vanishes
-
దుబాయ్లో కంపెనీ గల్లంతు.. రూ.కోట్లు నష్టపోయిన భారతీయులు
దుబాయ్కు చెందిన ఓ బ్రోకరేజీ సంస్థ రాత్రికి రాత్రే గల్లంతైంది. రూ.కోట్ల కొద్దీ ఇన్వెస్టర్ల సొమ్ముతో ఆచూకీ లేకుండా మాయమైంది. దుబాయ్ లోని బిజినెస్ బేలోని క్యాపిటల్ గోల్డెన్ టవర్లో అప్పటి వరకూ ఆ కంపెనీ ఉన్న ఆఫీస్ బయట ఒక బకెట్, అందులో ఒక మాప్, చెత్త సంచి మాత్రమే కనిపించాయి. కొన్ని వారాల క్రితం ఈ స్థలంలో గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ కార్యాలయం ఉండేదని, అదే ఇప్పుడు అదృశ్యమైనట్లు కనిపిస్తోందని ఖలీజ్ టైమ్స్ నివేదిక తెలిపింది.గల్లంతైన సంస్థ..గత నెల వరకు గల్ఫ్ ఫస్ట్ దుబాయ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లోని క్యాపిటల్ గోల్డెన్ టవర్ 302, 305 సూట్ లలో సుమారు 40 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేది. ఔత్సాహిక ఇన్వెస్టర్లను సంప్రదించడం, ఫారెక్స్ పెట్టుబడులను ప్రోత్సహించడం వారి పని.క్యాపిటల్ గోల్డెన్ టవర్లోని ఆ రెండు గదులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఫోన్ లైన్లు తెగిపోయి ఫ్లోర్లు దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. తాళాలు తిరిగి ఇచ్చి, అన్నీ క్లియర్ చేసి హడావుడిగా వెళ్లిపోయారని క్యాపిటల్ గోల్డెన్ టవర్ సెక్యూరిటీ గార్డు ఒకరు మీడియాకు తెలిపారు. ఇప్పుడు రోజూ జనం వచ్చి వారి గురించి అడుగుతున్నారని చెప్పారు.నష్టపోయిన భారత ఇన్వెస్టర్లుగల్ఫ్ ఫస్ట్ బాధితుల్లో భారతీయ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పెట్టుబడి పెట్టి కోట్లాది రూపాయలు నష్టపోయినట్లు బాధితులు చెబుతున్నారు. కేరళకు చెందిన మహ్మద్, ఫయాజ్ పొయిల్ గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ బ్యాంకర్స్ ద్వారా 75,000 డాలర్లు అంటే రూ.64 లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేసి మోసపోయారు.మరో భారతీయ ఇన్వెస్టర్ అయితే ఏకంగా 2,30,000 డాలర్లు భారతీయ కరెన్సీలో దాదాపు రూ.2 కోట్లు నష్టపోయారు. ఇన్వెస్ట్ చేసే సయమంలో కంపెనీ రిలేషన్షిప్ మేనేజర్ తనతో తన మాతృ భాష కన్నడంలో మాట్లాడారని చెప్పుకొచ్చారు. మొదట చిన్న చిన్న లాభాలను చూపించి డబ్బును ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించిన కంపెనీ ఆ తర్వాత ఉపసంహరణలకు వీలు లేకుండా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయించారని బాధితుడు పేర్కొన్నారు.కంపెనీ సిబ్బంది తనతో మాట్లాడేటప్పుడు గల్ఫ్ ఫస్ట్, సిగ్మా-వన్ పేర్లను మార్చి మార్చి చెప్పారని, అవి రెండూ ఒకే కంపెనీగా ఉన్నాయని 50,000 డాలర్లు (సుమారు రూ.42 లక్షలు) నష్టపోయిన మహమ్మద్ అనే మరో ఇన్వెస్టర్ వివరించారు. రెండు సంస్థలపై కేసు నమోదు చేసిన పోలీసులు సిగ్మా-వన్ క్యాపిటల్ కు డీఎఫ్ఎస్ఏ లేదా ఎస్సీఏ అనుమతి లేదని నిర్ధారించారు. -
‘కమ్యూనిస్టులు కూడా కనుమరుగు.. భవిష్యత్తు బీజేపీదే’
తిరువనంతపురం: భారతదేశం నుంచి కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేరళ రాజధాని తిరువనంతపురంలో నిర్వహించిన దక్షిణాది జోనల్ కౌన్సిల్ మీటింగ్లో తీవ్ర విమర్శలు గుప్పించారు. దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తు బీజేపీ పార్టీనేనని పేర్కొన్నారు. అలాగే.. ప్రపంచం నుంచే కమ్యూనిస్ట్ పార్టీలు కనుమరుగవుతున్నట్లు చెప్పారు. ‘భారత్ నుంచి కాంగ్రెస్ అంతరించిపోతోంది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ సైతం ప్రపంచం నుంచే కనుమరుగవుతోంది. కేరళలో ఒక్క బీజేపీ పార్టీకే భవిష్యత్తు.’ అని పేర్కొన్నారు అమిత్ షా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు అమిత్ షా. వెనకబడిన తరగతులు, మైనారిటీల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడూ పని చేయలేదని విమర్శించారు. వారిని కేవలం ఓటు బ్యాంకులాగే చూశారని దుయ్యబట్టారు. దేశం కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. అందుకే వారి పాలనలో భారతరత్న ఇవ్వలేదని ఆరోపించారు. ఇదీ చదవండి: ‘అదే జరిగితే 2024లో పిక్చర్ వేరేలా ఉంటుంది’.. బీజేపీపై నితీశ్ విమర్శలు -
హాంకాంగ్ లో మరో బుక్ సెల్లర్ అదృశ్యం..!
హాంకాంగ్ లో తాజాగా మరో బుక్ సెల్లర్ అదృశ్యమయ్యాడు. పుస్తకాలు తెచ్చేందుకు గోడౌన్ కు వెళ్ళిన అతడు.. తిరిగి రాకపోవడంతో ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. చైనా ప్రధాన భూభాగానికి చెందిన కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా పుస్తకాలను ప్రచురించే పబ్లిషింగ్ హౌస్ నుంచి ఇటీవలి కాలంలో ఒక్కొక్కరుగా మాయమౌతుండటం.. ఇప్పుడక్కడ చర్చనీయాంశంగా మారింది. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచురించేందుకు ప్రయత్నించిన 'మైటీ కరెంట్ పబ్లిషింగ్ హౌస్' కు ప్రస్తుతం ఈ చేదు అనుభవం ఎదురైంది. మైటీ కరెంట్ పబ్లిషింగ్ హౌస్ నుంచి ఓ వ్యక్తి వారం రోజుల క్రితం అదృశ్యం కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అంతేకాక గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకూ వరుసగా వ్యక్తులు అదృశ్యం కావడం ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఇప్పుడు మరో వ్యక్తి అదృశ్యంపై హాంకాంగ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి. ప్రజల స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోందంటూ నిరసనలు వ్యక్తమౌతున్నాయి. కాస్ వే బే బుక్స్ షేర్ హోల్డర్... మైటీ కరెంట్ పబ్లిషింగ్ హౌస్ ఉద్యోగి అయిన లీ బో... గత బుధవారంనుంచీ కనిపించడం లేదు. అతడు కంపెనీ వేర్ హౌస్ నుంచి పుస్తకాలు తెస్తానని చెప్పి వెళ్ళాడని, ఆ తర్వాత అతడి నుంచి తాను క్షేమంగానే ఉన్నట్లు ఫోన్ కాల్ తప్పించి, మరే ఇతర సమాచారం లేదని అతడి భార్య చెప్తోంది. అతడు అదృశ్యమైన తర్వాత వచ్చిన ఫోన్ కాల్ షాంఘై నుంచి వచ్చిందని, ఆ సమయంలో ఎప్పుడూ తాము మాట్లాడే కాంటనీస్ లో మాట్లాడకుండా... అతడు మాండరిన్ భాషలో మాట్లాడాడని ఆమె చెప్తోంది. అయితే ఇటీవలి కాలంలో పబ్లిషింగ్ హౌస్ నుంచి వ్యక్తులు అదృశ్యమౌతుండటం ఆందోళన కలిగిస్తోందని, తాజాగా ఐదో వ్యక్తి లీ కనిపించకుండా పోవడం అందర్నీ నిర్ఘాంతపోయేలా చేసిందని, భయానికి కూడా గురి చేసిందని డెమొక్రటిక్ పార్టీ చట్ట సభ్యుడు ఆల్బర్ట్ హో అన్నారు. ప్రభుత్వ విచారణకోసం అతడిని చైనా ప్రధాన భూ భాగానికి అక్రమంగా తరలించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన వ్యక్తులకోసం పోలీసులు విచారణ ప్రారంభించారు.