాబు, నారాయణ.. భూములతో లబ్ధి పొందారని. అప్పటి ఐఏఎస్ అధికారులపై ఒత్తిడి తేవడమే కాకుండా మాట వినని వారిని బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. భూ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రోజుకో ప్రెస్ మీట్ పెట్టి.. టీడీపీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అక్రమాలపై తన పోరాటం ఆగదని.. ఎందాకైనా పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే కోర్టుకు అన్నీ వివరాలు అందజేస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. చదవండి: అక్రమాల పుట్ట ‘అమరావతి’ ‘అసైన్డ్’పై గత సర్కారు తప్పు చేసినా ఎందుకు సహకరించారు? -
‘అసైన్డ్’ స్కామ్లో సీఐడీకి కీలక ఆధారాలు!
సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణంపై విచారణ నిర్వహిస్తున్న సీఐడీ దర్యాప్తు అధికారులు తాజాగా కీలక వివరాలు రాబట్టినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేసిన సీఐడీ అధికారులు ఫిర్యాదుదారైన ఆర్కే, అప్పటి గుంటూరుæ జాయింట్ కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్ను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. అసైన్డ్ భూముల కుంభకోణంలో గత ప్రభుత్వ పెద్దలతోపాటు టీడీపీ నేతలు, వారి బినామీలు ఉన్నట్లు సీఐడీ ప్రాథమికంగా ఆధారాలు సేకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న నేపథ్యంలో దీన్ని ఎత్తివేసేలా ప్రాథమిక ఆధారాలతో కౌంటర్ దాఖలు చేయడంపై సీఐడీ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు సేకరించిన పలు ఆధారాలను కూడా న్యాయస్థానానికి నివేదించనుంది. హైకోర్టు స్టే ఉత్తర్వులను పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు రెండు రోజులుగా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ కేసులో క్షుణ్నంగా దర్యాప్తు జరిపేందుకు అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
బాబు ‘రాజధాని’లో దగాపడ్డ దళితులు
అమరావతి రాజధాని పేరుతో పెద్ద భూబాగోతానికి తెరలేచింది. రాజధాని వస్తున్నదంటే భూముల ధరలు పెరుగుతాయని ఆశించినవాళ్లు ఎందరో ఉండొచ్చు. కానీ వాళ్లకు ఎవరికీ లాభం కలిగే అవకాశం లేకుండా, తర్వాత అమ్మడంలో ఇబ్బందులు అవుతాయని సందేహాలు రేపో, భయపెట్టో తెలుగుదేశం వర్గీయులు ఆ భూముల్ని అయినకాడికి కొనుగోలు చేశారు. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను సైతం వాళ్లు వదలలేదు. అట్లా అమ్మకానికి వీలు లేదని చట్టాలు చెబుతున్నా, అధికారంలో ఉన్న టీడీపీ అలాంటివారికి చుట్టంగా మారి తదనుగుణమైన జీవోలు జారీచేసింది. ఇక ఇవి కూడా నిరూపణ జరగకపోతే అర్థం అది వ్యవస్థల వైఫల్యమా, స్కాములు చేసినవారి నేర్పరితనమా? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గ్రామాలలో అసైన్డ్ భూముల కుంభకోణం జరిగిందన్నది పచ్చి నిజం. గత ప్రభుత్వ హయాంలో దళితులనుంచి అసైన్డ్ భూములను వారికి కొంత ధర చెల్లించో, భయపెట్టో, లేక రకరకాల సందేహాలు రేపి దళితేతరులు స్వాధీనం చేసుకున్నారన్నది నిఖార్సైన వాస్తవం. 2015 జనవరి ఒకటి నుంచి రాజధాని నిర్మాణం పేరుతో భూసమీకరణ ప్రారంభించారు. అప్పుడు పట్టా భూములకే పరిమితం అయ్యారు. 2016 ఫిబ్రవరిలో అసైన్డ్ భూములను కూడా తీసుకుంటామని జీఓ 41 తెచ్చారు. ఈ మధ్యకాలంలోనే పలువురు టీడీపీ నేతలు, ఇతర వ్యక్తులు ఈ భూములను 95 శాతం వరకు కొనుగోలు చేశారు. వారికి ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నది అభియోగం. అయితే తెలుగుదేశం మీడియా అసలు కుంభకోణమే జరగలేదన్నట్లుగా ప్రచారం చేస్తోంది. కొందరు దళితులు సీఐడీ అధికారుల వద్దకు వెళ్లి తాము స్వచ్ఛందంగానే విక్రయించామని, ఎవరూ తమను బెదిరించలేదని చెప్పారని కథనాలను వండి వార్చుతోంది. వాస్తవానికి 1977లో వచ్చిన చట్టం ప్రకారం గానీ, 1989 నాటి అత్యాచార నిరోధక చట్టం ప్రకారం గానీ అసైన్డ్ భూములను ఎవరూ కొనరాదు. ఒకవేళ ప్రభుత్వం తీసుకోదలిస్తే వారికి నిర్దిష్ట పరిహారం చెల్లించి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? దళితుల నుంచి కొందరు దళారులు భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఆ తర్వాత వారు అధిక ధరలకు విక్రయించుకుని లాభపడ్డారు. ఇలా కొన్నవారిలో పలువురు టీడీపీ నేతలు, అధికారులు, కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారని చెబుతారు. అసలు ఇలా వెసులుబాటు కలగడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? దళితుల నుంచి భూములు కొనుగోలు చేసినవారికి కూడా ల్యాండ్ పూలింగులో అవకాశం ఇచ్చి, వారు స్వాధీనపరచినట్లు చూపించగానే వాణిజ్య, నివాస ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇలా చేయడానికి వీలుగా సంబంధిత జీఓలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ జారీ చేశారన్నది మరో ఆరోపణ. ఇందులో వాస్తవం లేదా? కానీ గౌరవ హైకోర్టువారు రాజధాని ప్రాధికార సంస్థ చట్టంలోని ఒక సెక్షన్ ప్రకారం ఈ చట్టం కింద చేపట్టిన చర్యల విషయంలో అధికారుల మీదగానీ, అథారిటీల మీదగానీ ఎలాంటి ప్రాసిక్యూషన్ చేయరాదని ఉంది కనుక చంద్రబాబుకూ, నారాయణకూ సీఐడీ పెట్టిన కేసులో నాలుగువారాల స్టే ఇచ్చారు. దీని ప్రకారం సీఐడీకి ఈ కేసు విచారణార్హత ఉందా అన్నది తేలాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. కొన్ని కేసులలో చట్టాలకు చట్టాలనే కొట్టివేసిన న్యాయస్థానం, ఈ విషయంలో చట్టంలో ఉన్న ఫలానా క్లాజ్ను అనుసరించి అసలు కేసు పెట్టవచ్చా అన్న మీమాంసకు తెరతీసింది. కోర్టులు ఎలాంటి నిర్ణయాలు చేస్తాయన్నది పక్కనబెడితే దళితులకు ఎప్పుడో ఇచ్చిన భూములకు ప్రభుత్వం నేరుగా పరిహారం ఇచ్చినా, లేక వారు సమీకరణకు భూమి ఇస్తే వారికే తదనుగుణంగా ప్లాట్లను కేటాయించినా అసలు సమస్యే లేదు. అలాకాకుండా దళితులనుంచి భూములు కొని ఇతరులకు అమ్మినవారికి క్రమబద్ధం చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అప్పట్లోనే జాతీయ ఎస్సీ కమిషన్ ఈ ప్రాంతంలో పర్యటించి జీవో 41 ని రద్దు చేయాలని సిఫారసు చేసినా, ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కొందరు దళితులు స్వచ్ఛందంగానే భూములు అమ్మి ఉండవచ్చు. కానీ అలా అమ్ముకోవడానికి చట్టం అనుమతిస్తుందా? ఆ తర్వాత అది మరికొన్ని చేతులు మారి లక్షలు, కోట్ల ఆర్జనకు ప్రభుత్వమే ద్వారాలు తెరవొచ్చా? వీటిని న్యాయ వ్యవస్థ ఆలోచించాల్సి ఉండగా, అసలు చట్టంలో కేసులే పెట్టకూడదని ఉంది కనుక దాని గురించి విచారించాలని భావించింది. నిజానికి ఏ కేసులో అయినా సీఐడీ లేదా ఏ దర్యాప్తు సంస్థ అయినా విచారణ చేస్తుంటే దానిని కొనసాగించకుండా న్యాయ వ్యవస్థ నిర్ణయాలు చేయరాదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎఫ్ఐఆర్లు క్వాష్ చేయరాదని కూడా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకవేళ ఏవైనా అనుమానాలు వస్తే సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయకుండా విచారణ చేసుకోవచ్చని చెబితే కొంత పద్ధతిగా ఉంటుంది. అలాకాకుండా విచారణ నిలుపుదల చేయడం చర్చనీ యాంశం అవుతోంది. ఇలా నిర్ణయాలు జరగడం సాంకేతిక కారణాల వల్లే కావచ్చు. కానీ అది న్యాయవ్యవస్థపై విమర్శలకు ఆస్కారం ఇస్తోంది. దీనికి సంబంధించిన జీవోపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవల్సి ఉండగా, చంద్రబాబు, ఆనాటి మున్సిపల్ మంత్రి నారాయణ ఈ జీవో ఇచ్చేశారట. జరగని ఒక అధికారిక సమావేశాన్ని జరిపినట్లు చూపించి, జీవో ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకోవడం మరో ప్రత్యేకతగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. అసలు భూముల వ్యవహారాలన్నీ రెవెన్యూ శాఖ చూడవలసి ఉండగా, సంబంధిత మంత్రి కేఈ కృష్ణమూర్తికి ఎలాంటి సంబంధం లేకుండా, మున్సిపల్ శాఖే నిర్ణయాలు చేయడం ఆశ్చర్యం. ఈ క్రమంలోనే ఇన్సైడర్ ట్రేడింగ్ అంశం తెరపైకి వచ్చింది. తమకు కావల్సిన వారికి ముందుగా సమాచారం ఇచ్చి భూములు కొనుగోలు చేయడం అందులో ముఖ్యమైన అంశం. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ సరిగ్గా రాజధానిని అనుకుని 14 ఎకరాల భూమి కొనుగోలు చేయగలిగిందని వార్తలు వచ్చాయి. అంటే వీరు పూలింగ్కు కూడా ఇవ్వనవసరం లేదన్నమాట. అప్పట్లో దళిత భూములకు సంబంధించి సీపీఎం, ఇతర పార్టీలు ఆందోళన చేయకపోలేదు. ఇప్పుడు ఆ రాజకీయ పక్షాలు ఎందువల్లో చొరవ తీసుకుని ఈ కేసులకు సహకరిస్తున్నట్లు కనిపించదు. తాను ఒక మధ్యవర్తి నుంచి ఎకరం భూమి కొనుగోలు చేశాననీ, అది అసైన్డ్ భూమి అని తెలిసే కొన్నాననీ ఒక ప్రముఖుడు చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తుండటంతో తాను ఆ భూమిని వెనక్కి ఇవ్వడానికి సిద్ధపడుతున్నానని అన్నారు. ప్రభుత్వం భూములు లాక్కుంటుందని చెప్పి తక్కువ ధరకు తీసుకున్న మాట వాస్తవమేననీ అన్నారు. తాము నేరుగా ఈ భూమి కొనలేదనీ, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నవారి సన్నిహితుడి నుంచి కొన్నాననీ వివరించారు. దళితుడి నుంచి మధ్యదళారీ పది లక్షలకు కొని, తమకు నలభై లక్షలకు అమ్మారని, తద్వారా కాలు అడ్డం పెట్టినందుకు అతనికి 30 లక్షలు మిగిలిందని ఆయన వివరించారు. ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో భూమిని తిరిగి ఇచ్చేయవలసి వస్తే తమ డబ్బు తమకు ఇవ్వాలని అడుగుతున్నామని చెప్పారు. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినా టీడీపీ మీడియా అసలు కుంభకోణమే జరగలేదన్న పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎలా కేసు పెడతారని ఒక వాదన తేవడం, అసలు దళితులకు నష్టం జరగలేదని మరో ప్రచారం చేయడం... ఇలాంటి వన్నీ గత పాలకులు గానీ, వారికి మద్దతు ఇచ్చే మీడియా గానీ ఆత్మరక్షణలో పడ్డాయని చెప్పకనే చెబుతాయి. అదే సమయంలో హైకోర్టులో ప్రభుత్వం తరపున మరింత సమర్థంగా వాదన వినిపించాలన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. స్కామ్ను కనిపెట్టడం ఒక ఎత్తు అయితే, దానిని నిరూపించడం మరో ఎత్తు. రాజధానిలో దళిత అసైన్డ్ భూములతో సహా వేల ఎకరాలకు సంబంధించి అనేక స్కాములు జరిగాయని అందరికీ తెలుసు. కానీ అవి తేలకపోవడమే ఆశ్చర్యం కలిగించే అంశం. దీనికి కారణం ప్రభుత్వ వైఫల్యమా? స్కాములు చేసినవారి నేర్పరితనమా? ఆయా వ్యవస్థలు వాస్తవాలను గుర్తించలేకపోవడమా? కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
అసైన్డ్ ల్యాండ్ స్కాం: భయపెట్టి పొలం లాక్కున్నారు..
సాక్షి, గుంటూరు: టీడీపీ హయాంలో జరిగిన అమరావతి భూ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అమరావతిలో జరిగిన అసైన్డ్ భూముల స్కామ్ తాజాగా సీఐడీ దర్యాప్తులో బట్టబయలవడం, ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి భూముల కేటాయింపుల వరకు చోటు చేసుకున్న అక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణంలో బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత రైతు ప్రకాశం మీడియాతో మాట్లాడుతూ ‘‘నాకు కృష్ణాయపాలెంలో ఎకరా 20 సెంట్ల అసైన్డ్ భూమి ఉంది. గత 40 ఏళ్ల నుంచి భూమిని సాగు చేస్తున్నా. రాజధాని ప్రకటించగానే దళితులు సాగు చేస్తున్న అసైన్డ్ భూమిని.. రాజధాని కోసం ప్రభుత్వం తీసుకుంటుందని ప్రచారం చేశారు. అప్పటి మంత్రులు నారాయణ, పుల్లారావు, ఎంపీ జయదేవ్ ఈ ప్రచారం చేయించారు. భయపెట్టి, మానసికంగా హింసించి తక్కువ రేటుకు పొలం లాక్కున్నారని’’ ఆయన వాపోయారు. పొలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తీసుకున్నారని.. తమ చేతే భూమిని ల్యాండ్ పూలింగ్కు ఇప్పించారని.. ల్యాండ్ పూలింగ్కు ఇచ్చిన భూమి రిటర్న్ ప్లాట్లు ఇస్తారని చెప్పారని.. ప్లాట్లు ఇచ్చే సమయంలో కొనుగోలుదారులు తమ పేరుపై రిజిస్ట్రేషన్కు ప్రయత్నించారన్నారు. అసైన్డ్ భూమి విషయంలో తమకు తీవ్రమైన అన్యాయం చేశారని, మమ్మల్ని మోసం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని రైతు ప్రకాశం డిమాండ్ చేశారు. చదవండి: అక్రమాల పుట్ట ‘అమరావతి’ చంద్రబాబుకు శిక్ష తప్పదు.. -
చంద్రబాబుకు సీఐడీ నోటీసు
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం విషయంలో ఏపీ సీఐడీ అధికారులు మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి నోటీసు జారీచేశారు. గత సర్కారు హయాంలో పక్కా పథకం ప్రకారం సాగిన అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్లు సీఐడీ ప్రాథమికంగా నిగ్గు తేల్చింది. దీంతో ఈ స్కామ్లో ప్రమేయమున్న చంద్రబాబుతో పాటు అప్పటి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, స్కామ్కు సహకరించిన అధికారులపై కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా కేసు దర్యాప్తు అధికారి సీఐడీ విజయవాడ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణరావు నేతృత్వంలోని ప్రత్యేక బృందం మంగళవారం ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65.. డోర్ నెంబర్ 8–2–293/82/ఎ/1310లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 41ఎ(3), (4) కింద నోటీసు అందజేసింది. ఈనెల 23 ఉ.11 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఏ–1గా విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. అలాగే, మాజీమంత్రి నారాయణకు సీఆర్పీసీ సెక్షన్–41, అప్పటి గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండేకు సీఆర్పీసీ–160 కింద నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదుతో కేసు నమోదు ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల వ్యవహారంలో గత ప్రభుత్వం పథకం ప్రకారం అక్రమాలకు పాల్పడిందని, ఈ భూ స్కామ్పై విచారణ చేయాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత నెల 24న ఏపీ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏపీ సీఐడీ అడిషినల్ డీజీ పీవీ సునీల్కుమార్ ఆదేశాలతో దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు అసైన్డ్ భూ కుంభకోణం నిజమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ స్కామ్లో ప్రమేయమున్న చంద్రబాబు, నారాయణ, వారికి సహకరించిన మరికొందరు అధికారులపైన ఈ నెల 12న కేసు (ఎఫ్ఐఆర్ 5/2021) నమోదు చేశారు. పథకం ప్రకారం కుట్ర చేసినందుకు వీరిపై ఐపీసీ సెక్షన్ 120బి రెడ్విత్ 34, 35, 36, 37.. ఇతరులకు నష్టం కలిగించేలా బాధ్యత కలిగిన ప్రతినిధులు చట్టాన్ని ఉల్లఘించినందుకు సెక్షన్–166, పథకం ప్రకారం తప్పుడు పత్రాలు సృష్టించడంపై 167, బాధ్యతయుతమైన స్థానంలో ఉన్న వారు చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు సెక్షన్ 217తోపాటు ఎస్సీ, ఎస్టీలను భయపెట్టి తక్కువ ధరకు కొనుగోలుచేసి వారిని నష్టపరిచినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి యాక్డ్–1989, అసైన్డ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినందుకు ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్–1977 సెక్షన్–7 ప్రకారం కేసులు నమోదు చేశారు. చంద్రబాబుకు సీఐడీ అధికారులు జారీ చేసిన నోటీసులు దర్యాప్తునకు సహకరించండి.. చంద్రబాబుకు జారీచేసిన నోటీసులో సీఐడీ పలు ఆంక్షలను విధించింది. అవి.. ► అమరావతి పేరుతో సాగిన అసైన్డ్ భూముల స్కామ్ కేసులో సీఐడీ విచారణకు, దర్యాప్తు సక్రమంగా సాగేందుకు పూర్తిగా సహకరించాలి. ► అప్పట్లో జరిగిన వాస్తవాలను విచారణ సమయంలో వెల్లడించాలి. ► దర్యాప్తు ప్రక్రియను ప్రభావితం చేసేలా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కానీ జోక్యం చేసుకోకూడదు. ► ఈ కేసులో సాకు‡్ష్యలను బెదిరించడం, ప్రభావితం చేయడం చేయరాదు. ► సాక్ష్యాలను దెబ్బతీసేందుకు ఎటువంటి తెరవెనుక ప్రయత్నాలకూ పాల్పడకూడదు. ► ఈ కేసులో సీఐడీ విచారణకు, న్యాయస్థానానికి ఎప్పుడు హాజరుకావాలన్నా సిద్ధంగా ఉండి సహకరించాలి. ► ఈ కేసు దర్యాప్తు అధికారి విధించే షరతులను విధిగా పాటించాలి. ► షరతులు ఉల్లంఘిస్తే అరెస్టు చేయడానికి కూడా అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. సీఐడీ ప్రాథమిక నివేదిక సిద్ధం అమరావతి రాజధాని మాటున జరిగిన భూముల సమీకరణలో సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారం పథకం ప్రకారం జరిగిన కుట్రేనని సీఐడీ ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను సిద్ధంచేసింది. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఇక్కడి అసైన్డ్ భూములను భూసమీకరణలో చేర్చడానికి జీఓ ఇచ్చారని సీఐడీ ప్రధాన అభియోగం మోపింది. రాజధాని ప్రకటనకు ముందే ప్రభుత్వ పెద్దలు పథకం ప్రకారం ఇచ్చిన లీకులతో అధికార పార్టీ నేతలు కొందరు అమరావతి ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను లాగేసుకున్నారు. వీటికి ఎలాంటి ప్లాట్లు రావని చెప్పడంతో దళితులు తమ భూములను కారుచౌకగా అమ్ముకునేలా చేశారు. లొంగని వారిపై బెదిరింపులకు దిగారు. దీంతో వారు దారుణంగా మోసపోయారు. మరోవైపు. ఈ భూముల రిజిస్ట్రేషన్ల కోసం సబ్ రిజిస్ట్రార్లపై అప్పటి అధికార పార్టీ నేతలు విపరీతమై ఒత్తిళ్లు చేసి పనులు చక్కబెట్టుకున్నారు. ఆ తర్వాత ఈ భూములను భూ సమీకరణలో తీసుకోవడానికి, తీసుకున్న వాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి ప్రభుత్వ పెద్దలతో జీఓలు జారీచేయించారు. అనంతరం వన్టైమ్ సెటిల్మెంట్ కింద వాటి క్రమబద్ధీకరణకు అనుమతించారు. ఈ క్రమంలో కొందరు అధికారుల అభ్యంతరాలను, సూచనలను అప్పట్లో ఏపీ సీఆర్డీఏ చైర్మన్గా ఉన్న చంద్రబాబు బేఖాతరు చేశారు. ఒకే సామాజికవర్గం వారికే లబ్ధి ఇదిలా ఉంటే... అమరావతిలో అసైన్డ్ భూములను కొనుగోలు చేసి, వాటిని ల్యాండ్ పూలింగ్కు ఇచ్చి ప్లాట్లు పొందిన వారిలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా లబ్ధి పొందినట్లు సీఐడీ ప్రాథమిక విచారణలో తేలింది. ఇందులో గత ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నట్లు స్పష్టమైంది. ఉదా.. ► చంద్రబాబు తనయుడు, మాజీమంత్రి లోకేశ్ సన్నిహితుడు కొల్లి శివరామ్ 47.39 ఎకరాలను ఈ విధంగానే కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. ► లోకేశ్ మరో సన్నిహితుడు గుమ్మడి సురేష్ 42.925 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ను చేజిక్కించుకున్నారు. ► లోకేశ్ వద్ద ఉండే మరో వ్యక్తి బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరాలను కారుచౌకగా స్వాధీనం చేసుకున్నారు. -
అమరావతి భూ కుంభకోణంపై సమగ్ర నివేదిక
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి భూ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగానే మంగళవారం నాడు సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు అందజేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డ ప్రముఖుల జాబితాను నివేదిక వెల్లడించింది. రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కోనుగోళ్లు చేసినట్లు మంత్రివర్గం తేల్చింది. క్యాపిటల్ సిటీ, రీజియన్లో భూముల కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేపట్టినట్టు నివేదికలో పేర్కొంది. టీడీపీ నేతలు, బినామీలకు మేలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం రాజధాని సరిహద్దులపై నిర్ణయం తీసుకుందని నివేదిక తెలిపింది. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారించారు. భూ కేటాయింపుల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్కు పక్కా ఆధారాలు సేకరించిన మంత్రివర్గ ఉపసంఘం.. అమరావతి భూముల వ్యవహారంలో ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించినట్లు మంత్రివర్గ ఉపసంఘం చెబుతోంది. బినామీలు, నేతల భూములకు మేలు చేసేలా రాజధాని ఏర్పాటు చేశారని ఆరోపించింది. టీడీపీ నేతలు.. తెల్ల రేషన్ కార్డు దారులను బినామీలుగా వాడినట్లు మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరిపినట్లు తేల్చింది. 4 వేల 70 ఎకరాల భూములను ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొనుగోళ్లు చేసినట్లు గుర్తించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్లో టీడీపీ నేతలు, ప్రముఖులు ఉన్నట్లు తేల్చారు. అంతేకాదు.. నివేదికలో పేర్లను సైతం మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. ఇన్ సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డ ప్రముఖుల జాబితా… అమరావతి భూముల వ్యవహారంలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన ప్రముఖుల పేర్లతో కూడిన జాబితాను మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. మంత్రివర్గ ఉపసంఘం పేర్కొన్న పేర్లు ఇవే. 1. నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీ ఎం 2. వేమూరు రవికుమార్ ప్రసాద్, నారా లోకేష్ సన్నిహితుడు 3.పరిటాల సునీత, మాజీ మంత్రి 4. జీవి ఎస్ ఆంజనేయులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే 5.లింగమనేని రమేష్, చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని 6. పయ్యావుల కేశవ్, టీడీపీ ఎమ్మెల్యే 7. లంకా దినకర్, 8. దూళిపాళ్ల నరేంద్ర, 9. కంభంపాటి రామ్మోహన్ రావు, 10. పుట్టా మహేష్ యాదవ్ పేర్లను మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణల బినామీ దందా గురించి.. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బినామీ భూముల వ్యవహారాన్ని మంత్రివర్గ ఉపసంఘం బయటపెట్టింది. వేమూరి రవి కుమార్ కుటుంబం పేరుతో లోకేష్ భూముల కొనుగోళ్లు చేసినట్లు పేర్కొంది. మొత్తం 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు నివేదికలో పేర్కొంది. ఇక లింగమనేని రమేష్.. తన భార్యా, బంధువుల పేర్లతో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. మాజీ మంత్రి నారాయణ బినామీ దందాను కూడా ఈ నివేదిక బయటపెట్టింది. నారాయణ తన సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణ కుమార్ పేర్లతో 55. 27 ఎకరాలు భూములు కొనుగోలు చేసినట్లు నివేదిక పేర్కొంది. ఇక మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్.. బినామీ పేర్లతో 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అలాగే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరుతో 37.84 ఎకరాల భూములు కొన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు.. మైత్రీ ఇన్ ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోళ్లు చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. ఇంకా భూముల వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారి పేర్లు, రికార్డులు, ఆధారాలతో నివేదిక సమర్పించింది. టీడీపీ నేతల కోసం సీఆర్డీఏ పరిధి మార్పు టీడీపీ నేతలకు ప్రయోజనం చేకూర్చడం కోసమే సీఆర్డీయే పరిధిని నాటి చంద్రబాబు ప్రభుత్వం మార్చినట్లుగా మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. నేతల భూముల కోసం చంద్రబాబు ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసిందని మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. సీఆర్డీయే పరిధిలో 524.545 ఎకరాల భూముల కోసం సరిహద్దులు మార్పేశారు. బాలక్రిష్ణ వియ్యంకుడి సంస్థ వీబీసీ కెమికల్స్ కు భూముల కేటాయించారు. జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 498 ఎకరాల కేటాయించారు. భూములు కేటాయించాక సిఆర్డీయే పరిధి మారుస్తూ జీవో జారీ చేశారు. అలానే సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో కోడెల శివప్రసాద్కు భూములుకేటాయించాక పరిధి మారుస్తూ 207 జీవో విడుదల చేశారని నివేదిక తెలిపింది. మొవ్వ మండలం పెదముట్టేవి, చినముట్టేవిలో లింగమనేని భూముల కోసం.. కొనకంచిలో యలమంచిలి శివలింగ ప్రసాద్ భూముల కోసం సీఆర్డీఏ సరిహద్దుల్లో మార్పులు చేసినట్లు నివేదిక వెల్లడించింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపుల్లోనూ అక్రమాలు జరిగినట్లు నివేదిక తెలిపింది. 5 ప్రైవేట్ సంస్థలకు 850 ఎకరాల భూ కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఒక రేటు, ప్రైవేట్ సంస్థల మరొక రేటుకు భూముల అమ్మకాలు జరిపినట్లు తెలిపింది. సింగపూర్తో ఒప్పందంలోనూ అక్రమాలు గుర్తించిన మంత్రి వర్గ ఉపసంఘం పేర్లు, రికార్డులు, ఆధారాలతో సహా నివేదిక వెల్లడించింది. చదవండి: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు ఏం చంద్రబాబు ఇప్పుడేమంటారు..? -
చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి దీనికి సంబంధించిన నోటీసులను అందజేశారు. 41 కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రాసెస్ (సీఆర్పీసీ) కింద నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణకు కూడా సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో ఇప్పటికే ఐపీసీ సెక్షన్లు 120 బీ, 166, 167, 217, ప్రొహిబిషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ అలినేషన్ యాక్ట్ 1977, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయి. సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపుకు సంబంధించి చంద్రబాబుపై అధికారులు కేసు నమోదు చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండానే ఈ భూములను ల్యాండ్పూలింగ్లో చేర్చడానికి జీవో ఇచ్చారని ప్రధాన అభియోగం మోపారు సీఐడీ అధికారులు. వాస్తవంగా దళితులకు కేటాయించిన ఈ భూములను రాజధాని ప్రకటనకు ముందు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ అసైన్డ్ భూముల కొనుగోళ్లను వన్టైమ్ సెటిల్మెంట్లో క్రమబద్దీకరణ చేయడానికి అనుమతించారు. ఈ క్రమంలో అధికారుల అభ్యంతరాలను, సూచనలను పట్టించుకోకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. రాజధాని అసైన్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు అన్నీ ఇన్నీకావు. దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయారు, అన్యాయం అయిపోయారు. అధికారపార్టీనేతల లాఘవానికి వీళ్లు బలైపోయారు. ఒక పథకం ప్రకారం చవకగా తమ భూములను అమ్ముకునేలా చేశారు. రాజధాని ప్రాంతంలో అసైన్ఢ్ భూములకు ఎలాంటి ప్లాట్లు రావని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారు. అసైన్డ్ భూములు అమ్మేయాలంటూ బెదిరింపులకు దిగారు. బలవంతంగా వాటిని కొనుగోలుచేశారు. దీనికోసం సబ్రిజిస్ట్రార్లపై అధికారపార్టీ నాయకులు విపరీతంగా ఒత్తిడి తీసుకు వచ్చారు. తర్వాత ఈ భూములను భూ సమీకరణలో తీసుకోవడానికి, తీసుకున్నవాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి అనుకూలంగా జీఓలు జారీచేశారు. ఇలా అసైన్డ్భూములను కొనుగోలుచేసి, వాటిని ల్యాండ్ పూలింగ్కు ఇచ్చిన వారిలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉండటం విశేషం. అసైన్డ్భూములను తక్కువకు కొనుగోలుచేసి రాజధానిలో ప్లాట్లు పొందిన వారిలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైనవారు ఉన్నట్టు రికార్డుల్లో వెలుగుచూసింది. నారాలోకేష్ సన్నిహితుడు కొల్లి శివారం 47.39 ఎకరాలను ఇలా కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. నారాలోకేష్ సన్నిహితుడు గుమ్మడి సురేష్ 42.925 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ను చేజిక్కించుకున్నారు. నారాలోకేష్ వద్ద ఉండే మరో వ్యక్తి బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరాలను అసైన్డ్ దారులనుంచి తక్కువకే లాక్కున్నారు. మొత్తంగా 338. 887 ఎకరాల అసైన్డ్ భూములను ఈ రకంగా తక్కువకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొంది ఆర్థికంగా లబ్ధి పొందారు. చదవండి: అమరావతి భూకుంభకోణం: ‘గ్యాగ్’ ఎత్తివేత గత సర్కారు నుంచి భూములు తీసుకున్నారు.. -
గత సర్కారు నుంచి భూములు తీసుకున్నారు..
సాక్షి, అమరావతి: ‘‘అమరావతిలో గత ప్రభుత్వం నుంచి న్యాయమూర్తులు నామమాత్రపు రేట్లకే భూములు తీసుకున్నారు. ఇలా న్యాయమూర్తులు భూములు తీసుకోవచ్చా? తీసుకుంటే ఆ న్యాయమూర్తులు పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలకు సంబంధించిన కేసులను నిష్పాక్షికంగా విచారణ జరపగలరా? అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇది న్యాయవ్యవస్థ మౌలిక స్వరూపానికి సంబంధించిన అంశం. దీనిపై వాదనలు వినిపించేందుకు నాకు అవకాశమివ్వండి. కనీసం వాదనలు వినిపించే అవకాశం కూడా ఇవ్వకపోవడం రాజ్యాంగం నాకు ప్రసాదించిన హక్కును హరించడమే అవుతుంది. ఒకవేళ ఈ వ్యాజ్యంపై విచారించడానికి ఇబ్బంది ఉంటే, దానిపై జ్యుడిషియల్ ఆర్డర్ జారీ చేయండి. తదనుగుణంగా మేం తదుపరి చర్యలు చేపడతాం’’ అని న్యాయవాది సింహంభట్ల శరత్కుమార్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యానికి, తమ ముందున్న రాజధానుల కేసుకు సంబంధం లేదని, ఇది పూర్తిగా వేరే అంశమని, ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు జ్యుడిషియల్ ఆర్డర్ ఇస్తామని స్పష్టం చేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి సోమవారం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ స్పందిస్తూ.. తొలుత ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే మంగళవారం తన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. కాగా, ఈ కేసులపై విచారణ ప్రారంభమవడానికి ముందే.. శరత్కుమార్ తన కేసును ప్రస్తావించారు. పలుమార్లు తన కేసును ప్రస్తావించినప్పటికీ, వాదనలు వినిపించేందుకు తనకు ఇప్పటివరకు అవకాశం రాలేదన్నారు. న్యాయమూర్తులకు గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల గురించి ప్రస్తావిస్తూ.. తన పిటిషన్లోని పలు కీలకాంశాల్లో ఇదొకటని వివరించారు. అయితే ధర్మాసనం ఈ వ్యాజ్యానికీ, తమ ముందున్న వ్యాజ్యాలకు సంబంధం లేదంది. కనీసం తన వ్యాజ్యం విచారణకు నిర్దిష్టమైన తేదీని ఇవ్వాలని శరత్కుమార్ అభ్యర్థించగా.. ధర్మాసనం స్పందించలేదు. -
57వ రోజుకు 3 రాజధానుల మద్దతు దీక్షలు
తాడికొండ: మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతుగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు బుధవారం 57వ రోజుకు చేరుకున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన బహుజన సంఘాల నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. అమరావతి భూముల కుంభకోణంలో బినామీల బాగోతం బయటపడుతుందనే భయంతోనే విచారణకు చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిలో నిరుపేదలకు సెంటు భూమి ఇస్తే గగ్గోలు పెడుతున్న చంద్రబాబు అండ్ కో, ఎల్లో మీడియా రాజధాని పేరిట జరిగిన అడ్డగోలు దోపిడీ, రివర్స్ టెండరింగ్ ద్వారా బయటపడుతున్న కుంభకోణాలపై ఎందుకు నోరు విప్పడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. చంద్రబాబు ఇకనైనా కుయుక్తులకు స్వస్తి పలికి మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో దళిత వర్గాల సమాఖ్య అధ్యక్షుడు చెట్టే రాజు, రాజధాని ప్రాంత ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మల్లవరపు నాగయ్య, నాగార్జునా యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకుడు రుద్రపోగు సురేష్, దళిత నాయకులు ఇందుపల్లి సుభాషిణి, తాళ్లూరి అజయ్ పాల్గొన్నారు. -
అమరావతి భూకుంభకోణం: ‘గ్యాగ్’ ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు అసాధారణ రీతిలో ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. అమరావతి చుట్టూ భూముల కొనుగోళ్లు, ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇద్దరు కుమార్తెలతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేయడం అసాధారణ విషయం కాదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో సర్వోన్నత న్యాయస్థానం ప్రాథమికంగా ఏకీభవించింది. దమ్మాలపాటి తదితరులపై ఏసీబీ కేసు నమోదుకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రచురణ, ప్రసారం చేయకుండా పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాను నియంత్రిస్తూ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తద్వారా మీడియాను నియంత్రిస్తూ ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ ఎత్తివేసినట్టయ్యింది. కాగా ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని దమ్మాలపాటి శ్రీనివాస్ను ఆదేశించింది. అలాగే డీజీపీ, ఏసీబీ డీజీ తదితరులకు నోటీసులిచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్నప్పటికీ, ఆయనకు హైకోర్టే నోటీసు జారీ చేయకపోవడంతో సుప్రీంకోర్టు కూడా ఆయనకు నోటీసు అవసరం లేదని అభిప్రాయపడింది. తదుపరి విచారణను 2021 జనవరి చివరి వారానికి వాయిదా వేసింది. ఈ లోపు.. ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యంపై తుది విచారణ జరిపి తేల్చేయవద్దని హైకోర్టును సుప్రీంకోర్టు కోరింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ రామయ్యగారి సుభాష్రెడ్డి, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు గ్యాగ్ ఉత్తర్వులపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అదే రోజు పిటిషన్ .. అప్పుడే ఉత్తర్వులు అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరడంతో పాటు, దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక సమ్మతిని తెలియచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ ఏడాది మార్చి 23న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖను కొట్టేయాలని కోరుతూ దమ్మాలపాటి శ్రీనివాస్ గత సెప్టెంబర్ 14న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా, నిర్భంధించకుండా, తనపై ఇతర కఠిన చర్యలేవీ తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరారు. అలాగే హైకోర్టు ముందస్తు అనుమతి లేకుండా తనపై మరో దర్యాప్తు, విచారణ చేపట్టకుండా ఆదేశించాలని కోరారు. అంతేకాక రిటైర్డ్ హైకోర్టు జడ్జి పర్యవేక్షణలోనైనా దర్యాప్తు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. మొదట ఈ పిటిషన్ అదే నెల 15న జస్టిస్ దొనాడి రమేశ్ ముందు విచారణకు రాగా, ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని దమ్మాలపాటి న్యాయవాది అదే రోజు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ మహేశ్వరి బెంచ్ ముందు ప్రస్తావించారు. దీంతో సీజే మరుసటి రోజు (16న) విచారిస్తామని తెలిపారు. మరోవైపు 15వ తేదీ ఉదయమే దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇద్దరు కుమార్తెలతో పాటు మరికొందరిపై ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో దమ్మాలపాటి అదే రోజు సాయంత్రం అత్యవసరంగా హౌస్మోషన్ రూపంలో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ గురించి ఎలాంటి కథనాలు ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఈ అనుబంధ పిటిషన్పై సీజే జస్టిస్ మహేశ్వరినే స్వయంగా విచారణ జరిపారు. దానితో పాటు 14న దమ్మాలపాటి దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యాన్ని కూడా కలిపి విచారించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్పై స్టే విధించారు. తనను మాత్రమే అరెస్ట్ చేయవద్దని దమ్మాలపాటి కోరితే, సీజే ఏకంగా నిందితుల్లో ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక దమ్మాలపాటి కోరిన విధంగా పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాను నియంత్రిస్తూ గ్యాగ్ ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎల్పీ .. ఎట్టకేలకు విచారణ... హైకోర్టు సీజే ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 22న స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. దీనిపై రెండు నెలల తర్వాత బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు వినిపించగా, దమ్మాలపాటి తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, హరీష్ సాల్వేలు వాదనలు వినిపించారు. ఆ వ్యక్తులెవరో న్యాయమూర్తులకు తెలుసనే అనుకుంటున్నా: రాజీవ్ ధావన్ ‘అమరావతిని రాజధానిగా ప్రకటిస్తారని, ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాజెక్టులు వస్తాయో రిట్ పిటిషనర్ (దమ్మాలపాటి) తదితరులకు పూర్తిగా తెలుసు. ఆ వివరాల ఆధారంగానే వారు అమరావతి చుట్టూ భూములు కొన్నారు. ఈ కుంభకోణంలో భాగస్వాములైన వ్యక్తుల పేర్లు చెప్పడానికి నేను సిద్ధంగా లేను. ప్రజా బాహుళ్యంలో ఉన్న వారి పేర్లు న్యాయమూర్తులకు తెలిసే ఉంటాయని నేను భావిస్తున్నా. రాజధానిగా అమరావతిని నిర్ణయించిన విషయం బయటకు రాకముందే, చాలామంది రైతులు తమ భూములను చాలా తక్కువ ధరలకు అమ్ముకున్నారు. ఇదంతా ఓ పెద్ద కుంభకోణం. అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడానికి ముందే దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ మరుసటి రోజే గ్యాగ్ ఆర్డర్ కోసం మరో అనుబంధ పిటిషన్ వేశారు. సీజే స్వయంగా విచారణ జరిపి అప్పటికప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపైనే మా అభ్యంతరం. దమ్మాలపాటి కోరింది ఒకటైతే కోర్టు అంతకు మించి ఉత్తర్వులిచ్చింది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. అవి అసాధారణ ఉత్తర్వులు హైకోర్టు గ్యాగ్ ఉత్తర్వులు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు, రాజ్యాంగానికి విరుద్ధం. ఈ తరహా అసాధారణ ఉత్తర్వులు జారీ చేయాల్సినంత పరిస్థితులు ఏవీ లేవు. రిట్ పిటిషన్లో ప్రభుత్వంపై ఆరోపణలు తప్ప ఏమీ లేవు. ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని దాఖలు చేసిన రాజకీయ వ్యాజ్యమే అది. అసలు రైతులంతా వారి వారి భూములను జూన్, డిసెంబర్ మధ్యనే ఎందుకు అమ్ముకున్నారో తేల్చాల్సి ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల భూ లావాదేవీలను పరిశీలిస్తే, వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఏసీబీ దర్యాప్తు ప్రారంభించడానికి ముందే దర్యాప్తుపై స్టే ఇవ్వడం మనం ఎప్పుడైనా విన్నామా? ఎక్కడైనా చూశామా..?’ అని రాజీవ్ ధావన్ సుప్రీంకు నివేదించారు. దమ్మాలపాటిని లక్ష్యంగా చేసుకున్నారు... ‘రిట్ పిటిషన్ దాఖలు చేసే సమయానికి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఒక న్యాయమూర్తి విచారణకు నిరాకరించిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ పిటిషన్ను హైకోర్టు సీజే అత్యవసరంగా విచారించారు. ఎఫ్ఐఆర్ను మీడియాకు ప్రభుత్వం లీక్ చేసింది. దమ్మాలపాటి 30 సంవత్సరాలపాటు న్యాయవాద వృత్తిలో ఉన్నారు. మాజీ సీఎం తరఫున ఆయన కేసులు వాదించారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కూడా కేసులు వాదించారు. అందుకే ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని చూస్తే, అది హైకోర్టుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన అవిశ్వాస తీర్మానంలా ఉంది. హైకోర్టు సీజేపైనే ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తున్నారు.’ అని రోహత్గీ, సాల్వేలు వాదించారు. అన్ని విషయాలూ మాకు అర్ధం అయ్యాయి: ధర్మాసనం ఈ దశలో రాజీవ్ ధావన్ జోక్యం చేసుకుంటూ.. తాము కోర్టుకు వ్యతిరేకంగా నడుచుకోవడం లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ఆ తదుపరి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టకూడదంటే ఎలా? సిట్ విచారణ అనేది అసందర్భంగా వేసింది కాదు. ప్రభుత్వం నియమించిన సబ్ కమిటీ అమరావతి భూకుంభకోణంపై నివేదిక ఇచ్చింది. సీబీఐ విచారణ చేయాలని కేంద్రానికి లేఖ రాసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి న్యాయవాది లేదా మాజీ అడ్వొకేట్ జనరల్ అయితే చట్ట ప్రకారం విచారణ నుంచి ఆయనకు ఏమైనా మినహాయింపులు ఉన్నాయా?.’ అని ధావన్ ప్రశ్నించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘అన్ని విషయాలు మాకు అర్ధం అయ్యాయి..’ అని వ్యాఖ్యానించింది. గ్యాగ్ ఆర్డర్ అంటే.. ఏదైనా ఒక అంశానికి సంబంధించిన సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా, దీనికి సంబంధించి ఎలాంటి విషయాలూ ప్రచురించకుండా మీడియాను నియంత్రిస్తూ న్యాయస్థానం ఇచ్చే ఉత్తర్వులను గ్యాగ్ ఆర్డర్గా వ్యవహరిస్తారు. -
ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్కు సుప్రీంకోర్టు బ్రేక్
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి చివరి వరకు వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం.. అప్పటి వరకు ఈ కేసును ఫైనల్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అమరావతి భూ కుంభకోణం కేసులో హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం దీనిపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ తన వాదనలు వినిపించారు.(చదవండి: మీ గ్యాగ్ ఆర్డర్ను సవరించండి) ‘‘నేరం జరిగిన తర్వాత దర్యాఫ్తు చేయవద్దా. విచారణ వద్దు, మీడియా రిపోర్టింగ్ వద్దు అంటారు. ఈ కేసులో అసలు ఏమీ జరగకూడదా. మాజీ అడ్వకేట్ జనరల్ కోర్టును ఆశ్రయిస్తే 13మందికి ఈ ఆర్డర్స్ ఎలా వర్తింపజేస్తారు. కేసు వివరాలు ఎందుకు వెల్లడి కావొద్దు. పిటిషనర్ అడగకుండానే ఇలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారు’’ అంటూ దిగువ న్యాయస్థానం వ్యవహరించిన తీరును రాజీవ్ ధావన్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్పై స్టే విధిస్తూ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూముల కుంభకోణంపై కేబినెట్ సబ్ కమిటీ విచారణ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు, దర్యాప్తు ప్రక్రియను నిలువరిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)పై సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లోగా ప్రతివాదులైన టీడీపీ నేతలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అమరావతి భూ కుంభకోణంపై కేబినెట్ సబ్ కమిటీ పరిశీలన మేరకు ఏర్పాటైన సిట్ దర్యాప్తును నిలిపివేయాలంటూ టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు దర్యాప్తుపై స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. రాష్ట ప్రభుత్వం తరçఫున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, శేఖర్ నాఫడే, న్యాయవాది మెహ్ఫూజ్ నజ్కీ వాదనలు వినిపించారు. దవే వాదనలు వినిపిస్తూ.. ‘ఏపీ హైకోర్టు దర్యాప్తు నిలిపివేస్తూ అసాధారణమైన ఉత్తర్వులు జారీచేసింది. అవకతవకలు జరిగితే వాటిపై దర్యాప్తు జరపొద్దా’.. అని ప్రశ్నించారు. ఈ సమయంలో జస్టిస్ అశోక్ భూషణ్ జోక్యం చేసుకుంటూ.. ‘ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపై విచారణ జరపాలనుకుంటుందా?’ అని ప్రశ్నించారు. దీనికి దవే లేదని సమాధానమిచ్చారు. ఇలాంటి సందర్భాల్లో దర్యాప్తు కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు గత ఉత్తర్వులను దవే ప్రస్తావించి ప్రతివాదులకు నోటీసులివ్వాలని ధర్మాసనాన్ని కోరారు. దీంతో.. నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ ధర్మాసనం ప్రతివాదులైన టీడీపీ నేత వర్ల రామయ్య తదితరులకు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల తర్వాత తుది విచారణ చేపడతామని పేర్కొంది. -
భూ స్కాం: టీడీపీ నేతలకు సుప్రీం నోటీసులు
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి భూకుంభకోణంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. సిట్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు దశలో హైకోర్టు స్టే విధించడం సరికాదని ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా సిట్ ఏర్పాటైందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని వివరించారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసినట్లు గుర్తుచేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలన్నింటిపైనా దర్యాప్తు చేస్తారా? అని ప్రశ్నించింది. దీనిపై న్యాయవాది దుష్యంత్ దవే వివరణ ఇస్తూ.. అలాంటిది ఏమీ లేదని, అక్రమాలు చోటు చేసుకున్న విషయాలపైన మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ సిట్ దర్యాప్తు జరుపుతోందని స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోకూడని వాదించారు. ‘కొందరు ఆర్టికల్ 226 ప్రకారం సిట్ దర్యాప్తుపై హైకోర్టులో పిటిషన్లు వేశారు. వ్యక్తిగతంగా ప్రభావితమైతే తప్ప ఆర్టికల్ 226 ప్రకారం రిట్ దాఖలు చేయలేరు. సిట్ దర్యాప్తుతో ఎలాంటి సంబంధం లేనివారు పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టుకు అసాధారణ అధికారాలు లేవని.. సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడాల్సిందే’ అని న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు. మరోవైపు ఈ కేసులో భాగంగా టీడీపీ నేతలు వర్ల రామయ్య సహా ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణలో తుది వాదనలు వింటామని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
అమరావతి భూకుంభకోణంపై సుప్రీంకోర్టు విచారణ
-
గ్యాగ్ ఉత్తర్వుల సవరణకు హైకోర్టు నో
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం కేసులో నిందితుడు, మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ భూబాగోతానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని వివరాలను ప్రచురణ, ప్రసారం చేయవద్దని మీడియాను నియంత్రిస్తూ జారీచేసిన గ్యాగ్ ఉత్తర్వులను సవరించేందుకు హైకోర్టు నిరాకరించింది. దమ్మాలపాటి వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలన్న న్యాయవాది మమతారాణి అభ్యర్థననూ తోసిపుచ్చింది. ఇంప్లీడ్, గ్యాగ్ ఆర్డర్ సవరణకు మమతారాణి దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై సానుకూల ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా నిరాకరించింది. ఈ సందర్భంగా.. ఇటీవల సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ఫిర్యాదును, అమరావతి భూకుంభకోణంలో తామిచ్చిన గ్యాగ్ ఆర్డర్ను పోలుస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి పలు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం పెట్టిన మీడియా సమావేశంవల్ల తామిచ్చిన గ్యాగ్ ఉత్తర్వులు నిష్ప్రయోజనమయ్యాయని వ్యాఖ్యానించారు. ఆ సమావేశంలో అమరావతి భూకుంభకోణం ఎఫ్ఐఆర్, ఇతర డాక్యుమెంట్లు, సీఎం రాసిన లేఖను ప్రతీ ఒక్కరికీ ఇచ్చారని సీజే తెలిపారు. దీంతో తామిచ్చిన గ్యాగ్ ఆర్డర్ను సవరించాల్సిన అవసరంలేదని సీజే తేల్చిచెప్పారు. దమ్మాలపాటి పిటిషన్ అత్యవసర విచారణకు ‘నో’ మరోవైపు.. గ్యాగ్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఫేస్బుక్లో అమరావతి కుంభకోణానికి సంబంధించి ఏసీబీ ఎఫ్ఐఆర్లోని అంశాలు వ్యాప్తి అవుతూనే ఉన్నాయని, వాటిని తొలగించేలా ఆదేశాలివ్వాలంటూ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై అత్యవసర విచారణకు సీజే నిరాకరించారు. అత్యవసరమైతే రిజిస్ట్రార్ ముందు ప్రస్తావించాలని దమ్మాలపాటి న్యాయవాది ప్రణతికి సీజే సూచించారు. ఇకపై ఈ వ్యాజ్యం రోస్టర్ ప్రకారం సంబంధిత బెంచ్ ముందుకు వస్తుందని ఆయన తెలిపారు. అజేయ కల్లం వివరాలకు, గ్యాగ్ ఉత్తర్వులకు సంబంధంలేదు న్యాయవాది మమతారాణి వ్యాజ్యాలకు దమ్మాలపాటి కౌంటర్లు దాఖలు చేయగా మమతారాణి వాటికి రీజాయిండర్ ఇవ్వాల్సి ఉంది. ఈ దశలో వీటిపై విచారణ జరిపిన సీజే జస్టిస్ జేకే మహేశ్వరి.. అజేయ కల్లం మీడియా సమావేశానికి, ఈ కేసుకు ముడిపెడుతూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. అజేయ కల్లం చెప్పిన వివరాలకు, మీడియా గ్యాగ్ ఉత్తర్వులకు సంబంధంలేదన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్లోని అంశాలను ఆయన బహిర్గతం చేయలేదని వివరించారు. అయితే, సీజే మాత్రం ఈ వాదనలతో ఏకీభవించలేదు. మమతారాణి ఇంప్లీడ్కు, గ్యాగ్ ఆర్డర్ సవరణకు సీజే విముఖత వ్యక్తంచేస్తూ ఆ మేర ఉత్తర్వులిచ్చారు. -
తుళ్లూరు ఎమ్మార్వో కేసులో ఊహించని పరిణామం
సాక్షి, అమరావతి: అనేక మలుపులు తిరుగుతున్న అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి దాఖలైన కేసులో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తనపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ అప్పటి తుళ్లూరు ఎమ్మార్వో అన్నే సుధీర్బాబు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్పై సోమవారం వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గురువారం ఆకస్మాత్తుగా ఈ పిటిషన్ను రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. (దేశ చరిత్రలో తొలిసారి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) ►రాజధానికి భూములిస్తే పరిహారం రాదంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను అప్పటి అధికార పార్టీ నేతలకు కట్టబెట్టడంలో అప్పటి తుళ్లూరు ఎమ్మార్వో అన్నే సుధీర్బాబు, మరికొందరు సహకరించారంటూ సీఐడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ►ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సుధీర్బాబు మార్చి 23న హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, ఆ మరుసటి రోజే సీఐడీ దర్యాప్తునకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటిపై స్టే విధించింది. ►హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేసింది. అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప దర్యాప్తుపై స్టే ఇవ్వడం సరికాదని, దర్యాప్తును కొనసాగనివ్వాలని అభిప్రాయపడింది. ►వారంలో విచారణ జరిపి తేల్చాలని ఈ నెల 1న సుప్రీంకోర్టు హైకోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ వ్యాజ్యం రోస్టర్ మేరకు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ముందు విచారణకు రాగా, ఈ నెల 12న ఇరుపక్షాల వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేశారు. ►అయితే గురువారం ఈ పిటిషన్ జస్టిస్ రాయ్ ముందున్న కేసుల విచారణ జాబితాలో ‘ఫర్ బీయింగ్ మెన్షన్డ్’ శీర్షిక కింద లిస్ట్ అయింది. ఈ పిటిషన్ను తాను రిలీజ్ చేస్తున్నానని, దీనిని మరో న్యాయమూర్తికి నివేదించాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీనిపై పాలనా పరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ కేసు ఫైళ్లను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని పేర్కొన్నారు. తీర్పు రిజర్వ్ చేసిన కేసును రిలీజ్ చేయడానికి గల కారణాలు నిర్దిష్టంగా తెలియరాలేదు. -
న్యాయ వ్యవస్థపై అమితమైన గౌరవం ఉంది
-
ఏపీ హైకోర్టుకు ‘సుప్రీం’ కమాండ్
(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి): నిస్సందేహంగా ఇదో సంచలనమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆవేదనను ఆధారాలతో సహా భారత ప్రధాన న్యాయమూర్తితో పంచుకుంది. ఎందుకంటే దర్యాప్తు దశలో స్టే ఇవ్వవద్దని సుప్రీం కోర్టు పదే పదే చెబుతున్నా.. రాష్ట్ర హైకోర్టులో మాత్రం అలాంటి ‘స్టే’లు మంజూరైపోతున్నాయి. ఏ దర్యాప్తూ కదలకుండా ముందరికాళ్లకు బంధాలు పడిపోతున్నాయి. ఇక చిన్న చిన్న కేసుల్లో సైతం తీర్పుల సంగతలా ఉంచితే... రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిర్వీర్యమైపోయిందన్న స్థాయిలో తీవ్రమైన వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. వెంటనే ఓ వర్గం మీడియాలో అవన్నీ విపరీతమైన ప్రాధాన్యంతో ప్రసారమౌతూ అచ్చయిపోతున్నాయి. ఎందుకిలా అవుతోందని ఆరా తీసిన ప్రభుత్వం... అవన్నీ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్.వి.రమణ జోక్యంతో జరుగుతున్నాయని తెలుసుకుని ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేకు అందజేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటమే కాక... తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్ జనరల్గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్తో కలిసి జస్టిస్ ఎన్.వి.రమణ ఎలా ఆస్తులను పోగేసుకున్నారో అందులో వివరించారు. జస్టిస్ రమణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు మామూలు న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్కు అనుకూలంగా ఎన్ని ఉత్తర్వులిచ్చారో కూడా ముఖ్యమంత్రి ఆధారాలతో సహా వివరించారు. వీటన్నిటితో పాటు చంద్రబాబు నాయుడికి, జస్టిస్ ఎన్.వి.రమణకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడించే మరో ఆధారాన్ని కూడా సీఎం తన లేఖలో ప్రస్తావిస్తూ అందజేశారు. గతంలో ఓ ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సభ్యుడిగా జస్టిస్ ఎన్.వి.రమణ వ్యక్తం చేసిన అభిప్రాయం... అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసిన అభిప్రాయం అచ్చు గుద్దినట్లు ఒక్కటేనని... కింద సంతకాలు మాత్రమే మారాయని... ఈ విషయాన్ని అప్పట్లో కొలీజియం సభ్యుడిగా ఉన్న జస్టిస్ చలమేశ్వర్ స్వయంగా చెప్పారని కూడా సీఎం పేర్కొన్నారు. ఈ కుమ్మక్కు కారణంగా తాము ఏ అక్రమాన్ని వెలికితీయాలనకున్నా అడ్డుపడుతున్నారని, దానికి అన్ని స్థాయిల్లోనూ ఒత్తిళ్లు తెస్తున్నారని జగన్ వివరించారు. ఈ మేరకు ఆధారాలను కూడా సీజేఐకి అందజేసినట్లు శనివారం ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం తెలియజేశారు. రాత్రి 9 గంటల సమయంలో మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలు వెల్లడించారు. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) సీజేఐకి లేఖ, ధ్రువపత్రాలు కూడా... అమరావతి భూ కుంభకోణంగా ప్రభుత్వం పేర్కొంటున్న వ్యవహారంలో కేబినెట్ సబ్కమిటీ విచారణను, సిట్ దర్యాప్తును నిలిపేస్తూ ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేయటం మీకు తెలుసు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సైతం... ఈ కుంభకోణంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిటింగ్ జడ్జి కుటుంబ సభ్యులపై జరుగుతున్న దర్యాప్తును నిలిపేశారు. అంతేకాక దానికి సంబంధించిన వార్తలు మీడియాలో రాకుండా గ్యాగ్ ఉత్తర్వులిచ్చారు. వీటినీ సుప్రీం కోర్టులో సవాల్ చేశాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలను... ప్రత్యేకించి ఏపీ హైకోర్టు వ్యవహారాల్లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ జోక్యాన్ని దేశ ప్రధాన న్యాయమూర్తికి తెలియజేశాం. దీనికి సంబంధించిన వివిధ పత్రాలనూ ఈ నెల 8న ఆయనకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అందజేశారు. ఇవన్నీ జస్టిస్ ఎన్.వి.రమణకు, టీడీపీ అధిపతి నారా చంద్రబాబు నాయుడితో ఉన్న అనుబంధాన్ని, టీడీపీ నేతల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలను బయటపెట్టేవే. ఇక జస్టిస్ ఎన్.వి.రమణ తాను హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించిన కేసుల్లో ఆయనకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులైతే న్యాయ వ్యవస్థ దుర్వినియోగాన్ని బయటపెడతాయి. ఈ పరిణామాలన్నిటినీ సీజేఐకి లేఖ రూపంలో ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర హైకోర్టు వ్యవహారాలను జస్టిస్ ఎన్.వి.రమణ నేరుగా ఎలా ప్రభావితం చేస్తున్నారో తెలియజేశారు. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాలను, దాంట్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి ముందుంచారు’’ అని కల్లం వివరించారు. మీడియా సమావేశంలో భాగంగా వివిధ పత్రాలను మీడియాకు కూడా అందజేసినా... అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఇటీవల దమ్మాలపాటి, సుప్రీం న్యాయమూర్తి కుమార్తెలపై ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని, దానికి సంబంధించిన ఫిర్యాదును మాత్రం ఇవ్వలేదు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని మీడియాలో ప్రచురించకుండా “గ్యాగ్’ ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ఇలా చేసినట్లు కల్లం తెలిపారు. అయితే ఈ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి మాత్రం అందజేశామన్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ విషయంలో ముందుకెళ్లేటపుడు అఫిడవిట్లతో సహా ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టంచేశారు. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) న్యాయ వ్యవస్థపై అమితమైన గౌరవం ఉంది... ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి హైకోర్టుపై, సుప్రీంకోర్టుపై, న్యాయవ్యవస్థపై అత్యంత గౌరవ ప్రపత్తులున్నట్లు కల్లం తెలిపారు. సీఎం తన లేఖలోనూ ఈ విషయం పేర్కొన్నారని చెప్పారు. “ఇదంతా కొద్ది మంది గౌరవ న్యాయమూర్తుల వ్యవహార శైలిని సుప్రీంకోర్టుకు వివరించే ప్రయత్నమే. ముఖ్యమంత్రిగానీ, ప్రభుత్వం గానీ ఎప్పుడూ చట్టాలకు, రాజ్యాంగానికి లోబడే పనిచేస్తాయి. ఏ వ్యవస్థతోనయినా గౌరవపూర్వకమైన విభేదాలే ఉంటాయి’’ అని కల్లం ఉద్ఘాటించారు. టీడీపీ ప్రయోజనాలే లక్ష్యంగా.. హైకోర్టు ఉత్తర్వులివీ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను పరిరక్షించేందుకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లోని వాస్తవాలు ఇవీ అని పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుప్రీం సీజేకు అనుబంధ పత్రాలు అందజేశారు.. దానిలోని అంశాలు చూస్తే.. చంద్రబాబు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ వ్యవస్థలను గౌరవనీయ సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిల ద్వారా రాజకీయాలకు వినియోగించుకోవడం బాధ, ఆవేదన కలిగిస్తోంది. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, పడగొట్టడానికి గౌరవప్రదమైన హైకోర్టును ఉపయోగించుకుంటున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాయని మచ్చలాంటి తీర్పుల వెనుక జస్టిస్ ఎన్వీ రమణ ద్వారా చంద్రబాబు సాగిస్తున్న బహిరంగ, రహస్య కార్యకలాపాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతిలో వివిధ సంస్థలకు చెందిన వారు భూములు కొన్న విషయం ప్రజలకు తెలిసిందే. అసెంబ్లీ ఆమోదించిన మూడు రాజధానులు, ఒక కీలకమైన చర్చ జరిగిన విషయాన్ని సవాలు చేస్తూ ఈ ఏడాది జనవరి నుంచి వరుసగా రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. అమరావతిలో తమ స్వార్థ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ పిటిషన్లు వేశారు. ఈ సందర్భంలో అక్కడ జరిగిన నిరసనలకు స్వార్థపూరిత వ్యక్తులే నిధులు సమకూర్చారని నివేదికలు చెబుతున్నాయి. వివిధ దశల్లో 30 వరకూ పిల్స్ దాఖలయ్యాయి. ముఖ్యమంత్రిని ప్రతివాదిగా కూడా పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేపట్టినప్పటి నుంచి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో న్యాయ పరిపాలనను హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ద్వారా జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారనే విషయం స్పష్టమైంది. ఆ ప్రభావం ఈ విధంగా ఉంది. ► చంద్రబాబునాయుడు నిర్ణయం మేరకు ఆయన ప్రయోజనాలు కాపాడే విధంగా జడ్జిల సిట్టింగ్ రోస్టర్ను ప్రభావితం చేశారు. ఆ జడ్జిల్లో జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ డి.రమేశ్ తదితరులు ఉన్నారు. ► న్యాయంవైపు లేకుండా ఉన్న, హైకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పిల్స్ను అనుమతించే దిశగా ప్రభావం. ► కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభావం టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించిన ప్రత్యేక సందర్భాలు అమరావతి ల్యాండ్ స్కామ్ : అమరావతి భూ కుంభకోణంపై ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ కె. లలిత జడ్జిల్లో తెలుగుదేశం ప్రయోజనాలను కాపాడే వాళ్లలో జస్టిస్ కె. లలిత ఒకరు. మెడికల్ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టయ్యారు. ఆయన ఒక వారం రోజులు జైల్లో లేకుండానే.. ఆ జడ్జి ఆ మాజీ మంత్రిని ఆస్పత్రికి మార్చాలని ఆదేశాలిచ్చారు. తర్వాత ఇంకో ఆస్పత్రికి మార్చారు. తుదకు ఆస్పత్రి నుంచే విడుదల అయ్యే విధంగా బెయిల్ ఇచ్చారు. ఆ ఆదేశాలను ఆపాలని కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్లపై వాదనలు వినలేదు. దీంతో అచ్చెన్నాయుడుకు ప్రయోజనం చేకూరింది. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) అలాగే రక్షిత స్థలంలో ఉన్న ఇళ్లను, కట్టడాలను తొలగించడానికి గతంలో ఉన్న ఏపీసీఆర్డీఏ ప్రక్రియ మొదలు పెట్టింది. ఆ ఇళ్లలో చంద్రబాబు నివాసం కూడా ఉంది. ఆ ప్రక్రియపై స్టే ఉంది. వరదల సమయంలో నది నీళ్లు ఆ ఇళ్లలోకి చేరాయి. అలాగే ఆ కట్టడాలు ప్రవాహానికి ఆటకం కలిగించాయి. జస్టిస్ డి.రమేష్ జస్టిస్ రమేష్ను క్రిమినల్ కేసుల్లో క్వాష్ పిటిషన్ల విచారణ, రిట్ పిటిషన్ల పరిధిలో వ్యూహాత్మకంగా ఉంచారు. గత ప్రభుత్వం హయాంలో అడ్వొకేట్ జనరల్కు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా జస్టిస్ రమేష్ ఉండేవారు. టీడీపీకి అనుబంధంగా ఉన్న వారి విషయంలో ఆయన వ్యవహారం ఇలా ఉంది.. ► రమేష్ హాస్పిటల్స్కు చెందిన డాక్టర్ రమేష్ దాఖలు చేసిన పిటిషన్కు అనుకూలంగా, ఆయనపై తదుపరి చర్యలు తీసుకోకుండా జస్టిస్ రమేష్ స్టే ఇచ్చారు. రమేష్ ఆస్పత్రి నిర్వహించిన కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 10 మంది చనిపోయిన విషయంలో జస్టిస్ రమేష్ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ డాక్టర్ రమేష్ పరారీలోనే ఉన్నారు. జస్టిస్ రమేష్ ఆదేశాలను సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ► ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీపై దాఖలైన ఎఫ్ఐఆర్ను క్వాష్ కోరుతూ రాష్ట్ర ఎన్నికల అధికారి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని రోజుల నిందితుడు అదే ఎఫ్ఐఆర్ను క్వాష్ కోరుతూ రెండో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణకు స్వీకరించినపుడు రెండు పిటిషన్లు కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. అయితే కారణాలు ఏమీ చెప్పకుండా జస్టిస్ రమేష్ మాత్రం దర్యాప్తుపై స్టే విధించారు. సత్యనారాయణ మూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి గత పది సంవత్సరాల నుం జస్టిస్ ఎన్వీ రమణకు విశ్వసనీయమైన వ్యక్తిగా ఉన్నారు. ప్రభుత్వంపై ఆయన వ్యతిరేకత ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పరిపాలనలో హైకోర్టు జోక్యం చేసుకున్న ప్రతి విషయంలోనూ ఆయన పాత్ర స్పష్టంగా కనబడుతుంది. రాజధానుల విచారణ విషయంలో అన్ని సందర్భాల్లో (ఆయన పక్కన కానీ లేదా ఫుల్ బెంచ్ అయినా కానీ) జస్టిస్ సత్యనారాయణ మూర్తి తనతో ఉన్నట్లు చీఫ్ జస్టిస్ నిర్ధారించారు. ప్రభుత్వ న్యాయవాదులపై ఆయన దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. ► ఇంటర్ కాలేజీల సంఘం దాఖలు చేసిన పిటిషన్ విషయంలో.. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 365 విషయంలో అడ్వొకేట్ జనరల్కు సూచనలు చేస్తూ జస్టిస్ మూర్తి వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విషయంలో కౌంటర్ను పట్టించుకోకుండా కేవలం పిటిషనర్ అఫిడవిట్ ఆధారంగా జస్టిస్ మూర్తి విచారణను రిజర్వ్లో ఉంచారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై కూడా ఆయన పలుమార్లు విమర్శలు చేశారు. ► మాజీ అడ్వొకేట్ జనరల్, జస్టిస్ ఎన్వీ రమణకు ఆప్తుడు అయిన దమ్మాలపాటి శ్రీనివాస్పై నమోదైన క్రిమినల్ కేసు విషయంలో దర్యాప్తు కొనసాగకుండా జస్టిస్ మూర్తి స్టే ఇచ్చారు. జస్టిస్ డి.సోమయాజులు ► పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నుంచి నవయుగ ఇంజనీరింగ్ను తొలగించిన విషయంలో ఆ కంపెనీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ జస్టిస్ సోమయాజులు వద్దకు విచారణకు వచ్చింది. హైకోర్టు వెబ్సైట్లో ఆయన ప్రొఫైల్ చూస్తే.. జస్టిస్ సోమయాజులు గతంలో నవయుగ కంపెనీకి లీగల్ సలహాదారుగా ఉన్నారు. విచారణ సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించలేదు. ఆయన ఇచ్చిన ఆదేశాలను మరో జడ్జి వెకేట్ చేశారు. అయితే చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్.. జస్టిస్ సోమయాజులు ఇచ్చిన పూర్వ ఆదేశాలను తిరిగి అనుమతించింది. ► కేబినెట్ కమిటీ, సిట్ నివేదికలకు సంబంధించి అన్ని ప్రభుత్వ ఆదేశాలపై జస్టిస్ సోమయాజులు స్టే విధించారు. ఈ కేసు విషయంలో రిట్ పిటిషన్లు దాఖలు చేసిన వారు టీడీపీ కార్యకర్తలే. తమ పార్టీ ప్రతిష్టకు భంగం అంటూ ఆ పిటిషన్లు దాఖలు చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా ‘ఎల్లో పిల్స్’ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ఆ పార్టీ ఎజెండాను మోస్తున్న ఆంధ్రజ్యోతి, టీవీ5 న్యూస్ చానెల్ రాష్ట్ర ప్రభుత్వంపై పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలు చేయడానికి కారణమయ్యాయి. ముందుగా ఆయా అంశాలపై ఈ రెండు మీడియా సంస్థలు కథనాలు ఇవ్వడంతోపాటు చర్చలు నిర్వహిస్తాయి. ఇలా జరిగిన కొద్ది రోజులకే వాటిపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పలు పిల్స్ దాఖలు అవుతాయి. వీటిలో కొన్ని.. జడ్జిల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని పిల్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తోందంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఆగస్టు 15న ఒక కథనం ప్రచురించింది. అదే రోజు ఆ కథనాన్ని రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి ఖండించారు. ఆ పత్రిక రాసింది తప్పుడు కథనమని హైకోర్టు రిజిస్ట్రార్కు తెలిపారు. ఇది జరిగిన రెండు రోజులకే అంటే ఆగస్టు 17న హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై హైకోర్టు ఎలాంటి ప్రామాణికత లేని ఆ పత్రిక కథనాన్ని ఆధారం చేసుకుని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే ఆ పత్రిక కథనం ఆధారంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇందులో విచిత్రమేమిటంటే.. అటు హైకోర్టు.. ఇటు చంద్రబాబు ఫోన్ల ట్యాపింగ్ ఎలాంటి ఆధారాలను చూపకపోవడం గమనార్హం. విశాఖలో టీడీపీ ర్యాలీకి అనుమతి నిరాకరణ విశాఖలో బహిరంగ ర్యాలీ నిర్వహించడానికి టీడీపీని అనుమతించకపోవడానికి సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విశాఖ వెళ్లడానికి చంద్రబాబును ప్రభుత్వం అనుమతించని ఒక రోజు తర్వాత, సీఆర్పీసీ సెక్షన్ 151 కింద ఆయనకు నోటీసు జారీ చేసి అరెస్టు చేశాక ఈ పిల్ దాఖలు చేయడం గమనార్హం. దీనిపై కోర్టు డీజీపీని కోర్టుకు పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని నిలదీసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ పిల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఒక నాయకుడు కోవిడ్–19 మార్గదర్శకాలను ఉల్లంఘించారని, భౌతికదూరాన్ని పాటించడం లేదని ఆరోపిస్తూ ఈ పిల్ను దాఖలు చేశారు. విచారణ చేసి ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేశామని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే దీనిపై సంతృప్తి చెందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉల్లంఘనలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నానని పేర్కొన్నారు. ఇది జరిగిన మరుసటి రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని కోర్టులో పిల్ దాఖలైంది. ఈ రెండు పిల్స్ను కలిపి విచారించిన హైకోర్టు దీనికి సీబీఐ విచారణ అవసరం లేదని పేర్కొంది. పలు విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులు.. 1. గ్రామ పంచాయతీ కార్యాలయాల అధికార పార్టీ జెండా రంగులేస్తోందని పిల్స్ 2. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమం ప్రవేశపెట్టడంపై పిల్ 3. రాష్ట్ర ఎన్నికల సంఘానికి, మరెన్నో అంశాలకు సంబంధించి రిట్ పిటిషన్లు 4. జస్టిస్ ఈశ్వరయ్య, సస్పెన్షన్కు గురైన న్యాయాధికారి రామకృష్ణ మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణపై హైకోర్టు నేరుగా విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ చేయాలని జస్టిస్ రవీంద్రన్ను కోరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టుపై కుట్ర జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకుండానే విచారణ బాధ్యతలను రవీంద్రన్కు అప్పగించింది. ( జస్టిస్ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!) -
దర్యాప్తు ప్రారంభానికి ముందే స్టే ఎలా ఇస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మేం ఆమోదించం. అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప దర్యాప్తుపై స్టే ఇవ్వరాదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటిస్తూ వచ్చినందునే ఇప్పుడు మేం హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకుంటున్నాం. సంబంధిత పిటిషన్ను హైకోర్టు త్వరితగతిన విచారించాల్సిన అవసరం ఉంది. వచ్చే వారమే ఈ పిటిషన్ను విని, పరిష్కరించాలని హైకోర్టుకు సూచిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతమైన గుంటూరు జిల్లా తూళ్లూరు మండలంలో ఎస్సీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను ప్రభుత్వం రాజధాని కోసం తీసుకుంటే పరిహారం రాదని నమ్మించి.. రాజకీయ నాయకులు, అధికారులు కలిసి భూములు బదలాయించిన వ్యవహారంపై దర్యాప్తు జరుపుతుండగా హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ప్రభుత్వం తరుఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, పి.ఎస్.నరసింహా, మెహఫూజ్ నజ్కీ వాదనలు వినిపించారు. అక్కడ పరిష్కరించకపోతే మళ్లీ మీ వద్దకు.. తొలుత ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ‘ఒక వారం రోజుల్లోనే తుది విచారణ చేపట్టి ఉత్తర్వులు ఇస్తామని సెప్టెంబర్ 11 నాటి విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది..’ అంటూ ప్రస్తావించారు. ఈ సందర్భంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు స్పందిస్తూ ‘హైకోర్టులో విచారణ ఎప్పుడు ఉంది?’ అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సమాధానం ఇస్తూ ‘హైకోర్టు విచారణ తేదీ ఇవ్వలేదు..’ అని నివేదించారు. (కోటి కోర్కెలు తీర్చిన గ్రామ స్వరాజ్యం) ఈ నేపథ్యంలో ‘హైకోర్టు వచ్చే వారం సంబంధిత పిటిషన్ను పరిష్కరించాలని అడుగుతాం’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ దశలో ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ “అందుకు సమ్మతమే.. అయితే ఈ పిటిషన్ను ఇక్కడ పెండింగ్లో ఉంచండి..’ అని కోరగా.. ధర్మాసనం ఎందుకని ప్రశ్నించింది. “ఎందుకంటే అక్కడ పరిష్కరించకపోతే మళ్లీ మీ వద్దకు రావాలి. హైకోర్టు ఉత్తర్వులు పూర్తిగా చట్టవిరుద్ధం..’ అని రోహత్గీ నివేదించారు. దర్యాప్తు ప్రారంభానికి ముందే స్టే ఇస్తారా? ప్రతివాది తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించేందుకు ప్రయత్నించగా జస్టిస్ లావు నాగేశ్వరరావు జోక్యం చేసుకుంటూ “అది మధ్యంతర ఉత్తర్వు మాత్రమే కాబట్టి వచ్చే వారం పరిష్కరించాలని మేం హైకోర్టుకు సూచిస్తున్నాం.. కేసును పరిష్కరించనివ్వండి’ అని ఉత్తర్వు వెలువరించి ముగించబోయారు. ఈ సందర్భంలో ప్రతివాది తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా మాట్లాడుతూ “హైకోర్టు దర్యాప్తుపై స్టే ఇచ్చి ఉండాల్సింది కాదన్న మీ అబ్జర్వేషన్ను ఉత్తర్వుల్లో నమోదు చేస్తే దాని ప్రభావం హైకోర్టు విచారణపై పడుతుంది..’ అని నివేదించారు. అయితే దానిని ఉత్తర్వుల నుంచి తొలగిస్తామని, ఈ పిటిషన్ను ఇక్కడ పెండింగ్లో ఉంచుతున్నామని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి ఉత్తర్వులు నిలబడటం కష్టం ప్రతివాది తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా మరో నివేదినను ధర్మాసనం ముందుంచారు. “వారం సమయం మాత్రమే ఇవ్వడం వల్ల ఇబ్బంది ఉంటుంది. రెండు వారాలు గడువు ఇవ్వండి..’ అని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ “ముందుగా ఉత్తర్వులు రానివ్వండి.. వచ్చాక ఇక్కడ మూడు వారాలు ఆగి విచారణ జరుపుదాం.. తొందర ఏం లేదు.. దానిలో ఆందోళన అక్కర్లేదు..’ అని పేర్కొంది. ఈ సమయంలో సిద్ధార్థ లూత్రా తిరిగి వాదనలు వినిపిస్తూ దర్యాప్తు అంశాన్ని ప్రస్తావించారు. వాంగ్మూలాలు నమోదు చేస్తోందని నివేదించారు. ఈ సందర్భంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు జోక్యం చేసుకుంటూ “అదేమైనా కావొచ్చు. కానీ ఇలాంటి (దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడం) ఉత్తర్వులు నిలబడడం చాలా కష్టం. అది మీకు తెలుసు. మీరు నిపుణులు కూడా. ఒకసారి ఫిర్యాదు నమోదైన తర్వాత దర్యాప్తు ప్రారంభం కాకుండానే ఇందులో కేసు ఏముంది? అంటూ హైకోర్టు స్టే ఇవ్వడం ఏంటి?’ అని ప్రశ్నించారు. “2014కు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తోంది..’ అని లూత్రా నివేదించగా, “మేం ఏం సహాయం చేయలేం. యంత్రాంగం ముందుకు నడవాల్సి ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సి ఉంటుంది..’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. “మేం పదే పదే చెబుతున్నాం. సాధారణ పరిస్థితుల్లో స్టే ఇవ్వకూడదు..’ అని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేశారు. -
టీడీపీ నీచరాజకీయాలు చేస్తోంది: సజ్జల
సాక్షి, అమరావతి : మతం పేరుతో టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమరావతి భూ కుంభకోణంపై దృష్టి మరల్చడమే ఆ పార్టీ లక్ష్యమని ఆయన మండిపడ్డారు. గురువారం సజ్జల తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తమ రాజకీయ స్వార్థం కోసం టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తమ అనుకూల మీడియా ద్వారా వార్తలు ప్రసారం చేసుకుంటున్నారని, కుట్రపూరితంగానే ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఢిల్లీ కరుణ కోసం కాషాయవాదిగా అవతారం) హిందూ దేవాలయాలపై దాడుల వెనుక ప్రధాన ప్రతిపక్షం ఉందని సజ్జల రామకృష్ణరెడ్డి ఆరోపించారు. హిందూ మతంపై విశ్వాసంతో కాదని, అధికారంలో లేమనే బాధతో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. అత్యంత భక్తి భావంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారని తెలిపారు. సంక్షోభం సృష్టించాలన్న తాపత్రయమే ప్రతిపక్షాల్లో కనిపిస్తోందని, ఇలాంటి చర్యలతో ప్రజల్లో ప్రతిపక్షాలే చులకనవుతున్నాయని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు చేసిన వారే అభాసుపాలయ్యారన్నారు. (‘బురద జల్లేందుకే ఆ పిచ్చి రాతలు’) -
న్యాయవాదికి ఏపీ హైకోర్టు ఆదేశాలు
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో మాజీ అడ్వకేట్ జనరల్పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ను సవాలు చేస్తూ అడ్వకేట్ మమత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను బుధవారం విచారించిన హైకోర్టు ధర్మాసనం, కౌంటర్ దాఖలు చేయాలని మాజీ అడ్వకేట్ జనరల్తరఫు న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.(చదవండి: హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి) కాగా, రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో మాజీ అడ్వకేట్ జనరల్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కుమార్తెలు, మిగిలిన నిందితులు కలిసి జరిపిన భూముల కొనుగోళ్ల వెనుక భారీ కుంభకోణం ఉందంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం విదితమే. అయితే ఈ కేసులో ఎవ్వరినీ అరెస్టుచెయ్యొద్దని.. అలాగే, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రచురణ, ప్రసారం చేయరాదంటూ పత్రికలను, టీవీలను, సోషల్ మీడియాను నియంత్రిస్తూ ఈ నెల 15న హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది. -
అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరాం
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూకుంభకోణం, ఫైబర్ నెట్పై సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని కోరామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, అమరావతిపై సీబీఐ దర్యాప్తు, పోలవరం ప్రాజెక్టు నిధులు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. దానికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తోందని వెల్లడించారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించేందుకు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం కాలిపోయిందనే పేరుతో రాష్ట్రాన్ని కాల్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. అంతేకాకుండా మత కలహాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రైలు తగలబెట్టి కాపు ఉద్యమకారులపై కేసులు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి:(అమిత్ షాతో రెండోసారి సీఎం జగన్ భేటీ ) అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. తల్లి లాంటి పార్టీని విమర్శిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒక ద్రోహి అని మండిపడ్డారు. నీతి, నిజాయితీ ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. హద్దుమీరి మాట్లాడితే తన బండారం బయట పెడతానని హెచ్చరించారు. తమ నాయకుడిని విమర్శిస్తే ఊరుకోమని, కర్నూలుకు న్యాయ రాజధాని వస్తే ఎందుకు అంత కడుపుమంట అని నిలదీశారు. మరో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ తలారి రంగయ్య మీడియాతో మాట్లాడూ.. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కాఫీ తోటల పెంపకానికి ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులను కలిసి నిధుల కోసం ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. చదవండి:(కేంద్రమంత్రి షెకావత్తో సీఎం జగన్ భేటీ) -
హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వండి
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణానికి సంబం ధించి మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇద్దరు కుమార్తెలతో పాటు మరికొందరిపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఎవ్వరినీ అరెస్టుచెయ్యొద్దని.. అలాగే, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి వార్తలు ప్రచురణ, ప్రసారం చేయరాదంటూ పత్రికలను, టీవీలను, సోషల్ మీడియాను నియంత్రిస్తూ ఈ నెల 15న హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. అడ్వొకేట్ ఆన్ రికార్డ్ మహఫూజ్ నజ్కీ ఈ పిటిషన్ వేశారు. తనను అరెస్టు చెయ్యొద్దని దమ్మాలపాటి ఒక్కరే పిటిషన్ దాఖలు చేస్తే.. హైకోర్టు మాత్రం ఎఫ్ఐఆర్లో నిందితులుగా ఉన్న మిగిలిన 12 మందిని కూడా అరెస్టు చెయ్యొద్దని ఉత్తర్వులు జారీచేయడంపై రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ను సవాలు చేయకపోయినా హైకోర్టు స్టే ఇచ్చింది దమ్మాలపాటి శ్రీనివాస్ 14వ తేదీనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అమరావతి భూ కుంభకోణంలో తనను అరెస్టుచేసే అవకాశం ఉందని.. అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 15వ తేదీ ఉ.9 గంటల సమయంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదుతో దమ్మాలపాటి రిట్ పిటిషన్ నిరర్థకమైంది. అయితే, హైకోర్టు మాత్రం, ఆ రిట్ నిరర్థకమైనప్పటికీ.. ఏసీబీ ఎఫ్ఐఆర్ను ఆయన సవాలు చేయకపోయినప్పటికీ ఆయన పిటిషన్ను విచారించి, ఆయన కోరిన ఉత్తర్వులన్నింటినీ ఇచ్చింది. ఎఫ్ఐఆర్లోని ఆరోపణలను పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు స్టే ఇచ్చి ఎఫ్ఐఆర్ వివరాలపై గ్యాగ్ ఉత్తర్వులు సైతం జారీచేసింది. ఎఫ్ఐఆర్ను పట్టించుకోండా హైకోర్టు ఏకపక్ష ఉత్తర్వులు రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో దమ్మాలపాటి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కుమార్తెలు, మిగిలిన నిందితులు కలిసి జరిపిన భూముల కొనుగోళ్ల వెనుక భారీ కుంభకోణం ఉందంటూ ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కొనుగోళ్ల విషయంలో దమ్మాలపాటి శ్రీనివాస్ అడ్వొకేట్ జనరల్గా తన పదవిని దుర్వినియోగం చేశారు. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకుని తనతో పాటు తన బంధువులు, సన్నిహితులు భూ కొనుగోళ్లు చేసి లబ్ధి పొందారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసు పెట్టారన్నది దమ్మాలపాటి ఆరోపణ. వాస్తవానికి ఇది శుద్ధ తప్పు. ఒకవేళ ఇందులో నిజం ఉందని అనుకున్నా కూడా.. న్యాయస్థానం ఏసీబీ దర్యాప్తును నిలిపేయడానికి వీల్లేదు. హైకోర్టు కనీసం ఎఫ్ఐఆర్లోని అంశాలను ప్రస్తావించకుండా పూర్తి ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులిచ్చి పెద్ద తప్పు చేసింది. ప్రాథమిక దశలోనే ఎఫ్ఐఆర్ను తోసిపుచ్చడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం అనేక సందర్భాల్లో చెప్పింది. ఈ ఒక్క కారణంతో హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయవచ్చు. దర్యాప్తు పూర్తయ్యే వరకు జోక్యం కుదరదని “సుప్రీం’ చెప్పింది ఇక దర్యాప్తు అన్నది దర్యాప్తు సంస్థల పరిధిలోని వ్యవహారమని.. అది పూర్తయ్యేంత వరకు న్యాయస్థానాలు అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది. అయినప్పటికీ.. హైకోర్టు మాత్రం దమ్మాలపాటి దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకోవడమే కాక, ఆయన కోరిన ఉత్తర్వులన్నీ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు నిందితులకు వాదన వినిపించే హక్కేలేదని సుప్రీంకోర్టు పలుమార్లు తీర్పులిచ్చింది. సీఆర్పీసీ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. అయినా కూడా హైకోర్టు, అటు సీఆర్పీసీకి, ఇటు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరించింది. ఈ కారణంతో కూడా హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయవచ్చు. దమ్మాలపాటి పిటిషన్ను కొట్టేయాల్సి ఉన్నా.. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారన్న ఆందోళనతో దమ్మాలపాటి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదు. దానిని ప్రాథమిక దశలోనే కొట్టేయాలి. అయినప్పటికీ, ఆశ్చర్యకరంగా హైకోర్టు దానిని విచారించడమే కాక అతను కోరిన మేర ఉత్తర్వులిచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే దర్యాప్తును ఆపేయాలన్న ఉద్దేశంతో దమ్మాలపాటి ఆ పిటిషన్ను దాఖలు చేశారు. హైకోర్టు ఉత్తర్వులు జారీచేసే ముందు సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను పూర్తిగా విస్మరించింది. ఉ. 9 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైంది. అదేరోజు సాయంత్రంకల్లా హైకోర్టు స్టే ఇచ్చేసింది. స్టేవల్ల సాక్ష్యాలను కనుమరుగు చేసే ప్రమాదం ఉంది ఏసీబీ నమోదు చేసింది ఓ భారీ భూ కుంభకోణానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ అన్న విషయాన్ని హైకోర్టు పట్టించుకోలేదు. దమ్మాలపాటి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీల కుమార్తెలతో పాటు ఇతర నిందితుల పాత్ర గురించి ఆ ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అడ్వొకేట్ జనరల్గా ఉన్న సమయంలో దమ్మాలపాటి ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అందులో చాలా స్పష్టంగా ఉంది. ఎఫ్ఐఆర్ నమోదైన దశలో హైకోర్టు స్టే ఇవ్వడంవల్ల, నిందితులు సాక్ష్యాలను కనుమరుగు చేసే ప్రమాదం ఉంది. అలాగే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. ఇది దర్యాప్తుపై ఎంతో ప్రభావం చూపుతుంది. అందువల్ల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చట్టం దృష్టిలో చెల్లవు. బినామీలు, బంధువులు, సన్నిహితుల పేర్ల మీద భారీ మొత్తంలో భూములు కొనుగోలు చేశారన్న విషయాన్ని హైకోర్టు కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదు. సీనియర్ న్యాయవాదికి చట్టంలో ఎలాంటి రక్షణలేదు దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ అయినంత మాత్రాన, ఏ చట్టం కూడా అతనికి రక్షణ కల్పించడంలేదు. న్యాయవాదిపై కేసు నమోదు చేయకూడదని న్యాయవాదుల చట్టంలో ఎలాంటి నిబంధనలేదు. సీనియర్ న్యాయవాదిగా దమ్మాలపాటి శ్రీనివాస్ ఎలాంటి రక్షణ కోరజాలరు. ఈ విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా అతను కోరిన ఉత్తర్వులన్నీ ఇచ్చింది. ఈ కారణంతో కూడా హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయాలి. ఈ వ్యవహారంలో కొన్ని మౌలిక ప్రశ్నలు.. – ఎఫ్ఐఆర్ను సవాలు చేయకపోయినప్పటికీ, దర్యాప్తును నిలుపుదల చెయ్యొచ్చా? – దర్యాప్తు మొదలైన ప్రాథమిక దశలోనే రొటీన్ పద్ధతిలో ఎఫ్ఐఆర్ను నిలుపుదల చెయ్యొచ్చా? – అసలు దర్యాప్తును నిలిపేస్తూ రొటీన్ పద్ధతిలో స్టే జారీచేయడానికి వీలుందా? – సీఆర్పీసీ ప్రకారం.. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందే నిందితులకు వాదనలు వినిపించే హక్కు ఉందా? – దర్యాప్తు సంస్థ పరిధిలో ఉండే దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం సరైన చర్యేనా? – ఎఫ్ఐఆర్లో ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు, దర్యాప్తు ప్రక్రియను నిలిపేయవచ్చా? – హైకోర్టును ఆశ్రయించని నిందితుల విషయంలో కూడా హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వొచ్చా? – నేరానికి పాల్పడిన న్యాయవాదిపై కేసు నమోదు చేయకుండా న్యాయవాదుల చట్టం కింద రక్షణ ఉందా? -
రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం
విచారణలో ఉన్న ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) కోర్టులు జోక్యం చేసుకో రాదని హరియాణా ముఖ్యమంత్రి భజన్లాల్ కేసులో హరియాణా హైకోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. – (1992 : సుప్రీం. ఏఐఆర్. పేజీ 604) అమరావతిలో జరిగిన భూకుంభకోణా లపై రాష్ట్ర ఏసీబీ రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జనరల్ సుప్రీం న్యాయమూర్తి తాలూకు ఇరువురు సన్నిహిత బంధువులు సహా మొత్తం 13 మందిపైన నమోదు చేసిన కేసును రాష్ట్ర హైకోర్టు నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వు రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధంగా ఉందని ప్రముఖ రాజ్యాంగ నిపుణులు, రాజకీయ ప్రముఖులు, దేశవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. – పత్రికల వార్తలు (17–09–2020) ‘భూకుంభకోణంపై ఎలాంటి వార్తలు రాయొద్దు, ప్రసారం చేయొద్దు’ – హైకోర్టు ఆదేశం ఏసీబీ కేసు 15–09–2020న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దోనాటి రమేశ్ ముందు విచారణకు రాగా, విచారణ ప్రారంభించడానికి ముందే ఆయన ఈ కేసును తాను విననని చెప్పి సదరు కేసు ఫైల్ను ప్రధాన న్యాయమూర్తికి పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు’ – వార్త న్యాయం తప్పేవాళ్లకు ఏ ఆచార్యుల కటాక్షమూ అక్కర్లేదని తెలుగువారి సామెత. అంతేకాదు, న్యాయాన్ని అమ్మేవాడూ, దోవలు కాచి దోచుకునే వాడు కూడా ఒకటేనని మరో సామెత. అంతేకాదు, భారత పౌరహక్కుల పరిరక్షణ నేతగా, రాజ్యాంగం గ్యారంటీ చేసిన ప్రాథమిక హక్కులను కాపాడటంలో ఉద్ధండ పిండంగా ఎనలేని సేవలందించిన సుప్రసిద్ధ సుప్రీం న్యాయవాది ప్రశాంత భూషణ్పైన కోర్టు ధిక్కారం పేరిట జస్టిస్ అరుణ్ మిశ్రా (ఇక రిటైర్డ్) శిక్షించడానికి చేసిన ప్రయత్నం శాశ్వత చర్చగానే పరిష్కారం లేని ప్రతిపాదనగానే మిగిలిపోతుందని ప్రభుత్వ సీనియర్ అడ్వొకేట్ జనరల్ వేణుగోపాల్ స్పష్టం చేశారని మరిచిపోరాదు. అలాంటి మచ్చలేని ప్రశాంత భూషణ్ సైతం తాజా ‘హైకోర్టు’ ఉత్తర్వు సరైన పద్ధతిలో లేదని, గతంలో ఇలాంటి పరిణామం ఎన్నడూ చూడ లేదని, ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ ప్రజలు సమాచారం తెలుసుకోకుండా చేయడం ద్వారా అనేక వదంతులకు (రూమర్లకు) దారితీస్తుందనీ విమర్శించారు. అలాగే సుప్రసిద్ధ హిందూ దినపత్రిక పూర్వ సంపాదకుడు.. నేడు దేశవిదేశాల్లో ప్రసిద్ధిలోకి వచ్చి పరిశోధనాత్మక జర్నలిజంలో తల మానికంగా ఉన్న ‘ది వైర్’ సంస్థ ప్రధాన సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్ రాష్ట్ర హైకోర్టు నిషేధిత ఉత్తర్వును విమర్శిస్తూ ఇలా వ్యాఖ్యానించారు. ‘‘ఆంధ్రప్రదేశ్లో భూకుంభకోణాలను బహిర్గతం చేస్తూ వెలువడిన ప్రాథమిక విచారణా నివేదిక ఎఫ్ఐఆర్ బతికింది కొద్దిసేపే అయినా, ప్రయోజనకరంగా జీవించింది. ఈ దేశంలో రోజూ వేలాది ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. కానీ ఈ ఎఫ్ఐఆర్ను తొక్కి పడేశారు. దర్యాప్తును అడ్డుకున్నారు. దేనిపైన ఎప్పుడు ఎలా దర్యాప్తు జరపాలో నిర్ణయి స్తున్నవారే అసలైన అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు.’’ ఇలా ఒకరిద్దరు కాదు.. దేశవ్యాప్తంగానే లెక్కకు మించి ఒక రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుపై స్పందనలు వెల్లువెత్తడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. మరొక విశేషం.. తన ఈ ఆదేశాన్ని అమ లయ్యేలా చూడాలని ఒక్క ఏపీ డీజీపీనే కాకుండా కేంద్రాన్ని కూడా హైకోర్టు ఆదేశించడం! కానీ అంతకుముందు కేసు విచారణ నుంచి గౌరవ న్యాయమూర్తి ఎందుకు తప్పుకోవలసి వచ్చిందో కారణం మాత్రం ప్రజలకూ, విమర్శకులకూ వివరంగా వెల్లడి కావలసి ఉంది. ఎందుకంటే, బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకుల హయాంలో నిర్బం ధపూరిత శాసనాలు, క్రిమినల్ లా చట్టాలు ఎలాంటి ప్రధానమైన మౌలిక మార్పులు లేకుండానే హెచ్చు భాగంగా నేడు దేశంలో యథే చ్ఛగా అమలు జరుగుతున్నాయి. దీనివల్ల దేశంలో 1960ల నుంచీ ఎలాంటి ఫలితాలు ప్రజల్ని పీడిస్తున్నాయో, స్వతంత్ర భారత న్యాయవాదుల సంఘానికి, తొలి బార్ అసోసియేషన్కూ అధ్యక్షుడైన మచ్చలేని సుప్రసిద్ధ న్యాయవాది, భారత లా కమిషన్ తొలి అధ్య క్షుడు, పద్మవిభూషణ్ అయిన రాజ్యాంగ నిపుణుడు ఎం.సి. సెతల్వాడ్ చెప్పిన మాటల్ని ఎదిగి రావలసిన యువ న్యాయవాదులు ఒంట బట్టించుకోవాలి. సెతల్వాడ్ మాటల్లో: ‘లాయర్ల, న్యాయమూర్తుల వృత్తి నైపుణ్యం మొత్తంమీద పెరిగింది కానీ– ఒకనాడు ప్రజాసేవలో పాటించిన ఆదర్శాలను నేడు ఈ వృత్తి చాలావరకు కోల్పోయింది. ఎంతసేపూ స్వార్థ దృష్టిపైనే దాదాపు కేంద్రీకరణ అంతా. ఇక వృత్తి ధర్మంలో పాటించాల్సిన ఆదర్శాలూ దాదాపు దారుణంగా పతనమవు తున్నాయి. చివరికి పన్నుల ఎగవేత కేసుల్లో ప్రముఖ సీనియర్ లాయర్లే మునిగిపోతున్నారు’. చివరికి అవినీతి కేసుల్లో ఉన్న సుమారు 16–17 మంది ప్రధాన న్యాయమూర్తులలో కనీసం 8–9 మంది అవినీతికి లోనవడం గురించి ప్రశాంత్భూషణ్ 2009 సెప్టెంబర్ 7న సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంలో ఆ విషయమై రాగల పరిణామాల గురించి అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించడం జరిగిందేగానీ గత పదేళ్లు గానూ ఆ విషయాన్ని అరుణ్మిశ్రా విచారణకు తీసుకోవడం మాత్రం జరగలేదు. నిప్పు లేనిదే పొగ రాదన్న పెద్దల నానుడికి ఇది నిదర్శనం కాదా? అసలు ‘క్రిమినల్లా’కు ప్రాణమే ఎఫ్ఐఆర్. విచారణ సాగా లంటే ఆ ప్రాథమిక కర్మకాండ జరగాల్సిందే. అందుకే భజన్లాల్ కేసులో ఎఫ్ఐఆర్ని హైకోర్టు కొట్టేయడానికి చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు అడ్డుకోవాల్సి వచ్చింది (1992). అదే సుప్రీం, ఎస్.ఎస్. బసాక్ 2, ఎస్.సి.ఆర్ 52 (1963) వర్సెస్ వెస్ట్ బెంగాల్ కేసులో ఇలా తీర్పు చెప్పింది:''The allegations made in the complaint, do clearly constitute a cognijable offence, and this does not call for the extrordinary or inherent powers of the high court to quash the FIR itself (307 B)'' అలాగే, సుప్రసిద్ధ దివంగత సుప్రీం న్యాయమూర్తి వీఆర్ కృష్ణయ్యర్ మొత్తం న్యాయ వ్యవస్థ నైతిక స్థాయి గురించి అత్యున్నత స్థాయి హై పవర్ కమిషన్ను నియమిస్తే, ఆ విచారణ ఫలితం షాకింగ్గా ఉంటుందని చెబుతూ ఇలా అన్నారు: ‘సామాజికంగా న్యాయవ్యవస్థకు ఉండాల్సిన సహనశక్తీ, దమ్ము, నైతిక స్థాయి, స్వతంత్రంగా వ్యవహరించగల సత్తా దిగజారిపోయినప్పుడు– ఎలాంటి సామాజిక విప్లవమూ రాజాలదు. ఎందుకంటే, ఆర్థిక తాత్విక దృక్పథంగానీ, లేదా సాంఘికాభ్యున్నతిని సాధించాలన్న తపనగానీ, న్యాయవ్యవస్థకు కొరవడితే అది ప్రయోజనకర సంస్క రణలకు, ప్రజలను కార్యోన్ముఖులను చేయడానికి, ఎప్పటికప్పుడు ఆధునిక ప్రాపంచిక దృక్పథం వైపునకు న్యాయవ్యవస్థను నడిపిం చడం సాధ్యపడదు. కనుకనే న్యాయవ్యవస్థలో నైతిక సత్తా దీపించాలి. (జస్టిస్ కృష్ణయ్యర్: ‘లీగల్ స్పెక్ట్రమ్’ 2011, పే:197). అందువల్ల, గత సర్కారు నిర్ణయాలను సమీక్షించే సంపూర్ణాధి కారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి, కేంద్రం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పే వాదనలు వినాల్సిన అవసరం లేదంటూ ప్రకటించడం ఏ రకమైన పాలసీ కిందకు లేదా న్యాయ సూత్రాల కిందకు వస్తుందో మనకు తెలియడం లేదు. ఈ వాదనే నిజమనుకుని నమ్మాల్సి వచ్చే పక్షంలో– భారత సెక్యులర్ రాజ్యాంగాన్ని కనీసం మాటవరకైనా గౌరవించి వ్యవహరిస్తూ వచ్చిన కాంగ్రెస్ విధానాలను మార్చి ‘దారి మార్చకుండానే దిక్కుమార్చిన’ బీజేపీ విధానాలను ఏమని పిలవాలి? టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ను.. అల్లుడి పేరుతో ఇంట్లోకి చేరిన చంద్రబాబు అర్థాంత రంగా ‘కడతేర్చి’ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ‘బిల్మక్తా’గా, చుప్తాగా ఎన్టీఆర్ అంతకుముందు చేపట్టి అమలు చేస్తున్న కొన్ని కీలకమైన ప్రజా సంస్కరణలను శంకరగిరి మాన్యాలు పట్టించినప్పుడు ఏ ‘సంపూర్ణాధికారం’ చెలాయించగలిగాడు? ఏ న్యాయస్థానం ఆ ‘సంపూర్ణాధికారాన్ని’ అడ్డుకోగలిగింది? కాకపోతే ఈ కప్పలతక్కిడి రాజకీయాలకూ కృష్ణయ్యర్ ఆశిం చినట్టు సామాజిక పరిస్థితులను మూలమట్టుగా కుదిపి, కదిపే సాంఘిక విప్లవాలకు, వాటి పర్య వసానంగా ఆవిష్కరించుకునే రాజ కీయ పరిణామాలకూ చాలా తేడా ఉంది. ఇది న్యాయస్థానాలు సకాలంలో గుర్తించి జాగ్రత్తపడకపోతే ఆ లోపాన్ని, న్యాయస్థానాల రూపాన్ని సరిదిద్దుకోలేవు. ఢిల్లీలో సిక్కుల ఊచకోతను, గుజరాత్లో మైనారిటీల ఊచకోతనూ నిలువరించడంలో విఫలమైన జస్టిస్ ఆర్.ఎన్. మిశ్రాను, సుప్రీం మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎమ్. సిక్రీ నిశితంగా విమర్శించగా, గుజరాత్ ఊచకోతపై న్యాయస్థానాల వైఖరిపట్ల సుప్రీంకోర్టు ప్రత్యేక సలహా దారుగా ఉన్న ప్రసిద్ధ న్యాయ వాది రాజు రామచంద్రన్ పాతిక– ముప్పయి పేజీల డిస్సెంట్ పత్రం సమర్పించాల్సి వచ్చింది. అంతే గాదు, 1950–1989 మధ్య సుప్రీం న్యాయమూర్తులు కొంతమందిమీద తన పరిశోధనా ఫలితాల్ని నమోదు చేస్తూ జార్జి హెచ్ గ్యాడ్ బోయి వేసిన అంచనాలో ‘భారత దేశంలో కమీషన్లు కొట్టే సంస్కృతి ఉందనే ఒక సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చెప్పారని ఈ కమీషన్ల సంస్కృతి సంస్థాగత సంప్రదాయంగా ఉందని.. ఇది రాజకీయ సంస్కృతిలో పాతుకుపోయిందని రాశాడు. రిటైర్మెంట్ తర్వాత ‘క్విడ్ ప్రోకో’ (ఇచ్చిపుచ్చుకునే) సంస్కృతి కూడా ప్రభుత్వాలకు, జడ్జీలకు మధ్య స్థిరపడి ఉందనీ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ప్రసిద్ధ హిందీ వ్యంగ్య రచయిత హరిశంకర్ పర్యాయి గుర్తు చేసిన మాటలు వెన్నాడుతున్నాయి: ‘ఎన్నడైనా నిజాయితీపరుడైనవాడు గెలిచిన కేసేదైనా ఉందా? దుర్యోధనుడికి గెలిచి తీరుతానన్న దమ్ము ఎలా వచ్చింది? డబ్బు మదంవల్ల! ఎందుకంటే డబ్బు అనేది పైకి కనిపిస్తుంది. కానీ, దాన్ని దేవుడనే వాడొక్కడే చూడగల్గుతాడుగానీ అతడికి నిజం అయినా, సత్యమైనా కన్పించదు’’. -ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
భూ దోపిడీపై నిగ్గు తేల్చండి
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ హయాంలో రాజధాని అమరావతిలో వేల ఎకరాల భూ దోపిడీకి పాల్పడటంపై సీబీఐతో దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. పార్టీ ఎంపీలు ఆదివారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నానిర్వహించి ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్సభాపక్ష నేత పీవీ మిథున్రెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్చంద్రబోస్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వల్లభనేని బాలశౌరి, బీవీ సత్యవతి, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి, కోటగిరి శ్రీధర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రూ.40 వేల కోట్లకుపైగా దోపిడీ: ఎంపీ కోటగిరి శ్రీధర్ ► ప్రతి ఇంటికీ పథకాల లబ్ధి చేకూరుస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ 15 నెలలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోంది. వలంటీర్ వ్యవస్థ ద్వారా పాలనను సామాన్యుడి చెంతకే చేర్చింది. మేం రాజకీయాల్లోకి వచ్చి మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచాం. వైఎస్సార్సీపీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం. ప్రజలంతా మమ్మల్ని ఎంతో అభిమానిస్తున్నారు. ► 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అనుభవం ఏపాటిదో ఇప్పుడు కనబడుతోంది. ఆ అనుభవం మతవిద్వేషాలను రెచ్చగొడుతోంది. బీజేపీలో ఉన్న తన సన్నిహితులతో రెచ్చగొట్టేలా మాట్లాడిస్తున్నారు. అమరావతిలో 4 వేల ఎకరాలను తన సొంత మనుషులకు, అప్పటి అడ్వొకేట్ జనరల్కు, జడ్జిల కుటుంబ సభ్యులకు పంచిపెట్టారు. భూముల కుంభకోణంలో రూ. 40 వేల కోట్ల మేర దోపిడీ జరిగింది. ఎవరికి ఎన్ని భూములు ఉన్నాయి? ఎక్కడ కొన్నారు? రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేశారన్న విషయాన్ని సీబీఐ దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలి. ► చంద్రబాబు అధికారంలో ఉండగా వైఎస్సార్సీపీ నుంచి ముగ్గురు ఎంపీలను తీసుకెళితే ఎన్నికల్లో ఆయనకు ముగ్గురే మిగిలారు. వచ్చే ఎన్నికల్లో మీకు ఒక్క ఎంపీ మాత్రమే మిగులుతారు. ► రికార్డు స్థాయిలో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించి అత్యధిక సీట్లు గెల్చుకున్నా.. ప్రతి విషయానికి కోర్టులు అడ్డుపడుతున్నాయి. వైఎస్సార్ సీపీ సామాన్యుడి కోసం పుట్టిన పార్టీ. అభివృద్ధి పనులతో ప్రజల మనసులను గెలుచుకుంటాం. ప్రజలు అంతా గమనిస్తున్నారు: మోపిదేవి వెంకట రమణారావు ► అమరావతిలో భూముల అక్రమాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో నిలదీశారు. వీటిని వెలుగులోకి తెచ్చేందుకు అధికారంలోకి వచ్చాక కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. దర్యాప్తుల్లో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ► వాస్తవాలు బయటి ప్రపంచానికి తెలియకూడదని సాక్షాత్తూ న్యాయస్థానం నిబంధన విధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతవరకు సమంజసం? పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే స్టే, సామాన్యుడు ఇంగ్లిష్ అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తే దానిపై స్టే, రాజధాని భూముల కుంభకోణంపై దర్యాప్తుజరగకుండా స్టే.. ఇలా ఏ పనిచేసినా స్టే వస్తోంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. తప్పు చేయబట్టే అడ్డుకుంటున్నారు: వల్లభనేని బాలశౌరి చంద్రబాబు మొదటి నుంచి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బతుకుతున్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి అన్ని స్కాముల్లో ఇదే వైఖరి. ఏ తప్పు చేయనప్పుడు, దర్యాప్తు నిలిపివేయమని అడగాల్సిన పని ఏముంది? తప్పు చేశారు కాబట్టే అడ్డుకుంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఎన్నో రోజులు కుదరదు. రాష్ట్ర ప్రజలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. దర్యాప్తు జరిపే వరకు పార్లమెంటులో నిరసన వ్యక్తంచేస్తూనే ఉంటాం. -
మీ గ్యాగ్ ఆర్డర్ను సవరించండి
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇద్దరు కుమార్తెలపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని వివరాలను పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో ప్రచురించడం లేదా ప్రసారం చేయరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది గలేటి మమత రాణి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అంతేకాక.. అమరావతి భూ కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చుకుని, తమ వాదనలు వినాలని మమత రాణి తన అనుబంధ పిటిషన్లో కోర్టును కోరారు. ఆంక్షలతో పౌరుల హక్కులకు భంగం అధికరణ–19 ప్రకారం.. ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ అత్యంత పవిత్రమైన హక్కుగా రాజ్యాంగం గుర్తించిందని మమత రాణి తన అనుబంధ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పవిత్ర హక్కులో మీడియా హక్కులు కూడా మిళతమై ఉన్నాయన్నారు. ఈ హక్కులను కాలరాసే విధంగా పూర్తిస్థాయి ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేయడంవల్ల రాజ్యాంగంలోని అధికరణ–19(1) (ఏ) ద్వారా పౌరులకు సంక్రమించిన హక్కులకు భంగం కలిగించడమేనని ఆమె వివరించారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు రాజ్యాంగం ప్రకారం అపరిమితమైనది కాదని.. అధికరణ–19(2) కింద రాజ్యాంగం ఆ హక్కుపై కొన్ని పరిమితులు విధిస్తోందని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ కేసులో పూర్తిస్థాయి నిషిద్ధ ఉత్తర్వులు జారీచేయడం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులకు విఘాతం కలిగించడమే అవుతుందని.. న్యాయస్థానాలు ఇలా చేయడానికి వీల్లేదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును పలు న్యాయస్థానాల తీర్పులు సమర్థించాయని వివరించారు. ప్రజాస్వామ్య మనుగడకు మీడియా హక్కులు ఎంతో అవసరమని ఆమె తెలిపారు. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వులవల్ల తన హక్కులు ఎంతో ప్రభావితం అయ్యాయన్నారు. అందువల్ల ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలను వినాలని ఆమె కోర్టును కోరారు. అలాగే, ఈ ఏడాది జనవరి 10న ‘అనురాధా భాసిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును మమత రాణి తన వ్యాజ్యంలో ప్రస్తావించారు. పత్రికా స్వేచ్ఛపై జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఏం చెప్పిందంటే.. ప్రజాస్వామ్యంలో పత్రికలు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు ఉండాలి. స్వేచ్ఛాయుత హక్కు రాజ్యాంగం ప్రసాదించిన అత్యంత పవిత్రమైన హక్కు. ఈ హక్కులను ప్రభుత్వాలతో సహా అందరూ గౌరవించాలి. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల ప్రాచుర్యం ఎంతగానో పెరిగింది. పత్రికలను అడ్డుకుంటే సమాచార వ్యాప్తికి అడ్డుకట్ట వేసినట్లే. భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఇంటర్నెట్ వినియోగం వంటి స్వేచ్ఛలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. రాజ్యాంగంలోని అధికరణ–19 ప్రకారం.. ప్రాథమిక హక్కుల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఒకటి. దీని ద్వారా అతి ఎక్కువ మందికి తక్కువ కాలంలో సమాచారాన్ని చేరవేసే సౌలభ్యం ఉంది. దాన్ని మేం కాదనడంలేదు. వివిధ సాకులు, కారణాలు చూపి, ఆ సౌలభ్యాన్ని కాలరాయడానికి వీల్లేదు. పత్రికా స్వేచ్ఛను కూడా ప్రభుత్వాలు కాపాడాలి. జర్నలిస్టులు తమ విధులను నిర్వర్తించుకునేందుకు అవకాశం ఇవ్వాలి. -
అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి భరతం పట్టడానికి సహకరించాల్సింది పోయి, కుంభకోణాలకు పాల్పడిన వారిని వెనకేసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడం న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయేలా చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పేరుతో సాగిన కుంభకోణంపై ఆధారాలతో ఏసీబీ కేసు నమోదు చేస్తే దర్యాప్తు ఆపేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. నిందితుల జాబితాలో పెద్దల పేర్లు ఉండటమే ఇందుకు కారణమా అని నిలదీశారు. కేంద్రం తక్షణం స్పందించి అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరారు. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును నిరసిస్తూ శనివారం వైఎస్సార్సీపీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధాన మంత్రి తక్షణం స్పందించాలి : పిల్లి సుభాష్ చంద్ర బోస్ – ఆంధ్రప్రదేశ్లో జరిగిన అమరావతి భూముల కుంభకోణం, ఫైబర్నెట్ కుంభకోణం, అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటనకు సంబంధించి తప్పుడు ప్రచారంపై మూడు రోజులుగా వైఎస్సార్సీపీ ఎంపీలం పార్లమెంటులో ధర్నా చేస్తున్నాం. – ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తక్షణం స్పందించాలి. అమరావతిలో భూకుంభకోణం జరిగింది. న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇవి వాస్తవమా కాదా నిర్ధారించడం కోసం వెంటనే సీబీఐ దర్యాప్తుకు, విభాగ సంబంధిత దర్యాప్తుకు అదేశించాలి. – ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన న్యాయమూర్తులను పదవుల నుంచి తొలగించినట్లయితే చక్కని సందేశాన్ని ఇచ్చిన వారవుతారు. అమరావతి భూసేకరణ ఒక పెద్ద కుంభకోణం. అయిన వారికి లీకులు ఇచ్చి భూములు కొనేలా చేశారు. – ఇందులో అప్పటి మంత్రులు, న్యాయ వ్యవస్థలోని ప్రముఖులు, వాళ్ల కుటుంబీకులు ఉన్నారు. ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ప్రజలు పిటిషన్ వేయకపోయినా.. హైకోర్టుగానీ, సుప్రీంకోర్టు గానీ తనంతట తానే కేసులను చేపట్టి విచారణ జరిపిన సందర్భాలు దేశంలో కోకొల్లలు. – కానీ ఇక్కడ 13 మంది న్యాయమూర్తులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. తమ ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా న్యాయమూర్తులు వాటిని స్వీకరించారు. – కోర్టులపై వ్యాఖ్యానించడం నా ఉద్దేశం కాదు. ఒక అధికారి మీదనో, ప్రజాప్రతినిధి మీదనో ఆరోపణలు వచ్చినప్పుడు సూమోటోగా కేసులు చేపట్టి దర్యాప్తుకు ఆదేశించే న్యాయస్థానాలు.. న్యాయమూర్తులపై ఆరోపణలు వస్తునప్పుడు, పార్లమెంటు సభ్యులు ధర్నాలు జరుపుతూ మీడియా ద్వారా వాటిని యావత్ ప్రపంచం దృష్టికి తెస్తున్నప్పుడు దీనిపై దర్యాప్తు ఎందుకు జరపడం లేదు? – భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా బతికి ఉందని మేమంతా నమ్ముతున్నాం. న్యాయస్థానాలు ఎలా çస్పందిస్తాయా అని ఆం«ధ్రప్రదేశ్లో సాధారణ ప్రజలు కూడా గమనిçస్తున్నారు. దయచేసి అక్రమాలపై దర్యాప్తు జరిపించండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తుంటే హైకోర్టు స్టే విధించింది. పేదలు మీ నివాస ప్రాంతాలకు సమీపంలో నివసించడానికి అనర్హులా? ఇదేనా సమానత్వం? – అంతర్వేదిలో మత కలహాలు రెచ్చగొట్టడానికి కొందరు ప్రయతిస్తున్నారు. దివంగత సీఎం వైఎస్సార్, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్లకు కుల మత బేధాల్లేవు. వారికి అందరు సమానులే. దర్యాప్తు ఎందుకు ఆపేయాలి? : మోపిదేవి – న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులు వివాదాస్పదంగా ఉన్నాయి. అశేష ప్రజాభిమానంతో ముఖ్యమంత్రిగా గెలిచిన జగన్మోహన్రెడ్డి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కానీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల పట్ల న్యాయస్థానం స్పందిస్తోన్న తీరు వివాదాస్పదంగా ఉంది. అమరావతి రాజధాని కోసం జరిగిన భూసేకరణలో అవకతవకలపై సమగ్ర న్యాయ విచారణ జరగాలి. – చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక లాండ్ పూలింగ్ పేరుతో పచ్చని పంట పొలాలను బడుగు బలహీన వర్గాల వారి నుంచి సేకరించారు. ఇందులో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. నాడు ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్ ఈ స్కాం గురించి అనేక సార్లు లేవనెత్తారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తున్నారు. ఇందులో తప్పేముంది? ఎందుకు దర్యాప్తు ఆపేయాలి? – గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పునఃసమీక్ష జరపడానికి వీల్లేదనడం విచారించదగిన విషయం. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. సీబీఐ విచారణకు ఆదేశించాలి. ఆధారాలు ఉన్నందునే కేసు నమోదు : ఆయోధ్య రామిరెడ్డి – అవకతవకలు జరిగాయని ప్రాథామిక ఆధారాలు ఉన్న వాటిపైనే దర్యాప్తు జరుపుతున్నారు. తప్పులు జరగలేదనుకుంటే దర్యాప్తు జరగనివ్వండి. నిజానిజాలు తేలుతాయి కదా. – రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేయాలనుకున్నా న్యాయస్థానాల ద్వారా మోకాలడ్డుతున్నారు. ప్రభుత్వాన్ని పని చేయనీయడం లేదు. టీడీపీ ప్రభుత్వం చేసిన ప్రతి పనిపై మా ప్రభుత్వం దర్యాప్తు జరపడం లేదు. – అమరావతిలో భూ అక్రమాలు, ఏపీ ఫైబర్నెట్ కుంభకోణం, అంతర్వేదిలో రథం దగ్ధం.. ఈ మూడింటిపై నిష్పక్షపాతంగా న్యాయ విచారణ జరపాలి. శక్తిమంతులకు మేలు చేస్తున్నట్లుంది : లోక్సభ జీరో అవర్లో కృష్ణదేవరాయలు – అమరావతిలో రైతుల ప్రయోజనాలకు రక్షణ కల్పించాల్సింది పోయి, హైకోర్టు శక్తిమంతులకు మేలు చేసినట్టుగా కనిపిస్తోంది. అమరావతి భూముల కుంభకోణంలో నిష్పాక్షిక విచారణ జరగాలి. – ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దర్యాప్తును నిలిపివేయడమే కాకుండా.. ఎఫ్ఐఆర్లో మాజీ అడ్వకేట్ జనరల్, ఇతర పలుకుబడి కలిగిన పెద్దల పేర్లు ఉన్నందున మీడియా ఆయా వివరాలు ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తగదు. సామాన్యుడైనా, మాజీ అడ్వకేట్ జనరల్ అయినా చట్టం పరిధిలో అందరూ సమానమే. – ధర్నాలో వైఎస్సార్సీపీ లోక్సభా పక్ష నేత పీవీ మిథున్రెడ్డి, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్, బీవీ సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, కోటగిరి శ్రీధర్ పాల్గొన్నారు.