మ.2.15గంటలకు రేవంత్ బెయిల్పై విచారణ | again Revanth Reddy's bail petition case adjourned today afternoon 2.15 | Sakshi

మ.2.15గంటలకు రేవంత్ బెయిల్పై విచారణ

Jun 26 2015 11:54 AM | Updated on Aug 31 2018 8:24 PM

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది.

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. కేసు విచారణను హైకోర్టు ఈరోజు మద్యాహ్నం 2.15 గంటల వరకూ వాయిదా వేసింది. తెలంగాణ అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేనందున కేసు విచారణను వాయిదా వేసినట్లు సమాచారం. దీంతో రేవంత్ బెయిల్ పిటిషన్ పై విచారణ రెండుసార్లు వాయిదా పడింది. కాగా ఈ  నెల 5వ తేదీన ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డికి బెయిల్ నిరాకరించింది. దాంతో ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement