breaking news
indian bison
-
ఇలాగేనా రెస్క్యూ?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ఓ అడవిదున్న తప్పిపోయి వచ్చింది. అయితే దాన్ని సజీవంగా పట్టుకునేందుకు చేసిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. పది రోజులపాటు ఈ దున్న కదలికలను ఆ జిల్లా పరిసరాల్లో అటవీశాఖ అధికారులు గుర్తించినా, జీవించి ఉండగా పట్టుకోలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే జాతికి చెందిన ఆ అడవిదున్న (ఇండియన్ బైసన్) మృతి చెందడం పట్ల పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తంచేశారు. అరుదైన జంతువులు, వన్య›ప్రాణులను రక్షించాల్సిన అటవీశాఖ సన్నద్ధత, సంసిద్ధత, పరిమితులను ఈ ఘటన స్పష్టం చేస్తోందంటున్నారు. గతంలోనూ ఓ చిరుత, కొన్ని జంతువుల రెస్క్యూలో అటవీ అధికారులు, సిబ్బంది విఫలమైన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. రెస్క్యూలో అటవీశాఖకు ఓ స్పష్టమైన విధానం, కార్యాచరణ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ఆపదలో ఉన్న జంతువులు, వన్యప్రాణులను కాపాడేందుకు, వెంటనే స్పందించేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ) ఏర్పాటు చేస్తున్నామంటూ గతంలో చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అసలేం జరిగిందంటే..మేత, నీటికోసం వెతుక్కుంటూ దారితప్పిన దున్న చౌటుప్పల్ మండలం చిన్నకోడూరు గ్రామ సరిహద్దుల్లో కొందరికి కనిపించింది. ఎక్కడ జనవాసాల్లోకి వస్తుందోననే భయంతో దాన్ని బైక్లు, ఇతర వాహనాలపై నాలుగు గంటలపాటు వెంబడించారు. అప్పటికే ఆకలి, దప్పికతో ఉన్న దున్న పరిగెడుతూ డీ హైడ్రేషన్కు గురైంది. నోటి నుంచి నురగలు కక్కుతూ దయనీయస్థితికి చేరింది. దాన్ని రక్షించి, వైద్యం అందించి సురక్షిత ప్రాంతానికి తరలించే రెస్క్యూ టీమ్ అక్కడికి ఆలస్యంగా చేరుకుంది. వరంగల్ జూ నుంచి రెస్క్యూ టీమ్, నెహ్రూ జూపార్కు నుంచి వచ్చిన వెటరేరియన్ మత్తుమందు ఇచ్చి దున్నను నిలువరించే ప్రయత్నం చేశారు. వాహనంలోకి ఎక్కించి దానిని చికిత్స కోసం తరలిస్తున్న క్రమంలో అది అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు.ఉన్నవి రెండు బృందాలే..రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్లోని నె హ్రూ జూపార్క్, వరంగల్లోని కాకతీయ జూపార్క్లో తాత్కాలిక ఏర్పాట్లతో రెండు బృందాలు పనిచేస్తున్నాయి. వీటికి రెస్క్యూ వెహికిల్స్, వెటరేరియన్లు ఉన్నా రు. రాష్ట్రంలో ఎక్కడ వన్యప్రాణులు, అటవీ జంతువులను కాపాడాల్సి వచ్చి నా.. ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటే అక్కడి నుంచి వాహనం, సిబ్బందిని పంపిస్తున్నారు. అయితే ఈ బృందాలు పాత బడిన వాహనాలు, పరికరాలు, సామగ్రి తోపాటు ఏవో తాత్కాలిక పద్ధతులతో నెట్టుకొస్తున్నాయి. ఇప్పుడేం చేయాలి?» రాష్ట్రంలో వన్యప్రాణులు, జంతువు లకు సంబంధించి ఎక్కడైనా అనుకో ని సంఘటన లేదా ఆపద ఎదురైనా, అడవుల్లో అగ్నిప్రమాదాల వంటి ఘ టనలు జరిగినా త్వరితంగా స్పందించేలా బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలి. » పాతబడిన వాహనాలను తొలగించి, కొత్త వాహనాలను అందుబాటులోకి తేవాలి. ట్రాంకిలైజర్ గన్స్, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచాలి. » రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేయాలి. » జంతువుల తీరుపై వెటర్నరీ డాక్టర్లకు శిక్షణ ఇచ్చి తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించాలి. -
వైరల్: నిన్ను కూడా క్వారంటైన్కు పంపిస్తారు
సాక్షి, బెంగళూరు : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వడంతో రోడ్లన్నీ బోసిపోతున్నాయి. నిత్యం జనాలతో కిక్కిరిసిపోయే రహదారులన్నీ ఎవరూ లేక వెలవెలపోతున్నాయి. ఈ నేపథ్యంలో జన సంచారంలోకి రావడానికి బయపడే జంతువులు సైతం ధైర్యంగా రోడ్లపైకి వచ్చి స్వైర విహారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ దున్నపోతు వార్తల్లో నిలిచింది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయనుకుందో లేక అడవిలో తిరిగి బోర్ కొట్టిందేమో.. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. ఖాళీగా ఉన్న రోడ్లు చూసి ఆశ్చర్యపోయి.. రోడ్డుపై సుకుమారంగా నడుచుకుంటూ అలా వెళ్లిపోయింది. (కరోనా : చైనాను అధిగమించిన అమెరికా) దేశంలోనే అడవి దున్నపోతులు ఎక్కువగా ఉండే మలబార్ సివెట్లోని దున్నపోతు కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లా మార్కెట్ ప్రాంతలో షికార్లు చేసింది. దీంతో రోడ్లపై ఉన్న కొంత మంది ప్రజలు కూడా పక్కకు తప్పుకొని దానికి దారిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను భారత అటవీశాఖ అధికారి సుశాంత నంద సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ‘ఇండియన్ బిసోన్ (అడవి దున్నపోతు) వాకింగ్కు రోడ్లపైకి వచ్చింది. అతిపెద్ద బోవిన్.. దక్షిణ, ఆగ్నేయాసియాకు చెందినది. చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. బయట అరుదుగా కనిపిస్తుంది’ అనే క్యాప్షన్తో ట్విటర్లో షేర్ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్త! పోలీసులు చూస్తే నిన్ను కూడా క్వారంటైన్కు తరలిస్తారు. అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. -
తెలంగాణ రాష్ట్ర జంతువుగా అడవిదున్న!
అటవీశాఖ ఆమోదం..సీఎంవోకు చేరిన ఫైలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జంతువుగా అడవిదున్న ఖరారైంది. దీనికి సంబంధించిన ఫైలుపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న గురువారం సంతకం చేసి, ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించారు. ఇండియన్ బైసన్గా వ్యవహరిస్తున్న అడవిదున్న రాష్ట్ర జంతువుగా ఖరారు చేశారు. రాష్ట్ర పక్షిగా పాలపిట్ట (ఇండియన్ రోలర్)ను నిర్ణయించారు. రాష్ట్ర చెట్టుగా ఇప్పచెట్టును ప్రకటించనున్నారు. రాష్ట్ర పుష్పంగా మోదుగుపువ్వును ఖరారు చేశారు. వీటిని రాష్ట్ర అటవీశాఖ ఆమోదించి, సీఎం కేసీఆర్కు ఫైలును పంపించారు. అది సీఎం కార్యాలయానికి చేరింది. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్కు తిరిగి వచ్చిన వెంటనే వీటిని అధికారికంగా ప్రకటించనున్నారు.