Rajanna Sircilla District News
-
విద్య, వైద్యం అందించడమే లక్ష్యం
రుద్రంగి(వేములవాడ): పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు మెరుగైన ప్రభుత్వ ఉచిత విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగిలో నిర్మిస్తున్న 30 పడకల ఆస్పత్రి పనులను శుక్రవారం పరిశీలించారు. అనంతరం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని పరిశీలించి అధికారులకు ఫోన్చేసి త్వరగా తూకం వేయాలని సూచించారు. రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్రెడ్డి, తర్రె లింగం, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, గండి నారాయణ, పల్లి గంగాధర్, దువ్వాక గంగాధర్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు పేద ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక వేములవాడఅర్బన్: ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడఅర్బన్ మండలం చింతాల్ఠాణాలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
తాగి వాహనాలు నడపొద్దు
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్లక్రైం: మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరా రు. జిల్లాలో పది రోజుల వ్యవధిలో 77 మందిపై డ్రంకెన్డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో 46 మందికి జరిమానాలు, 31 మందికి జైలుశిక్ష ఖరారు చేసినట్లు వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయన్నారు. దీంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనాలకు బీమా చేయించుకోవాలన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
● జెడ్పీ సీఈవో గీత కోనరావుపేట(వేములవాడ): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని జెడ్పీ సీఈవో గీత కోరారు. కోనరావుపేట మండల పరిషత్లో కార్యదర్శులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులతో శుక్రవారం సమావేశమయ్యారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఇంకా ముగ్గులు పోసే దశలోనే ఉంటున్నాయని, వెంటనే పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవో శంకర్రెడ్డి, లేబర్ ఆఫీసర్ రఫీక్, ఎంపీవో ఆరిఫ్పాషా, ఏఈ సాయిప్రసన్న తదితరులు పాల్గొన్నారు. యారన్ సబ్సిడీ అందించాలి తంగళ్లపల్లి(సిరిసిల్ల): టెక్స్టైల్ పార్క్లో పనిచేసే పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న యారన్ సబ్సిడీని వెంటనే అందించాలని సీఐటీయూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. టెక్స్టైల్ పార్క్లో చేనేత జౌళిశాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్వీ రావుకు వినతిపత్రం అందజేశారు. రమణ మాట్లాడుతూ కార్మికులకు నిరంతరం ఉపాధితోపాటు మెరుగైన వేతనాలు వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. టెక్స్టైల్ పార్కు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కూచన శంకర్, మా మిడాల శ్రీనివాస్, రాచర్ల వేణు, పులి రమేశ్, కందికట్ల శ్రీనివాస్, వెంకటేశ్ పాల్గొన్నారు. 9న ఐటీఐలో అప్రెంటీస్ మేళా సిరిసిల్లకల్చరల్: సిరిసిల్ల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లో ఈనెల 9న జాతీయస్థాయి అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కవిత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 2024 నాటికి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మో టార్ వెహికల్, వెల్డర్ ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లని కోరారు. ఎస్సెస్సీ మెమో, ఐటీఐ మెమో, ఆధార్కార్డు, కుల ధ్రువీకరణపత్రాలతో హాజ రుకావాలని తెలిపారు. వివరాలకు 86886 12668లో సంప్రదించాలని సూచించారు. మధ్యాహ్న కార్మికుల బిల్లులు చెల్లించాలి సిరిసిల్లటౌన్: మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి మాట్లాడారు. కార్మికులకు ఆరు నెలల మెస్చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు, గౌరవ వేతనం పెండింగ్లో ఉందన్నారు. వెంటనే విడుదల చేయాలని కోరారు. నాయకులు గురిజాల శ్రీధర్, కార్మికులు వసంత, సత్తవ్వ, పద్మ, ఎల్లవ్వ, భాగ్య పాల్గొన్నారు. ఏరియా ఆస్పత్రిలో కాయకల్ప బృందంవేములవాడఅర్బన్: వేములవాడ ఏరియా ఆస్పత్రిని కాయకల్ప బృందం అధికారులు శుక్రవారం సందర్శించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లో తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలు, నిర్వహణపై కాయకల్ప టీమ్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. గతంలోనూ ఈ ఆస్పత్రికి మూడుసార్లు కాయకల్ప అవార్డుతోపాటు ఎన్క్వాస్లో మొదటిస్థానం, లక్ష్యలో మొదటి స్థానం నిలిచిందని వివరించారు. ఈ ఏడాది సైతం ఆస్పత్రి మొదటిస్థానంలో నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యులు సతీశ్, అస్సెసర్ స్టెల్లా, పెరుక తిరుపతి, నిషాత్ సల్మా, సుభాషిణి, సంతోష్చారి ఉన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం.. పేద కుటుంబానికి శాపం
● ఇంటినంబరు తప్పు మంజూరుతో ఇరకాటం ● అధికారులను వేడుకుంటున్న పేద కుటుంబం ● మున్సిపల్ తప్పునకు ఇల్లు కోల్పోతున్న బాధితులుసిరిసిల్లటౌన్: మున్సిపల్ అధికారులు చేసిన తప్పు.. ఓ నిరుపేద కుటుంబానికి శాపంగా మారింది. ఇంటినంబర్ తప్పుగా నమోదు చేయడం.. పాత నంబర్ను ఇతరులకు కేటాయించడంతో మంజూరైన ఇందిరమ్మ ఇల్లు రద్దయ్యేలా ఉంది. బాధితులు తెలిపిన వివరాలు. నేతకార్మికుడు అరికాల పాపయ్యకు స్థానిక 11వ వార్డులో స్థలం ఉంది. రాజీవ్నగర్.. సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం కాకముందు గ్రామపంచాయతీగా ఉండేది. ఆ సమయంలో వీరు నివసించిన ఇంటి నంబర్ 11–55గా ఉండేది. దీనిని గ్రామపంచాయతీ కార్యదర్శి 11–56గా ఇచ్చారు. ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఇల్లు కట్టుకుంటామంటే అసలు ఇంటి నంబర్ లేదని, ఆ ఇంటి నంబర్ వేరేవాళ్లకు కేటాయించారన్నారు. దీంతో తమ ఇంటి రికార్డ్స్ మున్సిపాలిటీలో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ప్రజావాణిలో మున్సిపల్ ప్రత్యేకాధికారి, కలెక్టర్కు విజ్ఞప్తి చేయగా.. సిరిసిల్ల మున్సిపల్ అధికారులను దీనిపై చర్యలు తీసుకోమని ఆదేశించారన్నారు. మున్సిపల్కు వెళ్తే ఈ ఇంటి నంబర్ వేరే వాళ్లకు ఇచ్చామని.. తమకు కొత్త ఇంటి నంబర్ ఇస్తామంటున్నారని వాపోయాడు. కలెక్టర్ జోక్యం చేసుకొని తమకు కేటాయించిన ఇంటి నంబర్నే ఇవ్వాలని కుటుంబ సభ్యులు శారద, జశ్వంత్ కోరుతున్నారు. సిరిసిల్ల పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారుల తప్పిదానికి పేద కుటుంబానికి సొంతింటి కల దూరం చేయొద్దని కోరారు. -
ప్రభుత్వ కళాశాలలోనే చేరాలి
సిరిసిల్లటౌన్: విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలోనే చేరాలని సిరిసిల్ల ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీనివాస్ అన్నారు. ఇంటర్మీడియట్ అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్) కళాశాల అధ్యాపకులు వెంకంపేట ప్రాంతంలో ప్రచారం చేపట్టారు. ప్రిన్సి పాల్ విజయ రఘునందన్, అధ్యాపకులు పాల్గొన్నారు. మెరిట్ స్కాలర్షిప్కు ఎంపిక చందుర్తి(వేములవాడ): మండలంలోని మల్యాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీదర్ల దీక్షిత జాతీయ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్కు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు శరత్చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిని ఉపాధ్యాయులు అభినందించారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): తాడూర్ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని కొత్వాల సహస్ర జాతీయ స్థాయి ఉపకార వేతనానికి ఎంపికైంది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్కు సహస్ర ఎంపికైనట్లు హెచ్ఎం బూర రవీందర్ శుక్రవారం తెలిపారు. విద్యార్థినిని ఉపాధ్యాయులు అభినందించారు. ఈ స్కాలర్షిప్ ద్వారా నెలకు రూ.వెయ్యి చొప్పున ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం అందివ్వనుంది. -
హద్దుల్లేని మైనింగ్
● ఈటీఎస్ సర్వేలో వెలుగులోకి అక్రమాలు ● జిల్లాలోని వ్యాపారులకు రూ.129కోట్ల జరిమానా ● అభివృద్ధి పనులకు కంకర సరఫరా చేశామని లెక్కలు ● జరిమానాలు తప్పించుకునేందుకు యత్నం సిరిసిల్ల: జిల్లాలో మైనింగ్ హద్దులు దాటింది. గనుల గడువు ముగిసినా అక్రమ తవ్వకాలు సాగించారు. నిర్ణయించిన హద్దులను దాటి తవ్వకాలు చేపట్టారు. రెవెన్యూ, గనులశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో క్వారీల యాజమాన్యాలు ఆడింది ఆటగా చెలామణి అయింది. ప్రభుత్వానికి సీనరేజీ, రాయల్టీ చెల్లించలేదు. జిల్లాలోని 14 క్వారీలకు, 9 క్రషర్లకు గడువు దాటిపోయిందని గనులశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. కొన్నింటిని ఏకంగా నిషేధిత జాబితాలో పెట్టారు. కానీ అప్పటికే నష్టం జరిగిపోయింది. క్రషర్లలో నలిగిన నిబంధనలు జిల్లాలో నిబంధనల మేరకు మైనింగ్శాఖ 2020లో మైనింగ్కు అనుమతించింది. వీటి గడువు ఇప్పటికే ముగిసిపోయింది. 1994 ఆదేశాల మేరకు ఐదు హెక్టార్లకు మించి ఖనిజాల తవ్వకాలు సాగిస్తే పర్యావరణ అనుమతులు పొందాలి. కానీ జిల్లాలో ఆ నిబంధనలు అమలుకావడం లేదు. రోడ్లు, భవనాల నిర్మాణాలకు అవసరమైన అన్ని సైజుల కంకర తయారీ కాగా.. క్రషర్లలో నిబంధనలు పాటించలేదు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన మైనింగ్ అధికారులు జిల్లాలోని పలు స్టోన్ క్రషర్లకు నోటీసులు ఇచ్చారు. వీటిపై యజమానులు కోర్టుకు వెళ్లగా యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. పక్క‘దారుల్లో’ అక్రమార్కులు జిల్లాలో అక్రమ మైనింగ్తో గుట్టలను గుల్లచేసిన అక్రమార్కులకు జిల్లాలో రూ.129కోట్ల జరిమానాలు విధించారు. ఈమేరకు ఆయా స్టోన్క్రషర్లకు నోటీసులు జారీచేసి వన్ టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్) అవకాశం కల్పించారు. అక్రమార్కులు దోచుకున్న సీనరేజీ, రాయల్టీ పన్నులను చెల్లించాల్సి వస్తోందని కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు అన్ని సైజుల కంకరను సరఫరా చేసినట్లు చెబుతున్నారు. ఈమేరకు పక్క‘దారులు’ వెతుకుతున్నారు. ఏ అభివృద్ధి పనికి ఎంత మేరకు సరఫరా చేశారో వివరాలు ఇవ్వాలని మైనింగ్ అధికారులు కోరగా.. ఆ లెక్కలను అందించే పనిలో పడ్డారు. గనుల స్వరూపం కలర్ గ్రానైట్ లీజులు : 24రాయి(కంకర) లీజులు : 16పట్టాభూములు : 40.14 హెక్టార్లు ప్రభుత్వ భూములు : 103.43 హెక్టార్లు 2023–2024 ఆదాయం : రూ.16.72 కోట్లు 2024–2025 ఆదాయ లక్ష్యం : రూ.18.77 కోట్లుఆరుగురు వివరాలు అందించారు జిల్లాలో 14 క్వారీలు, 9 స్టోన్క్రషర్లు ఉన్నాయి. నిబంధనలు పాటించకుండా తవ్వకాలు సాగించిన వారికి నోటీసులు జారీ చేశాం. క్వారీల్లో ఈటీఎస్ సర్వే నిర్వహించాం. డిజిటల్ సర్వే ద్వారా అక్రమ మైనింగ్ను నిర్ధారించి జరిమానాలు విధించాం. ప్రభుత్వ అభివృద్ధి పనులకు మెటీరియల్ సరఫరా చేశామని ఆరుగురు మాత్రమే వివరాలు అందించారు. మిగతా వారు ఇవ్వలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాం. – క్రాంతికుమార్, జిల్లా గనులశాఖ అధికారి, రాజన్న సిరిసిల్ల -
నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సిందే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు రావాలంటే.. తప్పకుండా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సిందేనని కరీంనగర్ పార్లమెంటరీ నాయకులు అధిష్టానానికి స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీభవన్లో కరీంనగర్ పార్లమెంటరీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జిల్లా నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా నేతలందరి నోట దాదాపుగా ఒకే డిమాండ్ వినిపించింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. డీసీసీ, కార్పొరేషన్ చైర్మన్లు సహా ఎలాంటి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకపోవడంపై కిందిస్థాయి నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వెల్లడించారు. వెంటనే పోస్టులు భర్తీ చేయకపోతే.. పార్టీకి క్షేత్రస్థాయిలో జరిగే నష్టాలను వివరించారు. పదవులు భర్తీ చేయలేకపోతే.. గ్రామాల్లో సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఉండదని కుండబద్ధలు కొట్టారు. ఈ క్రమంలో కలుగజేసుకున్న మీనాక్షి.. త్వరలోనే పదవుల భర్తీ ఉంటుందని, కష్టపడి పనిచేసిన వా రందరికీ సముచితస్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు అధిష్టానం ఇచ్చే ప్రొఫార్మా ప్రకారం.. పేర్లు పంపాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ల విలీనం తథ్యం పథకాల అమలులో విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, సన్నబియ్యం, ఇందిరమ్మ పథకాల అమలు తీరును మరింతగా జనాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ ధర్మం పేరుతో చేస్తున్న చర్యలను ఎక్కడికక్కడ ప్రజలకు వివరించాలన్నారు. ఆపరేషన్ సిందూర్ విషయంలోనూ బీజేపీ వ్యవహరించిన తీరును, దాని వైఫల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ ఏనాటికై నా బీజేపీలో విలీనం కావాల్సిందేనని, ఆ పార్టీల మైత్రిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఇక తాము ఎన్నికల ముందు పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామని, తమకు న్యాయం జరగాలని మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి, సిరిసిల్ల కాంగ్రెస్ నేత కేకే.మహేందర్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తదితరులు గుర్తుచేశారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రణవ్బాబు, మాజీ మంత్రి జీవ న్రెడ్డి, సీనియర్ నేత కటకం మృత్యుంజయం, సు డా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షికి స్పష్టం చేసిన కరీంనగర్ పార్లమెంటరీ నేతలు త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన మీనాక్షి నటరాజన్ బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీని ఎండగట్టాలని పిలుపు -
ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు
● జిల్లా వైద్యాధికారి రజిత సిరిసిల్ల: ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దని, ప్రభుత్వం నిర్వహించే ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి రజిత కోరారు. జిల్లా కేంద్రంలోని బీవైనగర్లో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. దీర్ఘకాలిక వ్యాధులు బీపీ, షుగర్, హెపటైటిస్ బీ, సీ వంటి వాటికి పరీక్షలు చేయించుకుని, నిర్ధారణ అయితే మందులు వాడాలన్నారు. సెప్టెంబరు వరకు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తామని సుఖవ్యాధులు( హెచ్ఐవీ)లకు ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య భద్రత కోసం జాగ్రత్త వహించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, టీబీ కో–ఆర్డినేటర్ బిగిందర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
పిల్లలు బడిలో ఉండాలి
సిరిసిల్ల: జిల్లాలో ప్రతీ పిల్లవాడు బడిలో చేరేలా చూడాలని, బాలకార్మికులు లేని జిల్లాగా మార్చాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం బడిబాటపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ బడిబాటలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఏఎన్ఎంలు, వీవోఏలు కలిసి బృందంగా ఏర్పడి ప్రతీ ఇంటిని సందర్శించి, పిల్లలంతా పాఠశాలల్లో నమోదయ్యేలా చూడాలన్నారు. విద్యాబోధన, వసతులు, ఉచిత పుస్తకాలు, యూని ఫామ్, మధ్యాహ్న భోజనం వివిధ పోటీపరీక్షలు జేఈఈ, నీట్ ఎంట్రన్స్ పరీక్ష కోచింగ్, డిజిటల్ క్లాస్రూమ్, విశాలమైన ప్లే గ్రౌండ్ గురించి తల్లి దండ్రులకు వివరించాలని సూచించారు. డ్రాపౌ ట్ కాకుండా చూడాలన్నారు. గ్రామాల్లో పంచా యతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాలకార్మికులు లేకుండా చూడాలన్నారు. డీఆర్డీవో శేషాద్రి, జి ల్లా వైద్యాధికారి రజిత తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించాలి ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపత్రాలు పొందిన వారు వెంటనే పనులు ప్రారంభించేలా చూడాలని కలెక్టర్ కోరారు. ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,413 ఇండ్లు గ్రౌండింగ్కాగా, మిగతా ఇళ్ల పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఉత్తమ పనితీరు చూపుతున్న పంచాయతీ కార్యదర్శులను అభినందించారు. గ్రామాలవారీగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో వాట్సాప్ గ్రూపులు పెట్టాలని తెలిపారు. కంపోస్టుషెడ్లు వినియోగించాలి సెగ్రిగేషన్ షెడ్లు, కంపోస్టుషెడ్లు వినియోగించాలని డీఆర్డీవో శేషాద్రి సూచించారు. వర్మీ కంపోస్ట్ తయారీపై వివరాలు ఇవ్వాలన్నారు. వ్యక్తిగత, సామూహిక ఇంకుడుగుంతలు వినియోగంలోకి వచ్చేలా పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలని తెలిపారు. హౌసింగ్ పీడీ శంకర్, డీపీవో షరీఫొద్దీన్, డీఎల్పీవో నరేశ్కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
నేటి నుంచి బడిబాట
● ప్రవేశాల పెంపే లక్ష్యంగా ముందుకు.. ● స్కూళ్లకు చేరిన పుస్తకాలు గంభీరావుపేట(సిరిసిల్ల): పాఠశాలల్లో విద్యార్థుల నమోదే లక్ష్యంగా ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట చేపట్టనున్నారు. ఈనెల 19 వరకు కొనసాగే బడిబాటలో ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాల పెంపే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో అందుతున్న సౌకర్యాలు, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనంపై ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రవేశాల పెంపు, బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్చడం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. విద్యార్థుల తల్లిదండ్రులను, గ్రామపెద్దలను, స్థానిక ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను, యువజన సంఘాలను భాగస్వామ్యం చేయనున్నారు. బడికి చేరిన పుస్తకాలు విద్యాసంవత్సరం ప్రారంభం రోజే విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే సరఫరా చేసింది. జిల్లాలో ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలలు 535 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో దాదాపు 50వేలకు పైగా విద్యార్థులు ఉన్నారు. 2,70,587 పుస్తకాలు అవసరం కాగా ఇప్పటికే 2,54,937 పుస్తకాలు వచ్చాయి. నాలుగో తరగతి తెలుగు, 9, 10వ తరగతులకు సంబంధించిన పర్యావరణవిద్య పాఠ్యపుస్తకాలు మాత్రమే రావాల్సి ఉంది. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
సిరిసిల్లకల్చరల్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా న్యాయస్థానం ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ సారథ్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులు వి.పుష్పలత, లక్ష్మణాచారి, కావేటి సృజన, ఎ.ప్రవీణ్ తదితరులు మొక్కలు నాటారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సీహెచ్ బాలమణి, లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు, చింతోజు బాస్కర్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి వేములవాడఅర్బన్: ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని వేములవాడ సబ్ కోర్టు న్యాయమూర్తి అజయ్కుమార్ జాదవ్ పేర్కొన్నారు. వేములవాడ కోర్టు ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. కాలుష్య నియంత్రణలో తమ బాధ్యతగా కోర్టు ఆవరణలో వివిధ రకాల మొక్కలు నాటినట్లు తెలిపారు. కోర్టు సిబ్బంది భూషణ్, రమణారెడ్డి, అంజయ్య,శంకర్ రెడ్డితదితరులు ఉన్నారు. మొక్కలు పంపిణీ సిరిసిల్లటౌన్: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని సిరిసిల్ల మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ పోసు వాణి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో గురువారం మొక్కల పంపిణీ, పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. అసిస్టెంట్ ఇంజినీర్ నరసింహస్వామి, టౌన్ ప్లానింగ్ అధికారి సాయికృష్ణ, రెవెన్యూ ఆఫీసర్ రామ్మోహన్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ స్వర్ణలత, టీఎంసీ మహాలక్ష్మి, పౌర సేవసమితి అధ్యక్షుడు బియ్యంకర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కోడెల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా వేములవాడఅర్బన్: తిప్పాపూర్లోని రాజన్న గోశాలలోని కోడెల కోసం రైతులు, ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. వెబ్సైట్ https://rajannasiricilla.telangana.gov.inలో వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. పట్టాదారు పాస్బుక్, ఆధార్కార్డ్లతో వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.భూభారతితో సమస్యలు పరిష్కారం● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముస్తాబాద్(సిరిసిల్ల): భూ భారతితో రైతుల భూమి సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని ఆవునూర్లో జరుగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సును ప్రభుత్వ విప్ గురువారం పరిశీలించి మాట్లాడారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో గ్రామాల్లో అనేక భూమి సమస్యలు సృష్టించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ధరణి రద్దు చేసి.. భూభారతిని తీసుకొచ్చామని తెలిపారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి, నాయబ్ తహసీల్దార్ అపర్ణ, ఆర్ఐ సుమలత, సారగొండ రాంరెడ్డి, గజ్జెల రాజు, గుండెల్లి శ్రీను, ఆంజనేయులు, వేణు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి ● సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు గంభీరావుపేట(సిరిసిల్ల): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ చట్టం ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మండలంలోని గోరింటాలలో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. తహీసీల్దార్ మారుతిరెడ్డి తదితరులు ఉన్నారు. ఘనంగా రావి నారాయణరెడ్డి జయంతి సిరిసిల్ల: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి జయంతి వేడుకలను సిరిసిల్లలోని జిల్లా రెడ్డి సంక్షేమ సంఘంలో గురువారం నిర్వహించారు. రావి నారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని సాగించిన యోధుడని కొనియాడారు. జిల్లా కోర్ కమిటీ సభ్యులు బాణాపురం రంగారెడ్డి, పొన్నాల బాల్రెడ్డి, ఉపాధ్యక్షులు ఎగుమామిడి కృష్ణారెడ్డి, గుల్లపల్లి నర్సింహారెడ్డి, కోశాధికారి ఎడమల హన్మంతరెడ్డి, కార్యవర్గ సభ్యులు కంది భాస్కర్రెడ్డి, అబ్బాడి తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు సింగిరెడ్డి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారులపై కేసులు ఉపసంహరించుకోవాలి సిరిసిల్లటౌన్: జిల్లా ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము ప్రభుత్వాన్ని కోరారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోసం ఉద్యమించిన కేసు విషయమై గురువారం ఉద్యమకారులతో కలిసి కరీంనగర్ కోర్టుకు హాజరయ్యారు. జిల్లా ఏర్పడి 9 ఏళ్లు గడుస్తున్నా ఉద్యమకారులకు తిప్పలు తప్పడం లేదన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ న్యాయం చేయాలని కోరారు. మైలారం తిరుపతి, కంసాల మల్లేశం, వీరవేని మల్లేశంయాదవ్ తదితరులున్నారు. -
మూడు నెలల్లోగా ఇళ్లు పూర్తి చేయాలి
● ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితం ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపత్రాలు పొందిన లబ్ధిదారులు మూడు నెలల్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ఇందిరమ్మ లబ్ధిదారులు గురువారం కలెక్టర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందన్నారు. మంజూరు పత్రాలు పొందిన వారికి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుందని తెలిపారు. సిమెంట్, స్టీల్ ధరలు తగ్గించేలా ఏర్పాట్లు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇల్లు మొదలు పెట్టేందుకు, నిర్మాణ పనులకు డబ్బులు లేని వారికి రుణవసతి కల్పిస్తామన్నారు. బేస్మెంట్, ఇతర దశలు పూర్తి కాగానే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లతో ఫొటో తీయించి, అప్లోడ్ చేయించాలని సూచించారు. బిల్లుల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. పీడీ హౌసింగ్ శంకర్, ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, కాంగ్రెస్ నాయకులు పర్శ హన్మాండ్లు, బాల్రెడ్డి పాల్గొన్నారు. నిబంధనలు పాటించాలి వేములవాడఅర్బన్: జిల్లాలో ఎరువులు, విత్తనాలు నిబంధనలు ప్రకారం విక్రయించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడలోని హనుమాన్ ఎంటర్ర్పైజేస్, శ్రీలక్ష్మీ ట్రేడర్స్ విత్తనాల దుకాణాలు, గోదాములను గురువారం తనిఖీ చేసి మాట్లాడారు. శ్రీలక్ష్మీ ట్రేడర్స్లోని సేల్స్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. రిజిస్టర్లోని వివరాల ప్రకారం గోదాములో ఎరువులు లేనట్లు గుర్తించి అమ్మకాల నిలిపివేతకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. సరైన సంజాయిషీ సమర్పించకపోతే షాప్ను సీజ్ చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం, మండల వ్యవసాయాధికారి సాయికిరణ్ ఉన్నారు. కోడెలకు మెరుగైన వైద్యం అందించాలి రాజన్న గోశాలలోని కోడెలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. గోశాలను గురువారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గోశాల ఆవరణలో పారిశుధ్య పనుల నిర్వహణకు అదనంగా వర్కర్లను నియమించనున్నట్లు తెలిపారు. ఆలయ ఈవో వినోద్రెడ్డి ఉన్నారు. అనంతరం గోశాలలోని కోడెలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనిఖీ చేశారు. సువిశాలమైన ప్రదేశంలో గోశాలను నిర్మిస్తామని తెలిపారు. భక్తులు తెచ్చే కోడెలలో కొన్నింటికి లంపీస్కిన్ వ్యాధి ఉండడంతో పది రోజులపాటు క్వారంటైన్లో పెట్టిన తర్వాత మిగతా వాటితో కలపాలని సూచించారు. -
ప్రజాసంక్షేమమే బీజేపీ లక్ష్యం
● పదకొండేళ్లలో అభివృద్ధిలో ముందంజ ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపిసిరిసిల్లటౌన్: ప్రజాసంక్షేమమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. పార్టీ జిల్లా ఆఫీస్లో గురువారం ‘పదకొండేళ్ల మోదీ ప్రభుత్వం – సంకల్పంతో సాకారం’పై సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథి అంజన్కుమార్ మొక్క నాటారు. వారు మాట్లాడుతూ జూన్ 6న అన్ని మండలాల్లో ఒకే స్థాయి కార్యశాలలు, జూన్ 9న జిల్లా స్థాయిలో ప్రెస్మీట్, జూన్ 10, 11 తేదీల్లో నియోజకవర్గాలలో ప్రెస్కాన్ఫరెన్స్, తర్వాత రోజుల్లో జిల్లా స్థాయిలో ప్రొఫెషనల్ మీట్స్, మేధావుల సదస్సులు నిర్వహిస్తామని వివరించారు. పార్టీ కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేశ్, అల్లాడి రమేశ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవేందర్యాదవ్, కార్యక్రమ కన్వీనర్ గరిపెల్లి ప్రభాకర్, కో–కన్వీనర్ నంద్యాడపు వెంకటేశ్ పాల్గొన్నారు. -
డిగ్రీ కాలేజీ పిలుస్తోంది
● అగ్రహారం ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు ● అనుభవజ్ఞులైన అధ్యాపకులు ● పరిశోధనల్లో రాణిస్తున్న విద్యార్థులు ● కొనసాగుతున్న రెండో విడత దోస్త్ ప్రవేశాలు ● ఈ ఏడాది నుంచి హాస్టల్ సౌకర్యంసిరిసిల్లకల్చరల్: డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ దోస్త్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. తొలి విడత పూర్తి కాగా రెండో దశ రిజిస్ట్రేషన్లు గత నెల 30 నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో అగ్రహారంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తన సుదీర్ఘ ప్రయాణంలో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్కు ఆలంబనగా నిలుస్తోంది. 38 ఏళ్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటూనే కార్మిక, ధార్మిక క్షేత్రాల్లో విద్యాపరిమళాలు వెదజల్లుతోంది. కోర్సులు ఇవీ.. బీఏ, బీకామ్ కోర్సులతో 1987లో మొదలైన కళాశాలలో ప్రస్తుతం వీటితోపాటు బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ బీజెడ్సీ కోర్సులు, బీఎస్సీ బీజెడ్సీఎస్ ఉన్నాయి. గతేడాది బీఎస్సీ ఫుడ్సైన్స్ క్వాలిటీ కంట్రోల్, బీఏ హెచ్ఈపీ, హెచ్పీపీ, ఈపీపీ, హెచ్ఈసీఎస్ కోర్సులతోపాటు బ్యుటీషీయన్, కాస్మెటాలజీ అనే సర్టిఫికెట్ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది నుంచి హాస్టల్ సౌకర్యం దూరప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం వసతిగృహాన్ని మంజూరు చేసింది. రూ.10కోట్లు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ, స్థల సేకరణ పూర్తయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో భవన నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉన్న భవనంలో హాస్టల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. ఏటా ఉద్యోగ మేళాలు డిగ్రీ పట్టా ఇవ్వడంతో సరిపెట్టకుండా పట్టభద్రులై న విద్యార్థులకు ఉపాధిమార్గాల అన్వేషణలోనూ కళాశాల దోహదం చేస్తోంది. ఏటా ఉద్యోగమేళాలు నిర్వహిస్తూ యువతకు ప్లేస్మెంట్ సౌకర్యాలను చేరువ చేస్తోంది. కోర్సుల అధ్యయనంతోపాటు ఉద్యోగ సాధనకు అవసరమైన స్కిల్స్ నేర్పించే ప్ర క్రియపై శ్రద్ధ పెడుతున్నారు. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం సులువు అవుతోంది. ప్రైవేట్ వలలో పడొద్దు ప్రభుత్వ కళాశాలల్లో సౌకర్యాలతోపాటు నిష్టగా పనిచేసే ఉన్నత విద్యార్హతలు గల అధ్యాపకులు ఉన్నారు. ప్రైవేట్ వలలో పడకుండా దోస్త్ రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తొలి ప్రాధాన్యంగా ఎంచుకుంటే ప్రభుత్వపరమైన అన్ని సౌకర్యాలు, నాణ్యమైన ఉన్నత విద్యతోపాటు సామాజిక విజయాలను సొంతం చేసుకోవచ్చు. – డాక్టర్ టి.శంకర్, ప్రిన్సిపాల్దోస్త్ షెడ్యూల్ ఇలా...రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు మే 30 నుంచి జూన్ 8 వరకు వెబ్ ఆప్షన్స్ : జూన్ 9 వరకు సీట్ల కేటాయింపు : జూన్ 13 సెల్ఫ్ రిపోర్టింగ్ : జూన్ 19 మూడో విడత జూన్ 13 నుంచి 19 వరకు సీట్ల కేటాయింపు : జూన్ 23 సెల్ఫ్ రిపోర్టింగ్ : జూన్ 28 కళాశాలలో ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ : జూన్ 24 నుంచి 28 తరగతులు : జూన్ 30 -
ట్రస్ట్బోర్డు నిరీక్షణే !
● ‘పుష్కర’కాలంగా ఏర్పాటు చేయని ప్రభుత్వాలు ● ఏటా ఉత్సవ కమిటీలతోనే శివరాత్రి వేడుకల నిర్వహణ ● 800 ఏళ్ల చరిత్ర ఉన్న దక్షిణకాశీ.. అభివృద్ధిలో వెనుకంజ ● ఆదాయంలో ఘనం.. వసతులు అంతంతే.. ● టీటీడీ తరహాలో బోర్డు ఏర్పాటుపై ప్రభుత్వం సన్నాహాలుసిరిసిల్ల: దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి 800 ఏళ్ల ఘన చరి త్ర. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగుబంగా రంగా నిలుస్తున్న స్వామి వారి ఆలయం అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. నిత్యం వేలాదిగా తరలి వస్తున్న భక్తుల ద్వారా భారీగా ఆదాయం వ స్తున్నా వసతులు అంతంతే ఉన్నాయి. ట్రస్ట్బోర్డు లేక అభివృద్ధి సాధించలేకపోతోంది. పుష్కరకాలంగా ప్రభుత్వాలు ట్రస్ట్బోర్డును పట్టించుకోవడం లేదు. ఫలితంగా భక్తులకు సౌకర్యాలు దరిచేరడం లేదు. 12 ఏళ్లుగా ఊసేలేని ట్రస్ట్బోర్డు వేములవాడ ఆలయ ట్రస్ట్బోర్డు లేక పన్నెండేళ్లు గడుస్తోంది. 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బొమ్మ వెంకన్నను ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్గా నియమించగా 2013 వరకు కొనసాగారు. అనంతరం రాజన్న ఆలయానికి ట్రస్ట్బోర్డు కమిటీ లేదు. ఏటా మహాశివరాత్రి వేడుకలకు ముందు ఉత్సవ కమిటీని నియమిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయిలో ట్రస్ట్బోర్డు లేక ఆలయ అభివృద్ధి, నిర్వహణలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో పూర్తిస్థాయి ధర్మకర్తల మండలిని నియమిస్తే ఆలయం అభివృద్ధిలో దూసుకెళ్తుందని స్థానికులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఉత్సవ కమిటీలు తాత్కాలిక పనులు మాత్రమే చేస్తున్నాయి. ట్రస్ట్బోర్డు లేక శాశ్వత అభివృద్ధి పనులు సాగడం లేదు. దాతలను సమీకరించి సన్నిధిలో వసతిగృహాల నిర్మాణాలు, ఆధునిక హంగుల కల్పన వంటి పనులు సాగడం లేదు. 62 ఏళ్ల కిందటే ట్రస్ట్బోర్డు ఏర్పాటు రాజన్న ఆలయంలో 1963లో అంటే.. 62 ఏళ్ల కిందటే తొలి ట్రస్ట్బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ధర్మకర్తల మండలిని నియమిస్తూ వచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో రాజకీయంగా ప్రాధాన్యమున్న ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ నియామకంపై ప్రభుత్వాలు ఆచీతూచీ నియమించాయి. 12 ఏళ్లుగా ట్రస్ట్బోర్డు కమిటీ లేక అధికారుల పర్యవేక్షణలో రాజన్న ఆలయ నిర్వహణ సాగుతోంది. కలెక్టరేట్లో వీటీడీఏ ఆఫీస్ వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ)ని 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ర్పాటు చేసింది. దీనికి సీఎం చైర్మన్గా, కలెక్టర్ వైస్ చైర్మన్గా ఉన్నారు. కానీ పూర్తిస్థాయిలో నిధులు కే టాయించకపోవడంతో వీటీడీఏ నామమాత్రంగా మారింది. వేములవాడ ఆలయ అభివృద్ధి ఆఫీస్ను కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. గత నవంబరులో సీఎం రేవంత్రెడ్డి వేములవాడకు వచ్చి ఆలయ అభివృద్ధికి రూ.127కోట్లు కేయించారు. అయినా పనుల్లో ప్రగతి లేదు. ఏడు నెలల కిందటే సీఎం నిధులు మంజూరు చేయగా టెండర్లు కూడా పూర్తికాలేదు. వేములవాడలో రోడ్ల విస్తరణ, పుష్కరిణి అభివృద్ధి, గోశాల నిర్మాణం, విస్తరణ, మురికికాల్వల నిర్మాణాలు పెండింగ్లోనే ఉన్నాయి. ట్రస్ట్బోర్డు ఉంటే... ఆలయ అభివృద్ధిపై తరచూ సమీక్షలు.. ప్రొటోకాల్ నిర్వహణ, దాతల నుంచి విరాళాలు సేకరించి వస తి గదులు నిర్మించడం.. సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. ఆలయ ధర్మకర్తల మండలి నియాకమంపై ప్రభుత్వం జాప్యం చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లు ఆలయ ట్రస్ట్బోర్డు ఊసే లేకుండా నెట్టుకొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. పుష్కరకాలంగా ట్రస్ట్బోర్డు ఏర్పాటులో పడిగాపులు తప్పడం లేదు.వేములవాడ రాజన్న ఆలయ ముఖద్వారంట్రస్ట్బోర్డు చైర్మన్లు.. పదవీకాలం సీహెచ్.వెంకటేశ్వర్రావు 1963–1977 ఎం.కొండల్రావు 1977–1980 సీహెచ్.వెంకటేశ్వర్రావు 1981–1984 వుచ్చిడి మోహన్రెడ్డి 1984–1987 దుగ్గిరాల వెంకట్రావు 1988–1990 వుచ్చిడి మోహన్రెడ్డి 1992–1994 సీహెచ్.కమలాకర్రావు 1994–1996 శికారి విశ్వనాథం 1998–1999 శికారి విశ్వనాథం 2002–2004 ఆది శ్రీనివాస్ 2004–2006 ఆది శ్రీనివాస్ 2007–2009 బొమ్మ వెంకన్న 2009–2013టీటీడీ తరహాలో ఏర్పాటుకు సన్నాహాలు వేములవాడ ఆలయ ట్రస్ట్బోర్డును టీటీడీ తరహాలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వేములవాడ, యాదగిరిగుట్ట ఆలయాలకు ధర్మకర్తల మండలి ఏర్పాటుపై ప్రభుత్వం కేబినెట్ స్థాయిలో చర్చించింది. రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. పనులు జరుగుతున్నాయి. ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. – ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే -
సన్నబియ్యం.. దేశానికే తలమానికం
● సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి సిరిసిల్లటౌన్: సన్నబియ్యం పథకం దేశానికే తలమానికంగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని తన నివాసంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రజాపాలన సాగిస్తున్న కాంగ్రెస్పై అక్కసుతో బీజేపీ, బీఆర్ఎస్లు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. పదేళ్లపాటు అవినీతికి అలవాటు పడిన బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనూ పేదల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలో అక్రమాల భయంతోనే కమీషన్ ముందుకు హాజరుకావడానికి జంకుతున్నారని ఎద్దేవా చేశారు. పది నెలల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు 58వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఆడెపు చంద్రకళ, నాయకులు ఆకునూరి బాలరాజు, వైద్య శివప్రసాద్, గడ్డం నర్సయ్య, గోనె ఎల్లప్ప, యెల్లె లక్ష్మీనారాయణ, రాపెల్లి కళ్యాణ్ పాల్గొన్నారు. -
‘ప్రైవేట్’లో పేదలకు ఉచితం అందేనా !
● 25 శాతం ఉచిత సీట్లపై తల్లిదండ్రుల ఎదురుచూపులు ● ఫీజులు చెల్లించలేక అవస్థలు ● విద్యాహక్కు చట్టం అమలుపై సందిగ్ధం గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు పేదలకు, దివ్యాంగులకు కేటాయించాలన్న చట్టం అమలుపై సందిగ్ధం నెలకొంది. ఫలితంగా ఏళ్లుగా పేదలు కార్పొరేట్ విద్యకు దూరమవుతున్నారు. విద్యాహక్కు చట్టం–2009 ప్రకా రం ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం సీట్లు నిరుపేద, దివ్యాంగ విద్యార్థులకు కేటాయించి ఉచిత విద్యనందించాల్సి ఉంది. కానీ ఏళ్లుగా ఈ చట్టం అమలు కా వడం లేదు. తాజాగా ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్ర భుత్వం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో పేద విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆశలు చిగురిస్తున్నా యి. ఈ ఏడాది నుంచైనా విద్యాహక్కుచట్టం అమలవుతుందో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 120 ప్రైవేటు పాఠశాలలు ఉన్నా యి. ఆయా పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చట్టం అమలైతే వారిలో 25 శాతం మందికి ప్రయోజనం కలుగనుంది. 16 ఏళ్లుగా నిరీక్షణే.. 2009లో విద్యాహక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25శాతం మంది పేద విద్యార్థులను చదివించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉచిత నిర్బంధ విద్యలో భాగంగా ఈ చట్టాన్ని కార్యాచరణలో చూపించాల్సి ఉంది. జీవో 44ను అమలు చేయాల్సి ఉన్నా.. 15 ఏళ్లుగా అమలు చేయడం లేదు. విద్యాశాఖ అధికారులు జీవోనుగాని, చట్టాన్నిగాని అమలు చేయడంలో విఫలమవుతున్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పేద, ధనిక అనే తేడా లేకుండా పిల్లల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి. అప్పుడే పేద పిల్లలపై ఆర్థిక భారం తగ్గుతుంది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చట్టం ప్రకారం 25శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. – కల్యాణ్కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అమలుపై దృష్టి పెట్టాలి విద్యాహక్కు చట్టం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించాలి. అనేక మంది పేద పిల్లలకు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని విద్యాహక్కు చట్టాన్ని, జీవో 44ను పకడ్బందీగా అమలు చేసి పేద పిల్లలకు న్యాయం చేయాలి. – తిరుపతి, ఏబీవీపీ నాయకుడు -
నీరుంటే నారు పోసుకోవచ్చు
● ఎప్పడూ ఒకే పంటలు వేయొద్దు ● ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి ● యూరియా, డీఏపీ వాడకం తగ్గించాలి ● లైసెన్స్ గల దుకాణాల్లో విత్తనాలు కొనాలి ● విత్తనాలు, ఎరువుల రశీదులు దాచుకోవాలి ● భూసార పరీక్షలు చేస్తాం ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం సిరిసిల్ల: పది రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రవేశించాయి. తొలకరి జల్లులు ముందే కురిశాయి. ఇప్పుడు మళ్లీ ఎండలు కొడుతున్నాయి. వర్షాలకు భూమి బాగా నానాలి.. భూమిలో వేడితగ్గాలి.. అప్పుడే ఏ విత్తనమైనా విత్తుకుంటే.. మొలకెత్తుతుంది. ఎప్పుడూ ఒకే పంటను వేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాని, పంట మార్పిడితో భూసారం పెరిగి ఎంతో ప్రయోజనం ఉంటుంది. నీరుంటే నారు పోసుకోవచ్చని రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం తెలిపారు. జిల్లా వ్యవసాయశాఖ ఆఫీస్లో బుధవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ‘సాక్షి’ నిర్వహించిన ‘ఫోన్ఇన్’లో వ్యవసాయ అధికారులు మహేశ్వరీ, కృష్ణవేణిలతో కలిసి సమాధానాలు ఇచ్చారు. జిల్లాలోని నలుమూలల నుంచి అనేక మంది రైతులు ఫోన్ చేసి సాగులో సందేహాలకు సమాధానాలు పొందారు. ఆ విశేషాలు ఇవీ... -
ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు
● పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం ● ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చందుర్తి(వేములవాడ): రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్ పేర్కొన్నారు. మండలంలోని సనుగులలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేసిన అనంతరం చౌడాలమ్మ కల్యాణ మహోత్సవంలో పాల్గొని మాట్లాడారు. గుడిసె లేని గ్రామాలే లక్ష్యమన్నారు. పేదల సొంతింటి కల ఇందిరమ్మతో నెరవేరుతుందన్నారు. నిబంధనల మేరకు నిర్మించుకుంటే బిల్లులు వస్తాయని తెలిపారు. ప్రజాప్రభుత్వంపై బురదజల్లే ప్రతిపక్షాలకు మెనిఫెస్టోలో లేని సన్నబియ్యాన్ని అందజేయడం చెంపపెట్టులాంటిదన్నారు. రుద్రంగి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, మాజీ జెడ్పీటీసీలు నాగం కుమార్, పొద్దుపొడుపు లింగారెడ్డి, సనుగుల సింగిల్విండో మాజీ అధ్యక్షుడు ముస్కు ముకుందరెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు ఏగోలపు శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీటీసీ మ్యాకల గణేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యం వేములవాడ: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన 65 మంది లబ్ధిదారులకు రూ.28.48లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి, ఎల్వోసీల ద్వారా ఇప్పటి వరకు రూ.20కోట్ల పైచిలుకు మంజూరు చేయించినట్లు విప్ తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలి
● మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ ఇల్లంతకుంట(మానకొండూర్): ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకోవాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. మండలంలోని కందికట్కూరులో లబ్ధిదారు తాళ్లపల్లి శ్రీధర్ ఇంటికి ముగ్గుపోసే కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఎల్లమ్మ జాతరలో పా ల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భాస్కర్రెడ్డి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు వెలిచాల జ్యోతి, నాయకులు గుడిసె ఐలయ్య, యాస తిరుపతి, గ్రామాధ్యక్షుడు బిగుల్ల విజయ్ పాల్గొన్నారు. పెండింగ్ వేతనాలు అందించాలి సిరిసిల్లటౌన్: ఏడు నెలల పెండింగ్లో ఉంచిన తమ జీతాలు వెంటనే అందించాలని ప్రభుత్వ పాఠశాలల స్వీపర్ స్కావెంజర్స్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తమ సమస్యల సాధనకు కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా చేపట్టగా స్వీపర్స్ స్కావెంజర్స్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ మాట్లాడా రు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేతనాలు అందించిన జిల్లాలో మాత్రం మూడు నెలలుగా పెండింగ్లో ఉంచారన్నారు. వెంటనే చెల్లించకుంటే జూన్ 16న నిరవదిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. నెలకు రూ.15వేల వేతనం చెల్లించాలని కోరారు. ఎ.రాజశేఖర్, డి.వెంకటేశ్, దేవయ్య, రాజు, మహేశ్, పరశురాములు, లత, లావణ్య, అనిత పాల్గొన్నారు. దమ్మన్నపేట శివారులో చిరుత సంచారంగంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని దమ్మన్నపేట శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. బుధవారం గ్రామస్తులకు చిరుత సంచారంపై అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేశారు. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హరిప్రసాద్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అంజలి పాల్గొన్నారు. గాలిపల్లి, ఇల్లంతకుంట ప్యాక్స్ చైర్మన్ల కొనసాగింపు ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, ఇల్లంతకుంట మాజీ ప్యాక్స్ చైర్మన్లను తిరిగి చైర్మన్లుగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీసీవో రామకృష్ణ బుధవారం తెలిపారు. ప్యాక్స్ చైర్మన్ల పదవీకాలం ఫిబ్రవరి 15తో ముగియడంతో వారి స్థానంలో కో–ఆపరేటీవ్ రిజిస్ట్రార్ లచ్చయ్యను గాలిపల్లి సొసైటీ స్పెషల్ ఆఫీసర్గా, బి.రమాదేవిని ఇల్లంతకుంట స్పెషలాఫీసర్గా నియమించారు. దీన్ని సవాల్ చేస్తూ గాలిపల్లి, ఇల్లంతకుంట సొసైటీల చైర్మన్లు అనంతరెడ్డి, తిరుపతిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారినే తిరిగి చైర్మన్లుగా కొనసాగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు వారు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. -
పరిషత్ సమరానికి సిద్ధం!
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కసరత్తు ● చర్యలు ప్రారంభించిన ఆయా జిల్లాల అధికారులు ● చకచకా ఓటర్ల తుది జాబితా, మార్పులు– చేర్పులు ● సిద్ధమవుతున్న పోలింగ్ స్టేషన్ల రూట్మ్యాప్లు ● ఈనెల 15 లేదా నెలాఖరున నోటిఫికేషన్ ?సాక్షిప్రతినిధి,కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇటీవల పదవీకాలం ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు. లోకల్బాడీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇటీవల సంకేతాలు వెలువడిన దరిమిలా.. ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం. ఈమేరకు కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని జెడ్పీ సిబ్బంది ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఓటర్ల తుది జాబితాను మే 30వ తేదీన హైదరాబాద్కు పంపారు. ఇది పంపే ముందు.. ఇటీవల 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను చేర్చడం విశేషం. ఆ తరువాత అందులో కొన్ని సవరణలు చేసి తిరిగి 31వ తేదీన మరోసారి ఓటర్ల జాబితాను హైదరాబాద్కు పంపారు. జోరుగా ఏర్పాట్లు.. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారని సమాచారం. ఈ నెల15న లేదా నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల అవుతుందని, ఆ లోపు జిల్లా అధికారులు పూర్తిగా సంసిద్ధులు కావాలన్న ఆలోచనలో భాగంగానే ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల ఖరారు చేశారు. పోలింగ్ స్టేషన్ల రూట్ మ్యాపింగ్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాలలోని పోలింగ్ స్టేషన్లను ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజకవర్గాలకు అనుగుణంగా సర్దుబాటు చేసే ప్రక్రియ కూడా దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈ ప్రక్రియపై వారాంతానికి స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల జెడ్పీ కార్యాలయ సిబ్బంది ఇదే పనిలో తలమునకలయ్యారు. ఈనెలలో ఏక్షణమైనా ఎన్నికలు జరుగవచ్చన్న ప్రభుత్వ ఆదేశాలతో అంతా సిద్ధమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాజకీయ నాయకులు సైతం ఉత్సాహంగా ఉన్నారు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారంతా ఇక రంగంలోకి దిగేందుకు సిద్ధమతున్నారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలుజిల్లా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు స్థానాలు కరీంనగర్ 170 15 జగిత్యాల 216 20 పెద్దపల్లి 140 13 రాజన్నసిరిసిల్ల 123 12 మొత్తం 649 60 -
ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించండి
● జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీనివాస్ గంభీరావుపేట(సిరిసిల్ల): తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీనివాస్ కోరారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు బుధవారం ఇంటింటీ ప్రచారం చేశారు. కళాశాల ప్రత్యేకతలు వివరిస్తూ రూపొందించిన ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీధర్, అధ్యాపకులు గజానంద్, శ్రీనివాస్, పాపారావు, సత్యనారాయణ, రవి, శ్రీధర్ పాల్గొన్నారు. ఐటీఐలో ప్రవేశాలు తంగళ్లపల్లి(సిరిసిల్ల): 2025–26 విద్యా సంవత్సరానికి ఐటీఐలో ప్రవేశాలకు 10వ తరగతి ఉత్తీర్ణులైన 14 ఏళ్లు నిండిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ కవిత బుధవారం ప్రకటనలో తెలిపారు. జూన్ 21 వరకు మొదటి విడత దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, వెల్డర్, డీఎం సివిల్, డీజిల్ మెకానిక్, సీవోపీఏ, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
సర్కారు బడికి చేయూతనివ్వాలి
● మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సిరిసిల్ల ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ సర్కారు బడికి చేయూతనందించాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. ‘ప్రభుత్వ బడులు నిలబడాలి–చదువుల్లో అంతరాలు పోవాలి’ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ మంగళవారం సిరిసిల్ల చేరుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాలని, తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. పౌరస్పందన వేదిక ఉపాధ్యక్షురాలు మంగ, కార్యవర్గ సభ్యులు నాగమణి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మాన మూర్తి, రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు గుండమనేని మహేందర్రావు, కోశాధికారి అంబటి రమేశ్, కార్యదర్శులు పాముల స్వామి, కొత్వాల్ ప్రవీణ్, తిరుపతిజాదవ్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు సి.రామరాజు, జిల్లా అధ్యక్షుడు సిలువేరి సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వానాకాలం సాగులో సందేహాలా..
● నేడు ‘సాక్షి’ ఫోన్ఇన్ ● సమాధానాలు ఇవ్వనున్న జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగంసిరిసిల్ల: వర్షా కాలం మొదలైంది. రోహిణి కార్తె ప్రవేశించింది. వానాకాలం(ఖరీఫ్) ప్రారంభంలోనే తొలకరి జల్లులు పలకరించాయి. జిల్లాలోని రైతులు మరికొద్ది రోజుల్లో విత్తనాలు వేసుకునేందుకు, నారు పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసుకున్నారు. వానాకాలం సీజన్లో పంటల సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి? వర్షాలు ఆలస్యమైతే.. ఏ పంటలు వేసుకోవాలి? అనే సందేహాల నివృత్తికి ‘సాక్షి’ ఫోన్ఇన్లో కాల్ చేయండి. ఈనెల 4న నిర్వహించే ఫోన్ఇన్లో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం రైతుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. సమయం : బుధవారం ఉదయం 9 నుంచి 10 గంటలు తేదీ: 04–06–2025 ఫోన్ నంబర్: 89777 55264 -
చిట్టీల రాయుళ్లు!
శాతవాహన వర్సిటీలో భారీగా చూచిరాతలు ● డిగ్రీలో డిబార్ అవుతున్న వారిలో కరోనా టైంలో ‘పది’ పాసైన వారే ఎక్కువ ● మొదటి నుంచి ఆరో సెమిస్టర్ వరకు ఇదే తీరు ● పర్యవేక్షణ పెరగడంతో భారీగా పట్టుబడుతున్న విద్యార్థులు ● సోషల్ మీడియా వ్యసనం, చదవలేక పోవ డంతో అడ్డదారులు ● డిబార్ అయిన విద్యార్థికి మద్దతుగా ఉత్తరాది మంత్రి ఫోన్!సాక్షిప్రతినిధి,కరీంనగర్: కుదురుగా పది నిమిషాలు కూర్చుని పరీక్ష రాయలేరు. పరీక్ష మొదలవగానే.. జేబులో దాచిన మైక్రో జిరాక్స్లు తీయడం, కాపీ చేయడం.. ఇదీ.. శాతవాహన వర్సిటీలో డిగ్రీ విద్యార్థుల తీరు. వాస్తవానికి మునుపెన్నడూ లేని స్థాయిలో విద్యార్థులు చిట్టీలు కొడుతూ పట్టుబడి డిబార్ అవుతున్నారు. గతవారంలో ఒకేరోజు 35 మంది డిబార్ అవడం వర్సిటీ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం. వాస్తవానికి విద్యార్థులు ఇలా చిట్టీలు రాయడం ఆందోళన కలిగిస్తోంది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్న ఆశయంతో యూనివర్సిటీ అధికారులు ఈసారి సిబ్బందిని పెంచి ఆకస్మిక తనిఖీలు చేయిస్తుండటంతో భారీగా చిట్టీల రాయుళ్లు పట్టుబడుతున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా విద్యార్థులు డిబార్ కావడంపై వర్సిటీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. జూన్ 2 వరకు వర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు రాస్తున్న 171 మంది డిబార్ అయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా సమయంలోని వారేనా? ఈ విషయంపై ఆరా తీసినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వాస్తవానికి ఇప్పుడు డిబార్ అవుతున్న విద్యార్థులంతా కరోనా విపత్తు సమయంలో 10వ తరగతి పాస్ అయినవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. 2020 మార్చిలో ఆకస్మికంగా కరోనా విపత్తు ప్రపంచాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జనజీవనం స్తంభించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు నిర్వహించలేకపోయింది. ఫలితంగా ఎలాంటి పరీక్షలు లేకుండా విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత 2021లోనూ పరీక్షలు లేకుండా పది పాసయ్యారు. 2022లో మాత్రం పది పరీక్షలు నిర్వహించినా.. గతంలో ఉన్న 11 పేపర్లను ఆరుకు కుదించి తేలిగ్గా ప్రశ్నలు ఇచ్చారు. 2023లో పది పరీక్షరాసిన పిల్లలు కాస్త నయంగానీ, 2020, 2021లో అసలు పరీక్షలు లేకుండా పాసైన విద్యార్థుల ప్రతిభాపాటవాలపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియా మరో కారణం 2020, 2021లో పది పాసైన వారి ప్రతిభాపాటవాలపై ఇప్పుడు ప్రొఫెసర్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. డిబార్ అవుతున్న వారిలో అధికంగా వారే ఉండటం, వారంతా సోషల్ మీడియా ప్రభావంతో కాపీయింగ్ పాల్పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. సులువుగా పరీక్షలు పాసవడానికి అలవాటు పడినవారు, ఆ కోణంలో వెళ్తున్నారని అంటున్నారు. కాపీ కొడితే పట్టుబడ్డారంటూ సోషల్మీడియా రీల్స్ చూసి వీరు కూడా పాటించి దొరికిపోతున్నారని పేరు తెలిపేందుకు ఇష్టపడని ఓ ప్రొఫెసర్ తెలిపారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. డిబార్ అయిన విద్యార్థులంతా రాజకీయ నాయకులతో వారిని వదిలేయాలంటూ వర్సిటీ అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నారు. వారిలో ఓ విద్యార్థిని వదిలేయాలంటూ ఉత్తరాదికి చెందిన ఓ పెద్ద మంత్రి ఏకంగా వర్సిటీకి ఫోన్ చేయడంతో విస్తుపోవడం అధికారుల వంతైంది.వారిలోనే డిబార్ సంఖ్య ఎక్కువ 2020లో పది పాసైనవారు ఇప్పుడు 6వ సెమిస్టర్, 2021లో పది పాసైనవారు 4వ సెమిస్టర్, 2022లో పది పాసైన వారు 2వ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నారు. ప్రతీ విద్యాసంవత్సరంలోనూ 1,3,5వ సెమిస్టర్లకు ఒకసారి, 2,4,6వ సెమిస్టర్లకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. 2023–24లో 1,3,5వ సెమిస్టర్లలో 26 మంది డిబార్ అయ్యారు. అదే 2023–24 విద్యా సంవత్సరంలో 2,4,6 సెమిస్టర్లలో 60 మంది డిబార్కు గురయ్యారు. 2024–25లో 1,3,5వ సెమిస్టర్లలో కేవలం 31 మంది డిబార్ కాగా, 2024–25 విద్యాసంవత్సరంలో 2,4,6 సెమిస్టర్లలో ఏకంగా 140 మంది డిబార్ అయ్యారంటే.. పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులో మే 28న ఒకేరోజు 34 మంది డిబార్కావడం గమనార్హం. అందులోనూ కరీంనగర్ నడిబొడ్డున తెలంగాణచౌక్ను ఆనుకుని ఉన్న కాలేజీ నుంచి ఏకంగా 13 మంది విద్యార్థులు ఉండటం విశేషం. ఇప్పుడు డిబార్ అయిన విద్యార్థుల్లో అధికంగా 2020, 2021లో పదో తరగతి పాసైన వారే అధికంగా ఉండటం గమనించదగ్గ అంశం. శాతవాహన యూనివర్సిటీ కింద సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో మొత్తం 120 డిగ్రీ కాలేజీలు, 28 పీజీ, 23 బీఈడీ, 7 ఎంబీఏ, ఒక ఎంఈడీ, ఒక బీపీఈడీ, ఒక లా కాలేజీలు తదితరాలు ఉన్నాయి. ఇటీవల వర్సిటీకి అదనంగా లా, ఇంజినీరింగ్ కాలేజీలు కూడా మంజూరయ్యాయి. ఇంతటి ప్రతిష్టాత్మక వర్సిటీలో ఇలాంటి విపరీత ధోరణి ఇదే తొలిసారి అని పలువురు వాపోతున్నారు. -
అంగన్వాడీ సేవలు విస్తరించాలి
● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం సిరిసిల్ల: అంగన్వాడీ కేంద్రాల సేవలను విస్తరించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. సిరిసిల్లలోని అంబేడ్కర్నగర్, బీవై నగర్ సెక్టార్లలో మంగళవారం జరిగిన అంగన్వాడీ టీచర్ల సమీక్ష సమావేశంలో మాట్లాడారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు రప్పించడం ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందుతుందన్నారు. ఉచితంగా మధ్యాహ్న భోజనం, ఆంగ్ల మాధ్యమంలో విద్యనందిస్తామని ప్రజలకు వివరించాలని సూచించారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని సరిచేసేందుకు ప్రత్యేక బాలామృతం అందిస్తామన్నారు. కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్లే మెటీరియల్, స్మార్ట్ టీవీలు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నాయని వివరించారు. గత నెలలో రిటైర్మెంట్ పొందిన ఇద్దరు టీచర్లు, ఒక ఆయాను సన్మానించారు. సూపర్వైజర్లు దివ్య, సుస్మిత తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఏఎస్పీ విచారణ
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలం జోగాపూర్కు చెందిన అందాసు మాధురి అదే గ్రామానికి చెందిన మ్యాదరి శంకరయ్యను కులం పేరుతో దూషించిందన్న కేసులో మంగళవారం వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి విచారణ చేపట్టారు. జోగాపూర్కు చెందిన మాధురికి అదే గ్రామానికి చెందిన శంకరయ్యకు మధ్య రెండేళ్లుగా భూవివాదం ఉంది. మాధురి సాగుచేస్తున్న భూమిలో ప్రభుత్వ భూమి ఉందన్న నెపంతో తరచూ మహిళతో గొడవకు దిగుతున్నారని నెల రోజుల క్రితం మ్యాదరి శంకరయ్యతోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదైంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మాధురి తమను దూషించిందన్న శంకరయ్య ఫిర్యాదుతో వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి విచారణ చేపట్టారు. అనంతరం చందుర్తిలో వారం క్రితం మహిళ హత్య జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆమె వెంట చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య ఉన్నారు. -
‘ఉద్యానం’ ఉపాధి
● పండ్ల తోటలు.. కూరగాయలతో లాభాలు ● ఆయిల్పామ్ సాగుతో ప్రయోజనాలు ● రైతులకు రాయితీ .. ప్రణాళిక ఖరారుసిరిసిల్ల: వరి, పత్తి పంటలే కాకుండా.. ఉద్యానపంటలతో నమ్మకమైన ఉపాధి పొందవచ్చు. రైతులు ఆసక్తి చూపితే సిరులు పండించవచ్చు. ప్రభుత్వం సైతం రాయితీ కల్పిస్తోందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సాగుప్రణాళికను ఉద్యానశాఖ అధికా రులు ఖరారు చేశారు. వివరాలను జిల్లా ఉద్యానశాఖ అధికారి కేఆర్ లత వివరించారు. సమగ్ర ఉద్యాన మిషన్ పథకం పండ్ల తోటల పెంపకానికి 50 శాతం, కూరగాయలు, పూల తోటల పెంపకానికి 40 శాతం సబ్సిడీ ఉంటుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో డ్రాగన్ఫ్రూట్ తోటలను 12.50 ఎకరాలు, బొప్పాయి 22.50 ఎకరాలు, మామిడితోటలు 25 ఎకరాల్లో పెంచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. జామ తోటలు ఐదెకరాలు, కూరగాయల నారు కోసం 87.50 ఎకరాలు, పూలు 47.50ఎకరాలు, సుగంధ ద్రవ్యాల విత్తనాల కోసం 17.50 ఎకరాలు, మామిడితోటల పునరుద్ధరీకరణకు 50 ఎకరాలు, మల్చింగ్ కోసం 125 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. పనిముట్లు పవర్ టిల్లర్లు, పవర్ వీడర్లు, పవర్స్ప్రేయర్లు, బ్రష్ కట్టర్లకు రాయితీ ఉంటుంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కూరగాయల సాగుకు శాశ్వత పందిరి నిర్మాణానికి 2025–26లో 30 యూనిట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. వెదురు మిషన్ పథకంలో పొలాల సరిహద్దులపై 2వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్లను జత చేయాల్సి ఉంటుంది. ఆధునిక విధానంలో సాగు.. పండ్లు, కూరగాయలు, పూలతోటల పెంపకం, మ ల్చింగ్, పాతతోటల పునరుద్ధరణ, ఉద్యాన యాంత్రీకరణ, జాతీయ వెదురు మిషన్ ద్వారా తోటల చుట్టూ వెదురుచెట్లు నాటించడం కోసం ఉద్యానశాఖ కార్యాచరణ రూపొందించింది. ఆయిల్పామ్ ఆయిల్పామ్ తోటల పెంపకాన్ని ప్రభుత్వం ప్రో త్సహిస్తుంది. ఒక ఆయిల్పామ్ మొక్కకు ఖరీదు రూ.193 ఉండగా.. రైతు రూ.20 చెల్లిస్తే ప్రభుత్వం రూ.173 చెల్లిస్తుంది. ఎకరానికి 50 మొక్కల నాటుతారు. ఆయిల్పామ్స్లో అంతర పంటలకు, పంట ల నిర్వహణకు ఎకరాకు రూ.4,200 చొప్పున ఏటా చెల్లిస్తుంది. ఇలా నాలుగేళ్లు రాయితీ డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ఈ ఏడాది 2వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పండ్లు, కూరగాయలు, ఇతర తోటలకు బిందు సేద్యానికి 437 ఎకరాలు, తుంపర సేద్యానికి 212 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. సూక్ష్మ, బిందు సేద్యం సబ్సిడీ ఇలా.. రైతులు సబ్సిడీ ఎస్సీ, ఎస్టీ వంద శాతం సన్న, చిన్నకారు 90 శాతం ఇతరులు 80 శాతం సంప్రదించాల్సిన అధికారులు సిరిసిల్ల గోవర్ధన్ 89777 14049 వేములవాడ లోకేశ్ 89777 14048 తక్కువ నీటితో ఎక్కువ పంటలు జిల్లాలో తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే అవకాశం ఉంది. ఉద్యాన పంటలు సాగుచేస్తే ప్రభుత్వం తరఫున రాయితీలు లభిస్తాయి. కూరగాయలు, పండ్లతోటల సాగుతో లాభాలు ఉంటాయి. ఆయిల్పామ్ సాగుతో బహుముఖ ప్రయోజనాలున్నాయి. జిల్లాలో కూరగాయలు, పండ్ల తోటల సాగుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. ఆసక్తి గల రైతులు ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలి. – కె.ఆర్.లత, జిల్లా ఉద్యానశాఖ అధికారి -
‘ఇందిరమ్మ’తో సొంతింటి కల సాకారం
● మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ ఇల్లంతకుంట(మానకొండూర్): ఇందిరమ్మ పథకంతో నిరుపేదల సొంతింటి కల సాకారమవుతుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలంలో 760 మంది లబ్ధిదారులకు మంగళవారం మంజూరుపత్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ త్వరలోనే రేషన్కార్డుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ఝా, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శశికళ, తహసీల్దార్ ఎంఏ ఫారుక్, నాయకులు భాస్కర్రెడ్డి, ఐలయ్యయాదవ్, రమణారెడ్డి, పసుల వెంకటి తదితరులు పాల్గొన్నారు. టీబీ బాధితులకు ఉచితంగా మందులు ● డీఎంహెచ్వో రజిత తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాలోని టీబీ వ్యాధి బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా వైద్యాధికారి రజిత పేర్కొన్నారు. పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తామన్నారు. మండలంలోని ఇందిరానగర్లో టీబీ ముక్త్ భారత్లో భాగంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో టీబీ మందులు వాడినవారు, డయాబెటీస్, బీడీ తాగేవారు, బీఎంఐ 18 కన్నా తక్కువ ఉన్నవారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఎక్స్రే పరీక్షలు చేయాలని సూచించారు. అందుకోసం 102 ప్రభుత్వ వాహనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. టీబీ వ్యాధి వచ్చిన వారికి ప్రభుత్వం నుంచి ఉచితంగా మందులు, ఆరు నెలల వరకు పోషణ భత్యం, పోషకాహారం కోసం రూ.వెయ్యి అందిస్తామని తెలిపారు. టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిత, వైద్యులు అంజలి ఆల్ఫ్రెడ్, సంపత్, రామకృష్ణ, ఎంఎల్హెచ్పీ స్రవంతిరెడ్డి, డిప్యూటీ డెమో రాజ్కుమార్, లింగం, బిగిందర్, జేత్య పాల్గొన్నారు. -
భూ సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఇల్లంతకుంట(మానకొండూర్): భూభారతి చట్టం ద్వారా భూసమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. ఇల్లంతకుంట మండలం ముస్కాన్పేటలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. ఈ నెల 20 వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని, సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన మ్యాపులను జతచేయాలన్నారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఎంఏ పారుఖ్, డీటీ సత్యనారాయణ పాల్గొన్నారు. గోశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్లటౌన్: దక్షిణకాశీ వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ గోశాలలో కోడెల మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝాను మంగళవారం కలిసి వినతిపత్రం అందించి మాట్లాడారు. గోశాలలో అపరిశుభ్రత, అధిక సంఖ్యలో కోడెలు ఉండడంతోనే చనిపోతున్నాయన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులకు డబుల్ ఇళ్లు ఇవ్వాలి ● సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ సిరిసిల్లటౌన్: గత ప్రభుత్వంలో అర్హులుగా గుర్తించి డ్రాలో పేర్లు వచ్చిన వారికి డబుల్బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. డ్రాలో పేర్లు రాని పేదలకు ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇచ్చి, నిర్మాణా నికి రూ.5లక్షలు అందించాలని కోరారు. సిరిసిల్లలో వెయ్యికి పైగా ఇల్లు లేని కుటుంబాలు ఉ న్నాయన్నారు. అద్దె కుటుంబాల్లో ఎవరైనా చని పోతే శవాన్ని రోడ్డుమీద వేసుకోవాల్సిన దుస్థితి ఉందన్నారు. నాగుల సత్యం, గాజుల మల్లేశం, స్వామి, మహేశ్ పాల్గొన్నారు. మత్స్య సంఘాల సమస్యలు పరిష్కరించాలి సిరిసిల్లటౌన్: మత్స్య కార్మిక సహకార సంఘాల సమస్యలు పరిష్కరించాలని సిరిసిల్ల గంగపుత్రులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ను కోరారు. ఈమేరకు మంగళవారం హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మత్స్య కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నిర్భయంగా ఫిర్యాదు చేయండి● మహిళలకు భరోసాగా షీ టీం సిరిసిల్లక్రైం: మహిళలకు భరోసాగా ఉండేందుకు షీటీం పనిచేస్తుందని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. గత నెలలో పలువురు పోకిరీలపై 3 ఎఫ్ఐఆర్లు, 6 పెట్టి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పనిచేసే ప్రదేశాలు, విద్యాలయాల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులను నిర్భయంగా తెలపాలని కోరారు. కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, జిల్లా షీటీం 87126 56425లో సంప్రదించాలని సూచించారు. -
వానాకాలం సాగులో సందేహాలా..
● ‘సాక్షి’ ఫోన్ఇన్లో నివృత్తి చేసుకోండి ● సమాధానాలు ఇవ్వనున్న జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగంసిరిసిల్ల: వర్షా కాలం మొదలైంది. రోహిణి కార్తె ప్రవేశించింది. వానాకాలం(ఖరీఫ్) ప్రారంభంలోనే తొలకరి జల్లులు పలకరించాయి. జిల్లాలోని రైతులు మరికొద్ది రోజుల్లో విత్తనాలు వేసుకునేందుకు, నారు పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసుకున్నారు. వానాకాలం సీజన్లో పంటల సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి? వర్షాలు ఆలస్యమైతే.. ఏ పంటలు వేసుకోవాలి? అనే సందేహాల నివృత్తికి ‘సాక్షి’ ఫోన్ఇన్లో కాల్ చేయండి. ఈనెల 4న నిర్వహించే ఫోన్ఇన్లో జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం రైతుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. సమయం: బుధవారం ఉదయం 9 నుంచి 10 గంటలు తేదీ: 04–06–2025 ఫోన్ నంబర్: 89777 55264 -
గీతా శ్లోక పఠన విజేతలకు సత్కారం
సిరిసిల్లకల్చరల్: భగవద్గీతలోని 700 శ్లోకాలను అవలీలగా పఠించి మైసూర్లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో బంగారు పతకాలు సాధించిన జిల్లాకు చెందిన ఐదుగురు మహిళలను గీత ప్రచార సమితి సోమవారం ఘనంగా సత్కరించింది. పట్టణానికి చెందిన నార్ల సంతోషి, కటకం లక్ష్మి, కటకంవిజయ, జి. సంగీత, జి ప్రశస్తిలు భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేశారు. మైసూర్ ఆశ్రమంలో ఆహుతుల ప్రశంసలు అందుకున్నారు. వీరిని సమితి స్థానిక మళయాళ సద్గురు గీతాశ్రమంలో శ్రీ నారాయణ నందగిరి స్వామి చేతుల మీదుగా సత్కరించారు. సమితి అధ్యక్ష, కార్యదర్శులు కోడం నారాయణ, డాక్టర్ జనపాల శంకరయ్య, మోర దామోదర్, గజ్జెల్లి రామచంద్రం, కొక్కుల రాజేశం, గడ్డం కౌసల్య, అనసూయ, పత్తిపాక హరికిషన్ పాల్గొన్నారు. -
హైకోర్టు ఉత్తర్వుల మేరకు వేతనాలు ఇవ్వాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): మధ్యాహ్న భోజన కార్మికులకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు వేతనాలు పెంచి ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల హన్మండ్లు డిమాండ్ చేశారు. ముస్తాబాద్లో సోమవారం వంట కార్మికుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా హన్మండ్లు మాట్లాడుతూ.. కార్మికులకు ప్రభుత్వం కేవలం రూ.3వేల వేతనాలు మాత్రమే ఇస్తోందన్నారు. రూ.17వేల వేతనాలు ఇవ్వాలని గత ఫిబ్రవరి 24న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆ ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రధా న కార్యదర్శి బాబాయి, జిల్లా అధ్యక్షురాలు సంతోష, దివ్య, నర్సవ్వ, నిమ్మల దేవవ్వ, లక్ష్మీనర్సవ్వ,మణెమ్మ, ఎల్లవ్వ పాల్గొన్నారు. అమ్మమాట అంగన్వాడీ బాట వేములవాడరూరల్: వేములవాడ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సంక్షేమ అధికారి వి.లక్ష్మిరాజం సూచించారు. వేములవాడ ప్రాజెక్టు పరిధిలోని చెక్కపల్లి, అర్బ న్ పరిధిలోని కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించారు. అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు బడికి రాని పిల్లలను గుర్తించి సెంటర్లో చేర్పించాలన్నారు. సెంటర్లో చదువుకుంటున్న పిల్లల ఎదుగుదలపై దృష్టిపెట్టాలని సాధికారికత కేంద్రం కోఆర్డినేటర్ రోజా అన్నారు. సూపర్వైజర్లు నిర్మల, అంజమ్మ పాల్గొన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టాలి సిరిసిల్లటౌన్: మార్కెట్లో నకిలీ విత్తనాలు అమ్మకుండా వ్యవసాయశాఖ అఽధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో సోమవారం మాట్లాడుతూ.. వానా కాలం సీజన్ ప్రారంభమవుతున్నందున రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారన్నారు. వ్యాపారులు నాణ్యమైన విత్తనాలను అందించే విధంగా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, నకిలీవి అమ్మితే పీడీయాక్టు నమోదు చేయాలన్నారు. పత్తి విత్తనాల అమ్మకంలో మోసపూరితమైన వ్యాపారాలు చేస్తున్నారన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యురాలు సూరం పద్మ పాల్గొన్నారు. యారన్ సబ్సిడీ అందించాలి సిరిసిల్లటౌన్: ప్రభుత్వం నుంచి నేత కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ డబ్బులు వెంటనే అందించాలని పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. బీవైనగర్లోని అమృత్లాల్ శుక్లా భవన్లో సోమవారం మాట్లాడుతూ.. 2023 బతుకమ్మ చీరలకు సంబంధించి గత నెలరోజుల క్రితం మొదటి విడతగా 3,000 మంది కార్మికుల ఖాతాల్లో సబ్సిడీ డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. ఇంకా 2200 మందికి సబ్సిడీ రావాల్సి ఉందన్నారు. వెంటనే సబ్సిడీ అందించాలని జూన్ 4న సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదు ట ధర్నా చేపట్టడం జరుగుతుందన్నారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్, స్వర్గం శేఖర్, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు. విదేశీ విద్యకు స్కాలర్షిప్ సిరిసిల్లకల్చరల్: విదేశాల్లో విద్యాభ్యాసం చేసే మైనార్టీ విద్యార్థులకు చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ పథకం ద్వారా ప్రత్యేక స్కాలర్షిప్లు మంజూరు చేయనున్నట్లు జిల్లా మైనారిటీ అభివృద్ధి అధికారి ఎంఏ భారతి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ దేశాల్లో పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్న మైనారిటీ అభ్యర్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. అర్హత, ఆసక్తి గల వారు ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
రాజన్న ఆలయం మూసివేయడం లేదు
● భీమేశ్వరాలయంలో దర్శనాలకు ఏర్పాటు ● ఆలయ విస్తరణపై అవగాహన ● రూ.76కోట్ల పనులకు త్వరలో టెండర్లు ● ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయం మూసివేయడం లేదని, ఆలయ విస్తరణపై త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పట్టణవాసులు, భక్తులు, ప్రజలందరికీ అవగాహన కల్పించనున్నట్లు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆలయ విస్తరణ, భీమేశ్వరాలయంలో దర్శనాల ఏర్పాట్లపై ఆలయ గెస్ట్హౌస్లో దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు, వీటీడీఏ వైస్చైర్మన్, కలెక్టర్ సందీప్కుమార్ ఝా, స్థపతి వల్లినాయగం, ఈవో వినోద్రెడ్డి, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్తో సమావేశం అయ్యారు. రూ.76కోట్లతో ఆలయ విస్తరణ పనులకు టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. రాజన్న ఆలయాన్ని మూసివేయమని స్పష్టం చేశారు. స్వామివారికి నిత్య పూజలు కొనసాగుతాయన్నారు. ఆలయంలో పనులు చేపట్టనున్న దృష్ట్యా భక్తులకు భీమేశ్వరాలయంలో దర్శనానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భీమేశ్వరాలయంలో నిత్య కల్యాణం షెడ్లు, భక్తుల దర్శనం క్యూలైన్లు, కోడెమొక్కుల క్యూలైన్లు, ఆలయ ఆవరణలో షెడ్లు తదితరుల వసతులు వంటి మొత్తం ఎనిమిది అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు పిలువనున్నట్లు వెల్లడించారు. విశాలమైన స్థలం, ఆధునిక సౌకర్యాలతో గోశాలలు నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించగా, స్థానికంగా స్థలం గుర్తించాలని చర్చించామన్నారు. రాజన్న ఆలయ సమీపంలో కిలోమీటర్ పరిధిలో పెద్దపెద్ద భవనాలు నిర్మించవద్దని గతంలో జారీ చేసిన జీవోను 100 మీటర్ల పరిధిని కుదించాలని చర్చించినట్లు తెలిపారు. రాజన్న ఆలయ గోశాలలోని కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని దేవాదాయశాఖ కమిషనర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కోడలకు పచ్చి గడ్డి ఇవ్వాలని, నాణ్యమైన దాన పెట్టాలని, వైద్య శిబిరాలు నిర్వహించి, మందులు అందజేయాలని ఆదేశించారు. -
అభివృద్ధి.. సంక్షేమం
సిరిసిల్ల: ‘రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 ఏళ్లు పూర్తి. అమరవీరుల త్యాగాల పునాదులపై అవతరించిన తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి దిశగా సాగుతోంది. పారదర్శక, సుపరిపాలన లక్ష్యాలుగా అభివృద్ధి, సంక్షేమబాటలో ప్రజా ప్రభుత్వం పాలన సాగుతోంది’ అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పో లీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి సోమవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. ప్రభుత్వ పాలన.. భవిష్యత్ ప్రణా ళికను వివరిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. నేతన్నలకు అండగా నేతన్నలకు నిరంతరం పని కల్పించేందుకు 4.30 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లను అందించామన్నా రు. రూ.50 కోట్లతో యారన్(నూలు) డిపోను వే ములవాడలో ఏర్పాటు చేశామని తెలిపారు. 4,111 మందికి 10శాతం యారన్ సబ్సిడీగా రూ.6.91 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి గతేడాది నవంబరులో శ్రీకారం చుట్టారని, రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అన్నదాన సత్రాన్ని రూ.35.25 కోట్ల అంచనాలతో నిర్మిస్తున్నామని, కోడెల సంరక్షణకు ఆధునిక గోశాలను నిర్మిస్తున్నామన్నారు. పేదలకు కూడు.. గూడు జిల్లాలోని రేషన్కార్డుదారులకు ప్రతినెలా 3,300మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఇస్తున్నామని, వసతి గృహాలకు మరో 220 మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 7,808 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మంజూరు పత్రాలు అందించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపామని తెలిపారు. మధ్యమానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు 4,696 ఇళ్లు మంజూరు చేశామన్నారు. రుద్రంగి, భీమారం తహసీల్దార్ ఆఫీస్లు, వేములవాడలో సబ్ రిజిస్ట్రా ర్ ఆఫీస్లను త్వరలో నిర్మిస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులు భూ భారతి పైలట్ ప్రాజెక్ట్గా రుద్రంగి మండలాన్ని ఎంపిక చేసి భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, భూమి కొలతలకు 149మంది సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో 2.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. చందుర్తి మండలం నర్సింగాపూర్, లింగంపేట, ఎన్గల్, కోనరావుపేట మండలం మర్రిమడ్ల, వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలో 33/11 విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మహిళలకు ఆర్థిక చేయూత ఇందిరా మహిళ శక్తిలో జిల్లాలో 19 గ్రామ సంఘాలకు సీడ్స్, ఫెర్టిలైజర్ షాపుల లైసెన్స్లు అందించామని, 4,376 మహిళా సంఘాలకు బ్యాంకు ద్వా రా రూ.542 కోట్ల రుణాలు అందించామన్నారు. జిల్లాలో 40,285 ఎకరాలు సాగునీరు అందించేందుకు రూ.63.36 కోట్లతో మిగిలిన పనులను పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. 222 మంది రైతుల కుటుంబాలకు రూ.11.10 కోట్ల భీమా సొమ్ము పంపిణీ చేశామని తెలిపారు. రూ.200 కోట్లతో స్కూల్ కాంప్లెక్స్ వేములవాడలో రూ.200 కోట్లతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరైందన్నారు. జిల్లాలోని 486 ప్రభుత్వ పాఠశాలల్లో ఐసీటీ ల్యాబ్ సౌకర్యం కల్పిస్తూ డిజిటల్ మాధ్యమంలో బోధనను అందిస్తున్నామన్నారు. రుద్రంగిలో రూ.42కోట్లతో అ డ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామ న్నారు. అగ్రహారం డిగ్రీ కళాశాలలో రూ.10 కోట్ల తో మహిళా వసతి గృహం మంజూరైందన్నారు. రోడ్లు, భవనాలు.. పరిశ్రమలు జిల్లాలో ఉపాధిహామీలో 730 పనులను రూ.50.29 కోట్లతో చేపట్టామని, గ్రామ పంచాయతీ, ఇందిరా మహిళా శక్తి, సామాజిక, అంబేద్కర్, పాలశీతలీకరణ కేంద్రాల భవనాల నిర్మాణాలకు రూ.16.51 కోట్లు, మూడు పీహెచ్సీలకు రూ.4.45కోట్లు, 16 ఆరోగ్య ఉపకేంద్రాలకు రూ.3.20 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. పీఎంజీఎస్వైలో నాలుగు వంతెనలు, 12 రోడ్ల నిర్మాణాలకు రూ.59.97 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. సిరిసిల్లలో కోర్టు సముదాయాలకు రూ.81 కోట్లు, వైద్య కళాశాల వసతి గృహానికి రూ.166 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. టీఎస్–ఐపాస్ ద్వారా రూ.5కోట్లతో 9 పరిశ్రమలను స్థాపించి 72 మందికి ఉపాధి కల్పించామని, టీ– ఐడియా, ఫ్రైడ్లో 73 పరిశ్రమలకు (రవాణా వాహనాలకు) రూ.3కోట్లు అందించామ ని తెలిపారు. టీ ప్రైడ్ పథకం కింద 42మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.1.85కోట్లు సబ్సిడీ మంజూరు చేశామని వివరించారు. వైద్య రంగంలో జిల్లాలో 50అంగన్వాడీ భవనాలకు రూ.6కోట్లు మంజూరయ్యాయని, 121 పోక్సో బాధితులకు రూ.51.65 లక్షల పరిహారం అందిచామని తెలిపా రు. సీఎంఆర్ఎఫ్ ద్వారా 4,969 మందికి రూ.17.76 కోట్లు, 248 మందికి ఎల్వోసీలు అందించి రూ.4.84 కోట్ల సాయం చేశామని తెలిపారు. జిల్లాలోని 324 చెరువులు, కుంటల్లో 46.71లక్షల చేప పిల్లలను వేశామని తెలిపారు. 123 మంది రైతులు 331 ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేసేలా ప్రోత్సహించామని పేర్కొన్నారు. రుద్రంగిలో పోలీస్స్టేషన్ భవనానికి రూ.2.50కోట్లు మంజూరు అయ్యాయని వివరించారు. ఏఎస్పీ శేషాద్రినీరెడ్డి, చంద్రయ్య, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ఏఎంసీ చైర్మన్లు వెల్ముల స్వరూపారెడ్డి, సబేరా బేగం, రాజు, ఎల్లయ్య, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో నర్సింగ్ కళాశాల విద్యార్థినులు, స్కూల్ పిల్లలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లాలోని 110 స్వశక్తి సంఘాలకు 102.45కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను విప్ శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. రైతులకు విత్తన కిట్లను అందజేశారు. టీ ప్రైడ్ పథకం కింద 42 మందికి రూ.1.85 కోట్ల సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. రవాణాశాఖ, ఆర్టీసీ శకటాలను ప్రదర్శించారు. అంతకుముందు పాత బస్స్టాండ్ నేతన్న చౌక్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే నివాళి అర్పించారు. పారదర్శక ప్రజాపాలన అందిస్తున్నాం వేములవాడ ఆలయ విస్తరణ.. పల్లె ప్రగతికి బాటలు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
కోడెలను జాగ్రత్తగా చూసుకోవాలి
● 32 మందికి రెండు చొప్పున 64 కోడెల పంపిణీ ● పక్కదారి పడితే కఠిన చర్యలు ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా వేములవాడ: రాజన్న కోడెలు పొందిన రైతులు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. ఏమైనా పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిప్పాపూర్ గోశాలలోని 32 జతల కోడెలను అర్హులైన రైతులకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోశాల ఆవరణను పరిశీలించి పలు సలహాలు, సూచనలు చేశారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ గోశాలలో కోడెల సంరక్షణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గోశాల ఆవరణలో లోతుగా ఉన్న స్థలంలో మట్టిని పోయిస్తూ చదును చేస్తున్నామని తెలిపారు. కోడెలకు మెరుగైన దాణా, పచ్చిగడ్డి అందిస్తామన్నారు. పశువైద్యాధికారుల బృందంతో వైద్యం అందిస్తూ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో రాధాభాయి, వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్బేగం, ఈవో వినోద్రెడ్డి, తహసీల్దార్ విజయప్రకాశ్రావు, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ ఉన్నారు. కోడెల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి సిరిసిల్ల: జిల్లాలోని వేములవాడ శ్రీరాజేశ్వరస్వామి ఆలయానికి కోడెలను పొందేందుకు రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదివారం తెలిపారు. వేములవాడ శివారులోని తిప్పాపూర్ గోశాలలోని కోడెలను ఉచితంగా రైతులు పొందేందుకు ఆన్లైన్లో రైతు పట్టదారు పాస్బుక్కు, ఆధార్కార్డు ఇతర వివరాలను నమోదు చేసి దరఖాస్తులు చేయాలన్నారు. అర్హులైన రైతులకు మాత్రమే జియోట్యాగింగ్ కలిగి ఉన్న కోడెలను పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. జియో ట్యాగింగ్ చేసి, ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన రైతులకు రాజన్న కోడెలను పంపిణీ చేస్తే.. అవి పక్కదారి పట్టకుండా ఉంటాయని, భవిష్యత్లో వాటిని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని సందీప్కుమార్ ఝా స్పష్టం చేశారు. కోడెలను తీసుకెళ్లే రైతులు విధిగా వాటి సంరక్షణ బాధ్యతను చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈమేరకు ఆన్లైన్ వెబ్సైట్: https://rajannasircilla.telangana. gov.inలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. -
వస్త్రపరిశ్రమ సమస్యలు పరిష్కరించాలి
● శ్రీధర్బాబును కలిసిన సిరిసిల్ల వస్త్ర వ్యాపారులు సిరిసిల్లటౌన్: వస్త్రపరిశ్రమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్ల వస్త్రవ్యాపారులు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును కోరారు. హైదరాబాద్లో ఆదివారం ఈమేరకు విన్నవించారు. పవర్లూమ్ కరెంటు సమస్య, బ్యాక్ బిల్లింగ్ తదితర అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, ఉపాధ్యక్షుడు ఏనుగుల ఎల్లయ్య, కార్యదర్శి గౌడ రాజు, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, కార్యదర్శి అంకాలపు రవి, బూట్ల నవీన్, బూట్ల సతీశ్, బండారి అశోక్ పాల్గొన్నారు. ప్రైమరీ స్కూళ్లపై వివక్ష చూపొద్దు సిరిసిల్లటౌన్: ప్రైమరీ పాఠశాలలపై వివక్ష చూపొద్దని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు మ్యాడారం హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి నరేందర్రెడ్డి కోరారు. సిరిసిల్లలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అసంబద్ధమైన సర్దుబాటు ఉత్తర్వులను వెనక్కితీసుకోవాలని కోరారు. బడిబాట ముగిసిన తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కూర శ్రీనివాస్, పెంచాల సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు శిరోమణి, సరోజ, వెంకటరమణ పాల్గొన్నారు. ‘ఆక్రమించిన భూమిని ఇప్పించండి’ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటాపూర్ శివారులోని ఓమౌజయ ఆశ్రమం నిర్మాణంలో కోల్పోయిన తమ భూములను తిరిగి అప్పగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూములు కోల్పోయిన రైతులు సంగెం బాలయ్య, నోముల రజిత, ఎరుకల ప్రశాంత్ ఆదివారం ఆశ్రమం వద్ద నిరసన తెలిపి మాట్లాడారు. గ్రామ శివారులో తమకు 982 సర్వేనంబర్లో 13 ఎకరాలకు పైగా భూమి ఉందని తెలిపారు. తమకు చెందిన పట్టాభూమిని ఆక్రమిస్తూ ఆశ్రమ నిర్వాహకులు ప్రహరీ నిర్మించారని ఆరోపించారు. దీనిపై ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. గోశాల నిర్వహణపై ఇంత నిర్లక్ష్యమా ? వేములవాడ: రాజన్న ఆలయ గోశాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా చీమ చిటుక్కుమన్న మాట్లాడే స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోడెలు చనిపోతున్నా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆరు నెలలుగా కోడెల పంపిణీ నిలిచిపోవడంతోనే తిప్పాపూర్ గోశాలలో భారీగా కోడెలు జమయ్యాయన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో గోశాలల నిర్వహణ బాగుందని, అక్కడికి వెళ్లి పరిశీలించి రావాలని సూచించారు. ఏనుగు మనోహర్రెడ్డి, క్రాంతికుమార్, రామతీర్థపు రాజు, నరాల శేఖర్, సిరిగిరి రామచందర్, నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, జోగిని శంకర్, గోలి మహేశ్ పాల్గొన్నారు. నేడు ప్రజావాణి రద్దుసిరిసిల్ల: కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిని ఈ సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదివారం ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. -
గోశాల నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టండి
వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా గోశాలను సువిశాల ప్రాంతంలో నిర్మించాలని సీఎం రేవంత్రెడ్డి తనకు సూచించినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఖతర్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని రాష్ట్రానికి చేరుకున్న ఆయన ఆదివారం సీఎంను కలిసి పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. కోడెల సంరక్షణకు అత్యాధునిక వసతులు, సువిశాలమైన గోశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించాలని సూచించారు. ఇటీవల రూ.200కోట్లతో వేములవాడ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరుపై, ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన కమిటీల్లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, డిలీమిటేషన్ కమిటీ సభ్యులుగా నియమించడంపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
పచ్చదనమే లక్ష్యం
● నర్సరీలలో సిద్ధమవుతున్న మొక్కలు ● జిల్లా వ్యాప్తంగా 255 నర్సరీలు ● 5.70 లక్షల మొక్కలు లక్ష్యం ● జూన్ నెలాఖరు వరకు సిద్ధమవుతున్న అధికారులుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవానికి అన్ని సిద్ధమయ్యాయి. ఇప్పటికే నర్సరీలలో మొక్కలను అధికారులు పెంచారు. జిల్లాలో 5.70 లక్షల మొక్కలు లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఈమేరకు సిద్ధం చేశారు. జూన్ నెలాఖరు వరకు వనమహోత్సవానికి స్థలాలను ఎంపిక చేసి, మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. 255 నర్సరీలు..5.70లక్షల మొక్కలు జిల్లా వ్యాప్తంగా 255 గ్రామపంచాయతీల పరిధిలో నర్సరీలను నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రామపంచాయతీలో ఒక్కో నర్సరీ నిర్వహిస్తున్నారు. ఒక్కో నర్సరీలో దాదాపు 50 వేల నుంచి 80 వేల వరకు మొక్కలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 9 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. లక్ష్యానికి మించి మొక్కలు రెడీగా ఉన్నాయి. నాటిన మొక్కలు ఒక వేళ ఎండిపోయిన, పశువులు తిన్నా.. వాటి స్థానంలో కొత్తవి నాటేందుకు అదనపు మొక్కలు కూడా జిల్లాలో ఉన్నాయి. వర్షాలు కురవగానే జూన్ 15 నుంచి మొక్కలు నాటడానికి స్థలాలను ముందుగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. జూన్ నెలాఖరు నుంచి మొక్కలు నాటడానికి ప్రణాళికలు తయారు చేశారు. ఉపాధిహామీలో.. ఉపాధిహామీ, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ముందుగా గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి, కూలీలతో మొక్కల పెంపకం చేపడుతున్నారు. నర్సరీలను జిల్లా కలెక్టర్తోపాటు గ్రామీణాభివృద్ధి, ఉపాధిహామీల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు ఇచ్చారు. నిర్ధేశిత లక్ష్యాలను చేరుకునేలా నర్సరీ నిర్వాహకులను స్థానిక ఏపీవోలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. దీంతో జిల్లాలో ఇప్పటికే 9 లక్షల మొక్కల వరకు సిద్ధం చేయగా.. రానున్న వనమహోత్సవంలో నాటేందుకు ప్రణాళికలు పెట్టుకున్నారు. మొక్కలు ఇవీ.. వనమహోత్సవంలో ప్రధాన రహదారుల వెంట కానుగ, గుల్మోర్, నిద్రగన్నేరు, సిసు వంటి మొక్కలను నాటనున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని వీధులు, గృహాల్లో జామ, ఉసిరి, అల్లనేరేడు, చింత, మామిడి, సీతాఫలం, దానిమ్మ, ఖర్జూర, బాదం, గులాబీ, మల్లె, మందారం మొక్కలు నాటనున్నారు. మొక్కలను తీసుకునేందుకు నర్సరీలకు వచ్చే వారికి పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల వారు నర్సరీలకు వస్తే వారికి ఇష్టమైన మొక్కలు అందిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో మొక్కలు ఇలా.. మండలం జీపీలు మొక్కలు బోయినపల్లి 23 30,000 చందుర్తి 19 40,000 ఇల్లంతకుంట 33 60,000 గంభీరావుపేట 21 60,000 కోనరావుపేట 28 60,000 ముస్తాబాద్ 22 60,000 రుద్రంగి 10 30,000 తంగళ్లపల్లి 30 60,000 వీర్నపల్లి 17 50,000 వేములవాడ రూరల్ 17 40,000 వేములవాడ అర్బన్ 11 20,000 ఎల్లారెడ్డిపేట 24 60,000మొక్కలు సిద్ధం వనమహోత్సవానికి నర్సరీలలో మొక్కలు సిద్ధం చేశాం. జిల్లాలో 5.70 లక్షల మొక్కలు లక్ష్యంగా పెట్టుకున్నాం. గతేడాదిలో పెంచిన మొక్కలు దాదాపు 9 లక్షల వరకు రెడీగా ఉన్నాయి. – కొమురయ్య, ఏపీవో -
‘బంటియా’ ఫర్నీచర్ షోరూం ప్రారంభం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల ఎదురుగా నూతనంగా ఏ ర్పాటు చేసిన బంటియా ఫర్నీచర్ షోరూంను శు క్రవారం బంటియా మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ బంటియాతో కలిసి సుడా చైర్మన్ కె.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేందర్ బంటియా మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు పొందిన బంటియా ఫర్నీచర్స్ ఇప్పుడు కరీంనగర్లో తన అతిపెద్ద షోరూంను గ్రాండ్గా ప్రారంభించినట్లు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి దిగుమతి చేసిన తాజా, నాణ్యమైన ఫర్నిచర్ ఉత్పత్తులను అందిస్తున్నామని అన్నారు. రూ.99,999కి పైగా కొనుగోలు చేసే కస్టమర్లకు హోండా యాక్టివా 6జీ ఉచితంగా ఇవ్వడంతో పాటు ప్రత్యేక బహుమతులు, డిసౌంట్లు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్యుత్ ఆధారిత రీకై ్లనర్లు రూ.99,999లకు లభిస్తాయన్నారు. క్రేవింగ్ సోఫాలు రూ. 66,000 నుంచి ప్రారంభమవుతాయని, ప్యాకేజీలు, జీరో డౌన్ పేమెంట్ ఈఎంఐ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పొగాకుతో గుండెకు ముప్పు
పాన్, గుట్కా, తంబాకు, సిగరెట్లలో నికోటిన్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి రక్తనాళాలను సంకుచితం చేస్తాయి. దీంతో రక్తప్రసరణ తగ్గి గుండైపె ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలంగా వీటిని వినియోగించే వారిలో గుండెపోటు, పక్షవాతం, హైపర్టెన్షన్ వంటి తీవ్రమైన కార్డియోవాస్కులర్ సమస్యలు వస్తాయి. పొగాకు వల్ల శరీరంలో శ్రీకోలెస్ట్రాల్శ్రీ స్థాయి పెరిగి, నాళాల్లో శ్రీబ్లాక్శ్రీ ఏర్పడుతుంది. ఇది గుండెకు రక్తసరఫరాను తగ్గించి ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, మితాహారం, వ్యాయామం పాటించడం ఎంతో అవసరం. – డాక్టర్ అనీశ్పబ్బ, కార్డియాలజిస్టు -
బావిలో పడిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి
మల్లాపూర్: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ట్రాక్టర్ పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలకేంద్రం శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. మాట్ల చిన్నపెద్దులు(61)కు భార్య సత్తమ్మ, కుమార్తె ఉన్నారు. ఉపాధి నిమిత్తం గతంలో గల్ఫ్ వెళ్లి వచ్చి కుమార్తె వివాహం జరిపించాడు. ఎనిమిదేళ్లుగా స్వగ్రామంలోనే ఉంటూ ట్రాక్టర్ నడిపించుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన శనిగారపు రమేశ్కు చెందిన వ్యవసాయ భూమిలో చిన్నపెద్దులు ట్రాక్టర్తో దుక్కి దున్నుతున్నాడు. రివర్స్ వెళ్లే క్రమంలో ట్రాక్టర్ వ్యవసాయబావిలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. నీటమునిగి చిన్నపెద్దులు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతుడి భార్య సత్తెమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై రాజు తెలిపారు. -
అంజన్న హుండీ ఆదాయం రూ.1.95 కోట్లు
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపును శుక్రవారం ఆలయ అధికారి శ్రీకాంత్, పర్యవేక్షణాధికారి రాజమౌలి ఆధ్వర్యంలో చేపట్టారు. 24 రోజులకుగాను హుండీ ఆదాయం రూ.1,00,95,392 సమకూరిందని, 44 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు. భక్తులు హుండీలో వేసిన మిశ్రమ బంగారం, వెండికి సీలువేసి,తిరిగి హుండీలో వేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు రామకృష్ణ, స్థానాచార్యుడు కపీందర్, పర్యవేక్షకుడు సునీల్కుమార్, ఎన్.చంద్రశేఖర్, హరిహరనాథ్, ఆలయ సిబ్బంది, ఏఎస్సై శ్రీనివాస్, శ్రీలలిత సేవా ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. ఉరేసుకుని ఒకరి ఆత్మహత్యమల్యాల: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన బేతి కృష్ణ(38) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. వైద్య చికిత్స కోసం లక్షలు ఖర్చు చేసినా, వ్యాధి నయం కాకపోవడంతోపాటు జీవితంపై విరక్తి చెందిన తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి తల్లి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. బావిలో పడి వృద్ధుడు మృతిసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన లంక ముత్తయ్య(70) సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపిన వివరాలు.. ముత్తయ్యకు కొడుకు, కూతురు ఉండగా కూతురు నర్సయ్యపల్లిలో ఉంటోంది. అనారోగ్యంతోపాటు మతిస్థిమితం సరిగా లేని ముత్తయ్య నెలరోజుల క్రితం కూతురు ఇంటికి వచ్చాడు. ఈనెల 18న ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు. ఈక్రమంలో అతడు ఇంటికి వెళ్లకపోవడంతో బంధువులు ఇళ్లలో, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం నర్సయ్యపల్లి శివారులోని వ్యవసాయ బావిలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనబడడంతో ముత్తయ్యగా కుటుంబసభ్యులు నిర్ధారించారు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలంలోని గంగారం శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కూనారం గ్రామానికి చెందిన ఎండీ అక్రం(27) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలో మెకానిక్ పని చేస్తూ జీవనం సాగిస్తున్న అక్రం సాయంత్రం ఇంటికి వెళ్తుండగా ఆటోట్రాలీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అక్రం అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్ పేర్కొన్నారు. మృతుడికి భార్య సమీరాబేగం, తల్లి దండ్రులు రేష్మ బేగం అక్బర్ పాషా ఉన్నారు. -
సేవ.. స్వచ్ఛంద తోవ
● రాజన్న సేవలో మహిళలు ● ఆలయంలో వివిధ పనులకు స్వచ్ఛందంగా హాజరు ● గోశాలలోని గడ్డి ఆరబెట్టేందుకు తరలివచ్చిన అతివలు వేములవాడ: రాజరాజేశ్వరీ సేవా సమితి సభ్యులు రాజన్న సేవలో తరిస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో వివిధ పనులకు స్వచ్ఛందంగా హాజరవుతున్నారు. హుండీ లెక్కింపు.. ఉత్సవాల సమయాల్లో ఆలయంలో వివిధ సేవల్లో రాజరాజేశ్వరీ సేవా సమితి సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన తిప్పాపూర్ గోశాలలోని గడ్డిని ఆరబెట్టేందుకు సైతం శుక్రవారం భారీగా మహిళలు స్వచ్ఛందంగా వచ్చారు. పశువులకు సేవా చేయడంలో ఉన్న సంతృప్తి వేరేదాంట్లో రాదని వారు పేర్కొంటున్నారు. దాదాపు 63 మంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చి కోడెలకు ఉపయోగపడే గడ్డిని ఆరబెట్టే పనుల్లో నిమగ్నమై.. ఆదర్శంగా నిలిచారు. -
పొగాకు నిర్మూలిద్దాం
● విచ్చలవిడిగా తంబాకు, గుట్కా వినియోగం ● బహిరంగంగానే ధూమపానం ● పెరుగుతున్న సిగరేట్లు కాల్చే వారి సంఖ్య ● నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినంకరీంనగర్టౌన్: యువత ఎంజాయ్ చేస్తున్నామనే భావనలో ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. సిగరేట్ కాలినట్లే తమ ఆరోగ్యం కాలిపోతుందనే విషయం గమనించలేకపోతున్నారు. జిల్లాలో యుక్తవయస్సు వచ్చిన విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు సిగరేట్, బీడీ, తంబాకు, జర్ధా, గుట్కా వంటి మత్తు పొగాకు మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరదాగా మొదలు పెట్టి చివరకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పొగాకు ఉత్పత్తులపై నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వాటి వల్ల వివిధ రకాల రోగాలు వస్తాయని వైద్యులు చెబుతున్నా తినేవారిలో మార్పు రావడం లేదు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కథనం.బహిరంగ ధూమపానం నేరం ధూమపానం నష్టాన్ని గుర్తించిన పాలకులు 2003లో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరమని చట్టం తీసుకువచ్చారు. చట్ట ప్రకారం ప్రయాణ ప్రాంగణాలు, పార్కులు, రోడ్లపై, సినిమా థియేటర్లు, బహిరంగ ప్రదేశాల్లో పొగతాగితే చట్టరీత్యా చర్యలతో పాటు జరిమానా విధించాలి. కానీ, జిల్లాలో అలాంటి కేసులు నమోదు కావడం లేదు. సిగరేట్ తాగడం ఆరోగ్యానికి హానికరమని ప్యాకెట్లపై ముద్రించి వదిలేస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై మరింత కఠిన నియంత్రణలు విధించాలని, విద్యాసంస్థల పరిసరాల్లో గుట్కా, సిగరెట్ అమ్మకాలు పూర్తిగా నిషేధించాలని ఆరోగ్య కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. -
ధాన్యం రాశిపై అడవి పందుల దాడి
రుద్రంగి(వేములవాడ): ఓవైపు నెలల తరబడి ధాన్యం కొనుగోలు చేయక రైతన్న ధాన్యం వర్షాలకు మొలకెత్తుతుంటే.. అదే ధాన్యంపై అడవి పందులు దాడి చేసి టార్పాలిన్ కవర్లు చింపి ధాన్యం చిందరవందర చేస్తున్నాయి. గురువారం రాత్రి మండల కేంద్రానికి చెందిన అక్కెనపెల్లి నర్సింగరావు అనే రైతుకు చెందిన ధాన్యం రాశిపై అడవి పందులు దాడి చేసి టార్పాలిన్ చింపి వేశాయి. ధాన్యాన్ని చెల్లాచెదురు చేయడంతో రైతు లబోదిబోమంటున్నాడు. 22 మంది మందుబాబులకు జైలువేములవాడ: మద్యం సేవించి వాహనాలు నడిపిన 22 మందికి జైలుశిక్ష విధించినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ శుక్రవారం తెలిపారు. స్టేషన్ పరిధిలో గత 14 రోజులుగా డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 36 మంది మందుబాబులను పట్టుకున్నట్లు వివరించారు. వీరందరిని శుక్రవారం వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్ ఎదుట హాజరుపరచగా 36 మందిలో 22 మందికి జైలు, 14 మందికి జరిమానా విధించినట్లు తెలిపారు. ఇందులో 11 మందికి మూడు రోజుల జైలు, రూ.2వేలు జరిమానా, ఐదుగురికి రెండు రోజుల జైలు, రూ.2వేల జరిమానా, నలుగురికి నాలుగు రోజుల జైలు, రూ.2వేల జరిమానా, ఒకరికి ఐదు రోజుల జైలు, రూ.2వేల జరిమానా, ఒక వ్యక్తికి ఏడు రోజుల జైలు, రూ.2వేలు జరిమానా విధించారని తెలిపారు. ఐదుగురికి.. చందుర్తి(వేములవాడ): డ్రంకెన్డ్రైవ్ కేసులో ఐదుగురికి రెండు రోజుల జైలు, రూ.2వేలు జరిమానాను మెజిస్ట్రేట్ ప్రవీణ్కుమార్ విధించినట్లు చందుర్తి ఎస్సై బి.అంజయ్య తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు.. మెట్పల్లికి చెందిన ఒకరు, కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన ఒకరు, ఇబ్రహీంపట్నంకు చెందిన ఒక వ్యక్తి, వేములవాడ రూరల్ మండలం తిప్పయ్యపల్లికి చెందిన ఒకరు, చందుర్తికి చెందిన మరొకరికి రెండు రోజుల జైలు, రూ.2వేల జరిమానా విధించినట్లు ఎస్సై అంజయ్య వివరించారు. ట్రాక్టర్, జేసీబీ పట్టివేతఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలో శుక్రవారం అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు, జేసీబీని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. తహసీల్దార్ ఆఫీస్కు తరలించారు. మండలంలోని దేవునిగుట్టతండాలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకోగా.. గొల్లపల్లి హైస్కూల్ వద్ద తప్పించుకున్నారు. గల్ఫ్ కార్మికులకు అండగా రేవంత్రెడ్డి సర్కార్ వేములవాడ: గల్ఫ్ కార్మికులకు రేవంత్రెడ్డి సర్కార్ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఖతర్ వెళ్లిన ఆయనకు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఖతర్లోని లేబర్ క్యాంపులను సందర్శిస్తూ కార్మికుల బాధలు తెలుసుకొని వారిలో ఆత్మస్థయిర్యం, మనోనిబ్బారాన్ని నింపారు. టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్, గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ సింగిరెడ్డి నరేశ్రెడ్డి, గుగ్గిళ్ల రవిగౌడ్, టీపీసీసీ ఖతర్ కన్వీనర్ నిజామోద్దీన్ ఖాజా, తెలంగాణ గల్ఫ్ సమితి ఖతర్ ఫౌండర్ మెంబర్లు శంకర్గౌడ్, ఎల్లన్న తల్లపెల్లి, వెంకటేశ్, ఎల్లన్న మండపెల్లి, గడ్డి రాజు, చింతకుంట మహేందర్ తదితరులు ఉన్నారు. -
వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతం
కొత్తపల్లి(కరీంనగర్): టీపీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలో విద్యుత్ వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతమైందని ఎస్ఈ మేక రమేశ్బాబు అన్నారు. విద్యుత్ భవన్లోని ఎస్ఈ చాంబర్లో శుక్రవారం ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. గత సంవత్సరం నవంబర్ నెల నుంచి వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని.. అందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంతో విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించామన్నారు. లోడ్ పెరిగే అవకాశమున్నచోట్ల రాచర్ల తిమ్మాపూర్, మొయినకుంట, జేపీనగర్, బోనాల, మల్లారం, రేణిగుంట ప్రాంతాల్లో 5 ఎంవీఏ, కరీంనగర్ టౌన్ బ్యాంక్ కాలనీలో 12.5 ఎంవీఏ కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు నెలకొల్పామని, కరీంనగర్ టౌన్ ఉజ్వల పార్క్, వాటర్ వర్క్స్, ఎస్ఆర్ఆర్, నవపేట్, వీర్నపల్లి ప్రాంతాల్లో 5 ఎంవీఏ నుంచి 8 ఎంవీఏ, సప్తగిరికాలనీ సాయినగర్(ఖాజీపూర్–2)లో 8 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏ, కోర్కల్, వట్టములలో 3.15 నుంచి 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం వరకు పెంచామని వివరించారు. కరీంనగర్ మున్సిపల్ టౌన్, కాజిపూర్(బాబుపేట్), చిగురుమామిడి, సిరిసిల్ల జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి లోడ్ సామర్థ్యం పెంచడంతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నివారించగలిగామని చెప్పారు. ఇప్పటివరకు 325 కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతోపాటు 355 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ మున్సిపల్ టౌన్, కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో అల్గునూరు, చిగురుమామిడి, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర ప్రాంతాల్లో ఓవర్ లోడ్ తగ్గించామని, గత నవంబర్ నెల నుంచి నిరంతరాయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ వేసవికాల ముందస్తు కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేశామని తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
● డీఈవో శ్రీరామ్ మొండయ్యకరీంనగర్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నాణ్యమైన, గుణాత్మక విద్య లభిస్తుందని, పాఠశాలల బలోపేతానికి ఎస్జీటీయూ ఉపాధ్యాయ సంఘం ఆరు రోజుల పాటు బడిబాట ప్రచార రథాన్ని నిర్వహించడం అభినందనీయమని డీఈవో శ్రీరామ్ మొండయ్య అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నమోదు కోసం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల ఉమ్మడి జిల్లా ప్రచార రథాన్ని డీఈవో శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. జూన్ 5 వరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలన్నారు. ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్రెడ్డి మాట్లాడుతూ, న్యాయపరంగా రావాల్సిన హక్కుల కోసం ఉద్యమిస్తామని, ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని, విద్యార్థులు తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో విజయేందర్రెడ్డి, మంజుల హరిప్రియ, రమణారెడ్డి, సత్యం, కిషన్, సుధాకర్రావు, గాయత్రి, రోహిణిదేవి, సాగర్, మాధవ్, రామన్, వెంకటేశ్, అరవింద్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకుంటున్నారు
గాలిపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఈ శిబిరానికి హాజరవుతున్నారు. ఈతరం యువజన సంఘం సభ్యులు సహకరిస్తున్నారు. గ్రామంలోని క్రీడాభిమానులు విద్యార్థులకు స్నాక్స్, క్రీడాదుస్తులు అందించారు. – సాన బాబు, వ్యాయామ ఉపాధ్యాయుడు క్రీడాకారులను ప్రోత్సహించాలనే.. విద్యార్థుల కోసం సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశాం. వ్యాయామ ఉపాధ్యాయుడు సానబాబు విద్యార్థులకు మెలకువలు నేర్పిస్తున్నారు. మంచి క్రీడాకారులు తయారు చేయడమే లక్ష్యం. – జి.నరేశ్, ఈతరం యువజన సంఘం అధ్యక్షుడు -
మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
● జిల్లా జెండర్, ఈక్విటీ కో–ఆర్డినేటర్ పద్మజాసిరిసిల్ల: మానవ అక్రమ రవాణాను అరికట్టాలని, సామాజిక బాధ్యతగా అందరూ భాగస్వాములు కావాలని జెండర్ అండ్ ఈక్విటీ జిల్లా కోఆర్డినేటర్ పద్మజా కోరారు. జిల్లా కేంద్రంలోని గీతానగర్ స్కూల్లో ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. పద్మజా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందన్నారు. సైబర్ ట్రాఫికింగ్పై అవగాహన కల్పించాలన్నారు. ఉద్యోగం, సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ పట్టణాలకు తీసుకెళ్లి వ్యభిచార గృహాల్లో అమ్ముతున్నారని.. ఇలాంటి వాటి గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజ్వల సంస్థ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ బలరాం మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే మన ఆడపిల్లలను రక్షించుకోవచ్చన్నారు. ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటి వరకు 30 వేల మంది అమ్మాయిలు, మహిళలను కాపాడినట్లు తెలిపారు. ఇలాంటి వాటిపై సఖీ, భరోసా, చైల్డ్లైన్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్స్ 1098, 100, 181, 1930, 181లో గురించి చెప్పాలన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ శైలజా, అసిస్టెంట్ కోఆర్డినేటర్ అంబర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటి సంరక్షించాలి
● సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీహరి ప్రసాద్ వీర్నపల్లి(సిరిసిల్ల): ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి, సంరక్షించాలని సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీహరిప్రసాద్ కోరారు. ప్రపంచ పర్యావరణ వా రోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం వీర్నపల్లి మండలం రాశిగుట్టతండాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. మే 22 నుంచి జూన్ 6 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు ముందుకురా వాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి జూట్ బ్యాగులను వాడాలని సూచించారు. గతంలో ఇచ్చిన పోడు పట్టాలకు మించి అటవీ భూమి లో సాగుచేస్తే చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. తహసీల్దార్ ముక్తార్పాషా, ఎస్సై ఎల్లయ్యగౌడ్, మండల అబివృద్ధి అధికారి వాజిద్, వీర్నపల్లి సెక్షన్ అధికారి రంజిత్కుమార్, మోహన్లాల్, అంజలి, భూలక్ష్మి, పద్మలత, సక్కారాం పాల్గొన్నారు. నేడు కేంద్ర మంత్రి సంజయ్ పర్యటన బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని వెంకట్రావుపల్లి–జగ్గారావుపల్లి గ్రామాల పరిసరాల్లో నిర్మించే బ్రిడ్జి పనులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ శనివారం శంకుస్థాపన చేస్తారని బీజేపీ మండల అధ్యక్షుడు ఎడపల్లి పరశురామ్ శుక్రవారం తెలిపారు. కేంద్ర మంత్రి పర్యటనలో మండలానికి చెందిన బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
శిక్షణతో నైపుణ్యాలకు మెరుగు
● వేసవి శిక్షణ శిబిరంలో రాణిస్తున్న విద్యార్థులు ● గాలిపల్లి హైస్కూల్లో నెల రోజులుగా కొనసాగుతున్న శిబిరం ● ప్రోత్సహిస్తున్న గ్రామస్తులు, ఈతరం యువజన సంఘం ఇల్లంతకుంట(మానకొండూర్): వేసవి సెలవులను వృథా చేయకుండా క్రీడల్లో నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం శిక్షణ తరగతులకు హాజరవుతూ నచ్చిన క్రీడాంశంలో శిక్షణ పొందుతున్నారు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి హైస్కూల్లో గ్రామానికి చెందిన సీనియర్ క్రీడాకారుల ఆధ్వర్యంలో నెల రోజులగా వాలీబాల్, కబడ్డీ క్రీడల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వీరికి ఈతరం యువజన సంఘం తోడుగా నిలిచింది. సమ్మర్ క్యాంప్నకు వస్తున్న విద్యార్థులకు స్నాక్స్ అందించడంతోపాటు సౌకర్యాలు కల్పిస్తున్నారు. గ్రామస్తుల ప్రోత్సాహంతో విద్యార్థులు క్రీడల్లో మెరికల్లా తయారవుతున్నారు. 80 మంది విద్యార్థులు నెల రోజులుగా కొనసాగుతున్న క్రీడల వేసవి శిబిరానికి గాలిపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు 80 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం వాలీబాల్, కబడ్డీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. స్థానిక పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సాన బాబు, గ్రామంలోని సీనియర్ క్రీడాకారుల సలహాలు, సూచనలతో శిక్షణ తీసుకుంటున్నారు. గ్రామంలోని సీనియర్ క్రీడాకారులు శిక్షణార్థులకు క్రీడాదుస్తులు అందజేశారు. -
పీసీసీలో మనోళ్లకు చోటు
● పీఏసీ కమిటీలో దుద్దిళ్ల, పొన్నం, ఆది ● కేబినెట్లో చోటు కోసం ఉమ్మడి నేతల ఆరాటంసాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన వివిధ పీసీసీ కమిటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రికి చోటు దక్కింది. పీసీసీ కమిటీల్లో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్లను నియమించారు. కాగా.. ఇటీవల కొంతకాలంగా పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డికి సలహా కమిటీలో అవకాశం కల్పించారు. అదేవిధంగా డీలిమిటేషన్ కమిటీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలను సభ్యులుగా నియమించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలవగా, అందులో నలుగురికి పీసీసీ కమిటీల్లో అవకాశం లభించింది. మంత్రి వర్గంలో ఆది.. మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు మరో బెర్తు ఖాయంగా కని పిస్తోంది. కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేల్లో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నా రు. మున్నూరు కాపు సామాజికవర్గం కోణంలో ఆ యనకు బెర్తు ఖాయమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. మాదిగ సామాజిక వర్గం తరఫున త మకు కూడా కేబినెట్ లో చోటు కల్పించాలని మరో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు కో రుతున్నారు. మరోవైపు తనకు కూడా మంత్రి పద వి ఇవ్వాలని ఇటీవల రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కోరిన విషయం విదిత మే. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇప్పటికే దు ద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ కేబినెట్లో ఉ న్నారు. వీరికితోడుగా మరో ఒక్క బెర్తు మాత్రమే ఖ రారయ్యే అవకాశాలు ఉండటంతో ఈ ఒక్క మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. -
జెండా పండుగ అతిథులు వీరే
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జరిగే జాతీయ పతాక ఆవిష్కరణ పండుగకు జిల్లా కేంద్రాల్లో జరిగే ఉత్సవాలకు అతిథులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, జగిత్యాలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, పెద్దపల్లికి రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, రాజన్న సిరిసిల్లకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్లు జెండా ఆవిష్కరించనున్నారు.వేములవాడ సబ్రిజిస్ట్రార్గా విజయభాస్కర్వేములవాడ: వేములవాడ సబ్ రిజిస్ట్రార్గా దేవరం విజ యభాస్కర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయన వేములవాడకు ప్రమోషన్పై వచ్చారు.నీరు నిల్వ ఉండకుండా చూడాలి● జిల్లా వైద్యాధికారి ఎస్.రజితసిరిసిల్ల: కొబ్బరి బొండాలు, కూలర్లు, డ్రమ్ముల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత కోరారు. సిరిసిల్లలోని సుందరయ్యనగర్ ఆరోగ్య కేంద్రం పరిధిలో శుక్రవారం డ్రై డేలో భాగంగా ప్రగతినగర్లో తనిఖీలు చేశారు. ఇంటి వద్ద ఉండే నీటితొట్లు, డ్రమ్ములు, ఆరు బయట పరిసరాలను పరిశీలించారు. డెంగీ, మలేరియా జ్వరాల నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, మలేరియా సూపర్వైజర్ లింగం, వాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.అధిక ధరలకు విక్రయిస్తే చర్యలుకోనరావుపేట(వేములవాడ): విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు గరిష్ట ధర(ఎమ్మార్పీ) కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధి కారి అఫ్జల్ బేగం హెచ్చరించారు. కోనరావుపేట, నిజామాబాద్, ధర్మారం గ్రామాల్లోని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నాణ్యమైన విత్తనాలు అందించాలని ఫర్టిలైజర్ దుకాణాదారులకు సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. విత్తనాల ధరలు, స్టాక్ వివరాలు బోర్డుపై ప్రదర్శించాలన్నారు. తనిఖీలలో స్థానిక మండల వ్యవసాయ అధికారి సందీప్ పాల్గొన్నారు.స్పోర్ట్స్ అకాడమీ హాస్టళ్లలో ప్రవేశాలకు ఎంపికలుసిరిసిల్లకల్చరల్: రాష్ట్ర క్రీడా ప్రాధికారసంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ స్పోర్ట్స్ అకాడమీలు, హాస్టళ్లలో ప్రవేశాలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల శాఖాధికారి అజ్మీర రాందాస్ శుక్రవారం తెలిపారు. సిరిసిల్ల వాలీబాల్ అకాడమీ కోసం రాజీవ్నగర్ మినీస్టేడియంలో జూన్ 10న జరిగే పోటీల్లో 14 నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలు పాల్గొనాలని తెలిపారు. జూన్ 1న సిద్దిపేట అకాడమీ, జూన్ 12, 13న మహబూబ్నగర్ స్టేడియం, 10, 11న సైక్లింగ్ వెలోడ్రోమ్ ఓయూ క్యాంపస్, ప్రాంతీయ క్రీడా వసతి గృహం హనుమకొండ, 12న వనపర్తి హాకీ అకాడమీ, ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు.ఆర్టీసీ బస్టాండ్లో పార్కింగ్కు టెండర్లుసిరిసిల్లటౌన్: ఆర్టీసీ కొత్త బస్టాండ్లో వెహికిల్ పార్కింగ్, క్యాంటీన్ నిర్వహణ, ఎల్లారెడ్డిపేటలో వెహికిల్ పార్కింగ్, ముస్తాబాద్లో మొబైల్ షాప్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డీఎం ప్రకాశ్రావు తెలిపారు. సిరిసిల్ల డిపోయార్డ్, గ్యారేజీలలో స్వీపింగ్, క్లీనింగ్ కాంట్రాక్టు వర్క్ కోసం టెండర్పత్రాలు డిపో మేనేజర్ ఆఫీసులో విక్రయిస్తున్నట్లు తెలిపా రు. 99493 73819, 86868 69005 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
బిల్లులు రావు.. దిగులు తీరదు !
సిరిసిల్లటౌన్: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా మారింది సిరిసిల్లలో కాంట్రాక్టర్ల పరిస్థితి. దాదాపు మూడేళ్ల క్రితం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.కోట్లాది పనులను టెండర్ల ద్వారా దక్కించుకుని నిర్మాణాలు పూర్తి చేశారు. అధికారులు నాణ్యతను పరిశీలించి నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి పంపించారు. దీంతో సుమారు రూ.6కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం ఇటీవల అందించింది. ప్రతీ రోజూ కాంట్రాక్టర్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా బిల్లులు అందడం లేదు. కాంట్రాక్టర్ల ఎదురుచూపులపై ‘సాక్షి’ ఫోకస్. బిల్లులపై కాలయాపన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల మంజూరులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.10కోట్లతో సిరిసిల్లలో మూడేళ్ల క్రితం పనులు చేపట్టినట్లు సమాచారం. వీటిని హైదరాబాద్, కరీంనగర్, పెద్దపల్లికి చెందిన ఐదుగురు కాంట్రాక్టర్లు పనులు పొందారు. ప్రభుత్వ పనులే కదా బిల్లులు వస్తాయని కొందరు ఆస్తులు, ఆభరణాలు తాకట్టు పెట్టి పనులు చేయించగా.. మరికొందరు అప్పు చేసి పనులు పూర్తి చేయించారు. మూడేళ్లుగా బిల్లులు రాకపోవడంతో అధికారులు, ఆఫీసులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నెల క్రితం రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల మున్సిపాలిటీకి రూ.5.85కోట్లు టీయూఎఫ్ఐడీసీ నిధులు మున్సిపాలిటీకి చేరాయి. 22 పనులకు సంబంధించిన బిల్లులు వస్తున్నాయని నెల రోజులుగా కాంట్రాక్టర్లు గంపెడాశతో ఉంటున్నారు. జిల్లా కలెక్టర్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్లపైనే వారు ఆశలు పెట్టుకున్నారు. కొత్తపనులకు ముందుకురాని కాంట్రాక్టర్లు పాతబిల్లులే మూడేళ్లుగా రాకపోవడంతో కొత్త పనుల కోసం టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్సీ, రాజ్యసభ, ఎస్డీఎఫ్ నిధుల ద్వారా పలు అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో వాయిదా వేశారు. ఇక సిరిసిల్ల మున్సిపల్ పరిఽధిలో మూడేళ్ల క్రితం రోడ్లు, వరదకాల్వలు, డ్రెయినేజీలు, కమ్యూనిటీ భవనాలు, క్రీడాస్థలాల పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం అధికారులు టెండర్లు పూర్తి చేసి పనులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. సదరు పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని 2023లో అప్పటి కమిషనర్ ఎండీ అయాజ్ను, 2024లో దుబ్బాక లావణ్యను, నెల క్రితం సెలవులో వెళ్లిన కమిషనర్ ఎస్.సమ్మయ్య, ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న పోసు వాణిలకు విన్నవించారు. అయినా ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. మీరు చూస్తున్న ఈ చిత్రం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం. మైదానంలో గ్రావెల్ పనులు, సీటింగ్ గ్యాలరీ, పైకా భవనం, మరుగుదొడ్లు, మూత్రశాలలు పూర్తయ్యాయి. దీనిని అభివృద్ధి చేసేందుకు మూడేళ్ల క్రితం టీయూఎఫ్ఐడీసీ రూ.3కోట్లు కేటాయించింది. వీటిలో రూ.కోటి వరకు బిల్లులు కాంట్రాక్టర్కు చెల్లించగా.. ప్రస్తుతం మరో రూ.70లక్షలు రెండో విడతగా నిధులు మంజూరయ్యాయి. మీరు చూస్తున్న ఈ ఫొటో జిల్లా కేంద్రంలోని వెంకంపేట ఆధునిక దోభీఘాట్ నుంచి పద్మనగర్ వరకు సుమారు 1.5 కిలోమీటర్లు నిర్మించిన ప్రధాన డ్రెయినేజీ. సుమారు రూ.6కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో ఐదేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. మూడేళ్ల క్రితమే కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేశారు. గతంలో సగం నిధులు మంజూరుకాగా కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం రూ.1.4కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చేరలేదు. మూడేళ్లుగా కాంట్రాక్టర్లకు ఎదురుచూపులే సిరిసిల్ల బల్దియాలో వింత ధోరణి పట్టించుకోని అధికారులు ఆందోళనలో కాంట్రాక్టర్లుఉన్నతాధికారులకు విన్నవిస్తాం కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుపై చర్యలు తీసుకుంటాం. బిల్లుల విషయమై ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తాం. నెల రోజుల క్రితం టీయూఎఫ్ఐడీసీ నిధులు వచ్చాయి. పట్టణ ప్రగతి పనుల బిల్లులు కూడా కొన్ని అందాయి. త్వరలోనే బిల్లులను అందజేసేందుకు కృషి చేస్తాం. – పోసు వాణి, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
చందుర్తి(వేములవాడ): త్వరలోనే జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. చందుర్తిలో పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం పార్టీ నాయకులు ప్రతాప రామకృష్ణ, చెన్నమనేని వికాస్రావులతో కలిసి ప్రారంభించారు. గోపి మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు గడపగడపకు తీసుకెళ్లాలని కోరారు. ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు. ప్రతీ కార్యకర్త స్థానికసంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు సైనికునిల్లా పనిచేయాలని కోరారు. పార్టీ మండలాధ్యక్షుడు మోకిలే విజేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అల్లాడి రమేశ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కోల కిష్టస్వామి, నియోజకవర్గ కన్వీనర్ మార్త సత్తయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, సీనియర్ నాయకులు పడాల గణేశ్, పోంచేటి రాకేశ్, నంద్యాడపు వెంకటేశ్, మారుతి, వేణుగోపాల్, రాపెల్లి శ్రీధర్, చిలుముల హనుమయ్య, తీపిరెడ్డి మనోహర్రెడ్డి, మట్కం మల్లేశం, చింతకుంట గంగాధర్ పాల్గొన్నారు. ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని పరీక్షలు చేయాలి
● రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝాసిరిసిల్ల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని వైద్యపరీక్షలు చేయాలని, ఆస్పత్రుల్లో వసతులు కల్పించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో 2డీ–ఇకో పరీక్షలతోపాటు అన్నీ పరీక్షలు చేయాలన్నారు. డయాగ్నోస్టిక్ హబ్లో అన్ని రకాల పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, శాంపిల్స్ సేకరణ, రిపోర్ట్ వేగంగా అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, టెక్నీషియన్స్ తాత్కాలిక ప్రాతిపదికన ఎక్కువ వేతనం అందించి నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధికి చేపట్టిన పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించి, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. సదరం క్యాంపులను ఎప్పటికప్పుడు నిర్వహించి దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు జారీ చేయాలని సూచించారు. వేములవాడ ఆస్పత్రిలో మోకాల ఆపరేషన్ విజయవంతంగా జరుగుతున్నాయని, సిరిసిల్ల ఆస్పత్రిలోనూ ఇలాంటి ఆపరేషన్లు జరగాలన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్.రజిత, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి సమీక్షించారు. జెండా ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్ధం చేయడంలో పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యేలా మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్.వెంకటేశ్వర్లు, డీఆర్డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, కలెక్టరేట్ ఏవో రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఇందిరమ్మ ఇళ్లను అర్హులకే కేటాయించాలని.. అనర్హులకు ఇస్తే అధికారులపై చర్యలు తప్పవని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు వానాకాలం పంటలసాగు సన్నద్ధతపై కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఖరీఫ్ సీజన్లో ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను భాగస్వామ్యం చేస్తాం. ఎస్సారెస్పీ సామర్థ్యం సిల్ట్ కారణంగా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ప్రకారం ఎస్సారెస్పీ రిజర్వాయర్ పూడికతీత, డీసిల్టేషన్ ఆధునిక పద్ధతుల్లో పూర్తిచేసి పూర్వపు సామర్థ్యం తీసుకొస్తాం. కడెం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల్లో సిల్ట్ తొలగించేందుకు అత్యాధునిక పద్ధతులను వినియోగిస్తాం. కరీంనగర్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తా.. ఇందుకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహకారంతో ముందుకు వెళ్తా. సింగరేణి భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. బండ్ల వాగు ఎత్తిపోతల పథకాన్ని వారం రోజులలో ప్రారంభిస్తాం. పాలకుర్తి ఎత్తిపోతల పథకం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణ పనులకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.● రోళ్లవాగు ప్రాజెక్టు అటవీ అనుమతులు వచ్చేలా ఉన్నతాధికారులతో జగిత్యాల కలెక్టర్ నిరంతరం సంప్రదింపులు చేయాలని మంత్రి సూచించారు. నారాయణపురం రిజర్వాయర్, కొండగట్టు ఎత్తిపోతల పథకం, కలికోట సూరమ్మ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలుచేస్తుందన్నారు. కలెక్టర్లు మరోవారం కొనుగోలు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అవసరమైనమేర ధాన్యం రవాణా కోసం వాహనాలు సిద్ధం చేసుకోవాలని.. లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు వాడాలన్నారు. దేశంలో మొదటిసారిగా తెలంగాణలోని 84 శాతం జనాభాకు ఉచితంగా ఆరుకిలోల సన్నబియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది విప్లవాత్మక పథకమని.. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకై క రాష్ట్రం మనదే అని తెలిపారు.ఇళ్ల స్థలాలపై ఆందోళన వద్దు..మీడియా మిత్రులకు ఎస్సారెస్పీ సమీపంలో అందుబాటులో ఉన్న భూములు పంపిణీకి ఉన్న సమస్యలు పరిష్కరించి త్వరలోనే ఇంటి పట్టాలు కేటాయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. కరీంనగర్ మీడియా మిత్రులు ఇండ్ల పట్టాల పంపిణీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో చర్చించి త్వరలో పట్టాలు అందించే కార్యక్రమం చేపడుతామని పేర్కొన్నారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగిందన్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.51 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలతో రైతుల నష్టపోకుండా అవసరమైన టార్ఫాలిన్ కవర్లు కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు. భూ భారతి చట్టంతో పట్టాదారులకు ఎటువంటి నష్టం రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పాలకుల హయాంలో రైస్ మిల్లులవద్ద తూకం పేరుతో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎక్కడా ఇబ్బంది లేదన్నారు. మలకపేట, సూరమ్మ, మోతె నారాయణపూర్, గౌరవెల్లి, దేవాదుల వంటి ప్రాజెక్టుల పనులు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలోకి భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలు వస్తాయని.. ఆయా జిల్లా కలెక్టర్లను సైతం సమీక్ష సమావేశాలకు ఆహ్వానించాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, చింతకుంట విజయ రమణా రావు, డాక్టర్ సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా, సత్య ప్రసాద్, పెద్దపల్లి అదనపు కలెక్టర్ జె.అరుణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. -
స్లాట్ బుకింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు
● జూన్ 2 నుంచి అమలు ● ఆన్లైన్లోనే స్టాంపు డ్యూటీ చెల్లింపులు ● సిరిసిల్లకు రోజుకు 48 స్లాట్లు సిరిసిల్ల: రిజిస్ట్రేషన్లు ఇకపై స్లాట్ బుకింగ్ విధానంలో చేయనున్నారు. ఆన్లైన్లో స్టాంపు డ్యూటీ, ఇతర ఫీజుల చెల్లింపు ఇప్పటికే అమలులో ఉండగా.. తాజాగా ప్రతీ రిజిస్ట్రేషన్కు ముందే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని జూన్ 2 నుంచి అమలు చేయనున్నారు. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ సబ్ రిజస్ట్రార్ ఆఫీస్లు ఉండగా.. ప్రస్తుతం రోజుకు 60 నుంచి 80 రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఒక్క సిరిసిల్లలో 30 నుంచి 35 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. రోజుకు 48 స్లాట్లను కేటాయించారు. పనిదినాల్లో 48 డాక్యుమెంట్లకు మించి రిజిస్ట్రేషన్ చేయరాదు. regisrtration.telangana.gov. in వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సిరిసిల్ల, వేములవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ల్లోనూ ఈ స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయనున్నారు. అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లకు చెక్ అర్ధరాత్రి వరకు ఆఫీస్ తెరిచి ఉంచి అక్రమాలకు తెరలేపే పద్ధతులకు చెక్ పెట్టేందుకే స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. స్లాట్బుకింగ్ చేసుకొని, ఆన్లైన్లో డబ్బులు చెల్లించి ఆలస్యంగా వచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకునే అవకాశం లేదు. ఇప్పటికే వ్యవసాయ భూములకు సంబంధించి న రిజిస్ట్రేషన్లు పాస్బుక్కుల ద్వారా ఆయా మండలాల్లో తహసీల్దార్లు చేస్తున్నారు. ఇంటి నంబ రు, డాక్యుమెంట్లు, పట్టణ ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు సబ్రిజిస్ట్రార్ ఆఫీస్ల్లో జరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో మరింత పారదర్శకంగా స్లాట్బుకింగ్తో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఆస్తుల క్రయ, విక్రయదారులు స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వస్తే సరిపోతుంది. గంటలోపు అన్ని పనులు పారదర్శకంగా జరగనున్నాయి.స్లాట్ బుకింగ్ తప్పనిసరి జూన్ 2 తర్వాత నేరుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వస్తే రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదు. ముందే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్లో తేదీ, సమయం ఉంటుంది. నిర్ధిష్టమైన వేళల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. స్లాట్ బుకింగ్లో ఇచ్చిన సమయానికి వస్తే చాలు. – ఆర్వీవీ స్వామి, సబ్ రిజిస్ట్రార్, సిరిసిల్ల -
రసాభాసగా రాజన్నపేట ఇళ్ల విచారణ
● పరిహారం ఇవ్వాలని పలువురి వాదన ● మరోసారి వాయిదాబోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం వరదవెల్లి అనుబంధ రాజన్నపేటలోని 9 ఇళ్ల పరిహారం చెల్లింపులపై గతంలో వచ్చిన ఆరోపణలపై గురువారం వరదవెల్లి గ్రామపంచాయతీలో చేపట్టిన విచారణ రసాభాసగా మారింది. ఈనెల 20న విచారణకు ఎవరూ హాజరుకాకపోవడంతో వాయిదాపడ్డ విషయం తెలిసిందే. గురువారం నాటి విచారణకు గ్రామానికి చెందిన పలువురు హాజరై తమ ఇళ్లకు పరిహారం రాలేదన్నారు. తమకు సైతం పరిహారం ఇవ్వాలని కోరారు. గతంలో పరిహారం తీసుకున్న వారికి మళ్లీ ఇస్తే తమకు సైతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న 9 మంది న్యాయవాదితో వచ్చారని డీఎల్పీవో నరేశ్ తెలిపారు. 2005 నుంచి గ్రామపంచాయతీ రికార్డులు సక్రమంగా లేవన్నారు. రికార్డులు సరిగ్గా తీసుకురావాలని ఆదేశించినట్లు తెలిపారు. సమావేశం రసాభాసగా మారడంతో వాయిదా వేస్తున్నట్లు డీఎల్పీవో ప్రకటించారు. సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్రావు, గతంలో పని చేసిన పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవో శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి శ్రీహిత హాజరయ్యారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
సిరిసిల్లటౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుమాల రమానాథ్రెడ్డి కోరారు. టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం గురువారం గీతానగర్ హైస్కూల్లో నిర్వహించారు. ప్రభుత్వాలు మారినప్పుడు విద్యావిధానాలు మారడం, నూతనంగా పాఠశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలలు సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయన్నారు. 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల వేతనాలు, సమగ్ర సర్వే చేసిన ఉపాధ్యాయులకు గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర కౌన్సిలర్ సత్తు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, ఉపాధ్యక్షులు పురం వాసుదేవరావు, మందాడి శ్రీనివాస్రెడ్డి, నూగురి దేవేందర్, కేవీ రజ నీరాణి, తాళ్లపల్లి శ్రీధర్, మైలారం తిరుపతి, చకినాల రామచంద్రం పాల్గొన్నారు.జాగ్రత్తలతో కరోనాను నివారించవచ్చు● వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి● జిల్లా వైద్యాధికారి ఎస్.రజితసిరిసిల్ల: జిల్లాలో కాలానుగుణంగా వ్యాపించే వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. ఈమేరకు గురువారం జిల్లా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ.. ప్రకటన విడుదల చేశారు. సాధారణ జలుబు, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రయాణాలు, జనసమూహాల్లో ఉన్నప్పుడు మాస్క్లు ధరించాలని సూచించారు. కోవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల్లో నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే నిర్ధారణకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చికిత్సతోనే నయమవుతుందని తెలిపారు. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి తక్కువస్థాయి లక్షణాలే నమోదవుతున్నాయని వివరించారు. -
పాలిస్టర్ వస్త్రానికి కూలి పెంచాలి
సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి కార్మికుల కూలి పెంచాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ కోరారు. యజమానులతో చర్చలు జరిపించి కూలి పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్కు గురువారం వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కార్మికుల కూలి ఒప్పందం 2024 ఏప్రిల్తోనే ముగిసిందన్నారు. ఈమేరకు యజమానులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పెంచకుంటే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.‘ఆలయ అభివృద్ధికి వ్యతిరేకం కాదు’వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ఈవో తమకు హైకోర్టు ద్వారా కేవియట్ నోటీస్ పంపించమేంటని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ప్రశ్నించారు. భీమేశ్వర గార్డెన్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి ప్రణాళిక లేకుండానే ఆలయాన్ని మూసివేస్తామనడం సమంజసం కాదన్నారు. తాము సైతం కోర్టులను ఆశ్రయించి భక్తుల మనోభావాలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. రాపెల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.గోశాలలో దిద్దుబాటు చర్యలువేములవాడఅర్బన్: తిప్పాపూర్లోని రాజన్న గోశాలలో దిద్దుబాటు చర్యలకు ఆలయ అధికారులు గురువారం దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గోశాలలో పరిశుభ్రత లోపించడం, వరిగడ్డి కట్టలు తడిసిపోయాయన్న విమర్శలకు అధికారులు స్పందించారు. ఆలయ సిబ్బంది, అధికారులు, సేవాసమితి సభ్యులు గోశాలలోని వరిగడ్డి కట్టలను ఆరబెట్టి, వాటిని ఒక చోట పేర్చి టార్పాలిన్ కవర్లు కప్పించారు. అంతేకాకుండా బురదతో నిండిపోయిన గోశాలలో వర్షం నీటిని తీయించి బురద కాకుండా చర్యలు తీసుకున్నారు. మరిన్ని సౌకర్యాలు క ల్పిస్తామని ఈవో వినోద్రెడ్డి తెలిపారు. ఈఈ రాజేశ్, ఏఈ రామకృష్ణారావు, గోశాల పర్యవేక్షకులు విజయ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రైతుల కష్టం వరదపాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అధికారుల నిర్లక్ష్యం మూలంగా వరదపాలైంది. అకాల వర్షాలు దండికొట్టడంతో 45రోజులుగా తూకం వేయకుండా కేంద్రాల్లోనే ఉన్న ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తింది. దీంతో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ఐకేపీ అధికారులు, నిర్వహకుల నిర్లక్ష్యం వల్ల మాయిచ్చర్ వచ్చి 45 అయినప్పటికీ రైతులు కేంద్రాలకు తెచ్చిన వడ్లను తూకం వేయలేదు. కేంద్రాల్లో హమాలీలు లేక, నిర్వహకులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. తడిసి మొలకెత్తిన ధాన్యం -
సింగరేణి స్టేడియానికి ఆధునిక హంగులు
● రూ.2కోట్లు ప్రకటించిన సీఎండీ బలరామ్ ● ప్రత్యేక సంస్థతో ప్రతిపాదనల రూపకల్పన ● త్వరలో తుదిరూపం వచ్చే అవకాశం ● సింథటిక్ ట్రాక్తోపాటు స్టేడియం విస్తరణకు చర్యలు ● కొన్ని సంగరేణి క్వార్టర్లను కూడా తొలగించే అవకాశంగోదావరిఖని: క్రీడాకారులకు అనుగుణంగా సింగరేణి స్టేడియాన్ని ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని యాజమాన్యం నిర్ణయించింది. సింథటిక్ వాకింగ్ట్రాక్తో పాటు క్రికెట్ ప్లే గ్రౌండ్, వాలీబాల్ కోర్టు, ట్రాక్ విస్తరణ కోసం మైదాన్ని విస్తరించాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం సీఎండీ బలరాం ఇటీవల రూ.2కోట్లు ప్రకటించారు. దీంతో రాబోయే తరానికి ఉపయోగపడేలా సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం స్టేడియంలోని కట్టడాలు, రాబోయే రోజుల్లో విస్తరిస్తే ఎలా మార్చాల్సి ఉంటుందనే అంశంపై నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈమేరకు స్పోర్ట్స్ అథారిటీ కంపెనీ ప్రతినిధులు మంగళవారం స్టేడియాన్ని పరిశీలించారు. సింథటిక్ ట్రాక్పైనే దృష్టి.. ప్రధానంగా సింథటిక్ వాకింగ్ ట్రాక్పై యాజమాన్యం దృష్టి సారించింది. 400 మీటర్ల వాకింగ్ ట్రాక్ లేదా 800మీటర్ల వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మైదానం చుట్టూ సింథటిక్ వాకింగ్ట్రాక్, మధ్యలో క్రికెట్ గ్రౌండ్, ఫుట్బాల్ కోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్వార్టర్ల తొలగింపుపై ఆలోచన జవహర్లాల్ నెహ్రూ స్టేడియం విస్తరణలో భాగంగా మైదానాన్ని ఆనుకుని ఉన్న సీఈఆర్క్లబ్ ఎదుట గల సింగరేణి క్వార్టర్లను తొలగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే స్టేడియం వెనకాల ఉన్న కొన్ని క్వార్టర్లను కూడా తొలగించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి స్పోర్ట్స్ అథారిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అభివృద్ధి కోసం రూ.2కోట్లు కేటాయిస్తారు. ఈప్రాంత క్రీడాకారులతోపాటు సింగరేణి ఉద్యోగులకు అనుకూలంగా స్టేడియంలో అన్నిఏర్పాట్లు చేస్తాం. సింథటిక్ వాకింగ్ట్రాక్ ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎమ్మెల్యే సూచనల మేరకు ఈప్రాంత క్రీడాకారుల కోసం స్టేడియం విస్తరణ పనులు శరవేగంగా సాగుతాయి. – లలిత్కుమార్, ఆర్జీ–1 జీఎం -
లక్ష్మీపూర్లో మున్నాభాయ్ ఎంబీబీఎస్!
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ లాగా నకిలీ వైద్యుడి లీలలు బుధవారం వెలుగు చూశాయి. గ్రామంలో వంగరి గోవర్దన్ అనే వ్యక్తి ఒక ఇంటిని అద్ధెకు తీసుకుని మెడికల్ ప్రాక్టీషనర్ పేరుతో క్లినిక్ను ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా తన కొడుకు పేరుతో ఎంబీబీఎస్ లెటర్ హెడ్తో వైద్యం ప్రారంభించాడు. పేషంట్లకు ఇంజక్షన్లు, సైలెన్లు పెట్టడం, ఎంబీబీఎస్ లెటర్ హెడ్పై మందులు వ్రాయడం మొదలెట్టాడు. వస్తున్న కాసులు సరిపోవడం లేదని అనుకున్నాడో ఎమో తెలియదు కానీ ఏకంగా మహిళలకు సంతానం కలిగిస్తానంటూ కొత్త వైద్యం ప్రారంభించాడు. సాధారణంగా గైనకాలజీ డాక్టర్లు మహిళలకు సంతానోత్పత్తి కొరకు హెచ్సీజీ ఇంజక్షన్లను అన్ని వైద్య పరీక్షల అనంతరం అవసమైతేనే ఇస్తుంటారు. ప్రథమ చికిత్సలకు పరిమితం కావాల్సిన మెడికల్ ప్రాక్టీషనర్లు ఏకంగా అర్హతగల డాక్టర్ల మాదిరిగా చికిత్సలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. నకిలీ వైద్యుడి వైద్యంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజితను ‘సాక్షి’ వివరణ కోరగా వారం రోజుల క్రితమే అతడికి నోటీసులు ఇచ్చామని, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొడుకు పేరుతో తండ్రి వైద్యం అద్దె ఇంటిలోనే పేషంట్లకు సైలెన్లు, ఇంజక్షన్లు ఇస్తున్న వైనం -
కోర్టు ఆవరణలో ఆటో దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లా కోర్టు ఆవరణలో పార్కింగ్ చేసిన ఆటోను దొంగిలించిన నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని గౌతమినగర్కు చెందిన జిలకర ప్రసాద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం బుట్టపూర్కు చెందిన మగ్గిడి కృష్ణ ఈనెల 26న జగిత్యాల కోర్టు ఆవరణలో ఆటోను పార్కింగ్ చేశాడు. దానిని ప్రసాద్ చాకచక్యంగా దొంగిలించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఈనెల 27న పట్టణ ఎస్సై గీత జిల్లాకేంద్రంలోని గాంధీనగర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ప్రసాద్ ఆటోలో వస్తూ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడిన ఉంచి ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని బుధవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై గీత, కానిస్టేబుళ్లు జీవన్, అనిల్, వంశీ పాల్గొన్నారు. ఉద్యమకారులను ఆదుకోవాలి పెద్దపల్లిరూరల్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి అన్నివిధాలా ఆదుకోవాలని ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఐలయ్య కోరారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద బుధవారం ఉద్యమకారులతో కలిసి నివాళి అర్పించారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత తమకు ప్రాధాన్యత దక్కుతుందని ఆశపడితే అప్పటి సీఎం ఉద్యమకారులను విస్మరించారని విమర్శించారు. కేవలం తమ కుటుంబానికే ప్రాధాన్యత ఇచ్చుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు మేలు కలిగేలా చూడాలని కోరారు. ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సారయ్య, నల్ల మనోహర్రెడ్డి, రాజేశం, జ్యోతి, చంద్రకళ, సురేందర్రెడ్డి, భాస్కర్, సదాశివ, రాజిరెడ్డి, రాజు, కృష్ణ, సదయ్య తదితరులు ఉన్నారు. ఫాజుల్నగర్ ప్రాంతంలో పులి ఆనవాళ్లువేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని ఫాజుల్నగర్ ప్రాంతంలో పులి తిరుగుతున్నట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈవిషయంపై వేములవాడ ఎఫ్ఆర్వో కలీలొద్దీన్ను వివరణ కోరగా వేములవాడ, కొడిమ్యాల, చందుర్తి ఫారెస్ట్ ప్రాంతంలో పులి తిరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజుకు పులి 35 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, అది ఫారెస్టు ప్రాంతంలో అనుకూలమైన ప్రాంతానికి వెళ్తుందని తెలిపారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
రాయికల్: మండలంలోని అల్లీపూర్కు చెందిన సిరిపురం శ్రీహరి (47) అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సుధీర్రావు కథనం ప్రకారం.. శ్రీహరి బీడీ ప్యాకర్గా పనిచేస్తున్నాడు. కుటుంబపోషణకు కొంత అప్పు చేశాడు. ఇటీవలే కూతురు పెళ్లి చేశాడు. మొత్తం రూ.8లక్షల వరకు అప్పు ఉందని, దానిని ఎలా తీర్చలోనని నిత్యం మనస్తాపం చెందుతున్నాడు. జీవితంపై విరక్తిచెంది ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. శ్రీహరి భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పరారైన ఖైదీ కోసం లుక్ ఆఫ్ నోటీస్జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోర్టు నుంచి మంగళవారం సాయంత్రం పరారైన జున్ను ప్రసాద్ కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్ను పట్టుకునేందుకు పోలీసు శాఖ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఆరు బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు విదేశాలకు పారిపోకుండా బుధవారం ఉదయమే దేశంలోని అన్ని ఎయిర్పోర్టులకు లుక్ ఆఫ్ నోటీసు జారీ చేశారు. సిరిసిల్లలో కోవిడ్ పాజిటివ్ కేసులు?● ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్ధారించని వైద్యులు సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జ్వరంతో బాధపడుతున్న ఓ దంపతులు బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వెళ్లారు. కోవిడ్ పరీక్షలు చేయడం లేదని ల్యాబ్ నిర్వాహకులు వెనక్కి పంపించినట్లు సమాచారం. సదరు దంపతులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. నోరు రుచి, ముక్కు వాసన పోవడంతో మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ దంపతులు కోవిడ్గా అనుమానించి ప్రభుత్వ ఆస్పత్రికి రాగా.. పరీక్షలు చేయకపోవడం గమనార్హం. -
దళిత యువకుడిని చితకబాదిన పోలీసులు
సైదాపూర్: డ్రంకెన్డ్రైవ్లో సహకరించడం లేదని ఓ దళిత యువకుడిని 20 రోజుల క్రితం చితకబాదిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటుచేసుకుంది. జరిగిన ఘటనపై దళిత సంఘాలు వివిధ రూపాల్లో బాధితుడికి న్యాయం చేయాలని ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బాధితుడు కరీంనగర్ సీపీ, మానవ హక్కుల కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిషన్ కోరినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. సైదాపూర్లో ట్రైనీ ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న అగస్త్య భార్గవ్గౌడ్ తోటి సిబ్బందితో కలిసి మండలంలోని లస్మన్నపల్లి శివారులో డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల మహేందర్ మొలంగూర్ నుంచి సైదాపూర్ వస్తున్నాడు. పోలీసులు ఆపారు. టెస్టు చేసి చలాను వేసిన తర్వాత అతడి వివరాలు రాసుకున్నారు. ఇంతలో మహేందర్కు ఇంటి వద్ద నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతున్న బాధితున్ని సహకరించడం లేదని ఫోన్ తీసుకొని ఎస్ఐ అగస్త్య భార్గవ్గౌడ్తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే చితకబాదారు. చెవి కర్ణభేరి దెబ్బతిని చెవి నుంచి రక్తం కారుతున్నా వదల్లేదని, తర్వాత పోలీస్ స్టేషన్కు పిలిచి తనతో క్షమాపణ పత్రం రాయించుకున్నారని మహేందర్ కమిషన్లకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనపై విచారించాలని కరీంనగర్ సీపీ హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ను ఆదేశించారు. బాధితుడి వాగ్మూలం తీసుకున్న మర్నాడే ఏసీపీ శ్రీనివాస్ బదిలీ కావడంతో పోలీసుల విచారణలో జాప్యం జరుగుతోందని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్ మాత్రం అడిషనల్ డీజీపీ, కరీంనగర్ సీపీకి విచారణ నివేదికను 20 రోజుల్లో అందజేయాలని నోటీసులు జారీ చేసింది. తాను పీజీ బీఈడీ చేసి, నిరుద్యోగిగా కూల్డ్రింకులు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, అకారణంగా చితకబాదడంతో అవమానంతో మానసికంగా భరించలేకపోతున్నాని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మహేందర్ అప్పటికే వేరే సంఘటనలో ఇతరులతో తగాదా పడి దెబ్బలు తిని వస్తున్నాడని, డ్రంకెన్డ్రైవ్ టెస్టులో సహకరించకుండా పోలీసులలో దుర్భాషలాడారని, అందుకు క్షమాపణ పత్రం రాసి ఇచ్చాడని పోలీసులు పేర్కొంటున్నారు. వాస్తవాలు ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది. దెబ్బతిన్న బాధితుడి చెవి కర్ణభేరి హెచ్ఆర్సీ, నేషనల్ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు విచారించి నివేదిక ఇవ్వాలని అడిషనల్ డీజీపీ, సీపీకి నోటీసులు -
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
సిరిసిల్ల: జిల్లాలో యాసంగి(రబీ) సీజన్లో రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా బుధవారం తెలిపారు. 242 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 37,223 మంది రైతుల వద్ద రూ.578 కోట్ల విలువైన 2,49,372మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. వీటిలో 2,16,258 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలు ఆన్లైన్ చేశామని, 34,479 మంది రైతుల బ్యాంకు ఖాతాలో రూ.447 కోట్లు జమ అయ్యాయని వివరించారు. మిగతా రైతులకు త్వరలో డబ్బులు జమ అవుతాయని ప్రకటించారు. జిల్లాలో ధాన్యం సేకరణ తుది దశకు వచ్చిందని, ఇప్పటికే 133 కొనుగోలు కేంద్రాలను మూసివేశామన్నారు. ఇంకా 109 కేంద్రాల్లో కొద్దిగా ధాన్యం ఉందన్నారు. జిల్లాలో చివరి గింజ వరకు దాన్యం సేకరిస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం సైతం సేకరిస్తామని రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. మూడేళ్లలో ధాన్యం సేకరణ తీరిదీ జిల్లాలో రబీ(యాసంగి) సీజన్లో మూడేళ్ల ధాన్యం సేకరణ తీరును కలెక్టర్ గణాంకాలతో వెల్లడించారు. 2022–2023లో మే 28వ తేదీ నాటికి 1,64,044 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, అదే 2023–2024 రబీ సీజన్లో ఇదే రోజు నాటికి 2,49,514 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది మే 28వ తేదీ నాటికి 2,49,372 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని అన్నారు. జిల్లాలో కొనుగోళ్లు పూర్తి అయ్యేనాటికి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు నమోదు అవుతాయని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పటికే 2,49,372 మెట్రిక్ టన్నుల సేకరణ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా -
సంఘం స్థలం స్వాహాకు యత్నం?
వేములవాడ: పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ స్థలం విషయంలో వివాదం ఏర్పడి పంచాయితీ ఎస్పీ వద్దకు చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 1800 సభ్యుల సంకల్పంతో 2011లో సర్వే నం.977లో 968 గజాల స్థలం కొనుగోలు చేశారు. సంఘం అధ్యక్షుడు, కార్యవర్గం పేరుపై ఉండాల్సిన భూమిని 12 మంది ప్రముఖులు ఓ ట్రస్టుగా ఏర్పడి తమ పేరుతో రిజిస్త్రేషన్ చేయించుకోవడంతో వివాదం చెలరేగింది. సంఘ సభ్యుల హితాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్లో సేవా కార్యక్రమాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొన్న ఈ స్థలంలో 12 మంది ప్రముఖులు తామే యజమానులమని గత డిసెంబర్లో తమ పేతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వెలుగు చూసింది. దీంతో సంఘ సభ్యులంతా తీవ్ర ఆగ్రహానికి లోనై ఇది కేవలం ఆస్తిపై మాత్రమే కాదు మన ఆర్యవైశ్యుల ఆత్మగౌరవంపై దాడి అంటూ పట్టణానికి చెందిన 1800 మంది సభ్యుల నమ్మకాన్ని, ఆశలను తాకట్టు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ అంశంతో ఆర్యవైశ్య ప్రముఖులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్దారులు కాంప్రమైజ్ అవుతామనీ, తమపై ఉన్న రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుని తిరిగి సంఘానికి చేస్తామని చెప్పినట్లు తెలిసింది. ఈ వివాదం బుధవారం వేములవాడలో సామాజికంగా కీలకమైన అంశంగా మారింది. వైశ్య సంఘం న్యాయబద్ధంగా తమ హక్కులను తిరిగి పొందుతుందా? లేక ఈ ప్రయత్నం వ్యర్థమవుతుందా? అన్న చర్చ కొనసాగింది. వేములవాడలో ఆర్య వైశ్య సంఘ భూవివాదం ఎస్పీ వద్దకు చేరిన పంచాయితీ -
హ్యాకర్ల చేతికి ఓదెల ఆధార్ కేంద్రం
పెద్దపల్లిరూరల్: ఆన్మోసాలు ఆగడంలేదు. సైబర్ నేరగాళ్లు, ఆన్లైన్ మోసగాళ్లు రోజుకో రూట్ మార్చుతూ ప్రజలకు ఎరవేస్తున్నారు. తాజాగా ఓదెల మండల కేంద్రంలోని మీసేవ ఆపరేటర్ తన ఆధార్ కేంద్రానికి సంబంధించి అప్డేట్ చేస్తామంటూ సైబర్ మోసగాళ్లు (సెల్ నంబరు 07427069687) నుంచి చేసిన ఫోన్కాల్కు స్పందించడంతో ఆధార్ సెంటర్ను హ్యాక్ చేశారు. కొద్ది నిమిషాల్లోనే ఆ ఐడీ ద్వారా నాలుగు ఆధార్కార్డులు డౌన్లోడ్ చేసినట్లు ఆపరేటర్కు సమాచారం రావడంతో అవాక్కయ్యాడు. ఆ వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. స్పందించిన అధికారులు యూఐడీఏఐ అధికారులను అప్రమత్తం చేశారు. వారు ఆధార్సెంటర్ హ్యాకర్ల చేతికి చిక్కినట్లు నిర్ధారించారు. ఇలాంటి ఘటన ఇదివరకు నాగర్కర్నూల్ జిల్లాలోనూ జరిగినట్లు సమాచారం. జిల్లాలోని పలు ఆధార్కేంద్రాల నిర్వాహకులకు సైతం ఇలాంటి ఫోన్కాల్స్ వచ్చినట్లు ఆపరేటర్లు తెలిపారు. కొంతకాలంగా ఓదెల మీసేవ కేంద్రంలో గల ఆధార్ సెంటర్ ద్వారా సేవలు నిలిపి వేశారు. కొద్ది రోజుల క్రితమే అధికారులు అనుమతినివ్వడంతో సేవలు పునరుద్ధరించారు. ఈ క్రమంలో హ్యాకర్ల నుంచి ఫోన్కాల్ రావడంతో ఆధార్ కేంద్రం అనుమతులిచ్చే కార్యాలయ అధికారుల నుంచే ఫోన్కాల్ వచ్చిందని భావించి ఎనీడెస్క్ను హ్యాకర్లకు అప్పగించి మోసపోయినట్లు తెలిసింది. పీఈసీ కిట్లను అప్పగించొద్దు.. ఆధార్ కేంద్రాలను నిర్వహించే ఆపరేటర్లు అనధికారిక అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్కాల్స్కు స్పందించొద్దని యూఐడీఏఐ అధికారులు బుధవారం రాష్ట్రంలోని ఆధార్ ఆపరేటర్లకు దిశానిర్దేశం చేశారు. ఆధార్కేంద్ర నిర్వాహకులు తమ సెంటర్లలో వినియోగించే కంప్యూటర్ నుంచి ఎనీడెస్క్, లేదా ఇతర రిమోట్యాక్సెస్ ఇచ్చి మోసపోతున్నారని, ఇది ఆధార్ డేటా భద్రతకు ముప్పు తెస్తుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనీడెస్క్, టీంవ్యూయర్ ఇతర రిమోట్ యాక్సెస్ సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని సూచించారు. యూఐడీఏఐ భద్రతా విధానాలకు అనుగుణంగా అవసరం లేని రిమోట్ యాక్సెస్ టూల్స్ని అన్ఇన్స్టాల్ చేయాలన్నారు. అపరిచితుల ఫోన్కాల్స్కు స్పందించొద్దు యూఐడీఏఐ కార్యాలయ అధికారుల ఆదేశం -
ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి
రామగిరి(మంథని): భర్త అనారోగ్యం.. ఆర్థికలేమి.. ముగ్గురు పిల్లలు పోషణ.. కూలీ పనులతో కుటుంబాన్ని నెట్టుకు రావడం ఆ గృహిణికి తలకుమించిన భారంగా మారింది. దాతలు సాయం చేస్తే భర్తకు మంచి వైద్యచికిత్స అందిస్తామని, పిల్లల పోషణ చూసుకుంటానని అంటోంది ఆ గృహిణి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన దుబ్బాక కుమార్ – విజయ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం కిరణ్, మహేందర్, చెర్రీ ఉన్నారు. అనారోగ్యానికి గురైన కుమార్.. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. అయినా నయం కాలేదు. తనకున్న స్థోమత వరకు ఖర్చుచేశాడు. చేతిలో ఉన్న సొమ్మంతా ఖర్చు కావడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లడానికి చిల్లిగవ్వకూడా లేకుండాపోయింది. కనీసం ప్రయాణానికి కూడా డబ్బులు లేని దీనస్థితిలో ఆ కుటుంబం ఉంది. విజయ కూలీ పనులకు వెళ్లి అంతోఇంతో సంపాదిస్తున్నా కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదు. దాతలు ముందుకు వచ్చి తన భర్తను కాపాడాలని విజయ కోరుతోంది. రెండు కిడ్నీలు పనిచేయక యువకుడి నరకయాతన -
సీపీఐని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లండి
కరీంనగర్: జిల్లాలో సీపీఐకి పూర్వవైభవాన్ని తెచ్చేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా మహాసభలు రెండోరోజు కొనసాగాయి. నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లవ్వ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మూడేళ్లలో జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సీపీఐకి జిల్లాలో ఘనమైన చరిత్ర ఉందన్నారు. తెలంగాణ దశాదిశా నిర్దేశించేలా క్రియాశీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఆర్ఎన్ఎన్ శక్తుల విజృంభన కొనసాగిస్తూ బీజేపీ ప్రమాదకరంగా మారిందన్నారు. రాష్ట్రంలో పెన్షన్, రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మఇళ్లు పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, మర్రి వెంకటస్వామి, పొనగంటి కేదారి, బోయిని అశోక్, కొయ్యడ సృజన్కుమార్, అందె స్వామి, బత్తుల బాబు, గూడెం లక్ష్మి పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి -
ఒక్క ఏడాదిలోనే 818 ఇళ్లు
బోయినపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోగా బోయినపల్లి మండలానికి 818 ఇళ్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం హైస్కూల్ మైదానంలో కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి 709 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, 98 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. అత్తగారి మండలానికి అల్లుడిగా మాజీ సీఎం కేసీఆర్, మనవళ్లుగా కేటీఆర్, సంతోశ్కుమార్లు ఇచ్చింది పెద్ద గుండుసున్న అని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి సహకారంతో మిడ్మానేరు ముంపు గ్రామాలకు త్వరలో మరో వెయ్యి ఇళ్లు మంజూరు కానున్నాయని తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మా ట్లాడుతూ మంజూరు పత్రాలు పొందిన వారు ఇళ్లు నిర్మించి వచ్చే దసరా, దీపావళి పర్వదినాలను సొంత ఇళ్లలో జరుపుకోవాలని అన్నారు. లబ్ధిదారులకు ఇసుక అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 90 రోజుల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించకుంటే రద్దు చేస్తామన్నారు. జెడ్పీ సీఈవో వినోద్, ఎంపీడీవో జయశీల, తహసీల్దార్ నారాయణరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రవీందర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్ పాల్గొన్నారు. -
డీఈవో వ్యాఖ్యలు..ఆరని మంటలు!
● మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసిన కరీంనగర్వాసి ● చర్యలు తీసుకోవాలని మరిన్ని ఫిర్యాదులు ● క్రమంగా వెలుగులోకి జనార్దన్రావు వ్యవహారాలు ● ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఐదేళ్లుగా కరీంనగర్లో విధులు ● కలెక్టర్ కార్యాలయం తీరుపైనా విమర్శలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్రావు వ్యవహారం మరింత ముదిరింది. ‘భర్తలకు వంట రాకపోతే.. భార్యలు లేచిపోతారు.. తాను రెండు సంసారాలు ఈదుతున్నాను’ అంటూ తలతిక్క వ్యాఖ్యలతో శిక్షణ శిబిరాల్లో టీచర్లను బెంబేలెత్తించిన డీఈవో జనార్దన్రావుపై విమర్శలు, ఆరోపణలు ఆగడం లేదు. ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ.. కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం రాత్రి ఆదేశాలిచ్చినా.. టీచర్లు శాంతించడం లేదు. ఆయన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయని మండిపడుతుండగా.. సామాజిక ఉద్యమకారుడు షాబుద్దీన్ మహిళా కమిషన్కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. డెమొక్రాటిక్ టీచర్ ఫెడరేషన్ (డీటీఎఫ్) నాయకులు జనార్దన్రావుపై హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) కూడా అతనిపై చర్యలకు డిమాండ్ చేసింది. బుధవారం కూడా సోషల్ మీడియాలో, మెయిన్స్ట్రీమ్ మీడియాలో విషయం ప్రాధాన్యం సంతరించుకోవడంపై చర్చ నడుస్తోంది. డీఈవో జనార్దన్ సిరిసిల్లకు కూడా డీఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో కామారెడ్డి డీఈవో ఎస్. రాజుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ డైట్ ప్రిన్సిపాల్ మొండయ్య నూతన డీఈవోగా బుధవారం అదనపు బాధ్యతలు చేపట్టారు. దండిగా పెద్దల దన్ను.. జనార్దన్రావుకు ప్రభుత్వ పెద్దల నుంచి దండిగా సహకారాలు ఉన్నాయని సమాచారం. కరోనా నుంచి డీఈవోగా కొనసాగుతున్న ఈయనపై ఎన్ని విమర్శలు వచ్చినా చర్యలు తీసుకోవడంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ● జిల్లాలో టీచర్లకు అకారణంగా, అత్యధికంగా మె మోలు ఇచ్చిన డీఈవో అన్న ఆరోపణలు ఉన్నాయి. యూనియన్ నాయకులకు ఇంక్రిమెంట్లలో కోత విధించారన్న విమర్శలు తెలిసిందే. ● వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో పనిచేసిన ప్రతీ ఉన్నతాధికారి ఎన్నికల నియమావళి ప్రకారం.. బదిలీపై వెళ్లారు. కానీ, ఈయనను కదపలేదు. ● హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, అనంతరం అసెంబ్లీ, పార్లమెంట్, ఇటీవల టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయినా ఇతని బదిలీ జరగకపోవడం అతని పలుకుబడికి నిదర్శనం. ● ఇవన్నీ తెలిసీ.. కలెక్టర్ కార్యాలయం కూడా ఆయన బదిలీ విషయంలో అలసత్వం వహించి విమర్శలను మూటగట్టుకుంది. ● 317 జీవో సమయంలోనూ పలువురు టీచర్లు ప్రొడ్యూస్ చేసిన మెడికల్ సర్టిఫికెట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ● హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయలో అప్పటి సీఎం సభను విజయవంతం చేయాలని ఆదేశాలివ్వడం, రూటు బాధ్యతలను టీచర్లకు అప్పగించడం తీవ్ర దుమారం రేపింది. ● ఇప్పుడూ తన స్వయంకృతాపరాధంతో వేటు పడిందే.. ఆయన్ను ఇక్కడ నుంచి ఎవరూ కదపలేకపోవడం గమనార్హం. -
గర్భస్థ శిశువును రక్షించడం అందరి బాధ్యత
సిరిసిల్ల: గర్భస్థ శిశువును రక్షించాల్సిన బాధ్య త ప్రతీ ఒక్కరిపై ఉందని జిల్లా వైద్య, ఆరో గ్యశాఖ అధికారి ఎస్.రజిత అన్నారు. కలెక్టరేట్లోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పీసీపీఎన్డీటీ సలహా కమిటీ సమావేశంలో మాట్లాడారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమన్నారు. ఎవరైన భ్రూణహత్యలకు పాల్ప డితే టోల్ఫ్రీ నంబర్ 94400 54641కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ అంజలి ఆల్ఫ్రెడ్, అనిత, రామకృష్ణ, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్, లీగల్ అడ్వైజర్ శాంతి ప్రకాశ్ శుక్లా, ఝాన్సీలక్ష్మి శుక్లా, డిప్యూటీ డెమో రాజకుమార్, హెచ్ఈ బాలయ్య, డీఈవో మహేశ్ పాల్గొన్నారు. బద్దెనపల్లి గురుకులానికి క్యాష్ అవార్డుతంగళ్లపల్లి: మండలంలోని బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకల పాఠశాలకు అరుదైన గౌరవం దక్కింది. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్లో పాఠశాల ప్రిన్సిపాల్ దర్శనాల పద్మకు అవార్డుతోపా టు రూ.5 లక్షల రివార్డు అందజేశారు. పీఎంశ్రీ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్, పదో తరగతి ఫలితాల్లో రా ష్ట్రస్థాయి ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఈ అవార్డు అందజేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎంపీసీలో రాష్ట్రస్థాయి రెండో ర్యా ంకు సాధించిన విద్యార్థిని నందినికి రూ. 10వేలు నగదు పారితోషకం అందించారు. హామీలు నెరవేర్చండిసిరిసిల్లటౌన్: ప్రొటోకాల్ అమలుపై కాంగ్రెసోళ్ల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. బుధవారం సిరిసిల్ల ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ విప్ ప్రొటోకాల్ విషయంపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీ సులో దేశ నేతల ఫొటోలు పెట్టుకోవడం స హజమని, కాంగ్రెసోళ్లు ప్రభుత్వ బంగ్లాకు చొ చ్చుకుపోయి సీఎం రేవంత్రెడ్డి ఫొటో పెట్టేందుకు ఒడిగట్టడం అప్రజాస్వామికమన్నారు. అడ్డుకోబోయిన పోలీసులను నెట్టేస్తూ బీఆర్ఎస్ నేతలపై దాడి చేయడం సరికాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక అనవసర రాద్దాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్కు వెన్నెతో పెట్టిన విద్య అన్నారు. ఈ సమావేశంలో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపా ణి, రాష్ట్ర నాయకులు ప్రవీణ్, రాజు, శ్రీనివా స్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల పరిహారంపై నేడు మరోసారి విచారణ బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు ప్రా జెక్టులో ముంపునకు గురైన బోయినపల్లి మండలం వరదవెల్లి అనుబంధ రాజన్నపేట గ్రా మంలోని 9 ఇళ్ల పరిహారం చెల్లింపులపై వచ్చిన ఆరోపణలతో గురువారం మరోసారి విచారణ జరుగనుంది. కలెక్టర్ సందీప్కుమా ర్ ఝా ఆదేశాలతో డీఎల్పీవో నరేశ్ ఈనెల 19న వరదవెల్లి జీపీ కార్యాలయంలో విచారణ జరిపారు. ఆ రోజు విచారణకు ఎవరూ హాజరు కాకపోవడంతో ఫిర్యాదుదారులకు, ఇళ్ల యజమానులకు ముందుగా నోటీసులు అందించి మరోసారి 29న విచారణ నిర్వహి ంచనున్నారు. ఈసారి విచారణలో ఏం జరుగుతుందో? అని ఎదురుచూస్తున్నారు. యూరియా వాడకం తగ్గించుకోవాలి కోనరావుపేట: రైతులు సాగులో యూరియా వాడకం తగ్గించుకోవాలని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ కె.మదన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం మామిడిపల్లిలోని ఆదర్శ సొసైటీలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో మాట్లాడారు. పంట మార్పిడి పాటిస్తూ అధిక దిగుబడులు పొందాలని సూచించారు. -
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జిల్లా ప్రథమ స్థానం
సిరిసిల్లకల్చరల్: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు.కలెక్టరేట్లో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్షించారు, జిల్లాకు 7,862 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా వేములవాడ నియోజకవర్గంలో రెండు దశల్లో 2,575, సిరిసిల్ల నియోజకవర్గంలో 3,608. చొప్పదండి నియోజకవర్గంలోని బోయిన్పల్లిలో 820 ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ విషయంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. అదే స్ఫూర్తితో నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సిమెంట్, స్టీల్ ధరల విషయంలో ఆయా కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపి తగ్గించే ప్రయత్నం చేస్తుందన్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్ల ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు , హౌసింగ్ పీడీ శంకర్, ఆయా మండలాల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. ‘రాజీవ్ యువ వికాసం’లో లాభసాటి యూనిట్లు సిరిసిల్ల: రాజీవ్ యువ వికాసం పథకంలో లాభసాటి వ్యాపార యూనిట్లను ఏర్పాటు చేయిస్తామని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అన్నారు. హైదరాబాద్ సచివాలయం నుంచి బుధవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాలో రాజీవ్ యువ వికాసం అమలు తీరుపై కలెక్టర్ వివరించారు. -
వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
సిరిసిల్ల: జిల్లాలో వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీ చేసేందుకు మంగళవారం ఇంటర్వ్యూలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన నిర్వహించారు. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించగా, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నాలుగు మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఒక్క అభ్యర్థి, కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక్క ల్యాబ్ మేనేజర్ పోస్టుకు ఆరుగురు, ఐదు ఎంఎల్హెచ్పీ పోస్టులకు 11 మంది హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఎస్.రజిత, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.నేతకార్మికుల ఉపాధికి ఆర్డర్లు● చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావుసిరిసిల్ల: నేతకార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తుందని సిరిసిల్ల చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకుడు జి.రాఘవరావు పేర్కొన్నారు. సిరిసిల్ల శివారులోని చంద్రంపేటలో మైండ్కేర్, కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మనోవికాస సదస్సులో మాట్లాడారు. సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు మహిళాశక్తి చీరల ఆర్డర్లు ఇచ్చామని, నేతన్నలకు చేతినిండా పని కల్పించే సంక్షేమశాఖల వస్త్రోత్పత్తి ఆర్డర్లు అందించామన్నారు. ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ స్కూల్ యూనిఫామ్స్, మరికొన్ని ప్రైవేట్ ఆర్డర్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. సెకాలజిస్ట్ కె.పున్నంచందర్ మాట్లాడుతూ ఆత్మహత్య ఆలోచనలు, మానసిక సమస్యలు ఎదురైనప్పుడు జిల్లా ఆస్పత్రిలోని మైండ్కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్లో సంప్రదించాలని కోరారు. కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయలు పాల్గొన్నారు.యోగా శిక్షణ షురూ..వేములవాడ: అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల సందర్భంగా ‘యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్’ అనే నినాదంతో హరితయోగా, యోగావాక్, యోగా సంగమం, యోగా ప్రభావ అనే నాలుగు కార్యక్రమాలు మంగళవారం ప్రారంభించినట్లు ఆయుష్ జిల్లా నోడల్ అధికారి శశిప్రభ తెలిపారు. జూన్ 21 వరకు గ్రామ, మండలస్థాయిలో శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఓల్డ్ అర్బన్కాలనీలోని కమ్యూనిటీహాల్లో 30 మంది హాజరయ్యా రు. డీపీఎం తిరుపతి, ఫార్మసిస్ట్ పుష్పలత, శిక్షకులు ఎలిగేటి కృష్ణ, ఆశవర్కర్లు లత, హేమలత, ఉమ, జయ, విజయ, రమ్య ఉన్నారు.వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ సీపీఐకరీంనగర్: దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే సీపీఐ ఒక్కటేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సీపీఐ కరీంనగర్ జిల్లా 23వ మహాసభలు నగరంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. పార్టీ పతాకాన్ని సీనియర్ నాయకుడు వేముల వెంకట్రాజం, అమరవీరుల స్మారకస్తూపం చిహ్నాన్ని శ్రీరాముల రామచంద్రం ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టులను దూరం చేసుకుని అధికారాన్ని పోగొట్టుకున్నామనే బాధలో బీఆర్ఎస్ ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సీపీఐ ఎంత కృషి చేసిందో ప్రజలకు తెలుసన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కార్మికులు లేబర్కోడ్లను వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలన్నారు. నాయకులు మర్రి వెంకటస్వామి, సభ్యుడు కలవేన శంకర్, పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్కుమార్, బో యిని అశోక్, అందెస్వామి, టేకుమల్ల సమ్మ య్య, కసిరెడ్డి సురేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఉరుములు..మెరుపులు..వర్షం
సిరిసిల్ల: జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఉరుములు.. మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుపడి ఇల్లంతకుంట మండలం గొల్లపెల్లికి చెందిన గొర్రెలకాపరి దాసరి లక్ష్మణ్(21) మృతిచెందాడు. పక్కనే ఉన్న మరో గొర్రెల కాపరికి తీవ్రగాయాలయ్యాయి. సిరిసిల్లలోని లోతట్టు ప్రాంతాలు వెంకంపేట, పాతబస్టాండు, సంజీవయ్యనగర్, ఆసిఫ్పుర, ఆటోనగర్, శాంతినగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రగతినగర్లో వేపచెట్టు విరిగి విద్యుత్తీగలపై పడడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. పొంగిపొర్లిన వాగులు వేములవాడ మండలం హన్మాజిపేట వద్ద నక్కవాగు నిండుగా పారింది. చందుర్తి మండలంలో భారీగా కురిసిన వర్షాలతో నక్కవాగు పొంగిపొర్లింది. తంగళ్లపల్లి మండలం సండ్రవాగు, ఇల్లంతకుంటలోని బిక్కవాగుల్లో వరద పారింది. మానేరువాగు, మూలవాగులకు వరదనీరు మోసుకొచ్చే ఒర్రెలు పారాయి. కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో వర్షాలతో వడ్లు తడిసి మొలకొచ్చాయి. తూకం వేసిన ధాన్యాన్ని తరలించకపోవడంతో బస్తాల్లోనే మొలక వచ్చింది. వర్షపాతం ఇలా.. వేములవాడ మండలం నాంపల్లి వద్ద అత్యధికంగా 102.5 మిల్లీమీటర్ల వర్షం నమోదుకాగా.. అత్యల్పంగా గంభీరావుపేటలో 3.3 మిల్లీమీటర్లు న మోదైంది. చందుర్తి మండలం మర్రిగడ్డ వద్ద 81.5, కోనరావుపేట మండలం నిజామాబాద్లో 72.0, బోయినపల్లిలో 63.0, ముస్తాబాద్ మండలం ఆవునూర్లో 56.3, కోనరావుపేట మండలం మర్తనపేటలో 53.5, వేములవాడ మండలం మల్లారంలో 52.8, వీర్నపల్లిలో 52.3, కలెక్టరేట్ వద్ద 52.0, పెద్దూరులో 43.5, నామాపూర్లో 31.0, కందికట్కూర్లో 30.5, ఎల్లారెడ్డిపేటలో 22.0, నేరెళ్లలో 21.5, రుద్రంగిలో 21.5, వట్టెంలలో 20.0, ఇల్లంతకుంటలో 20.0, పెద్దలింగాపూర్లో 16.0, మానాలలో 16.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా అంతటా వర్షం వేములవాడ: పట్టణంలోని రోడ్లపై వరదనీరు ప్రవహించింది. రాజన్న గుడి ముందు పెద్ద ఎత్తున వరదనీరు చేరిపోవడంతో మోకాళ్లలోతు వరదనీటిలో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కోనరావుపేట: మండలంలో 74 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వీర్నపల్లి: మండలంలోని వన్పల్లిలోని రామలక్ష్మణ్ చెరువులోకి నీరు చేరుతుంది. రుద్రంగి: మండలంలో కూరగాయల తోటలు నేలవాలి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లంతకుంట: మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. వెల్జీపూర్లోని కొనుగోలు కేంద్రంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న ధాన్యం కుప్పల చుట్టూ వర్షపు నీరు చేరింది. మండలంలో తూకం వేసిన దాదాపు 30వేల బస్తాలు తడిసిపోయాయి. వల్లంపట్లలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రహరీ కూలింది. ఎల్లారెడ్డిపేట: మండలంలోని వెంకటాపూర్ శివారులోని ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు నేలకూలాయి. అక్కపల్లి శివారులోని లేతమామిండ్లవాగు వరదనీటితో పొంగిపొర్లింది. ఇల్లంతకుంటలో పిడుగుపాటుకు గొర్రెలకాపరి మృతి సిరిసిల్లలో విరిగిపడిన చెట్లు.. నిలిచిన విద్యుత్ సరఫరా లోతట్టు ప్రాంతాలు జలమయం పొంగిపొర్లిన నక్కవాగు, లేతమామిండ్లవాగు -
వరద వచ్చినా సిద్ధం
● ముందస్తు రుతుపవనాలతో ఇరిగేషన్శాఖ అప్రమత్తం ● ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఎల్లంపల్లి గేట్ల నిర్వహణ షురూ ● పనుల కోసం టెండర్లు పిలిచిన అధికారులు ● ఎల్ఎండీలో మొదలైన పనులు, ఎంఎండీ, ఎల్లంపల్లివి జూన్లో ● వరదకు ముందే అప్రమత్తంగా ఉండేలా చర్యలుసాక్షిప్రతినిధి, కరీంనగర్: ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే వచ్చాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలో తొలకరి పలకరిస్తుంది. వాతావరణ మార్పుల కారణంగా ఈసారి అసాధారణరీతిలో దాదాపు రెండువారాల ముందే వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నీటిపారుదలశాఖ వానాకాలానికి ముందస్తుగానే గేట్ల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. రుతుపవనాలు ముందుగా రావడంతో ఈ పనుల్లో వేగం పెంచింది. ఇప్పటికే లోయర్ మానేరు డ్యాం అధికారులు గేట్ల నిర్వహణ పనులు చేపట్టారు. ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు టెండర్లు ఖరారవగా.. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు ప్రాజెక్టు గేట్ల నిర్వహణ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ల కాలంలో గేట్ల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా ఏం చేస్తారు? సాధారణంగా ఏటా వర్షాకాలానికి ముందే.. నీటిపారుదలశాఖ అధికారులు గేట్ల నిర్వహణకు పూనుకుంటారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల ప్రకారం ప్రతీ డ్యాం వద్ద వర్షాకాలానికి ముందు(ప్రీ మాన్సూన్), వర్షాకాలానికి తరువాత (పోస్ట్ మాన్సూన్) గేట్ల లూబ్రికేషన్ ప్రక్రియను చేపడతారు. వరద సమయంలో గేట్లు సులువుగా పైకి లేచేందుకు లూబ్రికేషన్ దోహదపడుతుంది. ఇందులో భాగంగా వాల్వ్ గేర్బాక్స్లకు కూడా గ్రీస్ పూయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వీలుగా జనరేటర్ల పనితీరును సమీక్షిస్తారు. వీటిని ప్రతీ ఐదు రోజులకు ఒకసారి దాదాపు 5 నిమిషాలపాటు అనివార్యంగా పనిచేయిస్తారు. ఇలాంటి భారీ జనరేటర్ల్లు ప్రతీ ప్రాజెక్టు వద్ద రెండు వరకు ఉంటాయి. వీటితోపాటు లిఫ్ట్లు, మెకానిక్ టూల్స్, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులను కూడా నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ఎల్ఎండీ అధికారులు రూ.13లక్షల నుంచి రూ.15లక్షల వరకు టెండరు పిలవగా.. ప్రస్తుతం పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇక పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లికి సంబంధించి రూ.38లక్షలకు టెండరు ఇచ్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా మిడ్మానేరుకు సంబంధించి దాదాపు రూ.26 లక్షలతో తాజాగా టెండరు పిలిచారు. ఈ రెండు ప్రాజెక్టుల పనులు జూన్లో మొదలు కానున్నాయి. వరద అవకాశాలు అంతంతే.. సాధారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు ఉన్న సమయంలో ప్రాజెక్టుల్లో నీరు చెప్పుకోదగ్గస్థాయిలో ఉండేది. వీటికి వర్షాలు తోడైనపుడు ప్రాజెక్టులు వేగంగా నిండి గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యేది. దాదాపుగా ఏడాదిన్నరగా ఎత్తిపోతలు నిలిచిపోయిన దరిమిలా మునపటి తరహాలో ప్రాజెక్టులలో నీటిమట్టాలు లేవనే చెప్పాలి. ఒకవేళ భారీగా కుండపోత వర్షాలు కురిసి, ఎగువనున్న మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున వరదలు వస్తేనే మన ప్రాజెక్టులు నిండి, గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నీటిపారుదల శాఖ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం గేట్లు ఎల్ఎండీ 24 టీఎంసీ 20 ఎంఎండీ 27.5 టీఎంసీ 25 ఎల్లంపల్లి 20 టీఎంసీ 62 -
చేపా చేపా ఎక్కడికెళ్లావు
ముస్తాబాద్(సిరిసిల్ల): మత్స్యకార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు పంపిణీ చేసేది. జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువుల్లో ఉచిత చేపపిల్లలు పంపిణీ చేయడం ద్వారా గ్రామాల్లో మత్స్యకారులు చేపలు పట్టుకొని ఉపాధి పొందేవారు. అయితే గతేడాదిగా ప్రభుత్వం చెరువుల్లో చేపపిల్లలు పంపిణీ చేయడం లేదు. జిల్లాలో నీటివనరుల్లో నీరు పుష్కలంగా ఉన్నా మత్స్యకారులకు ఉపాధి కరువైంది. చేపపిల్లల పంపిణీపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.మత్స్యశాఖలో ప్రణాళిక కరువుజిల్లాలో 48 మత్స్యకార సొసైటీల్లో 8,421 మంది కార్మికులు ఉన్నారు. వీరికి ఉపాధి కల్పించేందుకు మత్స్యశాఖ ఫిబ్రవరి, మార్చిలోనే టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టాలి. జిల్లాలో 1.42కోట్ల చేపపిల్లలు అవసరం కాగా.. అందుకు అనుగుణంగా కాంట్రాక్టర్ను ఎంపిక చేసి, సైజు, నాణ్యతను బట్టి టెండర్ అప్పగించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది సెప్టెంబర్లో మధ్యమానేరు, ఎగువమానేరు ప్రాజెక్టులలో కొంతమేరకు చేపపిల్లలను వదిలారు. కానీ, 440 చెరువులకు పిల్లలను సరఫరా చేయలేదు. మత్స్య సహకార సొసైటీలు, ఆ శాఖ అధికారులకు మధ్య సమన్వయలోపం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఏటా జిల్లాకు అవసరమైన రూ.1.60 కోట్ల బడ్జెట్పై ముందస్తుగా ప్రతిపాదనలు చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదనలు చేయలేదని సమాచారం.చేపల పెంపకం.. సొసైటీలపై భారంగతేడాది ప్రభుత్వం నుంచి చేపపిల్లలు రాకపోవడంతో జిల్లాలో మత్స్యకార్మికులే సొంతంగా డబ్బులు వెచ్చించి చేపపిల్లలను కొనుగోలు చేశారు. ముస్తాబాద్, గంభీరావుపేట, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని మత్స్యకార్మికులు తమ సొసైటీల ద్వారా డబ్బులు ఖర్చు చేసుకుని చేపపిల్లల పెంపకాన్ని చేపట్టారు. దీంతో ఆయా సొసైటీలపై ఆర్థిక భారం పడుతోందని కార్మికులు పేర్కొంటున్నారు. ఒక్క ముస్తాబాద్ సొసైటీ పరిధిలోని ఐదు చెరువుల్లో గతేడాది రూ.4లక్షలు వెచ్చించి చేపపిల్లలను వదిలారు. వాటినే ఏడాది పొడవునా పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఏటా వచ్చే భారీ వరదలతో చెరువులు మత్తళ్లు దూకి చేపపిల్లలు కొట్టుకుపోతున్నాయని, చేప పిల్లల రక్షణకు అవసరమైన జాలీలు, వలలు ఇవ్వాలని మత్స్యకార్మికులు కోరుతున్నారు.నాణ్యతే అసలు సమస్యప్రభుత్వం చేపపిల్లల సరఫరాకు ఏటా టెండర్ ని ర్వహిస్తుండగా.. కాంట్రాక్టు దక్కించుకున్న వారు ఆంధ్రప్రదేశ్ నుంచి చేపవిత్తనాలు సరఫరా చే స్తారు. అయితే ఇక్కడ చేప పిల్ల సైజు, దాని రకం, నాణ్యతపై కార్మికులకు అవగాహన ఉండదు. చెరువులో వదిలే సమయంలో చేపపిల్లల సంఖ్యను కూడా ఎవరూ లెక్కించే పరిస్థితి ఉండదు. దీంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పిల్లల సంఖ్యను పెద్ద ఎత్తున తగ్గించి సరఫరా చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.జిల్లాలో పరిస్థితి ఇలా..చేపపిల్లల డిమాండ్ 1.42 కోట్లురొయ్యపిల్లల డిమాండ్ 48 లక్షలుచెరువులు 440ప్రాజెక్టులు: ఎగువ మానేరు, మధ్యమానేరు, అన్నపూర్ణమత్స్యకార సొసైటీలు 48మత్స్యకార్మికులు 8,421 -
దళారులను నమ్మొద్దు
వేములవాఅర్బన్/వేములవాడరూరల్: ఇంది రమ్మ ఇళ్ల బిల్లుల మంజూరులో దళారులను నమ్మొద్దని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. విడతల వారీగా బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. వేములవాడ అర్బన్ మండలానికి 370 లబ్ధిదారులకు, వేములవాడరూరల్ మండలం చెక్కపల్లిలో మంగళవారం 333 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపత్రాలను కలెక్టర్ సందీప్కుమార్ ఝాతో కలిసి అందించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు ఇళ్లు మంజూరు చేశామన్నారు. వేములవాడరూరల్ మండలం వెంకటాంపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అధికారులు నిర్మాణాలను పరిశీలించిన తర్వాతే బిల్లులు మంజూరు చేస్తారని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇంటి కోసం ఉచితంగా ఇసుకా అందిస్తామన్నారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, హౌసింగ్పీడీ శంకర్, మండల ప్రత్యేకాధికారి లక్ష్మీరాజం, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ అబూబాకర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వకుళాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశంగౌడ్, జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వేములవాడ: నియోజకవర్గానికి రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైనట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, ఉపాధ్యాయులకూ వసతి కల్పించడానికి గృహ సముదాయాన్ని నిర్మిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజిటల్ విద్యాబోధన ఉంటుందని తెలిపారు. ఎన్నికల హామీ నెరవేరుస్తున్నాం ప్రభుత్వ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
రహదారికి అనుమతులు నిలిపివేయాలి
బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాక వైకుంఠధామం నుంచి నీలోజిపల్లికి చెందిన ఓ రైతుకు ఇచ్చిన రహదారి అనుమతులు నిలిపివేయాలని కొదురుపాక గ్రామస్తులు పలువురు తహసీల్దార్ కాలె నారాయణరెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శి అనుమతులు లేకుండానే దారి కోసం రైతు వైకుంఠధామంలో సుమారు 56 పచ్చని చెట్లు నరికేశాడని ఆరోపించారు. సదరు రైతుకు వేరే చోటు నుంచి రహదారి ఉన్నప్పటికీ మళ్లీ దారి కావాలని అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక్కడ బాలమల్లు, వెంకటేశ్, దీక్షిత్, కత్తెరపాక రవీందర్ తదిరతరులు పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ ‘వార్’
● కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ఘర్షణ ● పోలీసుల లాఠీచార్జీ ● ఇరువర్గాలపై కేసులుసిరిసిల్ల: సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రొటోకాల్ వార్ ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ ఎదుట బాహాబాహీకి దిగారు. ఇరువర్గాలను కట్టడి చేయడం సాధ్యం కాకపోవడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఎడమ చేయి విరుగగా, పార్టీ యూత్ నాయకులు సబ్బని హరీశ్, చంటీలకు గాయాలయ్యాయి. కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ నాయకులు జాలగం ప్రవీణ్(టోనీ), మునిగెల రాజు, బైరినేని రాము, కోడం అమర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై బైటాయించిన బీఆర్ఎస్ నాయకులనూ తంగళ్లపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. పొలిటికల్ వార్ సిరిసిల్ల నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదా రులకు మంజూరుపత్రాల పంపిణీ కార్యక్రమాల్లో సీఎం రేవంత్రెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఫొటోలు పెడుతున్న అధికారులు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో పెట్టడం లేదు. ఈ విషయమై సర్పంచ్ల ఫోరమ్ జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు ఆధ్వర్యంలో ఎస్పీ మహేశ్ బీ గీతేకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ ఫొటో పెట్టకపోతే కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్రెడ్డి ఫొటో లేదని.. పెడతామని అక్కడికి రాగా తోపులాట జరిగింది. ‘కాంగ్రెస్ గిచ్చి కయ్యం పెట్టుకుంటోంది’ కాంగ్రెస్ పార్టీ గిచ్చి కయ్యం పెట్టుకుంటోందని మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్పై కాంగ్రెస్ నాయకులు దాడిని ఖండించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే నివాసంలో సీఎం ఫొటోలు ఎలా పెడతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల లాఠీచార్జీ ఖండించారు. దాడి దారుణం కేటీఆర్ క్యాంపు ఆఫీస్పై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం దారుణమని వేములవాడ బీఆర్ఎస్ ఇన్చార్జి చలిమెడ లక్ష్మీనర్సింహారావు పేర్కొన్నారు. పోలీసులు పక్షపాత ధోరణి వీడాలని, అధికారులు రాజ్యాంగ బద్ధంగా ఉండాలన్నారు. గుండాల రాజ్యం – బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సిరిసిల్ల/తంగళ్లపల్లి: తంగళ్లపల్లి పోలీస్స్టేషన్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య.. నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో గుండా రాజ్యం సాగుతోందన్నారు. పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరించడంతోనే కేటీఆర్ క్యాంపు ఆఫీస్పై కాంగ్రెసోళ్లు దాడి చేశారని ఆరోపించారు. ముందుస్తు సమాచారం ఉన్నా కట్టడి చేయకుండా.. దాడులకు ఉసిగొల్పారని విమర్శించారు. కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలా పని చేస్తున్నారని మరోసారి రుజువైందన్నారు. ప్రజలు ఎన్నికల్లో ఐదుసార్లు తిరస్కరించినా కేకే మహేందర్రెడ్డిని కలెక్టర్ వెంటబెట్టుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో పా ల్గొనడం సరికాదన్నారు. కనీసం వార్డు మెంబర్గా కూడా గెలువలేని ఆయనకు ప్రొటోకాల్ ఏంటని? ప్రశ్నించారు. ప్రొటోకాల్ వివాదం శాంతిభద్రతల సమస్య అవుతుందని ముందే ఎస్పీకి ఫిర్యాదు చేశామని చక్రపాణి గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో ‘సెస్’ వైస్చైర్మన్ దేవరకొండ తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు చీటి నర్సింగరావు, బొల్లి రామ్మోహన్, రాఘవరెడ్డి, సిద్ధం వేణు, మాట్ల మధు, సబ్బని హరీశ్, చంటి, కృష్ణారెడ్డి, చంద్రయ్యగౌడ్, బండ నర్సయ్యయాదవ్, గజభీంకార్ రాజన్న, బాలయ్య, మల్యాల దేవయ్య, దిడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. -
రోజుకు ఉమ్మడి జిల్లా నుంచి 50 నుంచి 60 వేల ఆర్డర్లు ● రూ.కోట్లలో వ్యాపారం
షాపింగ్.. ఒకప్పుడు ఒకరిద్దరిని తోడుగా తీసుకొని వెళ్లి.. నచ్చింది చూసి.. ధర ఆరా తీసి.. బేరం చేసి తెచ్చుకునేవాళ్లం. నేడు అంతా మారిపోయింది. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో గుమ్మంలోకి వచ్చి చేరుతోంది. జీవితం ఉరుకుల..పరుగులమయం కావడంతో ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ ఆప్షన్గా మారింది. ఉమ్మడి జిల్లా నుంచి రోజుకు 50 నుంచి 60 వేల ఆర్డర్లు వెళ్తుండగా, కోట్లలో వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. డెలివరీ బాయ్స్కు ఉపాధినిస్తుండగా.. ప్రజలకు బయట అడుగుపెట్టే శ్రమ లేకుండా పోతోంది. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వెంటా డుతున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం.. బీపీ.. గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. జీవితమే టైమ్ మెషిన్లా మారిన నేటి కాలంలో ఆన్లైన్ షాపింగ్.. పరిణామాలపై మార్కెటింగ్ దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ.. – సిరిసిల్ల– వివరాలు 8లోu -
ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వండి
మాది బుడిగజంగాల కులం. మాకు ఎస్సీ కుల సర్టిఫికెట్లు మొన్నటి వరకు ఇచ్చారు. ఇప్పుడు ముస్తాబాద్ తహసీల్దార్ ఇవ్వడం లేదు. ఎవరో ఫిర్యాదు చేశారని ఆపారట. మాకు ఎస్సీ కుల ధ్రువీకరణపత్రాలను జారీ చేయాలి. – బుడిగజంగాల ప్రతినిధులు, ముస్తాబాద్ కిలో కోత విధిస్తామంటున్నారు వడ్లు బస్తాకు 42 కిలోలు తూకం వేశాం. అయినా మళ్లీ బస్తాకు కిలో వడ్లు తగ్గిస్తేనే లారీ నుంచి దించుకుంటామని రైస్మిల్లర్ అంటున్నాడు. నాలుగు రోజులుగా లారీని అన్లోడ్ చేయడం లేదు. ప్రతీ బస్తాకు ఇప్పటికే అదనపు వడ్లను జోకాం. అయినా.. ఇంకా కోత విధించి రైతులను ముంచాలని చూస్తున్నారు. – గెంటె మహేశ్, వెంకటాపూర్ -
ఆలకించి.. ఆదుకోండి
● ప్రజావాణిలో వినతుల వెల్లువ ● అర్జీలు వెంటనే పరిష్కరించాలి ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● వివిధ సమస్యలపై 182 దరఖాస్తులుసిరిసిల్ల: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీగా బాధితులు తరలివచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝాకు వినతిపత్రాలు అందించారు. జిల్లాలోని నలువైపుల నుంచి తరలివచ్చిన బాధితులు దాదాపు 182 మంది అర్జీలు అందించారు. రెవెన్యూశాఖకు 75, హౌసింగ్కు 36, ప్రత్యేక ఉపకలెక్టర్కు 12, డీఆర్డీవో, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్లకు 9 చొప్పున, ఎస్పీ ఆఫీస్కు 6, జిల్లా ఉపాధి కల్పన అధికారి, నీటిపారుదల శాఖలకు 5 చొప్పున, జిల్లా సంక్షేమాధికారికి 4, వ్యవసాయశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారి, చేనేత, జౌళిశాఖ, సబ్ రిజిస్ట్రార్, ఏడీ భూసర్వే శాఖలకు రెండు చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును వెంటనే పరిష్కరించాలని, లేదా.. బాధితులకు సమాధానం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్డీవో శేషాద్రి, డీఎంహెచ్వో రజిత పాల్గొన్నారు. -
గ్రీవెన్స్డేతో సమస్యలు పరిష్కారం
సిరిసిల్లక్రైం: ప్రజల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 18 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు పరిష్కరించాల్సిందిగా సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఠాణాకు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు.మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి● డీఆర్డీవో శేషాద్రిసిరిసిల్ల: జిల్లాలో మరో మూడు రోజుల్లో ధా న్యం కొనుగోళ్లను పూర్తి చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శేషాద్రి సోమవారం తెలిపారు. జిల్లాలో 242 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 35,902 మంది రైతుల వద్ద ఇప్పటికే 2,40,695 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. జిల్లాలో సేకరించిన ధాన్యం విలువ రూ.558 కోట్లని, యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా.. సజా వుగా కొనసాగిస్తున్నామన్నారు. జిల్లాలో పూ ర్తి స్థాయిలో మూడు రోజుల్లో వడ్లను కొనుగోలు చేస్తామని శేషాద్రి స్పష్టం చేశారు.నేడు పెద్దింటి కథా కార్యశాలసిరిసిల్లకల్చరల్: తెలంగాణ సాహిత్య అకాడమీ సారథ్యంలో మంగళవారం కథా రచయిత పెద్దింటి అశోక్కుమార్ నిర్వహణలో కార్యశాల(వర్క్షాప్) నిర్వహించనున్నారు. హైదరాబాద్ మినీరవీంద్రభారతిలో జరిగే కార్యశాలలో ఔత్సాహిక కథారచయితలకు అవగాహన కల్పిస్తారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపెల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అతిథులుగా హాజరవుతారని, సకాలంలో హాజరుకావాలని అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి కోరారు.తూనికలు, కొలతలశాఖ అధికారుల తనిఖీలుసిరిసిల్ల: జిల్లా కేంద్రంలో తూనికలు, కొలతలశాఖ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. స్థానిక పాతబస్టాండు, గాంధీచౌక్ ప్రాంతాల్లోని బేకరీలు, స్వీట్షాపులు, కిరాణ దుకాణాల్లో సోదాలు చేశారు. ప్యాకేజీ వస్తువులపై అధిక ధరలు వసూలు చేస్తున్నారని గుర్తించి ఐదు దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే 94925 34843లో ఫిర్యాదు చేయాలని కోరారు. తూనికలు, కొలతల శాఖ కరీంనగర్ జోనల్ అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, జిల్లా అధికారి ఆర్.రూపేశ్కుమార్, సిబ్బంది గంగరాములు, శ్రీనివాస్, మల్లికార్జున్ పాల్గొన్నారు.ప్రభుత్వ భూమి కబ్జాపై విచారణఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని సింగారం శివారులోని దర్శావళిగుట్ట వద్ద ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఈక్రమంలోనే రెవెన్యూ అధికారులు సోమవారం విచారణ జరిపి కబ్జాదారుడికి నోటీసులు జారీ చేశారు. కబ్జా చేసిన ఎకరం బంచరాయి భూమి వ్యవహారంలో కబ్జాచేసిన వ్య క్తితో ఓ రాజకీయపార్టీ నాయకులు రహస్యంగా మంతనాలు జరిపినట్లు సమాచారం. కబ్జాచేసిన భూమిని రికవరీ చేసుకునే విషయంలో రెవెన్యూ అధికారులు చర్యలకు దిగుతున్నట్లు తెలిసింది. -
కుట్టేస్తున్నారు
● విద్యార్థుల యూనిఫాంలు సిద్ధం చేస్తున్న మహిళలు ● విద్యాసంవత్సరం ఆరంభంలోగా అందించాలని లక్ష్యం ● వేగంగా సిద్ధమవుతున్న దుస్తులుగంభీరావుపేట(సిరిసిల్ల): విద్యాసంవత్సరం ఆరంభంలోనే విద్యార్థులకు యూనిఫాంలు అందించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. ఈమేరకు యూనిఫాంల కుట్టే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పజెప్పారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో వస్త్రాలను కొనుగోలు చేసి యూనిఫాం కుట్టే పనులను మహిళా సంఘాలకు అప్పగించారు. గత ఫిబ్రవరిలోనే వీవోఏలు, ప్రధానోనాపాధ్యాయుల చొరవతో విద్యార్థుల కొలతలను సేకరించారు. ప్రస్తుతం తరగతులవారీగా రూపొందించిన డిజైన్లు, కొలతల ప్రకారం దుస్తులను కుడుతున్నారు. మరోవైపు కుట్టుమిషన్ పని వచ్చే మహిళా సంఘాల సభ్యులు ఉపాధి పొందుతున్నారు. వీరికి ఒక్కో జత కుట్టినందుకు రూ.75 చొప్పున చెల్లించనున్నారు. ముందుగా ఒక్కో జత జిల్లా వ్యాప్తంగా 32,269 మందికి యూనిఫామ్స్ అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 20వేలకు పైగా యూనిఫామ్స్ దుస్తులు సిద్ధమయ్యాయి. మిగతావి కూడా జూన్ 12లోపు సిద్ధం చేస్తామని స్వయం సహాయక సంఘాల సభ్యులు చెబుతున్నారు. ముందుగా ఒక్కొక్కరికి ఒక్కో జత ఇవ్వనున్నారు. ఆర్థికాభివృద్ధికి దోహదం విద్యార్థుల యూనిఫాంలు కుట్టే పనులను మహిళలకు అప్పగించడం ద్వారా మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి దోహదం కానుంది. ఏటా ఇదే విధంగా మహిళలకు పనులు అప్పగిస్తే బాగుంటుందని భావిస్తున్నాం. యూనిఫాంలు కుట్టే పనితో మహిళలకు ఉపాధి లభిస్తుంది. – భాగ్య, మండల సమాఖ్య అధ్యక్షురాలు, గంభీరావుపేటగడువులోగా అందిస్తాం అధికారులు చెప్పినట్లుగా విద్యాసంవత్సరం ఆరంభంలోగా పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాంలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. మహిళలు యూనిఫాంలు కుట్టే పనిని వేగంగా చేస్తున్నారు. – సుదర్శన్, ఐకేపీ ఏపీఎం, గంభీరావుపేట -
నయా పైసా ఎవరికీ ఇవ్వొద్దు
సిరిసిల్ల/ముస్తాబాద్(సిరిసిల్ల): నయా పైసా ఎవరికీ ఇవ్వొద్దు.. ఇసుక ఫ్రీగా ఇస్తాం.. నిరుపేదలకు మెప్మా ద్వారా రూ.లక్ష వరకు బ్యాంకు రుణం ఇప్పిస్తాం.. నిబంధనల మేరకు 600 చదరపు అడుగుల్లో ఇల్లు కట్టుకోండి అని... కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. సిరిసిల్లలో 764 మందికి, ముస్తాబాద్లో 491 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపత్రాలను ఆదివారం పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పుడు ఇల్లు రాని వారికి రెండో విడతలో ఇస్తామని తెలిపారు. నాలుగు నెలల్లో ఇల్లు నిర్మాణం పూర్తి చేసి, దసరా, దీపావళి నాటికి గృహప్రవేశాలు చేయాలని కలెక్టర్ కోరారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి మాట్లాడుతూ రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ పాలనలో సిరిసిల్ల నేతన్నలకు 12వేల అంత్యోదయ కార్డులు ఇస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 వేల కార్డులను రద్దు చేసిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్లలో ఇసుకను, గుట్టలను దోచుకున్నారని, రూ.100 కోట్లతో నిర్మించిన చెక్డ్యామ్లు ముక్కలయ్యాయని మహేందర్రెడ్డి ఆరోపించారు. ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, డీఆర్డీవో శేషాద్రి, హౌసింగ్ పీడీ శంకర్, మున్సిపల్ కమిషనర్ పి.వాణి, ముస్తాబాద్ ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు చొప్పదండి ప్రకాశ్, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, యెల్ల బాల్రెడ్డి, కనమేని చక్రధర్రెడ్డి, గజ్జెల రాజు, శ్రీనివాస్గౌడ్, మిర్యాల్కార్ శ్రీనివాస్, కొండల్రెడ్డి, దీటి నర్సింలు, యాదగిరిగౌడ్, అంజన్రావు, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో బీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇసుక ఫ్రీగా ఇస్తాం.. దశలవారీగా బిల్లు చెల్లిస్తాం నిరుపేదలకు మెప్మా ద్వారా రూ.లక్ష రుణం కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్ల, ముస్తాబాద్లలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ -
‘ఉపాధి’పై నిఘా
● పనుల పర్యవేక్షణకు మానిటరింగ్ కమిటీలు ● ఐదుగురు సభ్యులతో ఏర్పాటుకు నిర్ణయం ● అక్రమాలకు తావులేకుండా పనులు చందుర్తి(వేములవాడ): ఉపాధిహామీ పథకం పారదర్శకంగా అమలు జరిగేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఉపాధిహామీ పథకం పనులపై నిఘా పెట్టేందుకు గ్రామాల్లో విలేజీ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనుంది. పనుల పర్యవేక్షణతోపాటు అవకతవకలు జరిగిన వెంటనే చర్యలు చేపట్టేందుకు విలేజీ మానిటరింగ్ కమిటీ(వీఎంసీ)కి పూర్తిస్థాయిలో అధికారాలను కట్టబెట్టింది. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. మానిటరింగ్ సభ్యుల నియామకానికి నిబంధనలు ● జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో విలేజీ మానిటరింగ్ కమిటీలను ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయాలని ప్రతీ గ్రామపంచాయతీకి ఆదేశాలు జారీచేశారు. ● ఈ కమిటీల్లో అంగన్వాడీ టీచర్, యూత్ సభ్యులు, స్కూల్టీచర్, గ్రామైక్య సంఘం సభ్యురాలు, ఈజీఎస్ సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ● పంచాయతీల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు కమిటీలను ప్రతిపాదిస్తూ ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు నివేదికలు పంపించారు. ఈ కమిటీలు దాదాపు ఆరు నెలలపాటు పనిచేసేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. 98 వేల కుటుంబాలకు జాబ్కార్డులు జిల్లాలోని 255 గ్రామపంచాయతీల పరిధిలో 98వేలకుపైగా జాబ్కార్డులు ఉన్నాయి. 1,98,564 మంది కూలీలు ఉన్నారు. ఇందులో 64వేల జాబ్కార్డులు యాక్టివేట్ కాగా ఒక లక్ష మంది వరకు పనులకు హాజరవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. కమిటీ విధులు ఇవీ.. ఉపాధిహామీ పనులను వారంలో ఒక్కసారైనా పర్యవేక్షించే బాధ్యత విలేజీ కమిటీలపై ఉంది. పనుల నిర్వహణపై కూలీలతో చర్చించాలి. ఉపాధిహామీ పనుల నిర్వహణ, సౌకర్యాలు పరిశీలించడంతోపాటు పనుల్లో నాణ్యత, వ్యయాన్ని అంచనా వేయడం, చేపట్టిన పనులపై నివేదికలు అందజేయడం కమిటీల బాధ్యత. కమిటీలు ఏర్పాటు చేశాం జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో విలేజీ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేశాం. ఉపాధిహామీ పథకం పనుల్లో అవతకవకలకు తావు లేకుండా పర్యవేక్షించేందుకు ఈ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతలను కమిటీ సభ్యులకు అప్పగించాం. పనులు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ కమిటీలు దోహదపడనున్నాయి. – శేషాద్రి, డీఆర్డీవో -
దేశ రక్షణలో సైనికులదే కీలకపాత్ర
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి ముస్తాబాద్(సిరిసిల్ల): దేశ రక్షణలో సైనికులదే కీలకపాత్ర అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం బందనకల్కు చెందిన సైనికులు ధర్మపురి, శరత్లు ఆపరేషన్ సిందూర్లో పాల్గొని ఇటీవల స్వగ్రామానికి చేరుకోగా వారిని ఆదివారం సన్మానించారు. గోపి మాట్లాడుతూ సైనికులు ప్రాణాలకు తెగించి దేశ ప్రజలందరిని సురక్షితంగా కాపాడుతున్నారని కొనియాడారు. దేశం కోసం జీవితాలను త్యాగం చేస్తున్న సైనికుల రుణం తీర్చుకోలేమన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు సౌల్ల క్రాంతికుమార్, సంతోష్రెడ్డి, మహేశ్వరి, మహేశ్, కార్తీక్రెడ్డి, రమేశ్, సుధాకర్, రాజేందర్, రాజు, వంశీ, శ్రీకర్, గాలిరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలి బోయినపల్లి(చొప్పదండి): ఉపాధ్యాయులు కాలానుగుణంగా బోధన చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని జిల్లా విద్యాధికారి సీహెచ్ జనార్దన్రావు కోరారు. మండలకేంద్రంలో జరుగుతున్న ఉపాధ్యాయుల వృత్త్యంతర శిక్షణ తరగతులను ఆదివారం పరిశీలించారు. బడిబాటను విజయవంతం చేయాలని కోరారు. ఎంఈవో శ్రవణ్కుమార్, హెడ్మాస్టర్ బొలగం శ్రీనివాస్, కరీంనగర్ డైట్ ప్రిన్సిపాల్ ఎస్.మొండయ్య, రిసోర్సుపర్సన్లు కనకయ్య, జగన్మోహన్, కుమారస్వామి, బి.శ్రీనివాస్, చంద్రశేఖర్, సురేంద్రస్వామి, టెక్నికల్ పర్సన్ శ్రీపతి చంద్రమౌళి ఉన్నారు. మహాసభలు విజయవంతం చేయండి సిరిసిల్లటౌన్: సీపీఐ జిల్లా నాలుగో మహాసభలు విజయవంతం చేయాలని పార్టీ పట్టణ కార్యదర్శి పంతం రవి కోరారు. జూన్ 12, 13 తేదీల్లో సిరిసిల్లలో జరిగే జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ విప్లవ పోరాటాలకు దిక్సూచిగా నిలిచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలకు జిల్లా కేంద్రంగా ఉండేదన్నారు. సోమ నాగరాజు, గాజుల లింగం, రాయమల్లు, నల్ల మార్కండేయులు, మోర తిరుపతి, సుంకనపెళ్లి శాంతక్క, కోడం ప్రమీల పాల్గొన్నారు. కార్పొరేట్ జ్యువెలరీ దుకాణాలను నిషేధించాలి ● హైకోర్టు అడ్వకేట్ రఘునాథ్ ముస్తాబాద్(సిరిసిల్ల): కార్పొరేట్ జ్యువెలరీ దుకాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వవద్దని, స్వర్ణకారుల చేతివృత్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని హైకోర్టు న్యాయవాది రఘునాథ్ డిమాండ్ చేశారు. ముస్తాబాద్లో రైతుఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన స్వర్ణకారుల సమావేశంలో మాట్లాడారు. కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న స్వర్ణకారులు రాజస్థాన్ నుంచి వస్తున్న కార్పొరేట్ జ్యువెలరీ దుకాణాలతో రోడ్డున పడుతున్నారన్నారు. పుస్తె, మెట్టెలను విక్రయించే హక్కులను స్వర్ణకారులకు ఇవ్వాలని కోరారు. సంఘం మండలాధ్యక్షుడు చింతోజు బాలయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, డీఎల్ఎఫ్ అధ్యక్షుడు మార్వాడి సుదర్శన్, అడ్వకేట్ సుజాత తదితరులు పాల్గొన్నారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
సిరిసిల్ల/రుద్రంగి(వేములవాడ): వరుసగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రుద్రంగి మండలంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. తేమశాతం వచ్చినా ధాన్యాన్ని సైతం తూకం వేయకపోవడంతో బుధ, గురువారాల్లో కురిసిన వర్షానికి ధాన్యం కుప్పల్లోకి వరదనీరు వచ్చి చేరింది. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కంటతడి పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను సైతం మిల్లులకు తరలించకపోవడంతో తడిసి ముద్దయ్యాయి. జిల్లా అంతటా వర్షాలు రుద్రంగిలో అత్యధికంగా 47.1 మిల్లీమీటర్లు, చందుర్తిలో 31.8, వేములవాడరూరల్లో 19.6, బోయినపల్లిలో 22.8, వేములవాడలో 35.9, సిరిసిల్లలో 23.4, కోనరావుపేటలో 27.8, వీర్నపల్లిలో 30.5, ఎల్లారెడ్డిపేటలో 42.7, గంభీరావుపేటలో 29.6, ముస్తాబాద్లో 27.2, తంగళ్లపల్లిలో 33.5, ఇల్లంతకుంటలో 19.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సగటు 30.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
వీర్నపల్లి(సిరిసిల్ల): పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. వీర్నపల్లి మండలంలో శుక్రవారం రెండో విడతలో మంజూరైన 259 మందికి ఇందిరమ్మ పత్రాలను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ 400 నుంచి 600 చదరపు అడుగులలోపు ఇంటి నిర్మాణం జరిగితే 4 దశల్లో బిల్లులు మంజూరవుతాయని తెలిపారు. బిల్లులు మంజూరు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే తనకు ఫోన్లో తెలపాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. నెల రోజుల్లోగా ఇళ్ల పనులు మొదలుపెట్టాలని సూచించారు. పీడీ హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేకాధికారి రామదాసు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రాములు, ఎంపీడీవో అబ్దుల్ వాజిద్, తహసీల్దార్ మక్తర్ పాషా, ఆర్ఐ శివకుమార్ పాల్గొన్నారు. గంభీరావుపేట(సిరిసిల్ల): వచ్చే దసరా, దీపావళి పండుగలను ఇందిరమ్మ ఇళ్లల్లో చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. గంభీరావుపేట మండలంలో రెండో విడత కింద 507 మందికి మంజూరైన ఇళ్ల ఉత్తర్వులను శుక్రవారం కేకే మహేందర్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని తెలిపారు. హౌసింగ్ పీడీ శంకర్, మండల ప్రత్యేకాధికారి హన్మంతు, ఏఎంసీ చైర్పర్సన్ విజయ, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు హమీద్, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాంచంద్రారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు, ఎంపీడీవో రాజేందర్, తహసీల్దార్ మారుతిరెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా బిల్లుల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే నాకు ఫోన్ చేయండి వీర్నపల్లి, గంభీరావుపేటల్లో ఇళ్ల మంజూరుపత్రాలు పంపిణీ -
విజిలెన్స్ స్లో!
● శాతవాహన సిబ్బందికి మరోసారి నోటీసులు ● ఖర్చు బాధ్యులకు తాజాగా తాఖీదులు ఇవ్వనున్న విజిలెన్స్ ● గతంలో నోటీసులకు పెద్దగా స్పందించని వర్సిటీ అధికారులు ● వీసీ, సిబ్బంది మారడంతో తొలి నుంచి విచారణ ● విచారణకు ఆటంకంగా మారిన విజిలెన్స్లో సిబ్బంది కొరతసాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరిగాయంటూ గతేడాది మొదలైన విజిలెన్స్ విచారణ నత్తనడకన సా గుతోంది. ఇటీవల యూనివర్సిటీ వీసీ మారడం, కొందరు సిబ్బంది బదిలీ కావడం, పదవీ విరమణ పొందడం అదే సమయంలో విజిలెన్స్కు కూడా కొత్త ఎస్పీ రావడంతో విచారణ తిరిగి మొదటి నుంచి ప్రారంభించనున్నారని సమాచారం. వాస్తవానికి శాతవాహన యూనివర్సిటీలో జరిగిన అభివృద్ధి పనులపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ నిధులను మంచినీళ్లలా ఖర్చు చేశారని పలువురు ఫ్రొఫెసర్లు బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో గతేడాది జూన్ 18వ తేదీన హైదరాబాద్లోని విజిలెన్స్ ప్రధాన కార్యాలయంలో కొందరు ఫిర్యాదు చేశారు. సరిగ్గా నెలరోజుల తరువాత ఈ ఫిర్యాదు కరీంనగర్ విజిలెన్స్ కార్యాలయానికి చేరింది. దాదాపు 160 పేజీలు ఉన్న ఆ ఫిర్యాదును అధ్యయనం చేసిన జిల్లా విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించినా అనుకున్న మేరకు అది సాగలేదు. వర్సిటీ అధికారులు సహకరించకపోవడం ప్రధాన కారణం అయితే, విజిలెన్స్లో స్టాఫ్ కొరత మరో ముఖ్య కారణంగా తెలుస్తోంది. మళ్లీ నోటీసులు దాదాపుగా ఏడాది కావొస్తున్నా.. విచారణలో పెద్దగా పురోగతి లేకపోవడంతో దీనిపై మరోసారి విజిలెన్స్ దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో వర్సిటీలో జరిగిన అధిక ఖర్చులపై విజిలెన్స్ చిట్టా రూపొందించింది. ముఖ్యంగా వర్సిటీ భవనాల్లో భారీగా (రూ.50 కోట్లకుపైగా) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ సమయంలో ఎవరు ఆ నిర్మాణాలకు బాధ్యలుగా ఉన్నారో గుర్తించారు. ఈ నిర్మాణాల్లోనే చాలా మట్టుకు టెండర్లలో గోల్మాల్ జరిగిందన్న విమర్శలున్నాయి. వారికి తిరిగి కొత్తగా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. కొత్తగా వచ్చిన వీసీకి కూడా జరిగిన విషయాన్ని విజిలెన్స్ అధికారులు వివరించి విచారణకు సహకరించాలని కోరారు. అదే సమయంలో విజిలెన్స్ ఎస్పీగా ఎం.శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టడంతో ఆయనకూ వివరించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ కేసు విచారణ వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.వేధిస్తున్న సిబ్బంది కొరతవాస్తవానికి విజిలెన్స్ విభాగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. డాక్యుమెంటేషన్ ప్రక్రియ కోసం డీటీపీ ఆపరేటర్లనూ రిక్రూట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఇన్స్పెక్టర్ ర్యాంకుల్లో ఉన్న అధికారులే విచారణతోపాటు కేసు వివరాలను స్వయంగా డీటీపీ చేసుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి కరీంనగర్లో గతంలో గొర్రెల స్కాం, పత్తి స్కాం, ఆసరా పింఛన్ల స్కాం, సదరం సర్టిఫికెట్ల స్కాం, బల్దియాలో పనులతో పాటు ఉమ్మడి జిల్లాలో అనేక కేసులు పరిమితి సిబ్బందితో విచారణ చేయాలంటే వీరికి తలకుమించిన భారంగా మారింది. పైగా పని ఒత్తిడితో సిబ్బంది సతమతమవుతున్నారు. ఈ క్రమంలో శాతవాహన వర్సిటీ అధికారులు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ విచారణ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. -
అప్రమత్తతే ఆయుధం
● జిల్లాలో కరోనా కేసుల్లేవు ● డెంగీ జ్వరానికి సర్కారు వైద్యమే బెస్ట్ ● వ్యాధులపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో జిల్లా వైద్యాధికారి రజితసిరిసిల్లటౌన్: జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు కాలేదు.. కరోనా, డెంగీ వ్యాధులకు భయపడకుండా అప్రమత్తత.. బాధ్యతతో ఉంటే నివారించవచ్చని డీఎంహెచ్వో రజిత పేర్కొన్నారు. జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభిస్తుండడంతో ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించేందుకు శుక్రవారం ‘సాక్షి’ జిల్లా వైద్యాధికారితో ఫోన్ఇన్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. జ్వరాలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దని సూచించారు. జూలైలో వచ్చే సీజనల్ వ్యాధులు ఇప్పుడే విస్తరిస్తున్నాయని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామీణ యువత సహకరిస్తే.. వైద్యారోగ్యశాఖ తరఫున ప్రజల్లో సీజనల్ వ్యాధులపై చైతన్యం కల్పిస్తామని తెలిపారు. -
మెడికల్ కాలేజీకి భౌతికకాయం
సిరిసిల్ల: జిల్లా మెడికల్ కాలేజీలో అంతర్నిర్మాణ శాస్త్ర బోధనకు అవసరమైన మానవ శవాన్ని వేములవాడ పోలీసులు శుక్రవారం అందించారు. వేములవాడ గుడి చెరువులో లభించిన గుర్తుతెలియని శవాన్ని పట్టణ సీఐ వీరప్రసాద్ సిరిసిల్ల మెడికల్ కాలేజీకి అందించారు. వివిధ విభాగాధిపతులు డాక్టర్ నిర్విశా, డాక్టర్ అన్వర్ ఉన్నీసా, డాక్టర్ అర్పిత ఉన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భవిష్యత్లో అనాథ భౌతికదేహాలు ఎక్కడ దొరికినా మెడికల్ కాలేజీకి అందించాలని కోరారు. వివరాలకు 80086 21371లో సంప్రదించాలని తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు● జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం సిరిసిల్ల: జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం హెచ్చరించారు. కలెక్టరేట్లో శుక్రవారం విత్తన, ఎరువుల వ్యాపారులకు, వ్యవసాయశాఖ అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ విత్తన విక్రయాలకు సంబంధించిన లైసెన్స్ కాలపరిమితి, గోదాం, దుకాణం ఇంటి నంబర్లు సరిగ్గా ఉన్నాయా.. లేదా.. పరిశీలించాలన్నారు. ప్రతీ విత్తనానికి ఇన్వాయిస్ కాపీ, ప్రిన్సిపల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. బిల్లులో రైతు పేరు, లాట్ నంబర్, డీలర్ సంతకం, రైతు సంతకాలు ఉండాలని సూచించారు. కాలం చెల్లిన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు విక్రయించొద్దని వ్యాపారులకు సూచించారు. -
ఆశీర్వచనాలు.. పరామర్శలు
ముస్తాబాద్(సిరిసిల్ల): బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముస్తాబాద్ మండలంలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. బందనకల్లో పెద్దమ్మ–పెద్దిరాజుల కల్యాణ ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నామాపూర్లో శ్రీవరాల మల్లికార్జునస్వామి ఆలయ వార్షికోత్సవానికి హాజరయ్యారు. ఆవునూర్ మడేలేశ్వరస్వామి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ముస్తాబాద్, గూడెం, ఆవునూర్లో నూతన వధూవరులను ఆశీర్వదించారు. బందనకల్లో మాజీ ఎంపీటీసీ రామచంద్రారెడ్డిని, చిగురు నరేశ్ను పరామర్శించారు. ముస్తాబాద్లో తిరుమల నర్సింగ్హోంను సందర్శించి, ఇటీవల ప్రారంభించిన ఐసీయూ యూనిట్ను పరిశీలించారు. కేటీఆర్ వెంట నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, కల్వకుంట్ల గోపాల్రావు, మండలాధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు, డాక్టర్ చంద్రశేఖర్రావు, సర్వర్, సంతోష్రావు, మనోహర్, జహంగీర్, స్వామి, వెంకటస్వామి పాల్గొన్నారు. ● జిల్లాలో కేటీఆర్ సుడిగాలి పర్యటన -
పదోన్నతులతో బాధ్యత పెంపు
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతిసిరిసిల్లక్రైం: ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతులు బాధ్యతను పెంచుతాయని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లాలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శంకర్(సిరిసిల్లటౌన్), లక్పతి(వేములవాడరూరల్), మోతీరాం(బోయినపల్లి)లకు ఎస్సైలుగా పదోన్నతి పొందారు. వీరికి ఎస్పీ అభినందనలు తెలిపారు. పదోన్నతులు పొందిన పోలీసులు రెట్టింపు ఉత్సాహంతో సేవలందించాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించే వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై నిఘా రైతులు నకిలీ విత్తనాల బారిన పడి మోసపోకుండా ఉండేందుకు గట్టి నిఘా పెట్టామని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. నకిలీ విత్తనాల ఉత్పత్తి, సరఫరా, విక్రయాలను అరికట్టేందుకు వ్యవసాయశాఖ, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఘనంగా సంతు సేవాలాల్ విగ్రహ ప్రతిష్ఠ రుద్రంగి(వేములవాడ): గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీజగదాంబమాత, శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ మానాల ఉద్యమ కాలం నుంచి తన వెంట నడిచిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మానాల, గిరిజన తండా గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీపీ గంగం స్వరూపారాణి, నాయకులు గంగం మహేశ్ తదితరులు ఉన్నారు. కంచర్లలో వైద్యశిబిరం తనిఖీ వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని కంచర్లలో కొనసాగుతున్న ఉచిత వైద్యశిబిరంను జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిత శుక్రవారం సందర్శించారు. పీహెచ్సీ వైద్యాధికారి సారి యా అంజుమ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. అనుమానిత జ్వరపీడితులకు పరీక్షలు చేశారు. ఈ వైద్యశిబిరంలో శుక్రవారం 10 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి ముగ్గురిక రక్తనమూనాలు సేకరించి ఆర్డీటీ పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. సూపర్వైజర్ లింగం, మోహన్ పాల్గొన్నారు. కూలిన గుడి పరిశీలన ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రేపాకలో గురువారం వర్షాలకు శ్రీనరసింహస్వామి ఆలయం గోపురం కూలిపోగా శుక్రవారం జిల్లా దేవాదాయశాఖ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు పరిశీలించారు. జిల్లా దేవాదాయశాఖ కార్యనిర్వాహకవర్గ అధికారి మారుతీరావు గుడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ.40లక్షలు మంజూరు చేస్తే గుడి అభివృద్ధి చేస్తామని గ్రామ కాంగ్రెస్ నాయకుడు మల్లేశం పేర్కొన్నారు. దేవాదాయశాఖ అధికారి మారుతీరావు, జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్, మండల మండల రెవెన్యూ కార్యాలయం ఆర్ఐ సంతోష్ పాల్గొన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనాలి సిరిసిల్లటౌన్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీసులో శుక్రవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుపెడుతున్నారన్నారు. ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా కొనుగోలు కేంద్రాల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ పాల్గొన్నారు. -
పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ఓబులాపూర్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల రికార్డులు, వ్యాక్సిన్ కోల్డ్ చైన్ను పరిశీలించారు. సకాలంలో గర్భిణీలకు, ఐదేళ్లలోపు చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయాలని సూచించారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి సంపత్కుమార్, పీహెచ్సీ మెడికల్ అధికారి అఫీసా, సిబ్బంది జ్యోతి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయండి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో వారం రోజుల్లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని పౌరసరఫరాల టాస్క్ ఫోర్స్ టీం అధికా రి లక్ష్మారెడ్డి, జంగయ్య సూచించారు. వెంకటాపూర్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రికార్డులు, రైతుల నుంచి సేకరించిన ధాన్యం, రైస్మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైస్మిల్లులను విజిట్ చేసి ధాన్యం దిగుమతి గురించి తెలుసుకున్నారు. డీటీసీఎస్ అశోక్, ఇన్చార్జి డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం మల్లేశం, సీసీ పద్మ పాల్గొన్నారు. మాంసం విక్రయాలపై నియంత్రణ ఉంచాలి సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో వెటర్నరీ డాక్టర్ గుర్తించకుండా సాగుతున్న మాంసం విక్రయాలను నియంత్రించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. ఈమేరకు బుధవారం సిరిసిల్ల మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ పోసు వాణికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పట్టణంలో నిబంధనల విరుద్ధంగా పశువైద్యులు ధ్రువీకరించకుండా మేక, గొర్రె మాంసాన్ని విక్రయిస్తున్నారని దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు చనిపోయిన జీవాలను కోసి అమ్ముతున్నారని, ఆడగొర్రెలను కోసి పొట్టేలుగా చెబుతూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్లాటర్హౌస్ నిర్మించినా అక్కడ గొర్రెలను కోయడం లేదన్నారు. ఎలిగేటి రాజశేఖర్, బూర్ల సందీప్ పాల్గొన్నారు. 27న కథారచనపై వర్క్షాప్ సిరిసిల్లకల్చరల్: కథలు ఎలా రాయాలి అనే అంశంపై ఈనెల 27న తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కథా కార్యశాల(వర్క్షాప్) నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త బుధవారం ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్స్హాల్లో జరిగే ఈ వర్క్షాప్లో జిల్లాకు చెందిన కథారచయిత పెద్దింటి అశోక్కుమార్ కీలకోపన్యాసం చేస్తారని పేర్కొన్నారు. ఈ వర్క్షాప్నకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్, సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, రచయితలు కాలువ మల్లయ్య, వెల్దండి శ్రీధర్ హాజరవుతారని తెలిపారు. పంట మార్పిడితో సుస్థిర ఆదాయం బోయినపల్లి(చొప్పదండి): రైతులు పంట మార్పిడితో సుస్థిర ఆదాయం పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బోయినపల్లి రైతువేదికలో బుధవారం రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందకు వీలుగా పలు అంశాలపై వారికి అవగాహన కల్పించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయాలని సూచించారు. ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ మదన్మోహన్రెడ్డి, ఏడీఏ రామారావు, శాస్త్రవేత్త రాజేంద్రప్రసాద్, ఎంఏవో ప్రణిత, మండల పశువైద్యాధికారి సతీశ్, ఏఈవోలు శ్రీదేవి, లక్ష్మణ్, రావెప్ విద్యార్థులు ఉన్నారు. -
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025
‘కొత్తపల్లికి చెందిన ఓ విద్యార్థికి ఆర్ట్స్ గ్రూపు అంటే ఇష్టం. చిన్నతనం నుంచే సోషల్ సంబంధిత సబ్జెక్టులపై పట్టు సాధించాడు. గ్రూప్స్ రాయాలనేది అతని కోరిక. పది పూర్తయ్యాక ఆర్ట్స్ గ్రూపులో చేరాలనుకున్నాడు. ఇంట్లో పెద్దల బలవంతంతో ఎంపీసీలో చేరాడు. అతను చదువలేక ఫెయిలయ్యాడు.’ ‘లింగన్నపేటకు చెందిన మరో విద్యార్థికి సీఏ చేయాలన్నది కోరిక. పది పూర్తయ్యాక ఎంఈసీలో చేరాలనుకున్నాడు. తల్లిదండ్రులేమో కొడుకును ఇంజినీర్గా చూడాలనుకున్నారు. బలవంతంగా ఎంపీసీలో చేర్పించారు. అయిష్టంతో చదివిన అతను పాస్మార్కులతో గట్టెక్కాడు. ఇంజినీరింగ్లో సీటు రాకపోవడంతో డిగ్రీలో ఆర్ట్స్ చదువుతున్నాడు.గంభీరావుపేట(సిరిసిల్ల): నా కొడుకును ఇంజినీర్గా చూడాలి.. డాక్టర్ను చేయాలి.. సీఏ చదివించి బాగా సంపాదించాలి... ఇలా తల్లిదండ్రులు తమ ఇష్టాలను పిల్లలపై రుద్దుతున్నారే తప్ప.. పిల్లల ఇష్టాలు.. అభీష్టాలు ఏంటి.. అని ఆలోచించే వారు కరువయ్యారు. సాఫ్ట్వేర్గా.. డాక్టర్గా బోలెడంతా డబ్బు సంపాదించాలనే ధ్యాసతోనే పదోతరగతి పాసైన తమ పిల్లలను ఎంపీసీ, బైపీసీలో చేర్పిస్తున్న తల్లిదండ్రులే ఎక్కువ ఉన్నారు. అసలు వారికి ఏ సబ్జెక్టుపై మక్కువ ఉందో తెలుసుకోవడం లేదు. తల్లిదండ్రులు చెప్పిన కోర్సులో చేరి.. సబ్జెక్టులు అర్థంకాక.. కార్పొరేట్ కాలేజీల్లో ఒత్తిడి భరించలేక చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు ఇంటర్ ఫెయిల్ అయి ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నారు. ప్రస్తుతం పదో తరగతి ఫలితాలు వెలువడడంతో ఇంటర్లో ప్రవేశాలు తీసుకుంటున్నారు. అసలు పిల్లలకు ఏ సబ్జెక్టులు అంటే ఇష్టమో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఏ గ్రూప్లో చేరాలో నిర్ణయం తీసుకోవాల్సిన స్వేచ్ఛ ఇస్తేనే వారు ఎంచుకున్న సబ్జెక్టులో ఉత్తమ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు ఇష్టమైన సబ్జెక్టులను బలవంతంగా రుద్దడం కాకుండా.. వారికి ఇష్టమున్న సబ్జెక్టులను చదివేలా చూడాలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. – వివరాలు 8లోuన్యూస్రీల్ -
ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్కు నోటీసులు
● నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు సిరిసిల్ల: అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పేరుతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పే ర్కొన్నారు. సిరిసిల్లలోని ప్రెస్క్లబ్లో బుధవారం బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రెస్మీట్లో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, పాలన చేతకాక దయనీయ స్థితిలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, దేశానికి రోల్మోడల్గా నిలిపిన కేసీఆర్ను దోషిగా చూపించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పీసీ ఘోష్ కమిషన్తో నోటీసులు ఇప్పించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే.. రిజర్వాయర్లు, సొరంగాలు, కాల్వలు, పంప్హౌజ్లని రెండు, మూడు ఫిల్లర్లు కుంగిపోతే వెంటనే రిపేరు చేయకుండా.. కేసీఆర్పై కోపంతో రైతులకు నీళ్లు ఇవ్వకుండా పొలాలు ఎండబెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ ప్రజాపాలన పేరిట సీఎం రేవంత్రెడ్డి తన నేర ప్రవృత్తిని చాటి చెప్పుకుంటున్నారని ఆరో పించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు రైతుబంధు రూ.15వేలు, కల్యాణలక్ష్మీలో తులం బంగారం, పెన్షన్లు డబుల్ ఇస్తామని చెప్పి ఒక్కటి అమలు చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, నాయకులు కుంబాల మల్లారెడ్డి, గుండ్లపల్లి పూర్ణచందర్, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. -
దీపావళి సొంతింటిలో జరుపుకోవాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరుపత్రాలు పంపిణీ తంగళ్లపల్లి/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వచ్చే దీపావళి తమ సొంతిళ్లలో జరుపుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డితో కలిసి మంజూరుపత్రాలు పంపిణీ చేశారు. తంగళ్లపల్లి మండలంలో 500, ఎల్లారెడ్డిపేట మండలంలో 643 మంది లబ్ధిదారులకు మంజూరుపత్రాలు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు దశలలో రూ.5లక్షలు అందజేస్తామని తెలిపారు. బేస్మెంట్ పూర్తయితే రూ.లక్ష, గోడలు నిర్మిస్తే రూ.లక్ష, స్లాబ్ తరువాత రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత చివరి రూ.లక్ష నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వివరించారు. బిల్లుల విషయంలో దళారులను నమ్మొద్దని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. 30 రోజుల్లోగా ఇంటి పనులు ప్రారంభించాలని, లేకుంటే అనుమతులు రద్దవుతాయన్నారు. ఇళ్లు నిర్మించుకోలేని నిరుపేద మహిళలకు స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రూ.లక్ష రుణం అందిస్తామన్నారు. పీడీ హౌసింగ్ శంకర్, మండలాల ప్రత్యేకాధికారులు షరీఫుద్ధీన్, అఫ్జల్బేగం, ఏఎంసీ చైర్పర్సన్ వెల్ముల స్వరూప, సాబేర బేగం, వైస్చైర్మన్ నేరెళ్ల నర్సింగం, ఎల్లారెడ్డిపేట పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ, తహసీల్దార్లు జయంత్కుమార్, సుజాత, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ప్రవీణ్ జే టోని, ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో సత్తయ్య, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
గాలివాన.. తడిసిన ధాన్యం
● చిత్తడిగా మారిన సిరిసిల్ల ● రోడ్లపై పారిన డ్రెయినేజీలు ● కోనరావుపేటలో అత్యధికంగా 40.6 మిల్లీమీటర్ల వర్షంసిరిసిల్ల: జిల్లాలో బుధవారం కురిసిన గాలివానతో సిరిసిల్ల పట్టణం చిత్తడిగా మారగా.. మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు టార్పాలిన్ కవర్లు కప్పేందుకు నానా తిప్పలు పడ్డారు. సిరిసిల్లలోని సంజీవయ్య విగ్రహం వెనకాల మురికినీరు రోడ్డుపైన పారింది. ఆటోనగర్, కుమ్మరిగల్లీ, ఆసిఫ్పుర, శాంతినగర్ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు చిత్తడిగా మారాయి. పట్టణంలోని పైభాగంలో ఉన్న ప్రాంతాల మురికినీరు లోతట్టు ప్రాంతాలకు చేరి రోడ్డు ఎక్కడంతో పట్టణంలోని పలు రోడ్లు అడుగువేయలేని స్థితికి చేరుతున్నాయి. ఏటా వర్షాకాలంలో ఈ మురికి కష్టాలు సిరిసిల్ల పట్టణ ప్రజలకు తప్పడం లేదు. లక్ష జనాభాతో 39 వార్డులతో విస్తరించి ఉన్న సిరిసిల్లలో ప్రజల అవసరాల మేరకు మురికి కాల్వల విస్తరణ చేయకపోవడంతో ఈ అగచాట్లు తప్పడం లేదు. ముందే పలకరించిన తొలకరి జిల్లాను తొలకరి జల్లులు ముందే పలకరించాయి. ఏటా మే 25న రోహిణీ కార్తె ప్రవేశంతో వానాకాలం మొదలవుతుంది. కానీ ఈ ఏడాది నాలుగు రోజుల ముందుగానే వర్షం కురవడం విశేషం. ఇన్నాళ్లు ఉక్కపోతతో ఇబ్బందిపడ్డ జిల్లా జనం బుధవారం కురిసిన భారీ వర్షంతో చల్లబడ్డారు. ధాన్యం కుప్పల్లోకి నీరు వేములవాడ/ఇల్లంతకుంట/కోనరావుపేట/ ఎల్లారెడ్డిపేట/రుద్రంగి/వేములవాడరూరల్/ చందుర్తి/బోయినపల్లి: వేములవాడ పట్టణంలో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ● ఇల్లంతకుంట మండల కేంద్రంతోపాటు పెద్దలింగాపూర్, కందికట్కూర్, రేపాక, గాలిపల్లి, వంతడుపుల గ్రామాల్లో వర్షం కురిసింది. మండల కేంద్రంలోని ఎస్సీకాలనీ వద్ద బీటీ రోడ్డుపై లోతట్టుగా వర్షం నీరు నిలిచింది. అనంతారం కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన బస్తాలు తడిసిపోయాయి. నెల రోజుల క్రితం ధాన్యం తీసుకొచ్చామని, మిల్లుకు తరలించడం లేదని రైతులు బైరి అనిల్, జలాలుద్దీన్ తెలిపారు. ● కోనరావుపేట, రుద్రంగి, వేములవాడరూరల్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నిల్వలు తడిసిపోయాయి. ● ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం శివారులోని కేసీఆర్ కాలనీ వద్ద సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై విద్యుత్ మెయిన్ లైన్ వైర్లు తెగిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సెస్ అధికారులు పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ● చందుర్తి మండలం బండపల్లి–ఎన్గల్ గ్రామాల మధ్య ఆర్అండ్బీ రోడ్డుపై చెట్టు కూలిపోతే స్థానికుల సహాయంతో తొలగించారు. కోరుట్ల–వేములవాడ ప్రధాన రహదారి చందుర్తి శివారులో చెట్లు కూలిపోయాయి. ● బోయినపల్లి మండలం దుండ్రపల్లి, గుండన్నపల్లి గ్రామాల్లోని రైతుల ధాన్యం తడిసిపోయింది. గుండన్నపల్లి, దుండ్రపల్లిల్లోని ధాన్యం కుప్పల చుట్టూ పెద్ద మొత్తంలో వర్షపు నీరు నిలిచింది. వర్షం ఇలా..(మి.మీ..)రుద్రంగి : 25.3 చందుర్తి : 35.9 వేములవాడ రూరల్ : 9.0 బోయినపల్లి : 12.9 వేములవాడ : 23.1 సిరిసిల్ల : 16.3 కోనరావుపేట : 40.6 వీర్నపల్లి : 35.3 ఎల్లారెడ్డిపేట : 15.3 గంభీరావుపేట : 22.3 ముస్తాబాద్ : 4.9 తంగళ్లపల్లి : 14.6 ఇల్లంతకుంట : 12.1 -
కొనుగోళ్లలో జాప్యం.. రోడ్డెక్కిన రైతన్న
ఇల్లంతకుంట(మానకొండూర్): ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై మంగళవారం మండలంలోని పొత్తూరులో రైతన్నలు రోడ్డుపై బైఠాయించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, గత నెల 11న గ్రామంలో కేంద్రం ప్రారంభించినా ఇప్పటివరకు కొనుగోళ్లు పూర్తి కాలేదని ఆరోపించారు. ఆది, సోమవారాల్లో తూకం వేసిన 4 వేల బస్తాల ధాన్యం లారీలు రాక కేంద్రంలోనే ఉండిపోయిందని, వర్షం పడితే ధాన్యం తడుస్తుందని పేర్కొన్నారు. ఈక్రమంలో మాజీ జెడ్పీటీసీ సిద్ధం వేణు రైతులకు సంఘీభావం తెలిపి ఐకేపీ ఏపీఎం వాణిశ్రీతో మాట్లాడారు. రెండురోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రెండురోజులు లారీలు రాకపోవడంతో తూకం వేసిన ధాన్యం ఆగిందని, మంగళవారం లారీల్లో మిల్లులకు పంపించినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, పట్నం శ్రీనివాస్, కుదురు శేఖర్, చెరుకు రాజు, నారాయణరెడ్డి, రాజయ్య, గౌరయ్య, రాజ మల్ల య్య తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలాపై పోరాటం తప్పదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. యూనియన్ పిలుపులో భాగంగా మంగళవారం స్థానిక బీౖవైనగర్లోని పార్టీ ఆఫీసులో ఫ్లకార్డులతో నిరసన చేపట్టి మాట్లాడారు. కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులను మోదీ ప్రభుత్వం తొలగించి పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికై నా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని లేకుంటే కార్మికవర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నల్దాస్ గణేశ్, సూరం పద్మ, నక్క దేవదాస్, బెజుగం సురేశ్, జిందం కమలాకర్, బింగి సంపత్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల అభీష్టం మేరకు వేములవాడ– ముంబయి బస్
వేములవాడ: ప్రజల అభీష్టం మేరకు వేములవాడ– ముంబయికి లహరి ఏసీ స్లీపర్ బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం వేములవాడ ఆలయ పార్కింగ్ స్థలంలో రెండు ఏసీ బస్సులను విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్కుమార్ఝాతో కలిసి అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య పూజ అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముంబయిలోని తెలుగు ప్రజల కోరిక మేరకు బస్సులను ప్రారంభిస్తున్నామని, రోజూ మధ్యాహ్నం 12.30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.45 గంటలకు ముంబయి చేరుకుంటుందని, తిరిగి అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబయి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు వేములవాడ చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు స్లీపర్ బెర్త్ రూ.2 వేలు, సీటుకు రూ.1,500, పిల్లలకు బెర్త్ రూ.1,600, సీట్ రూ.1,230 టికెట్ ఉంటుందని, ఈ ప్రాంతవాసులు వినియోగించుకోవాలని కోరారు. ఆలయ ప్రాంగణం నుంచి తిప్పాపూర్ బస్టాండ్ వరకు బస్సులో ప్రయాణించి ముంబయి వెళ్లే ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం రుద్రంగి(వేములవాడ): ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ నుంచి ముంబయికి మంగళవారం ప్రారంభమైన ఏసీ బస్సుకు రుద్రంగిలో విప్, స్థానిక నాయకులు స్వాగతం పలికి పూజలు చేశారు. ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తూము జలపతి తదితరులు ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ -
వస్త్ర పరిశ్రమను ప్రక్షాళన చేయాలి
సిరిసిల్లకల్చరల్: గత ప్రభుత్వ హయాంలో వస్త్ర పరిశ్రమకు వివిధ కారణాలతో విద్యుత్ సబ్సిడీ నిలిపేశారని కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి అన్నారు. పరిశ్రమలో సంక్షోభాన్ని నివారించాలని, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిరిసిల వస్త్ర, వ్యాపార ప్రముఖులు హైదరాబాద్లో కేకే క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ, పరిశ్రమ సంక్షోభాన్ని నివారించేందుకు వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన 50 శాతం విద్యుత్సబ్సిడీని గత బీఆర్ఎస్ తొలగించే ప్రయత్నం చేసిందన్నారు. అప్పటికే సెస్కు బకాయిపడిన రూ.32 కోట్లను ఇవ్వలేదన్నారు. పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్సమస్యను త్వరలోనే పరిష్కరిస్తుందన్నారు. పరిశ్రమ బాగుపడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.300 కోట్లు చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి, చేనేత సెల్ అధ్యక్షుడు బండారి అశోక్, బూట్ల నవీన్, వెల్దండి దేవదాస్, గుండ్లపెల్లి గౌతమ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నిధులు మంజూరు చేయాలని వినతి
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని కొత్తపల్లి శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి సంబంధించి ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కమిటీ సభ్యులు మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. అలాగే కొత్తపల్లి నుంచి అయోధ్యకు వెళ్లిన కరసేవకుడు పాతూరి బాల్రెడ్డిని సత్కరించారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, నాయకులు పెద్దూరి పర్షాగౌడ్, బీనవేని శ్రావణ్యాదవ్, నవీన్ యాదవ్, మన్మోహన్రెడ్డి, అఖిలేశ్యాదవ్, పవన్గౌడ్, మహేశ్గౌడ్, కమిటీ సభ్యులు ●తదితరులు పాల్గొన్నారు. 23న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలుసిరిసిల్లకల్చరల్/సిరిసిల్లటౌన్: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఎంపిక పోటీలు ఈ నెల 23న నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బ్రాడ్ జంప్, టెన్నిస్ బాల్ త్రో, లాంగ్ జంప్, జావెలిన్ త్రో స్టాండింగ్ షాట్పుట్ అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ప్రతిభ చూపిన బాలబాలికలను జూన్ 1న సికింద్రాబాద్ జింఖానా మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. ఆసక్తి గల వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు 12 ఏళ్ల లోపు పిల్లలను పోటీలకు పంపించాలని కోరారు. వైద్య శిబిరం సందర్శనవీర్నపల్లి(సిరిసిల్ల): కలెక్టర్ ఆదేశాలతో వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని డీఎంహెచ్వో డాక్టర్ రజిత పేర్కొన్నారు. మంగళవారం శిబిరాన్ని సందర్శించారు. గ్రామంలో సర్వే వివరాలు, జ్వర బాధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. గ్రామంలో జ్వరాలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. అనంతరం వీర్నపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రిజిస్టర్, మందుల నిల్వలను పరిశీలించారు. అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డీఎంహెచ్వో వెంట ఎల్లారెడ్డిపేట సీహెచ్సీ డాక్టర్ సరియా అంజూమ్ తదితరులు ఉన్నారు. రాజన్నపేట ఇళ్ల విచారణ వాయిదాబోయినపల్లి(చొప్పదండి): పరిహారం చెల్లింపులపై మంగళవారం వరదవెల్లి గ్రామపంచాయతీలో చేపట్టిన విచారణ వాయిదా పడినట్లు డీఎల్పీవో నరేశ్ తెలిపారు. మిడ్మానేరులో ముంపునకు గురైన వరదవెల్లి అనుబంధ రాజన్నపేటలో 9 ఇళ్లకు పరిహారం రావాలని కొందరు దరఖాస్తు చేసుకోగా, సుమారు రూ.1.80 కోట్లు పరిహారం పంపిణీకి అధికారులు చెక్కులు సిద్ధం చేశారు. కాగా గతంలో తీసుకున్న ఇళ్లకే బై నంబర్లు వేసి పరిహారం తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదులు వెళ్లడంతో చెక్కుల పంపిణీ ఆగింది. ఈక్రమంలో కలెక్టర్ ఆదేశాలతో డీఎల్పీవో, సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్కుమార్ విచారణకు వచ్చారు. గతంలో పని చేసిన పంచాయతీ కార్యదర్శులు శేఖర్, భాగ్యలక్ష్మి, గంగాతిలక్, రాజశేఖర్, ప్రస్తుత ఎంపీవో శ్రీధర్, కార్యదర్శి శ్రీహిత తదితరులు హాజరయ్యారు. ఫిర్యాదుదారులు రాకపోవడంతో మరోసారి విచారణ చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా విచారణలో అధికారులు పలు రికార్డులు పరిశీలించినట్లు తెలిపారు. కొన్ని ముఖ్యమైన రికార్డులు లేవని తెలిసింది. -
రెక్కలు?
భూముల ధరలకుసాక్షిప్రతినిధి,కరీంనగర్: భూముల మార్కెట్ విలువ పెంపునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూముల ధరలు ఎంత మేరకు పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖను ఆదేశించింది. అన్ని జిల్లాల రిజిస్ట్రార్లకు ఆదేశాలు పంపింది. ప్రస్తుతం ఉన్న భూముల వివరాలు, మార్కెట్ విలువ? దాన్ని ఎంత మేరకు పెంచవచ్చో అధ్యయనం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పలువురుశాఖల అధికారులతో కూడిన కమిటీలను కూడా సిద్ధం చేసింది. వీరు భూముల విలువపై అంచనాకు వచ్చి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నివేదికలోని సూచనలు అమలైతే దాదాపు 50 నుంచి 100 శాతం వరకు మార్కెట్ ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు, భూముల ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. కమిటీలు ఇలా.. భూముల పెంపులో ప్రభుత్వం అర్బన్, రూరల్ రెండు ప్రాంతాలుగా విభజించింది. పట్టణ ప్రాంతాల్లో అయితే.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు అందులో ఇటీవల విలీనమైన గ్రామాలకు కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో అడిషనల్ కలెక్టర్ (లోకల్బాడీస్) చైర్మన్గా ఉంటారు. సభ్యులుగా మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్చైర్మన్, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. కన్వీనర్గా సబ్రిజిస్ట్రార్ వ్యవహరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చైర్మన్గా ఆర్డీవో వ్యవహరిస్తారు. సభ్యులుగా తహసీల్దార్, ఎంపీడీవో ఉంటారు. కన్వీనర్ బాధ్యతలను సబ్రిజిస్ట్రార్ నిర్వహిస్తారు. భవన నిర్మాణాల ధరల నిర్ధారణకు జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ చైర్మన్గా ఉండగా.. ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ సభ్యుడిగా ఉంటారు. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలన్నీ వ్యవసాయ, రియల్ ఎస్టేట్, భూములతోపాటు అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, బహుళ అంతస్తుల భవనాల మార్కెట్ విలువను నిర్ధారిస్తారు. మే నెలాఖరుకు నివేదిక ప్రభుత్వ ఆదేశాల మేరకు రూపుదిద్దుకున్న కమిటీలు వారి పరిధిలో ఉన్న భూముల మార్కెట్ విలువపై సర్వే ప్రారంభించాయి. దాదాపుగా ఈ సర్వే కూడా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 28న నివేదికను ప్రభుత్వానికి అంజేయనున్నారు. ఈ నివేదిక ప్రకారం.. 50 నుంచి 100శాతం వరకు మార్కెట్ విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా మొత్తం శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా), సిరిసిల్ల జిల్లా మొత్తం వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ)లుగా అవతరించడంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు ముఖ్యంగా రెక్కలు రానున్నాయి.ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు, ఆదాయ వివరాలు (రూ.కోట్లలో)ఏడాది డాక్యుమెంట్లు ఆదాయం 2024 88,762 231.98 2025 32,383 86.25 మరోసారి మార్కెట్ విలువ పెంపు 50 నుంచి 100శాతం పెంచేలా కసరత్తు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వ ఆదేశం మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో అధ్యయనానికి కమిటీలు నివేదికకు మే నెలాఖరు సమయం భూ విలువలపై అధ్యయనం ప్రారంభించిన అధికారులు -
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు
● విప్ ఆది శ్రీనివాస్ చందుర్తి(వేములవాడ): నిరుపేదల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇళ్లు ప్రతీక అని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం కలెక్టర్ సందీప్కుమార్ఝాతో కలిసి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి మాట తప్పారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తుందని చెప్పడానికి చందుర్తి మండలంలోని 19 గ్రామాలకు 520 ఇళ్లు మంజూరు చేశామని, పైలట్ ప్రాజెక్టు గ్రామం కొత్తపేటలో 17 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, లబ్ధిదారులు నాలుగునెలల లోపు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని కోరారు. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, విండో అధ్యక్షుడు తిప్పని శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి రవీందర్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా మండలంలోని రామన్నపేటలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపించారు. వేములవాడ పట్టణంలో బిల్డింగ్ ఉన్న వ్యక్తిని లబ్ధిదారుగా ఎంపిక చేశారని, ఇప్పటికై నా అనర్హులను గుర్తించి, అర్హులకు అండగా నిలవాలని కోరారు. ఈదురుగాలుల వర్షం.. విరిగిన స్తంభంగంభీరావుపేట(సిరిసిల్ల): మండలకేంద్రంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మండలకేంద్రంలో ఎమ్మార్సీ ఏరి యాలో ఓ విద్యుత్ స్తంభం విరిగి ఇంటిపై పడింది. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. -
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి
● రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి సిరిసిల్ల: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం వ్యవసాయ అధికారులు, విత్తన డీలర్లు, డీఆర్డీఏ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వానాకాలం సీజన్ కోసం విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 97,200 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను అన్ని జిల్లాలకు అందిస్తున్నామని, వీటిని రైతులకు చేరవేయాలన్నారు. నాణ్యమైన వరి విత్తనాలు 1.20 లక్షల క్వింటాళ్లు, కంది 150 క్వింటాళ్లు, పెసర 200 క్వింటాళ్లు, మినుము 400 క్వింటాళ్లు, వేరుశనగ 1,775 క్వింటాళ్లు విత్తనాభివృద్ధి సంస్థ అందిస్తుందని వివరించారు. కొంతమంది రైతులు నాణ్యత లేని ప్రైవేట్ విత్తనాల పట్ల ఆకర్షితులై నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీలర్ల వద్ద విత్తనాలు, ఎరువులు కొనేటప్పుడు రసీదు పొంది పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం మాట్లాడుతూ, నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను కోరారు. జిల్లాలో 18 ఐకేపీల ద్వారా విత్తన లైసెన్సులు జారీ చేయించి 50 శాతం సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల అమ్మకాలు జరిపిస్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతీయ మేనేజర్ విష్ణువర్ధన్రెడ్డి, విత్తన అధికారి మౌనిక, ఏపీడీ గొట్టె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల భవిష్యత్కు పునాదులు వేయాలి
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా సిరిసిల్ల: ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థుల భవిష్యత్కు పునాదులు వేయాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. జిల్లా కేంద్రంలోని గీతానగర్ స్కూల్లో ఉపాధ్యాయులకు ఐదు రోజుల వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గణితం, ఏఐ టూల్స్లో పిల్లలు వెనుకపడకుండా వినూత్న పద్ధతుల్లో వారికి అర్థమయ్యేలా బోధన సాగించాలన్నారు. విద్యార్థులు రెగ్యులర్గా పాఠశాలకు హాజరయ్యేలా ఫాలో అప్ చేయాలని పేర్కొన్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలున్నా, ఇంటర్లో ఫెయిల్ అవుతున్నారని, విషయ పరిజ్ఞానంలో ముందస్తు నుంచి విద్యార్థులను బలోపేతం చేస్తే వైఫల్యాలను నిరోధించవచ్చని తెలిపారు. విద్యాశాఖలో ఒకే రోజు మార్పు సాధ్యం కాదని, నిర్వీరామంగా ప్రయత్నం చేస్తూ ఉండాలన్నారు. మంచి విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతల్లో ఉన్న ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. డీఈవో జనార్దన్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఐఐహెచ్టీ కోర్సుతో నమ్మకమైన ఉపాధి
● టెస్కో జీఎం అశోక్రావు సిరిసిల్ల: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) మూడేళ్ల కోర్సును విజయవంతంగా పూర్తి చేస్తే నమ్మకమైన ఉపాధి లభిస్తుందని టెస్కో జనరల్ మేనేజర్ వి.అశోక్రావు అన్నారు. సిరిసిల్ల నేత బజారులో మంగళవారం ఐఐహెచ్టీ కోర్సులపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక్క వెంకటగిరిలో ఈ కోర్సు చదువు ఉండేదని, తెలంగాణలో గతేడాది కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో ఐఐహెచ్టీ కోర్సును ప్రవేశ పెట్టి 60 సీట్లను కేటాయించారన్నారు. ఇందులో చేరిన అభ్యర్థులు చిత్తశుద్ధితో కోర్సు పూర్తి చేసి నైపుణ్యం పెంచుకుంటే చేనేత, జౌళిశాఖ ఉద్యోగాల్లో చేరవచ్చని, ప్రైవేటుగా స్పిన్నింగ్, గార్మెంట్, టెక్స్టైల్ పరిశ్రమల్లో మంచి వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. ఫీజుల భారం లేకుండా పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం ఈ కోర్సుల్లో అవకాశం కల్పిస్తుందన్నారు. సిరిసిల్ల ప్రాంతంలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఐఐహెచ్టీలో చేరాలన్నారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందేహాలను నివృతి చేశారు. సమావేశంలో జౌళిశాఖ డీడీ విద్యాసాగర్, ఏడీ విజయ్, డీవో రవీందర్రెడ్డి, సంతోష్, కార్మిక నాయకులు మూషం రమేశ్, కోడం రమణ తదితరులు పాల్గొన్నారు. -
వారసత్వ పనిని ఇప్పించాలి
మాది తిప్పాపురం. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో 60 ఏళ్లుగా మా వంశానికి చెందిన వారు 8 పాళ్లుగా పట్నాలు వేస్తున్నాం. అయితే మూడేళ్లుగా మా కులస్తులు ఎనిమిది పాళ్లు కాదని కొడుకులున్నోళ్లు మొత్తంగా 26 పాళ్లు చేశారు. నా కొడు కు అనారోగ్యంతో ఉంటున్నాడు. నాకు పాలు క ల్పించాలని కోరితే వారు ఒప్పుకోవడం లేదు. ఈ విషయమై వేములవాడ ఆలయ ఈవో సైతం వారికి చెప్పారు. అయినా వినడం లేదు. – పి.అంజలి, వేములవాడ ఉపాధి కల్పించాలి మాది రగుడు గ్రామం. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన దివ్యాంగుడిని. మా నాన్న చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. అమ్మే నన్ను ఐటీఐ వరకు చదివించింది. ప్రస్తుతం లైసెన్స్డ్ సర్వేయర్కు దరఖాస్తు తీసుకున్నారు. నాకు లైసెన్స్డ్ సర్వేయర్గా ఉద్యోగం కల్పించి ఆదుకోవాలి. – బూర మధు, రగుడు చెరువుకట్టలు పునర్ నిర్మించాలి గ్రామ శివారులోని పెద్దచెరువు, కొత్తచెరువులో పూడిక తీయాలి. పూడిక తీయగా చెరువు లోతు పెరుగుతుంది. పూడిక తీయకపోవడంతో చిన్నవర్షాలకే నిండి మత్తడి దూకుతున్నాయి. వెంటనే వాటిలో పూడిక తీసి కట్టలను పునర్ నిర్మించాలి. ఫలితంగా చెరువులోంచి నీరు వృథాపోకుండా అరికట్టవచ్చు. – రవీందర్, చిన్నబోనాల -
అక్రమంగా పట్టా చేసుకుండ్రు
ఊరిలో మా మామ పేరిట 9 ఎకరాల స్థలం ఉంది. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. వారిలో చిన్నకూతురు మినహా ఎవరూ బతికిలేరు. వారసత్వంగా మాకు సంక్రమించాల్సిన భూమిని కొందరు నా ప్రమేయం లేకుండానే వారి పేరిట పట్టా చేయించుకున్నారు. నా పోషణ గురించి పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయాలి. – జూలూరి మల్లవ్వ, సముద్రలింగాపూర్ ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి జిల్లాలోని చాలా ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు పాటించడం లేదు. వైద్యుల అర్హతల వివరాలు ప్రదర్శించడం లేదు. ధనార్జనే ధ్యేయంగా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. డబ్బుల కోసం రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – అంగూరి రంజిత్, సిరిసిల్ల నా స్థలాన్ని కబ్జా కానీయొద్దు మాకు జిల్లాకేంద్రం విద్యానగర్ బైపాస్ రోడ్డులో సర్వేనంబర్ 517లో స్థలం ఉంది. నేను ఉపాధి నిమిత్తం మా స్థలంలో హోటల్ పెట్టుకోవాలని చూస్తుంటే ఓ బీఆర్ఎస్ నాయకుడు బెదిరిస్తున్నాడు. అదే సర్వేనంబర్లో వారికి ఉన్న భూమి బైపాస్రోడ్డులో పోయింది. అప్పుడు పరిహారం కూడా పొందారు. ఇప్పుడు నిరుపేద అయిన నా స్థలాన్ని కాజేయాలని చూస్తుండ్రు. కలెక్టర్ న్యాయం చేయాలి. – షేక్ జలీల్, విద్యానగర్ -
లే అవుట్ స్థలం మాయం చేశారు
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని లే అవుట్ స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో పెద్దల అనుయాయులు మాయం చేశారు. సర్వేనంబరు 525, 530/సీలో ఫైల్ నంబరు 1828/80లో 121 గజాల స్థలం ప్లాట్ నంబరు 13ను మున్సిపల్కు చెందిందిగా పేర్కొన్నారు. దాని విలువ రూ.40లక్షలు ఉంటుంది. కబ్జాకు గురైన మున్సిపల్ లే అవుట్ స్థలాన్ని గుర్తించి మున్సిపల్కు అప్పగించేలా చర్యలు తీసుకోవాలి. – నాగుల శ్రీనివాస్, సిరిసిల్ల ధాన్యం తరుగు అరికట్టాలి మా గ్రామంలో ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తున్నారు. ఎందుకు తీయాల్సి వస్తుందో కూడా వివరణ ఇవ్వడం లేదు. నాతోపాటు గ్రామానికి చెందిన రైతులు ఓన్సులాల్, సజన్లాల్కు చెందిన 710 బస్తాలను లారీలో మిల్లుకు తరలించగా వాటిలోంచి 21 బస్తాలు తరుగు తీసినట్లు చెబుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో తరుగుపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – భూక్య గజన్లాల్, వీర్నపల్లి -
రాజన్నపేట ఇళ్ల పరిహారంపై నేడు విచారణ
● బై నంబర్లతో రూ.1.80 కోట్లు చెల్లింపులపై ఫిర్యాదులుబోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరులో ముంపునకు గురైన బోయినపల్లి మండలం వరదవెల్లి అనుబంధ గ్రామం రాజన్నపేటలోని 9 ఇళ్ల పరిహారం చెల్లింపులపై కలెక్టర్ సందీప్కుమార్ ఝా విచారణకు ఆదేశించారు. ఈమేరకు డీఎల్పీవో నరేశ్ మంగళవారం వరదవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టనున్నారు. పరిహారం పొందిన 9 పాత ఇళ్ల ఇంటి నంబర్లకు బై నంబర్లతో దాదాపు రూ.1.80 కోట్ల మేర పరిహారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. పరిహారం చెల్లింపులు నిలిచిపోయాయి. ఫిర్యాదులతో నిలిచిన చెల్లింపులు వరదవెల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో సుమారు 482 వరకు ఇంటి నంబర్లు ఉన్నాయి. 2006 నుంచి ఇళ్లు, భూముల ముంపు గుర్తింపు జరిగింది. 2014లో ఎంఎంఆర్ నంబర్లు వేసి నోటీసులు ఇచ్చారు. మళ్లీ నిర్మాణాలు చేస్తే పరిహారం వర్తించదని స్పష్టం చేశారు. కాగా తప్పిపోయిన ఇళ్లకు పరిహారం ఇవ్వాలని 2021లో గత ప్రభుత్వం జీవో ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో 9 ఇళ్లకు సంబంధించిన వారు పరిహారం కావాలని జిల్లా అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈక్రమంలో కలెక్టరేట్ నుంచి ఎస్డీసీ అకౌంట్లోకి డబ్బులు జమ చేశారు. రూ.1.80 కోట్ల మేర పరిహారం చెల్లించేందుకు అధికారులు చెక్కులు సిద్ధం చేశారు. పరిహారం పొందిన ఇళ్లకు బై నంబర్లతో మళ్లీ పరిహారం పొందుతున్నారని ఫిర్యాదులు వెళ్లడంతో చెల్లింపులు నిలిచిపోయాయి. మంగళవారం నాటి విచారణకు గ్రామంలో 2015 నుంచి 2019 వకు వరదవెల్లి గ్రామపంచాయతీ కార్యర్శులుగా పనిచేసిన వారు హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. విచారణ నేపథ్యంలో కొందరి అధికారుల్లో భయం నెలకొన్నట్లు సమాచారం. -
ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లాలి
● డెంగీ ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి ● ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు ● మహిళా సంఘాలకు ఎరువులు, విత్తనాల దుకాణాలు ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లాలో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికెళ్లాలని, డెంగీ ప్రబలకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే వానాకాలంలో డెంగీ రాకుండా ముందుజాగ్రత్త చర్యలకు సన్నద్ధం కావాలన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, నియంత్రణకు చ ర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ మంగ ళ, శుక్రవారాలలో డ్రైడే నిర్వహించాలన్నారు. డీఎంహెచ్వో రజిత, మున్సిపల్ కమిషనర్లు అన్వేశ్, వాణి పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు జిల్లాలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఈనెల 22 నుంచి 29 ఇంటర్ పరీక్షలు, జూన్ 3 నుంచి 12 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 13 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్డీవోలు రాధాబాయి, వెంకటేశ్వరావు, జిల్లా ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాలకు ఎరువుల దుకాణం జిల్లాలోని ఐదు మహిళా సంఘాలకు ఎరువుల దుకాణాలకు ఈ–పాస్ మిషన్లను కలెక్టర్ పంపిణీ చేశారు. మహాలక్ష్మీ గ్రామైక్య సంఘం ఫెర్టిలైజర్స్ అండ్ విత్తనాలు(పెద్దూర్), శ్రీధనలక్ష్మీ మండల సమాఖ్య ఫెర్టిలైజర్స్ అండ్ విత్తనాలు వేములవాడ, శివరామ్ గ్రామైక్య సంఘం ఫెర్టిలైజర్స్ అండ్ విత్తనాలు వేములవాడ మండలం బొల్లారం, విలాసాగర్ గ్రామైక్య సంఘం ఫెర్టిలైజర్స్ అండ్ విత్తనాలు బోయినపల్లి, వెన్నెల గ్రామ సమాఖ్య సంఘం రుద్రంగి వారికి ఈ–పాస్ యంత్రాలు అందజేశారు. జెడ్పీ సీఈవో వినోద్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్లక్రైం: ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారమే లక్ష్యంగా ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 33 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్స్టేషన్ల అధికారులకు ఫోన్చేసి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. నేడు వేములవాడ–ముంబయి ఏసీ బస్సు ప్రారంభం వేములవాడ: వేములవాడ నుంచి ముంబయికి వెళ్లేందుకు ఏసీ స్లీపర్ కోచ్ బస్సును రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం తెలిపారు. వేములవాడ నుంచి కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్, పుణె మీదుగా ముంబయి చేరుకుంటుందని తెలిపారు. సిట్టింగ్ రూ.1,500, స్లీపర్ రూ.2వేలు చార్జీలు ఉన్నట్లు చెప్పారు. అనంతరం స్థానిక మహాలింగేశ్వర ఫంక్షన్హాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ను బలోపేతం చేయడమే లక్ష్యం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గ్రామ, మండల శాఖ నూతన కార్యవర్గాలను ఎన్నుకుంటున్నట్లు పీసీసీ పరిశీలకులు ఫక్రుద్దీన్, చైతన్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తిస్తామన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ సాబేరా బేగం, వైస్చైర్మన్ గుండాడి రాంరెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సాహెబ్ పాల్గొన్నారు. నేడు ఐఐహెచ్టీ కోర్సుపై అవగాహన సదస్సు సిరిసిల్ల: కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్టీ) కోర్సుపై అవగాహన కల్పించేందుకు మంగళవారం సిరిసిల్లలో సదస్సు నిర్వహిస్తున్నామని చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు రాఘవరావు తెలిపారు. 2025–2026 విద్యాసంవత్సరంలో 60 సీట్లు చేనేత, టెక్స్టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ఉన్నట్లు వివరించారు. ఆ కోర్సు ప్రాధాన్యతను వివరించేందుకు బీవై నగర్లోని పాత ఏడీ ఆఫీస్లో మంగళవారం ఉదయం 11 గంటలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భగవద్గీత పఠనంలో గోల్డ్మెడల్స్ముస్తాబాద్(సిరిసిల్ల): భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు గోల్డ్మెడల్స్ సాధించారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్కు చెందిన కటకం లక్ష్మి, కటకం విజయలక్ష్మి మైసూర్లో జరిగిన భగవద్గీత శ్లోకాల పోటీల్లో సత్తా చాటారు. 700 శ్లోకాలను అలవోకగా ఆలపించిన అక్కాచెల్లెళ్లకు గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా బంగారు పతకాలను అందించారు. కంచర్ల పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్వీర్నపల్లి(సిరిసిల్ల): విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంచర్ల పంచాయతీ కార్యదర్శి ముక్తార్ అహ్మద్ను కలెక్టర్ సందీప్కుమార్ ఝా సోమవారం సస్పెండ్ చేశారు. గ్రామంలో డెంగీ కేసులు నమోదైనప్పటికీ పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. సోమవారం గ్రామంలో పర్యటించిన కలెక్టర్.. పంచాయతీ కార్యదర్శి లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో సస్పెండ్ చేశారు. -
రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాబు జగ్జీవన్రామ్ వ్యవసాయ కళాశాల జిల్లెల్ల ఆధ్వర్యంలో చీర్లవంచలో సోమవారం రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు పంటలకు సిఫారసు చేసిన మోతాదులోనే యూరియాను వినియోగించాలన్నారు. పచ్చిరొట్ట ఎరువులు, వర్మీకంపోస్టు, పేడ ఎరువులను వినియోగించాలన్నారు. చీడపీడల ఉధృతిని బట్టి సరైన మోతాదులో రసాయనిక మందుల వాడడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బాబు జగ్జీవన్రామ్ వ్యవసాయ కళాశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు డా.రజియా సుల్తానా, కె.భవ్యశ్రీ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మండల వ్యవసాయ అధికారి కె.సంజీవ్, ఏఈవో కరుణాకర్, మౌనిక, విత్తన అధికారి మౌనిక, విద్యార్థులు మణికంఠ, శాలిని, రైతులు పాల్గొన్నారు. -
విన్నపాలు వినవలే..
● ప్రజావాణిలో వెల్లువెత్తిన వినతులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● వివిధ సమస్యలపై 120 విన్నపాలుసిరిసిల్లటౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పలువురు బాధితులు కలెక్టరేట్ బాట పడుతున్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీ సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా వినతిపత్రాలు స్వీకరించి పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ 54, మున్సిపల్ 11, డీఆర్డీవో 7, ఉపాఽధికల్పన 6, హౌసింగ్ 5, ఎస్డీసీ 4, డీడబ్ల్యూవో 3, ఎస్సీ కార్పొరేషన్, ఏడీఎస్ అండ్ ఆర్డీఎస్వో, హ్యాండ్లూమ్, టెక్స్టైల్, డీఎంహెచ్వోకు రెండు చొప్పున మొత్తంగా 120 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, వేములవాడ ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయి, జెడ్పీ సీఈవో వినోద్కుమార్, వ్యవసాయాధికారి అఫ్జల్బేగం తదితరులు పాల్గొన్నారు. -
జ్వరం..ఒళ్లునొప్పులు
సిరిసిల్లటౌన్: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పల్లె..పట్నం తేడా లేకుండా జనాలు మంచం పడుతున్నారు. మండుటెండలు ఒక వైపు.. కురుస్తున్న వర్షాలు మరో వైపుతో వాతావరణంలో తీవ్రమార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా దోమలు పెరిగి జ్వరాలు వస్తున్నాయి. నీరు, ఆహారం కలుషితమై విరోచనాలు, మలేరియా, డెంగీ వ్యాధులు వస్తున్నాయి. జ్వర బాధితులతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. జిల్లా ఆస్పత్రికే నిత్యం 700 వరకు రోగులు ఓపీ సేవలు పొందుతున్నారు. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో డెంగీ కేసులు బయటపడుతుండడం జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. లక్షణాలు..చికిత్స సాధారణం నుంచి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు, వాంతులు, విరోచనాలు, కండ్లు లాగడం వంటి లక్షణాలతో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. మూత్రంలో రక్తం రావడం, నాలుక నల్లబారడం, జ్వరం తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వెంటనే ఆస్పత్రిలో వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఎన్ఎస్ఐ ఏజీ టెస్టు పాజిటివ్ వస్తే డెంగీ మొదటి దశలో ఉందని అర్థం. ఈ దశలో రెండు, మూడు రోజులు ఉంటుంది. ఐజీహెచ్ టెస్టు పాజిటివ్ వస్తే మోడరేట్ టు సివియర్గా పరిగణించి చికిత్స అందిస్తారు. ఈసమయంలో జాగ్రత్తలు తీసుకో వాల్సి ఉంటుంది. అన్ని రకాల జ్వరాలకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందుబాటులో ఉంది. ప్రైవేటుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జ్వరాల తీవ్రత పెరిగితే జిల్లా ఆస్పత్రిలో కార్పొరేట్ వైద్యానికి దీటుగా మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు సిబ్బంది వైద్యసేవలు అందిస్తున్నారు. జిల్లాలో జ్వరాల తీవ్రత దృష్ట్యా కలెక్టర్ సందీప్కుమార్ ఝా వైద్యశాఖను అప్రమత్తం చేశారు. వణికిస్తున్న వైరల్, డెంగీ కేసులు జిల్లా ఆస్పత్రికి పోటెత్తుతున్న రోగులు నిత్యం 700 మందికి పైగా ఔట్పేషంట్లు ప్లేట్లెట్స్ తగ్గడంతో జనాలు బెంబేలు ఈమె వీర్నపల్లి మండలం కంచర్లకు చెందిన దండుగుల లక్ష్మి. నాలుగు రోజుల క్రితం చాతి, తలనొప్పి తో పాటు పక్కబొక్కలు నొప్పిలేశాయి. విపరీతమైన జ్వరం వచ్చింది. ఊరిలోకి వైద్యశాఖ నుంచి వచ్చినోళ్లు గోలీలు ఇచ్చినా తగ్గలేదు. ఇంట్లో వాళ్లు వెంటనే సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు చేశారు. ర్యాపిడ్ టెస్టులో డెంగీ పాజిటివ్ వచ్చింది. ఇన్పేషెంటుగా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. డెంగీ నుంచి కోలుకుంటున్న ఎనిమిది రోజుల క్రితం తలనొప్పి, కండ్లు గుంజుడం.. నడుం నొప్పి వచ్చింది. జ్వరం ఎక్కువైంది. జిల్లా ఆస్పత్రికి వచ్చినం. ఇక్కడ ఎలీసా టెస్టు చేస్తే పాజిటివ్ రావడంతో వైద్యం అందించారు.ఎలాంటి ఖర్చు లేకుండానే డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న. – మిర్యాల మంజుల, కంచర్ల మెరుగైన చికిత్స అందిస్తున్నాం ఇటీవల రెండు డెంగీ పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇతర విషజ్వరాలతో కూడా రోగులు వస్తున్నారు. ఆస్పత్రిలో అన్ని రకాల మందులు ఉన్నాయి. ఫ్లూయిడ్స్, ఇంజక్షన్లు, ఓఆర్ఎస్లు, యాంటిబయాటిక్స్ ఉన్నాయి. వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఐసీయూలో పది పడకలు కేటాయించాం. జిల్లా ఆస్పత్రిలో అన్ని విభాగాల వైద్యులతో చికిత్స అందిస్తున్నాం. ప్రైవేటు కన్నా మెరుగ్గా వైద్యం అందిస్తున్నాం. – డాక్టర్ లక్ష్మీనారాయణ, సూపరింటెండెంట్ జిల్లా ఆస్పత్రి, సిరిసిల్ల ఈమె వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన శశికళ. ఈనెల 16న తీవ్ర జ్వరం, వాంతులు, ఒళ్లు నొప్పులతో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి వచ్చింది. ర్యాపిడ్ టెస్టు చేయగా డెంగీ పాజిటివ్గా తేలింది. వైద్యులు వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించారు. ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోకుండా 24 గంటలు సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. -
5 బస్తాలు కోత విధించారు
నేను 8 ఎకరాల్లో వరి సాగు చేసిన. దాదాపు 326 బస్తాల ధాన్యం వచ్చింది. తూకం వేసి రైస్మిల్లుకు పంపిన తర్వాత 5 బస్తాలను కట్ చేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే వెయిట్ లాస్ వచ్చిందని కట్ చేశారని బదులిచ్చారు. నాకు రూ.5వేలు నష్టం వచ్చింది. – మర్రి శంకర్, చందుర్తి వెయిట్ లాస్ వస్తోందని.. తూకం వేసిన తర్వాత రెండు రోజులు లారీలు ఆలస్యంగా వస్తే మిల్లర్లు తూకంలో వెయిట్ లాస్ వస్తోందని కోతలు విధిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. రైతులు మాత్రం మేమే ధాన్యం కట్ చేస్తున్నామని దూషిస్తున్నారు. కేంద్రాల నిర్వాహకులకు ధాన్యం కటింగ్కు సంబంధం లేదని చెప్పినా వినిపించుకోవడం లేదు. – రజిత, ఐకేపీ ఏపీఎం, చందుర్తి ● -
కొత్త చట్టాల ప్రకారమే కేసులు
సిరిసిల్లకల్చరల్: నూతన చట్టాల ప్రకారమే కేసులు నమోదు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శనివారం ద్వైమాిషిక పర్యవేక్షణ సమీక్ష నిర్వహించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, మానిటరింగ్, మెంటరింగ్ కమిటీ సభ్యులు, ప్యా నెల్ న్యాయవాదులతో సమావేశమయ్యారు. కొత్త చట్టాలతో నవీకరించే ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అగ్రి లీగల్, ఎయిడ్, పారలీగల్ వలంటీర్లు, లా విద్యార్థుల పనితీ రును ప్రశంసించారు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్, మానిటరింగ్ సభ్యుడు జి.అంజయ్య, లోక్అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, జి.అంజనేయులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● ముందు జాగ్రత్తలు మేలు ● మంగళ, శుక్రవారాల్లో డ్రైడే నిర్వహించాలి ● కలెక్టర్ సందీప్కుమార్ ఝాసిరిసిల్ల: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శనివారం అధికారులతో సమీక్షించారు. రా నున్న వానాకాలంలో ప్రతీ గ్రామంలో, ప్రతీ ము న్సిపల్ వార్డుల్లోనూ నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, నీటి నిల్వను తొలగించాలన్నారు. ప్రతీ మంగళ, శుక్రవారం డ్రై డే నిర్వహించాలని సూచించారు. డ్రెయినేజీల్లో ఆయిల్బాల్స్ వేయించాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై శ్రద్ధ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అధికంగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత, దోమల నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన చర్యలపై గ్రామసభలు పెట్టి అవగాహన కల్పించాలన్నారు. అన్ని పీహెచ్సీలలో డెంగీ రాపిడ్ టెస్ట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లాలో కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలను తొలగించాలని ఆదేశించారు. డీఎంహెచ్వో ఎస్.రజిత, డీపీవో షరీఫొద్దీన్, ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలు, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
నిండా ముంచుతున్నారు !
● ఇప్పటికే 530కి పైగా బస్తాల కోత ● రూ.5లక్షలకు పైగా రైతుల సొమ్ము స్వాహా ● ఒక్కో రైతు నుంచి 2 నుంచి 10 బస్తాల వరకు కటింగ్ ● అధికారులే న్యాయం చేయాలంటున్న రైతులుచందుర్తి(వేములవాడ): రైతులను ప్రకృతి ప్రకోపాలు నిండా ముంచడం చూశాం. కానీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు తెలియకుండానే ని లువు దోపిడీ చేస్తున్నారు. అధికారులు, పాలకులు ఒక్కటై అన్నదాతలను ఆగం చేస్తున్నారు. చందుర్తి మండల పరిధిలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం నుంచి దాదాపు 530కి పైగానే బస్తాలను కోత పెట్టారు. ఎవరికీ చెప్పుకోవాలో తెలియక అన్నదాతలు లోలోపల కుమిలిపోతున్నారు. రైతులను నిండా ముంచుతున్న వైనంపై ‘సాక్షి’ ఫోకస్. 20 కేంద్రాలు.. రూ.4.95 లక్షలు స్వాహా చందుర్తి మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో 13, సనుగుల సింగిల్విండో ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలోని 13 కేంద్రాల్లో ఇప్పటి వరకు 1.20 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం 314 బస్తాలు కోత పెట్టారు. ఐదు రోజుల లెక్కలు అందుబాటులో లేవు. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మరో 70 బస్తాల వరకు కోత విధించి ఉంటారన్న అంచనా. సనుగుల సింగిల్విండో పరిధిలో 56 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా.. రైతుల నుంచి 225 బస్తాల వరకు కటింగ్ చేశారు. ఐకేపీ, సింగిల్విండోల ద్వారా మొత్తానికి 539 బస్తాలు కోత విధించగా.. వీటి విలువ దాదాపు రూ.4.95 లక్షల వరకు ఉంటుంది. రైతుల ఖాతాల్లో జమకావాల్సిన సొమ్మును రైస్మిల్లర్లు దోచుకోవడంపై అన్నదాతల నుంచి విమర్శలు వె ల్లువెత్తుతున్నాయి. కొనుగోలు కేంద్రాల మూసివేసే వరకు రైతులకు చెందాల్సిన సుమారు రూ.20లక్షల సొమ్ము వరకు రైస్మిల్లర్ల జేబుల్లో చేరుతాయనే ఆరోపణలు రైతులు చేస్తున్నారు. గతంలో తూకంలో బస్తాకు కిలో అదనంగా వేయడంతో ఇలా కోత విధించలేదని.. ఈసారి అదనపు కిలో తూకం లేకపోవడంతో మిల్లర్లు తమ దోపిడీకి ఈ మార్గాన్ని ఎంచుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. మిల్లర్లు చెప్పిందే వేదం రైతుల ధాన్యంలో కోతలు విధిస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని అధికారుల హెచ్చరికలు తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో మిల్లర్ల దోపిడీ ఆగడం లేదు. కొనుగోలు కేంద్రాలకు గన్నీసంచులు పంపించగా.. వాటిని రైస్మిల్లర్లు దించుకోకపోవడంతో చాలా కేంద్రాల్లో కొత్త వాటిని పక్కకు పెట్టి పాత గన్నీసంచుల్లో తూకం వేస్తున్నట్లు తెలిసింది. ఇలా పాత గన్నీసంచుల్లోనే తూకం వేస్తేనే మిల్లర్లు ధాన్యాన్ని అన్లోడ్ చేసుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. పాత గన్నీ సంచుల్లోనే తూకం వేసుకోవాలన్న మిల్లర్ల ఆలోచన వెనుక వెనుక ఏం ఆంతర్యం తెలియడం లేదు. ఇతను చందుర్తికి చెందిన పోతురాజు మోహన్. 10 ఎకరాల్లో వరి సాగు చేశాడు. చందుర్తిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 904 ధాన్యం బస్తాలను విక్రయించాడు. లారీలో తరలించిన 904 బస్తాల నుంచి 10 బస్తాలను కట్ చేస్తున్నామని నిర్వాహకులు చెప్పగా.. తమ ధాన్యం బస్తాలను వాపస్ తెప్పించి ఇవ్వాలని రైతు మొండికేశాడు. ఎవరికై నా చెప్పుకోమనడంతో చేసేదేమి లేక సైలెంట్ అయ్యాడు. 10 బస్తాల కటింగ్తో 4 క్వింటాళ్ల ధాన్యం డబ్బులు రూ. 10వేల వరకు నష్టం వచ్చిందని వాపోయాడు. చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన రైతు ఏరెడ్డి శ్రీనివాస్రెడ్డి 626 బస్తాలను 20 రోజుల క్రితం తూకం వేసి అపెరల్ పార్క్కు తరలించారు. అక్కడ వేబ్రిడ్జి కాంటా వేసి అధికారులు 5 బస్తాలను కోత పెట్టారు. ఎవరికీ చెప్పుకున్నా ఎలాంటి లాభం లేకపోవడంతో ఈనెల 14వ తేదీ రాత్రి వివరాలు ఇచ్చి, ఓటీపీ చెప్పాడు. -
నేడు సిరిసిల్లకు కేటీఆర్
సిరిసిల్ల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కె.తారకరామారావు ఆదివారం సిరిసిల్ల లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు గంభీరావుపేట మండలం కోళ్లమద్దిలో మల్లికార్జునస్వామి ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కొత్తపల్లి, లింగన్నపేట, మల్లారెడ్డిపేట, జగదాంబతండా, రాచర్లగొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్లలో జరిగే శుభకార్యాలకు హాజరుకానున్నారు. హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయండి ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్ల: కరీంనగర్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఈనెల 22న నిర్వహించే హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి కోరారు. సిరిసిల్లలోని బీజేపీ ఆఫీస్లో శనివారం సన్నాహక సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ కో–కన్వీనర్ ఆడెపు రవీందర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరు భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్యాదవ్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు వైశాలి ఉన్నారు. వయోవృద్ధుల సమస్యలు పరిష్కరించాలి సిరిసిల్ల: వయోవృద్ధుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లును కోరారు. ఆర్డీవో ఆఫీస్లో శనివారం కలిసి విన్నవించారు. వయోవృద్ధులను వారి కొడుకులు పోషించకుండా.. ఆకలి బాధతో మాడ్చుతున్నారన్నారు. ఇటీవల ఆర్డీవోగా విధుల్లో చేరిన వెంకటేశ్వర్లును సీనియర్ సిటిజెన్స్ సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి జనపాల శంకరయ్య, ఉపాధ్యక్షుడు ఏనుగుల ఎల్లయ్య, రాష్ట్ర ఈసీ మెంబర్ శ్రీగాథ మైసయ్య, కోశాధికారి దొంత దేవదాసు, శ్రీకాంత్ పాల్గొన్నారు. వేములవాడ సబ్కోర్టు ఇన్చార్జి పీపీగా రాజిరెడ్డి వేములవాడ: వేములవాడ సబ్కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గౌరు రాజి రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శని వారం ఉత్తర్వులు జారీ చేశా రు. ఆమేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఏడాదిపాటు పదవిలో కొనసాగనున్నారు. కరీంనగర్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు అడిషనల్ పీపీగా విధులు నిర్వహిస్తున్న రాజిరెడ్డిని వేములవాడ ఇన్చార్జీగా నియమించారు. ఇక్కడ గురు, శుక్రవారాల్లో సేవలందిస్తారు. ఉగ్రవాదులను అంతం చేయాలివేములవాడ: మన ఆడబిడ్డల సింధూరాలను తుడిచిన ఉగ్రవాదులను అంతం చేయాలని ఫోజీ ఉమ్మడి కరీంనగర్ అధ్యక్షులు పద్మలత, జిల్లా ఐఎంఏ అధ్యక్షుడు నాగమల్ల శ్రీనివాస్ కోరారు. వేములవాడలో శనివారం తిరంగ్యాత్ర నిర్వహించారు. వైద్యులు స్రవంతి, స్వప్న, చీకోటి సంతోష్, అభినయ్, కోటగిరి మనోహర్, అనిల్కుమార్, తిరుపతి, ఆనందరెడ్డి, మహేందర్, సింధు, నాగేందర్, సుమన్, లహరి, సంతోష్చారి, సంధ్యారాణి, రాజేందర్, లీలాశిరీష, గీతావాణి. త్రిసంధ్య పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం పరిశీలనఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని అక్కపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీవో శేషాద్రి శనివారం తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు వివరాలు, ట్యాబ్లో ఎంత వరకు ఎంట్రీ చేశారని ఆరా తీశారు. ఇన్చార్జి డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం మల్లేశం, సీసీ రమణ, వీవోఏ రమ తదితరులు ఉన్నారు. -
ఆమ్చూర్ ఆశలు ఆవిరి
సిరిసిల్ల: మామిడి టంకర(ఆమ్చూర్) వ్యాపారం ఢీలా పడిపోయింది. అకాల వర్షాలు.. ఈదురుగాలులతో ఇప్పటికే చెట్టుపై ఉన్న కాయల్లో పావువంత రాలిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో ఆమ్చూర్కు సరైన ధర లేక మామిడిరైతులు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది క్వింటాలుకు రూ.35వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.19వేల నుంచి రూ.25వేలు పలుకుతుంది. ఆమ్చూర్ వినియోగం ఇలా మామిడికాయల పొట్టు తీసి, ముక్కలుముక్కలుగా కోసి ఎండలో ఎండబెడతారు. ఇలా ఎండిన ముక్కలను మామిడి టంకర అంటారు. అన్సీజన్లో వంటకాలలో వాడుకుంటారు. జిల్లాలోని పల్లెల్లో ఆమ్చూర్ను తయారుచేసి నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఏడాదికో పంట కావడంతో మామిడికాయలను నిల్వ చేసేందుకు శీతల గిడ్డంగులు లేక.. ఆమ్చూర్ చేసి అమ్ముకుంటున్నారు. ఆమ్చూర్కు ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాలు, విదేశాల్లో డిమాండ్ ఉంది. మహారాష్ట్ర వ్యాపారులతో స్థానిక వ్యాపారులు ఒప్పందం చేసుకొని ఎగుమతి చేస్తుంటారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం సగం ధరనే ఉండడంతో మామిడి రైతులు, కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలు.. రాలిన కాయలు జిల్లాలోని ఇల్లంతకుంట, ముస్తాబాద్, కోనరావుపేట, తంగళ్లపల్లి, చందుర్తి, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, బోయినపల్లి మండలాల్లో మామిడితోటలు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. తోటలను స్థానికులు కాంట్రాక్ట్ తీసుకుని చెట్లకు కాపలా ఉండి కాయలను కాపాడుకున్నారు. మరో పక్షం రోజుల్లో కాయలు చేతికొస్తాయని భావించగా.. అంతలోనే ఈదురుగాలులతో కాయలే రాలిపోయాయి. దీంతో మార్కెట్లో నాణ్యమైన మామిడికాయలకు కొరత ఏర్పడింది. ఈ సీజన్లో ఊరగాయల(తొక్కు)కు మామిడికాయలు పెద్దగా రావడం లేదు. ఉన్న కొద్దిపాట కాయలకు ధర మంచిగానే ఉన్నా మార్కెట్లో ఆమ్చూర్కు ధర లేక మామిడి రైతులు దిగాలు పడుతున్నారు. మామిడి దిగుబడి లేదు.. టంకరకు ధర లేదు అకాల వర్షాలు.. ఈదురుగాలులతో నష్టాలు మామిడి టంకర వ్యాపారం ఢీలాధర నిర్ణయించేది దళారీ ఆమ్చూర్ విక్రయాలకు కరీంనగర్ జిల్లాలో పెద్దగా మార్కెట్ లేదు. పొరుగునే ఉన్న నిజామాబాద్, లేదా హైదరాబాద్లో మార్కెట్ ఉండగా.. మహారాష్ట్ర వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయిస్తున్నారు. గతేడాది క్వింటాల్ ఆమ్చూర్కు రూ.35వేలు పలికింది. ఈ–నామ్ మార్కెట్ ఆధారంగా ఆమ్చూర్కు ధర నిర్ణయించాల్సి ఉండగా.. దళారులు సిండికేట్గా మారి ధర తగ్గించారని రైతులు వాపోతున్నారు. ఆమ్చూర్ ధర కనీసం క్వింటాలుకు రూ.30వేలు ఉంటే గిట్టుబాటవుతుందని మామిడి రైతులు అభిప్రాయపడుతున్నారు. అటు మామిడికాయల దిగుబడి లేక.. ఇటు అకాల వర్షాలతో కాయలు రాలిపోయి.. మరోవైపు మామిడి ఒరుగులకు ధర లేక ఈ ఏడాది తోటలను నమ్ముకున్న రైతులు, కాంట్రాక్టర్ల ఆశలు ఆవిరయ్యాయి. -
సార్..పని ఇవ్వండి
● శ్రమజీవులకు ఉపాధి వెతలు ● భవన నిర్మాణ కూలీలకు పని కరువు ● పెరిగిన ముడిసరుకు ధరలతో ఆగిన నిర్మాణాలు ● లేబర్ అడ్డాపై ఎదురుచూపులే దిక్కు ● పల్లెల్లో ‘ఉపాధి’ లేదు.. పట్నంలో పని కరువు సిరిసిల్లటౌన్: ఒకప్పుడు భవన కార్మికుల ఉపాధికి కల్పతరువైన సిరిసిల్లలో ప్రస్తుతం పనులు దొరకడం లేదు. కార్మికులకు పనులు కల్పించడంలో ప్రభుత్వ విధానాలు, అధికారుల నిర్లక్ష్యంతో శ్రమజీవులకు పనిలేకుండా పస్తులుండే పరిస్థితులు వచ్చాయి. కొందరు దళారులు స్వార్థానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకు తక్కువ కూలీ ఇస్తూ పనుల్లోకి తీసుకెళ్తున్నారు. శ్రమకు తగిన ఫలితం దక్కకుండా నిత్యం పనులు దొరక్క భవన నిర్మాణ కార్మికులు ప్రతిరోజు లేబర్అడ్డాపై పని ఇవ్వండి సారూ..అంటూ వచ్చిపోయే వారిని అర్థిస్తున్నారు. పనుల్లేకుండా అవస్థలు ఎదుర్కొంటున్న అడ్డా కూలీల వ్యథపై ప్రత్యేక కథనం. పని కోసం పడిగాపులు శ్రమించే చేతులకు పని లేకుండా పోయింది. పల్లెల్లో వ్యవసాయ పనులు ముగియడం.. ఉపాధి పనిలేకపోవడంతో పల్లెల నుంచి నిత్యం వందలాది సంఖ్యలో కూలీలు పొద్దున్నే సిరిసిల్లకు చేరుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి అన్నం వండుకొని సద్దిమూటలతో ఆటోలు ఎక్కి వచ్చేవారు కొందరైతే.. సైకిళ్లపై మరికొందరు వస్తున్నారు. జిల్లాలోని పదమూడు మండలాల పరిఽధిలోంచి కాకుండా.. కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా ప్రతిరోజు చాలా మంది కూలీలు వస్తున్నారు. అయితే పల్లెల్లో వ్యవసాయ పనులు ముగియడంతోపాటు ఇటీవల సిమెంటు, సలాక రేట్లు పెరిగిపోయాయి. భవన నిర్మాణాలు చాలా వరకు తగ్గిపోయాయి. ప్రతిరోజు సిరిసిల్ల పట్టణంలోనే సుమారు 3వేల మంది భవన నిర్మాణ పనుల్లో చేరి ఉపాధి పొందేవారు. ఇప్పుడు మందగించిన పనులతో అడ్టాపై కార్మికులకు నాలుగు రోజులకోసాసారి పనులు దొరుకుతున్నాయి. నిత్యం వందలాది మంది కూలీలు పని దొరక్క నిరాశతో ఇంటిదారి పడుతున్నారు. ఉపాధికి ధరాఘాతం గతంలో క్వింటాలు సలాక రూ.5వేలు ఉండగా.. ఇప్పుడు రూ. 6వేలు, సిమెంటు రూ.300 ఉండగా.. ప్రస్తుతం రూ.360, ఇటుక లోడ్ రూ.17 వేలు ఉండేది కాగా ప్రస్తుతం రూ.21వేలకు చేరినట్లు కార్మికులు, భవన నిర్మాణదారులు చెబుతున్నారు. స్థానిక అవసరాలకు ఇసుకను తోడేందుకు అధికారులు నిత్యం అనుమతులు ఇవ్వడం లేదు. ఫలితంగా భవన నిర్మాణ పనులు సరిగ్గా జరగడం లేదు. ఇతర రాష్ట్రాల కూలీలు కూడా రావడంతో సిరిసిల్లలో స్థానికులకు పని దొరకడం లేదు. అడ్డా కూలీల అవస్థలు ఇవీ ● సిరిసిల్ల లేబర్ అడ్డాకు షెడ్డు లేదు. ఫలితంగా కార్మికులు ఎండకు, వానకు ఇబ్బందులు పడుతున్నారు. ● అడ్డాపై కనీసం మరుగుదొడ్డి వసతి లేదు. పనులు దొరకని అవస్థకు తోడుగా ఒంటికి, రెంటికి పోవాలన్నా.. గుక్కెడు నీళ్లు తాగాలన్నా డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. ● అపార్టుమెంట్లలో పనిచేసే కార్మికులకు సేఫ్టిథింగ్స్ హెల్మెట్స్, గ్లౌజులు ఇవ్వడం లేదు. ● పనికి వచ్చే కార్మికులకు గుర్తింపుకార్డులు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. ● అడ్డాపైన వైద్య, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం లేదు.పని లేకుంటే ఇబ్బందే.. నేను, నా భార్య లక్ష్మీనర్స వ్వ, కొడుకు అజయ్.. కూలీ పనిచేసుకుని బతుకుతాం. ఊరిలో బయట నుంచి వ చ్చిన కూలీలతో మాకు పనులు దొరుకుతలేవు. నేను ఇంట్లో నుంచి 6 గంటలకు బయలుదేరి సిరిసిల్లకు 7 గంటల వ రకు వస్తా. వారంలో రెండు రోజులే పని దొరుకుతుంది. మిగతా రోజుల్లో ప్రతిరోజు రూ.80 బస్సు కిరాయిలు మీద పడుతున్నాయి. – అల్లెపు సురేష్, గజసింగవరంఇరవై ఏళ్లుగా సిరిసిల్లకు వస్తున్న నేను ఇరవై ఏళ్లుగా సిరిసిల్ల లేబర్ అడ్డాపైకి వస్తున్న. ఏడాది సంది పనులు సరిగా దొరుకుతలేవు. రాను పోను రూ.30 ఖర్చు అవుతాయి. ఇద్దరు ఆడపిల్లలను సాకాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూలీలు తక్కువ పైసలు తీసుకుంటుండ్రని మాకు పనులు ఇస్తలేరు. కమీషన్ ఏజెంట్లు వాళ్ల కోసం ప్రత్యేకంగా అడ్డా పెట్టిండ్రు. దళారుల స్వార్థానికి మాలాంటోళ్లకు పనులు దొరకనివ్వట్లేదు. – గోరిబీ, రాళ్లపేట గుర్రాలగొంది నుంచి వస్తున్న నేను సిద్దిపేట జిల్లా గుర్రాలగొంది నుంచి ఇరువై ఏళ్లుగా ఇక్కడికి వస్తున్న. రానుపోను బస్సు కిరాయిలు రూ.70 పోతయి. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలతో పోటీ ఎక్కువైంది. మరో దిక్కు స్థానికంగా ఇసుక దొరక్క భవన నిర్మాణాలు తగ్గి మాకు పనులు దొరుకుతలేవు. ఉదయం 5గంటలకు ఇంటి నుంచి వెళ్లిన. పని దొరకకుంటే నిన్న వచ్చిన కూలీ డబ్బులోంచి బస్సు కిరాయి పెట్టుకోవాలి. – ఎ.శివారెడ్డి, గుర్రాలగొంది పనులు తగ్గి.. పోటీ ఎక్కువైంది సిరిసిల్లలో ఇతర రాష్ట్రాల కూలీలతో స్థానిక కూలీలకు పనులు తగ్గి కూలీలకు పోటీ ఎక్కువైంది. మాకు నిత్యం పనులు దొరుకుతలేవు. ఊర్లలో వ్యవసాయ పనుల్లేవు. ఇక భవన నిర్మాణ ముడిసరుకుల ధరలు ఎక్కువైనయి. ఇసుకను రోజు ఇవ్వడం లేదు. ఫలితంగా చాలామటుకు నిర్మాణాల పనులు సరిగ్గా నడవడం లేదు. స్థానిక అవసరాలకు మొరం, ఇసుక రోజు అనుమతించాలి. – కోల శ్రీనివాస్, అడ్డా కూలీల అధ్యక్షుడు సంక్షేమ పథకాలు అందడం లేదు భవన నిర్మాణరంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అధికారుల నిర్లక్ష్యంతో అందడం లేదు. లేబర్అడ్డాౖ పె కనీసం నీడ లేదు. ఎండలు, వానలకు నిలబడాలి. బా త్రూమ్కు వెళ్లాలంటే, నీళ్లు తాగాలంటే రూ.5 ఖర్చు చేసుకోవాల్సిన పరి స్థితి. ఇది ఉన్నతాధికారులకు చెప్పినా అడ్డాపై కనీస వసతులు కల్పించడం లేదు. బయట కూలీలు, స్థానిక కూలీలకు ఒకే దగ్గర అడ్డా ఉంచితే అందరికీ పనులు దొరికేలా చూడాలి. – ఎగమంటి ఎల్లారెడ్డి, సీఐటీయూ అధ్యక్షుడు సమాచారం భవన కార్మికులు : 70 వేలు నమోదైన కార్మికులు: 50వేలు సిమెంటు బ్యాగు ధర: రూ.360 సలాక(క్వింటాలుకు): రూ.6వేలు ఇటుక(2వేల పీసులు): రూ.18,500 ఇటుక(బ్రాండెడ్, 2వేల పీసులు): రూ.21వేలు -
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
సిరిసిల్లటౌన్: రోడ్డు భద్రత నియమాలు పాటించా లని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో శుక్రవారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి ఇన్సూరెన్స్ గురించి వివరించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం నేరమని, సరైన పత్రాలు లేకుండా డ్రైవింగ్ చేసినా శిక్షార్హమేనన్నారు. లైసెన్సు లేని వారు వెంటనే తీసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ సభ్యులు చింతోజ్ భాస్కర్, ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, ఆటోడ్రైవర్ యూనియన్ ప్రెసిడెంట్ కనకం శ్రీనివాస్ పాల్గొన్నారు. లైసెన్సులు తప్పనిసరిగా పొందాలి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ ఆటోడ్రైవర్లకు అవగాహన -
నిలిచిన మైనర్ వివాహం
● తల్లిదండ్రులకు అధికారుల కౌన్సిలింగ్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గుట్టుచప్పుడు కాకుండా మైనర్ బాలిక వివాహం చేస్తున్నట్లు తె లుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి పెళ్లిని అ డ్డుకున్నారు. మైనర్ వివాహంపై తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అధికారులు తెలిపిన వివరాలు. మండలంలోని నారాయణపూర్లో శుక్రవారం మైనర్ బాలిక(17) వివాహం చేస్తుండగా.. సమాచారం అందడంతో ఐసీడీఎస్, సఖీ కేంద్రం, రెవెన్యూ, పోలీసు అధికారులు చేరుకొని అడ్డుకున్నారు. సీడీపీవో ఉమారాణి, తహసీల్దార్ సుజాత మాట్లాడుతూ.. మైనర్ వివాహాలు చట్టరీత్య నేరమన్నారు. మైనార్టీ తీరిన తర్వాతనే వారి ఇష్టానుసారంగా పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. చైల్డ్లైన్ అధికారులు విజయలక్ష్మి, సూపర్వైజర్ శ్రావణ్, ఆర్ఐ శ్రావణ్కుమార్, లీగల్ ప్రొటెక్షన్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ముస్తాబాద్(సిరిసిల్ల): బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు కరీంనగర్ పార్లమెంట్ కోకన్వీనర్ ఆడెపు రవీందర్ కోరారు. గంభీరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీపై ప్రజలు సానుకూలంగా ఉన్నారన్నారు. ప్రధాని మోదీ దేశ రక్షణ కోసం, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. దేశంలో సుస్థిరపాలన బీజేపీతోనే సాధ్యమన్నారు. మండల అధ్యక్షుడు కోడె రమేశ్, నాయకులు పాల్గొన్నారు. -
సర్వేయర్లతో భూ సమస్యలు పరిష్కారం
● రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చందుర్తి(వేములవాడ): భూభారతి చట్టంలో దరఖాస్తుదారుల సమస్యల పరిష్కారానికి జూన్ 2వ తేదీ తర్వాత మండలానికి ఐదారుగురు సర్వేయర్లు వస్తారని రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరయ్యారు. రుద్రంగిలో 243 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా.. వాటి నిర్మాణానికి భూమిపూజ చేసి మాట్లాడారు. భూ భారతిలో భాగంగా మండలంలో 1,300 దరఖాస్తులు స్వీకరించారని, జూన్ 2 తర్వాత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. భూభారతిలో భూముల రిజిస్ట్రేషన్తోపాటు హద్దులు, సర్వేయర్లు సర్వేచేసిన మ్యాప్లను పాసుబుక్లో ముద్రిస్తారని వివరించారు. రెండు రెవెన్యూ భవనాలకు నిధులు వేములవాడ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన రుద్రంగి, భీమారం మండలాల్లో రెవెన్యూ భ వన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి శ్రీనివాస్రెడ్డి హామీ ఇచ్చారు. వేములవా డ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ భవనానికి త్వరలో నిధులు మంజూరు చేస్తామన్నారు. ముంపు గ్రామాల బాధితులకు 4,696 ఇళ్లు మంజూరు చేస్తామని, అర్హులు మిగిలితే వారికి కూడా అందజేస్తామన్నారు. ఇందిరమ్మ పథకంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చామని.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరిక మేరకు అదనంగా మరో 1,750 ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. ప్రజలు ప్రశంసించేలా అభివృద్ధి : పొన్నం ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించి, జిల్లాను ప్రజ లు ప్రశంసించేలా అభివృద్ధి చేసి చూపిస్తామని బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలని ఆర్టీసీ బస్సులను అందజేస్తున్నట్లు తెలిపారు. వేములవాడ నుంచి మంబయికి త్వరలోనే ఏసీ బస్సును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి పనులకు నిధులు : సీతక్క ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. నాగారం చెరువు నుంచి కుక్కలగుట్టతండా వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందజేస్తుందన్నారు. యూనిఫాంలు, పాఠశాలల బిల్డింగ్ నిర్మాణాలు, ఇందిరాశక్తి క్యాంటీన్లు, ముందుకొచ్చే మహిళా సంఘాలకు రైస్మిల్లలను ఏర్పాటు చేస్తామని వివరించారు. రూ.150కోట్లతో ఆలయాభివృద్ధి : విప్ ఆది నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులను రూ.150 కోట్లతో త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, రాష్ట్ర సహకార సంఘం చైర్మన్ తీపీరెడ్డి మోహన్రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో నటరాజ్, రుద్రంగి, వేములవాడ, కోనరావుపేట మార్కెట్ కమిటీల చైర్మన్లు చెలుకల తిరుపతి, రొండి రాజు, కచ్చకాయల ఎల్లయ్య పాల్గొన్నారు. -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
● జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత వీర్నపల్లి(సిరిసిల్ల): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోనే డెంగీ వ్యాధిని నివారించగలమని జిల్లా వైద్యాధికారి రజిత పేర్కొన్నారు. వీర్నపల్లి మండలకేంద్రంలో శుక్రవారం డెంగీపై అవగాహన కల్పించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీటిని నిల్వ చేసుకోవద్దని సూచించారు. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, శరీరంపై దద్దులు, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటే వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో సంప్రదించాలని సూచించారు. పనికిరాని పాత్రలు, పాతటైర్లు, పగిలిపోయిన బకెట్లు ఉంటే బయట పడేయాలని సూచించారు. ప్రతీ మంగళ, శుక్రవారాలు డ్రై డేగా పాటించాలన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ తీసి, గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. వైద్యులు అంజలి, ఆల్ఫ్రెడ్, అనిత, రామకృష్ణ, సారియా అంజు, డిప్యూటీ డెమో రాజ్కుమార్, హెచ్ఈవో లింగం, ఎస్యూవో మోహన్, డీడీఎం కార్తీక్ పాల్గొన్నారు. రైతుబజార్లో వసతులు కల్పిస్తాం ● జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని రైతుబజార్లో వసతులు కల్పిస్తామని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లలోని మోడల్ రైతుమార్కెట్ను శుక్రవారం సందర్శించారు. వ్యాపారులు, రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రైతుబజార్ ఇన్ని రోజులు మున్సిపల్శాఖ నిర్వహణలో ఉండేదని, రెండు రోజుల క్రితమే వ్యవసాయశాఖ నిర్వహణ బాధ్యతలు తీసుకుందని తెలిపారు. రైతుబజార్లో టాయిలెట్స్, తాగునీటి సౌకర్యంపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. రైతులకు కేటాయించిన దుకాణాల్లోనే కూరగాయలు విక్రయించుకోవాలని, రోడ్డుపై విక్రయించొద్దని సూచించారు. ఏఎంసీ డైరెక్టర్లు దుబాల వెంకటేశం, ఖాజా, ఆడెపు జగన్ పాల్గొన్నారు. కార్మికులు బెనిఫిట్స్ కోల్పోతున్నారు సిరిసిల్లటౌన్: జిల్లా కార్మికశాఖ అధికారుల నిర్లక్ష్యంతో లేబర్కార్డులు లేక కార్మికులు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కోల్పోతున్నారని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల లోని కార్మికభవన్లో శుక్రవారం భవన నిర్మాణ కార్మిక సమస్యలపై మాట్లాడారు. కార్మికులకు ప్రమాదం జరిగితే రూ.10లక్షలు, సహజ మరణానికి రూ.5లక్షలు, డెలివరీకి రూ.50వేలు, పెండ్లికి రూ.లక్ష ఇవ్వాలని కోరారు. హెల్త్ చెకప్ పేరుతో జరుగుతున్న దోపిడీని ఆపాలని కోరారు. నాయకులు అజ్జ వేణు, సంజీవరెడ్డి పాల్గొన్నారు. వర్షానికి కూలిన ఇల్లుముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని మోహినికుంటలో మూడు రోజులుగా పలుమార్లు కురిసిన వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది. గ్రామానికి చెందిన రైతు మంద అశోక్ పెంకుటిల్లు శుక్రవారం కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వానలతో ఇల్లు ఉరుస్తోందని, వాన నీటికి గోడలు తడిసి పడిపోయిందని బాధిత రైతు అశోక్ తెలిపారు. -
ప్రతీ జిల్లాలో రైతువిజ్ఞాన కేంద్రం
జగిత్యాలఅగ్రికల్చర్: కృషి విజ్ఞాన కేంద్రాలు, డాట్ సెంటర్లు లేని అన్నిజిల్లాల్లో రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ జానయ్య తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో గురువారం శ్రీరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలుశ్రీ కార్యక్రమం నిర్వహించారు. జానయ్య ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 జిల్లాల్లో డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయన్నారు. మిగతా జిల్లాల్లో రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక్కో కేంద్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతీజిల్లాలో 50 ఎకరాలు అందుబాటులో ఉన్నచోట రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో లేదని, వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేక రైతు కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులతో పంటలపై అనేకరకాల పురుగులు, తెగుళ్లు దాడి చేస్తున్నాయన్నారు. వాటి నివారణకు శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేయాలని కోరారు. ఆర్ఎంపీల మాదిరిగా గ్రామాల్లో ఫార్మర్స్ క్లినిక్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం తెలంగాణ సీడ్ సంస్థ రూపొందించిన శ్రీమన సంస్థ– మన విత్తనంశ్రీ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ శ్రీలత, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ సైదానాయక్, జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖాధికారులు భాస్కర్, శ్యాంప్రసాద్, రైతు నాయకులు రవీందర్రెడ్డి, నారాయణరెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ వర్శిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ జానయ్య -
దేశరక్షణలో పల్లె యువత
● సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జిల్లా బిడ్డలు ● కశ్మీర్లో కాపలాగా ఉన్న యువకులు ● గర్వంగా భావిస్తున్న కుటుంబ సభ్యులు కోనరావుపేట(వేములవాడ)/ఇల్లంతకుంట(మానకొండూర్): దేశరక్షణలో జిల్లా యువత ముందుంటున్నారు. ఉగ్రవాద ముష్కరులను మట్టుబెట్టడంలో మేమున్నామంటూ దేశసరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా జిల్లాలో ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత సైన్యంలో పనిచేస్తున్న జిల్లాకు చెందిన యువతలో అత్యధికులు జమ్మూకశ్మీర్లోని దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నారు. సరిహద్దుల్లో గస్తీ కాస్తూ రక్షణగా నిలుస్తున్న వారిలో కోనరావుపేట మండలం మామిడిపల్లి నుంచి జవ్వాజి ప్రసాద్, బెదిరె వేణు, కోనరావుపేట నుంచి కస్తూరి ప్రశాంత్రెడ్డి, అజ్జు, ఎగ్లాస్పూర్ నుంచి తాళ్లపెల్లి శ్రీకాంత్, తాళ్లపెల్లి వినోద్, వేములవాడ మండలం చెక్కపల్లి నుంచి మెతుకు మధుకర్రెడ్డి, ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన అంతటి అనిల్ ఉన్నారు. గత కొన్నేళ్లుగా జమ్మూకశ్మీర్, లడక్లో దేశభద్రత విధుల్లో నిమగ్నమై ఉన్నారు. -
ప్రాణం తీసిన ఈతసరదా
● ఈతకు వెళ్లి యువకుడి మృతి ఎలిగేడు(పెద్దపల్లి): స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు వచ్చిన యువకుడు ముష్కి రాజీవ్గాంధీ(36) ఈత కోసమని వెళ్లి నీటమునిగి చనిపోయాడు. ఈ ఘటన ముప్పిరితోట గ్రామంలో చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై సనత్ కుమార్ కథనం ప్రకారం.. గోదావరిఖనిలోని జైభీమ్నగర్కు చెందిన ముష్కి రాజీవ్గాంధీ ఈనెల 14న ముప్పిరితోట గ్రామంలో జరిగిన శ్రీవేంకటేశ్వరస్వామి రథోత్సవం, జాతరకు వచ్చాడు. సాయంత్రం వేళ సరదాగా స్నేహితులతో కలిసి వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. ప్లాస్టిక్ డబ్బా కట్టుకుని బావిలో దిగాడు. ప్రమాదవశాత్తు బావిలో నీట మునిగి మృతి చెందాడు. గురువారం ఉదయం వ్యవసాయ బావి నుంచి మృతదేహాన్ని బయటకు తీసి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. నీటి సంపులో పడి చిన్నారి మృతివేములవాడ అర్బన్: నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లో గురువారం విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాలు. తిప్పాపూర్లో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం వచ్చింది. నాలుగేళ్ల చిన్నారి జిక్రా ఫాతిమా ప్రమాదవశాత్తు ఇంటి ముందు నీటిసంపులో పడిపోయింది. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఈ సంఘటనపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. రైలు ఢీకొని యువకుడు..మల్యాల: కొడిమ్యాల మండలం రాంసాగర్కు చెందిన అనుముల శేఖర్ (37) కొండగట్టు సమీపంలో రైలు ఢీకొని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. వార్డు సభ్యుడిగా పనిచేసిన శేఖర్ ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చాడు. బుధవారం కొండగట్టు సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మల్యాల సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్కుమార్లు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొందా? రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలుజగిత్యాలక్రైం: అతిగా మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడిన వ్యక్తికి న్యాయమూర్తి ఒకరోజు జైలుశిక్ష విధించారు. రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన అల్లెపు వెంకటనర్సయ్య ఇటీవల అతిగా మద్యం సేవించి వాహనం నడుపగా రాయికల్ ఎస్సై సుదీర్రావు పట్టుకుని అతడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని గురువారం స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్టేట్ సెకెండ్ క్లాస్ న్యాయమూర్తి కరుణాకర్ ముందు హాజరు పర్చగా ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. గొర్రె, మేకల దొంగల అరెస్టుమల్యాల: గొర్రెలు, మేకలు ఎత్తుకెళ్లి విక్రయిస్తూ జల్సాలు చేస్తున్న ముగ్గురు దొంగలను పట్టుకొని అరెస్టు చేసినట్లు మల్యాల సీఐ నీలరం రవి, ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. జగిత్యాలకు చెందిన ముద్దవేని అనిల్, మహ్మద్ మోసిన్, వెంకటేశ్లు రాత్రివేళ గ్రామాల్లో మోటారు సైకిల్, ఆటోల్లో తిరుగుతూ షెడ్లలోని గొర్రెలు, మేకలను దొంగిలించి కొన్నింటిని అమ్ముకోగా, మరికొన్నింటిని కోసి మాంసం విక్రయించే వారన్నారు. వచ్చిన డబ్బులను సమానంగా పంచుకొని జల్సాలు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం మల్యాల ప్రాథమిక సహకార కేంద్రం వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా బైక్, ఆటోలో రెండు మేకలు, రెండు గొర్రెలు తీసుకెళ్తున్న వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా వివిధ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు దొంగిలించినట్లు అంగీకరించారన్నారు. బైక్, ఆటో, రెండు మేకలు, రెండు గొర్రెలు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
ఎనిమిదేళ్లుగా దేశ సేవలోనే..
నేను గత ఎనిమిదేళ్లుగా దేశ సేవలోనే ఉంటున్నాను. మా నాన్న అంజయ్య మద్దిమల్లలో పనులు చేసుకుంటాడు. తల్లి లక్ష్మి ఇంటి వద్దే ఉంటుంది. నేను ప్రస్తుతం పంజాబ్ సమీపంలోని పటిండ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాను. మాకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో పాక్ బాంబు పడింది. – తాళ్లపల్లి వినోద్, ఎగ్లాస్పూర్ (కోనరావుపేట) దేశ సేవలో.. నా తల్లిదండ్రులు బెదిరె నాంపెల్లి–లక్ష్మి. అమ్మానాన్న గ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటారు. నేను 2019లో ఆర్మీలో చేరాను. గత ఐదేళ్లుగా ఆర్మీలో పనిచేస్తుండడం సంతోషంగా ఉంది. దేశం కోసం పనిచేయడం గర్వంగా ఉందని వేణు పేర్కొన్నాడు. – బెదిరె వేణు, మామిడిపల్లి (కోనరావుపేట) -
ముగ్గురు యువకులపై కత్తులతో దాడి
● ఒకరి పరిస్థితి విషమం జగిత్యాలక్రైం: పుట్టిన రోజు వేడుకలకు సిద్ధమవుతున్న యువకుడితో పాటు అతని ఇద్దరు స్నేహితులపై కత్తులతో దాడి చేయడంతో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన గురువారం లింగంపేట శివారులో చోటు చేసుకుంది. జగిత్యాలరూరల్ మండలం అంతర్గాంకు చెందిన ఏళ్ల అరవింద్ తన జన్మదిన వేడుకల కోసం అంతర్గాం, లింగంపేట శివారులోని గంగమ్మతల్లి ఆలయం వద్ద ఏర్పాట్లు చేసుకున్నాడు. అరవింద్ అతని స్నేహితులు తోపారపు గంగాధర్, ఉయ్యాల వంశీలు ఉండగా ఉండగా అదే గ్రామానికి చెందిన మహేశ్, రాకేశ్, చందు, దినేశ్తో పాటు మరికొంతమంది కత్తులతో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. గంగాధర్కు 23 చోట్ల గాయాలు కాగా, అరవింద్, వంశీలకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆటోలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా విషయం తెలుసుకున్న సీఐ వేణుగోపాల్, ఎస్సై గీత బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మహేశ్, రాకేశ్, దినేశ్, చందులతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. -
ఇల్లాలు.. కన్నీళ్లు
కరీంనగర్క్రైం: పెళ్లి చేసుకొని కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన మహిళలకు మొదట్లో బాగానే ఉన్నప్పటికీ రోజులు గడుస్తున్న కొద్ది రకరకాల రూపాల్లో వేధింపులు ఎదురవుతున్నాయి. అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్త, మామ, ఆడబిడ్డల వేధింపులు పెరుగుతున్నాయి. పోలీసుస్టేషన్లలో పెద్ద ఎత్తున పిటిషన్లు ఈ కారణాలతోనే వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల పరంగా వెనకబడడంతో మగవారు మద్యం, గంజాయి ఇతర దురలవాట్లకు బానిసవుతున్నారు. దీంతో నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ పెట్టడం, ఇల్లాలిని తిట్టడం, భౌతిక దాడులకు పాల్పడడం జరుగుతోంది. ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు ● అనుమానం పెనుభూతంగా మారి ఇల్లాలిని హత్య చేయడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే, వివిధ రకాల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ● ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుమానం కారణంగానే హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు మహిళలు ఇంట్లో ఆర్థిక పరిస్థితి చితికిపోవడంతో భవిష్యత్తు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేమని భయపడి ముందుగానే తనువు చాలిస్తున్నారు. ● బతుకుబండిని మోయలేక వ్యసనాలకు అలవాటుపడి భర్తలు.. ఇంట్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారి కనీస అవసరాలను సైతం వివాహితలు పుట్టింటివారికి చెప్పుకోలేక బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు అనేకం ఉంటున్నాయి. ● అలాగే మిస్సింగ్ కేసుల్లో కూడా ఎక్కువ శాతం వివాహితలు ఉంటున్నట్లు గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఇంట్లో సమస్యలు భరించలేక, వేధింపులు తట్టుకోలేక ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. వేధింపులు ఆగడంలేదు సమాజంలో మహిళలపై వేఽ దింపులు పెరుగుతున్నాయి. అదనపు కట్నం కోసం వివిధ విషయాల వల్ల ఆడవారిపై భర్త, వారి కుటుంబ సభ్యుల గృహహింస కేసులు పెరుగుతుండడం కనిపిస్తుంది. చిన్న విషయాలకే హత్యలు, ఆత్మహత్యల ఘటనలు జరుగుతున్నాయి. ఆడవారి భద్రతకు మరింత కఠిన చట్టాలు అవసరం. – కర్రె పావని, ఆదరణ సేవా సమితి, ఎన్జీవో నిర్వాహకురాలు కౌన్సెలింగ్ ఇస్తున్నాం గృహహింస కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. భర్త, భర్త కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తుంటాయి. మేము సాధ్యమైనంత వరకు కౌన్సెలింగ్ ఇచ్చి జంటలను కలుపుతున్నాము. తీరుమార్చుకోకపోతే కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నాం. – శ్రీలత, సీఐ, కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్ -
టికెట్ బుక్ చేసుకొని.. అక్కడే ఆగిపోయి
ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ అంతటి అనిల్ జమ్మూకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆ ప్రాంతంలోనే బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నాడు. గత 8 నెలలుగా జమ్మూసెక్టార్లోనే ఉంటున్నాడు. ఈనెల 7న ఇంటికొచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ 6వ తేదీ నుంచి యుద్ధ సన్నాహాలు మొదలుకావడంతో అక్కడే ఉండిపోయాడు. ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి 11 మంది యువకులు ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అంతటి అనిల్ -
సరస్వతీ నమస్తుతే..
● విశేష పూజలతో పుష్కరాలు ప్రారంభం ● తొలిస్నానం ఆచరించిన శ్రీశ్రీ మాధవనంద సరస్వతిస్వామి ● మొదటిరోజు సుమారు 50 వేల మంది పుణ్యస్నానం కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం ఉదయం 5.44 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి సరస్వతి ఘాట్లోని త్రివేణి సంగమం, అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో క్యూలైన్లో భక్తులు గంటల తరబడి నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ నెలకొంది. మొదటి రోజు భక్తుల తాకిడి.. తొలిరోజు ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాల్లో వచ్చిన భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు, గోదావరి తీరం కిక్కిరిసింది. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ నెలకొంది. సుమారు 50 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. హారతి గద్దెలకు ఏడు జీవనదుల పేర్లు సరస్వతి నది పుష్కరాల సందర్బంగా కాశీ పండితులచే నవరత్నమాల హారతి కార్యక్రమం నిర్వహించడానికి చతుర్వేదసరస్వతి ఘాట్ వద్ద ఏడు గద్దెలు నిర్మించారు. దేవాదాయశాఖ అధికారులు ఆ గద్దెలకు ఏడు జీవనధుల పేర్లను ప్రకటించారు. వాటిలో గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధూ, కావేరి పేర్లను శిలాఫలకం రూపంలో తయారు చేసి ప్రదర్శించారు. కాళేశ్వర శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు కాళేశ్వర శాశ్వత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదించాలని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ను సీఎం కోరారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి శ్రీధర్బాబు, అధికారులను అభినందించారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల్లోగా కాళేశ్వర అభివృద్ధికి రూ.100 కోట్ల నిధుల మంజూరుతోపాటు పర్యాటక క్షేత్రంగా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. ఇప్పటికే రూ.35కోట్లు మంజూరు చేశారని సీఎంకు కృత/్ఞతలు తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి సీఎం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న గోదావరి, కృష్ణ ఫుష్కరాలతో పాటు సమ్మక్క–సారలమ్మ జాతరను విజయవంతం చేస్తామని అన్నారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక లోటుపాట్లతో ఉన్నప్పటికి పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేశామన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఓసారి వచ్చే సరస్వతిమాత పుష్కరాలను భక్తులు ఆచరించాలని సూచించారు. -
వెల్జీపురం రూట్ పరిశీలన
ఇల్లంతకుంట: సిరిసిల్ల నుంచి మండలంలోని వెల్జీపూర్కు ఆర్టీసీ బస్సు నడిపేందుకు డీఎం శ్రీనివాసరావు గురువారం రూట్మ్యాప్ పరిశీలించారు. ఈనెల 7న మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెల్జీపూర్ రాగా గ్రామస్తుల విన్నవించారు. ఎమ్మెల్యే వెంటనే డీఎంతో మాట్లాడి బస్సు నడిపించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమేరకు డీఎం గ్రామంలో పర్యటించగా.. మానసాదేవి టెంపుల్ వరకు బస్సు నడపాలని గ్రామస్తులు వినతిపత్రం అందించారు. ఇక్కడి నుంచి దాచారం గ్రామానికి రూట్ పరిశీలనకు డీఎం వెళ్లారు. గుండ వెంకటేశం, ఏఎంసీ డైరెక్టర్ రాంప్రసాద్, బొజ్జ శ్రీనివాస్, బాల్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి ● డీఎంహెచ్వో రజిత వేములవాడరూరల్: రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత సూచించారు. వేములవాడరూరల్ మండలం హన్మాజిపేట, చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కాయకల్ప అసెస్మెంట్ జిల్లా టీంతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాల్లో పరిశుభ్రతతోపాటు రోగులకు అందించే తాగునీరు, మరుగుదొడ్లు, బిల్డింగ్ నాణ్యత ప్రమాణాలను జిల్లా క్వాలిటీ సిబ్బందితో తనిఖీ చేశారు. జిల్లా క్వాలిటీ టీం ఎన్హెచ్ఎం డీపీవో రాజేందర్, క్వాలిటీ మేనేజర్ సింధూజ, వైద్యాధికారులు సురేష్, దివ్యశ్రీ పాల్గొన్నారు. స్కానింగ్ వివరాలు నమోదు చేయాలిసిరిసిల్ల: స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు స్కానింగ్ వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో గురువారం పీసీపీఎన్డీటీ–యాక్టుపై వైద్యసిబ్బందితో సమీక్షించారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, రేడియాలజిస్టులు పీసీపీఎన్డీటీ రాష్ట్ర కమిటీ నిర్వహించే తనిఖీలలో ఫారం–ఎఫ్ ఆడిట్, రికార్డులు నిబంధనల మేరకు నిర్వహించాలన్నారు. నిబంధనలు పాటించని సెంట ర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగన్నపేట, ఎల్లారెడ్డిపేట, పోత్గల్ పీహెచ్సీల సిబ్బందికి టీకాల ఆన్లైన్ నమోదుపై శిక్షణ ఇచ్చారు. ఫ్యామిలీ ప్లానింగ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఫార్మాసిస్ట్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. ఎంహెచ్ఎన్ ప్రోగ్రాం ఆఫీసర్ అంజలి ఆల్ఫ్రెండ్, వైద్యులు సంపత్కుమార్, రామకృష్ణ, డిప్యూటీ డెమో రాజ్కుమార్, హెచ్ఈ బాలయ్య ఉన్నారు. అనుమతి లేని విద్యాసంస్థలు మూసేయాలి సిరిసిల్లటౌన్: జిల్లాలో అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి నాయకులు కంచర్ల రవిగౌడ్ కోరారు. ఈమేరకు గురువారం జిల్లా విద్యాధికారి ఆఫీస్లో వినతిపత్రం అందించి మాట్లాడారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లపై దృష్టి సారించాలని కోరారు. అనుమతులు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. మట్టె శ్రీనివాస్, జగన్, అనిల్, షేక్ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. మనం బుక్ ఆఫ్ రికార్డ్స్లో ‘చిటికెన’ సిరిసిల్లకల్చరల్: నిరంతర వ్యాసరచన, కవితలు, కథనాలతో సామాజిక చైతన్యానికి కారకుడయ్యారని జిల్లా కవి చిటికెన కిరణ్కుమార్కు ‘మనం’ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కల్పించారు. ఈమేరకు మనం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చక్రవర్తి సంబంధిత సర్టిఫికెట్ను అందజేశారు. -
ఇల్లాలు.. కన్నీళ్లు
● వివాహితలపై వేధింపులు ● ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న గృహహింస కేసులు ● అనుమానమే పెనుభూతమవుతున్న వైనం ● మహిళల హత్యలు, ఆత్మహత్యలు ఉమ్మడి జిల్లాలో 2024–25 ఏప్రిల్ వరకు కేసులు ఇలా..4225580515230073736820659గృహహింసఆత్మహత్యహత్యకరీంనగర్జగిత్యాలపెద్దపల్లిరాజన్న సిరిసిల్ల -
ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ
● బోధనలో మార్పులు అవసరం ● జిల్లా విద్యాధికారి జనార్దన్రావు సిరిసిల్లఎడ్యుకేషన్: మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు నూతన విధానంలో బోధన చేయాలని జిల్లా విద్యాధికారి జనార్దన్రావు పేర్కొన్నారు. సిరిసిల్లలో కొనసాగుతున్న శిక్షణ శిబిరాన్ని జిల్లా విద్యాధికారి జనార్దన్రావు, కరీంనగర్ డైట్ కళాశాల బోధకులు, స్టేట్ రిసోర్సు పర్సన్లు సందర్శించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. బోధన మార్పులకనుగుణంగా ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాల ద్వారా బోధించాల్సి ఉంటుందన్నారు. శిక్షణలో భాగంగా సాంఘికశాస్త ఉపాధ్యాయులకు మోటివేషన్ తరగతులను శ్రీనివాస్, బోధించారు. కోర్సు కోఆర్డినేటర్ శైలజ, కోర్సు ఇన్చార్జీలు శారద, పద్మ, వెంకటేశ్వర్రావు, జిల్లా సైన్స్ అధికారి దేవయ్య, జిల్లా రిపోర్సు పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
రుద్రంగి(వేములవాడ): రుద్రంగిలో శుక్రవారం మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతేలతో ఏర్పాట్లపై స్థానిక గ్రామపంచాయతీలో గురువారం సమీక్షించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ భాభారతి చట్టం అమలులో భాగంగా జిల్లాలో రుద్రంగిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందునా శుక్రవారం నిర్వహించే రెవెన్యూ సదస్సుకు రుద్రంగిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్గౌడ్ హాజరవుతున్నట్లు తెలిపారు. మండలంలో మంజూరైన 243 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇళ్ల దరఖాస్తులు పెండింగ్ ఉంటే వెంటనే మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. మంత్రుల పర్యటనకు రైతులు, ఇందిరమ్మ లబ్ధిదారులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపనలో మంత్రులు పాల్గొంటారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి.రాధాబాయ్, రుద్రంగి తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీవో నటరాజ్, ఈఈ ఆర్బీ వెంకట రమణయ్య, ప్రాజెక్టు డైరెక్టర్ హౌసింగ్ శంకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేడు రుద్రంగిలో పర్యటించనున్న మంత్రుల బృందం -
మంత్రుల పర్యటనకు పటిష్ట భద్రత : ఎస్పీ
సిరిసిల్ల ఎడ్యుకేషన్: రుద్రంగి మండలంలో శుక్రవా రం మంత్రుల పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రత చేపడుతున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. తీసుకోవాల్సిన భద్రత చర్యలపై జిల్లా పోలీస్ ఆఫీస్లో గురువారం సమీక్షించారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మురళీకృష్ణ, డీసీ ఆర్బీ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, మధుకర్, నాగేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మౌలిక సదుపాయాలకు పెద్దపీట!
● అదనపు లైన్లు, స్టేషన్ల ఆధునీకరణకు నిధులు ● ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు విడుదల ● కొత్తపల్లి–మనోహరాబాద్కు రూ.205 కోట్లు ● పెద్దపల్లి బైపాస్కు రూ.36 కోట్లు, నిజామాబాద్–పెద్దపల్లికి రూ.13 కోట్లు ● కొలనూరు ఆర్వోబీకి రూ.29 కోట్లు, రాఘవాపురం ఆర్వోబీకి రూ.36 కోట్లు ● ఉమ్మడి జిల్లాకు రూ.435 కోట్లకుపైగా నిధులు ● ఆలస్యంగా దక్షిణ మధ్య రైల్వే పింక్బుక్ సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎట్టకేలకు దక్షిణమధ్య రైల్వే బడ్జెట్ 2025–26 వెలుగుచూసింది. వాస్తవానికి ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు లేదా మూడు రోజుల తర్వాత స్థానిక రైల్వే విభాగాల కేటాయింపులను పింక్ బుక్ పేరిట విడుదల చేస్తారు. కానీ..దాదాపు నాలుగు నెలల తరువాత బడ్జెట్ వెలుగుచూడటం ఇదేతొలిసారి. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల మార్గాల్లో నెలకొన్న ఈ బడ్జెట్లో రైల్వే పనుల కోసం దాదాపు రూ.435 కోట్లకుపైగా నిధులు కేటాయించింది. ఇవే కాకుండా పలు అభివృద్ధి పనులకు మిగిలిన జిల్లాల్లోని స్టేషన్లతోకలిపి మరికొన్ని రూ.కోట్లు కేటాయించడం గమనార్హం. ఈసారి స్టేషన్ల ఆధునీకరణ, స్టేషన్లలో లైప్లైన్ల ఏర్పాటు, గూడ్స్ షెడ్ల నిర్మాణం, స్టేషన్లలో అదనపు మెయిన్ లైన్ల ఏర్పాటుకు ఈ నిధులు కేటాయించింది. కొత్తపల్లి మనోహరాబాద్కు రూ.205 కోట్లు అత్యంత కీలకదశలో ఉన్న కొత్తపల్లి–మనోహరాబాద్ (151 కిమీ) మార్గానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.205 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం సిద్దిపేట (సుమారు 77 కిమీ) వరకు లైన్ పూర్తయి సర్వీసు కూడా నడుస్తోంది. సిరిసిల్ల–సిద్ధిపేట మధ్య లైన్పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్లలో భూసేకరణ వేగంగా సాగుతోంది. 2026 వరకు ట్రాక్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. మిడ్మానేరులో బ్రిడ్జి పనులు సవాలుగా మారనున్నాయి. ఫలితంగా 2027లో పూర్తి అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సర్వేలకు.. ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు లైన్లకు ఫైనల్ లొకేషన్ సర్వేలకు నిధులు కేటాయించింది. కరీంనగర్–హసన్పర్తి రూ.1.55 కోట్లు, పెద్దపల్లి బైపాస్ లైన్ ఎఫ్ఎల్ఎస్ సర్వే రూ.2 లక్షలు, పెద్దపల్లి–నిజామాబాద్ డబ్లింగ్ లైన్ ఎఫ్ఎస్ఎల్ సర్వే కోసం రూ.3.56 కోట్లు ఇచ్చింది. స్టేషన్ల కోసం.. నూకపల్లి– మల్యాల నూకపల్లి మల్యాల హాల్ట్ స్టేషన్ను బ్లాక్ స్టేషన్గా మార్చేందుకు రూ.15.85 కోట్లు కరీంనగర్లో అదనంగా రెండు లూప్లైన్ల నిర్మాణం, రైల్వేస్టేషన్ కోసం రూ.27.50 కోట్లు నిజామాబాద్–పెద్దపల్లి సెక్షన్లో లింగపేట–జగిత్యాల స్టేషన్లోలూప్లైన్ కోసం రూ.19.89 కోట్లు మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి ప్లాట్ఫారాల అభివృద్ధికి రూ.4.54 కోట్లు పెద్దపల్లిలో గూడ్స్ షెడ్ అభివృద్ధి కోసం రూ.9.99 కోట్లు పెద్దపల్లి–నిజామాబాద్ మార్గంలో న్యూ క్రాసింగ్ స్టేషన్ పూడురు (నూకపల్లి మల్యాల–గంగాధర స్టేషన్ మధ్యలో) రూ.23.59 కోట్లు సుల్తానాబాద్–ఎస్టీబీడీ యార్డ్ విస్తరణ, అప్గ్రేడేషన్ కోసం రూ.రూ.36.80 కోట్లు మణుగూరు–రామగుండం (రాఘవాపురం) 200 కి.మీ లైన్కు ఈసారి నామమాత్రపు నిధులు కేటాయించారు. మెయిన్లైన్కు నిజామాబాద్– కరీంనగర్–పెద్దపల్లి లైన్ కోసం రూ.13.86 కోట్లు పెద్దపల్లి బైపాస్ లైన్ (2.169 కిమీ) ను బల్లార్షా కాజీపేట మెయిన్ లైన్కోసం రూ.36.99 కోట్లు రైలు వంతెనల కోసం.. కొలనూరు–పెద్దపల్లి ఆర్వోబీ కోసం రూ.29.33 కోట్లు పెద్దపల్లి–రాఘవాపురం ఆర్వోబీ కోసం రూ.36.83 కోట్లు కొలనూరు–పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఆర్యూబీ రూ.7.41 కోట్లు