breaking news
First Phase Counselling
-
ఇంజనీరింగ్ సీట్లు పెరగవా?
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్లో కొత్త సీట్లపై నెలకొన్న పేచీ ఇప్పట్లో తేలేట్టు లేదు. తొలి దశ కౌన్సెలింగ్ ముగిసే నాటికి దీనిపై స్పష్టత రావడం కష్టమని అధికార వర్గాలే అంటున్నాయి. దీంతో మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం డొనేషన్ కట్టిన విద్యార్థుల్లో ఆందోళన కన్పిస్తోంది. సీట్లు వస్తా యో? రావో? తెలియని అయోమయ స్థితిలో పలువురు తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు వంద కాలేజీలు ఈ ఏడాది సీట్ల పెంపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇతర బ్రాంచీలు తగ్గించుకుని కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని కోరాయి. కొత్తగా వచ్చేవి 10 వేలు, బ్రాంచీ మార్పుతో వచ్చే సీట్లు మరో పది వేలు... మొత్తంగా 20 వేల సీట్లు పెరుగుతాయని కాలేజీలు ఆశించాయి. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సులే. ఇప్పట్లో అనుమతి లేనట్టేనా?బ్రాంచీల మార్పు, కొత్త సెక్షన్లకు ప్రైవేటు కాలేజీలు చేసిన దరఖాస్తులను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించింది. కానీ రాష్ట్రంలోని వర్సిటీలు మాత్రం అనుమతించేందుకు వెనుకాడుతున్నాయి. తొలి విడత కౌన్సెలింగ్లో 173 కాలేజీల్లోని 98,296 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటా కింద 70,307 సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. వీటిల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్ గ్రూపుతో పాటు, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఆరిï్టœíÙయల్ ఇంటెలిజెన్స్ సహా పలు కంప్యూటర్ కోర్సుల్లోని సీట్లే 48 వేలున్నాయి. ఎల్రక్టానిక్స్–కమ్యూనికేషన్లో 9618, ఎలక్ట్రికల్లో 3602, మెకానికల్లో 2499 సీట్లు ఉన్నాయి. గత ఐదేళ్లతో పోలిస్తే ఈ బ్రాంచీల్లో సగటున 50 శాతం సీట్లు తగ్గాయి. ఇప్పుడు మొత్తం కంప్యూటర్ కోర్సులనే అనుమతిస్తే భవిష్యత్లో సంప్రదాయ కోర్సులే ఉండే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పంపిన నివేదికలోనూ ఇదే అంశాన్ని అధికారులు ప్రస్తావించినట్టు తెలిసింది. మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, సివిల్ కోర్సులు చేసినప్పటికీ సాఫ్ట్వేర్ అనుబంధ అప్లికేషన్లు ఆన్లైన్లో నేర్చుకోవచ్చని, సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు వెళ్లే అవకాశం ఉందని వర్సిటీలు భావిస్తున్నాయి. ఈ కారణంగానే ఆ బ్రాంచీల రద్దును అంగీకరించేందుకు వర్సిటీ అధికారులు ఏమాత్రం ఇష్టపడటం లేదు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ఈ కారణంగానే కొత్తగా రావాల్సిన 20 వేల సీట్లు తొలి కౌన్సెలింగ్లో ఇప్పటికీ చేర్చలేదని చెబుతున్నారు. ఫ్యాకల్టీ ఎక్కడ...? సీఎస్ఈని సమర్థవంతంగా బోధించే ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉందని అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఉన్న సెక్షన్లకు బోధకులు సరిపోవడం లేదని, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ బ్రాంచీలు బోధించే వారితో క్లాసులు చెప్పిస్తున్నారని తనిఖీ బృందాలు పేర్కొంటున్నాయి. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ కోర్సులకు ఇప్పటికీ ప్రత్యేక శిక్షణ పొందిన వాళ్లు లేరని అధికారులు అంటున్నారు. వివిధ రంగాల్లో నిపుణులైన సాఫ్ట్వేర్ నేపథ్యం ఉన్న ఉద్యోగుల చేత, లేదా కొన్ని చాప్టర్స్ను ఆన్లైన్ విధానంలో ఎన్ఆర్ఐల చేత బోధించే వెసులుబాటు కల్పించినప్పటికీ ఎవరూ ముందుకు రావడం లేదని తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సెక్షన్లు, కంప్యూటర్ సీట్ల పెంపునకు అనుమతించడం సరైన విధానం కాదని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్టు ఓ అధికారి చెప్పారు. ముగిసిన స్లాట్ బుకింగ్... ఆప్షన్లే తరువాయి తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కు గురువారంతో స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగి సింది. ఇప్పటి వరకూ 97,309 మంది రిజి్రస్టేష న్ చేసుకున్నారు. 33,922 మంది 16,74,506 ఆప్షన్లు ఇచ్చారు. కొంత మంది అత్యధికంగా 942 ఆప్షన్లు ఇచ్చారు. ఈ నెల 15వ తేదీతో ఆప్షన్లు ఇచ్చే గడువు ముగుస్తుంది. ఈ తేదీనాటికి మరికొన్ని ఆప్షన్లు వచ్చే వీలుందని తెలుస్తోంది. ఆప్షన్లు ఇచ్చిన వాళ్లలో 78 శాతం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచీకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికీ కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరుగుతాయనే విద్యార్థులు భావిస్తున్నారు. పెరిగే సీట్లపై అధికారులు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని, అప్పుడే ర్యాంకును బట్టి ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. -
జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి వచ్చే నెల 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన తేదీలను ఉన్నత విద్య మండలి శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకూ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (టీఎస్ఈఏపీ సెట్) ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ సెట్ ఫలితాలను ఈ నెల 18న విడుదల చేశారు.సెట్లో అర్హత సాధించిన వారికి కాలేజీల్లో కన్వీనర్ కోటా పరిధిలో ఉండే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్ తేదీ లపై ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పలువురు ఉన్నతాధికారులు సమావేశయ్యా రు. అనంతరం షెడ్యూల్ను విడుదల చేశారు. 12 నుంచి స్లైడింగ్... ఒకే కాలేజీలో వివిధ బ్రాంచ్లు మారాలనుకునే వారు ఆగస్టు 12, 13 తేదీల్లో స్లైడింగ్కు దరఖాస్తు చేసుకోవాలి. ఆప్షన్లను 13వ తేదీ ఫ్రీజ్ చేస్తారు. 16 న సీట్ల కేటాయింపు ఉంటుంది. 17వ తేదీలోగా విద్యార్థులు స్లైడింగ్లో కేటాయించిన బ్రాంచ్కు అంగీకరిస్తున్నట్టు రిపోర్టు చేయాలి. జూన్ 8 నుంచి ఈ–సెట్ కౌన్సెలింగ్ డిప్లొమా కోర్సులు చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈ–సెట్లో ఉత్తీర్ణులైన వారికి జూన్ 8 నుంచి కౌన్సెలింగ్ చేపడుతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కూడా ఉన్నత విద్యా మండలి శుక్రవారం విడుదల చేసింది.కౌన్సెలింగ్ తేదీలు ఇలా... -
27 నుంచి ఎన్జీరంగా వర్సిటీలో కౌన్సెలింగ్
సాక్షి,హైదరాబాద్: వ్యవసాయ పాలిటెక్నిక్, అగ్రికల్చర్,హార్టికల్చర్ వెటర్నరీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటివిడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరోసారి సిద్ధమైంది. ఈ నెల 27నుంచి 31 వరకు పాలిటెక్నిక్ కోర్సులకు, సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం రాష్ట్రం మొత్తంమీద 10 ఆన్లైన్ వెబ్కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీమాంధ్ర ప్రాంతంలోని తిరుపతి వ్యవసాయ కళాశాల, కర్నూలులోని నంద్యాల వ్యవసాయ పరిశోధనా కేంద్రం, గుంటూరు బాపట్ల వ్యవసాయ కళాశాల, తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ కళాశాల, అనకాపల్లి వ్యవసాయపరిశోధనా కేంద్రం, కడపలోని ప్రొద్దుటూరు పశువైద్యకళాశాల, కృష్ణాజిల్లాలోని గన్నవరం పశువైద్య కళాశాల, తెలంగాణలో ఏజీ వర్సిటీ సెంట్రల్ లైబ్రరీ, కరీంనగర్లోని జగిత్యాల వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వరంగల్లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు వెబ్కౌన్సిల్ కేంద్రాలకు ఎంపిక చేశారు. కౌన్సెలింగ్ తేదీలు : పాలిటెక్నిక్ కోర్సులకు 10వ,తరగతి గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) అనుసరించి ఈ నెల 27న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన అన్ని కేటగిరీలకు 30న ఆంధ్రా, ఉస్మానియా, వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో కౌన్సెలింగ్ ఉంటుంది. పై రోజుల్లో హాజరుకాని అభ్యర్థులు 31న హాజరు కావచ్చని వర్సిటీ అధికారులు తెలిపారు. యూజీ కోర్సులైన అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సులకు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 4 వరకు ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పై మూడు రోజులలో హాజరుకాని అభ్యర్థులు 5న కౌన్సెలింగ్కు హాజరు కావొచ్చు. అభ్యర్థులు వెబ్ కౌన్సెలింగ్ కేంద్రాలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో ఉదయం 9 గంటలలోపు హాజరు కావాలని ఎన్జీరంగా వర్సిటీ ఉపకులపతి ఎ.పద్మరాజు సూచించారు.