ప్రధాన వార్తలు

ఒక్క రోజులో 16 సూర్యోదయాలు: శుభాంశు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్)లో కి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో ప్రభాని నరేంద్ర మోదీతో జరిపిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ఈరోజు(శనివారం, జూన్ 28వ తేదీ) శుభాంశు శుక్లాతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. తొలుత శుభాంశును విష్ చేసిన ప్రధాని మోదీ.. ‘ఇది శుభ్ ఆరంభ్ అని, ఇది నయా శకం’ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మోదీ.. గొప్ప ఘనతను సాధించావంటూ కొనియాడారు. దానికి శుభాంశు బదులిస్తూ ఇది తన ఒక్కడి విజయం కాదని, భారత్ విజయమని వినమ్రతను చాటుకున్నారు. PM @narendramodi interacted with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station. pic.twitter.com/Q37HqvUwCd— PMO India (@PMOIndia) June 28, 2025 అదే సమయంలో అక్కడ ఎలా ఉంది అని మోదీ అడగ్గా... ఇక్కడ వాతావరణం అంతా భిన్నంగా ఉందని శుభాంశు తెలిపారు. ఈ కక్ష నుంచి చూస్తే భారత్ చాలా స్పెషల్గా కనిపిస్తుందని శుభాంశు స్పష్టం చేశారు. ఇక్కడ రోజుకు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలుగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ కక్షలో పరిస్థితులకు అలవాటు పడుతున్నామని, నిద్ర పోవడం అనేది చాలా పెద్ద చాలెంజ్గా ఉందన్నారు. ఇక్కడ గ్రావెటీ లేమి కారణంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయని శుభాంశు తెలిపారు. తల కాస్త భారంగా ఉంటుందని, ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయని, ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులేనని తెలిపారు. మీ యొక్క ఆశీర్వాదంతో ఐఎస్ఎస్లో అతి సులభంగా అడుగుపెట్టానని పేర్కొన్నారు శుభాంశు. ఇక ఐఎస్ఎస్ నుంచి భారత్ చాలా పెద్దదిగా కనిపిస్తుందని, మ్యాప్ కంటే భిన్నంగా ఉందని మోదీ పేర్కొనగా, ఇక్కడ నుంచి చూస్తే భారత్ చాలా స్పెషల్గా కనిపిస్తుందని శుభాంశు తెలిపారు. ఇలా పలు విషయాలను పంచుకుంటూ ప్రధాని మోదీ-శుభాంశుల సంభాషణ కొనసాగింది. #WATCH | Prime Minister Narendra Modi interacts with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station.PM Modi says "Today, you are away from our motherland, but you are the closest to the hearts of Indians...Aapke naam mein bhi shubh hai aur aapki… pic.twitter.com/lWOk7AVlL3— ANI (@ANI) June 28, 2025

ఇంగ్లండ్ను పేకమేడలా కూల్చి.. భారత్ గ్రాండ్ విక్టరీ!
నాటింగ్హామ్: ఐదు మ్యాచ్ల ట్వంటీ 20 సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన తొలి పోరులో భారత మహిళలు గ్రాండ్ విక్టరీ సాధించారు. తొలుత బ్యాటింగ్లో సత్తా చాటిన భారత్ మహిళలు.. ఆపై బౌలింగ్లో విజృంభించి ఇంగ్లండ్ను 14.5 ఓవర్లలో 113 పరుగులకే నేలకూల్చి 97 పరుగుల తేడాతో అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నారు.భారత బౌలర్లలో శ్రీచరణి నాలుగు వికెట్లు సాధించగా, రాధా యాదవ్, దీప్తి శర్మలు తలో రెండు వికెట్లతో ఇంగ్లండ్ నడ్డివిరిచారు. ఇంగ్లండ్ మహిళా బ్యాటర్లలో కెప్టెన్ స్కీవర్ బ్రంట్(66) అర్థ శతకం మినహా ఎవరూ రాణించలేదు.అంతకుముందు భారత మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) అద్భుత శతకంతో మెరిసింది. ఆది నుంచి నిలకడగా ఆడిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ యాభై ఒక్క బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుంది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో స్మృతికి ఇదే తొలి శతకం కావడం విశేషం. దీంతో ఆనందంలో మునిగిపోయిన స్మృతి హెల్మెట్ తీసి.. బ్యాట్ చూపిస్తూ నవ్వులు చిందిస్తూ సెలబ్రేట్ చేసుకుంది.ఇంగ్లండ్ పర్యటనలో..కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు భారత మహిళా జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత టీ20 సిరీస్ జరుగనుండగా.. శనివారం నాటి తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షఫాలీ వర్మ (20) స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ స్మృతి మంధాన.. వన్డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దింది.51 బంతుల్లో సెంచరీఈ క్రమంలో స్మృతి మంధాన 51 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. హర్లీన్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైంది. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్ (8) త్వరగానే పెవిలియన్ చేరగా.. జెమీమా రోడ్రిగెస్ డకౌట్ అయింది. ఇక స్మృతి మొత్తంగా 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు చేసి.. సోఫీ ఎక్లిస్టోన్ బౌలింగ్లో నాట్ సీవర్- బ్రంట్కు క్యాచ్ ఇచ్చి అవుటైంది.ఇంగ్లండ్క్ష్యం 211అమన్జోత్ కౌర్ 3, దీప్తి శర్మ ఏడు పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఇక స్మృతి అద్భుత శతకం ఫలితంగా.. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసింది. ఇంగ్లండ్కు భారీ లక్ష్యం విధించింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. ఎమ్ ఆర్లోట్, సోఫీ ఎక్లిస్టోన్ ఒక్కో వికెట్ తీశారు.కాగా టీ20లలో భారత మహిళా జట్టుకు ఇది రెండో అత్యుత్తమ స్కోరు. ఇంతకు ముందు ముంబై వేదికగా వెస్టిండీస్పై భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.

‘నీ అంతు చూస్తా’.. మహిళా ప్రిన్సిపల్కు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు
అనకాపల్లి,సాక్షి: కస్తుర్బా కాలేజీ ప్రిన్సిపల్ని చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు బెదిరింపులు గురి చేశాడు. ఎమ్మెల్యే రాజు బెదిరింపులతో ప్రిన్సిపల్ అన్నపూర్ణ గుండెపోటుకు గురయ్యారు. ‘ఎమ్మెల్యే రాజు నా అంతుచూస్తానని బెదిరించారు. 50 మంది మగాళ్ళ మధ్య నన్ను దూషించారు. కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగిన వదిలేది లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా స్కూల్లో సీట్ల కేటాయింపు జరిగిందని చెప్పా. అయినా, ఎమ్మెల్యే వినకుండా దూషించారు. ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరించారని’ వాపోయారు. ఇటా ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మహిళపట్ల దరుసు ప్రవర్తన ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చనీయాంశంగా మారాయి. ‘చంద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని తాను సీఎంకు చెప్పానని అన్నారాయన. ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తే డాబాలకు వెళ్లి బిరియానీలు తింటున్నారు. ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసి మందు తాగుతున్నారు అని అన్నారాయన. అక్కడితో ఆగకుండా.. ‘‘పథకాల వల్లే.. ఆడవాళ్లు ఇంట్లో వంట మానేస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి అలవాటు పడుతున్నారు. ఇచ్చిన డబ్బులతో చిల్లర ఖర్చులు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా బట్టలు కొనుక్కుంటున్నారు అంటూ తన నోటి దురుసును కొనసాగించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు ఎమ్మెల్యే రాజు క్షమాపణలు చెప్పాలని రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

మనీ రూల్స్ మారుతున్నాయ్.. జూలైలో కొత్త మార్పులు
జూన్ నెల ముగుస్తోంది.. ఇక జూలై నెల ప్రారంభమవుతోంది. ఈ క్రమంలో ఆర్థిక సంబంధిత నిబంధనలు కొన్ని మారుతున్నాయి.. కొత్త మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు మొదలుకొని పెద్ద వ్యాపార సంస్థల వరకూ ప్రభావితం చేసే అవకాశం ఉంది.సవరించిన యూపీఐ చార్జ్ బ్యాక్ నిబంధనలు, కొత్త తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ నిబంధనలు, పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఆధార్ అవసరం వంటి కొన్ని మనీ రూల్స్, మార్పులు జూలై నుంచి అమలవుతున్నాయి.యూపీఐ ఛార్జ్ బ్యాక్ నిబంధనలుఈ ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఇటీవల యూపీఐ ఛార్జ్ బ్యాక్ నిబంధనల్లో మార్పులు ప్రకటించింది.ప్రస్తుత విధానం ప్రకారం, ఛార్జ్ బ్యాక్ అభ్యర్థన తిరస్కరణకు గురైనప్పుడు, చట్టబద్ధమైన సందర్భాల్లో కూడా యూపీఐ రిఫరెన్స్ కంప్లయింట్స్ సిస్టమ్ (యూఆర్సీఎస్) ద్వారా కేసును వైట్లిస్ట్ చేయడానికి బ్యాంక్ ఎన్పీసీఐని సంప్రదించాల్సి ఉండేది.జూన్ 20న చేసిన ప్రకటన ప్రకారం.. ఇటువంటి సందర్భాల్లో ఇకపై ఎన్పీసీఐ జోక్యం అవసరం లేదు. ఎన్పీసీఐ నుండి అనుమతి కోసం వేచి ఉండకుండా ఆర్థిక సంస్థలు నేరుగా ప్రామాణిక తిరస్కరణకు గురైన ఛార్జ్ బ్యాక్ లను రీప్రాసెసింగ్ కు అర్హులుగా వర్గీకరించవచ్చు.కొత్త పాన్ కార్డులకు ఆధార్ తప్పనిసరిజూలై 1 నుంచి కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి. ఇంతకుముందు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి ఏదైనా చెల్లుబాటు అయ్యే ఐడీ కార్డ్, జనన ధృవీకరణ పత్రం ఉంటే సరిపోయేది. కానీ జూలై 1 నుంచి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్జూలై నుంచి పలు తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. జూలై 1 నుండి ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా దాని మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ రైలు టిక్కెట్లకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి.జూలై 15 నుంచి తత్కాల్ రైలు టికెట్ బుకింగ్స్కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) అవసరం. అంటే టికెట్లు బుక్ చేసేటప్పుడు వినియోగదారుల ఫోన్లకు ఒక కోడ్ వస్తుంది. కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) కౌంటర్లలో బుక్ చేసుకునే తత్కాల్ టికెట్లకు కూడా ఓటీపీ అథెంటికేషన్ అవసరం.తత్కాల్ టికెట్ల బుకింగ్కు సంబంధించి అధీకృత టికెటింగ్ ఏజెంట్లకు భారతీయ రైల్వే సమయ పరిమితిని ప్రవేశపెట్టింది. బుకింగ్ విండో తెరిచిన మొదటి 30 నిమిషాలు వారు టికెట్లు బుక్ చేయలేరు. ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్లకు ఉదయం 10:00 గంటల నుంచి 10:30 గంటల వరకు, నాన్ ఏసీ క్లాస్ తత్కాల్ టికెట్లకు ఉదయం 11:00 గంటల నుంచి 11:30 గంటల వరకు పరిమితి ఉంటుంది.జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ నిబంధనలుజూలై నుండి నెలవారీ జీఎస్టీ చెల్లింపు ఫారం జిఎస్టిఆర్ -3 బి ఎడిట్ చేసేందుకు వీలుండదని జీఎస్టీఎన్ జూన్ 7న ప్రకటించింది. అలాగే గడువు తేదీ నుంచి మూడేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత జీఎస్టీ రిటర్నులను దాఖలు చేయడానికి కూడా అవకాశం ఉండదని జీఎస్టీఎన్ తెలిపింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఫీజు, రివార్డు మార్పులుహెచ్డీఎఫ్సీ బ్యాంక్ రివార్డ్స్ ప్రోగ్రామ్కు కొత్త క్రెడిట్ కార్డు ఫీజులు, అప్డేట్లను ప్రకటించింది. ఇవి జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. రూ.10,000 కంటే ఎక్కువ నెలవారీ ఖర్చులపై 1% రుసుము, రూ .50,000 కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లు చెల్లింపులు, రూ .10,000 కంటే ఎక్కువ ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలు, అద్దె చెల్లింపులు, రూ .15,000 ఇంధన చెల్లింపులు, థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసే విద్య సంబంధిత చెల్లింపులు ఈ మార్పులలో ఉన్నాయి. ఈ ఛార్జీలను గరిష్టంగా రూ.4,999గా నిర్ణయించారు. అలాగే ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలకు రివార్డ్ పాయింట్లు అందుబాటులో ఉండవు. బీమా రివార్డ్ పాయింట్లపైనా నెలవారీ పరిమితి ఉంటుంది.

ఈ-స్టాంపుల కుంభకోణం.. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు సహా ముగ్గురి అరెస్ట్
సాక్షి,అనంతపురం: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ ఈ–స్టాంపుల కుంభకోణాన్ని పోలీసులు చేధించారు. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముఖ్య అనుచరుడు ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణం గురించి ఎస్పీ జగదీష్ మీడియాతో మాట్లాడారు.టీడీపీ నేత ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు 15 వేల నకిలీ ఈ-స్టాంపులు తయారు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 100 రూపాయల స్టాంప్ల సున్నాలు మార్చి లక్ష రూపాయల స్టాంప్గా నిందితులు మార్చారు. ఫోటో షాప్లో ఎడిట్ చేసి నకిలీ ఈ-స్టాంపులు తయారు చేసినట్లు తేలింది. టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ సంస్థకు టీడీపీ నేత ఎర్రన్న అలియాస్ మీసేవ బాబు 481 నకిలీ ఈ-స్టాంపులు విక్రయించిన ఆధారాలు సేకరించారు. కంప్యూటర్లు, ప్రింటర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదీ అసలు కథఇదో భారీ కుంభకోణం! ఓ దళారీని అడ్డుపెట్టుకుని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఫోర్జరీతో రూ.వందల కోట్ల మేర బ్యాంకు రుణాలు కాజేసిన ఓ కంపెనీ దీన్ని కప్పిపుచ్చుకునేందుకు కట్టు కథలు చెబుతోంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, తప్పుడు ఈ – స్టాంప్లతో బ్యాంకులు, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాలను మోసం చేసిన ఓ టీడీపీ ఎమ్మెల్యే నిర్వాకం ఇదీ!! తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు తీసుకుని బ్యాంకులను మోసం చేశారు. ఆస్తుల విలువను అధికంగా చూపించి ఫేక్ పత్రాలు సృష్టించారు.టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలుఅనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ బ్యాంకు రుణాలు తీసుకుని ఈ – స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో భారీ కుంభకోణానికి పాల్పడింది. ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో దీన్ని ఓ దళారీపై నెట్టేసి బయటపడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నానా తంటాలు పడుతున్నారు. ఈ స్కామ్లో కీలక పాత్రధారి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర అనుచరుడు బోయ ఎర్రప్ప అలియాస్ ‘మీ–సేవ బాబు’! టీడీపీ ప్రజా ప్రతినిధి అండదండలు లేకుంటే ఓ సాధారణ మీ–సేవా కేంద్రం నిర్వాహకుడు ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఈ స్టాంప్ల కోసం మీ–సేవ సెంటర్ నిర్వాహకుడు బాబుతో టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర సన్నిహిత సంబంధాలు నెలకొల్పాడు. ‘మీ–సేవ బాబు’ కూడా టీడీపీ కుటుంబ సభ్యుడే! మహానాడులో కూడా పాల్గొన్నాడు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు ఎమ్మెల్యే సురేంద్ర ఇంట్లో మనిషిలా మీసేవ బాబు వ్యవహరిస్తుంటాడు. ఈ కుంభకోణం వివరాలివీ...బ్యాంకు నుంచి రూ.900 కోట్ల రుణంటీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఈ ఏడాది యూనియన్ బ్యాంకు నుంచి రూ.900 కోట్ల మేర రుణం తీసుకుంది. ఆస్తులు తనఖా పెట్టి ఆ గ్యారెంటీతో రుణాలు తీసుకోవాలి. దీని కోసం ముందుగా స్టాంప్డ్యూటీ చెల్లించి తనఖా వివరాలు పొందుపరిచి ఈ–స్టాంప్ పొందాలి. రిజి్రస్టేషన్ ఫీజు, యూజర్ చార్జీలు చెల్లించాలి. బ్యాంకు రుణంలో 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కింద కంపెనీ కట్టాలి. అంటే రూ.900 కోట్ల రుణానికి రూ.4.5 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. అయితే ఎస్ఆర్సీ మాత్రం నాలుగు డాక్యుమెంట్ల ద్వారా మొత్తం రూ.1,51,700 మాత్రమే చెల్లించింది. అంటే రూ.4,48,48,300 మేర స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖను మోసగించింది! మోసం చేశారిలా.. ఈ–స్టాంప్లో 0.5 శాతం చెల్లించాల్సిన మొత్తాన్ని స్వల్పంగా చూపించి డాక్యుమెంట్ను మీ–సేవ బాబు జనరేట్ చేస్తాడు. జనరేట్ అయిన డాక్యుమెంట్లో స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని ఫ్యాబ్రికేట్ చేసి నిబంధనల ప్రకారం ఎంత చెల్లించాలో ఆ మొత్తాన్ని ఎంటర్ చేసి మరో ప్రింట్ తీసి కంపెనీ ప్రతినిధులకు అందించాడు. దీన్ని బ్యాంకులకు సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకున్నారు. ఇలా స్టాంప్ డ్యూటీ చెల్లింపులో కుంభకోణానికి పాల్పడ్డారు. తప్పుడు ఈ – స్టాంప్ పత్రాలను సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకోవడం ద్వారా బ్యాంకును, ఆర్బీఐని మోసగించారు.టాటా క్యాపిటల్స్ రుణాల్లోనూ ఇదే స్కామ్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ టాటా క్యాపిటల్స్ నుంచి రూ.20 కోట్లు రుణం తీసుకునేందుకు 2024 నవంబర్ 7న ఈ–స్టాంప్ డ్యూటీ చెల్లించారు. దీనికి కేవలం రూ.200 మాత్రమే ఈ–స్టాంప్ డ్యూటీ కట్టారు. ఈ డాక్యుమెంట్లో స్టాంప్డ్యూటీ మొత్తాన్ని ఎడిట్ చేసి 0.5 శాతం చొప్పున రూ.10 లక్షలుగా అంకెలు మార్చి టాటా క్యాపిటల్స్కు సమర్పించారు. ఈ విధంగా బ్యాంకు రుణాల్లో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కుంభకోణానికి పాల్పడింది. స్టాంప్ డ్యూటీ కుంభకోణంపై ఆధారాలతో ఫిర్యాదు అందడంతో స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో పాటు స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ అధికారులు దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యేకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రతినిధులు రంగంలోకి దిగారు. కంపెనీ ప్రతినిధులు తనకు డబ్బులు ఇచి్చనట్లు, అయితే తానే ఆ డబ్బులు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడినట్లు ఈ–సేవా నిర్వాహకుడు బాబుతో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతో పాటు ఓ ఆడియో రికార్డును కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.బుకాయిస్తే మాత్రం దాగుతుందా..! స్టాంప్ డ్యూటీ చెల్లింపులకు సంబంధించి కంపెనీ చెక్ ఇచ్చి ఉండాలి. లేదంటే ఆర్టీజీఎస్, డీడీతో పాటు ఏ రకమైనా చెల్లింపులైనా వైట్మనీగానే చెల్లించాలి. ఎస్ఆర్ కంపెనీ ఆ రకమైన చెల్లింపులు చేయలేదు. దీంతో మీ–సేవా బాబుకు తాము డబ్బులు ఇచ్చామని బలవంతంగా ఒప్పించినా, అందులో వాస్తవం లేదని బహిర్గతం అవుతుంది. కంపెనీ మోసం బట్టబయలవుతుంది. ఈ రెండు రుణాలు మాత్రమే కాదని, తప్పుడు ఈ–స్టాంప్ పత్రాలతో చాలా రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఫేక్ ఈ–స్టాంపు పేపర్లను విక్రయించిన మీసేవ బాబు, ఆయన భార్య కట్టా భార్గవిపై అనంతపురం టూ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రతినిధి గుంటూరు సతీష్బాబు పేర్కొన్నారు. తమ అకౌంట్స్ విభాగం డాక్యుమెంట్లను పరిశీలించగా ఈ–స్టాంపుల ఫోర్జరీ వెలుగులోకి వచ్చిందన్నారు. మీ–సేవ బాబు అలియాస్ బోయ ఎర్రప్ప, కట్టా భార్గవిపై బీఎన్ఎస్ 318(4), 338, 340, ఆర్/డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

సింగిల్గా అయితే సీన్ సితారే
ఎవరెన్ని అనుకున్నారు.. భారీ మెజారిటీతో గెలిచాం అని లోలోన చంకలు గుద్దుకుంటున్నప్పటికి.. కూటమి నాయకులకు మాత్రం ఇంకా వైఎస్ జగన్ అంటే భయం పోలేదు. జగన్కు జనంలో ఉన్న మాస్ ఇమేజ్ కూటమి నాయకులకు నిద్రలేకుండా చేస్తుంది. జగన్ ఇల్లు దాటడం లేదని ఓవైపు అంటూనే ఆయన వీధిలోకి వస్తే జనసంద్రం ఎలా ఉంటుందో చూసి లోలోన టీడీపీ, జనసేన నాయకులు కుళ్ళు కుంటున్నారు.మొన్న ఏదో మూడు పార్టీల మధ్య పొత్తు కలిసి వచ్చి అలా గెలిచేసారు కానీ అన్ని సందర్భాల్లోనూ ఇదే ఫార్ములా వర్కౌట్ అవుతుందని చెప్పలేం అని సాక్షాత్తు కూటమి నాయకులే ఒప్పుకుంటున్నారు. ఓకే కాంబినేషన్తో మళ్లీ మళ్లీ వస్తే సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ లేదని వాళ్ళే అంగీకరిస్తున్నారు. అన్నిటికి మించి మూడు పార్టీల మధ్య పొత్తు ఉంటే తప్ప విడివిడిగా పోటీ చేస్తే వైఎస్ జగన్ అలవోకగా అధికారాన్ని చేపడతారని తెలుగుదేశానికి వంతపాడే మీడియా సంస్థలు కూడా అంగీకరిస్తున్నాయి.నిత్యం వైఎస్ జగన్ను ఆడిపోసుకునే ఓ చానల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఒంటరిగా పోటీ చేస్తే కూటమికి చావు దెబ్బ తప్పదని అంగీకరించారు. మరోవైపు సూపర్ సిక్స్ హామీలు ఏవి అమలు చేయకుండా కేవలం మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా హైప్ తెచ్చుకొని తెచ్చుకొని అంతా బాగుందని చెప్పుకుంటాను కూటమి నాయకులకు.. దాని పెయిడ్ మీడియాకు కూడా సమాజంలో ఏం జరుగుతుందో అన్న విషయం స్పష్టంగా తెలుసు. ఎన్నికలకు ముందు నోటికి వచ్చిన హామీలు ఇచ్చి.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏమాత్రం ఆధారాలు లేని అభాండాలు వేసి రకరకాల మాయలు చేసి గెలిచిన కూటమి నాయకులు ఇప్పటికే ప్రజల్లో చులకన అయ్యారు.హామీలు ఎగ్గొట్టడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దండాలు దోపిడీలు రౌడీయిజం ప్రతిపక్ష నాయకుల మీద దాడులు అరాచకం మినహా ఇంకేమీ పనులు చేయకపోవడంతో ప్రజలకు సైతం ప్రభుత్వం మీద అసహ్యం మొదలైంది. మొదటి ఏడాదిలోనే ఇంత వెగటు పుడితే రానున్న నాలుగేళ్లలో ఇది మరింత ముదిరి కూటమి నాయకులను తన్ని తరిమేసే పరిస్థితికి వస్తుందని వారికి అర్థమైంది. ఒకసారంటే వీరి మాటలు ప్రజలు నమ్మారు కానీ మళ్ళీ మళ్ళీ అవే హామీలు అవే మోసకారి మాటలు చెబితే ప్రజలు నమ్మి నెత్తిన పెట్టుకోరు అనే విషయం కూటమి నాయకులతో పాటు ఆ మీడియాకు సైతం ఎప్పటికే అర్థమైంది.అంతేకాకుండా ఇటీవల పలు ప్రైవేట్ సంస్థలు చేసిన సర్వేల్లో కూడా దాదాపుగా 50 శాతం మంది ఎమ్మెల్యేలకు రెండోసారి గెలిచే అవకాశం లేదని తేలడంతో వారు ఇప్పుడు బిత్తిరి చూపులు చూస్తున్నారు. ఏదైతేనేం ఉన్న ఈ నాలుగేళ్లు ఉన్న కాడికి దండుకుందాం అనే టార్గెట్తో చాలామంది ఎమ్మెల్యేలు సహజం వనరులతో పాటు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దందా చేస్తూ సొమ్ములు వెనకేస్తున్నారు.ఈ పరిస్థితి కూడా కూటమి మీడియాకు తెలుసు.. అందుకే తాజాగా జరిగిన డిబేట్లో ఓ యాంకర్ సైతం ఇదే విషయాన్ని చెప్పలేక చెప్పలేక కుమిలిపోతూ చెప్పారు. కూటమి పొత్తులో లేకపోతే వైఎస్ జగన్ నిలువరించడం అసాధ్యం అని యాంకర్తో పాటు రఘురాం కృష్ణంరాజు సైతం అంగీకరించారు. ఏడాదిలోనే వారి పాలనపై వారికే నమ్మకం కోల్పోవడంతో.. ప్రజల ఇప్పుడు వైఎస్ జగన్పై దృష్టిసారించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు మరింత వివరించి వారి మద్దతు కూడగట్టుకునేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా సమాయత్తం అవుతున్నాయి..* సిమ్మాదిరప్పన్న

నితీశ్ రెడ్డి కాదు!.. శార్దూల్ స్థానంలో అతడే సరైనోడు: భారత మాజీ క్రికెటర్
ఇంగ్లండ్తో రెండో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. ఎవరిపై వేటు వేస్తారు? ఎవరికి కొత్తగా అవకాశం ఇస్తారు?.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?.. అన్న అంశాలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)ని టీమిండియా పరాజయంతో మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా లీడ్స్లో జరిగిన తొలి మ్యాచ్లో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటర్లు ఫర్వాలేదనిపించినా.. బౌలర్లు విఫలమయ్యారు. ఇక ఫీల్డింగ్లో అయితే టీమిండియా చెత్త ప్రదర్శన కనబరిచింది. ఏకంగా ఆరు క్యాచ్లు డ్రాప్ చేసి.. మూల్యం చెల్లించింది.శార్దూల్ విఫలం.. నితీశ్ రెడ్డికి అవకాశం?ఇక ఈ మ్యాచ్ సందర్భంగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇటు లోయర్ ఆర్డర్లో.. అటు బౌలింగ్లో అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్లో కలిపి ఐదు పరుగులు చేసిన శార్దూల్.. మొత్తంగా రెండు వికెట్లు తీశాడు.ఆల్రౌండర్గా రాణిస్తాడనుకుంటే.. అతడి వల్ల ఉపయోగం లేకుండా పోయిందంటూ మాజీ క్రికెటర్లు సైతం శార్దూల్ను విమర్శించారు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో అతడిపై వేటు పడే అవకాశం ఉందని.. అతడి స్థానంలో ఆంధ్ర యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి జట్టులోకి వస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు.నితీశ్ కాదు!.. శార్దూల్ స్థానంలో అతడే కరెక్ట్!అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘రెండో టెస్టు నుంచి శార్దూల్ ఠాకూర్ను తప్పిస్తారనే అనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే అతడి స్థానాన్ని బౌలర్తోనే భర్తీ చేయాలి.ప్రసిద్ కృష్ణ సంగతి పక్కనపెడితే.. వైవిధ్యం కోసం పేసర్ అర్ష్దీప్ సింగ్ను లేదంటే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుదిజట్టులోకి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఏదేమైనా పిచ్ స్వభావాన్ని బట్టే వీరిద్దరిలో ఒకరు ఫైనల్ అవుతారు’’ అని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా తమిళనాడుకు చెందిన బద్రీనాథ్ 2008- 2011 మధ్య టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 63, 79, 43 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు (జూలై 2-6)కు బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదిక.ఇంగ్లండ్తో టెస్టులకు భారత జట్టు:యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా.చదవండి: ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు!

ముంచెత్తిన వరద.. సాయం కోసం 2 గంటలకు పైగా ఎదురు చూపులు
సరదాగా నది ఒడ్డుకు పిక్నిక్ వెళ్లడం ఆ కుటుంబం పాలిట శాపమైంది. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని రెండు గంటలపాటు ప్రాణాలను రక్షించుకునేందుకు పోరాడింది ఆ కుటుంబం. అయితే సకాలంలో సాయం అందక.. అధికార యంత్రాంగ వైఫల్యంతో చివరకు నదిలో కొట్టుకుపోయి విగతజీవులుగా తేలారు. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టడానికి హెలికాఫ్టర్లను ఉపయోగించే పాకిస్తాన్లో ఘోరం జరిగింది. స్వాత్ నదీ ఆకస్మిక వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది కొట్టుకుపోగా, అందులో 10 మంది మరణించారు. నలుగురు ప్రాణాలతో బయటపడగా.. వరదలో గల్లంతైన మరో నలుగురి జాడ తెలియాల్సి ఉంది. జూన్ 27వ తేదీన జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.పంజాబ్ సియాల్కోట్కు చెందిన ఓ కుటుంబం మరికొందరు దగ్గరి బంధువులతో కలిసి ఖైబర్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఫిజాఘట్ వద్ద స్వాత్ లోయకు పిక్నిక్కు వచ్చింది. ఉదయం 8గం.ప్రాంతంలో అల్పాహారం చేస్తుండగా.. పిల్లలు, మహిళలు కొందరు నదీ సమీపంలోకి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సమయంలో స్వాత్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో వాళ్లను బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో.. అంతా వరదలో చిక్కుకున్నారు. ఈలోపు అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు సహాయం కోసం అధికారులకు సమాచారం అందించారు. అయితే రెండు గంటలు గడిచినా.. సహాయక బృందాలు అక్కడికి రాలేదు. ఈలోపు వరద అంతకంతకు పెరగడం.. వాళ్లు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఓ పెద్ద రాయి మీద నిలబడి సాయం కోసం ఆశగా ఎదురు చూశారు. నీళ్లలో జారిపోతున్న తమ వాళ్లను రక్షించుకునేందుకు చివరిదాకా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. మొత్తం 18 మంది అంతా చూస్తుండగానే వరదలో కొట్టుకుపోగా.. నలుగురిని స్థానికులు అతికష్టం మీద రక్షించగలిగారు. ఇప్పటిదాకా 10 మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు విమర్శిస్తుండగా.. ప్రతికూల వాతావరణంతోనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్ట లేకపోయామని అధికారులు వివరణలు ఇస్తున్నారు. అయితే ఎగువన వర్షాలతో స్వాత్ నదికి వరద క్రమక్రమంగానే పెరిగిందని.. అధికారులు అప్రమత్తం చేసి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవని అక్కడి మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టేందుకు సైనిక హెలికాఫ్టర్లను ఉపయోగించిన పాక్ ప్రభుత్వం.. సకాలంలో స్పందించి ఉంటే వాళ్లందరి ప్రాణాలు దక్కి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ వీడియో నెట్లో వైరల్ అవుతుండడంతో.. విమర్శలు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి.ప్రాణాల కోసం పోరాడిన ఆ వీడియోను మీరూ చూసేయండి. A Country where helicopter reaches to dry the Cricket ground in few minutes. Yet can't reach in Several hours to save human lives. #Swat pic.twitter.com/vJAPDQnPJ6— Aima Khan (@aima_kh) June 27, 2025

Kolkata: లా విద్యార్థిని అత్యాచారం కేసులో నాలుగో నిందితుడు అరెస్ట్
కోల్కతా: సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ లా ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ దారుణంలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. విద్యార్థినిపై దారుణం జరిగిన తర్వాత కూడా ఆమెను వేధించిన కాలేజీ క్యాంపస్ సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది. కోల్కతాలోని కస్బా ప్రాంత న్యాయ కళాశాలలో జూన్ 25న రాత్రి మొదటి సంవత్సరం లా చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్లోనే అత్యాచారం జరిగింది. జూలై 16న జరగనున్న సెమిస్టర్ పరీక్షల కోసం పరీక్షా ఫారాలను పూర్తి చేసేందుకు బుధవారం కాలేజీ క్యాంపస్కు వచ్చింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు.మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు.నా బోయ్ఫ్రెండ్కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు.

రితికా కంటే ముందు ఆమెతో ప్రేమలో రోహిత్?.. నన్గా మారిన నటి?!
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ఓనమాలు దిద్దిన స్టేడియం పిచ్పైనే మోకాళ్లపై కూర్చుని ప్రేయసి రితికా (Ritika Sajdeh)కు ప్రేమను వ్యక్తపరిచినట్లు వెల్లడించాడు. ఆమె కూడా సంతోషంగా ఒప్పుకోవడంతో ఇద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని రోహిత్ శర్మ తన రొమాంటిక్ ప్రపోజల్ గురించి చెబుతూ నవ్వులు చిందించాడు.ఇద్దరు పిల్లలు.. ముచ్చటైన కుటుంబంమాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అతడి భార్య గీతా బస్రా కలిసి నిర్వహిస్తున్న యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భార్య రితికాతో కలిసి హాజరైన రోహిత్ ఈ విషయాన్ని వెల్లడించాడు. కాగా రోహిత్- రితికా చాలా ఏళ్ల పాటు డేటింగ్ చేసి.. 2015, డిసెంబరు 13న పెళ్లిపీటలు ఎక్కారు. వీరికి కూతురు సమైరా, కుమారుడు అహాన్ సంతానం.తెరపైకి సోఫియా హయత్ పేరుఇక రోహిత్ శర్మ తన ప్రేమకథ గురించి వివరించిన నేపథ్యంలో గతంలో అతడు డేటింగ్ చేసిన అమ్మాయిల గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో ప్రధానంగా తెరపైకి వచ్చిన పేరు సోఫియా హయత్ (Sofia Hayat).లండన్లో కామన్ ఫ్రెండ్ ద్వారా సోఫియా- రోహిత్లకు పరిచయమైంది. తొలిచూపులోనే రోహిత్ను ఇష్టపడ్డ సోఫియా అతడితో డేటింగ్ చేసిందనే ప్రచారం ఉంది. అయితే, ప్రేమలో ఉన్నపుడు ఇద్దరూ కూడా ఈ విషయం గురించి బయటపెట్టలేదు. కానీ.. మీడియాలో వీరి గురించి వార్తలు రాగా.. 2012లో సోఫియా స్వయంగా స్పందించింది.నేను రోహిత్ శర్మతో డేటింగ్ చేశా‘‘ఇకనైనా వదంతులకు స్వస్తి పలుకుదాం. అవును.. నేను రోహిత్ శర్మతో డేటింగ్ చేశా. కానీ ఇప్పుడు అదంతా ముగిసిపోయింది.. ఇకపై జీవితంలో అతడితో మరోసారి డేటింగ్ చేయను. ఈసారి నేను మనసున్న మంచి వ్యక్తి కోసం మాత్రమే ఎదురుచూస్తున్నా’’ అని సోఫియా ట్వీట్ చేసింది.అందుకే బ్రేకప్ చెప్పానుఅంతేకాదు.. రోహిత్ శర్మతో తన బంధం ముగిసిపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘అతడు మంచివాడు. కలిసి ఉన్నపుడు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. అయితే, అతడు బిడియస్తుడు. హోటల్స్, రూమ్స్ దగ్గర మేము మీడియా కంటపడకూడదని భావించేవాళ్లం.కానీ మీడియాకు టిప్ అందింది. అపుడు మా మేనేజరే ఈ విషయం గురించి స్పందించారు. రోహిత్తో ఉన్న నాకున్న రిలేషన్పై గౌరవంతో నేనూ ఏమీ మాట్లాడలేదు. కానీ ఓసారి రోహిత్ మీడియాతో మాట్లాడుతున్నపుడు నా గురించి ప్రశ్న ఎదురుకాగా.. నేను కేవలం తన అభిమానిని మాత్రమే అని చెప్పాడు.దాంతో నేను చాలా బాధపడ్డాను. అందుకే అతడితో బ్రేకప్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతడితో ఉన్న అన్ని రకాల కాంటాక్టులను చెరిపివేశా’’ అని సోఫియా గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. పెదవి విప్పని రోహిత్అయితే, రోహిత్ మాత్రం ఆమెతో ప్రేమ, బ్రేకప్ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే.. వివాదాలకు కేరాఫ్ అయిన సోఫియా.. విరాట్ కోహ్లి కోసం తాను రోహిత్ను వదిలేశానంటూ మరో ట్వీట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆమె ప్రచారం కోసమే ఇదంతా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.నటి నుంచి నన్గా?సోఫియా హయత్ బ్రిటిష్ మోడల్, సింగర్. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. హిందీ బిగ్బాస్ 7లో సోఫియా పాల్గొంది. 2013లో బిగ్ బ్రదర్ ఇండియన్ వర్షన్లోనూ తళుక్కుమంది. అయితే, 2016లో అందరికీ షాకిస్తూ... ఆధ్యాత్మిక బాటలో నడుస్తూ.. నన్గా మారినట్లు ప్రకటించింది. తన పేరును గైయా సోఫియా మదర్గా మార్చుకుంది. యోగా టీచర్, హీలర్గా తన ఇన్స్టాగ్రామ్ బయోలో పేర్కొంది.చదవండి: ధావన్పై మండిపడ్డ రోహిత్ శర్మ.. షాకింగ్ విషయం బయటపెట్టిన గబ్బర్
పాక్ మళ్లీ మొదలుపెట్టేసింది.,.!
అరంగేట్రంలోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా టీనేజర్
చిరంజీవి బర్త్డే స్పెషల్.. 19 ఏళ్ల తర్వాత అవార్డ్ సినిమా రీరిలీజ్
సింపుల్ యాప్లు.. సీక్రెట్గా దోచేస్తున్నాయ్..
బిగ్బాస్ 9లోకి కామన్ ఆడియన్స్ .. ఇలా రిజస్టర్ చేసుకోండి
‘జ్యోతి రావు ఫూలే చిత్రాన్ని రాష్ట్ర ప్రజలంతా చూడాలి’
ఇంగ్లండ్ గడ్డపై స్మృతి మంధాన విధ్వంసకర శతకం
సింగిల్గా అయితే సీన్ సితారే
మేడ్చల్ క్లస్టర్ హవా.. ఆ స్థలాలకు ఫుల్ డిమాండ్
నితీశ్ రెడ్డి కాదు!.. శార్దూల్ స్థానంలో అతడే సరైనోడు: భారత మాజీ క్రికెటర్
అమెరికాలో ఉద్యోగం మానేశా.. నాకు స్టార్ హోటల్స్లో వసతి అక్కర్లేదు: లయ
ఓటీటీలో సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసిన రెండు సినిమాలు
కన్నప్పను కాపాడిన రుద్ర!
యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన - అయినా కొనసాగిన దాడులు
Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ
బంగారం కంటే వెండి ముద్దు
ఈ రాశి వారికి ఊహించని ఉద్యోగాలు.. సంఘంలో గౌరవం
పోటీ చేసి గెలిచి పనిచేయని పార్టీలపై కూడా కొరడా ఝళిపిస్తే బావుండు!
జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అబ్బే నోబెల్ కాదు! పోరు పడలేక ఓ డూప్లికేట్ తయారుచేసి ఇచ్చాం! ఇక ఆ లోకంలోనే ఉన్నారు!
ఈ రాశి వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు
నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ ప్రవస్తి
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
బిగ్బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్?
సూర్యాపేట: ఇద్దరు ఏపీ పోలీసులు మృతి
‘కన్నప్ప’ మూవీ రివ్యూ
లయ కూతుర్ని చూశారా? ఎంత పెద్దగా అయిపోయిందో! సినిమాల్లో..
Kannappa: అన్న ఇంత బాగా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు.. మనోజ్
ఇరాన్ అణుకేంద్రాలు ద్వంసం కాలేదు-పెంటగాన్ నివేదిక
సాక్షి కార్టూన్ 28-06-2025
పాక్ మళ్లీ మొదలుపెట్టేసింది.,.!
అరంగేట్రంలోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా టీనేజర్
చిరంజీవి బర్త్డే స్పెషల్.. 19 ఏళ్ల తర్వాత అవార్డ్ సినిమా రీరిలీజ్
సింపుల్ యాప్లు.. సీక్రెట్గా దోచేస్తున్నాయ్..
బిగ్బాస్ 9లోకి కామన్ ఆడియన్స్ .. ఇలా రిజస్టర్ చేసుకోండి
‘జ్యోతి రావు ఫూలే చిత్రాన్ని రాష్ట్ర ప్రజలంతా చూడాలి’
ఇంగ్లండ్ గడ్డపై స్మృతి మంధాన విధ్వంసకర శతకం
సింగిల్గా అయితే సీన్ సితారే
మేడ్చల్ క్లస్టర్ హవా.. ఆ స్థలాలకు ఫుల్ డిమాండ్
నితీశ్ రెడ్డి కాదు!.. శార్దూల్ స్థానంలో అతడే సరైనోడు: భారత మాజీ క్రికెటర్
అమెరికాలో ఉద్యోగం మానేశా.. నాకు స్టార్ హోటల్స్లో వసతి అక్కర్లేదు: లయ
ఓటీటీలో సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసిన రెండు సినిమాలు
కన్నప్పను కాపాడిన రుద్ర!
యుద్ధం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన - అయినా కొనసాగిన దాడులు
Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ
బంగారం కంటే వెండి ముద్దు
ఈ రాశి వారికి ఊహించని ఉద్యోగాలు.. సంఘంలో గౌరవం
పోటీ చేసి గెలిచి పనిచేయని పార్టీలపై కూడా కొరడా ఝళిపిస్తే బావుండు!
జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అబ్బే నోబెల్ కాదు! పోరు పడలేక ఓ డూప్లికేట్ తయారుచేసి ఇచ్చాం! ఇక ఆ లోకంలోనే ఉన్నారు!
ఈ రాశి వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు
నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ ప్రవస్తి
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
బిగ్బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్?
సూర్యాపేట: ఇద్దరు ఏపీ పోలీసులు మృతి
‘కన్నప్ప’ మూవీ రివ్యూ
లయ కూతుర్ని చూశారా? ఎంత పెద్దగా అయిపోయిందో! సినిమాల్లో..
Kannappa: అన్న ఇంత బాగా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు.. మనోజ్
ఇరాన్ అణుకేంద్రాలు ద్వంసం కాలేదు-పెంటగాన్ నివేదిక
సాక్షి కార్టూన్ 28-06-2025
సినిమా

'ది ఫ్యామిలీ మ్యాన్' అభిమానులకు సర్ప్రైజ్
ఓటీటీలో 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్కు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. వారిని సర్ప్రైజ్ చేస్తూ తాజాగా ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. తొలి సిరీస్ 2019లో విడుదల కాగా.. రెండో సీజన్ 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సిరీస్లు సూపర్ హిట్ కావడంతో ది ఫ్యామిలీ మ్యాన్ నుంచి మూడో భాగం త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్లో మనోజ్ బాజ్పాయ్ (Manoj Bajpayee) కీలక పాత్ర పోషించారు. ఆయనకు జోడీగా ప్రియమణి నటించారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా అందుబాటులోకి రానుంది.ఈ సిరీస్ తొలి సీజన్ భారత్పై ఉగ్రవాదులు పన్నిన కుట్రలు, దాడులను అడ్డుకోవడం వంటి అంశాల చుట్టూ సాగుతుంది. రెండో సీజన్ తమిళ్ టైగర్స్పై చేసే ఆపరేషన్ వంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో సమంత కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే మూడో సీజన్.. కరోనా వ్యాక్సిన్ బ్యాక్ డ్రాప్, చైనా కుట్రలు అనే అంశంపై తీస్తామని రెండో సీజన్ చివర్లో చూపించారు. దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్ తివారీగా మనోజ్ ప్రేక్షకులను మెప్పించగా. ఆయన సతీమణిగా ప్రియమణి ఆకట్టుకున్నారు. మూడో సీజన్లో ఈ జోడి మళ్లీ కనిపించనుంది. ఆపై ఇందులో షరీబ్ హష్మీ, శ్రేయా ధన్వంతరీ, వేదాంత్ సిన్హా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

5 పెళ్లిళ్లు.. 300 సినిమాలు.. చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులేని స్థితిలో..
కరాటేలో బ్లాక్బెల్ట్.. డ్యాన్సర్, మోడల్. ఇవన్నీ కాదని నటనవైపు అడుగులు వేశాడు. 300 సినిమాలు చేశాడు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విలనిజం పండించాడు. వెండితెరపై తిరుగులేని నటుడిగా రాణించాడు. కానీ, నిజ జీవితంలో మాత్రం ఒంటరితనంతో పోరాడి పేదరికంలో మగ్గిపోయి మరణించాడు. అతడే నటుడు మహేశ్ ఆనంద్ (Mahesh Anand).కెరీర్1982లో సనమ్ తేరీ కసం మూవీలో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా పనిచేశాడు. రెండేళ్ల గ్యాప్ తర్వాత కమల్ హాసన్ 'కరిష్మా' చిత్రంతో నటుడిగా మారాడు. సస్తి దుల్హన్ మహేంగ దుల్హ చిత్రంతో హీరోగా మారాడు. అది వర్కవుట్ కాకపోవడంతో విలన్గా స్థిరపడిపోయాడు. బాలీవుడ్లో కరడుగట్టిన విలన్గా పేరు గడించిన మహేశ్ ఆనంద్.. తెలుగులో లంకేశ్వరుడు, ఎస్పీ పరశురామ్, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, అల్లుడా మజాకా, నెంబర్ వన్, బాలు వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి ఇక్కడి జనానికి దగ్గరయ్యాడు.ఐదు పెళ్లిళ్లువెండితెరపై ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఈయన వైవాహిక జీవితంలో మాత్రం విఫలమవుతూనే వచ్చాడు. మొదట బర్క రాయ్ను పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. 1987లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎరిక డిసౌజను వివాహం చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు విడాకులిచ్చేశాక 1992లో మధు మల్హోత్రాను పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అవకాశాలు దూరంఅనంతరం నటి ఉషా బచ్చనిని పెళ్లాడాడు. రెండేళ్లకే (2000-2002) వీరిద్దరూ విడిపోయారు. ఈ సమస్యలు మహేశ్ కెరీర్ను కూడా ప్రభావితం చేశాయి. 2005 తర్వాత ఆయనకు సినిమా అవకాశాలే రాలేదు. 2019లో రంగీలా రాజా అని ఒకే ఒక్క మూవీ చేశాడు. ఇదే ఆయన ఆఖరి చిత్రం. దాంపత్య జీవితంలో నాలుగుసార్లు విఫలమైన మహేశ్.. 2015లో రష్యన్ యువతి లనాను ఐదో పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత ఆమె కూడా నటుడిని వదిలేసినట్లు తెలుస్తోంది. పేదరికంలో మగ్గిన నటుడువందల సినిమాలు చేసిన మహేశ్.. దాదాపు 18 ఏళ్లపాటు కటిక పేదరికంలోనే మగ్గిపోయాడు. ఈ విషయాన్ని అతడే ఓ ఫేస్బుక్ పోస్ట్లో వెల్లడించాడు. నేను తాగుబోతునని అందరూ అంటుంటారు. నాకంటూ ఎవరూ లేరు. నా స్టెప్ బ్రదర్ రూ.6 కోట్లు తీసుకుని మోసం చేశాడు. 300కి పైగా సినిమాలు చేశా.. కానీ, ఇప్పుడు నీళ్ల బాటిల్ కొనుక్కునేందుకు కూడా డబ్బుల్లేవు. ఈ ప్రపంచంలో నాకంటూ ఒక్క స్నేహితుడు కూడా లేకపోవడం విషాదకరం అని రాసుకొచ్చాడు.మూడురోజులుగా కుళ్లిపోయిన మృతదేహం2019 ఫిబ్రవరి 9న మహేశ్ తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడు. మూడు రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి సోదరికి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వెళ్లి చూడగా నటుడు సోఫాలో శవమై కనిపించాడు. అతడి పక్కనే మందు బాటిళ్లు కూడా ఉన్నాయి. అది సహజ మరణమేనని వైద్యులు ధ్రువీకరించారు. కానీ, అప్పటికే మరణించి మూడు రోజులైనట్లు వెల్లడించారు.చదవండి: ఆ డైరెక్టర్ తిట్టాడు.. నావల్ల కాక ఏడ్చేశా: కీర్తి సురేశ్

విజయ్ దేవరకొండకి కొత్త పేరు పెట్టిన రష్మిక.. ఎంత ముద్దుగా ఉందో!
విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ప్రేమలో ఉన్నారనే గాసిప్ గత కొనేళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. వాటిపై ఇటు రష్మిక కానీ అటు విజయ్ కానీ స్పందించడం లేదు కానీ..‘అవును మేం ప్రేమలోనే ఉన్నాం’ అన్నట్లుగా అప్పుడప్పుడు హింట్ అయితే ఇస్తున్నారు. కలిసి ట్రిప్స్కి వెళ్తున్నార.. ఒకరి సినిమాపై ఒకరు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఏదైనా సినిమా ఈవెంట్స్లో ప్రేమ, పెళ్లి ప్రస్తావన వస్తే.. పరోక్షంగా తాము రిలేషన్లో ఉన్నట్లుగానే ఒప్పుకుంటున్నారు. ఒకే లొకేషన్స్ ఉన్న ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ..తమ లవ్ మ్యాటర్ని కొంచెం కొంచెం రిలీల్ చేస్తున్నారు. తాజాగా రష్మిక విజయ్కి ముద్దుగా కొత్త పేరుతో పిలిచి.. మరోసారి ప్రేమ పుకార్లకు ఆజ్యం పోసింది.వారియర్గా రష్మిక.. ఇటీవల కుబేర చిత్రంలో ప్రేక్షకులను పలకరించిన రష్మిక..ఇప్పుడు మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే మైసా. రవ్రీంద పూలే దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రష్మిక డిఫరెంట్ పాత్ర పోషిస్తుంది. తొలిసారి ఆమె వారియర్గా కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. అందులో రష్మిక వారియర్ లుక్లో కనిపించి అందరిని సర్ప్రైజ్ చేసింది. చాలా మంది సినీ తారలు మైసా పోస్టర్ లుక్పై ప్రశంసలు కురిస్తూ.. రష్మికకి ఆల్ ది బెస్ట్ చుబుతున్నారు. అలా విజయ్ దేవరకొండ కూడా మైసా ఫస్ట్లుక్ పోస్టర్ని ఇన్స్టాలో షేర్ చేస్తూ.. ‘ఈ సినిమా అద్భుతంగా ఉండనుంది’ అని రాసుకొచ్చాడు.విజ్జూ.. నువ్వు గర్వపడేలా చేస్తా విజయ్ పోస్ట్పై రష్మిక స్పందించింది. ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ.. ‘విజ్జూ.. ఈ సినిమాతో నువ్వు గర్వపడేలా చేయబోతున్నాను’ అంటూ రష్మిక రిప్లై ఇచ్చింది. విజయ్తో అలా ముద్దుగా విజ్జూ అని పిలవడంతో మరోసారి వీరి ప్రేమ వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో విజయ్కి చాలా మంది హీరోయిన్లు స్నేహితులుగా ఉన్నప్పటికీ...ఎవరూ కూడా అలా పిలవలేదు. విజయ్తో రష్మికకు స్నేహానికి మించిన బంధం ఉంది కాబట్టే అలా ముద్దుగా పిలిచిందని చాలా మంది నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

ఆ డైరెక్టర్ తిట్టాడు.. నావల్ల కాక ఏడ్చేశా: కీర్తి సురేశ్
విమర్శలు అందుకోని సెలబ్రిటీలు ఉండరు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సినిమా రూపంలో వారు విమర్శలపాలవుతూనే ఉంటారు. హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) కూడా అలా తిట్లు తినే ఇక్కడివరకు వచ్చిందట! ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఉప్పు కప్పురంబు. సుహాస్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో జూలై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ తనను బాధపెట్టిన ఓ సంఘటనను చెప్పుకొచ్చింది. ఇప్పటికీ బాగా గుర్తుకీర్తి మాట్లాడుతూ.. ప్రియదర్శన్ సర్ డైరెక్ట్ చేసిన మలయాళ చిత్రం(గీతాంజలి)తో కథానాయికగా నా జర్నీ మొదలైంది. అప్పుడు జరిగిన ఓ సంఘటన నాకు చాలా బాగా గుర్తుంది. ఓ సన్నివేశం షూటింగ్ అయ్యాక.. ఎంత చెత్తగా చేశావో తెలుసా? వెళ్లి మానిటర్ చూసుకోపో అని తిట్టాడు. నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు అది మొదటి సినిమా కావడంతో ఏడ్చేశాను. ఆయన అందరినీ అలానే అనేస్తాడు. ఆయన కూతురు, నటి కళ్యాణి ప్రిదయర్శన్ను కూడా అలాగే తిట్టేవాడు.అంతదాకా తెచ్చుకోనుకానీ ఉప్పుకప్పురంబు డైరెక్టర్ అని శశి మాత్రం నటీనటులకు చాలా స్వేచ్ఛ ఇస్తాడు. ఈయన ఆవేశంతో తిట్టేవరకు పరిస్థితులు చేయిదాటిపోనివ్వను. అప్పటికే ఆయన చెప్పిన సీన్లో బాగా నటిస్తాను. ఇంకో విషయమేంటంటే.. ఈ డైరెక్టర్ మంచి నటుడు కూడా! చాలామంది డైరెక్టర్లు చెప్తారంతే.. కానీ ఈయన ఎలా యాక్ట్ చేయాలని చేసి చూపిస్తాడు అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది. గీతాంజలి చిత్రంతో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన కీర్తి సురేశ్.. తెలుగులో నేను శైలజ, నేను లోకల్, మహానటి, రంగ్దే, దసరా, సర్కారువారిపాట వంటి పలు చిత్రాల్లో నటించింది. కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్ వాడే కారుకు వాయిస్ ఓవర్ ఇచ్చింది.చదవండి: కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్.. రచ్చ లేపిన ఫ్యాన్స్
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

రితికా కంటే ముందు ఆమెతో ప్రేమలో రోహిత్?.. నన్గా మారిన నటి?!
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ఓనమాలు దిద్దిన స్టేడియం పిచ్పైనే మోకాళ్లపై కూర్చుని ప్రేయసి రితికా (Ritika Sajdeh)కు ప్రేమను వ్యక్తపరిచినట్లు వెల్లడించాడు. ఆమె కూడా సంతోషంగా ఒప్పుకోవడంతో ఇద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని రోహిత్ శర్మ తన రొమాంటిక్ ప్రపోజల్ గురించి చెబుతూ నవ్వులు చిందించాడు.ఇద్దరు పిల్లలు.. ముచ్చటైన కుటుంబంమాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అతడి భార్య గీతా బస్రా కలిసి నిర్వహిస్తున్న యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భార్య రితికాతో కలిసి హాజరైన రోహిత్ ఈ విషయాన్ని వెల్లడించాడు. కాగా రోహిత్- రితికా చాలా ఏళ్ల పాటు డేటింగ్ చేసి.. 2015, డిసెంబరు 13న పెళ్లిపీటలు ఎక్కారు. వీరికి కూతురు సమైరా, కుమారుడు అహాన్ సంతానం.తెరపైకి సోఫియా హయత్ పేరుఇక రోహిత్ శర్మ తన ప్రేమకథ గురించి వివరించిన నేపథ్యంలో గతంలో అతడు డేటింగ్ చేసిన అమ్మాయిల గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో ప్రధానంగా తెరపైకి వచ్చిన పేరు సోఫియా హయత్ (Sofia Hayat).లండన్లో కామన్ ఫ్రెండ్ ద్వారా సోఫియా- రోహిత్లకు పరిచయమైంది. తొలిచూపులోనే రోహిత్ను ఇష్టపడ్డ సోఫియా అతడితో డేటింగ్ చేసిందనే ప్రచారం ఉంది. అయితే, ప్రేమలో ఉన్నపుడు ఇద్దరూ కూడా ఈ విషయం గురించి బయటపెట్టలేదు. కానీ.. మీడియాలో వీరి గురించి వార్తలు రాగా.. 2012లో సోఫియా స్వయంగా స్పందించింది.నేను రోహిత్ శర్మతో డేటింగ్ చేశా‘‘ఇకనైనా వదంతులకు స్వస్తి పలుకుదాం. అవును.. నేను రోహిత్ శర్మతో డేటింగ్ చేశా. కానీ ఇప్పుడు అదంతా ముగిసిపోయింది.. ఇకపై జీవితంలో అతడితో మరోసారి డేటింగ్ చేయను. ఈసారి నేను మనసున్న మంచి వ్యక్తి కోసం మాత్రమే ఎదురుచూస్తున్నా’’ అని సోఫియా ట్వీట్ చేసింది.అందుకే బ్రేకప్ చెప్పానుఅంతేకాదు.. రోహిత్ శర్మతో తన బంధం ముగిసిపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘అతడు మంచివాడు. కలిసి ఉన్నపుడు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. అయితే, అతడు బిడియస్తుడు. హోటల్స్, రూమ్స్ దగ్గర మేము మీడియా కంటపడకూడదని భావించేవాళ్లం.కానీ మీడియాకు టిప్ అందింది. అపుడు మా మేనేజరే ఈ విషయం గురించి స్పందించారు. రోహిత్తో ఉన్న నాకున్న రిలేషన్పై గౌరవంతో నేనూ ఏమీ మాట్లాడలేదు. కానీ ఓసారి రోహిత్ మీడియాతో మాట్లాడుతున్నపుడు నా గురించి ప్రశ్న ఎదురుకాగా.. నేను కేవలం తన అభిమానిని మాత్రమే అని చెప్పాడు.దాంతో నేను చాలా బాధపడ్డాను. అందుకే అతడితో బ్రేకప్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతడితో ఉన్న అన్ని రకాల కాంటాక్టులను చెరిపివేశా’’ అని సోఫియా గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. పెదవి విప్పని రోహిత్అయితే, రోహిత్ మాత్రం ఆమెతో ప్రేమ, బ్రేకప్ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే.. వివాదాలకు కేరాఫ్ అయిన సోఫియా.. విరాట్ కోహ్లి కోసం తాను రోహిత్ను వదిలేశానంటూ మరో ట్వీట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆమె ప్రచారం కోసమే ఇదంతా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.నటి నుంచి నన్గా?సోఫియా హయత్ బ్రిటిష్ మోడల్, సింగర్. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. హిందీ బిగ్బాస్ 7లో సోఫియా పాల్గొంది. 2013లో బిగ్ బ్రదర్ ఇండియన్ వర్షన్లోనూ తళుక్కుమంది. అయితే, 2016లో అందరికీ షాకిస్తూ... ఆధ్యాత్మిక బాటలో నడుస్తూ.. నన్గా మారినట్లు ప్రకటించింది. తన పేరును గైయా సోఫియా మదర్గా మార్చుకుంది. యోగా టీచర్, హీలర్గా తన ఇన్స్టాగ్రామ్ బయోలో పేర్కొంది.చదవండి: ధావన్పై మండిపడ్డ రోహిత్ శర్మ.. షాకింగ్ విషయం బయటపెట్టిన గబ్బర్

వాళ్లంతా డుమ్మా!.. వీళ్లకు సీరియస్ వార్నింగ్.. సిరాజ్ బ్యాటింగ్ ప్రాక్టీస్!
ఇంగ్లండ్తో రెండో టెస్టు నేపథ్యలో టీమిండియా (Ind vs Eng 2nd Test) ప్రాక్టీస్లో తలమునకలైంది. తొలి మ్యాచ్లో చేసిన తప్పిదాలు పునరావృతం చేయకుండా ఉండేందుకు కఠినంగా సాధన చేస్తోంది. ఇందులో భాగంగా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బ్యాట్తో నెట్స్లో శ్రమించడం విశేషంగా నిలిచింది.ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో పాటు యువ పేస్ బౌలర్ ప్రసిద్ కృష్ణ ట్రెయినింగ్ సెషన్కు గైర్హాజరు కాగా.. సిరాజ్తో ఇతర టెయిలెండర్లు కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్లో మునిగిపోవడం గమనార్హం. టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే.లోయర్ ఆర్డర్ కూడా దారుణంగా విఫలంఈ క్రమంలో లీడ్స్ వేదికగా తొలి టెస్టు జరుగగా.. గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. బౌలర్లు, ఫీల్డర్లు తేలిపోవడం ఇందుకు ప్రధాన కారణం. అయితే, లోయర్ ఆర్డర్ కూడా దారుణంగా విఫలం కావడం ప్రభావం చూపింది. రెండు ఇన్నింగ్స్లో కలిపి టెయిలెండర్లంతా కలిపి కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.అదే సమయంలో ఇంగ్లండ్ లోయర్ ఆర్డర్ ఉత్తమంగా రాణించి జట్టు విజయంలో భాగమైంది. ఈ నేపథ్యంలో భారత టెయిలెండర్లపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో సిరాజ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీరియస్ వార్నింగ్.. సిరాజ్ బ్యాటింగ్ ప్రాక్టీస్!బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ నిర్దేశకత్వంలో సిరాజ్ డిఫెన్సివ్ షాట్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేశాడు. షార్ట్ బంతులు ఎదుర్కొన్న అతడు.. అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతుల్ని వదిలేశాడు. ఫార్వర్డ్ డిఫెన్స్ కూడా ప్రాక్టీస్ చేశాడు.సాధారణంగా బౌలర్లు.. ఇంతగా బ్యాటింగ్పై దృష్టి పెట్టరు. అయితే, మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు టెయిలెండర్లు బ్యాటింగ్పై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్కు కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ డుమ్మా కొట్టినట్లు సమాచారం. కాగా గిల్ (147)తొలి టెస్టులో శతకం బాదగా.. వైస్ కెప్టెన్ పంత్ ఏకంగా రెండు సెంచరీలు (134, 118) బాదాడు.ఇక రెండో టెస్టుకు ప్రధాన పేసర్ బుమ్రా దూరం కానున్నాడన్న వార్తల నేపథ్యంలో అర్ష్దీప్ సింగ్ అరంగేట్రం చేయనున్నాడని తెలుస్తోంది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ సూచనల మేరకు నెట్స్లో అర్ష్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ఇందుకు కారణం. కాగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టుకు వేదిక. ఇరుజట్ల మధ్య జూలై 2-6 వరకు మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు!

ఐపీఎల్లో అలవాటైంది.. ఇక్కడా అదే చేశారు.. గిల్ మారకుంటే..
టీమిండియా టెస్టు కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదుర్కొన్నాడు యువ ఆటగాడు శుబ్మన్ గిల్ (Shubman Gill). ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టు (Ind vs Eng)లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో శతకం (147)తో చెలరేగినా.. అతడి ఇన్నింగ్స్కు విలువ లేకుండా పోయింది.గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిబ్యాటింగ్ విభాగం రాణించినా.. బౌలర్లు.. ముఖ్యంగా ఫీల్డర్ల తప్పిదాల వల్ల గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఏకంగా ఆరు క్యాచ్లు వదిలేసింది. యశస్వి జైస్వాల్ (Yashavi Jaiswal), రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, సాయి సుదర్శన్ కీలక సమయాల్లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్లను నేలపాలు చేశారు.ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో ఓలీ పోప్ (106), రెండో ఇన్నింగ్స్లో బెన్ డకెట్ (149) శతకాలతో సత్తా చాటి.. మ్యాచ్ను టీమిండియా నుంచి లాగేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడిన్ శుబ్మన్ గిల్ కెప్టెన్సీని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.ఫీల్డింగ్ కూడా అద్భుతమే.. కానీ ఇప్పుడుభారత్ జట్టు గొప్పదని.. వారి ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉండేదన్న హాడిన్.. గిల్ మాత్రం ఆ వారసత్వాన్ని కొనసాగించడంలో ఆదిలోనే విఫలమయ్యాడని పేర్కొన్నాడు. కెప్టెన్తో పాటు ఆటగాళ్ల ఉదాసీనత వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని విమర్శించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భారత ఆటగాళ్లు ఇలా క్యాచ్లు జారవిడవడం ఎక్కువగా ఉందని.. ఇదో అలవాటుగా మారిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.‘‘ప్రతి గొప్ప జట్టు.. ఎక్కడ ఆడుతున్నా.. ఎప్పుడైనా ఫీల్డింగ్ విషయంలోనూ గొప్పగానే ఉంటుంది. కానీ ఈసారి గిల్ ఆ లెగసీని కొనసాగించలేకపోయాడు. జట్టుపై అతడు పట్టు కోల్పోయాడు. ఇప్పటికైనా గిల్ తన ఆటిట్యూడ్ మార్చుకోవాలి.మీ జట్టు బాగా ఫీల్డింగ్ చేయాలన్నా.. జట్టుగా సమిష్టిగా పోరాడలన్నా కెప్టెన్గా నువ్వు మరింత బలంగా తయారవ్వాలి. టెక్నిక్ మార్చాలి. ఎంత మంది కోచ్లు ఉంటే ఏం లాభం?.. ఆటగాళ్ల దృక్పథంలో మార్పు రావాలి. ఐపీఎల్లో అలవాటైంది.. ఇక్కడా అదేఈ ఏడాది ఐపీఎల్లోనూ చాలా మంది భారత ఆటగాళ్లు క్యాచ్లు మిస్ చేసిన తీరు చూశాం. దాని ఫలితమే ఇక్కడా కనిపిస్తోంది’’ అని బ్రాడ్ హాడిన్ విల్లో టాక్స్ పాడ్కాస్ట్లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లింది. ఇరుజట్ల మధ్య జూలై 2-6 రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: ఇప్పట్లో టీమిండియాలో అతడికి చోటు దక్కదు!

డబ్ల్యూటీసీలో తొలి ప్లేయర్గా.. ట్రవిస్ హెడ్ అరుదైన రికార్డు
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రవిస్ హెడ్ (Travis Head) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC)లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న క్రికెటర్గా నిలిచాడు. వెస్టిండీస్తో తొలి టెస్టు సందర్భంగా హెడ్ ఈ ఘనత సాధించాడు.కాగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత మూడు టెస్టులు.. అనంతరం ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మొదలైన తొలి టెస్టు (WI vs AUS) మూడు రోజు ఆటలోనే ముగిసింది.హెడ్ హాఫ్ సెంచరీలుబార్బడోస్ వేదికగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, విండీస్ బౌలర్ల విజృంభణకు ఆసీస్ టాపార్డర్ కుదేలు అయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (47) ఫర్యాలేదనిపించగా.. ఐదో స్థానంలో బరిలోకి దిగిన ట్రవిస్ హెడ్ అర్ధ శతకం (59)తో రాణించాడు. మిగతా వాళ్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (28) కాసేపు పోరాటం చేశాడు.ఈ క్రమంలో 56.5 ఓవర్లలోనే ఆసీస్ కథ ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇందుకు బదులుగా విండీస్ తమ మొదటి ఇన్నింగ్స్లో 190 పరుగులు సాధించింది. అయితే, రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ పొరపాట్లను పునరావృతం చేయలేదు.టాపార్డర్ మరోసారి విఫలమైనా.. ఈసారి హెడ్ (61)తో పాటు బ్యూ వెబ్స్టర్ (63), అలెక్స్ క్యారీ (65) కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్లో 310 పరుగులు చేసిన కంగారూలు.. ఆతిథ్య జట్టుకు 301 పరుగుల (విండీస్కు తొలి ఇన్నింగ్స్లో 10 పరుగుల ఆధిక్యం) లక్ష్యం విధించారు.ఆస్ట్రేలియా ఘన విజయంఈ క్రమంలో విండీస్ 141 పరుగులకే ఆలౌట్ కావడంతో.. 159 రన్స్తో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో 59, రెండో ఇన్నింగ్స్లో 61 పరుగులతో రాణించి ఇక ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ట్రవిస్ హెడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. హెడ్ టెస్టు కెరీర్లో ఇది పదో అవార్డు.తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (2019) మొదలుపెట్టిన తర్వాత అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా హెడ్ చరిత్రకెక్కాడు. ఇక ఓవరాల్గా టెస్టుల్లో సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్ అత్యధికంగా 23సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.చదవండి: వరుసగా ఐదు ఓటములు.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సన్రైజర్స్ స్టార్
బిజినెస్

హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్లో జోరు
హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో బలమైన పనితీరు చూపించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పడు ఆఫీస్ స్పేస్ లీజింగ్ 23 శాతం అధికంగా 32 లక్షల చదరపు అడుగులుగా (ఎస్ఎఫ్టీ) నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లీజింగ్ పరిమాణం 26 లక్షల ఎస్ఎఫ్టీగా ఉంది. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లోనూ స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 11 శాతం పెరిగి 178 లక్షల ఎస్ఎఫ్టీగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా ఒక నివేదిక రూపంలో వెల్లడించింది.అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ కార్పొరేట్ల నుంచి లీజింగ్కు మంచి డిమాండ్ కనిపించినట్టు తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఏడు నగరాల్లో స్థూల ఆఫీసు లీజింగ్ 161 లక్షల ఎస్ఎఫ్టీగా ఉంది. హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, పుణెలో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరగ్గా.. ఒక్క ముంబైలో మా త్రం తగ్గింది. ఈ గణాంకాల్లో లీజు పునరుద్ధరణ లు, ముందస్తు హామీలు, ఆసక్తి వ్యక్తీకరణలకు సంబంధించి డేటా లేదని కొలియర్స్ స్పష్టం చేసింది. నగరాల వారీ లీజింగ్.. బెంగళూరులో 48 లక్షల ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 48 లక్షల ఎస్ఎఫ్టీగానే ఉండడం గమనించొచ్చు.చెన్నైలో క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే 30 శాతం అధికంగా 26 లక్షల ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైంది.ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఆఫీస్ వసతుల లీజింగ్ 16 శాతం వృద్ధితో 22 లక్షల ఎస్ఎఫ్టీగా ఉంది.కోల్కతాలో లీజింగ్ 3 లక్షల నుంచి 6 లక్షల చదరపు అడుగులకు దూసుకెళ్లింది.పుణె నగరంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 60 శాతం పెరిగి రూ.16 లక్షల చదరపు అడుగులకు చేరింది.ముంబైలో మాత్రం ఆఫీస్ స్పేస్ లీజింగ్ 28 లక్షల ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 35 లక్షల చదరపు అడుగులతో పోల్చి చూసినప్పుడు 20 శాతం తగ్గింది.ఈ ఏడు పట్టణాల్లో కలిపి 175 లక్షల ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజింగ్కు గాను 135 లక్షల ఎస్ఎఫ్టీని కార్పొరేట్లు తీసుకున్నారు. 43 లక్షల ఎస్ఎఫ్టీని కోవర్కింగ్ ఆపరేటర్లు తీసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ప్రోత్సాహకరమే ‘‘భారత ఆఫీస్ మార్కెట్ 2025లోనూ వృద్ధి దశలో ఉంది. గత రెండు సంవత్సరాలుగా నమోదవుతున్న సానుకూల ధోరణికి అనుగుణంగానే ఉంది. స్థిరమైన సరఫరా, లీజుదారుల పరంగా వైవిధ్యం మద్దతుతో 2025 సంవత్సరం వాణిజ్య రియల్ ఎసేŠట్ట్ మార్కెట్కు ప్రోత్సాహకరంగా ఉండనుంది. మొత్తంమీద ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఈ ఏడాది చివరికి 65–70 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకోవచ్చు’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ ఎండీ అర్పిత్ మల్హోత్రా తెలిపారు.

జూలైలో ‘సిల్వర్ బాంబ్’.. వెండిపై ‘రిచ్డాడ్ పూర్డాడ్’ రచయిత
అత్యధికంగా అమ్ముడైన పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి అద్భుతమైన జోస్యం చెప్పారు. ఇది వెండిపై పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించవచ్చు. జూలైలో వెండి ధరలు భగ్గుమంటాయని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో కియోసాకి తన అధికారిక హ్యాండిల్లో పేర్కొన్నారు.కియోసాకి వెండిని ఈ రోజు ఉత్తమ 'అసమాన కొనుగోలు'గా అభివర్ణించారు. దాని అధిక రివార్డ్-టు-రిస్క్ సామర్థ్యాన్ని ఉదహరించారు."వెండి ఈ రోజు ఉత్తమ 'అసమాన కొనుగోలు'. అంటే తక్కువ ప్రతికూల రిస్క్తో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. జూలైలో వెండి ధరలు భగ్గుమంటాయి' అని రాబర్ట్ కియోసాకి తన ట్వీట్లో పేర్కొన్నారు.వైట్ మెటల్ తక్కువ ప్రతికూల రిస్క్ తో ఎక్కువ లాభాలను కలిగి ఉందని ఆయన వివరించారు. "ఈ రోజు ప్రతి ఒక్కరూ వెండిని కొనగలరు... కానీ రేపు కాదు" అన్నారు. తన సందేశాన్ని "గొప్ప పాఠం"గా అభివర్ణిస్తూ, తనను అనుసరించేవారికి గుర్తు చేశారు. "మీరు కొనుగోలు చేసినప్పుడు లాభాలు వస్తాయి... అమ్మినప్పుడు కాదు" అని సూచించారు.వెండి ధరలు పెరుగుతున్న తరుణంలో కియోసాకి ప్రకటన వెండి సమీప కదలికపై దృష్టిని మరింత పెంచింది. చాలా మంది ఇప్పుడు జూలైని నిశితంగా గమనిస్తున్నారు. విలువైన లోహాల మార్కెట్ ను గమనిస్తున్న విశ్లేషకులు కూడా వెండి జోరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. REMINDER: Rich Lesson:“Your profits are made when you buy…. Not when you sell.”Silver is the best “asymmetric buy” today. That means more possible upside gain with little down side risk.Silver price will explode in July, Everyone can afford silver today… but not…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 27, 2025

‘బ్యాంకులు అప్పులు ఇవ్వడంపై దృష్టి పెట్టాలి’
కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ అర శాతం తగ్గించడాన్ని అవకాశంగా అందిపుచ్చుకుని, ఉత్పాదక రంగాలకు మరిన్ని రుణాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. పీఎస్బీల రుణ వృద్ధి మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.గత ఆర్థిక సంవత్సరం స్థాయిలో లేదా అంతకు మించిన స్థాయిలో రుణ వృద్ధి సాధించడం లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి సూచించినట్లు వారు వివరించారు. పీఎస్బీల ఆర్థిక పనితీరును సమీక్షించేందుకు ఆయా బ్యాంకుల చీఫ్లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ మేరకు సూచనలు చేశారు. ఆర్థిక సమ్మిళితత్వం సాధించేందుకు ప్రభుత్వ పథకాల్లో మరింత మంది కస్టమర్లను చేర్చేందుకు కృషి చేయాలని మంత్రి చెప్పారు.ఇదీ చదవండి: ఐటీ అధికారులకు సీబీడీటీ సూచనతక్కువ వ్యయాలతో కూడుకున్న డిపాజిట్లను సమీకరించే మార్గాలు అన్వేషించాలని మంత్రి సూచించారు. కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం ముద్రా, ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన తదితర పథకాల పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో 12 పీఎస్బీల మొత్తం లాభం 26 శాతం వృద్ధి చెంది రూ. 1.78 లక్షల కోట్లకు చేరింది.

నెల రోజుల్లో 43 లక్షల కొత్త కనెక్షన్లు
దేశీయంగా మే నెలలో టెలికం యూజర్ల సంఖ్య స్వల్పంగా 43,58,231 మేర పెరిగి 120.7 కోట్లకు చేరింది. కొత్త యూజర్లలో సింహభాగం 99.84 శాతం వాటాను (43,51,294 కనెక్షన్లు) రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ దక్కించుకున్నాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 5జీ ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ విభాగంలో రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య నికరంగా 27 లక్షల కొత్త కస్టమర్లతో 47.24 కోట్లకు చేరింది. 40.92 శాతం మార్కెట్ వాటా ఉంది.ఇదీ చదవండి: ఐటీ అధికారులకు సీబీడీటీ సూచనభారతీ ఎయిర్టెల్ సబ్ర్స్కయిబర్స్ సంఖ్య నికరంగా 2.75 లక్షలు పెరిగి 39 కోట్లకు చేరగా, 33.61 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. అయితే సంక్షోభంలో ఉన్న వొడాఫోన్ ఐడియా 2.74 లక్షల మంది, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ 1.35 లక్షలు, ఎంటీఎన్ఎల్ 4.7 లక్షల మంది కస్టమర్లను కోల్పోయాయి. వైర్లైన్ సెగ్మెంట్లో జియో కొత్త యూజర్ల సంఖ్య 12.76 లక్షలు, ఎయిర్టెల్ యూజర్లు 99,000, టాటా టెలీసర్వీసెస్ సబ్స్క్రైబర్స్ 4,890, వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య 1,795 పెరిగింది. ప్రభుత్వ రంగ ఎంటీఎన్ఎల్ అత్యధికంగా 66,834 మంది, బీఎస్ఎన్ఎల్ 46,000 మంది కస్టమర్లను కోల్పోయాయి. దేశీయంగా మొత్తం ల్యాండ్లైన్ కనెక్షన్లు 3.34 శాతం పెరిగి 3.86 కోట్లకు, మొబైల్ కనెక్షన్లు 116.84 కోట్లకు చేరాయి. ఏప్రిల్లో మొత్తం యూజర్ల సంఖ్య 120.3 కోట్లు.
ఫ్యామిలీ

బాడీ బిల్డర్గా 'అడవి బిడ్డ'..!
నో స్పాట్లైట్... నో స్పాన్సర్... నో బిగ్–సిటీ జిమ్...ఎన్నో ‘నో’ల మధ్య ఆమె దగ్గర ఉన్న ఏకైక ‘యస్’ ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసమే ఛత్తీస్గఢ్లోని మారుమూల గ్రామానికి చెందిన ఖుష్బు నాగ్ను ‘బాడీబిల్డర్’ కావాలనే తన కల నెరవేర్చుకునేలా చేసింది.తాజాగా... ఢిల్లీలో జరిగిన ఎన్పీసి వరల్డ్వైడ్ బాడీబిల్డింగ్ చాంపియన్షిప్లో కాంస్య పతకం గెలుచుకుంది. ‘బస్తర్ కా షేర్నీ’ ‘వైరల్ బాడీ బిల్డర్’ ‘ఫిట్నెస్ క్వీన్’ అనిపించుకుంది. పేదింట్లో పుట్టిన ఖుష్బు నాగ్ కష్టపడి బీఎస్సీ చదువుకుంది. ఒకవైపు చదువుకుంటూనే పొలం పనుల నుంచి పశువులను మేపడం వరకు ఎన్నో పనులు చేసేది. ‘బాడీబిల్డర్’ కావాలనేది ఆమె కల.‘నేను బాడీబిల్డర్ కావాలనుకుంటున్నాను’ అనే మాట ఖుష్బు నోటి నుంచి వినిపించినప్పుడల్లా చుట్టుపక్కల వారికి చెప్పలేనంత వినోదంగా మారేది. ‘బాడీబిల్డర్’ అనే నిక్నేమ్తో పిలిచేవారు.అయితే ఎగతాళి మాటలకు, వెక్కిరింపులకు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు ఖుష్బు. ఆమె ఏకైక లక్ష్యం... బాడీబిల్డర్. వడ్రంగి అయిన తండ్రి ‘నువ్వు సాధించగలవు’ అని ఖుష్బుకు ధైర్యాన్ని ఇచ్చాడు.అడవిలో పెరిగిన అమ్మాయికి, జిమ్లు అందుబాటులో లేని అమ్మాయికి, బాడీబిల్డింగ్ ఛాంపియన్షిప్ నియమనిబంధనలు చెప్పే వ్యక్తి ఒక్కరూ లేని ప్రాంతానికి చెందిన అమ్మాయికి తన కలను నెరవేర్చుకోవడం సాధ్యపడుతుందా?‘కచ్చితంగా సాధ్యమే’ అని పట్టుదలతో నిరూపించింది ఖుష్బు నాగ్. తన ఇంటిని జిమ్గా చేసుకుంది. అందుబాటులో ఉన్న వస్తువులతోనే సాధన చేసేది.కేన్సర్తో ఖుష్బు తల్లి చనిపోయింది. ఆ దుఃఖం ఒకవైపు. ‘ఏదో ఉద్యోగం చూసుకోకుండా ఏమిటీ పనులు!’ లాంటి సూటిపోటి మాటలు మరోవైపు. అయినా సరే సాధన పక్కన పెట్టలేదు. పరిమిత వనరులతోనే పోరాటానికి రెడీ అయింది. ప్రతి సవాలును నిచ్చెనగా చేసుకొని లక్ష్యం వైపు దూసుకువెళ్లింది. జాతీయస్థాయిలో జరిగిన బాడీబిల్డింగ్ పోటీలలో ఎన్నో పతకాలు గెలుచుకుంది. ప్రతి పతకం ఖుష్బు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేది.ఖుష్బు విజయం గురించి మాట్లాడం అంటే ఆమె ప్రతిభ గురించి మాత్రమే మాట్లాడడం కాదు. ‘అడవిలో పుట్టిన వారు అడవికే పరిమితం అవుతారు’లాంటి తరతరాల భావజాలాన్ని పక్కన పెట్టిన విజేత గురించి మాట్లాడడం. ‘నీకు తోడుగా ఎవరూ లేరా? గాడ్ఫాదర్ లేడా? అయినా ఫరవాలేదు... అపురూప విజయాలు సాధించవచ్చు’ అని నిరూపించిన అడవిబిడ్డ ఆత్మవిశ్వాసం కథ.పవర్ ఆఫ్ పట్టుదలబాడీబిల్డర్ కావాలంటే ఎన్నో వనరులు ఉండాలి అంటారు. అయితే ఇలాంటి మాటలేవీ నన్ను వెనక్కి నెట్టలేదు. ప్రతి సవాలును స్వీకరించి లక్ష్యం వైపు అడుగులు వేశాను. సాధించాలనే పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదు అని చెబుతోంది ఖుష్బు నాగ్. View this post on Instagram A post shared by The CSR Journal (@thecsrjournal)(చదవండి: అర ఎకరం భూమి లేకుండానే డ్రాగన్ పంట..! రిటైర్డ్ ఉపాధ్యాయురాలి సక్సెస్ స్టోరీ)

Today Tip : షుగర్ పేషెంట్లు ఎగ్స్ తినవచ్చా? ఎన్ని తినవచ్చు?
షుగర్ (diabetes) అనేది దీర్ఘకాలిక వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే.. ఇక అంతే సంగతులు జీవితాంతం మనల్ని వీడిపోదు అనేది ఒకప్పటి మాట. లైఫ్ స్టైల్ డిజార్డర్ కాబట్టి ఆహార నియమాలు, వ్యాయామంతో పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని అనేది ఇప్పటి మాట. అయితే డయాబెటిస్ రాకుండానే జాగ్రత్తపడాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆహారం విషయంలోనూ, వ్యాయామం విషయంలోనే అలసత్వం ప్రదర్శించకూడదు. అయితే ఎలాంటి ఆహారాలు తినాలి? ఎలాంటి ఆహారాలు తీనకూడదు అనే సందేహం చాలామందిని పట్టి పీడిస్తుంటుంది. మరి ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే లో భాగంగా షుగర్ ఉన్న వారు ఎగ్స్ (Eggs) తినొచ్చా, ఒకవేళ తింటే ఎలా తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.కోటడిగుడ్లలో బయోటిన్, పొటాషియం, యాంటి యాక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే చాలా గ్లైసెమిక్ ఇండెక్స్ , కార్బొహైడ్రేట్స్ తక్కువగానూ ప్రోటీన్ ఎక్కువగానూ ఉంటుంది. ఈ రెండూ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో తోడ్పడతాయి. కాబట్టి గుడ్లును నిరభ్యంతరంగా తినవచ్చు. మధుమేహం ఉన్నవారికి ప్రోటీన్ అధిక మూలాన్ని అందిస్తుంది. కనుక చక్కగా తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలపై పెద్దగా ప్రభావం ఉండదు.గుడ్లలోని కొలెస్ట్రాల్ కంటెంట్ గురించి ఆందోళన అవసరం లేదని, అయితే మితంగా తినడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అంటే వారానికి మూడు రోజుల పాటు రోజుకొకటి చొప్పున తినొచ్చు. అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నవారు రెండు ఎగ్ వైట్స్ తింటే సరిపోతుంది.అలాగే, గుండె సమస్యలు, కిడ్నీ ,ఇతర సమస్యలున్న వారు ఎగ్స్ తినే విషయంలో వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.నోట్ : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. షుగర్లో ఉండే రకాలను బట్టి, వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి డయాబెటిస్తో బాధపడేవారు ఏం తినాలి అనేది ఆధారపడుంది. ఇలాంటి నిర్ణయాలు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. అయితే ఒత్తిడిలేని జీవితం, నీళ్లు తాగడం, నిద్ర, తాజా కాయగూరలు, పళ్లు, సిరిధాన్యాలతో చేసిన వంటలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. క్రమం తప్పని వ్యాయామం, రెగ్యులర్గా వైద్య పరీక్షలు చేయించుకోవడం మధుమేహం రోగులకు చాలా అవసరం.

'కన్నీళ్లు ఉప్పొంగే క్షణం': శుభాంశు తల్లిదండ్రుల భావోద్వేగం
శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి విజయవంతంగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా పేరు దేశమంతటా మారుమ్రోగిపోతుంది. ఎక్కడ చూసినా.. ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆ బృందం 14 రోజుల పాటు చేయనున్న పరిశోధనల గురించే అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరి నోట చూసినా..శుభాంశు శుక్లా పేరే హాట్టాపిక్గా మారింది. 140 కోట్ల పై చిలుకు బారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ రోదసిలోకి దూసుకెళ్లిను శుభాంశు బృందం మిషన్ సక్సెస్ అవ్వాలన్నేదే దేశమంతటి ఆ కాంక్ష కూడా. ఈ క్రమంలో యావత్తు దేశం గర్వపడేలా చేసే కుమారుడిని కన్న తల్లిదండ్రుల భావోద్వేగం మాటలకందనిది. అంతరిక్షంలోకి అడుగుపెట్టి తమ కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులిద్దరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఏ పేరెంట్స్కి అయినా ఇది గర్వంతో ఉప్పొంగే క్షణం. లక్నోలోని తమ ఇంటి నుంచి తమ కుమారుడు శుభాంశు ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆక్సియమ్ మిషన్ 4 ఆకాశంలోకి ఎగిసిన విధానాన్ని వీక్షించారు. ముఖ్యంగా శుభాంశు తల్లి ఆశా శుక్లాకి అదంతా చూసి కన్నీళ్లు ఆగలేదు. అయితే అవి ఆనందంతో ఉప్పొంగిన ఆనందభాష్పాలని చెప్పారామె. తమ బంధువులు, సన్నిహితులు స్క్రీన్లకి అతుక్కుపోయి చూస్తున్న విధానం..పట్టరాని ఆనందాన్నిచ్చిందని అన్నారామె. మాటలే రానంతగా గొతు వణుకుతోందామెకు. అలాగే అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి చేరిన వెంటనే గ్రూప్ కెప్టెన్ శుభాంశు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘అంతరిక్షం నుంచి మీ అందరికి నమస్కారం. ఈ యాత్ర చాలా అద్భుతంగా ఉంది. సుమారు 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షంలోకి తిరిగి వచ్చాం. ఈ అద్భుత యాత్రలో ప్రతి భారతీయుడూ నాకు తోడుగా ఐఎస్ఎస్లో ఉన్న భావనే కలుగుతోంది మీ అందరి ప్రేమ, ఆశీస్సులతోనే ఐఎస్ఎస్ చేరగలిగా. మనమంతా కలిసి ఈ యాత్రను మరింత ఉత్సాహభరితంగా మారుద్దాం. మీ అందరితో పాటు త్రివర్ణ పతాకం వెంట రాగా నాతోపాటు ఐఎస్ఎస్ చేరా. ఇది నా ఒక్కని ఘనత కాదు. భారతీయులందరి విజయం." అని అన్నారు. దానికి అతడి తల్లిదండ్రులు స్పందిస్తూ.. అది కేవలం తమ కుమారుడి దేశభక్తి మాత్రమే కాదు. అది చాలా వ్యక్తిగతమైనది. మా బిడ్డ ఇప్పుడు దేశ జెండా తోపాటు ఆ నక్షత్రాల మధ్య యావత్తు దేశ సామూహిక ఆకాంక్షలను తన భుజాలపై మోస్తున్నాడు. అని భావోద్వేగంగా అన్నారు.కాగా, తమ కుమారుడితో అంతరిక్షంలోనికి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఫోన్లో సంభాషించినట్లు తెలిపారు. నాన్న నా గురించి బాధపడుతూ ఉండిపోవద్దు. దేనికోసం ఇక్కడికి వచ్చానో..ఆ మిషన్ని విజయవంతంగా పూర్తి చేస్తాను అని చెప్పినట్లు శుభాంశు తండ్రి అన్నారు. అలాగే ఆయన అక్క సుచి కూడా 30 సెకన్లపాటు శుభాంశుతో మాట్లాడినట్లు సమాచారం. ఇక శుభాంశు కూడా బాగానే ఉన్నాడని, అతడికి శుభాకాంక్షలు కూడా తెలిపామని చెప్పుకొచ్చారు కుటుంబసభ్యులు. #WATCH | Lucknow, Uttar Pradesh: Parents, relatives of IAF Group Captain & astronaut Shubhanshu Shukla, celebrate as #Axiom4Mission lifts off from NASA's Kennedy Space Centre in Florida, US. The mission is being piloted by India's IAF Group Captain Shubhanshu Shukla. pic.twitter.com/bNTrlAq72r— ANI (@ANI) June 25, 2025 (చదవండి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్ లవ్ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..)

రూ. 400 చెప్పుల్ని లక్షకు అమ్ముకుంటారా? ప్రాడాపై హర్ష్ గోయెంకా విమర్శలు
ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ ప్రాడా ఇటీవల ప్రదర్శించిన చెప్పులు, వాటి ధరపై భారతీయ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా స్పందించారు. అసలు కళాకారులకు క్రెడిట్ ఇవ్వకుండా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ బ్రాండ్లు లాభపడుతున్నాయంటూ ఆయన విమర్శించారు. ఇది చాలా విచారకరం అంటూ ట్వీట్ చేశారు.Prada is selling products looking like Kolhapuri chappals for over ₹1 lakh. Our artisans make the same by hand for ₹400. They lose, while global brands cash in on our culture. Sad! pic.twitter.com/Cct4vOimKs— Harsh Goenka (@hvgoenka) June 26, 2025 ప్రాడా పురుషుల పాదరక్షల స్ప్రింగ్ సమ్మర్ 2026 ఇటీవల ప్రదర్శించింది. వీటి డిజైన్ అచ్చం మన షోలాపూర్ చెప్పుల మాదిరిగానే రాజసాన్ని ఒలకబోస్తుట్టున్నాయి. కానీ వాటి ధరే 1.2 లక్షలు ఉండటం హాట్ టాపిక్గా మారింది. నెటిజన్లు దీనిపై తీవ్రంగా చర్చించారు.అటు బిలియనీర్ గోయెంకా కూడా దీనిపై స్పందించారు.ఈ చెప్పుల ఫోటోలు ట్వీట్ చేస్తూ, ఇవి భారతదేశపు ఐకానిక్ కొల్హాపురి చెప్పులను పోలి ఉన్నాయి, కానీ ధర లక్షకు పై మాటే!అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. మన చేతివృత్తులు వారు వీటినే రూ.400 కు తయారు చేస్తారు. అంటే వారు ఎంత నష్టపోతున్నారు? ప్రపంచ బ్రాండ్లు మన సంస్కృతిని సొమ్ము చేసుకుంటున్నాయి. విచారకరం! అంటూ గోయెంకా రాసుకొచ్చారు.ఈ హై-ఎండ్ ఫ్యాషన్ చప్పల్స్ని ప్రీమియం మెటీరియల్స్, ఇండియన్ డిజైన్తో రూపొందించినట్టు ప్రాడా ప్రకటించింది. అయితే ఇండియాలో షోలాపూర్ చెప్పులను పోలి ఉన్న ఈ చెప్పుల ధర భారీ లగ్జరీగా ఉండటంతో నెటిజన్లు విస్తుపోయిన సంగతి తెలిసిందే.
ఫొటోలు
అంతర్జాతీయం

అత్యంత ప్రాచీన రాతి శిలలు
న్యూయార్క్: ఇవేమిటో తెలుసా? భూమిపైనే అత్యంత ప్రాచీనమైన రాతి శిలలు. తూర్పు కెనడాలో క్విబెక్ ప్రావిన్స్లో హడ్సన్ బే తీరంలోని నువాగిటిక్ గ్రీన్స్టోన్ బెల్ట్లో వీటిని గుర్తించారు. అయితే వీటి వయసు ఎంతన్నది సైంటిస్టుల నడుమ తీవ్ర భేదాభిప్రాయాలకు కారణమైంది. ఈ బూడిద రంగు రాళ్లు 400 కోట్ల ఏళ్ల కంటే ముందే ఏర్పడినట్లు తొలుత అంచనా వేశారు. కాదు, 308 కోట్ల ఏళ్ల క్రితం నాటివేనని మరికొందరు సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఎక్కువమంది మాత్రం 370 కోట్ల ఏళ్లనాటివన్న వాదనను అంగీకరించారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రాళ్ల వయసు లెక్కగట్టి, దాదాపు 416 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయని తేల్చారు. అంటే భూమి శైశవ దశలో ఉన్నప్పుడే రూపుదాల్చాయన్నమాట. భూగోళంపై ఇంతకంటే పురాతన రాళ్లు ఎక్కడా లేవని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. భూమి పుట్టుక, చరిత్రను అంచనా వేయడానికి ఈ పరిశోధన తోడ్పడుతుందని భావిస్తున్నారు. ‘‘భూమి తొలినాళ్లకు చెందిన హడియన్, ఆర్కియన్ యుగాలకు సంబంధించి మనకిప్పటిదాకా తెలియని ఎన్నో విశేషాలు ఈ శిలల అధ్యయనం ద్వారా వెలుగులోకి వస్తాయి. భౌగోళిక మార్పుల వల్లే ఈ శిలలు ఏర్పడ్డాయి. కాకపోతే ఇప్పటిదాకా చెక్కుచెదరకుండా నిలిచి ఉండడం అద్భుతమే’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ అధ్యయన వివరాలను జర్నల్ సైన్స్లో ప్రచురించారు.

పుట్టగానే ప్లాస్టిక్ బ్యాగ్లో కట్టి పడేశారు.. 40 ఏళ్ల తర్వాత ఇలా..!
నీకు ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందనేది మనం కాదనలేని సత్యం. బ్రతకాలని రాసిపెట్టి ఉంటే ఎలా పడేసినా, ఎక్కడ పడేసినా బ్రతుకుతాం. కర్మ బాలేకపోతే ఎక్కడికి కదలకుండా ఉన్నా కూడా చావును మాత్రం తప్పించలేం. అందుకే విధి రాతను ఎవరూ తప్పించలేరనేది. అప్పుడే పుట్టిన శిశువును ప్లాస్టిక్ బ్యాగ్లో కట్టేసి పడేస్తే ఎవరైనా బ్రతుకుతాడని అనుకుంటారా..? విధి అంటే వింత నాటకం అంటే ఇదేనేమో.. యూకేకు చెందిన ఓ వ్యక్తి.. పుట్టగానే ప్లాస్టిక్ బ్యాగ్లోకి వెళ్లిపోయాడు. అతని ఇంట్లో ఏ పరిస్థితుల కారణమో కానీ ప్లాస్టిక్ బ్యాగ్లో కట్టేసి ఓ చోట పడేశారు. ఆ సమయంలో ఆ ప్లాస్టిక్ బ్యాగ్లో ఉన్న శిశువును ముగ్గురు టీనేజర్లు బయటకు తీసి జన్మనిచ్చారు. ఆ తర్వాత అతను ఓ కుటుంబానికి దత్తత వెళ్లాడు. ఇప్పుడతను తనకు జన్మనిచ్చిన కుటుంబాన్ని కలిశాడు. అది కూడా 40 ఏళ్ల తర్వాత కావడం విశేషం. యూకేలోని ఓ టెలివిజస్ నిర్వహించే ‘లాంగ్ లాస్ట్ లైఫ్’ కార్యక్రమానికి వెళ్లిన జాన్ స్కార్లెట్ ఫిలిప్స్కు మళ్లీ పుట్టిన వాళ్లను కలిసే భాగ్యం దక్కింది. ఈ షో ద్వారా తన అన్న అతనే అని తెలుసుకున్న సోదరీ, సోదరీమణులు.. ఫిలిప్స్ను కలిశారు. అయితే తల్లి మాత్రం కలిసే పరిస్థితుల్లో లేదు. మానసికంగా, శారీరకంగా ఆమె అనారోగ్యంగా ఉండటంతో కేవలం తన కుమారుడికి ఓ సందేశాన్ని మాత్రమే పంపింది. కన్నవాళ్లను నాలుగు దశాబ్దాల తర్వాత కలిస్తే అదొక అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పెళ్లి చేసుకుని భార్యతో ఉంటున్న ఫిలిప్స్.. ఇకమై కుటుంబంతో కలిసే ఉంటానని అంటున్నాడు. తన సోదరుడు కోసం ఇప్పటి వరకూ చేయని ప్రయత్నం లేదని, ఇన్నాళ్లకు ఇలా కలిశామని అతని కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

ఇరాన్పై దాడులను... మాపై అణుబాంబులతో పోలుస్తారా?
టోక్యో: ఇరాన్పై ఇటీవల దాడులు జరిపిన అమెరికా, వాటిని రెండో ప్రపంచ యుద్ధాన్ని ముగించిన హిరోషిమా, నాగసాకిపై జరిగిన అణు బాంబు దాడులతో పోల్చడాన్ని జపాన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అణుబాంబు వేయడాన్ని సమర్థించినట్లుగా ఉన్నాయని నాగసాకి మేయర్ షిరో సుజుకి ఆక్షేపించారు. బాంబు దాడికి గురైన నగరవాసులుగా తాము చాలా విచారిస్తు న్నట్టు చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మిమాకి తోషియుకి అన్నారు. అణు బాంబు దాడి నుంచి బయటపడిన వారిలో ఆయన ఒకరు. ట్రంప్ ప్రక టనను ఉపసంహరించుకోవా లంటూ నాటి అణు బాంబు దాడుల నుండి బయటపడినవారు హిరోషి మాలో నిరసనకు దిగారు. ట్రంప్ ప్రకటన లను తిరస్కరిస్తూ హిరోషి మాలో చట్టసభ సభ్యు లు తీర్మానం ఆమోదించారు. సాయుధ పోరాటా లను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపు నిచ్చారు. ‘‘ఇరాన్పై అమెరికా దాడి వల్లే యుద్ధా నికి తెరపడింది. హిరోషిమా, నాగసాకి ఉదాహ రణను నేను ఉపయోగించాలనుకోవడం లేదు. కానీ తప్పడం లేదు’’ అని ట్రంప్ పేర్కొనడం తెలిసిందే. ప్రపంచంలో అణు దాడికి గురైన ఏకైక దేశం జపాన్. 1945 ఆగస్టులో దక్షిణ జపాన్లోని రెండు నగరాలపై అమెరికా వేసిన అణు బాంబులు 1.4 లక్షల మందిని బలిగొ న్నాయి. ప్రాణాలతో బయటపడినవారు నేటికీ నానా శారీరక, మానసిక వ్యాధులతో బాధపడు తున్నారు. అణ్వాయు ధాలకు జపాన్ వ్యతిరేకమని సూచించే శాంతి జ్వాల హిరోషిమాలో ఇప్పటికీ వెలుగుతూ ఉంటుంది. ప్రపంచంలోని చివరి అణు దాడి జరిగి ఎన్ని రోజులో తెలిపే గడియారం కూడా యుద్ధ మ్యూజి యం ప్రవేశద్వారం ఉంటుంది. శాంతి పట్ల తమ నిబద్ధత తెలియజేసేందుకు హిరోషిమాను సందర్శించే ప్రపంచ నాయకులతో కాగితపు క్రేన్లను తయారు చేయించే సంప్రదాయముంది.

నాకు కష్టమొచ్చింది.. ఇక ఈ ట్రైన్ ఎందుకు?.. అందులో ఉన్న మీరెందుకు?
మనిషికొక్క తీరు.. మనకి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా అధిగమించాలనేది కొంతమంది ఆలోచిస్తే, ఆ సమస్యనే తన చుట్టంగా చేసుకుని బాధపడే వాళ్లు మరికొందరు. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలయ్యే వాళ్లు ఇంకొందరు. ఇది చాలా ప్రమాదం. తన సమస్యను ప్రపంచ సమస్యలా ఫీలవ్వాలని కోరుకుంటారు.కానీ ప్రపంచంలోని సమస్యతో మాత్రం వీరికి అవసరం ఉండదు. ఇలాంటి వాళ్లు చాలా సందర్భాల్లో ఏం చేస్తున్నామనే విచక్షణ మరిచిపోతారు. ఏదైనా చిన్నపాటి కష్టం వస్తే చాలు.. మన చుట్టూ ఉన్న వాళ్లు ఎంత సుఖంగా ఉన్నారో అనే భ్రాంతిలో ఉండి వారికి తీవ్ర నష్టం చేయడానికి యత్నించడంలో ముందుంటారు. ఈ తరహాలోనే తన భార్య తనకు విడాకులు ఇచ్చిందనే కారణంతో మొత్తం ట్రైన్నే తగలబెట్టాలనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. తన వెంట బ్యాగులో తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాను ఒక్కసారిగా ట్రైన్లో చల్లుకుంటా వచ్చి ఒక్కసారిగా నిప్పంటించాడు. అసలు ఏం జరుగుతుందనే ప్రయాణికులు తేరుకుని పరుగులు తీసే లోపే ఆ ట్రైన్ లోపల ఒక్కసారిగా భగ్గుమంది. భార్య విడాకులిచ్చిందనే ఫ్రస్టేషన్లో..ఈ ఘటన దక్షిణాకొరియా దేశంలో చోటు చేసుకంది. ఇటీవల సియోల్కు చెందిన వాన్ అనే వ్యక్తికి భార్యతో విడాకులయ్యాయి. దీన్ని భరించలేకపోయాడు. సుమారు 67 ఏళ్ల వయసులో తనకు విడాకులు మంజూరు కావడాన్ని వాన్ తట్టుకోలేకపోయాడు. ఇక తాను ఎందుకు అనుకున్నాడు. అలా అనుకుంటూనే ట్రైన్ ఎక్కాడు. అప్పటికే ఓ పెట్రోల్ డబ్బా బ్యాగ్తో పాటు వెంట తెచ్చుకున్నాడు. అయితే ఆ ట్రైన్ కోచ్లో జనం కాస్త సంతోషంగా కనిపించారు. తనకు కష్టం వచ్చింది.. వీరి ముఖాల్లో నవ్వులు పూస్తున్నాయి అనుకున్నాడో ఏమో కానీ.. ఒక్కసారిగా పెట్రోల్ డబ్బా బయటకు తీశాడు. పెట్రోల్ డబ్బా బయటకు తీసిన క్షణంలోనే అనుమానం వచ్చిన ఆ కోచ్లోని ప్రయాణికులు పరుగులు తీశారు. పెట్రోల్ మొత్తం కోచ్ అంతా చల్లడం.. ఆపై నిప్పంటించడం జరిగిపోయాయి. సముద్రగర్భంలోని టన్నెల్లో రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో 22 మంది ఆస్పత్రి పాలు కాగా, మరొక 129 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిందితుడు వాన్ కూడా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కారణంగా 240,000 యూఎస్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.వాన్పై హత్యాభియోగాలుఈ దారుణానికి పాల్పడ్డ వాన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కదులుతున్న ట్రైన్లో ఘటన జూన్ 9న జరగ్గా, ఇది ఆలస్యంగా వెలుగుచూసింది. వాన్పై హత్యాయత్నం అభియోగాలతో పాటు పలు సెక్షన్లు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న వాన్.. భార్యతో విడాకులు మంజూరు అయినందుకే ఇలా చేశానని స్పష్టం చేశాడు. ట్రైన్లో పెట్రోల్ పోసిన ఘటన వీడియో వైరల్గా మారింది.서울지하철 5호선 방화범 CCTV사망자 없는게 기적이네요 pic.twitter.com/IQMowGZkWH— 브이몬 (@XXV_mon) June 25, 2025
జాతీయం

విమానం రెక్కలో ఇరుక్కున్న గడ్డి
ముంబై: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఈ నెల 25న ముంబై విమానాశ్రయంలో దాదాపు 5 గంటలపాటు నిలిచిపోయింది. విమానం ఒక రెక్క దిగువ భాగంలో గడ్డి ఇరుక్కుపోయి ఉండటమే ఇందుకు కారణమని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. గమనించిన వెంటనే తొలగించి, విమానం టేకాఫ్కు క్లియరెన్స్ ఇచ్చామంది. అయితే, ఆ విమానం ఏ రకానిది? అందులోని ప్రయాణికులు, సిబ్బంది సంఖ్య ఎంత? టేకాఫ్ షెడ్యూల్ సమయం? ప్రయాణికులు ఎంతసేపు విమానంలో ఉండిపోయారు? వంటి వివరాలను టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిరిండియా వివరించలేదు. రెక్క దిగువ భాగంలో గడ్డి ఎలా చేరిందని విషయాన్ని సైతం తెలపలేదు. అయితే, ముంబైలో ఉదయం 7.45 గంటలకు టేకాఫ్ తీసుకోవాల్సిన ఏఐ 2354 విమానం మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరినట్లు ఫ్లయిట్రాడార్24. కామ్ ట్రాక్ రికార్డును బట్టి తెలుస్తోంది.

ఐరాస సాయం తిరస్కరించిన భారత్
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తులో సాయం చేస్తామన్న ఐక్యరాజ్యసమితి విమానయాన దర్యాప్తు సంస్థ ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది. కీలకమైన బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించడంలో జాప్యం జరుగుతోందని భద్రతా నిపుణులు అంటుండటం తెలిసిందే. జూన్ 13న స్వాధీనం చేసుకున్న కంబైన్డ్ బ్లాక్ బాక్స్ యూనిట్ స్థితి, జూన్ 16న దొరికిన కాక్పిట్ వాయిస్ రికార్డర్తో సహా దర్యాప్తు గురించి సమాచారం లేకపోవడాన్ని వారు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తులో సాయం చేసేందుకు ఐరాస సంస్థ ముందుకొచ్చింది. భారత్లో ఉన్న తమ అధికారికి పరిశీలకుడి హోదా ఇవ్వాలని కోరింది. అందుకు భారత్ తిరస్కరించింది. 2014లో మలేషియా విమాన ప్రమాదం, 2020లో ఉక్రేనియా జెట్లైనర్ కూలిపోయిన ఘటనల్లో దర్యాప్తులకు సాయపడేందుకు ఆ దేశౠల విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ పరిశోధకులను నియమించింది. ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత దర్యాప్తు అధికారులు ఫ్లైట్ రికార్డర్ డేటాను డౌన్లోడ్ చేసుకున్నట్టు పౌర విమానయాన శాఖ గురువారం తెలిపింది.

బాధలో అహ్మదాబాద్ బాధితులు.. డీజే పార్టీ జోష్లో ఎయిర్ ఇండియా ఉద్యోగులు
ఢిల్లీ: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా (Air India) విమానం కూలిపోయిన ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘటన నుంచి మృతుల కుటుంబాలు, ప్రజలు తేరుకోక ముందే ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఉద్యోగులు.. ఆఫీసులోనే పార్టీ చేసుకుని ఎంజాయ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంస్థ.. నలుగురు సీనియర్ల ఉద్యోగులపై వేటు వేసింది. ఉద్యోగులు పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా గ్రౌండ్ సేవల సిబ్బంది ఆఫీసులో పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఎస్ఏటీఎస్ లిమిటెడ్ (గతంలో సింగపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ సర్వీసెస్) ఎయిరిండియా భాగస్వామ్యంతో (AISATS) దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఫుడ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వంటి గ్రౌండ్ సేవలందిస్తోంది. అయితే, గుజరాత్లో విమాన దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకే.. గురుగ్రామ్లోని ఏఐఎస్ఏటీఎస్ కార్యాలయ సిబ్బంది ఓ పార్టీ చేసుకున్నారు. సిబ్బందితో కలిసి సీనియర్ ఉద్యోగులు కూడా డీజేకు స్టెప్పులు వేస్తూ డ్యాన్సులు చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.A video showing senior Air India SATS (AISATS) executives dancing at a DJ party in their Gurugram office—just eight days after the deadly Flight AI171 crash—has sparked public outrage.The June 20 celebration, reportedly attended by top officials of AISATS (Air India SATS… pic.twitter.com/jBQwUSBstd— Mid Day (@mid_day) June 23, 2025విమాన ప్రమాదం కారణంగా ఓ వైపు మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఉద్యోగులు మాత్రం కనీన మానవత్వం లేదా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ప్రయాణీకుల ప్రాణాలంటే అంత చులకనగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశించడంతోపాటు మిగతా వారిని హెచ్చరించినట్లు తెలిసింది. ఉద్యోగుల ప్రవర్తన మా విలువలకు అనుగుణంగా లేదు. బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని చెప్పుకొచ్చింది.

‘శశి థరూర్.. ఒవైసీ వేరుకాదు’: జావేద్ అక్తర్
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ప్రభుత్వంపై జరిగిన దాడి కాదని, యావత్ దేశంపై జరిగిన దాడి అని ప్రముఖ గీత రచయిత, స్క్రిప్ట్ రైటర్ జావేద్ అక్తర్ పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’పై ప్రపంచదేశాలకు వివరించేందుకు ప్రతిపక్ష సభ్యుల బృందం వివిధ దేశాల్లో పర్యటనలు సాగిస్తోంది.ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో గీత రచయిత జావేద్ అక్తర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కాంగ్రెస్ నేత శశి థరూర్, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వంటి నాయకులను ప్రభుత్వం ఈ ప్రతినిధుల బృందంలో చేర్చడం సరైనదేనా? అని అడిగినప్పుడు, ఆయన మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్ర దాడి ప్రభుత్వంపై జరిగిన దాడి కాదని, దేశంపై జరిగిన దాడి అని అన్నారు. అందుకే దేశంలోని అన్నివర్గాల ప్రతినిధులూ వెళ్లారన్నారు. వీరిలోని కొందరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారని. కానీ దేశం విషయానికి వస్తే, అందరం ఒకటేనని అన్నారు. ఈ విధంగా చూస్తే ప్రతినిధుల బృందంలోని శశిథరూర్, అసదుద్దీన్ ఒవైసీ వేరుకాదని జావేద్ అక్తర్ పేర్కొన్నారు.శశి థరూర్ అన్ని విషయాల్లో చాలా స్పష్టంగా మాట్లాడతారని,ఇలాంటి కాంగ్రెస్ నేత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడం సంతోషంగా ఉందని, ఆయనకు ఐక్యరాజ్యసమితిలో దౌత్య అనుభవం ఉందని అక్తర్ పేర్కొన్నారు. భారత్- పాకిస్తాన్ మధ్య సంబంధం గురించి ఆయన మాట్లాడుతూ 1965 యుద్ధం.. అనంతరం జరిగిన కార్గిల్ యుద్ధం నాటి నుంచి కూడా వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయన్నారు. అయితే పాక్ ప్రభుత్వం ఇటువంటి వివాదాల్లో తన ప్రమేయం లేదని చెబుతూ వస్తున్నదన్నారు. పహల్గామ్ దాడి వారు చేసినదేనని అక్తర్ పేర్కొన్నారు.పాకిస్తాన్లోని కోట్లాది మంది భారతదేశంతో స్నేహాన్ని కోరుకుంటున్నారని, అలాగే అక్కడి యువత భారతదేశానికి వచ్చి, వినోద పరిశ్రమతో పాటు కార్పొరేట్ రంగంలో పనిచేయాలని కోరుకుంటున్నారని జావేద్ అక్తర్ పేర్కొన్నారు. అయితే అక్కడి సైనిక పాలకులకు ఇది నచ్చిన అంశమన్నారు. పాక్లో సైన్యం ఆధిపత్యం తెలుసుకున్న మీదటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ను ఆహ్వానించారన్నారు. పాక్లో ప్రజాస్వామ్యం ఒక బూటకమని, సైన్యమే ఆ దేశాన్ని పాలిస్తుందని జావేద్ అక్తర్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అభినందన్ను బంధించానన్న.. పాక్ ఆర్మీ అధికారి మృతి
ఎన్ఆర్ఐ

చెవిరెడ్డి అరెస్ట్ దారుణం: ఆస్ట్రేలియా ఎన్నారైలు
తన జీవితంలో ఏనాడు మద్యం వాసన కూడా తెలియనటువంటి నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఆ కేసులో ఇరికించటం అత్యంత హేయమైన చర్య అని ఆస్ట్రేలియా ఎన్నారైలు ఖండించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నవారిని ఏదో ఒక కేసులో ఇరికించటం దారుణమన్నారు. ఈ పరిణామాలు అన్నిటికీ రిటర్న్ గిఫ్టులు కచ్చితంగా ఉంటాయని ఆస్ట్రేలియా ఎన్నారై సూర్యనారాయణ రెడ్డి అన్నారు

పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు నాట్స్ ముందడుగు
డల్లాస్: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్ట్రావింగ్ చిల్డ్రన్ సంస్థ సంయుక్తంగా పేద చిన్నారుల ఆకలి తీర్చేందుకు వేల ఆహార కిట్లను సిద్ధం చేశాయి. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, స్థానిక తెలుగు ప్రజలు, విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొని ఆహార కిట్లను సిద్ధం చేశారు. నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం వెనుకబడిన దేశాల్లో వేల మంది చిన్నారుల ఆకలి తీర్చడంలో దోహదపడనుంది. మానవ సేవే మాధవ సేవ అనే నాట్స్ చేపట్టే అనేక కార్యక్రమాల్లో ఉంటుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచుతాయని అన్నారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పాన్ని, సమిష్టి శక్తిని చూపించడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలే మంచి ఉదాహరణలు అని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన పావని నున్న, సౌజన్య రావెళ్ల డల్లాస్ టీం సభ్యులకు డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ కుమార్ నిడిగంటిలకు నాట్స్ నాయకత్వం అభినందించింది. అలాగే స్పాన్సర్లకు నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సహ కోశాధికారి రవి తాండ్ర, నాట్స్ జాతీయ మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారె, నాట్స్ డల్లాస్ జట్టు సభ్యులు బద్రి బియ్యపు, పద్మసుందరి రాతినం, శ్యామల తూనుగుంట్ల తదితరులతో పాటు 20 కి పైగా యువ వాలంటీర్లు పాల్గొన్నారు. సమాజంలో సేవా స్ఫూర్తిని పెంచేలా సేవా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్న డల్లాస్ చాప్టర్ బృందానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి అభినందనలు తెలిపారు.

సెయింట్ లూయిస్లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
సెయింట్ లూయిస్: అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా సెయింట్ లూయిస్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. నాట్స్ మిస్సోరీ విభాగం ఆధ్వర్యంలో సెయింట్ లూయిస్లోని మహాత్మగాంధీ సెంటర్లో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక తెలుగు వారు వినియోగించుకున్నారు. నాట్స్ బోర్డు సలహా సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి, డాక్టర్ బాపూజీ దర్శిలు ఈ ఉచిత వైద్య శిబిరంలో సేవలు అందించారు. నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు శ్రీనివాస్ మంచికలపూడి, రమేశ్ బెల్లం, నాట్స్ మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర్ల, నాట్స్ మిస్సోరీ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ అన్వేష్ చాపరాల, నాగ శ్రీనివాస్ శిష్ట్ల తదితరులు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న నాట్స్ మిస్సోరీ విభాగాన్ని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అభినందించారు. మరిన్ని NRI న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జూన్ 16 : శ్రీ శ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డేగా ప్రకటించిన ఫ్లోరిడా
జాక్సన్విల్, ఫ్లోరిడా, జూన్ 16ను శ్రీ శ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డే అని ప్రకటించింది. జాక్సన్విల్, ఫ్లోరిడా శ్రీ శ్రీ రవిశంకర్ గారి నిరంతర సేవను.ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సమాజంలో పరస్పర అవగాహన, ఐక్యత, స్వస్థత చేకూరుట కోసం చేస్తున్న నిరంతర ప్రయత్నాలను గౌరవిస్తూ, జూన్ 16 తేదీని అధికారికంగా "శ్రీ శ్రీ రవిశంకర్ పీస్ అండ్ వెల్నెస్ డే" అని ప్రకటించింది. ఈ ప్రకటనను జాక్సన్విల్ మేయర్, నార్త్ ఫ్లోరిడా యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా అందజేశారు. దీని ద్వారా, జాక్సన్విల్ ప్రపంచంలో "శ్రీ శ్రీ రవిశంకర్ దినోత్సవం"ను ప్రకటించిన 32వ నగరంగా నిలిచింది.ఇదీ చదవండి: Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడు మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

యాంకర్ స్వేచ్ఛ కేసులో ట్విస్ట్
తెలుగు న్యూస్ రీడర్, యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(Swetcha Votarkar) ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. సాక్షి, హైదరాబాద్: పలు టీవీ ఛానెల్స్లో పని చేసిన స్వేచ్ఛకు.. గతంలోనే వివాహమైంది. ఓ కూతురు కూడా ఉంది. మనస్పర్థలతో భర్త నుంచి విడిపోయాక పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో ఆమె కలిసి ఉంటోంది. ఆమె ఫేస్బుక్ పేజీ పేరు సైతం స్వేచ్ఛా పూర్ణ చందర్గా మార్చుకుంది. అయితే కొన్నాళ్లుగా వీళ్ల మధ్యా విభేదాలు నడుస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వివాహం చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయగా.. అందుకు పూర్ణ చంద్రరావు నిరాకరించాడు. దీంతో అతనితో ఇక కలిసి ఉండలేనంటూ ఆమె తల్లిదండ్రుల వద్ద వాపోయింది. ఈ విషయంలోనే ఆమె మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాతి నుంచి పూర్ణచంద్రరావు ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. అజ్ఞాతంలో ఉన్న అతని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యాంకర్గా, న్యూస్ప్రజెంటర్గా పలు చానెల్స్లో పని చేసిన స్వేచ్ఛ.. డిజిటల్ కంటెంట్ క్రియేటర్గానూ గుర్తింపు దక్కించుకున్నారు. శుక్రవారం గాంధీనగర్ జవహర్ నగర్ తన ఇంట్లో ఫ్యాన్కు ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తొలుత పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్ట్మార్టం నిమిత్తం ఆమె మృతదేహానికి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె నేత్రాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మానవ మృగానికి ఉరే సరైన శిక్ష
విశాఖపట్నం: పెందుర్తి మండలం వి.జుత్తాడలో నాలుగేళ్ల క్రితం(2021 ఏప్రిల్ 15న) జరిగిన దారుణ హత్యల కేసులో నిందితుడు బత్తిన అప్పలరాజుకు జిల్లా కోర్టు శుక్రవారం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో బాధిత కుటుంబం, స్థానికులు న్యాయం లభించిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పసిపిల్లలతో సహా ఆరుగురు నిద్రమత్తులోనే ప్రాణాలు కోల్పోగా, అప్పటి నుంచి న్యాయం కోసం నిరీక్షిస్తున్న కుటుంబానికి ఈ తీర్పు కొంత ఊరటనిచ్చింది. అనుమానమే ఆరుగురి ప్రాణాలు తీసింది 2021 ఏప్రిల్ 15 తెల్లవారుజామున జుత్తాడ గ్రామం రక్తసిక్తమైంది. నిందితుడు బత్తిన అప్పలరాజు కుమార్తెకు, అదే గ్రామానికి చెందిన బమ్మిడి విజయ్కిరణ్కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఇరు కుటుంబాల మధ్య దీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ పగతో రగిలిపోయిన అప్పలరాజు.. విజయ్కిరణ్ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆ రోజు ఉదయం వారింట్లోకి ప్రవేశించి నిద్రలో ఉన్న బమ్మిడి రమణ(63), బమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నక్కెళ్ల అరుణ(40), బమ్మిడి ఉదయ్నందన్ (2), బమ్మిడి ఉర్విష విజయ్కిరణ్(6 నెలలు)లను కత్తితో అత్యంత పాశవికంగా హతమార్చాడు. అభంశుభం తెలియని పసికందులను కూడా వదలకుండా చంపడం అందరినీ కలచివేసింది. రక్తపు మడుగులో మృతదేహాల దృశ్యం చూసిన వారందరినీ కన్నీరు పెట్టించింది. న్యాయం దిశగా ... ఈ దారుణ ఘటన అనంతరం అప్పలరాజు పోలీసులకు లొంగిపోయాడు. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి, బాధిత కుటుంబానికి అండగా నిలబడింది. నష్టపరిహారం చెల్లించి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చింది. పోలీసులు ఈ కేసును అత్యంత పకడ్బందీగా విచారించి కోర్టులో నివేదించారు. నాలుగేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం, ఈ రోజు విశాఖ కోర్టు అప్పలరాజుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల ఆనందం ఈ తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు నాటి ఘటనను తల్చుకుని కన్నీరు పెట్టుకుంటూనే తమ ఆనందం వ్యక్తం చేశారు. ‘మానవ మృగానికి ఉరే సరైన శిక్ష. మా కుటుంబానికి న్యాయం జరిగింది’అని తెలిపారు. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి..
వరంగల్ క్రైం: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల కిందట జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందంటూ కొందరు వ్యక్తులు ఓ వివాహితను వివస్త్రను చేసి జననాంగంలో జీడిరసం పోసి విచక్షణారహితంగా దాడి చేశారు. ‘సాక్షి’కి విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు పిల్లలు. అయితే సమీప బంధువైన ఓ వివాహితతో అతను వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. సుమారు పది రోజులు ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు ఆ ఇద్దరినీ వెతికి పట్టుకొని ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకువచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికీ గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి.. జననాంగంపై జీడి (పూర్వకాలంలో నొప్పి తగ్గించేందుకు వాడేవారు. అదేవిధంగా శరీరంలోని సున్నిత అవయవాలపై పోస్తే పుండ్లు అవుతాయి) పోశారు. ‘తప్పు చేశాను.. క్షమించండి’ అంటూ బాధిత మహిళ వేడుకున్నా వినకుండా దాడి చేశారు. జననాంగంలోనుంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. ఆ తరువాత ఆ ఇద్దరినీ ఏం చేశారో ఇప్పటివరకు ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం లేదని తెలిసింది. అసలు ఆ ఇద్దరూ ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది.

ముంచెత్తే మత్తు..బతుకే చిత్తు
కూటమి అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ దందా గుంటూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. యువత, కళాశాలల విద్యార్థులు, పాఠశాలల్లో చదువుకునే బాలలే లక్ష్యంగా మాదకద్రవ్యాల ముఠాలు చెలరేగిపోతున్నాయి. పాలకులకు రెడ్బుక్ పేరిట రాజకీయ కక్షలు సాధించడంతో సరిపోతోంది. దీంతో డ్రగ్స్ దెబ్బకు యవత బంగారు భవిష్యత్తు నాశనమవుతోంది.నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో గంజాయి, కొకైన్, మెత్, ఎండీఎం వంటి మాదకద్రవ్యాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విశాఖపట్నం, పాడేరు, అరకు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి భారీగా సరఫరా అవుతోంది. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులు, యువతే లక్ష్యంగా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. విద్యార్థులే లక్ష్యంగా... శివారు ప్రాంతాలలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి నుంచి నగరంలోకి సిగరెట్స్, చాకెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో తీసుకొస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. కేజీ గంజాయి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా గ్రాము చొప్పున క్రిస్టల్ను రూ.8 వేలు నుంచి రూ.10 వేలు, మెత్ను రూ.5 వేలు నుంచి రూ.6 వేలు, ఎండీఎంఏను రూ.3 వేలు నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాకు మాదకద్రవ్యాలు చేరుతున్నాయి. రాజధాని ప్రాంతంలోనే ఎక్కువమంగళగిరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఈ స్టేషన్ పరిధిలోనే గత సంవత్సరం ఆగస్టులో 231.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతోపాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 234.2 కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. 38 మందిని అరెస్ట్ చేశారు. దీంతోపాటు మెత్, ఎండీఎంఏ 23 గ్రాములు స్వా«దీనం చేసుకున్నారు. దీనిపై మూడు కేసులు నమోదు చేయడంతోపాటు 17 మందిని అరెస్ట్ చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు వంద కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 20 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు అధిక ధర పెట్టి మద్యం కొనుగోలు చేయలేక చాలా మంది పేదలు, రోజువారీ కూలీలు తక్కువ ధరకు లభించే శానిటైజర్ను మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి మత్తులో తేలుతున్నారు. ఆయా షాపుల్లో ఇలాంటివి విక్రయించడంపై నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది.