సుపరిపాలనే తమ ప్రధాన ఎజెండా అని, ఈ నినాదంతోనే ముందుకెళతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
న్యూఢిల్లీ: సుపరిపాలనే తమ ప్రధాన ఎజెండా అని, ఈ నినాదంతోనే ముందుకెళతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. స్వావలంబన, ఆర్థిక స్థిరత్వమున్న దేశాభివృద్ధే తమ లక్ష్యమన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ రోజు చరిత్రాత్మకమైందని వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లవిరిసిందన్నారు. దేశ చరిత్రలో అత్యధిక ఓట్లు నమోదు కావడం ఇదే ప్రథమం అన్నారు. పది రాష్ట్రాల్లో బీజేపీ సంపూర్ణ విజయం సాధించిందని చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో ఎక్కువ స్థానాలు సాధించామని వెల్లడించారు.