భారత్‌తో మనుగడకే ప్రమాదం | Pakistan Mass Destruction Weapons Mention In US Threat Report | Sakshi
Sakshi News home page

భారత్‌తో మనుగడకే ప్రమాదం

May 26 2025 4:51 AM | Updated on May 26 2025 7:34 AM

Pakistan Mass Destruction Weapons Mention In US Threat Report

అందుకే అణ్వ్రస్తాల ఆధునీకరణపై పాక్‌ దృష్టి

అమెరికా రక్షణ నిఘా విభాగం నివేదిక వెల్లడి 

ఇస్లామాబాద్‌: భారత్‌ వల్ల తన అస్తిత్వమే ప్రమాదంలో పడిందని పాకిస్తాన్‌ భయపడుతోంది. సైనికపరంగా పైచేయిగా ఉన్న భారత్‌ను నిలువరించేందుకు తనకున్న ఏకైక మార్గం అణ్వస్త్రాలే అని భావిస్తోంది. అందుకే, తన వద్ద ఉన్న అణ్వ్రస్తాలను ఆధునీకరించుకునే పనిలో పడింది. ఇందుకోసం  సైనిక, ఆర్థిక పరమైన సాయం అందిస్తోంది’..ఈ విషయాలు ఆదివారం అమెరికా రక్షణ నిఘా విభాగం(యూఎస్‌డీఐఏ) వరల్డ్‌ త్రెట్‌ అసెస్‌మెంట్‌ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఉన్నాయి. 

రాబోయే సంవత్సరాల్లో పొరుగు దేశాలతో సరిహద్దుల్లో ఘర్షణలను ఎదుర్కోవడం పాకిస్తాన్‌ మిలటరీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగానే అణ్వస్త్రాల నవీకరణ కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ ఆయుధ సంపత్తిని భద్రంగా కాపాడుకోవడం, కమాండ్‌ కంట్రోల్‌ వంటి వాటిపైనా పాక్‌ మిలటరీ దృష్టి పెట్టిందని తెలిపింది. 

సామూహిక జన హననాని(డబ్ల్యూఎండీ)కి అవసరమయ్యే ఆయుధ సామగ్రిని విదేశీ ఉత్పత్తి సంస్థలు, దళారుల ద్వారా సేకరించడం ఆర్మీ తప్పనిసరని భావిస్తోంది. డబ్ల్యూఎండీ తయారీ, అభివృద్ధిలో వాడే సామగ్రి, సాంకేతికతను ప్రధానంగా చైనా నుంచి పొందుతోంది. 

ఇందులో కొన్నిటిని హాంకాంగ్, సింగపూర్, తుర్కియే, యూఏఈల ద్వారా తెప్పించుకుంటోందని యూఎస్‌డీఐఏ నివేదిక తెలిపింది. ‘పాక్‌కు ప్రధాన ఆయుధ సరఫరాదారు చైనా కొనసాగుతున్నప్పటికీ, పాక్‌లో వివిధ ప్రాజెక్టుల కోసం పనిచేసే చైనీయులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు రెండు దేశాలకు ఇబ్బందికరంగా మారాయి. రెండు మిత్ర దేశాల మధ్య ఇవి ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి’అని పేర్కొంది.  

నివేదికలో భారత్‌ గురించి ఏముంది? 
జమ్మూకశీ్మర్‌లోని పహల్గాంలో ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించిన విషయాన్ని కూడా యూఎస్‌డీఐఏ తన నివేదికలో ప్రస్తావించింది. ‘మే 7 నుంచి 10వ తేదీ వరకు క్షిపణి, డ్రోన్, ఆర్టిలరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. 10వ తేదీన రెండు దేశాల సైన్యాలు పూర్తి స్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి’అని పేర్కొంది. ‘చైనా పలుకుబడికి చెక్‌ పెట్టేందుకు భారత్‌ కూడా వ్యూహాత్మకంగా హిందూ మహా సముద్ర తీర, ద్వీప దేశాలతో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలను పెంచుకుంటోంది’అని నివేదిక తెలిపింది. 

భారత్‌–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల ప్రస్తావన సైతం ఇందులో ఉంది. ‘తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద వాస్తవా«దీన రేఖ వెంబడి చిట్టచివరి రెండు ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి ఇరు దేశాలు సైన్యాలను ఉపసంహరించుకున్నప్పటికీ సరిహద్దు విభజన వివాదం అపరిష్కృతంగానే ఉండిపోయింది’అని పేర్కొంది. మిలటరీ ఆధునీకరణ, ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో దేశీయ రక్షణ పరిశ్రమను బలోపేతమయ్యేలా భారత్‌ ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’కార్యక్రమాన్ని కొనసాగించే అవకాశముంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement