Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page
breaking news

ప్రధాన వార్తలు

16 Sunsets Here Shubhanshu Shukla To PM Narendra Modi1
ఒక్క రోజులో 16 సూర్యోదయాలు: శుభాంశు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్‌ఎస్‌)లో కి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లాతో ప్రభాని నరేంద్ర మోదీతో జరిపిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ఈరోజు(శనివారం, జూన్‌ 28వ తేదీ) శుభాంశు శుక్లాతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. తొలుత శుభాంశును విష్‌ చేసిన ప్రధాని మోదీ.. ‘ఇది శుభ్‌ ఆరంభ్‌ అని, ఇది నయా శకం’ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మోదీ.. గొప్ప ఘనతను సాధించావంటూ కొనియాడారు. దానికి శుభాంశు బదులిస్తూ ఇది తన ఒక్కడి విజయం కాదని, భారత్‌ విజయమని వినమ్రతను చాటుకున్నారు. PM @narendramodi interacted with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station. pic.twitter.com/Q37HqvUwCd— PMO India (@PMOIndia) June 28, 2025 అదే సమయంలో అక్కడ ఎలా ఉంది అని మోదీ అడగ్గా... ఇక్కడ వాతావరణం అంతా భిన్నంగా ఉందని శుభాంశు తెలిపారు. ఈ కక్ష నుంచి చూస్తే భారత్‌ చాలా స్పెషల్‌గా కనిపిస్తుందని శుభాంశు స్పష్టం చేశారు. ఇక్కడ రోజుకు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలుగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ కక్షలో పరిస్థితులకు అలవాటు పడుతున్నామని, నిద్ర పోవడం అనేది చాలా పెద్ద చాలెంజ్‌గా ఉందన్నారు. ఇక్కడ గ్రావెటీ లేమి కారణంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయని శుభాంశు తెలిపారు. తల కాస్త భారంగా ఉంటుందని, ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయని, ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులేనని తెలిపారు. మీ యొక్క ఆశీర్వాదంతో ఐఎస్‌ఎస్‌లో అతి సులభంగా అడుగుపెట్టానని పేర్కొన్నారు శుభాంశు. ఇక ఐఎస్‌ఎస్‌ నుంచి భారత్‌ చాలా పెద్దదిగా కనిపిస్తుందని, మ్యాప్‌ కంటే భిన్నంగా ఉందని మోదీ పేర్కొనగా, ఇక్కడ నుంచి చూస్తే భారత్‌ చాలా స్పెషల్‌గా కనిపిస్తుందని శుభాంశు తెలిపారు. ఇలా పలు విషయాలను పంచుకుంటూ ప్రధాని మోదీ-శుభాంశుల సంభాషణ కొనసాగింది. #WATCH | Prime Minister Narendra Modi interacts with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station.PM Modi says "Today, you are away from our motherland, but you are the closest to the hearts of Indians...Aapke naam mein bhi shubh hai aur aapki… pic.twitter.com/lWOk7AVlL3— ANI (@ANI) June 28, 2025

Indian Womens Wins England By 97 Runs2
ఇంగ్లండ్‌ను పేకమేడలా కూల్చి.. భారత్‌ గ్రాండ్‌ విక్టరీ!

నాటింగ్‌హామ్: ఐదు మ్యాచ్‌ల ట్వంటీ 20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ మహిళలతో జరిగిన తొలి పోరులో భారత మహిళలు గ్రాండ్‌ విక్టరీ సాధించారు. తొలుత బ్యాటింగ్‌లో సత్తా చాటిన భారత్‌ మహిళలు.. ఆపై బౌలింగ్‌లో విజృంభించి ఇంగ్లండ్‌ను 14.5 ఓవర్లలో 113 పరుగులకే నేలకూల్చి 97 పరుగుల తేడాతో అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నారు.భారత బౌలర్లలో శ్రీచరణి నాలుగు వికెట్లు సాధించగా, రాధా యాదవ్‌, దీప్తి శర్మలు తలో రెండు వికెట్లతో ఇంగ్లండ్‌ నడ్డివిరిచారు. ఇంగ్లండ్‌ మహిళా బ్యాటర్లలో కెప్టెన్‌ స్కీవర్‌ బ్రంట్‌(66) అర్థ శతకం మినహా ఎవరూ రాణించలేదు.అంతకుముందు భారత మహిళా జట్టు కెప్టెన్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్భుత శతకంతో మెరిసింది. ఆది నుంచి నిలకడగా ఆడిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ యాభై ఒక్క బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుంది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో స్మృతికి ఇదే తొలి శతకం కావడం విశేషం. దీంతో ఆనందంలో మునిగిపోయిన స్మృతి హెల్మెట్‌ తీసి.. బ్యాట్‌ చూపిస్తూ నవ్వులు చిందిస్తూ సెలబ్రేట్‌ చేసుకుంది.ఇంగ్లండ్‌ పర్యటనలో..కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత మహిళా జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్‌ జరుగనుండగా.. శనివారం నాటి తొలి మ్యాచ్‌లో టా​స్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మహిళా జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌ బ్రిడ్జ్‌ మైదానంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (20) స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. అయితే, మరో ఓపెనర్‌, కెప్టెన్‌ స్మృతి మంధాన.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ హర్లీన్‌ డియోల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దింది.51 బంతుల్లో సెంచరీఈ క్రమంలో స్మృతి మంధాన 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. హర్లీన్‌ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైంది. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్‌ (8) త్వరగానే పెవిలియన్‌ చేరగా.. జెమీమా రోడ్రిగెస్‌ డకౌట్‌ అయింది. ఇక స్మృతి మొత్తంగా 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసి.. సోఫీ ఎక్లిస్టోన్‌ బౌలింగ్‌లో నాట్‌ సీవర్‌- బ్రంట్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటైంది.ఇంగ్లండ్‌క్ష్యం 211అమన్‌జోత్‌ కౌర్‌ 3, దీప్తి శర్మ ఏడు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక స్మృతి అద్భుత శతకం ఫలితంగా.. నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యం విధించింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ బౌలర్లలో లారెన్‌ బెల్‌ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. ఎమ్‌ ఆర్లోట్‌, సోఫీ ఎక్లిస్టోన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.కాగా టీ20లలో భారత మహిళా జట్టుకు ఇది రెండో అత్యుత్తమ స్కోరు. ఇంతకు ముందు ముంబై వేదికగా వెస్టిండీస్‌పై భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.

Chodavaram MLA Faces Backlash Over Remarks at Kasturba School3
‘నీ అంతు చూస్తా’.. మహిళా ప్రిన్సిపల్‌కు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు

అనకాపల్లి,సాక్షి: కస్తుర్బా కాలేజీ ప్రిన్సిపల్‌ని చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ రాజు బెదిరింపులు గురి చేశాడు. ఎమ్మెల్యే రాజు బెదిరింపులతో ప్రిన్సిపల్‌ అన్నపూర్ణ గుండెపోటుకు గురయ్యారు. ‘ఎమ్మెల్యే రాజు నా అంతుచూస్తానని బెదిరించారు. 50 మంది మగాళ్ళ మధ్య నన్ను దూషించారు. కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగిన వదిలేది లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా స్కూల్లో సీట్ల కేటాయింపు జరిగిందని చెప్పా. అయినా, ఎమ్మెల్యే వినకుండా దూషించారు. ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరించారని’ వాపోయారు. ఇటా ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మహిళపట్ల దరుసు ప్రవర్తన ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. ‘చంద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని తాను సీఎంకు చెప్పానని అన్నారాయన. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారు. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసి మందు తాగుతున్నారు అని అన్నారాయన. అక్కడితో ఆగకుండా.. ‘‘పథకాల వల్లే.. ఆడవాళ్లు ఇంట్లో వంట మానేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అలవాటు పడుతున్నారు. ఇచ్చిన డబ్బులతో చిల్లర ఖర్చులు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు కొనుక్కుంటున్నారు అంటూ తన నోటి దురుసును కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు ఎమ్మెల్యే రాజు క్షమాపణలు చెప్పాలని రాజకీయ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

New money rules in July 2025 Aadhaar PAN Tatkal tickets UPI chargeback and more4
మనీ రూల్స్‌ మారుతున్నాయ్‌.. జూలైలో కొత్త మార్పులు

జూన్‌ నెల ముగుస్తోంది.. ఇక జూలై నెల ప్రారంభమవుతోంది. ఈ క్రమంలో ఆర్థిక సంబంధిత నిబంధనలు కొన్ని మారుతున్నాయి.. కొత్త మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు మొదలుకొని పెద్ద వ్యాపార సంస్థల వరకూ ప్రభావితం చేసే అవకాశం ఉంది.సవరించిన యూపీఐ చార్జ్‌ బ్యాక్‌ నిబంధనలు, కొత్త తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ నిబంధనలు, పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఆధార్ అవసరం వంటి కొన్ని మనీ రూల్స్, మార్పులు జూలై నుంచి అమలవుతున్నాయి.యూపీఐ ఛార్జ్ బ్యాక్ నిబంధనలుఈ ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఇటీవల యూపీఐ ఛార్జ్‌ బ్యాక్ నిబంధనల్లో మార్పులు ప్రకటించింది.ప్రస్తుత విధానం ప్రకారం, ఛార్జ్‌ బ్యాక్ అభ్యర్థన తిరస్కరణకు గురైనప్పుడు, చట్టబద్ధమైన సందర్భాల్లో కూడా యూపీఐ రిఫరెన్స్ కంప్లయింట్స్ సిస్టమ్ (యూఆర్‌సీఎస్) ద్వారా కేసును వైట్‌లిస్ట్ చేయడానికి బ్యాంక్ ఎన్‌పీసీఐని సంప్రదించాల్సి ఉండేది.జూన్ 20న చేసిన ప్రకటన ప్రకారం.. ఇటువంటి సందర్భాల్లో ఇకపై ఎన్‌పీసీఐ జోక్యం అవసరం లేదు. ఎన్‌పీసీఐ నుండి అనుమతి కోసం వేచి ఉండకుండా ఆర్థిక సంస్థలు నేరుగా ప్రామాణిక తిరస్కరణకు గురైన ఛార్జ్ బ్యాక్ లను రీప్రాసెసింగ్ కు అర్హులుగా వర్గీకరించవచ్చు.కొత్త పాన్ కార్డులకు ఆధార్ తప్పనిసరిజూలై 1 నుంచి కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఇంతకుముందు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఏదైనా చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డ్‌, జనన ధృవీకరణ పత్రం ఉంటే సరిపోయేది. కానీ జూలై 1 నుంచి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్జూలై నుంచి పలు తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. జూలై 1 నుండి ఐఆర్‌సీటీసీ వెబ్సైట్ లేదా దాని మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ రైలు టిక్కెట్లకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి.జూలై 15 నుంచి తత్కాల్ రైలు టికెట్ బుకింగ్స్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) అవసరం. అంటే టికెట్లు బుక్ చేసేటప్పుడు వినియోగదారుల ఫోన్లకు ఒక కోడ్‌ వస్తుంది. కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) కౌంటర్లలో బుక్ చేసుకునే తత్కాల్ టికెట్లకు కూడా ఓటీపీ అథెంటికేషన్ అవసరం.తత్కాల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అధీకృత టికెటింగ్ ఏజెంట్లకు భారతీయ రైల్వే సమయ పరిమితిని ప్రవేశపెట్టింది. బుకింగ్ విండో తెరిచిన మొదటి 30 నిమిషాలు వారు టికెట్లు బుక్‌ చేయలేరు. ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్లకు ఉదయం 10:00 గంటల నుంచి 10:30 గంటల వరకు, నాన్ ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్లకు ఉదయం 11:00 గంటల నుంచి 11:30 గంటల వరకు పరిమితి ఉంటుంది.జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ నిబంధనలుజూలై నుండి నెలవారీ జీఎస్టీ చెల్లింపు ఫారం జిఎస్టిఆర్ -3 బి ఎడిట్ చేసేందుకు వీలుండదని జీఎస్టీఎన్ జూన్ 7న ప్రకటించింది. అలాగే గడువు తేదీ నుంచి మూడేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత జీఎస్టీ రిటర్నులను దాఖలు చేయడానికి కూడా అవకాశం ఉండదని జీఎస్టీఎన్ తెలిపింది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఫీజు, రివార్డు మార్పులుహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రివార్డ్స్ ప్రోగ్రామ్‌కు కొత్త క్రెడిట్ కార్డు ఫీజులు, అప్డేట్లను ప్రకటించింది. ఇవి జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. రూ.10,000 కంటే ఎక్కువ నెలవారీ ఖర్చులపై 1% రుసుము, రూ .50,000 కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లు చెల్లింపులు, రూ .10,000 కంటే ఎక్కువ ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలు, అద్దె చెల్లింపులు, రూ .15,000 ఇంధన చెల్లింపులు, థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే విద్య సంబంధిత చెల్లింపులు ఈ మార్పులలో ఉన్నాయి. ఈ ఛార్జీలను గరిష్టంగా రూ.4,999గా నిర్ణయించారు. అలాగే ఆన్‌లైన్ గేమింగ్ లావాదేవీలకు రివార్డ్ పాయింట్లు అందుబాటులో ఉండవు. బీమా రివార్డ్ పాయింట్లపైనా నెలవారీ పరిమితి ఉంటుంది.

E-stamp Fraud In Kalyandurg,three Arrested 5
ఈ-స్టాంపుల కుంభకోణం.. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు సహా ముగ్గురి అరెస్ట్‌

సాక్షి,అనంతపురం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ ఈ–స్టాంపుల కుంభకోణాన్ని పోలీసులు చేధించారు. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముఖ్య అనుచరుడు ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అనంతరం నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణం గురించి ఎస్పీ జగదీష్‌ మీడియాతో మాట్లాడారు.టీడీపీ నేత ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు 15 వేల నకిలీ ఈ-స్టాంపులు తయారు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 100 రూపాయల స్టాంప్‌ల సున్నాలు మార్చి లక్ష రూపాయల స్టాంప్‌గా నిందితులు మార్చారు. ఫోటో షాప్‌లో ఎడిట్ చేసి నకిలీ ఈ-స్టాంపులు తయారు చేసినట్లు తేలింది. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ సంస్థకు టీడీపీ నేత ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు 481 నకిలీ ఈ-స్టాంపులు విక్రయించిన ఆధారాలు సేకరించారు. కంప్యూటర్లు, ప్రింటర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదీ అసలు కథఇదో భారీ కుంభకోణం! ఓ దళారీని అడ్డుపెట్టుకుని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఫోర్జరీతో రూ.వందల కోట్ల మేర బ్యాంకు రుణాలు కాజేసిన ఓ కంపెనీ దీన్ని కప్పిపుచ్చుకునేందుకు కట్టు కథలు చెబుతోంది. స్టాంప్‌ డ్యూటీ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, తప్పుడు ఈ – స్టాంప్‌లతో బ్యాంకులు, ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వాలను మోసం చేసిన ఓ టీడీపీ ఎమ్మెల్యే నిర్వాకం ఇదీ!! తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేశారు. ఆస్తుల విలువను అధికంగా చూపించి ఫేక్‌ పత్రాలు సృష్టించారు.టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలుఅనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ బ్యాంకు రుణాలు తీసుకుని ఈ – స్టాంప్‌ డ్యూటీ చెల్లింపుల్లో భారీ కుంభకోణానికి పాల్పడింది. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో దీన్ని ఓ దళారీపై నెట్టేసి బయటపడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నారు. ఈ స్కామ్‌లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్‌ ‘మీ–సేవ బాబు’! టీడీపీ ప్రజా ప్రతినిధి అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్రం నిర్వాహకుడు ఇంత రిస్క్‌ ఎందుకు తీసుకుంటాడు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఈ స్టాంప్‌ల కోసం మీ–సేవ సెంటర్‌ నిర్వాహకుడు బాబుతో టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర సన్నిహిత సంబంధాలు నెలకొల్పాడు. ‘మీ–సేవ బాబు’ కూడా టీడీపీ కుటుంబ సభ్యుడే! మహానాడులో కూడా పాల్గొన్నాడు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు ఎమ్మెల్యే సురేంద్ర ఇంట్లో మనిషిలా మీసేవ బాబు వ్యవహరిస్తుంటాడు. ఈ కుంభకోణం వివరాలివీ...బ్యాంకు నుంచి రూ.900 కోట్ల రుణంటీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఈ ఏడాది యూనియన్‌ బ్యాంకు నుంచి రూ.900 కోట్ల మేర రుణం తీసుకుంది. ఆస్తులు తనఖా పెట్టి ఆ గ్యారెంటీతో రుణాలు తీసుకోవాలి. దీని కోసం ముందుగా స్టాంప్‌డ్యూటీ చెల్లించి తనఖా వివరాలు పొందుపరిచి ఈ–స్టాంప్‌ పొందాలి. రిజి్రస్టేషన్‌ ఫీజు, యూజర్‌ చార్జీలు చెల్లించాలి. బ్యాంకు రుణంలో 0.5 శాతం స్టాంప్‌ డ్యూటీ కింద కంపెనీ కట్టాలి. అంటే రూ.900 కోట్ల రుణానికి రూ.4.5 కోట్లు స్టాంప్‌ డ్యూటీ చెల్లించాలి. అయితే ఎస్‌ఆర్‌సీ మాత్రం నాలుగు డాక్యుమెంట్ల ద్వారా మొత్తం రూ.1,51,700 మాత్రమే చెల్లించింది. అంటే రూ.4,48,48,300 మేర స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖను మోసగించింది! మోసం చేశారిలా.. ఈ–స్టాంప్‌లో 0.5 శాతం చెల్లించాల్సిన మొత్తాన్ని స్వల్పంగా చూపించి డాక్యుమెంట్‌ను మీ–సేవ బాబు జనరేట్‌ చేస్తాడు. జనరేట్‌ అయిన డాక్యుమెంట్‌లో స్టాంప్‌ డ్యూటీ మొత్తాన్ని ఫ్యాబ్రికేట్‌ చేసి నిబంధనల ప్రకారం ఎంత చెల్లించాలో ఆ మొత్తాన్ని ఎంటర్‌ చేసి మరో ప్రింట్‌ తీసి కంపెనీ ప్రతినిధులకు అందించాడు. దీన్ని బ్యాంకులకు సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకున్నారు. ఇలా స్టాంప్‌ డ్యూటీ చెల్లింపులో కుంభకోణానికి పాల్పడ్డారు. తప్పుడు ఈ – స్టాంప్‌ పత్రాలను సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకోవడం ద్వారా బ్యాంకును, ఆర్‌బీఐని మోసగించారు.టాటా క్యాపిటల్స్‌ రుణాల్లోనూ ఇదే స్కామ్‌ ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ టాటా క్యాపిటల్స్‌ నుంచి రూ.20 కోట్లు రుణం తీసుకునేందుకు 2024 నవంబర్‌ 7న ఈ–స్టాంప్‌ డ్యూటీ చెల్లించారు. దీనికి కేవలం రూ.200 మాత్రమే ఈ–స్టాంప్‌ డ్యూటీ కట్టారు. ఈ డాక్యుమెంట్‌లో స్టాంప్‌డ్యూటీ మొత్తాన్ని ఎడిట్‌ చేసి 0.5 శాతం చొప్పున రూ.10 లక్షలుగా అంకెలు మార్చి టాటా క్యాపిటల్స్‌కు సమర్పించారు. ఈ విధంగా బ్యాంకు రుణాల్లో ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కుంభకోణానికి పాల్పడింది. స్టాంప్‌ డ్యూటీ కుంభకోణంపై ఆధారాలతో ఫిర్యాదు అందడంతో స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులతో పాటు స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యేకు చెందిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ ప్రతినిధులు రంగంలోకి దిగారు. కంపెనీ ప్రతినిధులు తనకు డబ్బులు ఇచి్చనట్లు, అయితే తానే ఆ డబ్బులు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడినట్లు ఈ–సేవా నిర్వాహకుడు బాబుతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతో పాటు ఓ ఆడియో రికార్డును కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.బుకాయిస్తే మాత్రం దాగుతుందా..! స్టాంప్‌ డ్యూటీ చెల్లింపులకు సంబంధించి కంపెనీ చెక్‌ ఇచ్చి ఉండాలి. లేదంటే ఆర్‌టీజీఎస్, డీడీతో పాటు ఏ రకమైనా చెల్లింపులైనా వైట్‌మనీగానే చెల్లించాలి. ఎస్‌ఆర్‌ కంపెనీ ఆ రకమైన చెల్లింపులు చేయలేదు. దీంతో మీ–సేవా బాబు­కు తాము డబ్బులు ఇచ్చామని బలవంతంగా ఒప్పించినా, అందులో వాస్త­వం లేదని బహిర్గతం అవుతుంది. కంపెనీ మోసం బట్టబయలవుతుంది. ఈ రెండు రుణాలు మాత్రమే కాదని, తప్పుడు ఈ–స్టాంప్‌ పత్రాలతో చాలా రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఫేక్‌ ఈ–స్టాంపు పేపర్లను విక్రయించిన మీసేవ బాబు, ఆయ­న భార్య కట్టా భార్గవిపై అనంతపురం టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌­ఆర్‌ ఇన్‌ఫ్రా ప్రతినిధి గుంటూరు సతీ­ష్‌బాబు పేర్కొన్నారు. తమ అకౌంట్స్‌ విభాగం డాక్యుమెంట్లను పరిశీలించగా ఈ–స్టాంపుల ఫోర్జరీ వెలుగులోకి వచ్చిందన్నారు. మీ–సేవ బాబు అలియాస్‌ బోయ ఎర్రప్ప, కట్టా భార్గవిపై బీఎన్‌ఎస్‌ 318(4), 338, 340, ఆర్‌/­డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Chandrababu Naidu Government Scare Over Ys Jagan Popularity6
సింగిల్‌గా అయితే సీన్ సితారే

ఎవరెన్ని అనుకున్నారు.. భారీ మెజారిటీతో గెలిచాం అని లోలోన చంకలు గుద్దుకుంటున్నప్పటికి.. కూటమి నాయకులకు మాత్రం ఇంకా వైఎస్ జగన్ అంటే భయం పోలేదు. జగన్‌కు జనంలో ఉన్న మాస్ ఇమేజ్ కూటమి నాయకులకు నిద్రలేకుండా చేస్తుంది. జగన్ ఇల్లు దాటడం లేదని ఓవైపు అంటూనే ఆయన వీధిలోకి వస్తే జనసంద్రం ఎలా ఉంటుందో చూసి లోలోన టీడీపీ, జనసేన నాయకులు కుళ్ళు కుంటున్నారు.మొన్న ఏదో మూడు పార్టీల మధ్య పొత్తు కలిసి వచ్చి అలా గెలిచేసారు కానీ అన్ని సందర్భాల్లోనూ ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుందని చెప్పలేం అని సాక్షాత్తు కూటమి నాయకులే ఒప్పుకుంటున్నారు. ఓకే కాంబినేషన్‌తో మళ్లీ మళ్లీ వస్తే సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ లేదని వాళ్ళే అంగీకరిస్తున్నారు. అన్నిటికి మించి మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటే తప్ప విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ జగన్ అలవోకగా అధికారాన్ని చేపడతారని తెలుగుదేశానికి వంతపాడే మీడియా సంస్థలు కూడా అంగీకరిస్తున్నాయి.నిత్యం వైఎస్‌ జగన్‌ను ఆడిపోసుకునే ఓ చానల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేస్తే కూటమికి చావు దెబ్బ తప్పదని అంగీకరించారు. మరోవైపు సూపర్ సిక్స్ హామీలు ఏవి అమలు చేయకుండా కేవలం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా హైప్ తెచ్చుకొని తెచ్చుకొని అంతా బాగుందని చెప్పుకుంటాను కూటమి నాయకులకు.. దాని పెయిడ్ మీడియాకు కూడా సమాజంలో ఏం జరుగుతుందో అన్న విషయం స్పష్టంగా తెలుసు. ఎన్నికలకు ముందు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏమాత్రం ఆధారాలు లేని అభాండాలు వేసి రకరకాల మాయలు చేసి గెలిచిన కూటమి నాయకులు ఇప్పటికే ప్రజల్లో చులకన అయ్యారు.హామీలు ఎగ్గొట్టడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దండాలు దోపిడీలు రౌడీయిజం ప్రతిపక్ష నాయకుల మీద దాడులు అరాచకం మినహా ఇంకేమీ పనులు చేయకపోవడంతో ప్రజలకు సైతం ప్రభుత్వం మీద అసహ్యం మొదలైంది. మొదటి ఏడాదిలోనే ఇంత వెగటు పుడితే రానున్న నాలుగేళ్లలో ఇది మరింత ముదిరి కూటమి నాయకులను తన్ని తరిమేసే పరిస్థితికి వస్తుందని వారికి అర్థమైంది. ఒకసారంటే వీరి మాటలు ప్రజలు నమ్మారు కానీ మళ్ళీ మళ్ళీ అవే హామీలు అవే మోసకారి మాటలు చెబితే ప్రజలు నమ్మి నెత్తిన పెట్టుకోరు అనే విషయం కూటమి నాయకులతో పాటు ఆ మీడియాకు సైతం ఎప్పటికే అర్థమైంది.అంతేకాకుండా ఇటీవల పలు ప్రైవేట్ సంస్థలు చేసిన సర్వేల్లో కూడా దాదాపుగా 50 శాతం మంది ఎమ్మెల్యేలకు రెండోసారి గెలిచే అవకాశం లేదని తేలడంతో వారు ఇప్పుడు బిత్తిరి చూపులు చూస్తున్నారు. ఏదైతేనేం ఉన్న ఈ నాలుగేళ్లు ఉన్న కాడికి దండుకుందాం అనే టార్గెట్‌తో చాలామంది ఎమ్మెల్యేలు సహజం వనరులతో పాటు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దందా చేస్తూ సొమ్ములు వెనకేస్తున్నారు.ఈ పరిస్థితి కూడా కూటమి మీడియాకు తెలుసు.. అందుకే తాజాగా జరిగిన డిబేట్‌లో ఓ యాంకర్ సైతం ఇదే విషయాన్ని చెప్పలేక చెప్పలేక కుమిలిపోతూ చెప్పారు. కూటమి పొత్తులో లేకపోతే వైఎస్ జగన్ నిలువరించడం అసాధ్యం అని యాంకర్‌తో పాటు రఘురాం కృష్ణంరాజు సైతం అంగీకరించారు. ఏడాదిలోనే వారి పాలనపై వారికే నమ్మకం కోల్పోవడంతో.. ప్రజల ఇప్పుడు వైఎస్ జగన్‌పై దృష్టిసారించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు మరింత వివరించి వారి మద్దతు కూడగట్టుకునేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు కూడా సమాయత్తం అవుతున్నాయి..* సిమ్మాదిరప్పన్న

Not Nitish Reddy Ex Indian Star Wants This Star To Replace Shardul Thakur7
నితీశ్‌ రెడ్డి కాదు!.. శార్దూల్‌ స్థానంలో అతడే సరైనోడు: భారత మాజీ క్రికెటర్‌

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. ఎవరిపై వేటు వేస్తారు? ఎవరికి కొత్తగా అవకాశం ఇస్తారు?.. ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?.. అన్న అంశాలు క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.కాగా టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)ని టీమిండియా పరాజయంతో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో గిల్‌ సేన ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటర్లు ఫర్వాలేదనిపించినా.. బౌలర్లు విఫలమయ్యారు. ఇక ఫీల్డింగ్‌లో అయితే టీమిండియా చెత్త ప్రదర్శన కనబరిచింది. ఏకంగా ఆరు క్యాచ్‌లు డ్రాప్‌ చేసి.. మూల్యం చెల్లించింది.శార్దూల్‌ విఫలం.. నితీశ్‌ రెడ్డికి అవకాశం?ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇటు లోయర్‌ ఆర్డర్‌లో.. అటు బౌలింగ్‌లో అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఐదు పరుగులు చేసిన శార్దూల్‌.. మొత్తంగా రెండు వికెట్లు తీశాడు.ఆల్‌రౌండర్‌గా రాణిస్తాడనుకుంటే.. అతడి వల్ల ఉపయోగం లేకుండా పోయిందంటూ మాజీ క్రికెటర్లు సైతం శార్దూల్‌ను విమర్శించారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో అతడిపై వేటు పడే అవకాశం ఉందని.. అతడి స్థానంలో ఆంధ్ర యువ సంచలనం నితీశ్‌ కుమార్‌ రెడ్డి జట్టులోకి వస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు.నితీశ్‌ కాదు!.. శార్దూల్‌ స్థానంలో అతడే కరెక్ట్‌!అయితే, టీమిండియా మాజీ క్రికెటర్‌ సుబ్రమణ్యం బద్రీనాథ్‌ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘రెండో టెస్టు నుంచి శార్దూల్‌ ఠాకూర్‌ను తప్పిస్తారనే అనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే అతడి స్థానాన్ని బౌలర్‌తోనే భర్తీ చేయాలి.ప్రసిద్‌ కృష్ణ సంగతి పక్కనపెడితే.. వైవిధ్యం కోసం పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ను లేదంటే చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఏదేమైనా పిచ్‌ స్వభావాన్ని బట్టే వీరిద్దరిలో ఒకరు ఫైనల్‌ అవుతారు’’ అని బద్రీనాథ్‌ అభిప్రాయపడ్డాడు. కుల్దీప్‌ యాదవ్‌ ఆడే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా తమిళనాడుకు చెందిన బద్రీనాథ్‌ 2008- 2011 మధ్య టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాడు. రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఆయా ఫార్మాట్లలో 63, 79, 43 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య రెండో టెస్టు (జూలై 2-6)కు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియం వేదిక.ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టు:యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), కరుణ్‌ నాయర్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ధ్రువ్‌ జురెల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఆకాశ్‌ దీప్‌, హర్షిత్‌ రాణా.చదవండి: ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు!

Picnic Turns Tragic For Pak Family Swat River flash floods Video8
ముంచెత్తిన వరద.. సాయం కోసం 2 గంటలకు పైగా ఎదురు చూపులు

సరదాగా నది ఒడ్డుకు పిక్నిక్‌ వెళ్లడం ఆ కుటుంబం పాలిట శాపమైంది. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని రెండు గంటలపాటు ప్రాణాలను రక్షించుకునేందుకు పోరాడింది ఆ కుటుంబం. అయితే సకాలంలో సాయం అందక.. అధికార యంత్రాంగ వైఫల్యంతో చివరకు నదిలో కొట్టుకుపోయి విగతజీవులుగా తేలారు. క్రికెట్‌ గ్రౌండ్లను ఆరబెట్టడానికి హెలికాఫ్టర్లను ఉపయోగించే పాకిస్తాన్‌లో ఘోరం జరిగింది. స్వాత్‌ నదీ ఆకస్మిక వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది కొట్టుకుపోగా, అందులో 10 మంది మరణించారు. నలుగురు ప్రాణాలతో బయటపడగా.. వరదలో గల్లంతైన మరో నలుగురి జాడ తెలియాల్సి ఉంది. జూన్‌ 27వ తేదీన జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.పంజాబ్‌ సియాల్‌కోట్‌కు చెందిన ఓ కుటుంబం మరికొందరు దగ్గరి బంధువులతో కలిసి ఖైబర్‌ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఫిజాఘట్‌ వద్ద స్వాత్‌ లోయకు పిక్నిక్‌కు వచ్చింది. ఉదయం 8గం.ప్రాంతంలో అల్పాహారం చేస్తుండగా.. పిల్లలు, మహిళలు కొందరు నదీ సమీపంలోకి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సమయంలో స్వాత్‌ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో వాళ్లను బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో.. అంతా వరదలో చిక్కుకున్నారు. ఈలోపు అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు సహాయం కోసం అధికారులకు సమాచారం అందించారు. అయితే రెండు గంటలు గడిచినా.. సహాయక బృందాలు అక్కడికి రాలేదు. ఈలోపు వరద అంతకంతకు పెరగడం.. వాళ్లు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఓ పెద్ద రాయి మీద నిలబడి సాయం కోసం ఆశగా ఎదురు చూశారు. నీళ్లలో జారిపోతున్న తమ వాళ్లను రక్షించుకునేందుకు చివరిదాకా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. మొత్తం 18 మంది అంతా చూస్తుండగానే వరదలో కొట్టుకుపోగా.. నలుగురిని స్థానికులు అతికష్టం మీద రక్షించగలిగారు. ఇప్పటిదాకా 10 మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు విమర్శిస్తుండగా.. ప్రతికూల వాతావరణంతోనే రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్ట లేకపోయామని అధికారులు వివరణలు ఇస్తున్నారు. అయితే ఎగువన వర్షాలతో స్వాత్‌ నదికి వరద క్రమక్రమంగానే పెరిగిందని.. అధికారులు అప్రమత్తం చేసి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవని అక్కడి మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. క్రికెట్‌ గ్రౌండ్లను ఆరబెట్టేందుకు సైనిక హెలికాఫ్టర్లను ఉపయోగించిన పాక్‌ ప్రభుత్వం.. సకాలంలో స్పందించి ఉంటే వాళ్లందరి ప్రాణాలు దక్కి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ వీడియో నెట్‌లో వైరల్‌ అవుతుండడంతో.. విమర్శలు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి.ప్రాణాల కోసం పోరాడిన ఆ వీడియోను మీరూ చూసేయండి. A Country where helicopter reaches to dry the Cricket ground in few minutes. Yet can't reach in Several hours to save human lives. #Swat pic.twitter.com/vJAPDQnPJ6— Aima Khan (@aima_kh) June 27, 2025

Security Guard Arrested In Kolkata Law College Incident9
Kolkata: లా విద్యార్థిని అత్యాచారం కేసులో నాలుగో నిందితుడు అరెస్ట్‌

కోల్‌కతా: సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్‌ లా ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ దారుణంలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. విద్యార్థినిపై దారుణం జరిగిన తర్వాత కూడా ఆమెను వేధించిన కాలేజీ క్యాంపస్‌ సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది. ‌కోల్‌కతాలోని కస్బా ప్రాంత న్యాయ కళాశాలలో జూన్‌ 25న రాత్రి మొదటి సంవత్సరం లా చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్‌లోనే అత్యాచారం జరిగింది. జూలై 16న జరగనున్న సెమిస్టర్ పరీక్షల కోసం పరీక్షా ఫారాలను పూర్తి చేసేందుకు బుధవారం కాలేజీ క్యాంపస్‌కు వచ్చింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్‌ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్‌ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్‌ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్‌ గేట్‌కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు.మా కాలేజీలో ఫస్టియర్‌ చదువుతున్న జయీబ్‌ అహ్మద్‌ (19), ప్రమీద్‌ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్‌ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్‌ బెదిరించాడు.నా బోయ్‌ఫ్రెండ్‌కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్‌ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్‌ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు.

Rohit Sharma Allegedly Once Dated An Actress Turned Nun Is It True10
రితికా కంటే ముందు ఆమెతో ప్రేమలో రోహిత్‌?.. నన్‌గా మారిన నటి?!

టీమిండియా వన్డే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్‌ ఓనమాలు దిద్దిన స్టేడియం పిచ్‌పైనే మోకాళ్లపై కూర్చుని ప్రేయసి రితికా (Ritika Sajdeh)కు ప్రేమను వ్యక్తపరిచినట్లు వెల్లడించాడు. ఆమె కూడా సంతోషంగా ఒప్పుకోవడంతో ఇద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని రోహిత్‌ శర్మ తన రొమాంటిక్‌ ప్రపోజల్‌ గురించి చెబుతూ నవ్వులు చిందించాడు.ఇద్దరు పిల్లలు.. ముచ్చటైన కుటుంబంమాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ అతడి భార్య గీతా బస్రా కలిసి నిర్వహిస్తున్న యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భార్య రితికాతో కలిసి హాజరైన రోహిత్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. కాగా రోహిత్‌- రితికా చాలా ఏళ్ల పాటు డేటింగ్‌ చేసి.. 2015, డిసెంబరు 13న పెళ్లిపీటలు ఎక్కారు. వీరికి కూతురు సమైరా, కుమారుడు అహాన్‌ సంతానం.తెరపైకి సోఫియా హయత్‌ పేరుఇక రోహిత్‌ శర్మ తన ప్రేమకథ గురించి వివరించిన నేపథ్యంలో గతంలో అతడు డేటింగ్‌ చేసిన అమ్మాయిల గురించి కూడా సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో ప్రధానంగా తెరపైకి వచ్చిన పేరు సోఫియా హయత్‌ (Sofia Hayat).లండన్‌లో కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా సోఫియా- రోహిత్‌లకు పరిచయమైంది. తొలిచూపులోనే రోహిత్‌ను ఇష్టపడ్డ సోఫియా అతడితో డేటింగ్‌ చేసిందనే ప్రచారం ఉంది. అయితే, ప్రేమలో ఉన్నపుడు ఇద్దరూ కూడా ఈ విషయం గురించి బయటపెట్టలేదు. కానీ.. మీడియాలో వీరి గురించి వార్తలు రాగా.. 2012లో సోఫియా స్వయంగా స్పందించింది.నేను రోహిత్‌ శర్మతో డేటింగ్‌ చేశా‘‘ఇకనైనా వదంతులకు స్వస్తి పలుకుదాం. అవును.. నేను రోహిత్‌ శర్మతో డేటింగ్‌ చేశా. కానీ ఇప్పుడు అదంతా ముగిసిపోయింది.. ఇకపై జీవితంలో అతడితో మరోసారి డేటింగ్‌ చేయను. ఈసారి నేను మనసున్న మంచి వ్యక్తి కోసం మాత్రమే ఎదురుచూస్తున్నా’’ అని సోఫియా ట్వీట్‌ చేసింది.అందుకే బ్రేకప్‌ చెప్పానుఅంతేకాదు.. రోహిత్‌ శర్మతో తన బంధం ముగిసిపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘అతడు మంచివాడు. కలిసి ఉన్నపుడు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. అయితే, అతడు బిడియస్తుడు. హోటల్స్‌, రూమ్స్‌ దగ్గర మేము మీడియా కంటపడకూడదని భావించేవాళ్లం.కానీ మీడియాకు టిప్‌ అందింది. అపుడు మా మేనేజరే ఈ విషయం గురించి స్పందించారు. రోహిత్‌తో ఉన్న నాకున్న రిలేషన్‌పై గౌరవంతో నేనూ ఏమీ మాట్లాడలేదు. కానీ ఓసారి రోహిత్‌ మీడియాతో మాట్లాడుతున్నపుడు నా గురించి ప్రశ్న ఎదురుకాగా.. నేను కేవలం తన అభిమానిని మాత్రమే అని చెప్పాడు.దాంతో నేను చాలా బాధపడ్డాను. అందుకే అతడితో బ్రేకప్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతడితో ఉన్న అన్ని రకాల కాంటాక్టులను చెరిపివేశా’’ అని సోఫియా గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. పెదవి విప్పని రోహిత్‌అయితే, రోహిత్‌ మాత్రం ఆమెతో ప్రేమ, బ్రేకప్‌ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే.. వివాదాలకు కేరాఫ్‌ అయిన సోఫియా.. విరాట్‌ కోహ్లి కోసం తాను రోహిత్‌ను వదిలేశానంటూ మరో ట్వీట్‌ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆమె ప్రచారం కోసమే ఇదంతా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.నటి నుంచి నన్‌గా?సోఫియా హయత్‌ బ్రిటిష్‌ మోడల్‌, సింగర్‌. ఆ తర్వాత టెలివిజన్‌ రంగంలోకి ప్రవేశించింది. హిందీ బిగ్‌బాస్‌ 7లో సోఫియా పాల్గొంది. 2013లో బిగ్‌ బ్రదర్‌ ఇండియన్‌ వర్షన్‌లోనూ తళుక్కుమంది. అయితే, 2016లో అందరికీ షాకిస్తూ... ఆధ్యాత్మిక బాటలో నడుస్తూ.. నన్‌గా మారినట్లు ప్రకటించింది. తన పేరును గైయా సోఫియా మదర్‌గా మార్చుకుంది. యోగా టీచర్‌, హీలర్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో పేర్కొంది.చదవండి: ధావన్‌పై మండిపడ్డ రోహిత్‌ శర్మ.. షాకింగ్‌ విషయం బయటపెట్టిన గబ్బర్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement