breaking news
kameswar rao
-
'చేతకాకపోతే చంద్రబాబు తప్పుకోవాలి'
చీపురుపల్లి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాకపోతే ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు తప్పుకోవాలని సీపీఐ నేత కామేశ్వరరావు అన్నారు. శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి ఇంద్రజిత్సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా సీపీఐ జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోతే వెంటనే పదవి నుంచి తప్పుకోవాలన్నారు. జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు సీపీఐ పోరాటం చేస్తూనే ఉంటుందని ప్రకటించారు. -
ఏసీబీకి దొరికిన విద్యుత్ ఏడీఈ
మహబూబ్ నగర్ : ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట విద్యుత్తు ఏడీఈ కామేశ్వర్రావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రాందాస్తేజ కథనం ప్రకారం..పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన ఆవుల శ్రీశైలం 2012లో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీ చెల్లించాడు. ట్రాన్స్ఫార్మర్ మంజూరు కాలేదు. అయితే, సదరు డీడీ తాలూకు రసీదు ఎక్కడో పోయింది. కొన్నాళ్ల క్రితం ట్రాన్స్ఫార్మర్ కోసం శ్రీశైలం కొత్తకోటలో ఏడీఈ కామేశ్వర్రావును కలిశాడు. రూ.30వేలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేస్తానని పట్టుబట్టాడు. ఈ క్రమంలో ఇటీవల రూ.10వేలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఏడీఈ పై నిఘా వేశారు. బుధవారం కొత్తకోటలో రైతు నుంచి రూ.6 వేలు తీసుకుంటుండగా కామేశ్వర్రావును అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ సిబ్బంది రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. (కొత్తకోట)