breaking news
Business
-
బంగారం, వెండిలా.. దూసుకెళ్తున్న మరో మెటల్ రేటు!
సాధారణంగా విలువైన లోహాలు అంటే చాలామందికి బంగారం, వెండి గుర్తుకొస్తాయి. దీంతో వీటికి డిమాండ్ ఎక్కువై.. రేటు కూడా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో రాగి ధరలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ రేటు 12000 డాలర్లు దాటేసింది.2025లో బంగారం, వెండి ధరలు వరుసగా 70 శాతం, 140 శాతం పెరిగాయి. ఇదే సమయంలో రాగి రేటు ఏకంగా 35 శాతం పెరిగిపోయింది. 2009 తరువాత కాపర్ రేటు ఇంతలా పెరగడం బహుశా ఇదే మొదటిసారి. దీంతో నిపుణులు దీనిని కొత్త బంగారం లేదా కొత్త వెండి అని పిలుస్తున్నారు.రాగి ధరలు భారీగా పెరగడానికి కారణాలుమార్కెట్లో రాగి ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం..భౌగోళిక, రాజకీయ కారణాలు.రాగిని ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో, డేటా సెంటర్లలో, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో వినియోగించడంఅమెరికా విధించిన సుంకాలు కూడా రాగి ధర పెరగడానికి ఓ కారణం అనే చెప్పాలి. సుంకాల కారణంగా.. రాగి రేటు భవిష్యత్తులో పెరుగుతుందేమో అని చాలామంది దీనిని నిల్వ చేసుకుంటున్నారు. దీంతో సరఫరా తగ్గిపోయి.. డిమాండ్ పెరుగుతోంది. డిమాండుకు తగిన సరఫరా లేకపోవడం వల్ల.. ధర పెరిగింది.రాగి ఉత్పత్తి తగ్గడం కూడా సరఫరా తగ్గడానికి కారణమైంది. -
బ్రాంచ్ లేని బ్యాంక్ అకౌంట్లు..
దేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా డిజిటల్ వైపు అడుగులు వేస్తోంది. బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లకుండానే, పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఖాతా తెరవగలిగే డిజిటల్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఆధార్, పాన్ కార్డులు ఉంటే చాలు వీడియో-కేవైసీ సహాయంతో ఇంటి నుంచే ఖాతా ప్రారంభించే సౌకర్యాన్ని పలు బ్యాంకులు కల్పిస్తున్నాయి.ఏయే బ్యాంకులు అందిస్తున్నాయంటే..ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ డిజిటల్ సేవలను ప్రధానంగా అందిస్తున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ తన కొటక్ 811 డిజిటల్ సేవింగ్స్ ఖాతా ద్వారా జీరో బ్యాలెన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి బ్యాంకులు కూడా పేపర్లెస్, బ్రాంచ్లెస్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చాయి.ఇదే విధంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి బ్యాంకులు మొబైల్ యాప్ ఆధారంగా డిజిటల్ ఖాతా ప్రారంభించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ ఖాతాల ద్వారా యూపీఐ, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వర్చువల్ డెబిట్ కార్డ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి.అంతేకాకుండా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి పేమెంట్స్ బ్యాంకులు కూడా డిజిటల్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే వీటిపై డిపాజిట్ పరిమితులు ఉండటంతో, వీటిని సంప్రదాయ బ్యాంక్ ఖాతాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా పరిగణించలేము.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్ (BSBDA)కు డిజిటల్ సదుపాయాలను ప్రోత్సహిస్తూ, ఆర్థిక చేరికను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.డిజిటల్ బ్యాంకింగ్ వల్ల గ్రామీణ ప్రాంతాలు, యువత, ఉద్యోగుల్లో బ్యాంకింగ్ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఆన్లైన్ మోసాల పట్ల కూడా కస్టమర్లు జాగ్రత్తలు వహించాచాలని బ్యాంకులు సూచిస్తున్నాయి. -
అమెజాన్ ఐఎక్స్డీ ప్రోగ్రాంలో నిహార్ ఇన్ఫో
సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకునే దిశగా అమెజాన్ ఇంటర్–స్టేట్ ఎక్స్ప్రెస్ డెలివరీ (ఐఎక్స్డీ) ప్రోగ్రాంలో చేరినట్లు ఈ–కామర్స్ సంస్థ నిహార్ ఇన్ఫో గ్లోబల్ ఎండీ దివ్యేష్ నిహార్ తెలిపారు. ఐఎక్స్డీ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పొందినట్లు పేర్కొన్నారు.ఇప్పటివరకు కంపెనీ రెండు వేర్హౌస్లతో కార్యకలాపాలు సాగిస్తుండగా, ప్రోగ్రాంలో చేరడంతో సదరు రాష్ట్రాల్లోని 20కి పైగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఉపయోగించుకోవడానికి వీలవుతుందని పేర్కొన్నారు.సమర్ధవంతంగా నిల్వలను పాటించేందుకు, వ్యయాల భారాన్ని తగ్గించుకుని దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్, పంపిణీ సామర్థ్యాలను పెంచుకునేందుకు, వేగవంతంగా డెలివరీలు చేసేందుకు ఇది తోడ్పడుతుందని వివరించారు. కంపెనీ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు మొదలైనవి ఆన్లైన్ మార్కెట్ప్లేస్లలో విక్రయిస్తోంది. -
డబ్బు సంపాదన ధ్యేయంగా.. రోజుకు 14 గంటలు పని!
వ్యాపారం చేసి రాణిద్దామనుకున్నాడు. ప్రారంభించిన నెలల వ్యవధిలోనే భారీగా నష్టపోయి, అప్పుల పాలయ్యాడు. ఎలాగైనా అప్పు తీర్చి.. మరోసారి వ్యాపారం చేయడానికి పెట్టుబడి సిద్ధం చేసుకోవాలనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేశాడు. కేవలం ఐదేళ్ల వ్యవధిలో కోటీశ్వరుడయ్యాడు. అప్పు తీర్చడమే కాకుండా.. కొత్త ఏడాదిలో కోటి రూపాయలతో రెండు టిఫిన్ సెంటర్లు కూడా ప్రారంభిస్తాడట. నిరాశతో కూరుకుపోయిన జీవితాన్ని స్వయంకృషితో ముందుకు సాగిన చైనాకు చెందిన పాతికేళ్ల కుర్రాడి గురించి అక్కడి మీడియాలో ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఫుడ్డెలివరీ బాయ్గా కోట్లు ఎలా సంపాదించాడో గర్వంగా చెప్పుకుంటున్నాడు. శ్రమ, పట్టుదల ఉంటే అసాధ్యమేదీ కాదని నిరూపించిన చైనా యువకుడు జాంగ్ జుకియాంగ్ గురించి తెలుసుకుందాం.వ్యాపారంలో నష్టందక్షిణ చైనాలోని షాంఘై నగరానికి చెందిన పాతికేళ్ల 'జాంగ్ జుకియాంగ్' 2020లో ఓ వ్యాపారం ప్రారంభించాడు. ప్రారంభించిన కొన్ని నెలల వ్యవధిలోనే నష్టాల్లో కూరుకుపోయి వ్యాపారం మూసివేశాడు. నష్టంతో పాటు అప్పటికే అతనికి 50వేల యువాన్లు ఇక్కడి కరెన్సీ ప్రకారం. సుమారు ఆరున్నర లక్షలు అప్పు కూడా అయింది. సర్దుకున్న జాంగ్ నిరాశపడలేదు. ఎలాగోలా ముందుకెళ్లాలని నిర్ణయించుకుని షాంఘైలో ఓ పెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లో చేరాడు. ఫుడ్ ఆర్డర్లను సరఫరా చేయసాగాడు. తోటి డెలివరీ బాయ్స్లా కాకుండా.. తనకంటూ ఓ లక్ష్యాన్ని పెట్టకున్నాడు. నెలకు కనీసం ఇక్కడి కరెన్సీలో చూస్తే మూడు లక్షల రూపాయలు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.365 రోజులు పని & రోజుకు 300 పార్శిళ్లుఏడాది మొత్తంలో 365 రోజులు పని చేయడం, రోజూ కేవలం విశ్రాంతి, తినడానికయ్యే సమయాన్ని మినహాయించి మిగతా సమయం అంతా ఫుడ్ డెలివరీ కోసం కేటాయించాడు. నిత్యం ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు అంటే సుమారు 14 గంటలు ఫుడ్ డెలివరీ కోసం తిరిగాడు. రోజూ కనీసం 300 పార్శిళ్లను లక్ష్యంగా పెట్టకుని వాటిని కస్టమర్లకు అందజేశాడు. ప్రతిరోజు సుమారు 9 గంటల పాటు విశ్రాంతి తీసుకునే వాడు. చైనీస్ స్ప్రింగ్ ఫెస్టివల్ సెలవుల్లో కొన్ని రోజులు మాత్రమే సెలవు తీసుకుని మిగతా సమయాన్ని ఫుడ్ డెలివరీకి కేటాయించాడు.డబ్బు సంపాదన ధ్యేయంగా పని చేసిన జాంగ్ రోజూ 300 పార్శిళ్లు ఇవ్వడం... ప్రతి పార్శిల్కు అత్యధికంగా 20 నుంచి25 నిముషాలకు మించి సమయం తీసుకోకుండా త్వరితగతిన డెలివరీ చేయడంలోనూ ఫుడ్ డెలివరీ కంపెనీలో రికార్డు సృష్టించాడు. ఐదేళ్ల వ్యవధిలో జాంగ్ డెలివరీ కోసం 3లక్షల 24వేల కిలోమీటర్లు ప్రయాణించడంతో పాటు లక్షన్నరకు పైగా ఫుడ్ డెలివరీ పార్శిళ్లను అందజేశాడు. అతని అంకితభావాన్ని చూసి తోటి ఉద్యోగలు అతనికి ఆర్డర్ కింగ్ అని నామకరణం చేశారు. ఐదేళ్ల కాలంలో జాంగ్ మొత్తం కోటి 80లక్షలు సంపాదించి.. వాటిలో కోటి 42 లక్షలు పొదుపు చేయగలిగాడు. ఆ డబ్బుతో తిరిగి వ్యాపారం చేయడానికి సిద్ధమవుతన్నాడు. -
ఈ బ్యాంకుకు 115 ఏళ్లు..
ప్రభుత్వ రంగ దిగ్గజం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ 115 వ్యవస్థాపక దినోత్సవాన్ని ముంబైలో జరుపుకొంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు పాల్గొన్నారు.తొలి స్వదేశీ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేశ బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంలో, సమ్మిళిత ఆర్థిక వృద్ధి సాధనలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. బ్యాంకు రుణాల్లో ఆర్ఏఎం (గ్రామీణ, వ్యవసాయ, చిన్న–మధ్య తరహా సంస్థలకు లోన్స్) వాటా 72 శాతంగా ఉండటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.మరోవైపు, దేశవ్యాప్తంగా 4,556 శాఖలు, 21,492 టచ్ పాయింట్లతో విస్తృతంగా సేవలు అందిస్తున్నట్లు బ్యాంకు ఎండీ కల్యాణ్ కుమార్ తెలిపారు. వ్యాపార పరిమాణం రూ. 7,37,938 కోట్లకు చేరినట్లు వివరించారు.భారతదేశంలో తొలి స్వదేశీ బ్యాంకుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) పేరుగాంచింది. 1911లో పూర్తిగా భారతీయుల యాజమాన్యంలో, నిర్వహణలో స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడింది. సోరాబ్జీ పోచ్ఖానావాలా దీనిని స్థాపించారు. -
ఆధార్ పాన్ లింక్: ఇంకొన్ని రోజులే గడువు
ఆధార్ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతుండటంతో, ప్రజలు రెండు గుర్తింపు కార్డులను లింక్ చేయడానికి తొందరపడుతున్నారు. 2025 డిసెంబర్ 31లోపు తమ పాన్ & ఆధార్ కార్డులను లింక్ చేయని వారికి రూ.1000 ఆలస్య రుసుము విధించనున్నారు.ఆధార్తో పాన్ కార్డులు లింక్ చేసుకోనివారు.. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ను ఫైల్ చేయలేరు. ట్యాక్స్ రిఫండ్ను అందుకోలేరు. అలాగే ఇతర బ్యాంకింగ్, షేర్ మార్కెట్ ట్రేడింగ్, ఇతర ఆర్థిక కార్యకలాపాల్లోనూ ఇబ్బందులు తప్పవు. పన్ను ఎగవేతలను.. అక్రమాలను అరికట్టడానికి ఆధార్, పాన్ కార్డులను లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పుడో నిబంధన తెచ్చింది. కాబట్టి అందరూ తమ పాన్, ఆధార్ కార్డులను తప్పకుండా లింక్ చేసుకోవాలి.ఆన్లైన్లో పాన్-ఆధార్ లింక్ చేసుకోవడం ఎలాఅధికారిక ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి."లింక్ ఆధార్"పై క్లిక్ చేసి మీ పాన్, ఆధార్ నంబర్, మొబైల్ నంబరును నమోదు చేయండి.ఇప్పుడు మీ ఫోన్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వివరాలను వెరిఫై చేయండి.లింకింగ్ పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి, వెబ్సైట్లో ‘క్విక్ లింక్స్’కు వెళ్లి ఆధార్ స్టేటస్ లింక్పై క్లిక్ చేయండి. -
బజాజ్ పల్సర్ 150 బైక్.. ‘కొత్త’గా వచ్చేసింది!
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ పాపులర్ పల్సర్ 150 బైక్ను మరింత ఆకర్షణీయంగా అప్ డేట్ చేసింది. దాని మెకానికల్ సెటప్లో ఎలాంటి మార్పులు లేకుండా చిన్నపాటి డిజైన్, ఫీచర్ మెరుగుదలలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పల్సర్ 150 ఇప్పుడు ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్తో వస్తోంది. కాగా బైక్లో ఇప్పుడున్న వేరియంట్లు అలాగే ఉంటాయి.బజాజ్ 2026 ద్వితీయార్ధంలో పల్సర్ క్లాసిక్ శ్రేణిలో మార్పులు చేస్తుందని ఓవైపు ఊహాగానాలు నడుస్తుండగానే బజాజ్ ఆటో తన అత్యంత ఐకానిక్ మోటార్ సైకిళ్లలో ఒకటైన పల్సర్ 150ను రిఫ్రెష్ చేసింది. అప్డేటెడ్ పల్సర్ 150 శ్రేణి ధర రూ. 1.08 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. పల్సర్ 150 ఎస్డీ ధర రూ .1,08,772, పల్సర్ 150 ఎస్డీ యూజీ ధర రూ. 1,11,669లుగా ఉంది. ఇక టాప్-స్పెక్ అయిన పల్సర్ 150 టీడీ యూజీ ధర రూ. 1,15,481. (ఇవన్నీ ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధరలు).ఏం మారాయి..? సమకాలీన మోడల్ బైక్లతో పోటీపడేలా బజాజ్ పల్సర్ 150లో అప్ డేటెడ్ గ్రాఫిక్స్ తో డీటైల్స్ను కాస్త మెరుగుపరిచి కొత్త కలర్ ఆప్షన్లు తీసుకొచ్చింది. ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ను జోడించడం అత్యంత ముఖ్యమైన ఫంక్షనల్ అప్ గ్రేడ్. ఇది బైక్కు విజిబులిటీని పెంచడమే కాకుండా మొత్తం డిజైన్కే మోడ్రన్ టచ్ ఇస్తుంది.పల్సర్ 150 బైకులోని 149.5 సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్పీఎం వద్ద 13.8 బీహెచ్పీ పవర్, 6,500 ఆర్పీఎం వద్ద 13.25 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్ బాక్స్తో జత చేయబడి ఉంటుంది.ఇక బ్రేకింగ్ హార్డ్ వేర్ విషయానికి వస్తే 260 మి.మీ ఫ్రంట్ డిస్క్, సింగిల్-ఛానల్ ఏబీఎస్తో రియర్ డ్రమ్ సెటప్ ఉన్నాయి. కాగా సస్పెన్షన్ పనిని టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్లు,ట్విన్ గ్యాస్-ఛార్జ్డ్ రియర్ షాక్ అబ్జార్బర్లు చూసుకుంటాయి. -
తగ్గిన ఎయిర్ పొల్యూషన్: ఆ వాహనాలపై నిషేధం ఎత్తివేత!
ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైన నేపథ్యంలో.. బీఎస్4 వాహనాలను నగరంలో ప్రవేశించకుండా నిషేధించారు. అయితే ఇప్పుడు ఆ ఆంక్షలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో గాలి నాణ్యత మెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.డిసెంబర్ 13న, ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 స్థాయిని దాటిన తర్వాత.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ IV అమలులోకి వచ్చింది. ఈ సమయంలోనే రాజధానిలో కొన్ని నిర్దిష్ట వాహనాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఇప్పుడు గాని నాణ్యత మెరుగుపడటంతో.. ఈ నిషేధం తొలగించారు.బీఎస్ 6 వాహనాలు మాత్రమే నగరంలోకి ప్రవేశించాలనే నియమం అమలు చేసిన సమయంలో.. సుమారు 1.2 మిలియన్ వాహనాలను నిషేధించారు. అయితే ఇప్పుడు ఆంక్షలు నిషేధించబడినప్పటికీ.. ఢిల్లీలో రిజిస్టర్ చేసుకున్న BS4 వాహనాన్ని కలిగి ఉంటే, మీ PUC చెల్లుబాటు అయితే, GRAP స్టేజ్ IV సమయంలో.. ఢిల్లీ NCRలో ఉపయోగించవచ్చు. ఢిల్లీలో రిజిస్టర్ కానీ బీఎస్3, బీఎస్4 వాహనాలు నగరంలో ప్రవేశించకూడదు. నియమాలను అతిక్రమించిన వాహనదారులు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. -
ఐటీ ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ క్రిస్మస్ కానుక
సాక్షి, ముంబై: సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగులకు క్రిస్మస్ కానుక అందించింది. ఫ్రెషర్లకు ఎంట్రీ-లెవల్ జీతాలను పెంచింది, స్పెషల్ టెక్నాలజీ రోల్స్కు ఏడాది రూ. 21 లక్షల దాకా పరిహార ప్యాకేజీలను అందిస్తోంది. AI-ఫస్ట్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి,డిజిటల్గా స్థానిక ప్రతిభను ఆకర్షించేందుకు సంస్తలో నియామకాలను పెంచుతుంది.ఇది ఇండియాలో మిగిలిన ఐటీ కంపెనీలతో పోలిస్తే ఇదే అత్యధిక ఎంట్రీ-లెవల్ వేతనంగా నిలిచింది.ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు ఆఫర్ ఎంత? మనీకంట్రోల్ అందించిన సమచారం ప్రకారం ఇన్ఫోసిస్ 2025 ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ల కోసం ప్రత్యేక టెక్నాలజీ ఉద్యోగాల ఎంపికకోసం ఆఫ్-క్యాంపస్ నియామక డ్రైవ్ను ప్రారంభించనుంది. దీని వార్షిక పరిహారం రూ. 7 లక్షల నుండి రూ. 21 లక్షల వరకు ఉంటుంది.ఈ ఆఫర్లో స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (L1 నుండి L3), డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ (ట్రైనీ) ఉన్నాయి .అ లాగే కంప్యూటర్ సైన్స్, ఐటీ,ఈఈఈ, ఈసీఈలాంటి ఎంపిక చేసిన సర్క్యూట్ బ్రాంచ్ల నుండి BE, BTech, ME, MTech, MCA ,ఇంటిగ్రేటెడ్ MSc గ్రాడ్యుయేట్లకు అవకాశం ఉంది. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L3 (ట్రైనీ): రూ. 21 వార్షిక ప్యాకేజీని (ఎల్పీఏ) స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L2 (ట్రైనీ): రూ. 16 LPA, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L1 (ట్రైనీ): రూ. 11 LPA, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ (ట్రైనీ): రూ. 7 ఎల్పీఏ అందిస్తుంది.AI-ఫస్ట్ విధానంలో భాగంగా క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ నియామకాల్లో సంవత్సరానికి రూ. 21 లక్షల వరకు ప్యాకేజీలతో ఉద్యోగులను ఎంపిక చేస్తామని ఇన్ఫోసిస్ గ్రూప్ CHRO షాజీ మాథ్యూ తెలిపారు.భారతదేశంలోని అగ్ర ఐటీ సంస్థలలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఎంట్రీ-లెవల్ జీతాలు దశాబ్ద కాలంగా స్తబ్దుగా ఉంది.అయితే, ప్రత్యేక నైపుణ్యాలతో వచ్చే గ్రాడ్యుయేట్ల విషయంలో ఈ ట్రెండ్ మారుతోందంటున్నారు నిపుణులు. -
2025.. ఏఐ ఇయర్
సరిగ్గా ఏడాది కిందట.. ఏఐని ఒక డిజిటల్ విజ్ఞాన సర్వస్వంలా చూశాం. ఏదైనా సమాచారం కావాలన్నా చాట్ జీపీటీని అడిగేవాళ్లం. కానీ 2025కు వచ్చేసరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు మన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఏఐ (జనరేటివ్ ఏఐ), నేడు మన పనులను చక్కబెట్టే ఏఐ ఏజెంట్గా రూపాంతరం చెందింది. గతంలో ఏఐ కేవలం ఒక రియాక్టివ్ అసిస్టెంట్. అంటే మనం అడిగితేనే సమాధానం చెప్పేది. కానీ 2025 ఏఐ టూల్స్ ప్రోయాక్టివ్ పార్ట్నర్స్(మీరు ఒక చిన్న మాట చెబితే మీ అవసరాలను ఊహించి, మీ ప్రమేయం లేకుండానే పనులను పూర్తి చేసే ఒక తెలివైన భాగస్వామి)గా మారాయి.సాంకేతిక నిపుణులు 2025వ సంవత్సరాన్ని ఏఐ ఇయర్గా అభివర్ణిస్తున్నారు. 2024లో కేవలం మాటలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) 2025లో చేతల్లోకి వచ్చేసింది. కేవలం ప్రశ్నలకు సమాధానాలివ్వడమే కాకుండా మన పనులను స్వయంగా పూర్తి చేసే ఏఐ ఏజెంట్లు ఈ ఏడాది కీలకంగా మారాయి. జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు జనరేటివ్ ఏఐ రంగంలో కంపెనీలు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, టూల్స్ పై ప్రత్యేక కథనం.తొలి త్రైమాసికంలో..చైనాకు చెందిన డీప్సీక్ ఆర్1 మోడల్ విడుదల కావడంతో ఏఐ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇది తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఆలోచనా సామర్థ్యం అందించడంతో ఓపెన్ సోర్స్ ఏఐ ఊపందుకుంది. ఇదే నెలలో ఓపెన్ఏఐ ఓ3-మినీని విడుదల చేసింది.ఆంథ్రోపిక్ Claude 3.7 Sonnetను, ఎలాన్ మస్క్ గ్రోక్ 3ని లాంచ్ చేశారు. వీటితో పాటు ఓపెన్ఏఐ కంప్యూటర్లను స్వయంగా ఆపరేట్ చేయగల Operator అనే ఏజెంట్ను పరిచయం చేసింది. గూగుల్ తన అత్యంత వేగవంతమైన Gemini 2.5 Flash, రోబోటిక్స్ కోసం ప్రత్యేకమైన ఏఐ మోడల్స్ను తెచ్చింది.రెండో త్రైమాసికంలో..ఏప్రిల్లో మెటా Llama 4 మోడల్స్ను విడుదల చేసింది. ఇవి ఓపెన్ సోర్స్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించాయి. మేలో ఆంథ్రోపిక్ నుంచి Claude 4 విడుదలయ్యింది. ఇది మనుషుల లాగా వరుసగా ఏడు గంటల పాటు స్వయంగా పని చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. జూన్లో గూగుల్ తన సెర్చ్ ఇంజిన్లో ఏఐ మోడ్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది.మూడో త్రైమాసికంజులైలో ఓపెన్ఏఐ తన ఆదాయంలో 1 బిలియన్ డాలర్ల మార్కును దాటి ఏఐ మార్కెట్ సత్తాను చాటింది. ఆగస్టులో అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన జీపీటీ-5 విడుదలైంది. ఇది మునుపటి మోడల్స్ కంటే రెట్టింపు తెలివితేటలతో, కోడింగ్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. సెప్టెంబర్లో వీడియో జనరేషన్ రంగంలో ఓపెన్ఏఐ Sora యాప్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తన వీడియో మోడల్ Veo 2తో దీనికి పోటీనిచ్చింది.నాలుగో త్రైమాసికంఅక్టోబర్లో ఓపెన్ఏఐ తన సంస్థాగత నిర్మాణాన్ని మార్చుకుని పూర్తి లాభాపేక్ష కలిగిన కంపెనీగా అవతరించింది. నవంబర్లో గూగుల్ Gemini 3.0ని విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో పర్సనల్ అసిస్టెంట్గా మారింది. డిసెంబర్లో GPT-5.2 అప్డేట్తో పాటు, గూగుల్ ట్రాన్స్లేట్లో అత్యంత కచ్చితమైన ఏఐ అనువాద ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.ఇదీ చదవండి: చెక్ పవర్ తగ్గిందా? -
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
ప్రపంచవ్యాప్తంగా వెండి ధర భగ్గుమంటోంది. ప్రతిరోజూ కొత్త రికార్డు స్థాయికి దూసుకెళ్తోంది. ఔన్స్కు 72 డాలర్ల మార్కును దాటింది. దాదాపు 140% లాభాలతో, వెండి అనేక ఇతర అసెట్లను గణనీయంగా అధిగమించింది. ఈ నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఫియట్ కరెన్సీ, హార్డ్ అసెట్స్పై వ్యాఖ్యానానికి ప్రసిద్ధి చెందిన రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు.పారిశ్రామిక డిమాండ్, స్థూల ఆర్థిక ఆందోళనల మధ్య సురక్షిత-స్వర్గధామ ఆస్తిగా భావిస్తూ పెట్టుబడులు పెంచుతుండటంతో వెండి ధరలు తారస్థాయికి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో తనదైన శైలిలో స్పందించారు.‘వెండి 70 డాలర్లు దాటింది.బంగారం, వెండి పొదుపు చేసేవారికి గొప్ప వార్త.ఫేక్ మనీ (డాలర్లు) దాచుకునే వాళ్లకు బ్యాడ్ న్యూస్’ అంటూ పోస్టును ప్రారంభించిన కియోసాకి అధిక ద్రవ్యోల్బణం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, డాలర్ విలువను కోల్పోతూనే ఉన్నందున 2026 నాటికి వెండి ఔన్స్ కు 200 డాలర్లకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు.‘నష్టపోకండి.. వెండి ధర 2026 నాటికి 200 డాలర్లకు చేరుకుంటున్న క్రమంలో ఆ ఫేక్ డాలర్ (డబ్బు విలువ ఉండదనేది ఆయన అభిప్రాయం) కొనుగోలు శక్తి మరింత క్షీణిస్తుంది’ అంటూ ముగించారు. రాబర్ట్ కియోసాకి అంచనా కాస్త అతిశయోక్తిలా అనిపించినా వెండి ధర అత్యంత వేగంగా పెరుగుతోందనే విషయం మాత్రం వాస్తవం. SILVER over $70.GREAT NEWS for gold and silver stackers.BAD NEWS for FAKE MONEY savers.I am concerned $70 silver may signal hyper-inflation in 5 years as the fake $ keeps losing value. Don’t be a loser. Fake $ will continue to lose purchasing power as silver goes to…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 23, 2025 -
పండగ సీజన్లో గిగ్ వర్కర్ల షాక్ : 7 రోజుల జాతీయ సమ్మె
సాక్షి,ముంబై: జీతం, భద్రతా ప్రమాణాలు, సామాజిక భద్రత డిమాండ్లతో గిగ్ వర్కర్లు జాతీయ సమ్మెకు పిలుపునిచ్చారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రధాన ఫుడ్ డెలివరీ, ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలోని డెలివరీ పార్టనర్స్ డిసెంబర్ 25 నుంచి 31వ తేదీవరకు అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చారు. పని పరిస్థితులు, సామాజిక భద్రత పరిస్తితులు మరింత దిగజారుతున్నాయని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా "10 నిమిషాల డెలివరీ" లాంటి వాటిని ఉపసంహరించుకోవాలనేది ముఖ్యమైన డిమాండ్.తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, కర్ణాటక యాప్ ఆధారిత వర్కర్స్ యూనియన్తో సహా , ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. మెట్రో, టైర్-2 నగరాల్లో డెలివరీ భాగస్వాములు ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది. భారతదేశం అంతటా డెలివరీ కార్మికులు అఖిల భారత సమ్మెను ప్రకటించినందున, క్రిస్మస్ రోజు (డిసెంబర్ 25),నూతన సంవత్సర వేడుకల (డిసెంబర్ 31) నాడు ఆన్లైన్ ఫుడ్, కిరాణా, ఇ-కామర్స్ డెలివరీలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.కంపెనీలు కార్మికులకు న్యాయమైన వేతనాలు, భద్రత, గౌరవం, సామాజిక భద్రతను కల్పించడం లేదని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ఎక్కువ పని గంటలు, హై-రిస్క్ డెలివరీలు ముఖ్యంగా గరిష్ట డిమాండ్ సమయాల్లో, ప్రాథమిక కార్మిక రక్షణ వ్యవస్థ లేవని కార్మికులు ఆరోపిస్తున్నారు. పది నిమిషాల్లో డెలివరీ సర్వీసుతో కార్మికుల్లో ఒత్తిడి తీవ్రమవుతోందంటున్నారు. అంతేకాదు ఇది తమ ప్రాణాలనే ప్రమాదంలో పడేస్తుందని కార్మికులు చెబుతున్నారు. ఇతర డిమాండ్లలోయు పారదర్శకమైన ఆర్డర్కు చెల్లింపు, మెరుగైన ప్రోత్సాహక నిర్మాణాలు, తప్పనిసరి విశ్రాంతి విరామాలు, సహేతుకమైన పని గంటలు లాంటివి ఉన్నాయి. అదనపు డిమాండ్లలో మెరుగైన భద్రతా చర్యలు, బలమైన సాంకేతిక ,యాప్ మద్దతు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, ప్రమాద కవరేజ్, పెన్షన్ ప్రయోజనాలు ,కార్యాలయంలో గౌరవప్రదమైన చికిత్స ఉన్నాయి. యూనియన్లలో చేరినందుకు లేదా పని సంబంధిత సమస్యలపై స్వరం పెంచినందుకు కొంతమందిని బ్లాక్మెయిల్, లేదా వేధిస్తున్నారని కూడా కార్మికులు ఆరోపించారు.అలాగే డెలివరీ ఐడిలను ఏకపక్షంగా బ్లాక్ చేయడం, అక్రమంగా విధించిన జరిమానాలను నిలిపివేయాలని కూడా కార్మికులు డిమాండ్ చేశారు. సరైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు లేకపోవడం, రూటింగ్ మరియు చెల్లింపులను ప్రభావితం చేసే యాప్ లోపాలు మరియు అల్గారిథమ్ ఆధారిత వివక్ష కారణంగా అస్థిరమైన పని కేటాయింపుపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, ఆయా ప్లాట్ఫామ్ కంపెనీలను నియంత్రించాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని, గిగ్ కార్మికులకు సామాజిక భద్రతా చట్రాలను అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు. -
రూ.10 నోట్లకు గుడ్బై..!
సామాన్య ప్రజల దైనందిక అవసరాలలో చిల్లర నోట్లకు ఉన్న ప్రాధాన్యత తెలియనిది కాదు. అలాగే విద్యార్థుల అవసరాలకు, చిన్న చిన్న ఒప్పందాల లావాదేవీలలో ఉపయోగించే 10 రూపాయల స్టాంప్ పేపర్ల పాత్ర ప్రాధాన్యమైంది. ఉదయం పాల నుంచి మార్కెట్లో కూరగాయలు, నిత్యావసరాల కొనుగోళ్లలో పది రూపాయల నోట్ల ప్రాధాన్యత మామూలుది కాదు. అయితే కొన్నేళ్లుగా రూ.10 నోట్లు కనుమరుగవుతున్నాయి. నోట్లకు బదులు విడుదల చేసిన రూ.10 నాణేలు చెల్లుబాటు కావని పలు వదంతులు రావడంతో వాటి చెలామణిలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రూ.10 నాణెం తయారీ కంటే 10 నోట్ల ముద్రణ తక్కువ ఖర్చవుతున్నా వాటి జీవిత కాలం తక్కువగా ఉండటంతో నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసినట్లు తెలుస్తోంది. వేయి రూ.10 నోట్లు ముద్రించడానికి ఆర్బీఐకి 966(ప్రతీ నోటుకు 1.01 రూ) రూపాయలు ఖర్చవుతుండగా. 10 నాణెం తయారీకి 5.54 రూపాయలు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. నోట్ల ముద్రణ తక్కువ ఖర్చుతో కూడుకున్నదే అయినా వాటి జీవితకాలం కూడా తక్కువగానే ఉంటున్నది. 10 రూపాయల నోటు ఏడాదిలోపే శిథిలమవుతుండగా నాణాలు మాత్రం జీవితకాలం పాడవకుండా ఉంటాయి. ఇదే కారణంగా ప్రతి ఏడాది నోట్ల ముద్రణ కంటే నాణాల ముద్రణకే ఆర్బీఐ మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. మార్కెట్లో 10 నాణాలపై వస్తున్న వదంతులను ఖండిస్తూ ఆర్బీఐ కచ్చితమైన ప్రకటనలు చేసింది. 10 నాణాలను (10 Rupees Coins) ఎవరైనా నిరాకరిస్తే ఫిర్యాదు చేయవచ్చని సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లను సామాజిక మాధ్యాల ద్వారా పోస్టర్ల ద్వారా బ్యాంకుల్లో ప్రదర్శించింది. వదంతులకు గురైన పాత రూ.10 నాణాలతో పాటు, గత సంవత్సరం కొత్త రూ.10 నాణాలను ఆర్బీఐ విడుదల చేసింది. రూ.10 నోట్ల కొరత కారణంగా ప్రస్తుతం రూ.10 నాణాల పట్ల మార్కెట్లో తిరస్కరణ ఉండటం లేదని పలువురు అంటున్నారు.రూ.10 స్టాంప్ పేపర్ల కొరతవిద్యార్థుల, సామాన్యుల అవసరాలలో ప్రాధాన్యత కలిగిన రూ.10 స్టాంప్ పేపర్లు కూడా కనుమరుగయ్యాయి. కొద్ది కాలం క్రితం వరకు వాహనాల నెలవారీ కిరాయిలు, ఇళ్లు, దుకాణాల కిరాయినామా లావాదేవీలు, చిన్న చిన్న అఫిడవిట్లు పూర్తిగా రూ.10 స్టాంప్ పేపర్ల పైనే జరిగేవి. విద్యార్థుల స్టైఫండ్ల రెన్యూవల్స్, ఆదాయ, కుల ధృవీకరణాల పత్రాల కోసం ఈ స్టాంప్ పేపర్లనే వాడే వారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు రూ.10 స్టాంప్ పేపర్లపైనే అందజేసేవారు. కొద్ది కాలంగా స్టాంప్ పేపర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్థులు, సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.10 స్టాంప్లు లభించకపోవడంతో రూ.20, రూ.50, రూ.100 స్టాంప్ పేపర్లను వాడాల్సి వస్తోంది. సాధారణ అవసరాలకు కూడా ఎక్కువ విలువ గల స్టాంప్ పేపర్లను వాడుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ఏడాది క్రితమే రూ.10 స్టాంప్ పేపర్ల ముద్రణ కూడా ఆగిపోయిందని అధికారులు అంటున్నారు.ఫ్రాంకింగ్ మెషిన్ల ద్వారా..స్టాంప్ పేపర్ల కొరతను అధిగమించేందుకు ప్రతి రిజి్రస్టార్ కార్యాలయాల్లో ఫ్రాంకింగ్ మెషిన్లను అందుబాటులోకి తెచ్చినట్లు సబ్ రిజిస్ట్రార్ అధికారులు తెలిపారు. ఈ మెషిన్ల ద్వారా తెల్ల కాగితంపై వినియోగదారులకు ఎంత విలువ స్టాంప్ పేపర్లు (Stam Papers) అవసరమో ఆ విలువను ముద్రించి ఇస్తున్నామని వారు అంటున్నారు. -
చెక్ పవర్ తగ్గిందా?
రెండు దశాబ్దాల క్రితం.. బ్యాంకుకి వెళితే పెద్ద క్యూ లైన్, చేతిలో చెక్కు పుస్తకం, సంతకం వెరిఫికేషన్ కోసం ఎదురుచూపులు. అప్పట్లో ఒకరికి డబ్బు పంపాలంటే చెక్కు రాసి ఇవ్వడమే అత్యంత సురక్షితమైన, ఏకైక మార్గం. ఇరవై ఏళ్ల క్రితం దేశంలోని మొత్తం ఆర్థిక లావాదేవీల విలువలో 98.8 శాతం వాటా చెక్కులదే. కానీ, కాలం మారింది.. టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు అదే బ్యాంకు మన అరచేతిలోకి వచ్చేసింది. ఒకప్పుడు సంతకం కోసం నిమిషాలు వేచి చూసిన మనం, ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో పని ముగిస్తున్నాం. ఈ మార్పు వెనుక చాలానే కారణాలున్నాయి.ఆర్థిక లావాదేవీల పరిణామంభారతీయ బ్యాంకింగ్ రంగంలో గత ఇరవై ఏళ్లుగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. జరుగుతున్న మార్పులు విస్మయానికి గురిచేస్తాయి. ఒకప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయాలంటే కేవలం చెక్కులే దిక్కు. కానీ నేడు స్మార్ట్ఫోన్ల ద్వారా ఒక్క క్లిక్తో క్షణాల్లో పని పూర్తవుతోంది. కొన్ని సర్వేల ప్రకారం మొత్తం వార్షిక లావాదేవీల విలువలో చెక్కుల వాటా ఎలా పడిపోయిందో చూద్దాం.సంవత్సరంలావాదేవీల విలువలో చెక్కుల వాటా (%)200598.8%201092.5%201550.7%202015.4%20248.5% 2005లో దాదాపు పూర్తి స్థాయిలో (98.8%) రాజ్యమేలిన చెక్కులు, 2024 నాటికి కేవలం 8.5 శాతానికి పడిపోయాయి. అంటే ప్రజలు, వ్యాపార సంస్థలు పేపర్ ఆధారిత లావాదేవీల కంటే ఎలక్ట్రానిక్ పద్ధతులకే మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది.మార్పునకు కారణాలుపెద్ద నోట్ల రద్దు.. 2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు భారత ఆర్థిక వ్యవస్థకు ఒక టర్నింగ్ పాయింట్. నగదు కొరత ఏర్పడటంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతికారు. ఇది డిజిటల్ వాలెట్లు, కార్డ్ పేమెంట్స్ వాడకాన్ని ఒక్కసారిగా పెంచింది.యూపీఐ విప్లవం.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) చెక్కుల మనుగడను ప్రశ్నార్థకం చేసింది. చెక్కు రాసి బ్యాంకుకు వెళ్లి, అది క్లియర్ అవ్వడానికి రెండు రోజులు వేచి చూసే బదులు సెకన్లలో డబ్బు పంపే సౌలభ్యం యూపీఐ కల్పించింది.డిజిటలైజేషన్, ఇంటర్నెట్ వ్యాప్తి.. చౌకైన డేటా ధరలు, స్మార్ట్ఫోన్ల లభ్యత పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లావాదేవీలు సాధారణమయ్యాయి. నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ వంటి సేవలు చెక్కుల అవసరాన్ని భారీగా తగ్గించాయి.భవిష్యత్తు అంచనాలుభవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు మరింత వినూత్నంగా మారబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన ‘ఈ-రూపాయి’(e-Rupee) రాబోయే రోజుల్లో ఫిజికల్ క్యాష్, చెక్కుల అవసరాన్ని మరింత తగ్గిస్తుంది. భవిష్యత్తులో కేవలం ముఖ గుర్తింపు లేదా వేలిముద్రలతో మరింత సురక్షితమైన లావాదేవీలు జరగనున్నాయి. యూపీఐ సేవలు ఇప్పటికే ఇతర దేశాలకు (సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్ వంటివి) విస్తరిస్తున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ లావాదేవీల్లో కూడా చెక్కులు లేదా డ్రాఫ్టుల వాడకం కనుమరుగవుతుంది. ఫిజికల్ బ్యాంక్ బ్రాంచ్లతో పనిలేకుండా ‘నియో బ్యాంక్స్(డిజిటల్ బ్యాంకులు)’ ప్రాధాన్యత పెరగనుంది.ఇదీ చదవండి: పదవి పట్టాభిషేకం కాదు.. ప్రజాసేవకు పునాది! -
ఆకాశంలో ఇక ‘కొత్త విమానాలు’
దేశీ గగనతలంపై త్వరలో కొత్త ఎయిర్లైన్స్ రెక్కలు విప్పుకోనున్నాయి. ఇటీవలే ఇండిగో సంక్షోభంతో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం.. ఈ రంగంలో పోటీని పెంచేందుకు వీలుగా రెండు కొత్త సంస్థల కార్యకలాపాలకు పచ్చజెండా ఊపింది.కేరళకు చెందిన అల్హింద్ గ్రూప్ కంపెనీ అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్ప్రెస్ సంస్థలకు పౌర విమానయాన శాఖ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) మంజూరు చేసింది. మరోవైపు ఇప్పటికే ఎన్వోసీని సొంతం చేసుకున్న శంఖ్ఎయిర్ సైతం 2026 మొదటి త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్టు బుధవారం ప్రకటించింది.వచ్చే రెండు మూడేళ్లలో 20–25 ఎయిర్క్రాఫ్ట్లకు తమ సామర్థ్యాలను పెంచుకుంటామని సంస్థ చైర్మన్, ఎండీ శర్వణ్కుమార్ విశ్వకర్మ కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్నాయుడుతో భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. దేశీయంగా 9 విమానయాన సంస్థలు సేవలు అందిస్తుండగా, ఇండిగో, ఎయిర్ఇండియా 90 శాతం వాటా కలిగి ఉన్నాయి.ఇప్పటికే ఎన్వోసీ పొందిన సంస్థలు తదుపరి దశలో ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (ఏఓసీ) కోసం డీజీసీఏ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో భద్రతా ప్రమాణాలు, పైలట్లు–సిబ్బంది శిక్షణ, విమానాల సమీకరణ, నిర్వహణ వ్యవస్థలపై కఠిన పరిశీలన జరుగుతుంది. అనుమతులు పూర్తయిన తర్వాత దేశీయ రూట్లతో పాటు మధ్యప్రాచ్యం, దక్షిణాసియా వంటి ప్రాంతాలకు అంతర్జాతీయ సేవలపై కూడా ఈ సంస్థలు దృష్టి పెట్టే అవకాశముంది. ముఖ్యంగా కేరళ కేంద్రంగా పనిచేసే సంస్థలు గల్ఫ్ దేశాలకు ప్రయాణికుల డిమాండ్ను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.కొత్త ఎయిర్లైన్స్ రాకతో టికెట్ ధరల్లో పోటీ పెరిగి ప్రయాణికులకు మరిన్ని ఎంపికలు లభించనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అలాగే చిన్న నగరాలు, టైర్-2, టైర్-3 పట్టణాలకు కనెక్టివిటీ మెరుగుపడే అవకాశం ఉంది. ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్న ప్రాంతీయ విమానయాన పథకాలకు కూడా ఇవి తోడ్పడతాయని అంచనా. అదే సమయంలో ఇంధన ధరలు, విమానాల లీజింగ్ ఖర్చులు, నైపుణ్య సిబ్బంది కొరత వంటి సవాళ్లను కొత్త సంస్థలు ఎలా ఎదుర్కొంటాయన్నది ఆసక్తికరంగా మారింది. -
బంగారమా.. ఈరోజైనా కొనగలమా?
దేశంలో బంగారం, వెండి ధరల పరుగు కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజూ ధరలు పైకే ఎగబాకాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) అదే స్థాయిలో పెరిగాయి. వెండి ధరలు వేగాన్ని కాస్త తగ్గించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
పదవి పట్టాభిషేకం కాదు.. ప్రజాసేవకు పునాది!
తెలంగాణ పల్లెల్లో మళ్లీ కొత్త పాలన మొదలైంది. ఊరూరా ఎన్నికల కోలాహలం ముగిసి, కొత్తగా ఎన్నికైన సర్పంచులు నియామక పత్రాలు అందుకుని గద్దెనెక్కారు. అయితే, కొంతమంది సర్పంచుల్లో ఈ విజయోత్సాహం వెనుక ఒక చేదు నిజం కూడా ఉంది. ఎన్నికల హోరాహోరీలో గెలుపు కోసం చాలా చోట్ల తాయిలాలు, నగదు ప్రవాహం రాజ్యమేలిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు కొత్త సర్పంచుల ముందున్న లక్ష్యం ఏమిటి? ఎన్నికల్లో ఖర్చు చేసిన పెట్టుబడిని రాబట్టుకునే మార్గాలను వెతకడమా? లేక పల్లె ప్రగతికి బాటలు వేయడమా? అనే సందిగ్ధం కొద్దిమందిలో నెలకొంది.2018 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం సర్పంచ్కు ఒక సామాన్య ప్రతినిధి హోదా నుంచి గ్రామ పాలకుడి స్థాయి అధికారాన్ని కట్టబెట్టింది. అధికారం అంటే ఆధిపత్యం కాదు.. పారిశుధ్యం, హరితహారం, మౌలిక వసతుల కల్పనలో చూపాల్సిన కార్యదక్షత. ఓటును కొనుక్కున్నామనే భావన పక్కన పెట్టి, గ్రామ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ప్రతి పైసాను అభివృద్ధికి వెచ్చించేలా సర్పంచులు అడుగులు వేయాల్సిన సమయం ఇది. పదవిని ఒక వ్యాపారంగా చూడకుండా, పల్లెను ఒక ఆదర్శంగా మార్చే బాధ్యతగా స్వీకరించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది.తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక వికాసానికి గ్రామాలు పట్టుకొమ్మలు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామం ఒక స్వయం ప్రతిపత్తి గల యూనిట్గా పనిచేస్తుంది. ఈ వ్యవస్థలో సర్పంచ్ కేవలం ఒక ప్రతినిధి మాత్రమే కాదు, గ్రామ సర్వతోముఖాభివృద్ధికి సారథి.పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ విధులుగ్రామసభ నిర్వహణ.. ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామసభను నిర్వహించి, ప్రజల అవసరాలను గుర్తించడం.పారిశుధ్యం, ఆరోగ్యం.. గ్రామంలో చెత్త సేకరణ (తడి, పొడి చెత్త విభజన), మురుగు కాలువల శుభ్రత, అంటువ్యాధులు ప్రబలకుండా చూడటం సర్పంచ్ ప్రథమ కర్తవ్యం.హరిత హారం.. గ్రామంలో నర్సరీల నిర్వహణ, నాటిన మొక్కల్లో కనీసం 85% బతికించాల్సిన బాధ్యత సర్పంచ్పై ఉంటుంది.ఆర్థిక నిర్వహణ.. పంచాయతీ నిధులను పారదర్శకంగా ఖర్చు చేయడం, వార్షిక బడ్జెట్ ఆమోదించి, ఆడిటింగ్కు సహకరించడం.మౌలిక సదుపాయాలు.. వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, అంతర్గత రోడ్ల మరమ్మతులు పర్యవేక్షించడం.ఎన్నికల ఖర్చు.. అభివృద్ధి కాంక్షఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి భారీగా ఖర్చు చేశారనే వాదనలు ఉన్న మాట వాస్తవం. అయితే, ‘పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవాలి’ అనే ధోరణితో సర్పంచులు పనిచేస్తే, అది గ్రామానికి శాపంగా మారుతుంది. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అవినీతికి పాల్పడితే చట్టపరమైన చర్యలు (కలెక్టర్ ద్వారా తొలగింపు) ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించాలి. రాజకీయ అధికారం అనేది కేవలం ఐదేళ్ల అవకాశం. ఈ సమయంలో సంపాదించిన సొమ్ము కంటే గ్రామంలో నిర్మించిన అభివృద్ధి చిహ్నాలు, ప్రజల గుండెల్లో సంపాదించుకున్న గౌరవం శాశ్వతంగా నిలిచిపోతాయి.గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దే మార్గాలుకొత్తగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చడానికి కొన్ని అంశాలపై దృష్టి సారించాలి. గ్రామ పంచాయతీ సేవలను ఆన్లైన్ చేయడం, ప్రతి పద్దును ప్రజల సమక్షంలో చర్చించి ఖర్చు చేయడం ద్వారా పారదర్శకతను పెంచవచ్చు. గ్రామ వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలను అన్వేషించాలి. పన్నుల వసూలులో క్రమశిక్షణ పాటించాలి. అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, స్వయం సహాయక సంఘాలకు తోడ్పాటు అందించాలి. ఏదైనా పని చేసే ముందు ప్రజల సలహాలను తీసుకోవడం వల్ల పనుల్లో నాణ్యత పెరుగుతుంది. జవాబుదారీతనం ఉంటుంది.సర్పంచ్ పదవి అనేది కేవలం హోదా కాదు, అది ఒక గొప్ప సామాజిక బాధ్యత. ఎన్నికల్లోని ఖర్చును ఒక సామాజిక సేవగా భావించి, రాబోయే ఐదేళ్లు గ్రామ పురోభివృద్ధికి అంకితం కావాలి. పచ్చని చెట్లు, శుభ్రమైన వీధులు, విద్యావంతులైన యువత.. ఉన్న గ్రామమే నిజమైన బంగారు తెలంగాణకు పునాది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని లాభపడటం కంటే ఒక తరాన్ని బాగు చేసే గ్రామ నాయకుడిగా ఎదగడమే సర్పంచుల అసలు విజయం.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!? -
దేశంలో అతిపెద్ద సోప్ బ్రాండ్ ఏదంటే..
విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ సంస్థకు చెందిన ‘సంతూర్’ సబ్బు దేశంలోనే అతిపెద్ద సోప్ బ్రాండ్గా అవతరించింది. గడిచిన ఏడాది కాలంలో రూ.2,850 కోట్ల విలువైన సంతూర్ సోప్ల అమ్మకాలు జరిగినట్లు ఇన్వాయిస్డ్ సేల్స్ (ఇండాస్) డేటా వెల్లడించింది. ప్రతి భారతీయ మహిళకు ‘యవ్వనమైన, కాంతివంతమైన చర్మం’ అనే ట్యాగ్లైన్తో సంతూర్ గుర్తింపు పొందింది. తర్వాత ‘సంతూర్ మామ్’ ప్రచారంతో కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంది.ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ వినీత్ అగర్వాల్ మాట్లాడుతూ... ‘కస్టమర్ల అవసరాలపై లోతైన అవగాహన, వ్యూహాలను కఠిన క్రమశిక్షణతో అమలు చేయడం, దీర్ఘకాలంలో స్థిరమైన విలువను సృష్టిస్తుందనే నమ్మకం, ఆకర్షణీయమైన ప్రకటనలు విజయానికి కారణమయ్యాయి. 1986లో కేవలం రూ.60 కోట్ల ఆదాయంతో ప్రారంభమైన సంతూర్, వ్యూహాత్మక విస్తరణతో 2018లో రూ.2,000 కోట్ల మైలురాయిని దాటింది. ప్రస్తుతం రూ.2,850 కోట్ల ఆదాయంతో లైఫ్బాయ్ను అధిగమించి దేశంలోనే నంబర్ వన్ సబ్బు బ్రాండ్గా నిలిచింది’ అని అన్నారు.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!? -
పన్ను చెల్లింపుదారులను పెంచుకోవాలి
వృద్ధిని మరింత వేగవంతం చేయడానికి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులను మరింత విస్తృతం చేసుకోవడంతోపాటు.. ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడంపై 2026–27 బడ్జెట్లో దృష్టి సారించాలని ‘థింక్ చేంజ్ ఫోరమ్’ (టీసీఎఫ్) సూచించింది. పన్నులను సులభతరం చేయడం వల్ల ఆదాయాన్ని పెంచుకోవచ్చని ఇటీవలి జీఎస్టీ 2.0 సంస్కరణలు నిరూపించినట్టు పేర్కొంది.పన్ను వసూళ్లను పెంచుకునేందుకు అధిక పన్ను రేట్లు ఉండాలన్న దీర్ఘకాలిక నమ్మకాన్ని ఇది సవాలు చేసినట్టు తెలిపింది. జీఎస్టీ సంస్కరణల సూత్రాలను ప్రత్యక్ష పన్నులకూ విస్తరించాలని సూచించింది. విధానపరమైన స్పష్టత, నిబంధనల అమలు ఆధారిత వృద్ధి ఉండాలని పేర్కొంది. పరిహార సెస్సు ముగిసిన తర్వాత ఎంఆర్పీ ఆధారిత పన్నుల వ్యవస్థను నిలిపవేయాలని సూచించింది. ఉత్పాదకతను పెంచే పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, చట్టవిరుద్ధ/దొంగ రవాణాతో కూడిన సమాంతర ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరింది. పన్నుల నిష్పత్తిని పెంచుకోవాలి..జీడీపీలో పన్నుల నిష్పత్తిని పెంచుకునేందుకు పన్ను చెల్లింపుదారులను విస్తృతం చేసుకోవడంపై తక్షణం దృష్టి సారించాలని థింక్ చేంజ్ ఫోరమ్ నివేదిక ప్రధానంగా సూచించింది. 140 కోట్ల జనాభాలో పన్ను చెల్లింపుదారులు కేవలం 2.5–3 కోట్లుగానే ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. రేట్లను పెంచడం కాకుండా టెక్నాలజీ సాయంతో పన్ను చెల్లింపుదారులను విస్తృతం చేసుకోవాలని కోరింది. ఇందుకు గాను జీఎస్టీ, ఆదాయపన్ను, అధిక వినియోగ డేటాను అనుసంధానించాలని సూచించింది.గత దశాబ్ద కాలంలో కార్పొరేట్ లాభదాయకత పెరిగినప్పటికీ.. జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి 2011 నాటి గరిష్ట స్థాయికి దిగువనే ఉన్నట్టు తెలిపింది. కంపెనీల లాభాలు ఉత్పాదకతను పెంచే సామర్థ్య విస్తరణకు కాకుండా, ఆర్థిక సాధనాల్లోకి వెళుతున్నట్టు పేర్కొంది. కనుక పన్ను ప్రోత్సాహకాలతోపాటు, పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ), ఉపాధి కల్పనను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని కోరింది.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!? -
వృద్ధికి మద్దతుగా 2026–27 బడ్జెట్
దేశీయంగా బలంగా ఉన్న డిమాండ్కు ప్రేరణనివ్వడం ద్వారా వచ్చే బడ్జెట్ (2026–27) వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని ఈవై ఎకానమీ వాచ్ తన అంచనా వ్యక్తం చేసింది. వృద్ధికి అనుకూలమైన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాన్ని సానుకూలంగా పేర్కొంది. ఆదాయపన్ను మినహాయింపులు, జీఎస్టీ సంస్కరణలతో కొంత ఆదాయం కోల్పోవాల్సి వస్తున్నప్పటికీ.. పన్నేతర ఆదాయం కింద బడ్జెట్లో పేర్కొనని అదనపు ఆదాయం, బడ్జెట్లో ప్రకటించిన కొన్ని రకాల వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా ప్రభుత్వం నిర్దేశించుకున్న ద్రవ్యలోటు, మూలధన వ్యయాల లక్ష్యాలను చేరుకోవచ్చని అంచనా వేసింది.ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ఇటీవలే పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, జాతీయ భద్రతా, ప్రజారోగ్యం సెస్సులను ప్రస్తావించింది. పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ, పాన్ మసాలాపై సెస్సును అమలు చేసే రెండు చట్టాలకు పార్లమెంట్ ఇటీవలే ఆమోదించడం తెలిసిందే. ‘‘ఇక ముందూ భారత్ వృద్ధికి మద్దతుగా దేశీ డిమాండ్పైనే ఆధారపడడం కొనసాగొచ్చు. దీనికితోడు ఆర్బీఐ వృద్ధి ఆధారిత విధానంతో 2026–27 బడ్జెట్ వృద్ధికి మద్దతుగా ఉంటుందని అంచనా వేయొచ్చు’’అని ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు.అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో వాస్తవ జీడీపీ వృద్ధికి ఎగుమతుల రూపంలో సమకూరేది ప్రతికూలంగా ఉండొచ్చని ఈవై ఎకా నమీ వాచ్ పేర్కొంది. రెండో త్రైమాసికం జీడీపీ వృద్ధి (సెప్టెంబర్ క్వార్టర్)లో ఎగుమతుల వాటా మైనస్ 2.1 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. జూన్ త్రైమాసికంలో ఇది మైనస్ 1.4 శాతంగా ఉందని, అక్క డి నుంచి పెరిగినట్టు తెలిపింది. వాణిజ్య అనిశి్చతులు సమసిపోయే వర కు ఇదే పరిస్థితి కొనసొ గొచ్చని అంచనా వేసింది. భారత్ మధ్య కాలానికి 6.5% వృద్ధిని కొనసాగించొచ్చని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!? -
సెలెబ్రిటీలను మించిపోయిన క్రియేటర్లు!
బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని టెండూల్కర్ చెప్పాల్సిన పని లేదు.. అందమైన చీరలు షూటింగ్ షర్టింగులు అంటూ విజయశాంతి ఊయలూగుతూ చెప్పే అవసరం లేదు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా అంటూ కాజల్ అగర్వాల్ గోడలు అద్దాలు బద్దలుకొట్టుకుని రావాల్సిన అవసరం లేదు.. ఇంకా ఇప్పుడు పట్టణాలు.. నగరాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్ లు కటవుట్లు .. ఫ్లెక్సీలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు.. కాలం మారింది.. మారుతోంది.. ఇంకా మారనున్నది.. వివిధ ఉత్పత్తుల ప్రచారం కోసం సెలబ్రిటీలు.. సినిమా నటులు.. క్రీడాకారులు మాత్రమే యాడ్ ఫిలిమ్స్ లో నటించాలని రూలేం లేదు.. వాళ్లకు లక్షలు.. కాదు కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడంతా ట్రెండ్ మారింది.. మున్ముందు ఇంకా మారుతుంది.సోషల్ మీడియా.. ముఖ్యంగా ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్ ఫారాలు వచ్చాక కమర్షియల్స్ .. అంటే యాడ్ ఫిలిమ్స్ రూపకల్పన తీరు మారిపోతోంది. దీనికోసం సెలబ్రిటీలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు పాతిక లక్షలమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సిద్ధంగా ఉన్నారు.. వీరు సినిమా సెలబ్రిటీలు.. స్పోర్ట్స్ పర్సన్స్ కాదు కాబట్టి తక్కువ ఖర్చుతోనే ప్రచారం చేస్తారు.ఐదారేళ్ళ క్రితం వరకుఒకప్పుడు భారతదేశంలో మార్కెటింగ్ అంటే హోర్డింగులు, సెలబ్రిటీ ఎండా ర్సుమెంట్లు, మెరుపువెలుగుజిలుగులు.. తళుక్కుమనే టీవీ ప్రకటనలే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో రీల్స్ చేసేవాళ్ళు.. నేరుగా కష్టమర్లతో మాట్లాడే వారే వినియోగదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారు. వారు ఏం కొనాలి.. ఎందుకు కొనాలన్నది ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వివరించి చెబుతున్నారు.బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) అనే ఒక ప్రఖ్యాత మార్కెట్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారత కంటెంట్ క్రియేటర్ ఎకానమీ కీలక మలుపు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 నుంచి 25 లక్షల మంది డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు యాక్టివ్గా ఉన్నారు. వీరంతా సొంత రీల్స్, కంటెంట్ పోస్ట్ చేస్తూనే వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ ఆదాయం కూడా పొందుతున్నారు.వీరి ప్రభావంతో వినియోగదారుల కొనుగోలు నిర్ణయాల్లో 30 శాతానికి పైగా మార్పు వస్తుండగా, వార్షికంగా రూ. 350–400 బిలియన్ డాలర్ల (సుమారు లక్షల కోట్ల రూపాయల) వ్యయం ఈ క్రియేటర్ల ప్రభావంలో జరుగుతోంది. 2030 నాటికి ఈ సంఖ్య 1 ట్రిలియన్ డాలర్లను దాటే అవకాశముందని అంచనా.ఈ వీరి ప్రభావం మరింత విస్తృతం అవుతుందని బీసీజీ అంచనా వేస్తోంది. ఇది ఇకపై వైరల్ డ్యాన్స్ వీడియోలు లేదా మేకప్ ట్యుటోరియల్స్కే పరిమితం కాదు. ఫ్యాషన్, టెక్నాలజీ, బ్యూటీ, రోజువారీ అవసరాలు వంటి అన్ని విభాగాల్లోనూ ఈ క్రియేటర్లు దూసుకుపోతున్నారు.BCG అధ్యయనం ప్రకారం:60 శాతం మంది వినియోగదారులు క్రమం తప్పకుండా క్రియేటర్ కంటెంట్ను చూస్తున్నారు.30 శాతం కంటే ఎక్కువ మంది తమ కొనుగోలు నిర్ణయాలకు క్రియేటర్లే కారణమని చెబుతున్నారు. ఎవరెవరో సినిమా నటులు, క్రికెటర్లు చెప్పే ప్రకటనలకన్నా కమ్యూనిటీ ఆధారిత నమ్మకమే ఇప్పుడు ప్రధానంగా మారింది. మనకు తెలిసినవాళ్ళు చెప్పే ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు మక్కువ చూపుతున్నారని తెలుస్తోంది.ఇకముందు ఈ 'కంటెంట్ క్రియేటర్లను తాత్కాలిక ప్రచార సాధనంగా కాకుండా, దీర్ఘకాల భాగస్వాములుగా చూసే బ్రాండ్లే విజేతలుగా నిలుస్తాయి. వాళ్ళ ఉత్పత్తులే ఎక్కువగా మార్కెట్లోకి వెళ్తాయి అని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్లు అయితే క్రియేటర్లను కేవలం తమ ఉత్పత్తుల ప్రచారం కోసమే కాకుండా అమ్మకాలు పెంచుకోవడం, ఇంకా ధరను కూడా వారిద్వారానే నిర్ణయించేలా వ్యూహాలు రూపొందించి సక్సెస్ అవుతున్నారు. వీరితో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుని తమ వ్యాపారాలు పెంచుకుంటున్నాయి. ఎంత ఎక్కువమంది ఫాలోవర్లు ఉంటే అంతపెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా వారిని గుర్తిస్తూ తమ వ్యాపారంలో భాగస్వాములను చేస్తున్నారు.--సిమ్మాదిరప్పన్న -
భాగ్యనగరంలో ఇళ్ల అమ్మకాలు డీలా..!
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ప్రస్తుత త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 98,019 యూనిట్లకు పరిమితం అవుతాయని రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. 2024 చివరి త్రైమాసికంలో విక్రయాలు 1,16,137 యూనిట్లతో పోలి్చతే 16 శాతం తక్కువ అని తెలిపింది. 2021 జూలై–సెపె్టంబర్ త్రైమాసికం తర్వాత ఇంత తక్కువ విక్రయాలు మళ్లీ ఇదేనని పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న విక్రయ గణాంకాల ఆధారంగా డిసెంబర్ త్రైమాసికంపై తన అంచనాలతో ఒక నివేదికను విడుదల చేసింది. నవీ ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ మినహా మిగిలిన ఏడు నగరాల్లో అమ్మకాలు తగ్గినట్టు తెలిపింది. ఆయా నగరాల్లోని ప్రధాన నివాస ప్రాంతాలకు సంబంధించిన డేటా ఆధారంగా ప్రాప్ ఈక్విటీ ఈ అంచనాలు రూపొందించింది. ‘‘సంప్రదాయంగా అక్టోబర్–డిసెంబర్లో అమ్మకాలు బలంగా ఉంటుంటాయి. పండుగల సీజన్లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు కనిపిస్తుంటాయి. ఇటీవలి అమ్మకాల క్షీణత అన్నది మార్కెట్లో ప్రీమియమైజేషన్ను సూచిస్తోంది. దీంతో అమ్మకాలు తగ్గినప్పటికీ విలువలో వృద్ధి కనిపిస్తోంది’’ అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు. నగరాల వారీ అంచనాలు.. → హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు డిసెంబర్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గి 11,323 యూనిట్లుగా ఉండొచ్చు. → చెన్నైలోనూ 3 శాతం తక్కువగా 4,542 యూనిట్లకు విక్రయాలు పరిమితం కావొచ్చు. → బెంగళూరులో అమ్మకాలు 15,603 యూనిట్లుగా ఉంటాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చతే ఒక శాతం తక్కువ. → కోల్కతాలో 11 శాతం తక్కువగా 3,995 యూనిట్లుగా ఉంటాయి. → పుణెలో అమ్మకాలు ఏకంగా 31 శాతం తగ్గి 15,788 యూనిట్లకు పరిమితం అవుతాయి. → థానేలో అమ్మకాలు 26 శాతం తగ్గి 16,987 యూనిట్లుగా ఉంటాయి. → ముంబై మార్కెట్లోనూ 25 శాతం తక్కువగా 9,135 యూనిట్లకు విక్రయాలు పరిమితం అవుతాయి. → నవీ ముంబైలో మాత్రం 13 శాతం అధికంగా 8,434 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లోనూ అమ్మకాలు 4 శాతం వృద్ధితో 12,212 యూనిట్లుగా ఉంటాయి. → ఇక ఈ నగరాల్లో కొత్త ఇళ్ల యూనిట్ల సరఫరా సైతం 10 శాతం తగ్గి 88,427 యూనిట్లుగా ఉంటాయన్నది ప్రాప్ ఈక్విటీ అంచనా. -
లిస్టింగ్పై 3 కంపెనీల కన్ను
ఓవైపు సెకండరీ మార్కెట్లు శాంట క్లాజ్ ర్యాలీలోనూ ఆటుపోట్లను చవిచూస్తుంటే మరోవైపు ఈ కేలండర్ ఏడాది(2025) అధిక ఇష్యూలు, అత్యధిక నిధుల సమీకరణతో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డుకు తెరతీశాయి. ఈ బాటలో ప్రైమరీ మార్కెట్లు ఏడాది చివరిలోనూ సందడి చేస్తున్నాయి. తాజాగా 3 కంపెనీల ప్రాస్పెక్టస్లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: గత వారం ఐపీవోకు వచ్చిన కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ తాజాగా లిస్ట్కాగా.. ఈ వారం గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీసహా.. 4 ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలు ప్రారంభమయ్యాయి. ఈ బాటలో మరిన్ని కంపెనీలు ప్రైమరీ మార్కెట్లలో సందడి చేయనున్నాయి. ఇందుకు సెబీ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచి్చంది. ఈ జాబితాలో ధారివాల్ బిల్డ్టెక్, ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, బీఎల్ఎస్ పాలిమర్స్ చేరాయి. ఈ మూడు కంపెనీలు లిస్టింగ్కు అనుమతించమంటూ సెబీకి ఈ ఏడాది ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య ప్రాస్పెక్టస్లు దాఖలు చేశాయి. వీటి ప్రకారం ఈ సంస్థలన్నీ ఐపీవో ద్వారా కొత్తగా ఈక్విటీ జారీతో నిధుల సమీకరణను చేపట్టనున్నాయి. ఐపీవో తదుపరి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానున్నాయి. కన్స్ట్రక్షన్ కంపెనీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా కన్స్ట్రక్షన్ కంపెనీ ధారివాల్ బిల్డ్టెక్ రూ. 950 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటిలో రూ. 300 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మరో రూ. 203 కోట్లు నిర్మాణ రంగ పరికరాల కొనుగోలుకి, రూ. 174 కోట్లు ముందస్తు రుణ చెల్లింపులకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. జాతీయ, రాష్ట్ర రహదారులు, పీఎంజీఎస్వై రోడ్లు, బ్రిడ్జిలు, రైల్వే ఓవర్బ్రిడ్జిలు, సొరంగ మార్గాలు నిర్మించే కంపెనీ రైల్వే, నీటిపారుదల, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతోంది. క్లౌడ్ ఇన్ఫ్రా సేవలు క్లౌడ్, మేనేజ్డ్ సర్వీసుల సంస్థ ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటిలో రూ. 481 కోట్లు క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్విప్మెంట్ కొనుగోలుతోపాటు డేటా సెంటర్ల మౌలికసదుపాయాల ఏర్పాటుకు వెచ్చించనుంది. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ఐఏఏఎస్, ఎస్ఏఏఎస్ ఆధారిత క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సర్వీసులు, సాఫ్ట్వేర్ సొల్యూషన్లు అందిస్తోంది. కస్టమ్ పాలిమర్ కాంపౌండ్స్ అవసరాలకుతగిన(కస్టమ్) పాలిమర్ కాంపౌండ్స్ రూపొందించే బీఎల్ఎస్ పాలిమర్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 1.7 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా సమీక రించిన నిధుల్లో రూ. 70 కోట్లు కొన్ని ప్రొడక్టుల తయారీ సౌకర్యాల విస్తరణకు, రూ. 75 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచి్చంచనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ టెలికం, విద్యుత్, రైల్వే, చమురు–గ్యాస్ తదితర రంగాలకు కస్టమ్ పాలిమర్ కాంపౌండ్స్ అందిస్తోంది. సెబీకి టన్బో ఇంజినీరింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు గ్లోబల్ డిఫెన్స్ ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీ ప్రధాన కంపెనీ(ఓఈఎం) టన్బో ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1,80,85,246 ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. అయితే కొత్తగా ఈక్విటీ జారీ చేయబోదు. 2003లో ఏర్పాటైన కంపెనీ తొలిదశలో యూఎస్ రక్షణ శాఖ, సర్నాఫ్ కార్పొరేషన్తో కలసి పనిచేసింది. ఆపై 2012లో ప్రస్తుత ప్రమోటర్ల ఆధ్వర్యంలో రక్షణ రంగ పరికరాల తయారీపై దృష్టి పెట్టింది. కంపెనీ ప్రధానంగా సెన్సింగ్, ప్రాసెసింగ్, కమ్యూనికేషన్, గైడెన్స్ సిస్టమ్స్ను రూపొందిస్తోంది. విజిబుల్, ఇన్ఫ్రారెడ్, మల్టీసెన్సార్ ఇమేజింగ్ టెక్నాలజీలతోకూడిన టాక్టికల్, ప్లాట్ఫామ్ సిస్టమ్స్ తయారు చేస్తోంది. ప్రపంచస్థాయిలో రక్షణ రంగ దళాలకు ప్రొడక్టులను సరఫరా చేస్తోంది. 2025 సెపె్టంబర్30కల్లా దాదాపు రూ. 267 కోట్ల విలువైన ఆర్డర్బుక్ను కలిగి ఉంది. గత రెండు నెలల్లోనూ రూ. 72 కోట్ల విలువైన ఆర్డర్లను పొందింది. -
హయర్ ఇండియాలో భారతీకి వాటా
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం దేశీ యూనిట్ హయర్ ఇండియాలో డైవర్సిఫైడ్ దిగ్గజం భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యూహాత్మక పెట్టుబడులకు తెరతీస్తోంది. యూఎస్ పీఈ దిగ్గజం వార్బర్గ్ పింకస్తో కలసి 49 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. అయితే డీల్ విలువను వెల్లడించçప్పటికీ 2 బిలియన్ డాలర్లు(రూ. 17,956 కోట్లు) వెచ్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. చైనీస్ హయర్ గ్రూప్ అనుబంధ సంస్థ హయర్ ఇండియాలో వార్బర్గ్తో కలసి వ్యూహాత్మక పెట్టుబడులను చేపట్టనున్నట్లు పేర్కొంది. తద్వారా ఏసీలు, టీవీల తయారీ దిగ్గజంలో సంయుక్తంగా 49 శాతం వాటా సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. హయర్ గ్రూప్ యాజమాన్యం 49 శాతం వాటాను అట్టిపెట్టుకుంటుందని.. మిగిలిన 2% వాటా సంస్థ మేనేజ్మెంట్ టీమ్ చేతిలో ఉంటుందని వివరించింది. హయర్ ఇండియా వాషింగ్ మెషీన్లు, ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్స్సహా పలు కిచెన్ అప్లయెన్సెస్ తయారు చేసే సంగతి తెలిసిందే. కంపెనీలో వాటా కొనుగోలుకి సజ్జన్ జిందాల్ గ్రూప్ జేఎస్డబ్ల్యూ, ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పోటీపడినట్లు తెలుస్తోంది. హయర్ ఇండియా విజన్.. మేడిన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియాకు తాజా భాగస్వామ్యం దన్నునిస్తుందని భారతీ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. స్థానిక ప్రాధాన్యత, తయారీ సామర్థ్య విస్తరణ, నూతన ప్రొడక్టుల ఆవిష్కరణలు ఇందుకు తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. తద్వారా మార్కెట్లో మరింత లోతుగా విస్తరించనున్నట్లు అభిప్రాయపడింది. -
సెజ్ ఔషధాలకు ట్యాక్స్ రిలీఫ్
న్యూఢిల్లీ: దేశీయంగా కీలక ఔషధాల లభ్యత పెరిగేలా, ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (సెజ్) తయారు చేసి, దేశీయంగా విక్రయించే ఔషధాలపై కస్టమ్స్ సుంకాలను ఎత్తివేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెజ్లలో తయారై, దేశీయ మార్కెట్లో అమ్మే ఔషధాలపై 10 శాతం సుంకాలు వర్తిస్తున్నాయి. ఒకవేళ తాజా ప్రతిపాదన ఆచరణ రూపం దాలిస్తే సదరు సుంకాల ప్రస్తావన లేకుండా పలు టీకాలు, కీలక ఔషధాలను దేశీయంగా తక్కువ ధరకే విక్రయించేందుకు వీలవుతుంది. అయితే, ఏకమొత్తంగా అన్ని ఔషధాలకు కాకుండా కొన్ని ఉత్పత్తులకు మాత్రమే మినహాయింపులను వర్తింప చేయొచ్చని భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనను చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా ఎంపిక చేసిన కొన్ని టీకాలు, కొన్ని కీలకమైన ఔషధాలు, ప్రభుత్వం నిర్ణయించే ఉత్పత్తులకు మినహాయింపునివ్వొచ్చని పేర్కొన్నాయి. వైద్య పరికరాలకు కూడా.. దేశీయంగా స్టార్టప్ వ్యవస్థని కూడా ప్రోత్సహించే దిశగా కొన్ని మెడికల్ డివైజ్ల తయారీ సంస్థలు, బయోటెక్ సంస్థలకు కూడా ఇదే తరహాలో సుంకాల నుంచి మినహాయింపులనిచ్చే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దిగుమతులపై ఆధారపడాల్సి వస్తున్న ఉత్పత్తులను, దేశీయంగా తయారు చేసేందుకు పెట్టుబడులు పెట్టేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. మన ఫార్మా రంగం గణనీయంగా ఎదుగుతోందని, పలు రాష్ట్రాలు ఫార్మా సెజ్లను ఏర్పాటు చేస్తున్నాయని వివరించాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇలాంటి ప్రతిపాదనలు తోడ్పడగలవని వివరించాయి. అక్టోబర్ 1 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై అమెరికా 100 శాతం సుంకాలను ప్రకటించడంతో దేశీయంగా ఔషధాలను విక్రయించుకునేందుకు సుంకాల నుంచి మినహాయింపునివ్వాలంటూ సెజ్ యూనిట్లు కోరుతుండటంతో ప్రభుత్వ తాజా యోచన ప్రాధాన్యం సంతరించుకుంది. సెజ్ల నుంచి ఎగుమతవుతున్న ఉత్పత్తుల్లో హైపర్టెన్షన్, మధుమేహం, కార్డియోవాసు్కలర్ వ్యాధుల్లాంటి వాటి చికిత్స కోసం ఉపయోగించే ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఇంజెక్టబుల్ ఔషధాలు ఉంటున్నాయి. వీటికి దేశీ మార్కెట్లో కూడా గణనీయంగా డిమాండ్ ఉంటోంది. ప్రస్తుతం దేశీ ఫార్మా మార్కెట్ 60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నట్లు అంచనా. భారత్కి అంతర్జాతీయంగా జనరిక్ ఔషధాల విభాగంలో 20 శాతం వాటా, టీకాల సరఫరాలో 60 శాతం వాటా ఉంది. -
వెండికి ‘బంగారు’ కాలం
ఈ ఏడాది వెండి ధరలు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అసాధారణ మైలురాయిని చేరాయి. పెట్టుబడి సాధనంగా, పారిశ్రామిక అవసరాల పరంగా ఈ లోహం సరికొత్త రికార్డులను సృష్టించింది. ఒకవైపు విశ్లేషకులు ధరల దిద్దుబాటు(Correction)పై హెచ్చరిస్తున్నప్పటికీ, వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ మాత్రం వెండి భవిష్యత్తుపై అత్యంత ధీమాతో ఉన్నారు.గతంలో వెండి ఎప్పుడూ బంగారం ధరల గమనాన్నే అనుసరిస్తూ ఉండేది. కానీ 2025లో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనిల్ అగర్వాల్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నట్లుగా.. ధరలు తాత్కాలికంగా హెచ్చుతగ్గులకు గురైనప్పటికీ వెండి మెరుపు కొనసాగుతుంది. వెండి కథ ఇప్పుడే ప్రారంభమైందని అగర్వాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ ఏడాదిలో వెండి ధర ఏకంగా 125 శాతం పెరిగింది. బంగారం కూడా మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, దాని వృద్ధి 63 శాతం మాత్రమే. అంటే బంగారం కంటే వెండి రెట్టింపు రాబడిని అందించింది. వెండి అటు విలువైన ఆభరణంగానూ, ఇటు కీలకమైన పారిశ్రామిక లోహంగానూ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డిజిటల్ యుగంలో వెండి పాత్ర ఎంతో కీలకంగా మారింది.సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండికి ప్రత్యామ్నాయం లేదు. డేటా సెంటర్ల విస్తరణ, ఎలక్ట్రికల్ వాహనాల విద్యుదీకరణలో దీని డిమాండ్ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అత్యాధునిక రక్షణ పరికరాల్లో వెండి కీలక అంశంగా ఉంది. భారతదేశంలో వెండి ఉత్పత్తిదారుగా ఉన్న హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ద్వారా ఈ పెరుగుతున్న పారిశ్రామిక అవసరాన్ని తాము ప్రత్యక్షంగా చూస్తున్నామని అగర్వాల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!? -
టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?
ఈరోజుల్లో మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదు.. కానీ కుటుంబ భవిష్యత్తుకు మాత్రం గ్యారెంటీ ఉండాల్సిందే. చాలామంది ఇన్సూరెన్స్ అనగానే ‘తిరిగి ఎంత వస్తుంది?’ అని లెక్కలు వేస్తారు. అయితే, మీరు లేని లోటును ఏ డబ్బు భర్తీ చేయలేకపోయినా, మీ కుటుంబం ఆర్థికంగా కుప్పకూలిపోకుండా నిలబెట్టే ఏకైక ఆయుధం టర్మ్ ఇన్సూరెన్స్. నెలకు ఓ కుటుంబానికి అయ్యే సినిమా టికెట్ ఖర్చుతో కోటి రూపాయల రక్షణ కవచాన్ని అందించే ఈ పాలసీపై అపోహలు వీడాలి.నేటి ఆధునిక కాలంలో ఆర్థిక ప్రణాళిక అనగానే చాలామంది కేవలం పొదుపు, పెట్టుబడుల గురించే ఆలోచిస్తారు. ఈ క్రమంలో టర్మ్ ఇన్సూరెన్స్ను ఒక అనవసరపు ఖర్చుగా భావిస్తూ ‘ప్రీమియం కడితే తిరిగి రాదు కదా, ఇది డబ్బులు దండగ’ అనే ధోరణిలో ఉంటున్నారు. అయితే, ఇది ఆర్థికంగా అత్యంత ప్రమాదకరమైన ఆలోచన.ఏది పెట్టుబడి? ఏది రక్షణ?చాలామంది ఇన్సూరెన్స్ను కూడా మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలాగా చూస్తారు. అందులో..ఎండోమెంట్ పాలసీలు.. వీటిలో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత కొంత డబ్బు తిరిగి వస్తుంది. కానీ, ఇందులో ఉండే లైఫ్ కవర్(బీమా మొత్తం) చాలా తక్కువగా ఉంటుంది.టర్మ్ ఇన్సూరెన్స్.. ఇది స్వచ్ఛమైన బీమా. ఇక్కడ మీరు చెల్లించే ప్రీమియం కేవలం మీ ప్రాణానికి రక్షణ కల్పించడానికి మాత్రమే. పాలసీ కాలపరిమితిలో పాలసీదారునికి ఏదైనా జరిగితే, నామినీకి పెద్ద మొత్తంలో (ఉదాహరణకు కోటి రూపాయలు) బీమా సొమ్ము అందుతుంది.‘డబ్బులు తిరిగి రావు’ అనేది అపోహ మాత్రమే‘నేను ఆరోగ్యంగా ఉంటే కట్టిన డబ్బులు పోతాయి కదా’ అని బాధపడటం అంటే.. మనం ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుని ఇల్లు కాలిపోలేదు కాబట్టి ఇన్సూరెన్స్ వేస్ట్ అని అనుకోవడమే. వయసును అనుసరించి నెలకు వెయ్యి రూపాయలలోపు ప్రీమియంతోనే కోటి రూపాయల కవరేజ్ పొందే అవకాశం కేవలం టర్మ్ ఇన్సూరెన్స్లో మాత్రమే ఉంటుంది.ప్రీమియం రిటర్న్ రావాలంటే..డబ్బులు వెనక్కి రావాలనుకునే వారి కోసం ఇప్పుడు కంపెనీలు ‘రిటర్న్ ఆఫ్ ప్రీమియం’ ప్లాన్లను కూడా అందిస్తున్నాయి. ఇందులో పాలసీ ముగిశాక మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇస్తారు (అయితే దీని ప్రీమియం సాధారణ టర్మ్ ప్లాన్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది).టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గం.పిల్లల చదువు, పెళ్లిళ్లు, రోజువారీ ఖర్చులకు ఇది భరోసా ఇస్తుంది.నేటి కాలంలో చాలా మందికి హోమ్ లోన్, కారు లోన్ లేదా పర్సనల్ లోన్స్ ఉంటున్నాయి. పాలసీదారునికి ఏమైనా జరిగితే ఆ అప్పుల భారం కుటుంబం మీద పడకుండా, ఇన్సూరెన్స్ డబ్బుతో వాటిని తీర్చుకోవచ్చు.25-30 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఒకసారి నిర్ణయించిన ప్రీమియం పాలసీ కాలపరిమితి ముగిసే వరకు మారదు.ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మీరు చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు.టర్మ్ ఇన్సూరెన్స్ను ఒక ఖర్చులా కాకుండా, మీ కుటుంబం కోసం మీరు కట్టే రక్షణ కవచంలా భావించాలి. విలాసాల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే మనం, మన తదనంతరం కుటుంబం గౌరవంగా బతకడానికి రోజుకు రూ.30-40 కేటాయించడం పెద్ద విషయం కాదు. కాబట్టి, ప్రతి వ్యక్తి తక్షణమే సరైన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ముఖ్యం.ఇదీ చదవండి: రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం -
రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం
హరియాణా రాష్ట్రంలో పని గంటలు, వ్యాపార నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘హరియాణా షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (సవరణ) బిల్లు, 2025’కు ఆమోదం లభించింది. 1958 నాటి పాత చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ద్వారా రోజువారీ పని గంటలను పెంచడంతో పాటు పలు సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.బిల్లులోని ముఖ్యాంశాలుప్రస్తుతమున్న 9 గంటల పని పరిమితిని 10 గంటలకు పెంచారు. ఇందులో విశ్రాంతి సమయం కూడా కలిసి ఉంటుంది. అయితే వారానికి గరిష్టంగా 48 గంటల పని నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.త్రైమాసికానికి ఓవర్ టైమ్ పరిమితిని 50 గంటల నుంచి ఏకంగా 156 గంటలకు పెంచారు. వ్యాపార గరిష్ట డిమాండ్ సమయాల్లో సంస్థలకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.విరామం లేకుండా చేసే నిరంతర పని సమయాన్ని 5 గంటల నుంచి 6 గంటలకు పెంచారు.20 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న చిన్న సంస్థలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం వ్యాపార సమాచారాన్ని అందిస్తే సరిపోతుంది.వ్యాపార సౌలభ్యమా? బానిసత్వమా?ఈ బిల్లుపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగింది. కార్మిక మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. ‘చిన్న సంస్థలపై భారాన్ని తగ్గించడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే 10 గంటల పని విధానం ఉంది’ అని పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత సుర్జేవాలా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘రోజుకు 10 గంటలు, దానికి తోడు 2 గంటల ఓవర్ టైమ్ కలిపితే ఒక కార్మికుడు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇది ఆధునిక బానిసత్వం కిందకు వస్తుంది. ఇలా అయితే ఒక కార్మికుడు తన కుటుంబంతో గడిపే సమయం ఎక్కడ ఉంటుంది?’ అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: మీ స్మార్ట్వాచ్.. బీమా ప్రీమియం డిసైడ్ చేస్తుందా? -
మీ స్మార్ట్వాచ్.. బీమా ప్రీమియం డిసైడ్ చేస్తుందా?
ఉదయాన్నే లేచి పార్కులో వాకింగ్ చేస్తున్నారా? ఆఫీసులో లిఫ్ట్కు బదులు మెట్లు ఎక్కుతున్నారా? రాత్రికి సమయానికి నిద్రపోతున్నారా? అయితే, ఇవన్నీ కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మీ జేబును కూడా కాపాడబోతున్నాయి! ఇప్పటివరకు మీ వయసును బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం నిర్ణయించే బీమా కంపెనీలు ఇకపై మీరు ఎలా జీవిస్తున్నారు(Lifestyle) అనే అంశాన్ని బట్టి రేట్లను ఫిక్స్ చేయనున్నాయి.ఒకప్పుడు బీమా అంటే కేవలం పాలసీ పత్రాలు, క్లెయిమ్లకే పరిమితం. కానీ ఇప్పుడు ‘పే-హౌ-యు-లివ్’(Pay-How-You-Live) విధానంతో అడుగులు వేస్తోంది. కస్టమర్ల జీవనశైలి, ఆరోగ్య అలవాట్లు, రోజువారీ డేటా ఆధారంగా ప్రీమియంలను నిర్ణయించేదే ఈ విధానం. మీ స్మార్ట్ వాచ్ ఇచ్చే డేటా ఆధారంగా మీరు ఆరోగ్యంగా ఉంటే మీ బీమా ప్రీమియం తగ్గుతుంది. అంటే మీ ఆరోగ్యం ఇప్పుడు మీ ఆర్థిక ప్రణాళికలో ఒక భాగం కాబోతోంది. 2025లో ఐఆర్డీఏఐ తెచ్చిన సంస్కరణలతో ఈ డైనమిక్ ఇన్సూరెన్స్ మోడల్ ఇప్పుడు సామాన్యులకు మరింత చేరువకానుంది.‘పే హౌ యు లివ్’ అంటే..సాధారణంగా బీమా పాలసీలు వయసు, జెండర్ వంటి ప్రాథమిక అంశాల ఆధారంగా ధరలను నిర్ణయిస్తాయి. కానీ, ‘పే-హౌ-యు-లివ్’ నమూనాలో రియల్ టైమ్ వెల్నెస్ డేటా కీలకం అవుతుంది. స్మార్ట్ వాచ్లు, ఫిట్నెస్ యాప్ల ద్వారా సేకరించిన సమాచారం (ఉదాహరణకు రోజువారీ నడక, నిద్ర సమయం, వ్యాయామం) ఆధారంగా అల్గారిథమ్లు బీమా ప్రీమియంలను సర్దుబాటు చేస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునే ఆరోగ్యవంతులకు ప్రీమియం తగ్గుతుంది. మీ జీవనశైలి మెరుగుపడితే మీ ఇన్సూరెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది.2025లో వచ్చిన మార్పులుఈ విధానం వేగవంతం కావడానికి ఐఆర్డీఏఐ (బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ) 2025లో ప్రవేశపెట్టిన నూతన మార్గదర్శకాలు ఈ మార్పులకు ప్రధాన కారణం.ఆరోగ్య బీమా తీసుకోవడానికి ఉన్న గరిష్ట వయసు పరిమితులను తొలగించడం వల్ల వృద్ధులకు కూడా ఈ వెల్నెస్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి.గతంలో 8 ఏళ్లుగా ఉన్న మోరటోరియం కాలాన్ని(పాలసీదారుడు తన పాలసీని నిర్దిష్ట కాలం పాటు కొనసాగించిన తర్వాత బీమా సంస్థ తన క్లెయిమ్ను తిరస్కరించడానికి వీలులేని కాలం) 5 ఏళ్లకు తగ్గించడం ద్వారా వినియోగదారులకు భరోసా పెరిగింది.వృద్ధులపై ప్రీమియం భారం పడకుండా, పెంపును 10% కి పరిమితం చేయడం వంటి చర్యలు ఈ మోడల్ను మరింత న్యాయబద్ధంగా మార్చాయి.స్మార్ట్ పరికరాల వాడకం పెరగడం వల్ల డేటా సేకరణ సులభమైంది.ప్రస్తుత మార్కెట్ స్థితిగతులుభారతదేశంలో ఈ ధోరణి ఇప్పటికే మోటార్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రారంభమైంది. ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి సంస్థలు ‘పే హౌ యు డ్రైవ్’ ద్వారా సురక్షితంగా వాహనం నడిపేవారికి రాయితీలు ఇస్తున్నాయి.ఆరోగ్య బీమా.. ప్రస్తుతం జిమ్ మెంబర్షిప్లు లేదా స్టెప్ కౌంట్ ఆధారంగా రివార్డ్ పాయింట్లు ఇచ్చే పైలట్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి.జీవిత బీమా.. 2025 నాటికి టాప్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు వెల్నెస్ రైడర్లను జోడిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారికి పేఅవుట్లను పెంచేలా మార్పులు జరుగుతున్నాయి.సవాళ్లుఈ విధానం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయి. వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షించడం వల్ల డేటా భద్రతపై ఆందోళనలు ఉన్నాయి. జన్యుపరమైన లేదా అనివార్యమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ మోడల్ వల్ల ప్రీమియం భారం పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి ఐఆర్డీఏఐ పారదర్శకత, సమ్మిళిత నిబంధనలను కఠినతరం చేస్తోంది.పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే ఐదేళ్లలో ఈ మోడల్కు మరింత ఆదరణ పెరుగుతోంది. దేశంలోని యువత సాంకేతికతను ఇష్టపడటం ఈ మార్పుకు కలిసివచ్చే అంశం. బీమా అనేది కేవలం ఆపదలో ఆదుకునే ఆర్థిక ఉత్పత్తిగానే కాకుండా, కస్టమర్లను ఆరోగ్యంగా ఉంచే ఒక వెల్నెస్ పార్టనర్గా రూపాంతరం చెందుతోంది.ఇదీ చదవండి: ‘యూనివర్సల్ స్టూడియోస్’ మెగా థీమ్ ప్రాజెక్ట్.. ఎక్కడంటే.. -
హౌసింగ్ మార్కెట్లో మందగమనం
దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఊహించని మందగమనాన్ని ఎదుర్కొంటోంది. 2025 సంవత్సరం ముగింపు నాటికి భారతదేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. ప్రాప్ఈక్విటీ అనే రియల్టీ సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2025 నాలుగో త్రైమాసికంలో మొత్తం 98,019 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 16 శాతం క్షీణత నమోదైంది. ముఖ్యంగా 2021 మూడో త్రైమాసికం తర్వాత నమోదైన అత్యల్ప విక్రయాల వాల్యూమ్ ఇదే కావడం గమనార్హం.నవీ ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్ల జోరుమొత్తం మార్కెట్ డీలా పడినా నవీ ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్లు మాత్రం సానుకూల వృద్ధిని కనబరిచాయి. నవీ ముంబై అమ్మకాల్లో 13 శాతం వృద్ధిని నమోదు చేసి స్టార్ పర్ఫార్మర్గా నిలిచింది. ఢిల్లీ-ఎన్సీఆర్ 4 శాతం వృద్ధితో నిలకడను చాటుకుంది. అయితే, మిగిలిన ఏడు ప్రధాన నగరాల్లో అమ్మకాలు ఏకంగా 31 శాతం వరకు పడిపోయాయి.ప్రధాన నగరాల్లో అమ్మకాల పరిస్థితిబెంగళూరు: 15,603 యూనిట్ల విక్రయాలతో గతంతో పోలిస్తే 7 శాతం క్షీణతను చూసింది.హైదరాబాద్: ఇక్కడ కూడా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.పుణె: అత్యధికంగా 31 శాతం క్షీణతతో 15,788 యూనిట్లకు పడిపోయింది.చెన్నై, కోల్కతా: వరుసగా 16 శాతం వార్షిక క్షీణతను నమోదు చేశాయి.ప్రీమియం ఇళ్ల వైపు మొగ్గుఅమ్మకాలు తగ్గినప్పటికీ డెవలపర్ల ఆదాయం, ఇళ్ల విలువల విషయంలో ఆసక్తికర మార్పు కనిపిస్తోంది. 2023లో 4.81 లక్షల ఇళ్ల లాంచ్ విలువ రూ.6.3 లక్షల కోట్లుగా ఉంటే, 2024లో లాంచ్ అయిన ఇళ్ల సంఖ్య (4.11 లక్షలు) తగ్గినప్పటికీ, వాటి విలువ మాత్రం రూ.6.8 లక్షల కోట్లకు పెరిగింది. ఇది కొనుగోలుదారులు, డెవలపర్లు లగ్జరీ/ప్రీమియం విభాగం వైపు మళ్లుతున్నారని స్పష్టం చేస్తోంది.తగ్గిన సరఫరాకేవలం అమ్మకాలే కాకుండా కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కూడా ఈ త్రైమాసికంలో 10 శాతం తగ్గి 88,427 యూనిట్లకు చేరుకుంది. పెరిగిన నిర్మాణ వ్యయం, మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల డెవలపర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్లో కొత్త ప్రాజెక్ట్ల సరఫరాలో వరుసగా 16%, 7% మేర తగ్గుదల నమోదైంది.ఇదీ చదవండి: ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే! -
‘యూనివర్సల్ స్టూడియోస్’ మెగా థీమ్ ప్రాజెక్ట్.. ఎక్కడంటే..
ప్రపంచ పర్యాటకాన్ని ఆకర్షించేలా సౌదీ అరేబియాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. వివిధ దేశాల్లోని పర్యాటకులను అలరించే ‘యూనివర్సల్ స్టూడియోస్’ థీమ్ పార్క్ ఇప్పుడు సౌదీలో ఏర్పాటు కానుంది. రియాద్ సమీపంలోని ఖిద్దియా ఈ ప్రాజెక్టుకు వేదిక కానుంది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికల ప్రకారం, యూనివర్సల్ స్టూడియోస్ మాతృ సంస్థ కామ్ కాస్ట్ (Comcast) ప్రతినిధులు ఈ థీమ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి సౌదీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. కామ్ కాస్ట్ సీఈఓ బ్రియాన్ రాబర్ట్స్ ఇటీవల స్వయంగా ఖిద్దియా సైట్ను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక దశలో ఉందని, నిర్మాణానికి సంబంధించి తుది అనుమతులు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.334 చదరపు కిలోమీటర్లుఈ థీమ్ పార్క్ ఏర్పాటు కానున్న ఖిద్దియా ప్రాజెక్ట్ విస్తీర్ణం 334 చదరపు కిలోమీటర్లుగా ఉందని అంచనా. ఇది ఫ్లోరిడాలోని ప్రఖ్యాత డిస్నీ వరల్డ్ కంటే రెండున్నర రెట్లు పెద్దది కావడం గమనార్హం. ఏటా 4.8 కోట్ల మంది సందర్శకులను ఆకర్షించడం దీని లక్ష్యం. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సౌదీ జీడీపీకి సుమారు 4.5 బిలియన్ల డాలర్ల అదనపు ఆదాయం సమకూరుతుంది.పర్యాటక రంగంలో దూసుకుపోతున్న సౌదీసౌదీ అరేబియా తన ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కేవలం చమురుపైనే ఆధారపడకుండా వైవిధ్యీకరించాలని చూస్తోంది. గతేడాది 10 కోట్ల మందికిపైగా సందర్శకులు సౌదీని సందర్శించారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 6.09 కోట్ల మంది పర్యాటకులు రావడం గమనార్హం. 2030 నాటికి ఏడాదికి 15 కోట్ల మంది పర్యాటకులను రప్పించాలని సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (PIF) లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే! -
ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే!
ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని గంటల తరబడి వేచి చూసే రోజులకు కాలం చెల్లనుందా.. అంటే అవుననే చెప్పాలి. గాల్లో ప్రయాణించే పక్షిలా.. నగరంలోని గగనతలంలో విహరిస్తూ గమ్యాన్ని నిమిషాల్లో చేరుకునే ఎయిర్ టాక్సీ కల సాకారం కాబోతోంది. బెంగళూరుకు చెందిన ‘సరళా ఏవియేషన్’ తమ అధునాతన ఎయిర్క్రాఫ్ట్తో భారత విమానయాన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది.బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘సరళా ఏవియేషన్’ (Sarala Aviation) అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) విమానం SYL-X1 హాఫ్-స్కేల్ ప్రోటోటైప్ గ్రౌండ్ టెస్టింగ్ను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. నగరంలోని కంపెనీ టెస్ట్ ఫెసిలిటీలో జరిగిన ఈ పరీక్షలు దేశీయ ఎయిర్ టాక్సీ ప్రయాణాన్ని నిజం చేసే దిశగా నిలిచాయి.ఈ విమానం ప్రత్యేకతలు7.5 మీటర్ల భారీ రెక్కల విస్తీర్ణంతో రూపొందిన SYL-X1 ప్రస్తుతం భారతదేశంలో ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన అతిపెద్ద, అధునాతన eVTOL విమానంగా గుర్తింపు పొందింది. కేవలం 9 నెలల కాలంలోనే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని సిద్ధం చేశారు. సాధారణ మోడల్స్ లాగా కాకుండా ఈ విమానాన్ని మొదటి నుంచే వాణిజ్య ధ్రువీకరణ (Certification) పొందేలా డిజైన్ చేశారు. ఇది భవిష్యత్తులో రాబోయే 15 మీటర్ల రెక్కల విస్తీర్ణం కలిగిన పూర్తిస్థాయి విమానానికి పునాదిగా నిలుస్తుంది.‘ఈ విభాగంలో కేవలం మొదటి స్థానంలో ఉండటం కాదు, ఏవియేషన్ రంగంలో ఒక దిగ్గజంగా ఎదగడమే మా లక్ష్యం’ అని సరళా ఏవియేషన్ సహ వ్యవస్థాపకులు, సీటీఓ రాకేష్ గావ్కర్ పేర్కొన్నారు. కంపెనీ తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద తయారు చేసిన ఆరు సీట్ల ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీతో ఎంతో మేలు జరుగుతుందని సంస్థ పేర్కొంది. ఇది బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె వంటి మెట్రో నగరాల్లో గంటల తరబడి ఉండే ట్రాఫిక్ ప్రయాణ సమయాన్ని నిమిషాల్లోకి తగ్గించనుందని చెప్పింది.నిధుల సేకరణఇప్పటికే ఈ సంస్థ తన కార్యకలాపాల కోసం సుమారు 13 మిలియన్ డాలర్ల (సుమారు రూ.108 కోట్లు) నిధులను సేకరించింది. దీనికి అదనంగా, భారత్ మొబిలిటీ ఎక్స్పోలో జాతీయ ప్రదర్శన కోసం ఒక పూర్తిస్థాయి స్టాటిక్ ఎయిర్క్రాఫ్ట్ను కూడా సిద్ధం చేసింది. 2024లోనే, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (BIAL)తో సరళా ఏవియేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ఎయిర్పోర్ట్కు తక్కువ సమయంలో ప్రయాణించేలా eVTOL సేవలను ప్రారంభించడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశమని తెలిపింది.తదుపరి దశ ఏమిటి?గ్రౌండ్ టెస్టింగ్ విజయవంతం కావడంతో కంపెనీ ఇప్పుడు తన ఎయిర్ టాక్సీ ప్రోగ్రామ్లో అతి ముఖ్యమైన ధ్రువీకరణ (Validation) దశలోకి ప్రవేశించింది. త్వరలోనే ఈ హాఫ్-స్కేల్ విమానం గాలిలోకి ఎగిరే అవకాశం ఉంది. ఇది విజయవంతమైతే భారత్ సొంత ఎయిర్ టాక్సీలను కలిగిన దేశాల జాబితాలో చేరుతుంది.ఇదీ చదవండి: ఇది గ్రాఫిక్స్ కాదు.. నిజంగా రోబోనే! -
ఇది గ్రాఫిక్స్ కాదు.. నిజంగా రోబోనే!
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేసే రోబోలు నిజ జీవితంలోకి వచ్చేస్తున్నాయి. ‘టెర్మినేటర్’ సినిమాలో విధ్వంసం సృష్టించిన ‘టీ800’ గుర్తుండే ఉంటుంది కదా! సరిగ్గా అదే పేరుతో చైనా కొత్త రోబో తయారు చేసింది. అయితే టెర్మినేటర్లో మాదిరి విధ్వంసం సృష్టించేదిగా కాకుండా, మానవాళికి సహాయపడేలా చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ ‘ఇంజిన్ ఏఐ’ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేసింది. ఇటీవల జరిగిన ఓ ప్రదర్శనలో ఈ రోబో చేసిన కుంగ్ ఫూ విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి.సాహసోపేత అడుగు2023లో స్థాపించిన ఈ ఇంజిన్ఏఐ స్టార్టప్ కంపెనీ తక్కువ సమయంలోనే రోబోటిక్స్ రంగంలో సంచలనం సృష్టించింది. ‘బోర్న్ టు సబ్వర్ట్’ (వ్యవస్థను మార్చడానికే పుట్టింది) అనే నినాదంతో వస్తున్న T800 లైవ్ డెమోల్లో హై-కిక్స్, స్పారింగ్ మూమెంట్స్తో ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తోంది. దీని చురుకుదనం చూసిన చాలామందికి ఇది అసలైన రోబోనా లేక కంప్యూటర్ గ్రాఫిక్సా అనే సందేహం కలగకమానదని కొందరు చెబుతున్నారు. విమర్శలకు సమాధానంగా కంపెనీ మేకింగ్ వీడియోలను విడుదల చేసింది. సీఈఓ జావో టోంగ్యాంగ్ స్వయంగా ఆ రోబోతో తలపడిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.టీ800ని అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో రూపొందించినట్లు కంపెనీ చెప్పింది. 1.73 మీటర్ల ఎత్తు, 75 కిలోల బరువు ఉండే ఈ రోబోను ఏరోస్పేస్ గ్రేడ్ మెగ్నీషియం-అల్యూమినియం మిశ్రమంతో తయారు చేసినట్లు పేర్కొంది. 450 ఎన్ఎం టార్క్ కీళ్ల సామర్థ్యంతో ఇది అథ్లెట్ల తరహాలో కదలగలదని చెప్పింది. ఇది ఒక్కో చేతిలో 5 కిలోల వరకు వస్తువులను సులువుగా లేపగలదు. ఈ రోబోలో అధికంగా వేడి జనరేట్ అవ్వకుండా ఉండటానికి అధునాతన కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది. నాలుగు గంటల పాటు నిరంతరాయంగా పనిచేసేలా మాడ్యులర్ సాలిడ్-స్టేట్ బ్యాటరీని ఇందులో అమర్చినట్లు కంపెనీ తెలిపింది.ఏఐ సూపర్ పవర్ఈ రోబోలో ఎన్వీడియా ఏజీక్స్ ఓరిన్ మాడ్యూల్, ఇంటెల్ N97 సీపీయూలున్నాయి. ఇవి 275 TOPS (Trillions of Operations Per Second) శక్తిని అందిస్తాయి. 360 డిగ్రీల వ్యూతో తన పరిసరాలను మిల్లీసెకన్లలో అర్థం చేసుకుని అడ్డంకులను అధిగమిస్తుంది.Oh my god! Sci-fi movie becomes reality in China!⬆️: 🇺🇸sci-fi films Real Steel, 2011⬇️: 🇨🇳ENGINEAI T800 humanoid robot, 2025China is turning the silver-screen fantasy into tangible technology in just a decade. pic.twitter.com/WTWxnfAoT7— Li Zexin 李泽欣 (@XH_Lee23) December 3, 2025టీ800 ప్రాజెక్ట్ కోసం హువాంగ్పు రివర్ క్యాపిటల్ వంటి సంస్థల నుంచి 1 బిలియన్ యువాన్ల (సుమారు రూ.1,180 కోట్లు) భారీ నిధులను ఇంజిన్ ఏఐ సేకరించింది. ఈ నిధులతో 2026 మధ్య నాటికి టీ800 రోబోలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి డెలివరీ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టెస్లాకు చెందిన ఆప్టిమస్, బోస్టన్ డైనమిక్స్కు చెందిన అట్లాస్ వంటి దిగ్గజ రోబోలతో టీ800 పోటీ పడనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: రూపాయికి ఆర్బీఐ రక్షణ కవచం -
రూపాయికి ఆర్బీఐ రక్షణ కవచం
భారత రూపాయి విలువ గత కొన్ని నెలలుగా ఒత్తిడికి లోనవుతోంది. అందుకు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, అమెరికా వాణిజ్య సుంకాల పెంపు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. వంటివి చాలా కారణాలున్నాయి. ఈ క్రమంలో రూపాయి మరింత నేలచూపులు చూడకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చురుకైన చర్యలు చేపట్టింది.ప్రస్తుతం (డిసెంబర్ 2025 నాటికి) భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే చారిత్రక కనిష్ట స్థాయిలకు చేరుకుంది. ఇటీవలి కాలంలో రూపాయి విలువ రూ.91 మార్కును తాకి స్వల్పంగా పుంజుకుంది. ఈ తీవ్ర ఒడిదుడుకులను అరికట్టడానికి ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఉపయోగించి మార్కెట్లో డాలర్లను విక్రయిస్తోంది.ఆర్బీఐ జోక్యంతాజా అధికారిక సమాచారం ప్రకారం, రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ భారీ స్థాయిలో డాలర్లను విక్రయించింది. అక్టోబర్ నెలలో నికరంగా 11.9 బిలియన్ డాలర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించింది. రూపాయి విలువ రూ.89 మార్కును దాటకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టింది. కానీ అంతర్జాతీయ పరిస్థితులు దృష్ట్యా రూపాయి విలువ రూ.91కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు ఆర్బీఐ దాదాపు 34.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.91 లక్షల కోట్లు) విలువైన డాలర్లను అమ్మి రూపాయి పతనాన్ని అడ్డుకుంది. డిసెంబర్ 12, 2025 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 688.95 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సెప్టెంబర్ 2024లో ఉన్న 704 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయి నుంచి కొంత తగ్గినప్పటికీ, ఇప్పటికీ ఇవి దేశానికి పటిష్టమైన రక్షణను కల్పిస్తున్నాయి.రూపాయి బలహీనపడటానికి కారణాలుట్రంప్ ప్రభుత్వ సుంకాల పెంపు భారత ఎగుమతులపై ప్రభావం చూపడం రూపాయి బలహీనతకు ఒక కారణం.ఈ ఏడాది విదేశీ మదుపరులు భారత మార్కెట్ల నుంచి సుమారు 17 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకోవడం రూపాయిపై ఒత్తిడి పెంచింది.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల వల్ల మన దేశం ఎక్కువ డాలర్లను చెల్లించాల్సి రావడం రూపాయి విలువను తగ్గిస్తోంది.ఆర్బీఐ చర్యల పర్యావసానాలురూపాయి ఒక్కసారిగా పడిపోతే దిగుమతి చేసుకునే వస్తువుల (పెట్రోల్, ఎలక్ట్రానిక్స్) ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకశం ఉంది. ఆర్బీఐ జోక్యం వల్ల ఈ ధరలు అదుపులో ఉంటాయి. రూపాయి విలువ మరీ అస్థిరంగా ఉంటే విదేశీ పెట్టుబడిదారులు ఆందోళన చెందే ప్రమాదం ఉంటుంది. ఆర్బీఐ నియంత్రణ వారిలో నమ్మకాన్ని పెంచుతుంది.ప్రతికూలతలుడాలర్లను విక్రయించడం వల్ల దేశ విదేశీ మారక నిల్వలు క్రమంగా తగ్గుతాయి. ఇది భవిష్యత్తులో వచ్చే ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడంలో ఆటంకం కావచ్చు. ఆర్బీఐ డాలర్లను అమ్మడం వల్ల మార్కెట్లో నగదు లభ్యత తగ్గుతుంది. దీన్ని సర్దుబాటు చేసేందుకు ఆర్బీఐ ఇటీవల రూ.2.90 లక్షల కోట్ల లిక్విడిటీ లభ్యత చర్యలను ప్రకటించింది.భారత రూపాయి ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ, ఆర్బీఐ తన వద్ద ఉన్న అపారమైన విదేశీ మారక నిల్వలతో రక్షణ గోడలా నిలుస్తోంది. కేవలం రూపాయి విలువను పెంచడం కంటే, మార్కెట్లో తీవ్రమైన అస్థిరత లేకుండా చూడటమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యమని గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు కుదిరితే రూపాయి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే.. -
చిట్టి బ్యాంకులు.. గట్టి బ్యాంకులు!
బ్యాంకులు నిత్య అవసరాలు. ప్రజల దైనందిన ఆర్థిక కార్యకలాపాలు బ్యాంకుల మీద ఆధారపడే సాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు! దేశంలో ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు అటు ప్రైవేటు రంగంలోనూ పెద్ద కమర్షియల్ బ్యాంకులతోపాటు పేమెంట్ బ్యాంకులని, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులని వివిధ రకాల బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి.బ్యాంకుల వర్గీకరణ ఇలా.. దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో పేమెంట్ బ్యాంకులు (Payments Banks), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (Small Finance Banks – SFBs), పెద్ద బ్యాంకులు / యూనివర్సల్ బ్యాంకులు (Universal Banks) అని రకాలు ఉంటాయి.వీటిలో చిన్న లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు వంటి ప్రాథమిక సేవలు అందించేవి పేమెంట్ బ్యాంకులు. వీటికి రుణాలు ఇచ్చే అవకాశం ఉండదు. ఉదాహరణకు ఫినో పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్.. వంటివి.చిన్న ఫైనాన్స్ బ్యాంకులు చిరు వ్యాపారులు, రైతులు, తక్కువ ఆదాయ వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తుంటాయి. అయితే పరిమిత కార్యకలాపాలకే అనుమతి ఉంటుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స బ్యాంక్ వంటివి ఉదాహరణలు.ఇక పెద్ద బ్యాంకులు.. వీటినే యూనివర్సల్ బ్యాంకులు అని వ్యవహరిస్తుంటారు. ఇవి వ్యక్తులకు, కార్పొరేట్లకు, పరిశ్రమలకు పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు అందిస్తాయి. ఉదాహరణకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి సంస్థలు.ఆయా బ్యాంకులు తమ సేవలను విస్తృతపరుచుకుంటూ కాలక్రమంలో అప్గ్రేడ్ అయ్యేందుకు కేంద్ర బ్యాంకు ఆర్బీఐకి దరఖాస్తు చేస్తుంటాయి. వాటి అర్హతను పరిశీలించి ఆర్బీఐ ఆ మేరకు అనుమతులు జారీ చేస్తుంటుంది. అలా కేంద్ర బ్యాంకు 2025లో కొన్ని పేమెంట్ బ్యాంకులకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులుగా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు యూనివర్సల్ బ్యాంకులుగా(పెద్ద బ్యాంకులు) అనుమతులు ఇచ్చింది.ఏయూ స్మాల్ బ్యాంకుకు ‘యూనివర్సల్’ అనుమతిరిజర్వ్ బ్యాంక్ 2025లో ఏయూ ఫైనాన్స్ స్మాల్ బ్యాంకుకు (AU Small Finance Bank) యూనివర్సల్ బ్యాంక్ స్థితికి మారటానికి అనుమతి పొందింది. త్వరలో పెద్ద బ్యాంకుగా సేవలు అందించేందుకు లైసెన్స్ లభించనుంది. దశాబ్ద కాలంలో యూనివర్సల్ బ్యాంక్గా అనుమతి పొందిన ఏకైక బ్యాంక్ ఇదే కావడం గమనార్హం. మరి కొన్ని బ్యాంకులు దరఖాస్తు చేసినప్పటికీ అవి కొన్ని పెండింగ్లో ఉండగా మరికొన్నింటిని ఆర్బీఐ తిరస్కరించింది.పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లుఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతమైన సేవలు అందిస్తోంది. పెద్ద బ్యాంకులతో పోటీగా వడ్డీ రేట్లు అందిస్తూ డిపాజిటర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో సేవింగ్స్ అకౌంట్స్పై అత్యధికంగా 6.5 శాతం వరకూ వడ్డీ ఇస్తోంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా 8.5 శాతం దాకా వడ్డీ చెల్లిస్తోంది.పేమెంట్ బ్యాంకుకు ప్రమోషన్2025లో ఆర్బీఐ మరో పేమెంట్ బ్యాంకుకు కూడా ప్రమోషన్ ఇచ్చింది. ఫినో పేమెంట్స్ బ్యాంకు (Fino Payments Bank) స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా మారటానికి ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ అనుమతి పొందింది. దీంతో ఫినో బ్యాంక్ రానున్న రోజులలో పెద్ద డిపాజిట్లు, రుణాలు, బీమా సేవలను అందించగల స్థితికి చేరుతుంది.ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలను చిన్న ఫైనాన్స్ రంగంలో నాణ్యత , సేవా విస్తరణను ప్రోత్సహించేందుకు తీసుకున్న ముందడుగు అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు త్వరలో మరింత అనుకూలమైన బ్యాంకింగ్ సదుపాయాలను పొందగలుగుతారని భావిస్తున్నారు. -
హోమ్ లోన్ మహాన్.. ఎస్బీఐ
ఎస్బీఐ తన గృహ రుణాల పోర్ట్ఫోలియో రూ.10 లక్షల కోట్లను దాటనున్నట్టు ప్రకటించింది. ‘‘ఇప్పుడు ఎస్బీఐ గృహ రుణ పోర్ట్ఫోలియో రూ.9 లక్షల కోట్లకు పైనే ఉంది. బ్యాంక్లో ఇది అతిపెద్ద రుణ విభాగం. మా మొత్తం రుణ ఆస్తుల్లో 20 శాతానికి పైనే ఉంటాయి. 14 శాతం వృద్ధి రేటు ప్రకారం వచ్చే ఆర్థిక సంత్సరంలో ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్పోలియో రూ.10 లక్షల కోట్లు దాటుతుంది’’అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వివరించారు.బలమైన డిమాండ్, సానుకూల వడ్డీ రేట్లు (కనిష్ట స్థాయిలో) వృద్ధికి మద్దతుగా ఉన్నట్టు చెప్పారు. ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్ఫోలియో గత నెలలోనే రూ.9 లక్షల కోట్లు దాటడంతో దేశంలోనే అతిపెద్ద మార్ట్గేజ్ రుణదాతగా నిలవడం గమనార్హం. 2024–25లో ఎస్బీఐ గృహ రుణాల పోర్ట్పోలియో 14.4 శాతం పెరిగి రూ.8.31 లక్షల కోట్లకు చేరింది.2011 మార్చి నాటికి రూ.లక్ష కోట్లు మార్క్నకు చేరగా, అక్కడి నుంచి నాలుగున్నరేళ్లకే (2025 నవంబర్) రూ. 9 లక్షల కోట్లను దాటేయడం వేగవంతమైన వృద్ధిని సూచిస్తోంది. గృహ రుణ విభాగంలో వసూలు కాని మొండి బకాయిలను (ఎన్పీఏలు) ఒక శాతంలోపునకే కట్టడి చేస్తోంది. 2025 మార్చి నాటికి మొత్తం గృహ రుణాల్లో స్థూల ఎన్పీఏలు 0.72 శాతంగా ఉండడం గమనించొచ్చు. -
పసిడి హ్యాట్రిక్.. వెండి త్రిబుల్ షాక్!
దేశంలో బంగారం, వెండి ధరలు మరింత భారీగా పెరిగాయి. వరుసగా మూడో రోజూ ఎగిసి పసిడి ధరలు హ్యాట్రిక్ కొట్టాయి. వెండి ధరలు రెండు రోజుల్లో పెరిగిన దానికి మించి దూసుకెళ్లాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం బంగారం ధరలు (Today Gold Price) మోస్తరుగా పెరిగాయి. వెండి ధరలు అయితే రికార్డు స్థాయిలో ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
Stock Market Updates: ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. గడిచిన సెషన్తో పోలిస్తే స్వల్ప లాభాలలో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 31 పాయింట్లు లాభంతో 26,208 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 63 పాయింట్లు పెరిగి 85,588 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.91బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 63 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.15 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.5 శాతం పెరిగింది.నాస్డాక్ 0.6 శాతం పుంజుకుంది.Today Nifty position 24-12-2025(time: 9:35)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఐటీ ఉద్యోగాలు.. బాగానే పెరిగాయ్..
దేశీయంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఈ ఏడాది హైరింగ్ మెరుగ్గా నమోదైంది. గతేడాదితో పోలిస్తే నియామకాలు 16 శాతం పెరిగాయి. 2025లో మొత్తం ఐటీ ఉద్యోగాల డిమాండ్ 18 లక్షలకు చేరినట్లు వర్క్ఫోర్స్, టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఒక నివేదికలో తెలిపింది.దీని ప్రకారం ఐటీ హైరింగ్ మార్కెట్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అత్యధికంగా 27 శాతం వాటా దక్కించుకున్నాయి. 2024లో నమోదైన 15 శాతంతో పోలిస్తే గణనీయంగా ఉద్యోగులను తీసుకున్నాయి. ఇక ప్రోడక్ట్, సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) సంస్థలు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో రిక్రూట్ చేసుకున్నాయి. అయితే, ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ విభాగాల్లో మాత్రం నియామకాల వృద్ధి ఒక మోస్తరుగానే నమోదైంది.నిధుల ప్రవాహం నెమ్మదించడంతో స్టార్టప్లలో హైరింగ్ కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్కి పడిపోయినట్లు నివేదిక వివరించింది. అప్పటికప్పుడు పూర్తి స్థాయి ఉద్యోగ విధులను నిర్వర్తించేందుకు సన్నద్ధంగా ఉన్న వారితో పాటు మిడ్ కెరియర్ ప్రొఫెషనల్స్ (4–10 ఏళ్ల అనుభవం) ఉన్నవారి ప్రాధాన్యం లభించింది. మొత్తం హైరింగ్లో వీరి వాటా 65 శాతానికి పెరిగింది. 2024లో ఇది 50 శాతం. నివేదికలో మరిన్ని విశేషాలు.. మొత్తం డిమాండ్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో హైరింగ్ వాటా 15 శాతంగా ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నియామకాలు మొత్తం ఐటీ హైరింగ్లో 10–11 శాతంగా నమోదయ్యాయి. 2024లో ఇది సుమారు 8 శాతంగా నిల్చింది. ఐటీలో నెలకొన్న డిమాండ్ని బట్టి చూస్తే ఐటీ కొలువుల్లో కాంట్రాక్ట్ నియామకాల వాటా పెరిగింది. ఏఐ, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ నైపుణ్యాలు ఉన్న వారిపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. వచ్చే ఏడాది (2026) ఆసాంతం ఐటీ హైరింగ్ ఇదే విధంగా ఉండొచ్చు. డిజిటల్లో స్పెషలైజ్డ్ ఉద్యోగ విధులు, ద్వితీయ శ్రేణి నగరాల పరిధిని దాటి క్రమంగా విస్తరిస్తుండటం వంటి అంశాలు ఇందుకు దన్నుగా ఉంటాయి. ఏఐ, క్లౌడ్, సైబర్సెక్యూరిటీ, డేటా ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ నెలకొనవచ్చు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), తయారీ, సాస్, టెలికం రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉండొచ్చు.సర్వీసుల్లో ఫ్రెషర్స్, మహిళల నుంచి దరఖాస్తుల వెల్లువ సర్వీసుల ఆధారిత ఉద్యోగాలవైపు మహిళలు, ఫ్రెషర్స్ మొగ్గు చూపడంతో ఈ ఏడాది ఉద్యోగాలకు దరఖాస్తులు 29 శాతం పెరిగాయి. అప్నాడాట్కో నివేదిక ప్రకారం 9 కోట్లకు పైగా జాబ్ అప్లికేషన్లు వచ్చాయి. మెట్రోల పరిధిని దాటి హైరింగ్, డిజిటల్ రిక్రూట్మెంట్ సాధనాల వినియోగం పెరిగింది. ఫైనాన్స్, అడ్మిని్రస్టేటివ్ సర్వీసులు, కస్టమర్ ఎక్స్పీరియన్స్, హెల్త్కేర్ సపోర్ట్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 36 శాతం పెరిగి 3.8 కోట్లుగా నమోదయ్యాయి.ఇది చదివారా? సత్య నాదెళ్లకు అదో సరదా..ఇక సర్వీస్, టెక్నాలజీ ఆధారిత రంగాల్లో ఫ్రెషర్ల నుంచి దరఖాస్తులు సుమారు 10 శాతం పెరిగాయి. అప్నాడాట్కో పోర్టల్లోని ఉద్యోగ దరఖాస్తుల డేటా విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం ఏటా 1 కోటి మంది యువతీ, యువకులు ఉద్యోగాల్లో చేరుతున్నారు. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), రిటైల్, లాజిస్టిక్స్, ఈ–కామర్స్, ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ, ఐటీ సర్వీసులు తదితర విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది.చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎస్ఎంబీ) జాబ్ పోస్టింగ్స్ 11 శాతం పెరిగి 10 లక్షలుగా నమోదైంది. అటు పెద్ద సంస్థల్లో జాబ్ పోస్టింగ్స్ 14 శాతం పెరిగి 4 లక్షలుగా నమోదయ్యాయి. ప్రథమ శ్రేణి నగరాల నుంచి సుమారు 2 కోట్ల దరఖాస్తులు, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల నుంచి 1.8 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. మహిళల జీతభత్యాలు సగటున 22 శాతం పెరిగాయి. -
రిలయన్స్ కన్జూమర్ చేతికి ‘ఉదయం’
రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్) తాజాగా తమిళనాడుకి చెందిన ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. జాయింట్ వెంచర్ ఒప్పందం ప్రకారం కంపెనీలో ఆర్సీపీఎల్కి మెజారిటీ వాటాలు, సంస్థ గత ప్రమోటర్లు ఎస్. సుధాకర్, ఎస్. దినకర్లకు మైనారిటీ వాటాలు ఉంటాయి.ఈ డీల్తో ఆర్సీపీఎల్ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలో ఉదయం బ్రాండ్ కూడా చేరినట్లయింది. ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను దశాబ్దాలుగా అందిస్తూ ఉదయం ఎంతో పేరొందిందని ఆర్సీపీఎల్ డైరెక్టర్ టి. కృష్ణకుమార్ తెలిపారు. ఉదయం బ్రాండ్ కింద బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ప్యాకేజ్డ్ పప్పు ధాన్యాలు మొదలైన అమ్ముడవుతున్నాయి. -
ఓయో ఐపీవోకు వాటాదారులు ఓకే
ట్రావెల్ టెక్ ప్లాట్ఫామ్ ప్రిజమ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వాటాదారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా నిర్వహించిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎం)లో ఇందుకు అనుగుణంగా ఓటు వేసినట్లు ఓయో బ్రాండ్ కంపెనీ ప్రిజమ్ పేర్కొంది.ఐపీవోలో తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించేందుకు వాటాదారులు ఆమోదించినట్లు వెల్లడించింది. వెరసి తగిన సమయంలో లిస్టింగ్ సన్నాహాలకు తెరతీయనున్నట్లు తెలియజేసింది.ఈ ఐపీవో ద్వారా సమీకరించే నిధుల్లో భాగాన్ని అప్పుల తగ్గింపు, టెక్నాలజీ ప్లాట్ఫామ్ బలోపేతం, కొత్త మార్కెట్ల విస్తరణతో పాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ వర్గాలు సూచించాయి. మార్కెట్ పరిస్థితులు, నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన అనంతరం డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) దాఖలు చేసి, ఇష్యూ టైమ్లైన్ను ఖరారు చేయనున్నట్లు తెలిపాయి. -
చైనా జేవీలో అరబిందో ఫార్మా వాటాల పెంపు
చైనా కంపెనీతో ఏర్పాటు చేసిన లువోక్సిన్ ఆరోవిటాస్ జాయింట్ వెంచర్లో అదనంగా 20 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. ఇందుకోసం 5.12 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 46 కోట్లు) వెచి్చంచనున్నట్లు వివరించింది.దీనికోసం భాగస్వామి షాన్డాంగ్ లువోక్సిన్ ఫార్మా గ్రూప్తో తమ అనుబంధ సంస్థ హెలిక్స్ హెల్త్కేర్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. మూడు నెలల వ్యవధిలో ఈ లావాదేవీ ముగియనుంది. జేవీలో హెలిక్స్కి 30 శాతం, షాన్డాంగ్కి 70 శాతం వాటాలు ఉన్నాయి. 2029 నాటికి 18.86 మిలియన్ డాలర్లతో మిగతా 50 శాతం వాటాను అరబిందో ఫార్మా కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉంది. -
ఐటీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ
ముంబై: ఐటీ, ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్ప నష్టంతో ముగిసింది. సెన్సెక్స్ 43 పాయింట్లు కోల్పోయి 85,525 వద్ద స్థిరపడింది. నిఫ్టీ అయిదు పాయింట్లు పెరిగి 26,177 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు సానుకూలంగా మొదలయ్యాయి. వీక్లీ ఎక్స్పైరీ రోజు కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో రోజంతా పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య ట్రేడయ్యాయి.ఇంట్రాడేలో సెన్సెక్స్ 85,343 – 85,705 శ్రేణిలో ట్రేడైంది. నిఫ్టీ 26,119 వద్ద కనిష్టాన్ని, 26,234 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ఐటీ 0.71%, రియల్టీ 0.21%, కన్జూమర్ డ్యూరబుల్స్ 0.10% నష్టపోయాయి. మరోవైపు కమోడి టీస్ 0.68%, వినిమయ 0.59%, మెటల్ 0.52%, విద్యుత్ 0.40%, ఫైనాన్సియల్ సరీ్వసెస్, ఇంధన 0.36% లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.38%, 0.07% పెరిగాయి. ⇒ తన అనుబంధ సంస్థలు ఏసీసీ లిమిటెడ్, ఓరియంట్ సిమెంట్స్ కంపెనీల విలీనానికి అంబుజా సిమెంట్స్ సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఓరియంట్ సిమెంట్స్ షేరు 4.40% పెరిగి రూ.171 వద్ద ముగిసింది. ఒక దశలో 10% పెరిగి రూ.180 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అంబుజా సిమెంట్స్ షేరు 1.25% పెరిగి రూ.547 వద్ద స్థిరపడింది. ఒక దశలో 4.30% లాభపడి రూ.563 వద్ద గరిష్టాన్ని తాకింది. ఏసీసీ షేరు 1.21% నష్టపోయి రూ.1,754 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1.50% పతనమై రూ.1,802 కనిష్టాన్ని తాకింది. ⇒ కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ షేరు లిస్టింగ్లో నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.384)తో బీఎస్ఈలో 3.50% డిస్కౌంటుతో రూ.370 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 9% క్షీణించి రూ.350 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 8% నష్టంతో రూ.355 వద్ద ముగిసింది. -
చిన్నగానే చుట్టేసొద్దాం..
సాక్షి, బిజినెస్డెస్క్: కరెన్సీ కదలికలు, క్రిస్మస్..న్యూ ఇయర్ సీజన్ వ్యయాలు విహారయాత్రల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. చాలా మంది పర్యాటకులు సుదీర్ఘ యాత్రల కన్నా అయిదు రోజుల్లో చుట్టేసొచ్చేలా టూర్లను ప్లాన్ చేసుకుంటున్నారు. అందులోనూ వీసా సులభంగా దొరికే దేశాలను ఎంచుకుంటున్నారు. ట్రావెల్ సర్విసుల కంపెనీ కాక్స్ అండ్ కింగ్స్కి నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గత శీతాకాలంతో పోలిస్తే ఈసారి అంతర్జాతీయ ప్రయాణాలకి కేవలం 15–20 రోజులు ముందుగా బుక్ చేసుకునే ధోరణి 30 శాతం పెరిగింది.65 శాతం బుకింగ్స్ అయిదు రోజుల్లోపు ట్రిప్లకే పరిమితమైంది. ఈసారి భారతీయ ప్రయాణికులు బయల్దేరడానికి కాస్త ముందుగా మాత్రమే బుక్ చేసుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో ఖర్చులు అంచనాలకు అనుగుణంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారని, సుదీర్ఘ ప్రయాణాలను...డాలర్ మారకంతో ముడిపడి ఉండే ప్రయాణ ఖర్చులను తగ్గించుకుంటున్నారని నివేదిక పేర్కొంది. అలాగని ప్రయాణాలకు డిమాండేమీ తగ్గిపోలేదని తెలిపింది. ఈసారి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పర్యాటకులు తమ సౌకర్యానికి, ఖర్చు చేసే ప్రతి రూపాయికి లభించే ప్రయోజనాలకి ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారని వివరించింది. రిపోర్టులో మరిన్ని విశేషాలు.. ⇒ మిగతా పేరొందిన ప్రాంతాలతో పోలిస్తే దుబాయ్, వియత్నాంల వైపు పర్యాటకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కనెక్టివిటీ బాగుండటం, వీసా ప్రక్రియ సులభతరంగా ఉండటం, తక్కువ రోజుల్లోనే ఎక్కువగా చుట్టేసేయడానికి అవకాశంలాంటి అంశాలు వీటికి సానుకూలంగా ఉంటున్నాయి. అందుకే ఆఖరు నిమిషంలో ప్లాన్ చేసుకునే వారు దుబాయ్, వియత్నాంల వైపు చూస్తున్నారు. శ్రీలంక, బాలి, ఒమన్ వెళ్లే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ⇒ ఆఖరు నిమిషంలో బుక్ చేసుకుంటున్న వారిలో 45 శాతం మంది పిల్లలు, వృద్ధులతో కలిసి ప్రయాణిస్తున్న కుటుంబాలకు చెందినవారే ఉంటున్నారు. వారు భద్రత, వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉండే దుబాయ్లాంటి డెస్టినేషన్లను ఎంచుకుంటున్నారు. ఇక తొలిసారిగా విదేశీ పర్యటన చేస్తున్న వారికి, మిలీనియల్స్కి, జెనరేషన్ జెడ్కి, యువ జంటలకి, బ్యాక్ప్యాకర్స్, యువ ప్రొఫెషనల్స్, మిత్ర బృందాలకి వియత్నాం ఫేవరెట్గా ఉంటోంది. సాధారణంగా ఇది పీక్ సీజన్ కావడంతో పాటు కొన్ని ప్రదేశాలకు టికెట్ల కొరత ఉన్నప్పటికీ ఈ–వీసా ప్రక్రియపై స్పష్టత, ఎయిర్ కనెక్టివిటీ మెరుగ్గా ఉండటంలాంటి అంశాలు ఆ దేశానికి సానుకూలంగా ఉంటున్నాయి. ⇒ శీతాకాలంలో స్వల్ప వ్యవధి టూర్లకు బుక్ చేసుకునే వారిలో 55 ఏళ్ల పైబడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మౌలిక సదుపాయాలు, ప్రయాణం సులభతరంగా ఉండే ప్రాంతాలను వారు ఎంచుకుంటున్నారు. ⇒ ఆఖరు నిమిషపు శీతాకాలం బుకింగ్స్లో అత్యధిక వాటా దుబాయ్ది ఉంటోంది. ముఖ్యంగా పిల్లలు, వయోవృద్ధులున్న కుటుంబాలు దీన్ని ఎంచుకుంటున్నాయి. -
సన్టెక్లో సచిన్ టెండూల్కర్ పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రూజాన్ సోలార్ బ్రాండ్ కింద సౌర విద్యుత్ ఉత్పత్తులను అందించే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇన్వెస్ట్ చేశారు. బ్రాండ్ విశ్వసనీయత మరింత పెరిగేందుకు, జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని సంస్థ వ్యవస్థాపకుడు చారుగుండ్ల భవానీ సురేశ్ తెలిపారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కార్యకలాపాలను బలోపేతం చేసుకుంటున్నామని, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్ తదితర మార్కెట్లో దూకుడుగా విస్తరిస్తున్నామని ఆయన వివరించారు. 2008లో ఏర్పాటైన సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్ తదితర విభాగాల్లో అవసరాలకు కావాల్సిన సోలార్ ఉత్పత్తులను అందిస్తోంది. -
పసిడి సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: పసిడి, వెండి రికార్డు ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం ధరల్లో సరికొత్త రికార్డు నమోదైంది. మంగళవారం 10 గ్రాములకు రూ.2,650 పెరిగి రూ.1,40,850కు చేరుకుంది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధర 78 శాతం పెరిగినట్టయింది. 2024 డిసెంబర్ 31న ఉన్న రూ.78,950 నుంచి నికరంగా రూ.61,900 వరకు 10 గ్రాములకు పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో వెండి ధర కిలోకి మరో రూ.2,750 పెరగడంతో సరికొత్త రికార్డు రూ.2,17,250 నమోదైంది. వెండి ధర ఈ ఏడాది ఏకంగా 142 శాతం పెరగడం గమనార్హం. 2024 డిసెంబర్ 31న కిలో ధర రూ.89,700 వద్ద ఉండగా, అక్కడి నుంచి నికరంగా రూ.1,27,550 లాభపడింది.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధర ఔన్స్కు 1.4 శాతం పెరిగి 70 డాలర్ల మార్క్ను మొదటిసారి చేరుకుంది. బులియన్లో అసాధారణ ర్యాలీ కొనసాగుతోందని, అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్కు 4,500 మార్క్ను చేరుకున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూఎస్ ఫెడ్ 2026లో ఒకటికి మించిన రేట్ల కోతను చేపట్టొచ్చన్న అంచనాలు తాజాగా మరో విడత పసిడి, వెండి ధరల్లో ర్యాలీకి కారణమవుతున్నట్టు చెప్పారు. దీనికితోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సురక్షిత సాధనంగా డిమాండ్ సైతం కొనసాగుతున్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా పసిడి స్పాట్ ధర ఔన్స్కు ఈ ఏడాది 18,92 డాలర్ల నుంచి 4,500 డాలర్లకు చేరుకోవడం గమనార్హం -
బిలియన్ డాలర్ల ఆదాయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏటా సుమారు 30 శాతం వృద్ధితో వచ్చే అయిదేళ్లలో 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 9,000 కోట్లు) ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీఈవో సునీల్ నాయర్ తెలిపారు. ప్రస్తుతం ఇది దాదాపు రూ. 2,000 కోట్ల స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం దాదాపు రూ. 10,000 కోట్లుగా ఉన్న ఆర్డర్ల విలువను రూ. 30,000 కోట్ల స్థాయికి పెంచుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా రెండు విభాగాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు నాయర్ వివరించారు.నీరు–వ్యర్థ జలాలకు సంబంధించిన ట్రీట్మెంట్ ప్లాంట్లు, పారిశ్రామిక పార్క్లపై ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, రూ. 1,000 కోట్ల నుంచి రూ. 2,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులను దక్కించుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు నాయర్ తెలిపారు. ఇప్పుడు దాదాపు రెండున్నరేళ్లకు సరిపడా ఆర్డర్ బుక్ ఉన్నట్లు ఆయన వివరించారు. దేశీయంగా 1 బిలియన్ డాలర్లు, అంతర్జాతీయంగా రూ. 1,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టులను దక్కించుకోవడంపై కసరత్తు జరుగుతోందన్నారు. ఆదాయాల్లో ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) వాటా 45 శాతంగా, బీవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) వాటా 25 శాతంగా ఉందని నాయర్ చెప్పారు. కొత్త విభాగాలపై దృష్టి.. ప్రధాన వ్యాపారానికి అనుబంధంగా ఉండేలా డేటా సెంటర్లు, పర్యావరణహిత ఏవియేషన్ ఇంధనంలాంటి కొత్త విభాగాల్లోకి కూడా విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు నాయర్ తెలిపారు. మరోవైపు, డివిడెండు పాలసీ కూడా పరిశీలనలో ఉందని సంస్థ సీఎఫ్వో స్రవంత్ రాయపూడి చెప్పారు. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా పూర్తి గా చెల్లించివేసి రుణరహిత సంస్థగా కంపెనీ మారిందని ఆయన వివరించారు. ప్రాజెక్టులు బట్టి స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ)కి సంబంధించి మాత్రమే రుణం తీసుకుంటున్నట్లు స్రవంత్ తెలిపారు. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ లో గోదావరి జలాలను నింపేందుకు ఉద్దేశించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డ్ నుంచి దక్కించుకున్న రూ. 2,085 కోట్ల భారీ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని నాయర్ చెప్పారు. -
వెహికల్ ఇన్సూరెన్స్.. ఐదు ముఖ్యాంశాలు!
కార్లు, బైకులు కొనేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఇక్కడ కొనుగోలుదారులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఇన్సూరెన్స్ ఎంచుకోవడం, ఇన్సూరెన్స్ కవరేజ్ను, సరైన జనరల్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ను ఎంచుకోవడం. ఇక్కడ ఏదైనా పొరపాటు చేస్తే.. వెహికల్ ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు మీరే డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో సమయంలో చేసే తప్పులను గురించి ఇక్కడ తెలుసుకుందాం.ప్రాథమిక అంశాల్ని తెలుసుకోకపోవడంవెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునేటప్పుడు లేదా అది అందించే సంస్థను ఎంచుకునేముందు ప్రారభమిక అంశాలను గురించి తెలుసుకోవాలి. అందులో భాగంగానే.. ఇతర సంస్థలు అందించే పాలసీలు, వాటి ఫీచర్స్, క్లెయిమ్ సెటిల్మెంట్ వంటివాటిని కూడా తెలుసుకోవాలి.సరైన ఐడీవీ ఎంచుకోకపోవడంవాహనానికి ఏదైనా డ్యామేజ్ లేదా దొంగతనానికి గురైనా.. ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే మొత్తాన్ని ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) అంటారు. ప్రీమియం అనేది ఈ విలువపైన ఆధారపడి ఉంటుంది. ప్రీమియమ్ తగ్గించుకునే ఉద్దేశ్యంతో.. ఐడీవీ తగ్గించుకునే నష్టపోతారనే విషయం గుర్తుంచుకోవాలి.ఎన్సీబీ ఉపయోగించుకోకపోవడంపాలసీ ఒక ఏడాదిలో ఎలాంటి క్లెయింలు చేయకపోతే.. అలాంటి సమయంలో నో-క్లెయిమ్ బోనస్ (NCB) ఆఫర్ చేస్తుంది. అంటే.. ఎలాంటి క్లెయిమ్ లేకుండా, వాహనాన్ని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్న కారణంగా.. ఇన్సూరెన్స్ కంపెనీలు రివార్డుగా ప్రీమియం డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. దీని గురించి వాహనదారులు తెలుసుకోవాలి.పాలసీలను పోల్చి చూడకపోవడంఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు.. కంపెనీలను గురించి తెలుసుకోవడంతో పాటు, మీరు తీసుకునే పాలసీలను కూడా పోల్చిచూసుకోవాలి. ఇలాంటివేవీ చేయకుండా.. ఏదో ఒక పాలసీ లేదా తక్కువకు లభించే పాలసీని ఎందుకోకూడదు. పాలసీ తీసుకునే ముందే రీసర్చ్ చేసి తీసుకోవడం ఉత్తమం. కవరేజీ ఎంపికలో ప్రీమియం ధరలమీద మాత్రమే దృష్టి పెట్టడం సరైన పద్దతి కాదు.యాంటీ థెఫ్ట్ డివైజ్లను అమర్చుకోకపోవడంఒక వాహనం కొనుగోలు చేసి.. డబ్బు కొంత ఖర్చు అవుతుందని వెనుకడుగు వేసి యాంటీ థెఫ్ట్ డివైజ్లను అమర్చుకోవడం మర్చిపోకూడదు. ఇలాంటి డివైజ్లను ఉపయోగించుకోకపోవడం వల్ల.. వాహనాలు దొంగతనాలకు గురవుతాయి. కాబట్టి జీపీఎస్ ట్రాకర్లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్లు, గేర్లాక్స్ మొదలైన సెక్యూరిటీ డివైస్లను అమర్చుకోవడం వల్ల.. వాహనం కొంత సురక్షితంగా ఉంటుంది. ఇలాంటి డివైస్లను ఇన్స్టాల్ చేసిన వాహనాలకు ప్రీమియం చెల్లింపులపై డిస్కౌంట్లు పొందవచ్చు. -
రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అప్డేట్స్
ఇండస్ట్రియల్ పార్కులు, వాటర్ & వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, అర్బన్ సొల్యూషన్స్లో.. ప్రత్యేక నైపుణ్యం కలిగిన మౌలిక సదుపాయాల రంగంలో పనిచేస్తున్న ప్రముఖ సంస్థ రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.. 2025లో కంపెనీ ఆపరేటింగ్ ఫండమెంటల్స్ను ఎలా బలోపేతం చేసింది, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృద్ధి కోసం వ్యూహలు ఏమిటనే విషయాలను వెల్లడించింది.కంపెనీ రూ. 1000 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల వరకు ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ విధానం ద్వారా చిన్న ప్రాజెక్టులలో విభజనను తగ్గించడం, సంక్లిష్టమైన పనులపై కఠినమైన డెలివరీ నియంత్రణలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. సంస్థ సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు దగ్గరగా ఉన్న అంతర్జాతీయ పైప్లైన్తో పాటు సుమారు 1 బిలియన్ డాలర్ల దేశీయ పైప్లైన్ను కూడా సూచించింది.విదేశీ ఇండస్ట్రియల్ పార్కులు, నీటి ప్రాజెక్టులకు పరిమితం చేసిన కంపెనీ.. ఇంజనీరింగ్, నిర్మాణం, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, ఆపరేషన్, మెయింటెనెన్స్ వంటి వాటిపై దృష్టి సారించింది. నీరు, వ్యర్థ జలాల విభాగంలో.. కంపెనీ పరిధిలో డిజైన్ బిల్డ్ ప్రాజెక్టులు, ట్రాన్స్మిషన్ పైప్లైన్లు, పంపింగ్ స్టేషన్లు, మురుగునీటి శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. -
పిల్లల విద్య కోసం ఐదేళ్లు..: ఖతార్లో ఇషా అంబానీ
ఇండియా & ఖతార్లలో.. మ్యూజియం ఇన్ రెసిడెన్స్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్లను అభివృద్ధి చేయడానికి ఖతార్ మ్యూజియమ్స్ - ముంబై కేంద్రంగా ఉన్న నితా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) మధ్య ఐదు సంవత్సరాలకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఖతార్ మ్యూజియమ్స్ చైర్పర్సన్ షేఖా అల్ మయాసా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఇషా అంబానీ సంతకాలు చేశారు.ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం.. ఖతార్లలో మ్యూజియం ఇన్ రెసిడెన్స్ పేరుతో ప్రత్యేక విద్యా కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. దీని ద్వారా పిల్లలకు ఉల్లాసభరితమైన, మ్యూజియం ఆధారిత అభ్యాస అనుభవాలను పరిచయం చేయనున్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం సృజనాత్మకతను ప్రేరేపించడం. మన దేశంలో ఈ కార్యక్రమాలను రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో.. NMACC అమలు చేస్తుంది. కాగా ఖతార్ మ్యూజియమ్స్ నిపుణులు.. మాస్టర్ క్లాసులు, ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం వహించనున్నారు.ఈ సందర్బంగా ఇషా అంబానీ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తు & విద్యాభివృద్ధి కోసం షేఖా అల్ మయాసా బింట్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ మరియు ఖతార్ మ్యూజియంలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ భాగస్వామ్యంతో నిర్వహించనున్న కార్యక్రమాలు గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలతో సహా పాఠశాలలు, అంగన్వాడీలు, కమ్యూనిటీ కేంద్రాలలో అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
భారీగా పెరిగిన బంగారం ధర: కొత్త రేట్లు ఇలా..
బంగారం ధరల హీట్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. 2025 జనవరిలో రూ. 79వేలు వద్ద ఉన్న గోల్డ్ రేటు.. ఇప్పుడు రూ. 1.38 లక్షలకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే ఏడాదిలో రూ. 59వేలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. అంతే కాకుండా గత రెండు రోజులుగా పసిడి ధరలు గరిష్టంగా రూ. 4370 పెరిగింది.హైదరాబాద్, విజయవాడలలో గోల్డ్ రేటు రెండు రోజుల్లో (డిసెంబర్ 22, 23) రూ. 4370 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,180 నుంచి రూ. 1,38,550 వద్దకు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,23,000 దగ్గర నుంచి రూ. 1,27,000 వద్దకు (రూ. 4000 పెరిగింది) చేరింది.ఢిల్లీ నగరంలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. డిసెంబర్ 22, 23 తేదీల్లో రూ. 4370 పెరిగింది. దీంతో ఇక్కడ 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,38,700కి చేరింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల రేటు రూ. 4000 పెరగడంతో రూ. 1,27,150 వద్దకు చేరింది.చెన్నైలో పసిడి ధరలు పెరగడంతో.. 24 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,39,310 వద్దకు (రూ. 4030 పెరిగింది), 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,27,700 వద్దకు (రూ. 3700 పెరిగింది) చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా రెండు రోజుల్లో (సోమ, మంగళవారాలు) రూ. 8000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2.34 లక్షలకు చేరింది. -
ఐఫోన్లపై డిస్కౌంట్స్.. కొనేందుకు సరైన సమయం!
ఈ ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ 17 ప్రో లాంచ్ అయింది. ఈ మొబైల్ ఫోన్ లాంచ్ అయినప్పటికీ.. చాలామంది ఐఫోన్ 16 ప్రో కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఏ ఫోన్ కొనాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ సందర్భంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలు కూడా వీటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.ఫ్లిప్కార్ట్ & అమెజాన్లో ధరలుయాపిల్ ఐఫోన్ 17 ప్రో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ అమెజాన్ ఇండియాలో రూ.1,34,900కి అందుబాటులో ఉంది. అయితే కొనుగోలుదారులు ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.4,000 వరకు తగ్గింపును పొందవచ్చు.ఐఫోన్ 16 ప్రో అసలు ధర రూ.1,19,900 కాగా.. ఫ్లిప్కార్ట్లో రూ.1,08,999కు లభిస్తోంది. అంతే కాకుండా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ఆఫర్స్ వంటివి ఉపయోగించి అదనపు తగ్గింపులను పొందవచ్చు.స్పెసిఫికేషన్లు & ఫీచర్లుఐఫోన్ 17 ప్రో 6.3 ఇంచెస్ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ & 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇది iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్తో జత చేయబడిన Apple A19 Pro చిప్సెట్ పొందుతుంది. ఇందులో మూడు 48MP సెన్సార్లతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. సెల్ఫీలు & వీడియో కాల్ల కోసం ఇది 18MP ఫ్రంట్ స్నాపర్ను కూడా లభిస్తుంది.ఇదీ చదవండి: మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?ఇక ఐఫోన్ 16 ప్రో విషయానికి వస్తే.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో 6.3 అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేను పొందుతుంది. iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్తో జత చేయబడిన Apple A18 ప్రో చిప్సెట్ లభిస్తుంది. అయితే లేటెస్ట్ iOS 26.2కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. హ్యాండ్సెట్లో రెండు 48MP సెన్సార్లు & వెనుక 12MP సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, వీడియో కాల్స్ & సెల్ఫీల కోసం 12MP కెమెరా లభిస్తుంది. -
జీడీపీ డేటా కొత్త సిరీస్: కేంద్రం ప్రకటన
మార్చిన బేస్ ఇయర్తో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) డేటా సిరీస్ని విడుదల చేయనున్నట్లు కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ వెల్లడించింది. అలాగే పారిశ్రామికోత్పత్తి కొత్త సిరీస్ను మే నెల నుంచి ప్రకటించనున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది.దీని ప్రకారం 2024 బేస్ ఇయర్గా (100కు సమానం) రిటైల్ ద్రవ్యోల్బణం కొత్త సిరీస్ 2026 ఫిబ్రవరి 12న విడుదల అవుతుంది. అలాగే, 2022–23 ఆర్థిక సంవత్సరం బేస్ ఇయర్గా నేషనల్ అకౌంట్స్ డేటాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న, ఐఐపీ డేటా మే 28న విడుదల చేస్తారు. -
మొబైల్ యూజర్లకు షాక్ తప్పదా.. కొత్త రీఛార్జ్ ప్లాన్స్?
ఇంకొన్ని రోజుల్లో 2026 వచ్చేస్తోంది. కొత్త ఏడాదిలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరుగుతాయని మార్కెట్ పరిశోధన సంస్థ మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. దీని ప్రకారం ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ & పోస్ట్పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ 20% వరకు ఖరీదైనవి కావచ్చు.మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, భారతీయ టెలికాం కంపెనీలు 2026లో తమ ARPU (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్)ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికోసం సంస్థలు టారిఫ్లను 16 నుంచి 20 శాతం వరకు పెంచవచ్చు. ఇది రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచే అవకాశం ఉంది. ప్రతి ఏటా టెలికాం కంపెనీలు ఇలా పెంచుకుంటూనే వెళ్తున్నాయి. జూలై 2024లో కూడా కంపెనీలు టారిఫ్లను పెంచినప్పుడు.. రీఛార్జ్ ప్లాన్లు మరింత ఖరీదైనవిగా మారాయి. ఇప్పుడు మరోమారు అదే పరిస్థితి ఏర్పడవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే.. యూజర్లు ఇబ్బందిపడే అవకాశం ఉంది.ఏ కంపెనీ ఎంత టారిఫ్లను పెంచుతుందనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. ప్రస్తుతం రూ.319 ఖరీదు చేసే ఎయిర్టెల్ 28 రోజుల అన్లిమిటెడ్ 5G ప్లాన్ రూ.419కి పెరగవచ్చని స్టాన్లీ నివేదిక చెబుతోంది.జియో రూ.299 ప్లాన్ను రూ.359కు పెంచే యోజన ఉంది. రూ.349గా ఉన్న 28 రోజుల 5G ప్లాన్.. రూ.429కి పెరగవచ్చు.వోడాఫోన్ ఐడియా 28 రోజుల 1GB రోజువారీ డేటా ప్లాన్ రూ.340 నుంచి రూ.419కి పెరగవచ్చు. అదేవిధంగా, 56 రోజులు (సుమారు 2 నెలలు) చెల్లుబాటుతో 2GB రోజువారీ డేటా ప్లాన్ రూ.579కి బదులుగా రూ.699కి పెరగవచ్చు. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 65.43 పాయింట్లు లేదా 0.076 శాతం నష్టంతో 85,502.05 వద్ద, నిఫ్టీ 6.35 పాయింట్లు లేదా 0.024 శాతం నష్టంతో 26,166.05 వద్ద నిలిచాయి.ఓమాక్స్, మోడీ రబ్బర్ లిమిటెడ్, టీమో ప్రొడక్షన్స్ హెచ్క్యూ లిమిటెడ్, ట్రాన్స్వారంటీ ఫైనాన్స్, ప్రిజం జాన్సన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ష్రెనిక్ లిమిటెడ్, వినీత్ లాబొరేటరీస్ లిమిటెడ్, ఎస్ఈఎల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, విన్నీ ఓవర్సీస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాలను చవిచూశాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఢిల్లీలో త్వరలో ‘దర్పణ్ 2.0’ ప్రారంభం!
పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన నిర్ణయాలే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశ రాజధానిలో పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ‘దర్పణ్ 2.0’ అనే అధునాతన పర్యవేక్షణ(మానిటరింగ్) డాష్బోర్డ్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ఈ ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేసింది.ఏమిటీ ‘దర్పణ్ 2.0’?దర్పణ్ (Dashboard for Analytics, Review and Performance Assessment Nationwide) అనేది వివిధ ప్రభుత్వ పథకాలను 24x7 పర్యవేక్షించేందుకు రూపొందించిన ఒక మల్టీ ల్యాంగ్వేజీ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇది కేవలం సమాచారాన్ని చూపడమే కాకుండా, విశ్లేషణాత్మక అంశాలను అందిస్తుంది.ఫీచర్లు ఇవే..వేర్వేరు విభాగాల మధ్య ఉన్న డేటా అంతరాలను తొలగించి అన్ని ప్రభుత్వ పథకాల పురోగతిని ఒకే చోట చూపిస్తుంది.ప్రభుత్వ పథకాల స్టేటస్ను తెలియజేస్తుంది. ఈ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా? అనే అంశాలను ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చు. రియల్ టైమ్లో వీటిని ట్రాక్ చేయవచ్చు.ఏదైనా ప్రాజెక్ట్ నెమ్మదించినా లేదా అడ్డంకులు ఎదురైనా ఈ సిస్టమ్ అధికారులను ముందుగానే అప్రమత్తం చేస్తుంది.కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐ) ద్వారా ప్రతి విభాగం పనితీరును స్కోర్ కార్డుల రూపంలో అంచనా వేస్తుంది.అమలు ఎప్పుడంటే..ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వం రాబోయే 12 నుంచి 16 వారాల్లో దశలవారీగా అమలు చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా అన్ని విభాగాల నోడల్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. సురక్షితమైన ఏపీఐల ద్వారా ఢిల్లీ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ఈ డాష్బోర్డ్కు అనుసంధానిస్తారు.భవిష్యత్ లక్ష్యాలుడిజిటల్ ఇండియా విజన్లో భాగంగా రూపొందుతున్న ఈ వ్యవస్థ భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత విశ్లేషణలకు, పబ్లిక్ డాష్బోర్డ్లకు పునాది వేయనుంది. దీనివల్ల ప్రభుత్వ పనితీరు ప్రజలకు స్పష్టంగా తెలియడమే కాకుండా, సాక్ష్యాధారిత విధాన ప్రణాళిక రూపొందించడానికి మార్గం సుగమం అవుతుంది.ఇదీ చదవండి: 2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందించిన ఈ ‘దర్పణ్’ మోడల్ను ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్నాయి.ఉత్తరప్రదేశ్: ఇటీవల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ‘NexGen UP-CM DARPAN 2.0’ పేరుతో అత్యంత ఆధునిక వెర్షన్ను ప్రారంభించింది. ఇందులో 53 విభాగాలకు చెందిన దాదాపు 588 పథకాలను రియల్ టైమ్లో పర్యవేక్షిస్తున్నారు.మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్: ఈ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాల పురోగతిని పర్యవేక్షించడానికి దర్పణ్ డ్యాష్బోర్డ్ అందుబాటులో ఉంది.హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్: పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం ఈ ప్లాట్ఫామ్ను సమర్థవంతంగా వాడుతున్నారు.ఈశాన్య రాష్ట్రాలు: మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ట్రాలు కూడా తమ జిల్లా స్థాయి ప్రాజెక్టుల పర్యవేక్షణకు దీనినే ఉపయోగిస్తున్నాయి.కేంద్రపాలిత ప్రాంతాలు: పుదుచ్చేరి, లక్షద్వీప్, చండీగఢ్ వంటి ప్రాంతాల్లో కూడా ఇది అమలులో ఉంది. -
2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..
ఇటీవల కాలంలో బంగారం అంటేనే కొండెక్కి కూర్చునే ధర అనుకున్న వారికి, ఇప్పుడు వెండి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. కేవలం ఏడాది కాలంలోనే సుమారు 120 శాతం పైగా రాబడి అందించి, కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.2 లక్షలను దాటింది. అయితే, ఈ పెరుగుదల ఇక్కడితో ఆగేలా లేదు. 2026 జనవరి 1 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ఉత్పత్తిదారు అయిన చైనా ఎగుమతులపై ఆంక్షలు విధించనుందనే వార్తలు గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి.సౌర విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కోసం మైక్రోచిప్ల తయారీలో వెండి వినియోగం పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఒకప్పుడు కేవలం ఆభరణాలకే పరిమితమైన వెండి, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీకి కీలకంగా మారింది. సరఫరా తక్కువ, డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో 2026 ప్రారంభానికి ముందే కిలో వెండి ధర రూ.2.5 లక్షలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు చైనా ఎగుమతుల కోత, ఇటు పెరుగుతున్న టెక్నాలజీ అవసరాల మధ్య వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లనున్నాయి.వెండి ఎగుమతులపై చైనా ఆంక్షలుప్రపంచంలో వెండి ఉత్పత్తిలోనూ, ఎగుమతిలోనూ చైనాది కీలక పాత్ర. అయితే జనవరి 1, 2026 నుంచి చైనా ప్రభుత్వం వెండి ఎగుమతులపై కొత్త నిబంధనలను అమలు చేయాలని చూస్తోంది. అయితే వీటిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ప్రతిపాదిత అంశాల ప్రకారం.. ఇకపై వెండిని ఎగుమతి చేయాలంటే కంపెనీలు ప్రత్యేక ప్రభుత్వ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇది 2027 వరకు అమలులో ఉండే అవకాశం ఉంది. ఏడాదికి 80 టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి చేసే చిన్న సంస్థలకు ఎగుమతి అనుమతులు నిరాకరించే అవకాశం ఉంది. కేవలం పెద్ద, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలకే ఈ అవకాశం దక్కుతుంది. చైనా తన దేశీయ అవసరాల కోసం (ముఖ్యంగా సోలార్, ఎలక్ట్రానిక్స్ రంగాలు) వెండి నిల్వలను కాపాడుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలను ప్రభావితం చేయడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.డిమాండ్ పెరగడానికి కారణాలుగ్రీన్ ఎనర్జీ విప్లవం.. వెండికి విద్యుత్ వాహకత చాలా ఎక్కువ. సౌర ఫలకాల తయారీలో వెండిని కీలకమైన సిల్వర్ పేస్ట్ రూపంలో వాడతారు. ప్రపంచం శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లుతుండటంతో సోలార్ ప్యానెల్స్ తయారీకి వెండి డిమాండ్ 2020తో పోలిస్తే 2024 నాటికి దాదాపు 150% పెరిగింది.ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ.. సాధారణ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం చాలా ఎక్కువ. బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సెన్సార్లు, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వెండిని విరివిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ల విస్తరణ వల్ల అత్యాధునిక చిప్లు, సెమీకండక్టర్ల తయారీలోనూ వెండి వాటా పెరుగుతోంది.సరఫరాలో లోటు.. గడిచిన ఐదేళ్లుగా వెండి ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ ద్వారా వచ్చే వెండి పరిమితంగా ఉంది. వెండి అనేది ఎక్కువగా రాగి, బంగారం, సీసం వంటి లోహాల వెలికితీతలో ఉప-ఉత్పత్తిగా ఉంది. కాబట్టి, డిమాండ్ పెరిగిన వెంటనే వెండి ఉత్పత్తిని పెంచడం మైనింగ్ సంస్థలకు సాధ్యం కావడం లేదు.సురక్షిత పెట్టుబడిగా వెండి.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల వల్ల పెట్టుబడిదారులు వెండిని సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు. అందుకే ఈ ఏడాది వెండి దాదాపు 120% పైగా రాబడిని ఇచ్చింది.2026 నాటి చైనా ఎగుమతి ఆంక్షలు అమలులోకి వస్తే గ్లోబల్ మార్కెట్లో వెండి కొరత మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం ఆభరణాల రంగాన్నే కాకుండా ఆధునిక సాంకేతిక, ఇంధన రంగాలను కూడా ప్రభావితం చేస్తుంది. భారతీయ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, 2026 నాటికి వెండి ధరలు కిలోకు రూ.2.4 లక్షల నుంచి 2.5 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వెండి కేవలం ఒక లోహంగా మాత్రమే కాకుండా, వ్యూహాత్మక వనరుగా మారబోతోంది.ఇదీ చదవండి: రూపాయి విలువ తగ్గినా మంచికే! -
ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
విలువ తగ్గినా మంచికే!
అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గడం అనేది సాధారణంగా ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తుంది. అయితే, ఆర్థిక కోణంలో విశ్లేషిస్తే దీనివల్ల భారత ప్రభుత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు కొన్ని కీలకమైన సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. అదెలాగంటారా? ముఖ్యంగా ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు, దేశీయ తయారీ రంగంపై దీని ప్రభావం సానుకూలంగా ఉంటుంది. ఎలాగో చూద్దాం.ఎగుమతులకు లభించే ప్రోత్సాహంరూపాయి విలువ తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు తగ్గుతాయి. అంటే విదేశీ కొనుగోలుదారులకు మన ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయి. చైనా వంటి దేశాలతో పోటీ పడేటప్పుడు తక్కువ ధర కలిగిన భారతీయ వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. విదేశీ కరెన్సీలో (డాలర్లలో) వచ్చే ఆదాయాన్ని రూపాయల్లోకి మార్చినప్పుడు ఎగుమతిదారులకు మునుపటి కంటే ఎక్కువ మొత్తం అందుతుంది. ఇది ఐటీ, ఫార్మా, వస్త్ర పరిశ్రమలకు ఎంతో మేలు చేస్తుంది.ప్రవాస భారతీయుల నుంచి రెమిటెన్స్లుప్రపంచంలోనే అత్యధికంగా విదేశాల నుంచి నిధులను పొందే దేశం భారత్. రూపాయి విలువ పడిపోవడం ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ) ఒక వరం లాంటిది. వారు ఇండియాకు పంపే ప్రతి డాలర్కు ఇప్పుడు ఎక్కువ రూపాయలు వస్తాయి. దీనివల్ల వారి కుటుంబాల వినియోగ సామర్థ్యం పెరగడమే కాకుండా దేశంలోకి విదేశీ కరెన్సీ ప్రవాహం పెరుగుతుంది. ఇది దేశ విదేశీ మారక నిల్వలను బలోపేతం చేస్తుంది.‘మేక్ ఇన్ ఇండియా’కు ఊతందిగుమతులు ఖరీదైనవిగా మారడం వల్ల దేశీయంగా వస్తువులను తయారు చేసే కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది. విదేశీ వస్తువుల ధరలు పెరగడం వల్ల ప్రజలు స్వదేశీ వస్తువుల వైపు మొగ్గు చూపుతారు. ఇది దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తుంది. విదేశీ కంపెనీలు భారత్లో కార్యాలయాలను లేదా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడం మునుపటి కంటే చౌకగా మారుతుంది. దీనివల్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (FDI) పెరిగే అవకాశం ఉంది.పర్యాటక రంగం అభివృద్ధివిదేశీ పర్యాటకులు భారత్లో పర్యటించేందుకు మరింత తక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. డాలర్ విలువ పెరగడం వల్ల విదేశీయులు తక్కువ ఖర్చుతోనే భారతదేశంలో ఎక్కువ రోజులు గడపవచ్చు. ఇది హోటళ్లు, రవాణా, స్థానిక వ్యాపారాలకు ఆదాయాన్ని పెంచుతుంది.ప్రభుత్వానికి ఆదాయందేశంలో దిగుమతి చేసుకునే వస్తువుల విలువ రూపాయల్లో పెరగడం వల్ల వాటిపై విధించే కస్టమ్స్ డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఎగుమతుల ద్వారా లాభపడే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వానికి అధిక డివిడెండ్లు అందే అవకాశం ఉంది.రూపాయి విలువ తగ్గడం వల్ల ముడి చమురు, ఎలక్ట్రానిక్స్ వంటి దిగుమతుల భారం పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉంది. అయినప్పటికీ సరైన విధానాలతో ఎగుమతులను, దేశీయ ఉత్పత్తిని పెంచుకుంటే భారత్ దీన్ని ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. ప్రభుత్వం ఎగుమతి ఆధారిత వృద్ధిపై దృష్టి పెట్టినప్పుడు బలహీనమైన రూపాయి ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్లా పనిచేస్తుంది.ఇదీ చదవండి: జనరేటివ్ ఏఐ కంటే స్పష్టమైన ఫలితాలిచ్చే దిశగా.. -
ఫ్లాట్గా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం ఫ్లాట్గా పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 27 పాయింట్లు నష్టంతో 26,144 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 128 పాయింట్లు దిగజారి 85,434 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 23-12-2025(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
జనరేటివ్ ఏఐ కంటే స్పష్టమైన ఫలితాలిచ్చే దిశగా..
ప్రపంచంలోనే అతిపెద్ద ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన సేల్స్ ఫోర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో తన దూకుడును తగ్గించుకుంటోంది. గత ఏడాది కాలంగా లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్(LLM) పనితీరుపై నమ్మకం సడలడమే ఇందుకు ప్రధాన కారణం. జనరేటివ్ ఏఐ కంటే మరింత స్పష్టమైన ఫలితాలనిచ్చే నిర్ణయాత్మక (Deterministic)ఆటోమేషన్ వైపు కంపెనీ మొగ్గు చూపుతోంది.నమ్మకం కోల్పోతున్న ఎగ్జిక్యూటివ్లు‘ఒక సంవత్సరం క్రితం ఎల్ఎల్ఎంల గురించి మాకున్న నమ్మకం ఇప్పుడు లేదు’ అని సేల్స్ ఫోర్స్ ప్రొడక్ట్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజ్న పరులేకర్ అంగీకరించారు. ఏఐ నమూనాల్లో ఉండే రాండమ్నెస్(యాదృచ్ఛికం) వల్ల వ్యాపార పనుల్లో తప్పులు దొర్లే ప్రమాదం ఉందని, అందుకే తమ కొత్త ఉత్పత్తి అయిన ఏజెంట్ ఫోర్స్లో మరింత నియంత్రిత ఆటోమేషన్ను ప్రవేశపెడుతున్నామని ఆమె వెల్లడించారు.సాంకేతిక వైఫల్యాలే కారణమా?ఏజెంట్ ఫోర్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మురళీధర్ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. AI మోడల్స్కు ఎనిమిది కంటే ఎక్కువ సూచనలు (Prompts) ఇచ్చినప్పుడు అవి గందరగోళానికి గురవుతున్నాయి. ముఖ్యంగా..ఎక్కువ సూచనలు ఉంటే ఎల్ఎల్ఎంలు కీలకమైన ఆదేశాలను వదిలివేస్తున్నాయి.వినియోగదారులు అసంబద్ధమైన ప్రశ్నలు అడిగినప్పుడు ఏఐ తన అసలు లక్ష్యాన్ని మర్చిపోయి పక్కదారి పడుతోంది.25 లక్షల కస్టమర్లు ఉన్న వివింట్(Vivint) వంటి కంపెనీలు కస్టమర్ సర్వేలను పంపడంలో ఏఐ విఫలమైందని గుర్తించాయి. దీన్ని సరిదిద్దడానికి ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో ‘ట్రిగ్గర్లను’ ఏర్పాటు చేయాల్సి వస్తోంది.డేటా ఫౌండేషన్లపై దృష్టిఏఐ ద్వారా వేల కోట్లు ఆర్జించవచ్చని భావించిన సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ ఇప్పుడు డేటా ఫౌండేషన్లపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సరైన డేటా లేకుండా ఏఐ ఇష్టారీతిన ప్రవర్తిస్తుందని చెప్పారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ఏఐ ఏజెంట్ల విస్తరణ కారణంగా కంపెనీ తన సహాయక సిబ్బందిని 9,000 నుంచి 5,000కి తగ్గించిందని వెల్లడించారు.ఇదీ చదవండి: చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ! -
పసిడి @ 1.38 లక్షలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగా పుత్తడి, వెండి రేట్లు కొత్త రికార్డు స్థాయిలకు దూసుకెళ్తున్నాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం సోమవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,685 మేర పెరిగింది. రూ. 1,38,200కి ఎగిసింది. అటు వెండి ధర కూడా కిలోకి రూ. 10,400 మేర పెరిగి మరో కొత్త ఆల్టైమ్ గరిష్ట స్థాయి రూ. 2,14,500కి చేరింది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతుండటం, అక్కడి ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు మరింతగా పసిడి, వెండివైపు మళ్లుతున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు కూడా ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఇటు పరిశ్రమల నుంచి అటు ఇన్వెస్ట్మెంట్ కోణం నుంచి డిమాండ్ నెలకొనడంతో వెండి రేట్లు పరుగులు తీస్తున్నట్లు కోటక్ మ్యూచువల్ ఫండ్కి చెందిన ఫండ్ మేనేజర్ సతీష్ దొండపాటి చెప్పారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పుత్తడి ధర ఔన్సుకి (31.1 గ్రాములు) ఒక దశలో 80.85 డాలర్లు పెరిగి 4,420.35 డాలర్లకు ఎగిసింది. వెండి సైతం 2.31 డాలర్లు పెరిగి ఔన్సుకి 69.45 డాలర్లు తాకింది. -
రూ.1.4 లక్షలకు చేరువలో బంగారం!: ఇక కొనేదెలా..
బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు (డిసెంబర్ 22) ఉదయం గరిష్టంగా రూ. 1100 పెరిగిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి మరోమారు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో తాజా గోల్డ్ రేటు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఉదయం రూ.1,24,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,24,800 వద్దకు చేరింది. అంటే ఈ రోజు 24 గంటలు కాకముందే రూ. 800 పెరిగిందన్న మాట. (ఉదయం 1000 రూపాయలు పెరిగిన గోల్డ్ రేటు, ఇప్పడు మరో 800 రూపాయలు పెరిగి.. మొత్తం రూ. 1800 పెరిగింది).24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే, రూ. 1970 పెరగడంతో 10 గ్రాముల ధర రూ. 1,36,150 వద్దకు చేరింది. (24 క్యారెట్ల గోల్డ్ రేటు ఉదయం 1100 రూపాయలు పెరిగింది. సాయంత్రానికి మరో 870 రూపాయలు పెరగడంతో రెండూ కలిపి మొత్తం రూ. 1970 పెరిగింది).ఢిల్లీలో కూడా బంగారం ధర ఒకే రోజు రెండోసారి పెరిగింది. దీంతో సాయంత్రానికి 24 క్యారెట్ల ధర రూ. 1970 పెరగడంతో 10 గ్రాముల రేటు రూ. 1,36,300 వద్ద నిలిచింది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1800 పెరిగి.. 1 24,950 రూపాయల వద్దకు చేరింది.ఇక చెన్నై విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బంగారం ధరలు సాయంత్రానికి మరింత పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1850 పెరగడంతో రూ. 1,37,130 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1700 పెరిగి.. 1,25,700 రూపాయల వద్దకు చేరింది. -
బయోఫ్యాబ్రి.. భారత్ బయోటెక్ మధ్య ఒప్పందం
జెండాల్ గ్రూప్లో భాగమైన గ్లోబల్ హ్యూమన్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కంపెనీ.. బయోఫ్యాబ్రి వ్యాక్సిన్ ఆవిష్కరణ, తయారీలో ప్రపంచ అగ్రగామి అయిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (BBIL) ఈరోజు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు ప్రకటించాయి.రెండు సంస్థల భాగస్వామ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రాధాన్యతలకు అనుగుణంగా.. క్షయవ్యాధి వ్యాక్సిన్లకు అందించడానికి ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.2020లో లైసెన్సింగ్ అగ్రిమెంట్ తరువాత జరిగిన ఈ కొత్త టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒప్పందం రెండు కంపెనీలను మరింత బలపరుస్తుంది. ఈ భాగస్వామ్యం ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. ఆఫ్రికా, ఆగ్నేయాసియా అంతటా 70 కంటే ఎక్కువ దేశాలలో MTBVAC వ్యాక్సిన్ తక్కువ ఖర్చులో అందుబాటులో ఉండేలా చూడడం. -
కియోసాకి ఆర్ధిక సూత్రాలు: ధనికులయ్యే మార్గాలు!
ప్రపంచ ఆర్థిక అంశాలు, పెట్టుబడులపై సూచనలు ఇచ్చే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. తన ఎక్స్ ఖాతాలో యాక్టివ్గా ఉంటూ.. ధనవంతులు అవ్వడం ఎలా?, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను పేర్కొంటూ ఉంటారు. ఇందులో భాగంగానే.. ఈ మధ్య కాలంలో కొన్ని ఆర్ధిక పాఠాలను వెల్లడించారు.👉కియోసాకి మొదటి సూచన చమురు, సహజ వాయువు వంటి ఇంధనాలపై పెట్టుబడులు పెట్టడం. కృత్రిమ మేధస్సులో వేగవంతమైన పురోగతి, ప్రపంచ ఇంధన డిమాండ్ను గణనీయంగా పెంచుతుందని, సాంప్రదాయ ఇంధన ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారన్న ఆయన తాను ఇంధన రంగంలోనే పెట్టుబడుతున్నట్లు వెల్లడించారు.👉ఓడిపోయినవారు ఎప్పుడూ పాత ఆలోచనలు పట్టుకుంటారు. విజేతలా ఆలోచించడం ప్రారంభించండి. డబ్బును పట్టుకోవడం మానేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా మారండి. 1996లో ప్రచురించబడిన రిచ్ డాడ్ పూర్ డాడ్లో.. నేను “పొదుపు చేసేవారు ఓడిపోతారు” అని హెచ్చరించాను.👉ఆర్థిక సంక్షోభానికి చిక్కకుండా ఉండాలంటే ‘నెట్ వర్క్ మార్కెటింగ్’లో చేరాలని సూచించారు. ఆర్థిక రచయిత రాబర్ట్ కియోసాకి నెట్ వర్క్ మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా వ్యవస్థాపక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక పతనానికి సిద్ధం కావాలని అన్నారు.👉ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ధనవంతులు ఎలా జీవిస్తారో అలాగే మీరూ జీవించండి. మాంద్యం ప్రభావం నుంచి బయటపడటానికి తక్షణమే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఆయన సూచించారు. సొంత కారు ఉన్నవారు వెంటనే ఉబర్ (Uber) వంటి సేవల్లో చేరి అదనపు ఆదాయాన్ని సంపాదించాలని సూచించారు.👉ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో, అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి. తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే పాటించాను.👉ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.👉ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్కాయిన్, ఇథీరియం కొనండి.👉మాటలను నియంత్రించుకోవాలి. ''మీరు మాట్లాడే మాటలే మీరు'' అవుతారని కియోసాకి అన్నారు. రిచ్ డాడ్ (ధనిక తండ్రి).. తన కొడుకు నుంచి చేతకాదు, చేయలేను.. అనే మాటలను ఒప్పుకోరు. ఎందుకంటే మాటలే మనల్ని నియంత్రిస్తాయని అంటారు. పూర్ డాడ్ (పేద తండ్రి).. పదేపదే నేను చేయలేను అని చెప్పేవారు. ఆయన ఆ మాటలకే కట్టుబడిపోయారు. దీంతో ఆయన ఎంత డబ్బు సంపాదించినా జీవితాంతం పేదవాడిగానే ఉండిపోయారని కియోసాకి పేర్కొన్నారు. -
H-1B visa: ఆగిన వర్క్పర్మిట్ల పునరుద్ధరణ
భారత్కు వచ్చి హెచ్-1బీ వీసా స్టాంపింగ్ పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్న అనేక మంది భారతీయ హెచ్ -1బి వీసా హోల్డర్లు ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు. ఇక్కడి యూఎస్ కాన్సులర్ కార్యాలయాలు హఠాత్తుగా వారి వీసా స్టాంపింగ్ అపాయింట్లను రీషెడ్యూల్ చేసింది. దీంతో వాళ్లు తిరిగి తమ ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.ఈ వీసా రీషెడ్యూళ్లు ప్రధానంగా డిసెంబర్ 15 నుంచి 26వ తేదీల మధ్య స్లాట్ లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. దీనికి క్రిస్మస్ సెలవు సీజన్ ఓ కారణమై ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ, అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సోషల్ మీడియా స్క్రీనింగ్ను కఠినంగా అమలు చేయడం వల్లే ఈ మార్పులు జరిగాయేమో అన్న అనుమానాలు వీసా హోల్డర్లలో ఆందోళనను పెంచుతున్నాయి.ఇక ఈ పరిణామం వల్ల ప్రభావితులవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐటీ, హెల్త్కేర్, ఫైనాన్స్ రంగాల్లో పనిచేస్తున్న హెచ్-1బి ఉద్యోగులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఉద్యోగులు పనిచేసే అమెరికాలోని కంపెనీలు కూడా ఉద్యోగుల గైర్హాజరీతో ప్రాజెక్ట్ డెడ్లైన్లు తప్పే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
నరెడ్కో తెలంగాణ 30వ వార్షికోత్సవ వేడుకలు
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NAREDCO), తెలంగాణ సభ్యులు తమ 30 సంవత్సరాల వార్షికోత్సవాన్ని నిర్వహించకునేందుకు సిద్ధమయ్యారు. మొదటగా 1995లో స్థాపించబడిన నరెడ్కో సంస్థ రాష్ట్ర శాఖ దాని ప్రత్యక్ష వాటాదారుల భాగస్వామ్యం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో కీలక పాత్ర పోషించింది.ప్రభుత్వం, పరిశ్రమ,కొనుగోలుదారుల మధ్య అంతరాన్ని సమర్థవంతంగా తగ్గించడం ద్వారా, నరెడ్కోతెలంగాణ పారదర్శక, విధాన-అనుగుణ్య, వృద్ధి-ఆధారిత రియల్ ఎస్టేట్ వాతావరణాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రధాన వార్షిక ప్రాపర్టీ షోలు, ఇతర పరిశ్రమ వేదికల ద్వారా, అసోసియేషన్ అర్థవంతమైన సంభాషణను ప్రారంభించింది.మౌలిక సదుపాయాల అభివృద్ధితో ముడిపడిన విధాన సంస్కరణలకు మద్దతు ఇచ్చింది. నగర రియల్ ఎస్టేట్ వృద్ధికి గణనీయంగా దోహదపడింది. విశ్వసనీయ డెవలపర్లు, ధృవీకరించబడిన ప్రాజెక్ట్లకు ప్రాప్యతను అందిస్తూ, పారదర్శకత, నైతిక పద్ధతులు, నియంత్రణ అవగాహనను ప్రోత్సహించడం ద్వారా ఇది గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడుతుంది. ఫ్లాట్లు, విల్లాలు, ప్లాట్లు లేదా ఇళ్లను కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు తగిన సమాచారంతో, నమ్మకంగా నిర్ణయాలు తీసుకునేలా సాధికారికతను అందిస్తుంది.నేడు, నరెడ్కోలో తెలంగాణలోని ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లతో సహా 300 మందికి పైగా సభ్యులు ఉన్నారు – ఇది నరెడ్కో ఒక పటిష్టమైన స్వీయ-నియంత్రణ సంస్థగా పరిణామం చెందింది అనడానికి నిదర్శనం. హైదరాబాద్ నివాస, వాణిజ్య ఆస్తులకు ఒక ప్రీమియం కేంద్రంగా ఎదుగుతున్న సందర్భంలోనరెడ్కో తెలంగాణ రాష్ట్రానికి తన సేవలను అందిస్తూనే ఉంటుంది.దీనితో కలసి పని చేసే వారు కూడా ఈ మహానగరంతో పాటు అభివృద్ధి చెందేలా చూస్తుంది. రాబోయే మరో 30 ఏళ్లు కూడా ఈ ప్రస్థానం కొనసాగాలని ఆశిస్తోంది. -
సాగర గర్భంలో అపార ఖనిజ సంపద.. వెలికితీత సాధ్యమేనా?
భారతదేశం అనేక ఖనిజాలకు (ఇంధన, లోహ, అలోహ ఖనిజాలు) నిలయం. వీటిని సరైన విధంగా గుర్తించి.. వినియోగించుకుంటే.. దిగుమతి కోసం దాదాపు ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. భూమిపైన మాత్రమే కాకుండా.. సముద్ర గర్భంలో కూడా విరివిగా లభిస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియా.. నేషనల్ గ్యాస్ హైడ్రేట్ ప్రోగ్రామ్ (NGHP) ద్వారా.. సముద్రంలో మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలను గుర్తించింది. ఇంతకీ ఇదెందుకు ఉపయోగపడుతుంది?, ఎలా బయటకు తీయాలి?, బయటకు తీయడం వల్ల లాభం ఏమిటనే.. ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.భారతదేశం.. బంగాళాఖాతంలో మాత్రమే కాకుండా, దాని తూర్పు ఖండాంతర అంచున దగ్గర కూడా భారీగా మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలను గుర్తించింది. ఈ నిక్షేపాల విలువ ట్రిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా. కానీ దీనిని (మీథేన్ హైడ్రేట్) సముద్రం నుంచి బయటకు తీయగల సరైన టెక్నాలజీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అంతే కాకుండా దీనిని బయటకు తీయడానికి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (UNCLOS) ద్వారా కొన్ని హక్కులను పొందాల్సి ఉంటుంది.మీథేన్ హైడ్రేట్ను బయటకు తీయడం కష్టమా?, ఎందుకు?సముద్రం అడుగున ఉన్న భూభాగం చల్లగా (0-4 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్) ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీథేన్ హైడ్రేట్ గడ్డ కట్టుకుని ఉంటుంది. అయితే దీనిని బయటకు తీయాలని ప్రయత్నించినప్పుడు.. కొంత ఉష్ణోగ్రత వల్ల కరిగిపోవచ్చు. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ మీథేన్ హైడ్రేట్ ఆవిరయ్యే అవకాశం ఉంటుంది.డీ–ప్రెషరైజేషన్, థర్మల్ స్టిమ్యులేషన్, వంటి టెక్నాలజీలను ఉపయోగించి లేదా కొన్ని రసాయన పద్దతుల ద్వారా మీథేన్ హైడ్రేట్ బయటకు తీయవచ్చు. కానీ సముద్ర గర్భంలో ఎక్కువ సేపు పని చేయడం అనేది చాలా కష్టమైన పని. అంతే కాకుండా పనిచేస్తున్నప్పుడు మీథేన్ విడుదలైతే చాలా ప్రమాదం. దీనికోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.మీథేన్ హైడ్రేట్ వల్ల ఉపయోగాలుసముద్రంలోని భారీ మీథేన్ హైడ్రేట్ను బయటకు తీస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రధానంగా గ్యాస్ దిగుమతులు తగ్గించవచ్చు. విద్యుత్ ఉత్పత్తి, వంట గ్యాస్, పరిశ్రమల్లో ఉపయోగించవచ్చు. భవిష్యత్ తరాలు ఉపయోగించుకోవడానికి నిల్వ చేసుకుపోవచ్చు. బొగ్గు, పెట్రోలియంతో పోలిస్తే.. మీథేన్ హైడ్రేట్ ఉపయోగం వల్ల కాలుష్యం తగ్గుతుంది. గ్యాస్ ధరలు కూడా తగ్గుతాయి.పరిధి దాటితే పరిస్థితులు తీవ్రం!సముద్రం అనేది ఏ ఒక్క దేశం అధీనంలో ఉండదు. ఇది మొత్తం అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉంటుంది. కేవలం తీరరేఖ నుంచి 12 నాటికల్ మైళ్ల దూరం మాత్రమే ఆ దేశం ఆధీనంలో ఉంటుంది. అయితే తీరరేఖ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న సముద్రంలో లభించే వనరులను దేశం ఉపయోగించుకునే అధికారం ఉంటుంది. ఈ పరిధి ఏ దేశం దాటినా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సముద్రంలోని నిక్షేపాలను ఏ ఒక్క దేశం స్వాధీనం చేసుకోవడం అనేది సాధ్యం కాదు.ఇదీ చదవండి: 'ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు'.. కియోసాకి పదో పాఠం -
Income Tax: పన్ను చెల్లించే విధానం ఇలా..
ఈ నెలాఖరుతో 2025–26లో 9 నెలలు పూర్తవుతాయి. వచ్చే మార్చికి ఏడాది పూర్తి. ఎలాగైతే ఏడాది పొడవునా ఆదాయం వస్తుందో, అదే రకంగా ఆదాయపు పన్ను చెల్లించాలి.మొదటిది. టీడీఎస్..ఉద్యోగస్తులైతే మొదటి నెల నుంచి టీడీఎస్ పరిధిలోకి వస్తారు. యజమాని ఉద్యోగి పన్ను భారాన్ని లెక్కించి, పన్నెండు భాగాలుగా విభజించి, ఏప్రిల్ నుంచి రికవరీ చేసి, గవర్నమెంటు ఖాతాలో జమ చేయాలి. ఇలా జరిగిన టీడీఎస్ మీ ఖాతాలోనే పడుతుంది. అంతే కాకుండా బ్యాంకు వాళ్లు మీకు వడ్డీ ఇచ్చినప్పుడు లేదా క్రెడిట్ చేసినప్పుడు టీడీఎస్ చేస్తారు. ఇతరత్రా ఎన్నో ఆదాయాలు చేతికొచ్చే సందర్భంలో టీడీఎస్ జరుగుతుంది. ఇందులో ముఖ్యమైనది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటి. అలాగే మీరు విదేశాలకు డబ్బులు పంపించినప్పుడు, బ్యాంకర్లు చేసే టీడీఎస్ని టీసీఎస్ అంటారు.రెండోది. టీసీఎస్..ఇది కూడా ముఖ్యమైన రికవరీ. కొన్ని నిర్దేశిత వస్తువులను మీరు కొంటున్నప్పుడు, అంటే, ఉదాహరణకి మోటర్ వాహనాన్ని తీసుకుంటే మీరు కొనుగోలుదారు అవుతారు. అప్పుడు అమ్మే వ్యక్తి మీ దగ్గర్నుంచి 1 శాతాన్ని పన్నుగా రికవరీ చేస్తారు. దీన్నే టీసీఎస్ అంటారు.మూడోది.. ఎస్టీటీ..ఇది షేర్ల క్రయవిక్రయాల్లో వసూలు చేసే పన్ను.అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు..పన్నుభారం కొన్ని పరిమితులు దాటితే, అడ్వాన్స్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. అలాంటి భారం ఏర్పడ్డ వారు ముందుగానే తమ అడ్వాన్స్ ట్యాక్స్ భారాన్ని లెక్కించి, నాలుగు భాగాలుగా సమర్పించాలి. 60 ఏళ్లు దాటిన వారికి వ్యాపారం/వృత్తి మీద ఆదాయం లేకపోతే వర్తించదు. ఎలా కట్టాలంటే.. జూన్ 15నాటికి 15 శాతం, సెప్టెంబర్ 15 నాటికి 30 శాతం, డిసెంబర్ 15 నాటికి 30 శాతం, మార్చి 15 నాటికి 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత జూన్ 15 నాటికి, ఆ తర్వాత ప్రతి క్వార్టర్లో చివరి నెల 15లోపు పైన చెప్పిన విధంగా చెల్లించాలి. కొంత మంది ఊహాజనితంగా ట్యాక్స్ చెల్లిస్తారు. వారు 100 శాతాన్ని మార్చి 15లోపల చెల్లించాలి. సకాలంలో చెల్లించకపోతే వడ్డీ పడుతుంది.క్యాపిటల్ గెయిన్స్ ఏర్పడటం ముందుగా ఊహించడం కుదరదు కనుక, అడ్వాన్స్ ట్యాక్స్ లెక్కింపులో దాన్ని పరిగణనలోకి తీసుకోరు. కానీ వ్యవహారం అయిన తర్వాత వచ్చే క్వార్టర్లోగా చెల్లించాలి. అలా చెల్లించిన తర్వాత, టీడీఎస్ తీసుకున్నాక, ఇంకా పన్ను భారం ఏర్పడితే, మార్చి 31లోగా పూర్తిగా చెల్లించాలి. వీలైతే ఈ వారంలో మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ కింది వాటిని చూడండి.1. ఫారం 26 ఏఎస్ 2. ఏఐఎస్ 3. టీఐఎస్సర్వసాధారణంగా ఈ మూడు ఫారాలలోని అంశాల్లో, ఆ రోజు వరకు మీకొచ్చిన ఆదాయం, మీరు చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు, టీడీఎస్, టీసీఎస్ రికవరీ మొదలైనవి కనిపిస్తాయి. ఒక్కొక్కపుడు కొన్ని ఎంట్రీలు పడకపోవచ్చు, కనిపించకపోవచ్చు. గాభరాపడకండి. అవి అప్డేట్ అవుతాయి. ఈ సమాచారమంతా గ్రహించిన తర్వాత మీకు తెలుస్తుంది.. మీ పన్నుభారమెంతో. తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని మార్చి 15 వరకు వాయిదాలతో సర్ది, సరిచేసి అంతా చెల్లించి హాయిగా ఉండండి. దీనితో మీ పన్ను భారం చెల్లింపులు పూర్తవుతాయి.ఆరోది..ఆఖరుది. సెల్ఫ్ అసెస్మెంటు. సాధారణంగా మార్చి లోపల చేసే చెల్లింపులన్నీ టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ అవుతాయి. మార్చి తర్వాత చేసే పేమెంట్లని, సెల్ఫ్ అసెస్మెంట్ చెల్లింపులని అంటారు. రిటర్నులు వేసేటప్పుడు అన్నీ దగ్గర పెట్టుకుని, పన్ను భారం లెక్కించి కట్టేది సెల్ఫ్ అసెస్మెంట్. అప్పటికే ఎక్కువ చెల్లించినట్లయితే రిఫండ్ కోరవచ్చు. అసెస్మెంట్ చేసినప్పుడు ఆదాయంలో హెచ్చులు, తప్పొప్పులు జరిగితే పన్నుభారం పడొచ్చు. ఆ చెల్లింపుని డిమాండ్ చెల్లింపని అంటారు. దీనితో కథ ముగిసినట్లే. -
ఒకే ఒక్క రూల్.. ఎంతో మందిని ‘రిచ్’ చేసింది!
ఒకే ఒక్క రూల్.. ప్రపంచ మార్కెట్లను ఎన్నో ఏళ్లుగా ఏలుతోంది. సగటు ఇన్వెస్టర్లు ధనవంతులు అయ్యేందుకు రామ బాణంలా పనిచేస్తూ వస్తోంది. అదే వారెన్ బఫెట్ ప్రతిపాదించిన 90/10 పెట్టుబడి వ్యూహం. వ్యక్తిగత మదుపరులకు అందుబాటులో ఉన్న అత్యంత సరళమైన, ప్రభావవంతమైన విధానాలలో ఒకటిగా ఇది నిలిచింది. అధిక రుసుములు, అనవసరమైన సంక్లిష్టతను నివారిస్తూ, దీర్ఘకాలంలో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి నుంచి లాభపడేందుకు సగటు మదుపరులకు సహాయపడాలనే ఉద్దేశంతో బఫెట్ ఈ నియమాన్ని సూచించారు.మార్కెట్ను అంచనా వేయడంలో చాలా మంది యాక్టివ్ ఫండ్ మేనేజర్లు విఫలమవుతున్నారని చాలా కాలంగా విమర్శిస్తూ వచ్చిన బఫెట్.. చారిత్రక మార్కెట్ డేటా, సహనం, కాంపౌండింగ్ శక్తిపై ఆధారపడేలా పెట్టుబడి ప్యూహాన్ని ప్రతిపాదించారు. 90/10 వ్యూహం పెట్టుబడిదారులకు వృద్ధిని గరిష్టంగా పొందే అవకాశం ఇస్తూనే, చిన్న భద్రతా వలయాన్ని కూడా కల్పిస్తుంది. తక్కువ నిర్వహణ, దీర్ఘకాలికంగా నిలకడైన, అమలు సాధ్యమైన వ్యూహంగా దీన్ని రూపొందించారు.ఏమిటీ 90/10 రూల్?మదుపరులు పెట్టే పెట్టుబడుల్లో 90 శాతం తక్కువ ఖర్చుతో కూడిన ఎస్& పి 500 ఇండెక్స్ ఫండ్లో మిగిలిన 10 శాతం స్వల్పకాలిక అమెరికా ప్రభుత్వ ట్రెజరీ బిల్లుల్లో ఇన్వెస్ట్ చేయాలనేది ఈ నియమం సారాంశం.బఫెట్ 2013లో తన బెర్క్ షైర్ హాత్వే వాటాదారులకు రాసిన లేఖలో ఈ నియమాన్ని మొదటిసారిగా బహిరంగంగా వివరించారు. బెంజమిన్ గ్రాహం బోధనలను ఆధారంగా తీసుకుని, చాలా మంది వ్యక్తిగత మదుపరులకు స్టాక్స్ను లోతుగా విశ్లేషించే సమయం లేదా నైపుణ్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. గెలుపు గుర్రాల్లాంటి స్టాక్స్ను ఎంచుకోవడానికి ప్రయత్నించడంకన్నా, విస్తృత మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మెరుగైన మార్గం అనేది బఫెట్ అభిప్రాయం.తన భార్య కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్కు సంబంధించిన పెట్టుబడులకు కూడా ఇదే సూత్రాన్ని పాటించారు బఫెట్. దీంతో ఈ వ్యూహంపై ఇన్వెస్టర్లకు నమ్మకం మరింత బలపడింది.బఫెట్ లాజిక్ ఇదే..కాలక్రమేణా అమెరికన్ వ్యాపార రంగం పెరుగుతుందనేది బఫెట్ నమ్మకం. ఆ వృద్ధిని సంపూర్ణంగా పొందాలంటే విస్తృత మార్కెట్ బహిర్గతం అవసరం. అధిక ఫీజులు, భావోద్వేగ నిర్ణయాలు, తప్పుడు టైమింగ్ వంటి అంశాలు మదుపరుల రాబడులను తగ్గిస్తాయి. ఇండెక్స్ ఫండ్లు ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తాయి.బఫెట్ తరచూ చెప్పే మాట ఒక్కటే ‘చిన్నపాటి ఫీజులు కూడా దీర్ఘకాలంలో భారీ నష్టాలకు దారి తీస్తాయి.’ప్రయోజనాలు.. పరిమితులు90/10 వ్యూహం అనేక స్పష్టమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఎస్&పీ 500 దాదాపు ఒక శతాబ్దంలో స్థిరమైన వృద్ధిని అందించిందని దీర్ఘకాలిక డేటా చూపిస్తోంది. దాని విస్తృత వైవిధ్యం.. అధిక ఈక్విటీ కేటాయింపుతో వచ్చే రిస్క్ను కూడా పరిమితం చేస్తుంది. తక్కువ నిర్వహణ రుసుములు కాంపౌండింగ్ను మరింత పెంచుతాయి. కాలక్రమేణా పోర్ట్ ఫోలియోకు వేలాది డాలర్లను జోడిస్తాయి.అయితే ఈక్విటీలకు 90 శాతం కేటాయింపు అందరికీ తగినది కాదని విమర్శకులు గమనించారు. ఇది పదవీ విరమణ చేసిన వారికి లేదా రిస్క్ సహనం తక్కువ ఉన్నవారికి దూకుడుగా ఉండవచ్చు. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 638.12 పాయింట్లు లేదా 0.75 శాతం లాభంతో 85,567.48 వద్ద, నిఫ్టీ 195.20 పాయింట్లు లేదా 0.75 శాతం లాభంతో 26,161.60 వద్ద నిలిచాయి.క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్, జూపిటర్ వ్యాగన్స్, ష్రెనిక్, ఐడియాఫోర్జ్ టెక్నాలజీ, సద్భావ్ ఇంజనీరింగ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. నాలెడ్జ్ మెరైన్ & ఇంజనీరింగ్ వర్క్స్, దావణగెరె షుగర్ కంపెనీ, ఆర్వీ లాబొరేటరీస్, మీషో లిమిటెడ్, రిలయన్స్ పవర్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ధర ఎక్కువైనా.. 24 గంటల్లో కొనేశారు!
బ్రిటిష్ లగ్జరీ కార్ల బ్రాండ్ నుంచి బీఎండబ్ల్యు ఏజీ కింద భారతదేశంలో లాంచ్ అయిన.. లేటెస్ట్ కారు 'మినీ కూపర్ కన్వర్టిబుల్' వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందనను పొందింది. డిసెంబర్ 12న ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన ఈ మోడల్ మొదటి బ్యాచ్ బుకింగ్స్ 24 గంటల్లో పూర్తయ్యాయి.మినీ కూపర్ కన్వర్టిబుల్ ప్రారంభ ధర రూ. 58.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనికి సంస్థ మన దేశానికి సీబీయూ మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. ఈ కారణంగానే దీని ధర కొంత ఎక్కువగా ఉంటుంది.మినీ కూపర్ కన్వర్టిబుల్ ధర సాధారణ కార్ల కంటే కొంత ఎక్కువే అయినప్పటికీ .. కొనుగోలుదారులు మాత్రం వెనక్కి తగ్గకుండా బుక్ చేసుకున్నారు. తరువాత బ్యాచ్ బుకింగ్స్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభం కానున్నాయి. ప్రీమియం ఫీచర్స్ పొందిన ఈ కారు నాలుగు వేర్వేరు రంగులలో లభిస్తుంది.ఇదీ చదవండి: అందుకే.. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్!కొత్త మినీ కూపర్ కన్వర్టిబుల్ సిగ్నేచర్ మినీ సిల్హౌట్ పొందుతుంది. దీని ముందు భాగంలో రౌండ్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, కొత్త రేడియేటర్ గ్రిల్ లేఅవుట్ చూడవచ్చు. ఇది 18-అంగుళాల ఏరోడైనమిక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్పై నడుస్తుంది. వెనుక భాగంలో, ఇది ఫ్లష్ సర్ఫేస్ స్టైలింగ్లో పూర్తయిన ఎల్ఈడీ టెయిల్లైట్స్ కనిపిస్తాయి. -
ప్రపంచ 5జీ అగ్రగామిగా భారత్
కొద్దిరోజుల్లో 2025వ సంవత్సరం ముగుస్తున్న వేళ, టెలికమ్యూనికేషన్ రంగంలో భారత్ ప్రపంచ దిగ్గజంగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. చరిత్రలోనే అత్యంత వేగవంతమైన మౌలిక సదుపాయాల కల్పనతో దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య 40 కోట్లకు (400 మిలియన్లు) చేరుకుంది. ఇది భారతదేశ మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్యలో దాదాపు 32 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఫలితంగా ప్రపంచ డిజిటల్ వృద్ధికి భారత్ ప్రధాన ఇంజిన్గా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా 5G విస్తరిస్తున్నప్పటికీ, భారతదేశ వృద్ధి పథం సాటిలేనిదిగా ఉంది. 2025 చివరి నాటికి, ప్రపంచవ్యాప్తంగా 5G కస్టమర్ల సంఖ్య సుమారు 290 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ప్రపంచవ్యాప్త మొబైల్ కస్టమర్ల సంఖ్య మూడింట ఒక వంతు. 110 కోట్లకు పైగా వినియోగదారులతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, భారత్ రికార్డు వేగంతో ఆ వ్యత్యాసాన్ని తగ్గిస్తోంది. జులై 2025 నాటికి 36.5 కోట్ల వినియోగదారులను చేరుకున్న భారతీయ మార్కెట్, 2030 నాటికి 100 కోట్లకు, 2031 నాటికి 110 కోట్లకు చేరుకుంటుందని అంచనా.ముందంజలో జియోఈ విప్లవంలో రిలయన్స్ జియో (Reliance Jio) కేవలం భారతీయ లీడర్గానే కాకుండా, ప్రపంచ స్థాయి టెక్నాలజీ పవర్హౌస్గా అవతరించినట్లు కంపెనీ తెలిపింది. సంస్థ చెప్పిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 2025లో జియో 50 కోట్ల మొబైల్ వినియోగదారుల చారిత్రక మైలురాయిని అధిగమించింది. అక్టోబర్ 31 నాటికి ఆ సంఖ్య 51 కోట్లకు పెరిగింది. కేవలం ఈ ఏడాది మొదటి పది నెలల్లోనే దాదాపు 3 కోట్ల మంది కొత్త వినియోగదారులు చేరారు. కేవలం 5G విభాగంలోనే, 2025 చివరి నాటికి జియో వినియోగదారుల సంఖ్య 26 కోట్లకు చేరుకోనుంది. జియో మొత్తం వైర్లెస్ డేటా ట్రాఫిక్లో 5G వాటా ఇప్పుడు 50 శాతంగా ఉంది. 2025 మొదటి తొమ్మిది నెలల్లో ఈ నెట్వర్క్ ద్వారా ఏకంగా 162 ఎక్సాబైట్ల (162 బిలియన్ జీబీ) డేటా వినియోగం జరిగింది. 5G నెట్వర్క్కు మారడం వల్ల ఏడాది ప్రారంభంలో 32.3 జీబీగా ఉన్న సగటు జియో వినియోగదారుని నెలవారీ డేటా వినియోగం ఇప్పుడు 38.7 జీబీకి పెరిగింది.తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యంఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రిలయన్స్ జియో తిరుగులేని డిజిటల్ లీడర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లు కంపెనీ చెప్పింది. 2025 చివరి నాటికి ఈ ప్రాంతంలో జియో వైర్లెస్ వినియోగదారుల సంఖ్య 3.2 కోట్లు దాటినట్లు పేర్కొంది. దూకుడుగా విస్తరణ, సాంకేతిక విజయాలతో తెలుగు రాష్ట్రాల్లో జియో టాప్ పర్ఫార్మర్గా నిలిచినట్లు తెలిపింది. మొబైల్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా, హోమ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో కూడా కంపెనీ విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు స్పష్టం చేసింది. జియో ఎయిర్ఫైబర్ (Jio Fiber) సేవలు మార్కెట్ వాటాలో సింహభాగాన్ని దక్కించుకోవడంతో, రెండు రాష్ట్రాల్లో వైర్లైన్ వినియోగదారుల సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరుకుందని చెప్పింది.100 కోట్ల దిశగా ప్రయాణంభారత ప్రభుత్వం ఈ డిజిటల్ ప్రయాణంపై ధీమాగా ఉంది. 2026 నాటికి దేశీయ 5G వినియోగదారుల సంఖ్య 43 కోట్లకు చేరుతుందని భావిస్తోంది. మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, 5G డివైజెస్ అందుబాటులోకి రావడంతో 2030 నాటికి 100 కోట్ల 5G వినియోగదారుల లక్ష్యం అసాధ్యమేమీ కాదనే అభిప్రాయాలున్నాయి. 5G ప్రారంభించిన కేవలం మూడేళ్లలోనే భారత్ ప్రపంచ నాయకత్వ స్థాయికి చేరుకుంది. ఈ చారిత్రక మార్పులో రిలయన్స్ జియో ముందు వరుసలో నిలిచినట్లు కంపెనీ చెప్పింది.ఇదీ చదవండి: చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ! -
కెనడా కీలక నిర్ణయం : ఆ వీసాల నిలిపివేత, ప్రభావం ఎంత?
కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలోవ్యాపారం చేయాలనుకునేవారికి భారీ షాక్ ఇచ్చింది. తన స్టార్ట్-అప్ వీసా(SUV) కార్యక్రమాన్ని నిలిపివేసింది. వలస వ్యవస్థాపకుల కోసం కొత్త పైలట్ విధానాన్ని సిద్ధం చేస్తున్నందున తన వ్యాపార వలస వ్యవస్థలోని కొన్ని భాగాలను నిలిపివేస్తున్నట్టు కెనడా ప్రకటించింది.స్టార్ట్-అప్ వీసా దరఖాస్తుదారులకు అందుబాటులో ఉన్న ఐచ్ఛిక వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తులను ఇకపై అంగీకరించబోమని ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్షిప్ కెనడా (IRCC) ప్రకటించింది. అయితే ఇప్పటికే కెనడాలో ఉన్న తమ ప్రస్తుత పొడిగించాలని కోరుకునే దరఖాస్తుదారులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. ఈ నెల 31 రాత్రి 11.59 గంటలకు కొత్త స్టార్ట్-అప్ వీసా దరఖాస్తులను అంగీకరించడం నిలిపివేస్తామని కూడా డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది.మరోవైపు దేశంలో వ్యాపారాలు ప్రారంభించే విదేశీయుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. 2026లో పైలట్ ప్రాజెక్టు ద్వారా శాశ్వత నివాసానికి కొత్త పథకాన్ని ఐఆర్సీసీ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త పైలట్ వివరాలు 2026లో ప్రకటించబడతాయని భావిస్తున్నారు.తమ దేశంలో ఆవిష్కరణ, పోటీతత్వం , ఉద్యోగ సృష్టిని పెంచడానికి ఈ ప్రోగ్రామ్ ఉత్తమ వ్యవస్థాపకులను ఎంపిక చేస్తుందని నిర్ధారించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది.వారికి మినహాయింపు 2025లో జారీ చేయబడిన నియమించబడిన సంస్థ నుండి ఇప్పటికే ఎస్యూవీ వర్క్ పర్మిట్ అనుమతి ఉన్నప్పటికీ. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు తమ దరఖాస్తుదారులు సమర్పించుకోవచ్చు. వీరు జూన్ 30, 2026లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారతీయులపై ప్రభావంఇప్పటికే కెనడాను విడిచిపెడుతున్నామని, ప్రేమతో నిర్మించుకున్న అందమైన కలల గూడును వీడుతున్నామని వ్యాపార వేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చాలా దేశాలు స్టార్టప్లకు , వ్యాపారాలకు ఒకే విండోను అందిస్తుండగా కెనడాలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. కంపెనీ భవిష్యత్తుతోపాటు పిల్లలు విద్య కూడా ప్రభావితమవుంది వందలాదిమంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. కంపెనీల నిర్మాణానికి, ఆదాయాన్ని ఆర్జించడానికి, తమ కుటుంబాల శాశ్వత నివాసం కోసం కెనడాకు వెళ్లిన పలువురు ఇబ్బందుల్లో పడ్డారని భావిస్తున్నారు. ఇదీ చదవండి: పదేళ్ల డేటింగ్ : ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటైన లవ్బర్డ్స్ -
చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ!
ప్రపంచవ్యాప్తంగా భారత్తోపాటు వివిధ దేశాల్లో ఉద్యోగులు పనిచేసే చేసే పని గంటలకు, అందుకు వారికి లభించే వేతనానికి మధ్య ఉన్న వ్యత్యాసం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతీయులు వారానికి ఎక్కువ గంటలు శ్రమిస్తున్నప్పటికీ వారి సంపాదన మాత్రం ఆయా దేశాల ఉద్యోగుల కంటే చాలా తక్కువగా ఉంటోంది. 2024-25 నాటి గణంకాలు, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) నివేదికల ఆధారంగా వివిధ దేశాల పనిగంటలు, వేతనాల విశ్లేషణ కింద చూద్దాం.వివిధ దేశాల పనిగంటలు.. వేతనాల పరిశీలనదేశంసగటు వారపు పనిగంటలుసగటు నెలవారీ వేతనంగంటకు ఆదాయంఅమెరికా34 - 36 గంటలురూ.5,60,000రూ.4,100జర్మనీ34 - 35 గంటలురూ.4,50,000రూ.3,100జపాన్38 - 40 గంటలురూ.3,10,000రూ.1,900చైనా46 - 48 గంటలురూ.1,40,000రూ.750భారతదేశం46 - 48 గంటలురూ.32,000రూ.170 గమనిక: ఈ వేతనాలు ఆయా దేశాల కరెన్సీ విలువను ప్రస్తుత మారకపు రేటు ప్రకారం రూపాయిల్లోకి మార్చగా వచ్చిన సగటు విలువలు. రూపాయి విలువను అనుసరించి వీటిలో మార్పులుంటాయని గమనించాలి.అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితిఅమెరికా, జర్మనీ దేశాల్లో వారానికి కేవలం 35 గంటల లోపు పనిచేస్తూనే భారీ వేతనాలను అందుకుంటున్నారు. ఇక్కడ స్మార్ట్ వర్క్, హై-టెక్నాలజీ వినియోగం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత లభిస్తుంది.ఒకప్పుడు అధిక పనిగంటలకు పేరుగాంచిన జపాన్, ప్రస్తుతం వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వైపు మొగ్గు చూపుతోంది. 40 గంటల పని పరిమితిని కచ్చితంగా అమలు చేస్తోంది.చైనాలో కూడా పనిగంటలు భారత్తో సమానంగా ఉన్నప్పటికీ అక్కడి ఉత్పాదకత, తయారీ రంగం బలంగా ఉండటం వల్ల వేతనాలు భారత్ కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.భారత్లో ఎందుకీ పరిస్థితి?భారతదేశంలో కార్మికులు లేదా ఉద్యోగులు అత్యధిక సమయం పనిచేస్తున్నా తక్కువ ఆదాయాన్ని పొందడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 90% పైగా శ్రామిక శక్తి అసంఘటిత రంగంలోనే ఉంది. ఇక్కడ కచ్చితమైన వేతన చట్టాలు లేదా పనిగంటల నియంత్రణ తక్కువగా ఉంటుంది.అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక గంటలో తయారయ్యే వస్తువు/సర్వీసు విలువ, భారత్లో తయారయ్యే దానికంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం అధునాతన సాంకేతికత, మెరుగైన మౌలిక సదుపాయాలు లేకపోవడం.శ్రమ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కంపెనీలు తక్కువ వేతనాలకే ఉద్యోగులను నియమించుకోగలుగుతున్నాయి. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండటం వల్ల బేరమాడే శక్తి ఉద్యోగులకు తక్కువగా ఉంటోంది.భారత్లో జీవన వ్యయం (Rent, Food, Medical) అమెరికా, జర్మనీలతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి రూపాయి విలువ పరంగా తక్కువగా కనిపించినా స్థానిక అవసరాలకు అది సరిపోతుందని కంపెనీల వాదన. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చినప్పుడు ఇది భారీ వ్యత్యాసంగానే కనిపిస్తుంది.భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా ఎదుగుతున్నప్పటికీ సామాన్య ఉద్యోగికి దక్కే ఫలితం ఇంకా ఆశాజనకంగా లేదు. పనిగంటలను తగ్గించి, వేతనాలను పెంచాలంటే ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, ఆటోమేషన్, సంఘటిత రంగం విస్తరణపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్! -
పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్!
పర్యావరణ పరిరక్షణ, పెరుగుతున్న వాహన కాలుష్య నివారణే లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యే ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్’(పీయూసీ) లేని ఏ వాహనానికీ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయించకూడదని రాష్ట్ర రవాణా యంత్రాంగం (ఎస్టీఏ) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.చమురు సంస్థలకు కీలక ఆదేశాలుఈ నిబంధనను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రిలయన్స్, షెల్ వంటి ప్రైవేట్ చమురు సంస్థలకు కూడా రవాణా శాఖ లేఖలు రాసింది. ప్రతి ఫ్యుయల్ స్టేషన్ వద్ద వాహనదారుడి పీయూసీ సర్టిఫికేట్ను సిబ్బంది భౌతికంగా లేదా డిజిటల్ రూపంలో తనిఖీ చేసిన తర్వాతే ఇంధనం పోయాల్సి ఉంటుంది.అవగాహన కార్యక్రమాలుఈ కొత్త నిబంధనపై వాహనదారులకు, పెట్రోల్ బంక్ సిబ్బందికి తగినంత అవగాహన కల్పించాలని చమురు సంస్థలను కోరింది. ఒకవేళ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఇంధనం సరఫరా చేస్తే సంబంధిత డీలర్లపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్టీఏ హెచ్చరించింది.చట్టపరమైన నిబంధనలు ఇవే..మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 190(2), సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989లోని రూల్ 115 ప్రకారం.. ప్రతి వాహనం నిర్దేశిత ఉద్గార ప్రమాణాలకు లోబడి ఉండాలి. పీయూసీ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ బాటలోనే ఒడిశాదేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరడంతో అక్కడ ఇప్పటికే ‘నో పీయూసీ - నో ఫ్యూయల్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ-4) అమల్లో ఉంది. అదే బాటలో ఒడిశా ప్రభుత్వం కూడా ముందుస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్పై నిఘా -
కెనరా బ్యాంక్ కొత్త యాప్.. ఏఐ ఫీచర్లతో..
డిజిటల్ చెల్లింపులను సురక్షితంగా చేసేందుకు ఉపయోగపడేలా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ కొత్తగా ’కెనరా ఏఐ1పే’ పేమెంట్స్ యాప్ని ప్రవేశపెట్టింది. యూపీఐ ప్లాట్ఫాం ద్వారా వేగవంతంగా, సురక్షితంగా పేమెంట్స్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంకు తెలిపింది.నెలవారీగా ఖర్చులను విశ్లేషించుకునేందుకు స్పెండ్ అనలిటిక్స్, సులువుగా క్యూఆర్ స్కాన్ చేసేందుకు విడ్జెట్ సదుపాయం, తక్షణ నగదు బదిలీలు.. బిల్లుల చెల్లింపులు మొదలైన వాటికి యూపీఐ ఆటోపేలాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయని పేర్కొంది. అలాగే, పిన్ నంబరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా చిన్న మొత్తాలను చెల్లించేందుకు వీలుగా యూపీఐ లైట్ ఫీచరు సైతం ఇందులో ఉన్నట్లు వివరించింది.ఇదే యాప్లో మల్టీ లెవల్ భద్రతా వ్యవస్థను కూడా పొందుపరిచినట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ఏఐ ఆధారిత మోసాల గుర్తింపు (Fraud Detection) ద్వారా అనుమానాస్పద లావాదేవీలను తక్షణమే గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేసే విధంగా ఈ యాప్ను రూపొందించారు. బయోమెట్రిక్ లాగిన్, డివైస్ బైండింగ్, రియల్టైమ్ అలర్ట్స్ వంటి సదుపాయాలతో వినియోగదారుల ఖాతా భద్రత మరింత బలోపేతం అవుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు.అలాగే, ఈ యాప్ ద్వారా వ్యక్తిగత వినియోగదారులతో పాటు వ్యాపారులు కూడా సులభంగా చెల్లింపులు స్వీకరించవచ్చని పేర్కొన్నారు. చిన్న దుకాణాలు, స్వయం ఉపాధి వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల వైపు అడుగులు వేయడానికి ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కెనరా బ్యాంక్ స్పష్టం చేసింది. -
పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్పై నిఘా
కేంద్ర ప్రభుత్వం పన్ను వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో చారిత్రాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. ఆదాయపు పన్ను బిల్లు, 2025 ద్వారా ప్రతిపాదించిన మార్పుల ప్రకారం.. ఏప్రిల్ 1, 2026 నుంచి ఆదాయపు పన్ను శాఖకు పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్, ఇతర డిజిటల్ ఖాతాలను యాక్సెస్ చేసే అధికారం లభించనుంది. పన్ను ఎగవేతను అరికట్టడానికి, ఆర్థిక పారదర్శకతను పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.‘వర్చువల్ డిజిటల్ స్పేస్’ విస్తరణప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్థిక లావాదేవీలు కేవలం బ్యాంకు ఖాతాలకు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ ఆన్లైన్ వేదికల ద్వారా జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ‘వర్చువల్ డిజిటల్ స్పేస్’ అనే నిర్వచనాన్ని విస్తరించింది. దీని పరిధిలోకి..సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు (Facebook, Instagram, X మొదలైనవి)వ్యక్తిగత కమ్యూనికేషన్.. ఈమెయిల్ రికార్డులు.ఆన్లైన్ ఖాతాలు.. క్లౌడ్ స్టోరేజ్, ట్రేడింగ్ ఖాతాలు, ఇన్వెస్ట్మెంట్ పోర్టల్స్ వస్తాయి.పన్ను చెల్లింపుదారులు ప్రకటించిన ఆదాయానికి, వారి వాస్తవ జీవనశైలికి మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించడం ఈ చర్య ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ మార్పులు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయని గమనించాలి. కొందరు పన్ను చెల్లింపుదారులు తక్కువ ఆదాయాన్ని చూపిస్తూ విదేశీ పర్యటనలు చేయడం లేదా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి ప్రతిపాదిత మార్పుల ద్వారా నిఘా పరిధిలోకి వస్తాయి.ఈ డిజిటల్ పర్యవేక్షణ ద్వారా పన్ను చెల్లింపుదారులలో బాధ్యత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో భారీ డేటాను విశ్లేషించి పన్ను ఎగవేతను ముందస్తుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.గోప్యతా ఆందోళనలు.. చట్టపరమైన సవాళ్లుఈ సంస్కరణ అమలుపై న్యాయ నిపుణులు, పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా గోప్యత ప్రాథమిక హక్కు అనే అంశంపై చర్చ జరుగుతోంది. కోర్టు అనుమతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం అధికారులకు ఇవ్వడం దుర్వినియోగానికి దారితీయవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. క్లౌడ్ స్టోరేజ్ నుంచి వ్యక్తిగత సందేశాల వరకు యాక్సెస్ ఉండటం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఫాక్స్కాన్ ప్లాంట్లో 30,000 మంది నియామకం -
బీమా ప్రీమియం పెరిగింది.. మరి కవరేజీ సరిపోతుందా?
విద్యలేని వాడు వింత పశువు అని ఒకప్పుడు అనేవారు.. ఈ ఆధునిక కాలంలో మాత్రం ఈ సామెతను బీమా లేని వారికి వాడుకోవాలి. అయితే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కబళించిన 2020 నుంచి భారత్లో బీమా ప్రీమియం గణనీయంగా పెరిగింది. కచ్చితంగా చెప్పాలంటే ప్రీమియం 73 శాతం వరకూ పెరగ్గా బీమా చేసిన మొత్తం కూడా 240 శాతం వరకూ ఎక్కువైంది. కానీ... ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే... ఉన్న బీమా కవరేజీ అస్సలు సరిపోవడం లేదు. ఇతర అవసరాల కోసం దాచుకున్న సొమ్ము ఖర్చుపెట్టాలి లేదంటే అప్పు చేయాలి. అందుకే... మీ బీమా పాలసీ ఏటికేడాదీ పెరిగిపోతున్న వైద్యం ఖర్చులను తట్టుకునేలా ఉందా? లేదా? సరిచూసుకోండి.దేశంలో చాలామంది బీమా పాలసీ తీసుకున్న వారు తమకు రూ.10 - 15 లక్షల కవరేజీ ఉంటే సరిపోతుందని అనుకుంటున్నారు. కొంచెం ఆదాయం తక్కువగా ఉన్న వారు రూ.పది లక్షల మొత్తానికి సర్దుకుంటూంటే.. మధ్యతరగతి వారు ఇంకో ఐదు లక్షల వరకూ ఎక్కువ మొత్తంతో పాలసీలు తీసుకుంటున్నారు. అయితే ఈ పెంపు సరిపోతుందా? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం చూస్తే వైద్యం ఖర్చులు ఏటా పన్నెండు నుంచి 14 శాతం వరకూ పెరుగుతున్నాయి. శస్త్రచికిత్సలకు మాత్రమే కాకుండా.. ఆసుపత్రుల్లో గదుల అద్దెలు, మందులు, ఇతర కన్స్యూమబల్స్ రేట్లు పెరిగిపోవడం ఇందుకు కారణం. గత ఐదేళ్లలో పెరిగిన ప్రీమియం మొత్తం కూడా ఈ వ్యత్యాసాన్ని తట్టుకోలేకపోతోంది. ఎక్కువ మొత్తానికి పాలసీ తీసుకున్నాం కాబట్టి ఇబ్బంది లేదని చాలామంది పాలసీదారులు అనుకుంటున్నారని, అంతకంటే వేగంగా ఆసుపత్రి బిల్లులు పెరుగుతున్నాయని గుర్తించడం లేదని నిపుణులు చెబుతున్నారు.టాప్ అప్లతో ఉపశమనం...పెరిగిపోతున్న వైద్యం ఖర్చులకు అనుగుణంగా మీ పాలసీను మలచుకోవడం ఒక మార్గం. బేస్ ప్లాన్కు అనువైన టాప్అప్ పాలసీలు జోడించుకోండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ కవరేజీ వస్తుంది. కొన్ని కంపెనీలు ద్రవ్యోల్బణానికి తగ్గట్టు ఏటా బీమా మొత్తాన్ని పెంచే పాలసీలు అందిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఐసీఐసీఐ లంబార్డ్లలో పాలసీ మొత్తం ఏటా పదిశాతం పెరిగేలా ఇన్ఫ్లేషన్ షీల్డ్ కవరేజీ అందిస్తున్నాయి. కుటుంబంలో ఒకొక్కరి ఒక్కో పాలసీ కాకుండా.. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లు ఎంచుకోండి. దీనివల్ల అందుబాటులో ఉండే మొత్తం ఎక్కువగా ఉంటుంది. పాలసీని ఎంచుకునేటప్పుడు ఏ ఏ అంశాలపై కవరేజీ లేదన్నది స్పష్టంగా అర్థం చేసుకోండి. కొన్ని పాలసీల్లో ఆసుపత్రిలో గది అద్దెలపై పరిమితి ఉంటుంది. లేదా పూర్తి మినహాయింపు ఉండవచ్చు. అలాగే ఏ ఏ ప్రొసీజర్లకు కవరేజీ వర్తిస్తుందో కూడా గమనించండి. వీటితోపాటు వీలైనంత వరకూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొంత అదనపు మొత్తాన్ని ఒక పద్ధతి ప్రకారం పొదుపు చేసుకోవడమూ అవసరమే.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
ఐఫోన్ తయారీ ప్లాంట్లో 30,000 మంది నియామకం
భారతదేశ తయారీ రంగంలో నియామకాల పర్వం కొనసాగుతోంది. తైవాన్కు చెందిన దిగ్గజ సంస్థ ఫాక్స్కాన్ బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఏర్పాటు చేసిన తన కొత్త ఐఫోన్ అసెంబ్లీ యూనిట్లో రికార్డు స్థాయిలో నియామకాలు చేపట్టింది. కేవలం 8 నుండి 9 నెలల వ్యవధిలోనే దాదాపు 30,000 మంది కార్మికులను నియమించుకోవడం ద్వారా తన కార్యకలాపాలను వేగవంతం చేసింది.మహిళలకు పెద్దపీట300 ఎకరాల ఈ భారీ సదుపాయంలో మొత్తం శ్రామిక శక్తిలో దాదాపు 80 శాతం మంది మహిళలే. వీరిలో మెజారిటీ ఉద్యోగులు 19-24 సంవత్సరాల వయస్సు కలిగిన వారు, మొదటిసారి ఉద్యోగంలో చేరుతున్న వారే కావడం గమనార్హం. వచ్చే ఏడాది నాటికి ఈ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటే మొత్తం ఉద్యోగుల సంఖ్య 50,000కు పెరుగుతుందని అంచనా. తద్వారా దేశంలోని ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలో లేని విధంగా ఒకే ప్రాంగణంలో అత్యధిక మంది మహిళా కార్మికులు పనిచేస్తున్న ప్లాంట్గా ఇది రికార్డు సృష్టించనుంది.ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ తయారీ ఇక్కడే..ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఐఫోన్ 16 మోడల్తో ట్రయల్ రన్ ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీ ప్రస్తుతం యాపిల్ అత్యాధునిక మోడల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ను తయారు చేస్తోంది. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తుల్లో 80 శాతానికి పైగా విదేశాలకు ఎగుమతి కానున్నాయి.ప్లాంట్ విశేషాలుసుమారు రూ.20,000 కోట్లు పెట్టుబడి.2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం.సగటున వేతనం నెలకు రూ.18,000 (ఉచిత వసతి, సబ్సిడీ భోజనం).ఉద్యోగుల కోసం ఇప్పటికే 6 భారీ వసతి గృహాలు అందుబాటులోకి వచ్చాయి.‘మినీ టౌన్షిప్’గా దేవనహళ్లికేవలం ఫ్యాక్టరీగానే కాకుండా ఈ ప్లాంట్ భవిష్యత్తులో ఒక మినీ టౌన్షిప్లా మారనుందని కంపెనీ చెప్పింది. ఇందులో నివాస సముదాయాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, వినోద సౌకర్యాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే మహిళా కార్మికులకు ఇది ఎంతో ఆసరాగా నిలుస్తోందని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చలి చంపుతున్నా వ్యాపారం భళా -
పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. విరుచుకుపడిన వెండి
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. రెండు రోజులుగా నిలకడగా ఉన్న పసిడి ధరలు ఒక్కసారీగా ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Today Gold Price) భారీగానే పెరిగాయి. వెండి ధరలు అయితే విరుచుకుపడ్డాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
చలి చంపుతున్నా వ్యాపారం భళా
భారతదేశంలో చలికాలం కేవలం వాతావరణ మార్పులకే పరిమితం కాకుండా దేశ రిటైల్, ఉత్పాదక రంగాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగే ఈ సీజన్ సుమారు 13.5 బిలియన్ డాలర్ల(సుమారు 1.1 లక్షల కోట్లు) విలువైన వింటర్ వేర్ మార్కెట్తో పాటు పలు కీలక రంగాలకు లాభాల పంట పండిస్తోంది. ఈ కాలంలో వినియోగదారుల అవసరాలు మారిపోవడం వల్ల అనేక రకాల వ్యాపారాలు పుంజుకుంటున్నాయి.చలికాలంలో వృద్ధి చెందే ప్రధాన వ్యాపారాలుభారతదేశంలో వింటర్ వేర్ మార్కెట్ విలువ 2025 నాటికి సుమారు 13.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. స్వెటర్లు, జాకెట్లు, థర్మల్ వేర్, శాలువాలు, గ్లౌవ్స్, మఫ్లర్లకు ఈ కాలంలో చాలా డిమాండ్ ఉంటుంది. లుధియానా, తిరుపూర్ వంటి ప్రాంతాల నుంచి హోల్సేల్గా కొనుగోలు చేసి రిటైల్ షాపులు లేదా రోడ్డు పక్కన తాత్కాలిక స్టాళ్ల ద్వారా వీటిని విక్రయిస్తున్నారు.ఆహార, పానీయాల రంగంచల్లని వాతావరణంలో ప్రజలు వెచ్చని, పోషక విలువలున్న ఆహారాన్ని కోరుకుంటారు. టీ, కాఫీ ముఖ్యంగా సూప్ విక్రయాల విభాగంలో ఈ సమయంలో డిమాండ్ పెరుగుతోంది. రోగనిరోధక శక్తిని పెంచే బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్, బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూల అమ్మకాలు పెరుగుతాయి.గృహోపకరణాలుఉష్ణోగ్రతలు తగ్గడంతో గృహ వినియోగ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. నీటిని వేడి చేసే గీజర్లు, గదిని వెచ్చగా ఉంచే రూమ్ హీటర్ల అమ్మకాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జోరుగా సాగుతాయి.చలికాలపు వ్యాపారాలు దేశ ఆర్థిక, సామాజిక స్థితిగతులపై ప్రభావం చూపుతాయి. పండుగలు (సంక్రాంతి, క్రిస్మస్), వివాహాల సీజన్ కూడా ఈ కాలంలోనే రావడంతో రిటైల్ రంగం భారీ ఆదాయాన్ని గడిస్తుంది. మార్కెట్ విశ్లేషణల ప్రకారం.. వింటర్ వేర్ మార్కెట్ ఏటా 6.10% వృద్ధి రేటుతో పెరుగుతోంది.తాత్కాలిక విక్రయదారులు, ఉన్ని దుస్తుల తయారీదారులు, పర్యాటక రంగంలో గైడ్లకు ఈ మూడు-నాలుగు నెలలు ఉపాధి లభిస్తుంది. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి మంచు కురిసే ప్రాంతాలతో పాటు ఆహ్లాదకరంగా ఉండే రాజస్థాన్, కేరళ వంటి రాష్ట్రాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. దీనివల్ల హోటల్, రవాణా రంగాలు లాభపడతాయి. అయితే, ఈ వ్యాపారాలు కేవలం కొన్ని నెలలకే పరిమితం కావడం వల్ల మిగిలిపోయిన సరుకు (Inventory) వ్యాపారులకు భారంగా మారుతుంది. దీన్ని అధిగమించడానికి సీజన్ ముగింపులో భారీ డిస్కౌంట్లు ఇస్తుంటారు.ఇదీ చదవండి: దీర్ఘకాల సంపద రహస్యం ఏమిటంటే.. -
26,100 మార్కు చేరిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే సోమవారం లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు లాభంతో 26,128 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 484 పాయింట్లు పుంజుకొని 85,408 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 22-12-2025(time: 09:40 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దీర్ఘకాల సంపద రహస్యం ఏమిటంటే..
ఆర్థిక మార్కెట్లకు 2025 సంవత్సరం ఆశ్చర్యాలకు గురిచేసింది. సంవత్సరంలో ఎక్కువ భాగం ఈక్విటీ మార్కెట్లు స్థిరంగా ఉన్నప్పటికీ, ఇటీవల రికవరీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రెండో అర్ధభాగంలో రెండు రకాల ఆస్తులు ప్రత్యేకంగా మెరిశాయి.బంగారం, వెండిబంగారం, క్యాలెండర్ ఇయర్ 2024లో 30% రాబడిని అందించింది. ఇది ఈక్విటీలను మించిన లాభం. మరోవైపు పరిశ్రమల వినియోగంతో డిమాండ్ పెంచుకున్న వెండి 25.3% లాభపడింది. దీంతో వీటిలో ఎక్కువ పెట్టుబడి పెట్టుంటే బాగుండేది అనుకునే ఇన్వెస్టర్ల సంఖ్య పెరిగింది. కానీ ఇలాంటి సమయంలోనే ‘రాబడులు ఇప్పటికే పెరిగాక వాటిని వెంబడించడం’ అనే ఉచ్చులో పెట్టుబడిదారులు చిక్కుకుంటారు.సమూహాన్ని వెంబడించే మానసిక లక్షణంబంగారంలో రాబడులు పెరిగే సమయంలో పెట్టుబడిదారుల ఆసక్తి కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. అయితే ధరలు పడిపోతే అదే ఆసక్తి తగ్గిపోతుంది. ఈ ప్రతిస్పందనాత్మక ప్రవర్తనే, పెట్టుబడుల్లో క్రమశిక్షణ, స్థిరత్వం ఎంత కీలకమో గుర్తు చేస్తుంది. మార్కెట్ టైమింగ్ కన్నా, దీర్ఘకాలిక దృష్టితో, విభిన్న ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మెరుగైన ఫలితాలు ఇస్తుంది. మార్కెట్ గతంలో ఇచి్చనట్లుగా భవిష్యత్లో కూడా లాభాలను అందిస్తుందనే హామీ ఏమీ ఉండదు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక సమర్థవంతమైన మార్గంఔట్సోర్సడ్ అసెట్ అలొకేషన్. అంటే, మన డబ్బును ఏ ఆస్తిలో ఎంత పెట్టాలి (షేర్లు, బాండ్లు, గోల్డ్, క్యాష్ వంటివి) అనే నిర్ణయాన్ని ఒక ఫండ్ మేనేజర్కే అప్పగించడం.క్లిష్ట పరిణామాల నేపథ్యంలో పెట్టుబడులుఎప్పటికప్పుడు మారుతూ అస్థిరంగా ఉన్న ప్రపంచ మార్కెట్లలో, ఇటీవల బాగా రాబడులు ఇచ్చిందనే కారణంతో ఒకేరకమైన ఆస్తి తరగతిపైనే పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం కావచ్చు. విభిన్న ఆస్తి తరగతులు ఇప్పుడెలా ప్రవర్తిస్తున్నాయో చూద్దాం:బంగారం–వెండి: సంప్రదాయంగా సురక్షిత పెట్టుబడి ఆస్తులుగా భావించే ఈ లోహాలు, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు లేదా కరెన్సీ బలహీనపడినప్పుడు మెరుగ్గా లాభాలను అందిస్తాయి. పరిశ్రమలతో అనుసంధానమై ఉండడం వల్ల ఎక్కువ ఊగిసలాట ఉన్నా వెండిలో అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.ఈక్విటీలు: వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండే ఆస్తి తరగతి. కానీ వడ్డీ రేట్లు, కంపెనీల లాభాల అంచనాలు, స్థూల ఆర్థిక మార్పులపై ఎక్కువగా ఆధారపడతాయి. ప్రాంతాలు, రంగాల మధ్య పనితీరులో పెద్దగా తేడాలు ఉంటాయి.ఫిక్స్డ్ ఇన్కమ్: స్థిరత్వం ఎక్కువ, అంచనా వేయగల ఆదాయాన్ని అందిస్తాయి. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ ధరలపై ఒత్తిడి వచ్చినా, రిస్క్ నియంత్రణకు, మూలధన పరిరక్షణకు ఇవి కీలకం. ముఖ్యంగా సంరక్షణాత్మక పెట్టుబడిదారులకు, పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారికి ఇవి ఉపయోగం.రియల్ అసెట్స్ ఇతర ప్రత్యామ్నాయాలు: రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమోడిటీలు ద్రవ్యోల్బణానికి రక్షణనిచ్చే అవకాశముంది. ప్రైవేట్ ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులు అధిక రాబడులు ఇవ్వగలిగినా, ఎక్కువ రిస్క్, తక్కువ లిక్విడిటీ కలిగి ఉంటాయి.వైవిధ్యీకరణ ఎందుకు కీలకం?: బుల్ మార్కెట్లో ఈక్విటీలు కావొచ్చు, మాంద్య సమయంలో బంగారం కావొచ్చు. అత్యుత్తమ పనితీరు కనబరిచే ఆస్తి వెంట పరుగులుతీయడం, ఇదిపెట్టుబడుల విషయంలో తప్పు టైమింగ్కు, అధిక ఊగిసలాటకు దారితీస్తుంది. వైవిధ్యీకరణ అంటే, వివిధ పరిస్థితుల్లో భిన్నంగా ప్రవర్తించే ఆస్తుల మధ్య పెట్టుబడులను పంచడం. ఇది రిస్క్ను తగ్గిస్తుంది.వైవిధ్యీకరణకి ఉదాహరణ: ఎన్ఎస్ఈ 500 కంపెనీలలో, 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మే 31 వరకు, తక్కువ పనితీరు, నిదానమైన వృద్ధి ఉన్న కంపెనీలు, మంచి పనితీరు, అధిక వృద్ధి కంపెనీల కంటే ఎక్కువ రాబడులు ఇచ్చాయి. కానీ ఈ ధోరణి మళ్లీ మారుతోంది. 2024 జూన్ నుంచి, మార్కెట్ మళ్లీ అధిక పనితీరు, అధిక వృద్ధి కంపెనీలను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. అవి గతంలో ఎదుర్కొన్న అండర్పర్ఫార్మెన్స్లో పావు వంతుకు పైగా రికవరీ సాధించాయి. అందువల ఈక్విటీల పనితీరును బట్టి వైవిధ్యీకరణను పాటించాలి.ఇదీ చదవండి: క్రూడాయిల్ ధరలు తగ్గినా.. తగ్గని పెట్రోల్, డీజిల్ రేట్లుముగింపు: తరచూ ఒడిదుడుకులకు లోనయ్యే పెట్టుబడుల ప్రపంచంలో, ఆలోచనాత్మకమైన వైవిధ్యీకరణతో బలమైన పోర్ట్ఫోలియో నిర్మించడం తెలివైన పని మాత్రమే కాదు, అవసరం కూడా. అందుకే పెట్టుబడిదారులు తాత్కాలిక రాబడులకన్నా, సమతుల్యత, క్రమశిక్షణ, దీర్ఘకాలిక వ్యూహంపై దృష్టి పెట్టాలి. ప్రఖ్యాతపారిశ్రామికవేత్త, పెట్టుబడిదారు నావల్ రవికాంత్ చెప్పినట్లుగా.. ‘‘జీవితంలో వచ్చే అన్ని రాబడులూ సంపద, సంబంధాలు, జ్ఞానం కలయిక వల్లే వస్తాయి.’’ -
జస్ట్ 99.. కానీ కాస్ట్లీ
ఓ 20 ఏళ్ల కిందటి మాట. అప్పట్లో పెట్రోల్, డీజిల్పై లీటరుకు ఒకటి రెండు రూపాయలు పెరిగితే చాలు. దేశమంతా భగ్గుమనేది. ప్రతిపక్షాలు బంద్లకు పిలుపునిచ్చేవి. ధర్నాలు, రాస్తారోకోలు మామూలే. చివరికి ప్రభుత్వం దిగివచ్చి పెంచినదాంట్లో కొంత తగ్గించేది. దాంతో పరిస్థితి సర్దుమణిగేది. కానీ 2017 జులైలో కేంద్ర ప్రభుత్వం రోజువారీ ధరలు మారే విధానాన్ని అమల్లోకి తెచి్చంది. అంటే అంతర్జాతీయ ధరలకనుగుణంగా ఏ రోజుకారోజు ధరలను సవరించటమన్న మాట. కేంద్రం ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేనాటికి పెట్రోలు ధర లీటరుకు రూ.65. నాటి నుంచీ ధరలు రోజూ పైసా నుంచి 5 పైసల వరకు పెరగటం మొదలయ్యాయి. అప్పుడప్పుడూ తగ్గినట్లు కనిపించినా... అది తాత్కాలికమే. మెల్లగా ఎనిమిదేళ్లు తిరిగేసరికి ప్రస్తుతం లీటరు ధర ఏకంగా రూ.105కు చేరింది. విచిత్రమేంటంటే ఇంతలా పెరిగినా బంద్లు, ధర్నాలు, రాస్తారోకోలు జరగలేదు. జనం కనీసం ఆగ్రహాన్ని కూడా వ్యక్తంచేయటం లేదు. ఎందుకంటే ఈ పెరుగుదల అనేది వారికి నొప్పి తెలియకుండా జరిగింది. ఇదంతా ఎందుకంటే... నెలవారీ సబ్ర్స్కిప్షన్లు కూడా ఇలా నొప్పి తెలియకుండా మన జేబుకు చిల్లు పెట్టేవే. కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తే... వీటిద్వారా వృధా కాకుండా బాగానే ఆదా చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం...ఏడాదికి 30వేల నుంచి లక్ష వరకూ డిజిటలైజేషన్ పెరిగాక సబ్ర్స్కిప్షన్ల యుగం మొదలైంది. ఇపుడవి నగరవాసుల జీవితాల్లో భాగమైపోయాయి. ఓటీటీలు, మ్యూజిక్, క్లౌడ్ స్టోరేజీ, లెరి్నంగ్ యాప్లు, ఏఐ యాప్లు... ఇలా ఒకటేమిటి!. రకరకాల యాప్లు. వాటిలో నిజంగా ఏది అవసరం, ఏది అనవసరం అనేది కాస్త ఆగి, ఆలోచించకుండా, ఎడా పెడా సబ్్రస్కయిబ్ చేసేసే ధోరణి పెరుగుతోంది. పైపెచ్చు ఎదిగిన పిల్లలున్న ఇంట్లో అయితే ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే యాప్ను సబ్్రస్కయిబ్ చేస్తున్న సందర్భాలు అనేకం. తాజా సర్వేల ప్రకారం ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి యావరేజ్గా 5–12 సబ్స్క్రిప్షన్లు ఉంటున్నాయి. యాప్ని బట్టి ప్రతి నెలా సబ్స్క్రిప్షన్ ఖర్చు అత్యంత తక్కువగా తొంభై తొమ్మిది రూపాయలేగా అనే ధోరణితో లైట్గా తీసుకుంటున్నప్పటికీ, మొత్తం సబ్స్క్రిప్షన్లన్నీ కలిపితే ఈ ఖర్చు ఏడాదికి 30–40 వేలు దాటిపోతోంది. ఇక పిల్లలు కూడా సబ్ర్స్కయిబ్ చేస్తున్న కుటుంబాల్లో ఈ ఖర్చు లక్షకు దగ్గర్లోనే ఉంటోంది. అందుకోసమే వీటిని నియంత్రించుకోవటంపై దృష్టి పెట్టడం తప్పనిసరి అవుతోంది. ఒకటీ రెండూ కాదు... ఓటీటీల్లో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లతో మొదలుపెడితే హాట్స్టార్, జీ5, సన్ టీవీ, ఎయిర్టెల్ ప్లే, ఆహా, ఎంఎక్స్ ప్లేయర్ సహా పదులకొద్దీ ఉన్నాయి. వీటిలో 99 శాతానికి సబ్్రస్కిప్షన్ తప్పనిసరి. కొన్నింటికి సబ్్రస్కిప్షన్ తీసుకున్నా కూడా... యాడ్లు లేకుండా చూడాలంటే మరింత ఎక్కువ పెట్టి సూపర్ సబ్్రస్కిప్షన్ తీసుకోవాలి. ఇక మ్యూజిక్ కోసం స్పాటిఫై, గానా వంటివి... క్లౌడ్ స్టోరేజీ కోసం గూగుల్ వన్, ఐక్లౌడ్ వంటివి... సోషల్ మీడియా, ఏఐ కోసం ట్విటర్, చాట్ జీపీటీ, గ్రోక్ వంటివి... ఇవన్నీ కాకుండా రకరకాల లెరి్నంగ్ యాప్లు, ఫిట్నెస్ యాప్లు, యాంటీ–వైరస్లు, ఈ–కామర్స్ మెంబర్íÙప్లు చాలా ఉన్నాయి. వీటిలో చాలావరకూ సబ్స్క్రిప్షన్లు రూ. 99, రూ. 149, రూ. 299..రూ.499 ఇలా ఉంటున్నాయి. విడివిడిగా యాప్లకు సబ్్రస్కయిబ్ చేస్తాం కనక అదేం పెద్ద మొత్తం కాదనిపిస్తుంది. కానీ ఇదో ఉచ్చులాంటిదని గ్రహించం. చాలా మటుకు సబ్్రస్కిప్షన్లను కావల్సినప్పుడు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు కదా అని ముందుగా తీసుకుంటాం. ప్రతి నెలా గుర్తుంచుకుని మరీ కట్టే బాదరబందీ ఎందుకు, ఆటోమేటిక్గా రెన్యూ చేసుకునే ఆప్షన్ని ఎంచుకోండి అని యాప్ సూచించగానే ఓకే కొట్టేస్తాం. ఆటో రెన్యువల్ మోడల్ పెట్టేస్తాం. కానీ ఆ తర్వాత ఆ విషయాన్నే మర్చిపోతాం. నెల తిరగ్గానే కొద్ది కొద్ది మొత్తం కట్ అయిపోతుంటుంది. ముందుగా మెసేజ్లు వస్తాయి గానీ... వంద, రెండొందలే కదా అని పెద్దగా పట్టించుకోం. కానీ అన్ని యాప్లూ కలిస్తే ఎంతవుతోంది? నెలకు మొత్తంగా ఎంత కడుతున్నాం? ఏడాదికి ఎంతవుతోంది? అనేది ఆలోచించం. అలా... వేల రూపాయల్ని చెల్లిస్తూనే ఉంటాం. సైకాలజీ ఏమంటుందంటే.. దీని వెనుక సైకాలజీ పాయింట్లు కూడా ఉన్నాయి. ఈఎంఐలను, సబ్స్క్రిప్షన్లను మెదడు వేర్వేరు రకాలుగా ప్రాసెస్ చేసుకుంటుంది. ప్రతి నెలా ఈఎంఐ కింద కట్టాలంటే అదొక పెద్ద మొత్తంగా కనిపించి, భారంగా అనిపిస్తుంది. కానీ సబ్స్క్రిప్షన్ అంటే మరీ పెద్ద మొత్తం కాదు కదా.. ఫర్లేదులే అనే అభిప్రాయం ఉంటుంది. ఉదాహరణకు రూ.1 లక్ష టీవీకి ప్రతి నెలా ఈఎంఐ కట్టాలంటే, అబ్బో అంత కట్టాలా .. అని కాస్త భయం వేస్తుంది. కానీ ప్రతి నెలా ఓ సబ్్రస్కిప్షన్కి రూ. 199 కట్టాలంటే ఫర్లేదులే అనిపిస్తుంది. కానీ అలాంటివి రూ. 199 చొప్పున ఓ పన్నెండు సబ్ర్స్కిప్షన్లు ఉన్నాయంటే! నెలకు దాదాపు రూ. 2,400 అవుతుంది. అదే ఏడాదికి చూస్తే సుమారు రూ. 30,000 అవుతుంది. అయినప్పటికీ ఇంత భారీ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఒక్కో సబ్ర్స్కిప్షన్కి కట్టే మొత్తం తక్కువగా ఉండటం వల్ల, పెద్ద భారం కాదులే అని మెదడు లైట్గా తీసుకుంటుందట!. దీన్నుంచి ఎలా బయటపడాలంటే ఎంత పెద్ద పడవైనా, చిన్న రంధ్రం పడితే చాలు. నీరు మెల్లగా చేరి అంత పెద్ద పడవ కూడా మునిగిపోయే ముప్పుంటుంది. అలాగే చిన్న చిన్న మొత్తాలే కదా అని నిర్లక్ష్యం చేస్తే బడ్జెట్ అదుపు తప్పేసే అవకాశాలు ఉన్నాయి. దీన్ని నివారించేందుకు ఏం చేయాలంటే... → వన్–్రస్కీన్ విధానం: కుటుంబం ఉపయోగిస్తున్న ప్రతి సబ్్రస్కిప్షన్ వివరాలనూ పేపరు మీద రాయండి. ఒక్కొక్క దాని అవసరాన్ని బట్టి ‘తప్పనిసరి’, ‘ఉపయోగకరం’, ‘వ్యర్ధం’ అనే రేటింగ్ ఇచ్చుకోండి. → మూడు నెలల పాటు... అంటే 90 రోజులుగా ఉపయోగించుకుండా నిరుపయోగంగా ఉన్న సర్వీసులను తక్షణం క్యాన్సిల్ చేయండి. → అవసరం అనుకుంటే వార్షిక ప్లాన్లకు మారండి. నెలవారీ ప్లాన్లతో పోలిస్తే యాన్యువల్ ప్లాన్లు సుమారు 15–40 శాతం వరకు చౌకగా ఉంటాయి. → ఫ్యామిలీ సబ్స్క్రిప్షన్లను షేర్ చేసుకోండి. నెట్ఫ్లిక్స్ / స్పాటిఫై / గూగుల్ వన్ ఫ్యామిలీ ప్లాన్లతో 50–80 శాతం వరకు ఆదా అవుతుంది. → కొందరు టెలికామ్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్లు తమ సర్వీసులతో పాటు ఓటీటీలు కాంబోగా అందిస్తున్నారు. ఇలాంటివి చాలా తక్కువ ధరే ఉంటాయి. సరీ్వసు గనక మంచిదైతే... కాంబోలో ఇస్తున్న ఓటీటీలతో మనకు ఆదా అవుతుందనుకుంటే తీసుకోవచ్చు. చివరిగా చెప్పేదేమిటంటే.. సబ్ర్స్కిప్షన్లనేవి పూర్తిగా చెడ్డవేమీ కావు. కాకపోతే వాటి సరీ్వసులు, నాణ్యతకన్నా మన అవసరం ముఖ్యం. పెద్దగా అవసరం లేనపుడు ఎంత మంచి యాప్ను సబ్స్క్రయిబ్ చేస్తే మాత్రం ఏంటి లాభం? అందుకే వాడుకోలేకపోతే ఈ యాప్ల వల్ల ఏటా రూ. 20,000 నుంచి రూ. 40,000 వరకు చల్లగా వృధా అయిపోయే ప్రమాదముంది. మధ్య తరగతి వారికి ఈ మొత్తం ఒక నెల, లేదా ఏడాది సిప్కి (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్), ఓ రెండు, మూడు గ్రాముల బంగారానికి, ఓ దేశీ విహారయాత్ర ఖర్చులకు సరిసమానం. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకుంటే శ్రేయస్కరం. -
శాంట క్లాజ్ ర్యాలీకి చాన్స్!
సుమారు 3 వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు మద్దతు స్థాయిలనుంచి రికవర్ అవుతూ వస్తున్నాయి. తొలుత అమ్మకాలు.. తదుపరి కొనుగోళ్లతో నిఫ్టీ 26,000, సెన్సెక్స్ 85,000 పాయింట్లకు అటూఇటుగా కదులుతున్నాయి. అయితే ఈ వారం మార్కెట్లు మరోసారి సైడ్వేస్లో కదలనున్నాయా లేక శాంటా ర్యాలీకి దారి ఏర్పడుతుందా చూడవలసి ఉంది! క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం(25న) మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. మరోపక్క యూఎస్ సహా.. పలు యూరోపియన్ మార్కెట్లకు కొత్త ఏడాది సెలవులు సైతం జత కలవనుండటంతో దేశీయంగానూ ట్రేడింగ్ పరిమాణం నీరసించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల ఆటు పోట్ల మధ్య మార్కెట్లు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో కదులుతున్నాయి. దీంతో ఈ వారం కూడా హెచ్చుతగ్గుల మధ్య మార్కెట్లు అక్కడక్కడే అన్నచందాన ట్రేడ్కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మరోపక్క ఇదే సమయంలో ఈ వారం శాంట క్లాజ్ ర్యాలీకి బీజం పడవచ్చని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో? పరిశీలించదగ్గ అంశాలు → దేశీయంగా నేడు(22న) నవంబర్ నెలకు మౌలిక రంగ పురోగతి వివరాలు వెల్లడికానున్నాయి. 2025 అక్టోబర్లో దాదాపు యథాతథంగా 3.3 శాతం వృద్ధి నమోదైంది. 14 నెలల తదుపరి ఎలాంటి పురోగతి నమోదుకాకపోవడం గమనార్హం! యూఎస్ టారిఫ్లు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. → డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ చరిత్రాత్మక కనిష్టం 91 స్థాయి నుంచి భారీ రికవరీ సాధించింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకపు విలువ వారాంతాన 89.67 వద్ద స్థిరపడింది. → దేశీ మార్కెట్లలో పటిష్ట లిక్విడిటీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు పలు ఐపీవోలతో ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతుంటే.. మరోపక్క సెకండరీ మార్కెట్లలో రిటైలర్లతోకలసి దేశీ ఫండ్స్ పెట్టుబడులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో కొద్ది నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్లో విక్రయాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నప్పటికీ మార్కెట్లు నిలదొక్కుకుంటున్నట్లు విశ్లేషకులు వివరించారు. విదేశీ ఎఫెక్ట్ → ఈ వారం(23న) యూఎస్ మూడో త్రైమాసిక(జూలై–సెపె్టంబర్) జీడీపీ వృద్ధిపై ద్వితీయ అంచనాలు వెలువడనున్నాయి. క్యూ2(ఏప్రిల్–జూన్)లో యూఎస్ జీడీపీ వార్షికంగా 3.8%పుంజుకుంది. 3.3% అంచనాలను అధిగమించింది. → ఇదే రోజు యూఎస్ ప్రయివేట్ రంగ ఉద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. 24న నిరుద్యోగ గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. → ద్రవ్యోల్బణం, ఉపాధి గణాంకాల ప్రభావంతో యూఎస్ ఫెడ్ మరోసారి వడ్డీ రేట్ల కోత అమలు కు మొగ్గు చూపవచ్చని అంచనాలు పెరిగాయి.సాంకేతిక అంచనాలు ఇలా గత వారం అంతక్రితం వారంలాగే మార్కెట్లు రెండో సపోర్ట్ లెవల్స్వద్ద నుంచి రికవరీ సాధించాయి. సాంకేతిక నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ వారం శాంట ర్యాలీకి తెరతీయవచ్చని అంచనా. నిఫ్టీ 26,060కు ఎగువన నిలదొక్కుకుంటే 26,450 వరకూ బలపడవచ్చు. 25,700 స్థాయిలో పటిష్ట మద్దతు లభిస్తోంది. బలహీనపడి 25,600కు చేరితే మరింత నీరసించవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అప్పుడే తీర్చేయొద్దు!
ఇపుడు ఫోన్ తెరిచి మెసేజ్లు, వాట్సాప్లు చూసినా... మెయిల్ తెరిచినా రుణాలిస్తామంటూ రోజూ ఆఫర్ల కొద్దీ ఆఫర్లు. దీంతో పాటు ఫోన్లు. ఫోన్ చేసి మరీ... లోన్ కావాలా? అని అడిగే ఏజెన్సీలు కోకొల్లలు. ఇలాంటివేమీ లే కున్నా.. జస్ట్ యాప్ తెరిచి క్లిక్ కొడితే మన ఖాతాలోకి డబ్బులిచ్చేసే రుణ యాప్లు కూ డా ఉన్నాయి. అదీ ఫిన్టెక్ మహిమ. నిజానికి ఈ యాప్లన్నీ అప్పులిచ్చేది వాటి సొంత డబ్బేమీ కాదు. అవన్నీ ఏదో ఒక ఫైనాన్స్ కంపెనీతోనో, బ్యాంకుతోనో జతకట్టి ఉంటాయి. వాటికన్నా కాస్త ఎక్కువ వడ్డీ వేసుకుని... అత్యంత ఈజీగా మీ ఖాతాలోకి వేసేస్తూ ఉంటాయి. తీర్చటం కాస్త ఆలస్యమయినా, తీర్చకపోయినా వీటి వ్యవహారశైలి కూడా చాలా దుర్మార్గంగా ఉంటుంది. అందుకే రుణం తీసుకునేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ తీసుకున్నాం? ఎంత వడ్డీకి తీసుకున్నాం? ప్రాసెసింగ్ ఛార్జీలెంత? ప్రీపేమెంట్ పెనాల్టీ ఎంత? ఇవన్నీ తప్పనిసరిగా చూడాలి. సరే! ఇవన్నీ చూశాకే రుణం తీసుకున్నారనుకుందాం. ఇల్లు, కారు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, గృహోపకరణాల కొనుగోళ్లు, టూర్లు... ఇలా దేనికైనా రుణం తీసుకుని ఉండొచ్చు. కాకపోతే చాలామంది ఈజీగా వస్తున్నాయి కదా అని ప్రతిదానికీ రుణం తీసేసుకోవటం... ఆ తరువాత దాన్ని భారంగా భావించి త్వరగా వదిలించుకునే మార్గాల కోసం వెతకడం చేస్తుంటారు. దేశంలో ముందస్తు రుణ చెల్లింపులు పెరుగుతుండడం దీన్నే సూచి స్తోంది. 1వ తారీఖు వస్తుందంటే మనసులో ఆందోళన పెరగడం... ‘ఈఎంఐ’ కట్టడంలో ఉన్న నొప్పి... వారితో అలా చేయిస్తుంటా యి. కానీ, అన్ని రుణాలనూ ఇలా ముందు గా తీర్చేయడం ఆర్థికంగా తెలివైన పనేమీ కా దు. రుణాల్లో మనల్ని పిండేసే వాటితో పాటు కొన్ని మనకు లాభాన్నిచ్చేవి కూడా కొన్ని ఉంటాయి. ఆర్థికంగా గుల్ల చేసే రుణాలను వదిలించుకోవడం, చౌక రుణాలతో నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం ఎలాగో చూద్దాం...రుణాన్ని ముందుగా తీర్చేయడం ఎందుకు? → రుణ భారం నుంచి బయటపడాలన్న ప్రయత్నం వెనుక ఎన్నో కారణాలుంటాయి. → అత్యవసరమో లేక నచి్చన వస్తువును సొంతం చేసుకోవాలన్న బలహీనత వల్లో రుణం తీసుకుని ఉండొచ్చు. నెలవారీ రుణ చెల్లింపులు మొదలయ్యాక భారంగా అనిపించొచ్చు. ఆదాయం నుంచి ఈఎంఐలకు సర్దుబాటు చేయలేక, రుణాన్ని ముగించాలని భావించొచ్చు. → పెట్టుబడులు గడువు తీరి చేతికి రావొచ్చు. లేదా పనిచేస్తున్న కంపెనీ నుంచి బోనస్ బ్యాంక్లో జమ కావొచ్చు. వీటితో రుణం భారం తగ్గించుకుందామని అనిపించొచ్చు. → నెలవారీ ఆదాయంలో చాలా వరకు రుణ చెల్లింపులకే ఖర్చు చేసేస్తుంటే.. ఇక ఇతర ఖర్చులకు చాలని పరిస్థితులతో ఇంట్లో ఒత్తిళ్లు తట్టుకోలేక.. రుణాన్ని క్లోజ్ చేసే ప్రయత్నాలు మొదలు పెడుతుంటారు. రుణంతో కలసి సాగడమే.. కొన్ని రుణాలను ముందుగా చెల్లించడం కంటే, వాటిని కొనసాగించుకోవడం ద్వారా రుణ గ్రహీత అదనపు ప్రయోజనం పొందొచ్చు. అది ఎప్పుడంటే.. → రుణంపై వడ్డీ రేటు 9–10 శాతం మించకుండా ఉండాలి. సాధారణంగా గృహ రుణం, వాహన రుణం, విద్యా రుణాలు ఇంత తక్కువ రేటుకు వస్తుంటాయి. ప్రాపర్టీ తనఖాపైనా ఇంతే తక్కువ రేటుకు రుణాలు లభిస్తున్నాయి. → రుణాన్ని తీర్చే బదులు, ఆ మొత్తాన్ని పెట్టుబడి పెడితే.. రుణ రేటు కంటే అధిక రాబడి వచ్చేట్టు ఉండాలి. సాధారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్పై రాబడులు 10–15 ఏళ్లు అంతకుమించిన దీర్ఘకాలంలో 12–20 శాతం మధ్య ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. → అత్యవసరాల కోసం ఉద్దేశించిన నిధిని తీసుకెళ్లి రుణానికి కట్టేయడం వివేకం అనిపించుకోదు. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతేనో లేదా వైద్య అత్యవసరం ఏర్పడితేనో నిధుల కోసం మళ్లీ అప్పు చేయాల్సి వస్తుంది. కనుక అత్యవసర నిధిని రుణాల కోసం ఉపయోగించొద్దు. → నెలవారీ రుణ చెల్లింపులు ఆదాయంలో 30% లోపే ఉన్నప్పుడు దాన్ని ముందుగా తీర్చడం కంటే.. మిగులు ఆదాయాన్ని పెట్టుబడులకు మళ్లించుకునే మార్గాలను చూడొచ్చు. → పన్ను ఆదా ప్రయోజనాలున్న రుణాలను వదిలించుకోవడం కంటే కొనసాగించడం ద్వారా ప్రయోజనం పొందొచ్చు. ఉదాహరణకు గృహ రుణం. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద ఇంటి రుణం కోసం చేసే చెల్లింపుల్లో అసలు రూ.1.50 లక్షల వరకు, సెక్షన్ 24 కింద వడ్డీ రూ.2 లక్షలపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. పన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇంటి రుణంపై 8.3% వడ్డీ రేటు చెల్లిస్తున్నప్పటికీ.. నికరంగా పడే భారం 6.5–7% మించదు. పైగా ముందస్తు చెల్లింపుల ను ఈక్విటీ, బంగారంలోకి పెట్టుబడిగా మళ్లించి మెరుగైన రాబడులూ సొంతం చేసుకోవచ్చు.ఇలాంటపుడు తీర్చేయటమే బెటర్...→ నెలవారీ సంపాదనలో ఈఎంఐలు 45 శాతం మించినట్టయితే, ఆయా రుణాలను త్వరగా చెల్లించే మార్గాలను చూడొచ్చు. → పదవీ విరమణకు చేరువవుతుంటే (మరికొన్నేళ్లే ఉంటే)... అప్పుడు వీలైనంత త్వరగా ఆ రుణాల నుంచి బయటకు రావాలి. → రుణాల్లో అధిక వడ్డీ రేటుతో ఉన్న వాటిని త్వరగా వదిలించుకోవాలి. ఉదాహరణకు క్రెడిట్ కార్డులపై 36– 44 శాతం వరకు వడ్డీ పడుతుంది. ఆ తర్వాత వ్యక్తిగత రుణాలపైనా 15 శాతం వరకు వడ్డీ ఉంటుంది. ఇలాంటి వాటిని ముందుగా చెల్లించడం వల్ల లాభమే కానీ, నష్టం ఉండదు. → కొన్ని వాహన రుణాలపై వడ్డీ రేటు 12 శాతం వరకు ఉంటుంది. ఇలాంటివీ ముందుగా తీర్చేయొచ్చు. → గృహ, విద్యా రుణం తప్ప మిగిలిన రుణాలపై ఎలాంటి పన్ను ప్రయోజనాల్లేవు. కనుక అధిక రేటుతో ఉంటే త్వరగా బయటకు వచ్చేయడం లాభమే. → కొందరు ఈక్విటీ పెట్టుబడులపై మెరుగైన రాబడి వచి్చనప్పటికీ.. పెట్టుబడి కంటే రుణాన్ని ముగించేందుకే మొగ్గు చూపుతుంటారు. అధిక రాబడి కోసం పెట్టుబడులపై రిస్క్ తీసుకోవడం వారికి నచ్చదు. పైగా రుణాన్ని ఎక్కువ కాలం పాటు కొనసాగించేందుకు ఇష్టంలేని వారికి సైతం రుణభారం దింపుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది. → ఏది ఏమైనా మెరుగైన రాబడులు ఇస్తున్ను పెట్టుబడులను ముందస్తు రుణ ముగింపునకు వినియోగించడం వివేకం అనిపించుకోదు.ఆదా మామూలుగా లేదుగా..! → రూ.20 లక్షల గృహ రుణాన్ని 15 ఏళ్ల టర్మ్తో తీసుకున్నారు. వడ్డీ రేటు 8.3%. → ఇందులో రూ.5 లక్షలను ముందుగా చెల్లించినట్టయితే 15 ఏళ్ల కాలంలో మొత్తం మీద రూ.3.2 లక్షలు వడ్డీ రూపంలో ఆదా అవుతుంది. → రూ.5 లక్షలను ముందస్తు రుణం చెల్లింపులకు వినియోగించకుండా, 12 శాతం రాబడినిచ్చే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? → 15 ఏళ్ల కాలంలో రూ.27.36 లక్షలు సమకూరుతుంది. → ముందస్తు రుణ చెల్లింపులకు బదులు.. ఇన్వెస్ట్ చేయడం వల్ల రూ.24 లక్షలు సమకూర్చుకోవచ్చని ఈ ఉదాహరణ తెలియజేస్తోంది. → పెట్టుబడులపై రాబడి, రుణం రేటు కంటే అధికంగా ఉంటే అలాంటప్పుడు ముందస్తు చెల్లింపులతో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. వీటిని గమనించాలి.. అధిక రేటుతో తీసుకున్న రుణాలను ముందుగా తీర్చేయడం లాభమే. కానీ, గడువు కంటే ముందుగానే వాటిని ముగించేందుకు బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు ఉచితంగా అనుమతించకపోవచ్చు. ఫోర్క్లోజర్ చార్జీలంటూ చాలా సంస్థలు రుణ గ్రహీతల నుంచి వసూలు చేస్తున్నాయి. రుణాన్ని గడువులోపు తీర్చేస్తుంటే.. అప్పటికి మిగిలిన బకాయిపై 2–5 శాతం వరకు ఈ రూపంలో చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తదితర కొన్ని బ్యాంక్లు అయితే వ్యక్తిగత రుణాలను ముందుగా తీర్చేస్తుంటే ఎలాంటి చార్జీలు విధించడం లేదు. కనుక ఇలాంటి చార్జీల్లేని చోటే రుణాలు తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల తర్వాతి కాలంలో వీలైనంత ముందుగానే గుడ్బై చెప్పేయొచ్చు. -
అందుకే.. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్!
2025 ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్' (FASTag Annual Pass) ప్రారంభమైంది. ఇది అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. ఆ తరువాత కూడా ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది.నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్ప్రెస్వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో దీనిని అమలు చేసింది.వాహనదారులు ఫాస్టాగ్లో డబ్బులు అయిపోయిన ప్రతిసారి రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.3 వేలు చెల్లించి వార్షిక ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకుంటే 200 ట్రిప్పులు లేదంటే ఏడాది గడువుతో (ఏది ముందు అయితే అది) ఈ పాస్ వర్తిస్తుంది. వాహనదారులు కొత్తగా ఫాస్టాగ్ కొనాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్టాగ్కే ఆ మొత్తాన్ని రీచార్జ్ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాజ్మార్గ్ యాత్ర యాప్ను అందుబాటులోకి తెచ్చింది.ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్కు డిమాండ్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా..యాన్యువల్ పాస్ ద్వారా ఒకేసారి రూ. 3,000 చెల్లించి సంవత్సరానికి 200 టోల్ క్రాసింగ్లు లేదా ఒక సంవత్సరం (ఎదైనా ముందే వచ్చే వరకు) ప్రయాణం అనుమతిస్తుంది. కాబట్టి ఒకసారి చెల్లించి ఏడాది ప్రయోజనం పొందవచ్చు.సాధారణంగా ప్రతి టోల్కి రూ. 80 నుంచి రూ. 100 వరకు ఖర్చవుతుంది. కానీ యాన్యువల్ పాస్తో ఇది చాలా తగ్గుతుంది.యాన్యువల్ పాస్కు తీసుకోవడంతో.. రీఛార్జ్ ఎప్పుడు అయిపోతుందో అనే గాబరా అవసరం లేదు. కాబట్టి టోల్ లైన్లలో గడువు తీరేవరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. తద్వారా సమయం తగ్గుతుంది.యూజర్-ఫ్రెండ్లీ కొనుగోలు & యాక్టివేషన్ ప్రక్రియ చాలా సులభం. -
ఇన్వెస్టర్లకు శుభవార్త.. సెబీ కొత్త రూల్స్ వచ్చేశాయ్
భారతదేశంలో చాలామంది స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇందులో అందరికీ లాభాలు వస్తాయని గానీ.. అందరూ నష్టపోతారని గానీ కచ్చితంగా చెప్పలేము. కాబట్టి కొన్నిసార్లు లాభాలు, మరికొన్ని సార్లు నష్టాలు ఉంటాయి.లాభ, నష్టాలు ఉన్నప్పటికీ.. ఇందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ చేసేవారి సంఖ్య ఎక్కువవుతున్న సమయంలో.. సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కొన్ని కీలక ప్రకటనలు చేసింది. దేశీయ మ్యూచువల్ ఫండ్లు బ్రోకరేజ్లకు చెల్లించే రుసుము మాత్రమే కాకుండా.. మ్యూచువల్ ఫండ్ నిబంధనలలో ప్రాథమిక నిర్వహణ ఛార్జీని కూడా తగ్గించింది.SEBI బోర్డు సమావేశం తర్వాత, విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. నగదు లావాదేవీలపై స్టాక్ బ్రోకర్లకు చెల్లింపును 8.59 బేసిస్ పాయింట్ల నుంచి 6 బేసిస్ పాయింట్లకు తగ్గించారు. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ గతంలో ఆస్తి నిర్వాహకులు చెల్లించే రుసుముపై 2 బేసిస్ పాయింట్ల రుసుమును ప్రతిపాదించింది.కొత్త రూల్స్➤కంపెనీ నిర్ణయాలను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్న పెద్ద వాటాదారులను మినహాయించి, పబ్లిక్ ఇష్యూలలో ఉన్న వాటాదారులకు లాక్ ఇన్ అవసరాలను రెగ్యులేటర్ చేసింది.➤కొత్త నిబంధనల ప్రకారం, ఒక కంపెనీ పబ్లిక్గా విడుదల కావడానికి ముందు, షేర్లకు లాక్-ఇన్ అవసరాలు స్వయంచాలకంగా అమలు చేయబడతాయి. ఇది లిస్టింగ్ ప్రక్రియలో ఆలస్యాలను పరిష్కరిస్తుందని సెబీ తెలిపింది.➤ఐపీఓకు ముందు షేర్ల లాక్-ఇన్ నిబంధనల సవరణకు సెబీ ఆమోదం తెలపడంతో, అనేక కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన కార్యాచరణ సవాలు ఇప్పుడు పరిష్కారమైందని.. కార్పొరేట్ కంప్లైయన్స్ సంస్థ MMJC అసోసియేట్స్ వ్యవస్థాపక భాగస్వామి మకరంద్ జోషి అన్నారు.➤పెట్టుబడిదారుల ప్రక్రియను అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి, జారీ చేసే కంపెనీలు పబ్లిక్ ఆఫర్ పేపర్లలో భాగంగా కీలక సారాంశాన్ని అప్లోడ్ చేయాలని కూడా సెబీ స్పష్టం చేసింది.➤మహిళలు, రిటైల్ & సీనియర్ పెట్టుబడిదారులకు అదనపు ప్రోత్సాహకాలను అందించడానికి.. రుణ ఇష్యూలలో రిటైల్ భాగస్వామ్యాన్ని పెంచడానికి సెబీ చర్యలను ఆమోదించింది.➤రిస్క్ మేనేజ్మెంట్ చర్యలకు లోబడి, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు అన్లిస్టెడ్ డెట్ సెక్యూరిటీలను రేట్ చేయడానికి అనుమతించబడతాయని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే రెగ్యులేటర్ బోర్డు సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో తెలిపారు. టేకోవర్ కోడ్ నిబంధనలను సవరించడానికి నియంత్రణ సంస్థ కూడా కృషి చేస్తోందని ఆయన అన్నారు.ఖర్చులను తగ్గించి.. మ్యూచువల్స్ ఫండ్స్లో పారదర్శకతను పెంచడానికి సెబీ ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే ఈ ఏడాది (2025) చాలామంది ఇన్వెస్టర్లు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. దీంతో ఊహకందని నష్టాలను కూడా చవిచూడాల్సి వచ్చింది. ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి ఇన్వెస్టర్లు నిపుణుల సలహా లేదా బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీలను ఎంచుకోవడం ఉత్తమం. -
కొత్త టెక్నాలజీల పరిశీలనకు వర్కింగ్ గ్రూప్
స్టాక్ ఎక్స్చేంజీలనిర్వహణ సామర్థ్యాలను, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణను, మార్కెట్ పర్యవేక్షణనను మెరుగుపర్చేందుకు ఉపయోగపడే కొత్త సాంకేతికతలను పరిశీలించేందుకు వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. వచ్చే 5–10 ఏళ్లలో ఎక్స్చేంజ్ టెక్నాలజీ ఏ విధంగా రూపాంతరం చెందాలి, అంతర్జాతీయ ఉత్తమ ప్రమాణాలను అందుకోవాలి, మార్కెట్ మౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు కొత్త విధానాలను రూపొందించాలి తదితర అంశాలపై ఈ కమిటీ దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు.కమోడిటీ, క్యాపిటల్ పార్టిసిపెంట్స్ అసోసియేషన్ 11వ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న సందర్భంగా పాండే ఈ విషయాలు వివరించారు తుహిన్ కాంత పాండే. టెక్నాలజీపరంగా పటిష్టంగా ఉండటం ఎంతో ముఖ్యమని, ఎక్స్చేంజీల్లో చోటు చేసుకునే ప్రతి సాంకేతిక లోపాన్ని సెబీ చాలా సీరియస్గా తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అటు నాన్–అగ్రి కమోడిటీ డెరివేటివ్స్ను సమీక్షించేందుకు కూడా వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పాండే చెప్పారు. త్వరలోనే దీన్ని నోటిఫై చేస్తామని తెలిపారు. -
'ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు'.. కియోసాకి పదో పాఠం
తొమ్మిది ఆర్ధిక పాఠాలు చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు తాజాగా లెసన్ 10 అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు ఎలా ధనవంతులు కావాలి? అనే విషయం గురించి ప్రస్తావించారు.మాటలను నియంత్రించుకోవాలి. ''మీరు మాట్లాడే మాటలే మీరు'' అవుతారని కియోసాకి అన్నారు. రిచ్ డాడ్ (ధనిక తండ్రి).. తన కొడుకు నుంచి చేతకాదు, చేయలేను.. అనే మాటలను ఒప్పుకోరు. ఎందుకంటే మాటలే మనల్ని నియంత్రిస్తాయని అంటారు.పూర్ డాడ్ (పేద తండ్రి).. పదేపదే నేను చేయలేను అని చెప్పేవారు. ఆయన ఆ మాటలకే కట్టుబడిపోయారు. దీంతో ఆయన ఎంత డబ్బు సంపాదించినా జీవితాంతం పేదవాడిగానే ఉండిపోయారని కియోసాకి పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ.. దాన్ని ఎలా సాదించగలను అనే విషయం గురించి ఆలోచించాలి. ఇది మన మెదడును ఆలోచింపజేస్తుంది, పరిష్కారాలు వెతకమంటుంది, కొత్త మార్గాలు, అవకాశాలు చూపిస్తుంది. ఇలా పెద్ద పెద్ద ఆర్థిక సమస్యలను పరిష్కరించడం నేర్చుకుని మరింత ధనవంతులవుతారని వెల్లడించారు.ఇదీ చదవండి: 26ఏళ్ల వయసు.. ఫోర్బ్స్ జాబితాలో చోటు: ఎవరీ కళ్యాణి రామదుర్గం?ఏదైనా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు.. ఆస్తులు తక్కువ ధరలకు లభిస్తాయి. ఉదాహరణకు, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ సమయంలో.. రియల్ ఎస్టేట్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్లు, బంగారం, వెండి అన్నీ అమ్మకానికి వచ్చాయి. ఆ సమయంలో భయపడిన వాళ్లు అమ్మేశారు. సాహసం చేసిన వాళ్లు కొనేశారు. కొన్నవాళ్లే తర్వాత ధనవంతులయ్యారు. ఇప్పుడు ధనవంతులు కావడానికి ఇది మంచి అవకాశం, కానీ మీ మాటలను నియంత్రించగలిగితేనే.. అని కియోసాకి స్పష్టం చేశారు.LESSON #10 How to get richer as the economy crashes:CONTROL YOUR WORDS: In Sunday School I learned: “The word became flesh and dwelt amongst us.”In other words “You become your words.”My rich dad forbid his son and from saying “I can’t afford it.”Rich dad said: “Poor…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 21, 2025 -
వీధి దీపాల కింద చదువుకుని ప్రపంచ గుర్తింపు: కొనియాడిన అంబానీ
శాస్త్రీయ రంగంలో ప్రతిభను మరియు "నవ భారత్" స్ఫూర్తిని కొనియాడుతూ జరిగిన ఒక ప్రత్యేక సాయంత్రం వేళ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. దిగ్గజ శాస్త్రవేత్త డాక్టర్ రఘునాథ్ అనంత్ మషేల్కర్కు ఘన నివాళులర్పించారు. డాక్టర్ మషేల్కర్ రికార్డు స్థాయిలో 54 గౌరవ డాక్టరేట్లు పొందిన అసాధారణ విద్యా మైలురాయిని పురస్కరించుకుని, ఒక ప్రత్యేక సన్మాన కార్యక్రమం, పుస్తకావిష్కరణ నిర్వహించారు.ఈ వేడుకలో ప్రొఫెసర్ ఎం.ఎం. శర్మ, మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్, శాస్త్రీయ రంగానికి చెందిన ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు.వీధి దీపాల కింద చదువుకుని ప్రపంచ గుర్తింపు వరకు..సభికులను ఉద్దేశించి అంబానీ మాట్లాడుతూ, ముంబై వీధి దీపాల కింద చదువుకున్న ఒక సామాన్య బాలుడు ప్రపంచ స్థాయి శాస్త్రీయ ఐకాన్గా ఎదిగిన డాక్టర్ మషేల్కర్ ప్రయాణాన్ని వివరించారు."డాక్టర్ మషేల్కర్ జీవిత ప్రయాణంలో నేను ఆధునిక భారతదేశ ప్రయాణాన్ని చూస్తున్నాను," అని అంబానీ పేర్కొన్నారు. "అతను పేదరికం నుంచి ప్రపంచ స్థాయి గౌరవం వరకు ఎదిగారు. దీనికి కారణం వారి తల్లి అంజనీ గారి ప్రేమ, ఆయన ఉక్కు సంకల్పమే."చాలామంది జీవితంలో ఒక డిగ్రీ పొందడానికే కష్టపడతారని, కానీ మషేల్కర్ గారు 54 డాక్టరేట్లు సాధించారని అంబానీ కొనియాడారు. అంత ఎదిగినా ఆయన ఎంతో వినయంగా ఉంటారని, "పండ్లతో నిండిన చెట్టు ఎప్పుడూ కిందకే వంగి ఉంటుంది" అనే సామెత ఆయనకు సరిగ్గా సరిపోతుందని అన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్పై డాక్టర్ మషేల్కర్ చూపిన ప్రభావం ఈ ప్రసంగంలో ప్రధానాంశంగా నిలిచింది. రిలయన్స్ను కేవలం ప్రాజెక్టులను అమలు చేసే సంస్థ నుంచి సైన్స్ ఆధారిత ఆవిష్కరణల (Innovation) దిశగా మళ్లించడంలో మషేల్కర్, ప్రొఫెసర్ ఎం.ఎం. శర్మల పాత్ర కీలకమని అంబానీ అంగీకరించారు.2000వ సంవత్సరంలో మషేల్కర్ సూచన మేరకు స్థాపించబడిన రిలయన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ కంపెనీ సంస్కృతినే మార్చివేసిందని ఆయన వెల్లడించారు. నేడు రిలయన్స్లో 1,00,000 కంటే ఎక్కువ మంది సాంకేతిక నిపుణులు ఉన్నారని గర్వంగా చెప్పారు. "రిలయన్స్ను ఒక పారిశ్రామిక సంస్థగా కాకుండా, ఒక సైన్స్ కంపెనీగా చూడాలని ఆయన మాకు నేర్పారు," అని అంబానీ అన్నారు. ముఖ్యంగా జియో & గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మషేల్కర్ దార్శనికతకు నిలువుటద్దాలని పేర్కొన్నారు.'గాంధీ ఇంజనీరింగ్' మరియు కృత్రిమ మేధ (AI)ఈ సందర్భంగా డాక్టర్ మషేల్కర్ రాసిన తాజా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో ఆయన ప్రసిద్ధ సిద్ధాంతమైన *"More from Less for More"* (తక్కువ వనరులతో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చేలా ఎక్కువ ఉత్పత్తి చేయడం) గురించి వివరించారు. దీనినే ఆయన 'గాంధీ ఇంజనీరింగ్' అని పిలుస్తారు.ఈ సిద్ధాంతాన్ని ప్రస్తుత కృత్రిమ మేధ (AI) యుగానికి అన్వయిస్తూ, అంబానీ ఒక ముఖ్యమైన మాట చెప్పారు: "AI రంగంలో భారత్ ప్రపంచ నాయకత్వం వహించాలి, కానీ 'కరుణ లేని సాంకేతికత.. కేవలం యంత్రం మాత్రమే' అని మనం గుర్తుంచుకోవాలి." తెలివితేటలతో పాటు సానుభూతిని, సంపదతో పాటు లక్ష్యాన్ని జోడించడం ద్వారా భారత్ ప్రపంచానికి కొత్త అభివృద్ధి నమూనాను చూపగలదని ఆయన ఆకాంక్షించారు.క్వాంటం కంప్యూటింగ్, సింథటిక్ బయాలజీ, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాలలో భారత్ "డీప్-టెక్ సూపర్ పవర్"గా ఎదగాలంటే, పారిశ్రామిక రంగం & విద్యా సంస్థల మధ్య బలమైన అనుసంధానం ఉండాలని అంబానీ పిలుపునిచ్చారు. ప్రసంగం ముగియగానే, అంబానీ "జ్ఞాన యోగి" అని పిలిచిన డాక్టర్ మషేల్కర్కు సభికులందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో గౌరవ వందనం సమర్పించారు. -
రూ. 16వేలు పెరిగిన వెండి రేటు: వారంలోనే ఇంతలా
బంగారం ధరలు మాదిరిగా కాకుండా.. వెండి ధరలు ఊహకందని రీతిలో పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లో (డిసెంబర్ 14 నుంచి 20 వరకు) సిల్వర్ రేటు ఏకంగా రూ. 16,000 పెరిగింది. దీన్ని బట్టి చూస్తే వెండి రేటు ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.2025 డిసెంబర్ 14న రూ. 2,10,000 వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. 20వ తేదీ (శనివారం) నాటికి రూ. 2,26,000లకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే.. ఒక గ్రామ్ సిల్వర్ రేటు 226 రూపాయలకు చేరిందన్న మాట. వారం రోజుల్లో రెండు రోజులు మాత్రమే తగ్గిన రేట్లు, మిగిలిన నాలుగు రోజులు పెరుగుదల దిశగానే వెళ్లాయి.వెండి రేటు పెరగడానికి ప్రధాన కారణాలువెండిని కేవలం.. ఆభరణాల రూపంలో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది. -
వాట్సాప్లో కొత్త మోసం.. 'ఘోస్ట్ పేయిరింగ్'తో జాగ్రత్త!
టెక్నాలజీ పెరుగుతున్న వేళ.. రోజుకో కొత్త స్కామ్ పుట్టుకొస్తోంది. ఇప్పుడు తాజాగా 'ఘోస్ట్పెయిరింగ్' పేరుతో వాట్సాప్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఘోస్ట్పెయిరింగ్ స్కామ్వాట్సప్లోని డివైజ్ లింక్ ఫీచర్ ద్వారా.. ఓటీపీ, పాస్వర్డ్స్, వెరిఫికేషన్స్ వంటి వివరాలతో సంబంధం లేకుండానే స్కామర్లు.. యూజర్స్ ఖాతాల్లోకి చొరబడతున్నారు. దీనినే టెక్ నిపుణులు ఘోస్ట్పెయిరింగ్ అంటున్నారు.ఘోస్ట్పెయిరింగ్ స్కామ్ ఇలా..సోషల్ ఇంజినీరింగ్ ద్వారా.. సైబర్ నేరగాళ్లు ఘోస్ట్పెయిరింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. స్కామర్లు.. యూజర్ల వాట్సప్కు తెలిసిన కాంటాక్టుల ద్వారా Hey, is this you in this photo? లేదా I just found your picture అనే మోసపూరిత మెసేజ్ వస్తుంది. ఇలాంటి మెసేజ్లో ఇంటర్నల్గా వేరే లింక్ ఉంటుంది. కాబట్టి యూజర్లు తమకు వచ్చిన లింక్ క్లిక్ చేయగానే.. ఒక ఫేక్ వెబ్పేజ్ ఓపెన్ అవుతుంది.ఓటీపీ గానీ, స్కానింగ్ లేకుండా.. మీకు తెలియకుండా మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్కు కనెక్ట్ అవుతుంది. ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. మీ కాంటాక్ట్స్ లిస్ట్ దొంగిలిస్తారు. మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడతారు. చివరికి మీ ఖాతాను మీరే వాడుకోలేక లాక్ చేస్తారు.ఘోస్ట్పెయిరింగ్ స్కామ్ నుంచి తప్పించుకోవడం ఎలామీకు తెలియని లేదా.. అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయవద్దు.వాట్సాప్ సెట్టింగ్స్లో 'Linked Devices' ఆప్షన్ను తరచూ పరిశీలించండి. తెలియని డివైజ్లు ఉంటే వెంటనే రిమూవ్ చేయండి.Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలి.వీసీ సజ్జనార్ ట్వీట్వాట్సాప్ ఘోస్ట్పెయిరింగ్ ఫీచర్ గురించి.. వీసీ సజ్జనార్ ట్వీట్ చేసారు. ఇందులో.. "హేయ్.. మీ ఫొటో చూశారా? అంటూ ఏదైనా లింక్ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్ చేయకండి'' అని వెల్లడించారు.🚨 Cyber Alert: New WhatsApp “GhostPairing” scam 🚨If you receive a message saying “Hey, I just found your photo” with a link — DO NOT click it, even if it appears to come from someone you know.⚠️ This is a GhostPairing scam.The link takes you to a fake WhatsApp Web page and… pic.twitter.com/7PsZJXw2pt— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 21, 2025 -
స్కూల్ యాన్యువల్ డే వేడుకల్లో నీతా అంబానీ
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) వార్షికోత్సవ వేడుకలను నీతా అంబానీ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ.. పూజా కార్యక్రమంతో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''కుటుంబం అంటే నిజమైన ప్రేమను అర్థం చేసుకునే ప్రదేశం, మన కష్టాలను ఆనందాలను పంచుకునే ప్రదేశం, విభేదాలను పరిష్కరించుకోవడం ఎలా అని తెలుసుకునే ప్రదేశం. విలువలు, సంస్కృతి అనేది తాతలు, తల్లిదండ్రుల నుంచి లభిస్తాయని పేర్కొన్నారు. నా అతిపెద్ద బలం, నా చీర్లీడర్ నా భర్త ముఖేష్" అని అన్నారు.ఈ వేడుకలకు ముకేశ్ అంబానీ, ఇషా అంబానీ మాత్రమే కాకుండా.. ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్ మొదలైన సెలబ్రిటీలు హాజరయ్యారు. View this post on Instagram A post shared by DAIS Mumbai (@daismumbai) -
జనవరి 1 నుంచి ఈ కార్ల ధరల పెంపు
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా తమ వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. వాహన మోడల్, వేరియంట్ను బట్టి పెంపు 2% వరకు ఉంటుందని వివరించింది. ముడిసరకు ధరలు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.మెర్సిడెస్ బెంజ్ ఇండియా, బీఎమ్డబ్ల్యూ వాహన ధరలు సైతం జనవరి 1 నుంచి పెరుగనున్న సంగతి తెలిసిందే. అటు బీఎండబ్ల్యూ మోటోరాడ్ కూడా తమ బైక్ల ధరలను 6 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. డాలరు, యూరోలతో పోలిస్తే రూపాయి మారకం కొద్ది నెలలుగా గణనీయంగా పడిపోతుండటం, ముడి పదార్థాలు .. లాజిస్టిక్స్ వ్యయాలు పెరిగిపోతుండటం రేట్ల పెంపునకు కారణమని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.భారత్లో తయారు చేసే జీ 310 ఆర్ఆర్, సీఈ 02 బైక్లతో పాటు ఎఫ్ 900 జీఎస్, ఎఫ్ 900 జీఎస్ఏలాంటి దిగుమతి చేసుకున్న ప్రీమియం బైక్లను కంపెనీ విక్రయిస్తోంది. వీటి ధర రూ. 2.81 లక్షల నుంచి రూ. 48.63 లక్షల వరకు ఉంది. -
ఫుడ్ డెలివరీ యాప్లు వద్దు బాబోయ్..
దేశంలో ఫుడ్ డెలివరి యాప్లు విస్తృతంగా పెరిగిపోయాయి. వాస్తవంగా ఈ యాప్లు రెస్టారెంట్ పరిశ్రమకు కస్టమర్లను, ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఈ యాప్స్ను నమ్ముకుని హోటళ్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయా.. లేక రెస్టారెంట్లపై ఆధారపడి ఫుడ్ డెలివరి యాప్లు పనిచేస్తున్నాయా అంటే చెప్పడం కష్టం.అయితే ఇవే ఫుడ్ డెలివరి యాప్లు రెస్టారెంట్లకు ఆర్థికంగా, కార్యాచరణపరంగా ఒత్తిళ్లను కూడా తెస్తున్నాయి. ప్రోసస్ సౌజన్యంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం ఫుడ్ డెలివరి యాప్లు, రెస్టారెంట్ల మధ్య నలుగుతున్న వివాదాస్పద ఘర్షణను వెలుగులోకి తెచ్చింది.దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, ప్రాంతాల్లోని రెస్టారెంట్లతో నిర్వహించిన వివరణాత్మక సర్వేలో కీలక వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్లను ఉపయోగిస్తున్న రెస్టారెంట్లలో 35 శాతం అవకాశం ఉంటే ఈ యాప్ల నుండి నిష్క్రమించాలనే అనుకుంటున్నాయి. అదే సమయంలో దాదాపు మూడింట రెండు వంతుల రెస్టారెంట్లు మాత్రం ఫుడ్ డెలివరీ యాప్లతో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నాయి.రెస్టారెంట్ల బేజారుకు కారాణాలివే..అధిక కమీషన్లు ఫుడ్ డెలివరీ యాప్లపై రెస్టారెంట్ల అసంతృప్తికి ప్రధాన కారణం ప్రతి ఆర్డర్పై అవి వసూలు చేపసే కమీషన్. నివేదిక ప్రకారం.. ప్లాట్ ఫామ్ కమీషన్లు కొన్నాళ్లుగా పెరిగిపోయాయి. బిల్లు మొత్తంలో వాటి వాటా గణనీయంగా ఉంటోంది. చాలా మంది రెస్టారెంట్ యజమానులకు, ఆర్డర్ వాల్యూమ్లు బలంగా ఉన్నప్పటికీ, కమీషన్ల కారణంగా ఆర్డర్కు వచ్చే నికర ఆదాయాలు తగ్గిపోయాయి. "సగటు 'పర్ ఆర్డర్' కమిషన్ 2019లో 9.6 శాతం ఉండగా 2023 వచ్చేసరికి అది 24.6 శాతానికి పెరిగింది. సొంత డెలివరీ యాప్ల వైపు రెస్టారెంట్లుఅధిక కమిషన్లు, నియంత్రణల కారణంగా అనేక రెస్టారెంట్లు ఇప్పుడు తమ సొంత డెలివరీ యాప్లు, వెబ్సైట్లను అభివృద్ధి చేసుకుంటున్నాయి. దీనివల్ల మధ్యవర్తుల అవసరం తగ్గుతుంది. కమిషన్ల భారం ఉండదు. కస్టమర్ డేటాపై పూర్తి నియంత్రణ ఉంటుంది. లాభాల మార్జిన్ మెరుగుపడుతుందని రెస్టారెంట్ల నిర్వాహకులు భావిస్తున్నారు. పెద్ద చైన్ రెస్టారెంట్లు మాత్రమే కాకుండా, మధ్యస్థ స్థాయి హోటళ్లు కూడా వాట్సాప్ ఆర్డర్లు, లోకల్ డెలివరీ బాయ్స్ సహాయంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నాయి.బ్రాండ్ విలువకు దెబ్బఫుడ్ డెలివరీ యాప్లు తరచూ భారీ డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్ ఆఫర్లు, ఫెస్టివ్ డీల్స్ వంటి వాటిని రెస్టారెంట్లపై ఒత్తిడి చేసి అమలు చేయిస్తున్నాయి. దీని వల్ల రెస్టారెంట్ ధరల స్వతంత్రత కోల్పోతుంది. బ్రాండ్ విలువ తగ్గుతోంది. ఆఫ్లైన్ కస్టమర్లతో ధరల అసమతుల్యత ఏర్పడుతుంది. -
రైల్వే ఛార్జీల పెంపు.. 26 నుంచే కొత్త రేట్లు
భారతీయ రైల్వేస్ కీలక ప్రకటన చేసింది. టికెట్ ధరలను పెంచుతున్నట్లు పేర్కొంది. పెరిగిన ఛార్జీలు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజాగా పెంచిన రేట్ల ప్రకారం.. లోకల్, స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే..అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే.. ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటరకు 1 పైసా చొప్పన పెంచింది. మెయిల్/ఎక్స్ప్రెస్ ఏసీ, నాన్-ఏసీ రైళ్లలో కిలోమీటరకు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్-ఏసీ ట్రైన్లో 500 కి.మీ దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్ చేస్తూనే.. ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. చివరిసారి రైల్వే ఛార్జీల పెంపు 2025 జూలైలో జరిగింది. ఆ పెంపుతో రైల్వేకు సుమారు రూ.700 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. తాజా పెంపుతో దాదాపు రూ.600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. -
వారం రోజులు.. మారిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ మారిపోతున్నాయి. తీవ్రమైన హెచ్చుతగ్గులు, బలమైన రికవరీతో గత వారం రోజుల్లో (డిసెంబర్ 14 – డిసెంబర్ 21) హైదరాబాద్ సహా తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు గణనీయ మార్పులు నమోదు చేశాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారంతోపాటు ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పసిడి లోహం ధరలు మొత్తంగా చూస్తే స్వల్పంగా పెరిగాయి.ధరల మార్పు ఇలా..డిసెంబర్ 14న రూ.1,33,910గా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర.. పెరుగుతూ.. తగ్గుతూ డిసెంబర్ 21 నాటికి రూ.1,34,180 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల అనంతరం నికరంగా రూ.270 పెరిగింది.ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే డిసెంబర్ 14న రూ.1,22,750తో ప్రారంభమై, డిసెంబర్ 21న రూ.1,23,000 వద్ద కొనసాగుతోంది. నిరకంగా చూస్తే వారం రోజుల్లో రూ.250 ఎగిసింది.ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుబంగారాన్ని ప్రస్తుతం గ్లోబల్ ఇన్వెస్టర్లు ‘సేఫ్-హేవెన్’గా కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం డిమాండ్.. ధరలు పెరుగుతున్నాయి.అంతర్జాతీయ బంగారం ధరలు యూఎస్ డాలర్ బలం, అంతర్జాతీయ వడ్డీ రేట్ల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. డాలర్ బలంగా మారితే బంగారం ఫ్యూచర్స్పై ప్రభావం పడుతుంది. ఇది స్థానిక ధరలను ప్రభావితం చేస్తుంది.డిసెంబర్లో పండుగలు, శుభదినాలు, పెళ్లి సీజన్ మొదలైన సందర్భాల నేపథ్యంలో బంగారం కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. ఈ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తోంది.ఇక స్థానికంగా ఉన్న పన్నులు, సరఫరా, డిమాండ్ కూడా రోజువారీ పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. సీజనల్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంది. -
అదే బైక్.. అప్డేటెడ్ వెర్షన్
బజాజ్ ఆటో లిమిటెడ్ ‘2026 పల్సర్ 220ఎఫ్’ మోటార్సైకిల్ను కొత్త అప్డేట్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఎక్స్–షోరూం ధర రూ. 1.28 లక్షలు. స్వల్ప స్టైలింగ్, రంగులతో పాటు ప్రధానంగా కాస్మెటిక్, ఫీచర్లపై కంపెనీ దృష్టి పెట్టింది. రైడింగ్ సేఫ్టీని పటిష్టం చేసేందుకు సింగిల్–ఛానల్ ఏబీఎస్ నుంచి డ్యూయల్–ఛానల్ ఏబీఎస్కి అప్గ్రేడ్ చేశారు.మరింత స్పష్టంగా కనిపించేలా, మోడ్రన్ లుక్తో ఎల్ఈడీ టర్న్–సిగ్నల్స్(ఇండికేటర్స్) అమర్చారు. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఈ మోడల్లో ముఖ్యమైన ఆకర్షణగా నిలుస్తుంది. బ్లాక్ చెర్రీ రెడ్, బ్లాక్ ఇంక్ బ్లూ, బ్లాక్ కాపర్ బీయి, బ్లాక్ కాపర్ బేజ్ గ్రీన్ లైట్ కాపర్ మొత్తం నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది.అత్యుత్తమ పనితీరుతో అభిమానులను ఆకట్టుకున్న 220సీసీ ట్విన్ స్పార్క్ డీటీఎస్–ఐ ఇంజిన్ను మాత్రం కంపెనీ యథాతథంగా ఉంచేసింది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో, ఆయిల్–కూల్డ్ సింగిల్ సిలిండర్ సెటప్లో వస్తుంది. ఈ ఇంజిన్ 8,500 ఆర్పీఎం వద్ద 20.9 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తూ బలమైన పనితీరును ప్రదర్శిస్తుంది.‘కేటీఎం డ్యూక్ 160’ కొత్త వేరియంట్ప్రీమియం బైక్ విభాగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు కేటీఎం సంస్థ ’160 డ్యూక్’లో మరింత అధునాతన వేరియంట్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 1.78 లక్షలు (ఢిల్లీ ఎక్స్–షోరూం). అయిదు అంగుళాల కలర్ టీఎఫ్టీ డిస్ప్లే ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉంది. జెన్–3 కేటీఎం 390 డ్యూక్ నుంచి దీనిని ప్రేరణగా తీసుకున్నారు.రైడర్ తన అభిరుచికి తగ్గట్లు డిస్ప్లే థీమ్ను మార్చుకోవచ్చు. రైడర్ మెనూలు, కనెక్టివిటీ వంటి బైక్ ఫంక్షన్లను నియంత్రించేందుకు 4–వే స్విచ్ క్యూబ్ కూడా ఉంటుంది. నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. ఈ బైక్ను కేటీఎం మై రైడ్ యాప్కు కనెక్ట్ చేసుకోవచ్చు. -
కొటక్ బ్యాంక్పై కొరడా.. ఆర్బీఐ భారీ జరిమానా
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్పై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నిబంధనలు పాటించనందుకు గానూ రూ.61.95 లక్షలు జరిమానా చెల్లించాలని కొటక్ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది.జరిమానా ఇందుకే.. ‘బ్యాంకింగ్ సేవలు అందించడం - బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా’ 'బిజినెస్ కరస్పాండెంట్లు (బీసీ) చేపట్టాల్సిన కార్యకలాపాల పరిధి'పై ఆదేశాలను పాటించనందుకు అలాగే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ రూల్స్, 2006 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.2024 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక స్థితికి సంబంధించి బ్యాంక్ సూపర్వైజరీ మూల్యాంకనాన్ని (ISE 2024) తనిఖీ చేసిన ఆర్బీఐ.. ఇప్పటికే కనీస సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న కొంతమంది కస్టమర్లకు అలాంటి మరో ఖాతాను తెరిచినట్లు గుర్తించింది. అలాగే అనుమతించిన పరిధికి మించిన కార్యకలాపాలను చేపట్టడానికి బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లకు అవకాశం కల్పించినట్లు కూడా గమనించింది. అంతేకాకుండా కొంతమంది రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సిఐసి) తప్పుడు సమాచారాన్ని అందించినట్లు తేల్చింది. -
ఐదు ముక్కల్లో జగన్ మార్కు అభివృద్ధి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ తీసుకొచ్చిన పెట్టుబడులు, ఆయన హయాంలో ఏర్పాటైన పారిశ్రామిక సంస్థల గురించి జరిగిన ప్రచారం ఒకటి.. అసలు వాస్తవం ఇంకోటి. ఐదేళ్ల పదవీ కాలంలో తొలి రెండేళ్లు కోవిడ్-19తోనే సరిపోయింది. రాష్ట్ర విభజన తరువాత వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ కొరత కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు అడ్డంకి కానే కాలేదు. అన్ని ఇబ్బందులను అధిగమించి కోవిడ్ బాధితులను ఆదుకోవడంలో అందరి ప్రశంసలు అందుకుంది జగన్ ప్రభుత్వం. అదే సమయంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి జగన్ ఒక్కటొక్కటిగా పునాదులు వేస్తూ పోయారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి తీసుకున్న చర్యలు, వాటి ఫలితాల గురించి స్థూలంగా ఐదు ముక్కల్లో...1. భారీ పెట్టుబడులు..ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఐదేళ్ల కాలంలో ఆమోదం తెలిపిన పెట్టుబడులు ఏకంగా రూ.1.44 లక్షల కోట్లు. అంతేకాదు.. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో 17.5 గిగావాట్ల విద్యుదుత్పత్తికి అనుమతులు ఇవ్వడం ద్వారా రికార్డు సృష్టించింది. మిగిలిన రాష్ట్రాలు సౌర, పవన విద్యుత్తులకు మాత్రమే పరిమితమైతే.. ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఆంధ్రప్రదేశ్లో పంప్డ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్రాజెక్టు ఏర్పాటైంది. గ్రీన్కో సంస్థ సుమారు రూ.28 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు సంప్రదాయేతర ఇంధన రంగంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. కోల్ ఇండియా, ఏఎం గ్రీన్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కారణంగా గ్రీన్ అల్యూమినియం, హైడ్రోజన్ ఉత్పత్తి ప్రాజెక్టులకు నిరంతర విద్యుత్తు సరఫరా సాధ్యమైంది. ఎకోరెన్ గ్రూపు రూ.11 వేల కోట్లు అకార్డ్ గ్రూపు రూ.పదివేల కోట్లు, సెంచురీ ప్లైబోర్డ్స్ రూ.2600 కోట్లతో, ఆంధ్ర పేపర్ మిల్లు రూ.3400 కోట్లు, ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ రూ.1087 కోట్లు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొత్త ప్లాంట్ల ఏర్పాటు, విస్తరణలకు పెట్టుబడులుగా పెట్టింది కూడా జగన్ హయాంలోనే!2. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. 2023లో విశాఖలో ఏర్పాటు చేసిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 340 వరకూ పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటి మొత్తం విలువ రూ.13 లక్షల కోట్లు. సుమారు 20 రంగాల్లో ఆరు లక్షల ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఏర్పడింది. ఇదే సమ్మిట్లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ వర్చువల్ పద్ధతిలో రూ.3841 కోట్ల విలువైన పరిశ్రమలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిద్వారా సుమారు తొమ్మిదివేల ఉపాధి అవకాశాలు దక్కాయి. దేశ వ్యాపార దిగ్గజాలు ముఖేశ్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్), కృష్ణ ఎల్లా (భారత్ బయోటెక్), జి.మోహన్ రావు (జీఎంఆర్ గ్రూపు), నవీన్ జిందల్ (జిందల్ స్టీల్ అండ్ పవర్), అదానీ గ్రూపు ప్రతినిధులు ఇతర అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయం గమనార్హం.3. పోర్టులు.. ఇతర మౌలిక సదుపాయాలు..సుమారు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని రాష్ట్రాభివృద్ధికి మెట్టుగా మార్చాలని వై.ఎస్.జగన్ సంకల్పించారు. ఇందుకు తగ్గట్టుగానే ఆయన హాయంలో మచలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టుల నిర్మాణానికి శ్రీకారం పడింది. రికార్డు సమయంలో మచలీపట్నం పోర్టు పూర్తయ్యి 2023 మే నెలలో ప్రారంభమైంది కూడా. వీటితోపాటు అప్పటికే ఉన్న వైజాగ్, కృష్ణపట్నం, గంగవరం నౌకాశ్రయాల ఆధునికీకరణ, విస్తరణ కూడా చేపట్టారు. ఫలితంగా 2022లో ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఉన్నత స్థానానికి చేరుకోగలిగింది. ఆ ఏడాది దేశీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 38 శాతం! నౌకాశ్రయాల పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రంలో పలు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణానికి కూడా వై.ఎస్.జగన్ శ్రీకారం చుట్టారు. పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ ఎగుమతులు కేంద్రంగా విశాఖ - చెన్నై కారిడార్ ఏర్పాటైతే.. ఆంధ్రప్రదేశ్ దక్షిణ జిల్లాలను బెంగళూరు- చెన్నై కారిడార్లతో కలిపే ప్రయత్నం జరిగింది.4. పారిశ్రామిక విధానం..సంక్షేమం పునాదిగా.. పారిశ్రమలే చోదక శక్తిగా జగన్ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 65 శాతానికి కారణమవుతున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, పెట్రోకెమికల్స్పై ప్రధానంగా దృష్టి పెట్టారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పారిశ్రామిక అనుమతులు ఇచ్చేపద్ధతిని మొదలుపెట్టారు. వీటన్నింటి కారణంగానే ఆంధ్రప్రదేశ్ 2019-2024 మధ్యకాలంలో వరుసగా మూడేళ్లు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశంలోనే అగ్రస్థానానికి చేరుకోగలిగింది. సంక్షేమ పథకాలకు పారిశ్రామిక ప్రగతికి ముడిపెట్టిన జగన్ రాష్ట్రానికి వస్తున్న కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేసేందుకు పలు స్కిల డెవలప్మెంట్ కోర్సులను అమలు చేశారు. అపారెల్ పార్క్, ఆటో క్లస్టర్లను గ్రామీణ యువత, మహిళలకు నైపుణ్యాలను అందించే పథకాలకు జోడించారు. వీరిలో అత్యధికులు అమ్మ ఒడి, ఎస్హెచ్జీ గ్రూపు లబ్ధిదారులే.5. పండుగలా వ్యవసాయం..2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం పండుగల మారింది. రైతు భరోసా ద్వారా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఏటా రూ.13,500 పంపిణీ చేయడం మాత్రమే కాదు.. ఉచిత బోర్వెల్స్, సాగునీటి ప్రాజెక్టులు, పంట బీమా పథకాలు రైతు కష్టాలను గణనీయంగా తగ్గించాయి. ఎప్పటికప్పుడు రైతు అవసరాలను గమనించి తీర్చేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా పదివేలకుపైగా రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు పెరిగాయి. వలసలు తగ్గాయి. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలు కూడా రైతు పురోగతిలో తమ వంత పాత్ర పోషించాయి. పండ్లు, చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 2023-24 సంవత్సరానికి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. 2022లో ఆంధ్రప్రదేశ్ నుంచి 774 కోట్ల డాలర్ల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.:: గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ఇల్లు.. ఇక కొందామా.. తొలగిన డైలమా!
కొందామా.. మరికొన్నాళ్లు వేచి చూద్దామా..? కొనగానే ధరలు పడిపోతే..? పోనీ, ధైర్యం చేసి కొన్నా అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందకపోతే? ..ఏడాది కాలంగా హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో ఇలాంటి ఎన్నో సందేహాలు. ఏ నిర్ణయం తీసుకోకుండా తర్జన భర్జనలో పడేశాయి. 2025లో ఈ ఊగిసలాటకు తెరపడింది. స్థిరాస్తి మార్కెట్లో కొన్నాళ్లుగా నెలకొన్న అనిశ్చితి ఈ ఏడాదితో తొలగిపోవడంతో కొనుగోలుదారుల్లో అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. కొనుగోళ్లు పెరగడంతో స్థిరాస్తి సంస్థలు నిర్మాణాలు పూర్తి చేయడంలో వేగం పెంచాయి. రాష్ట్ర ప్రభుత్వం మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ల కార్యాచరణలో వేగంగా అడుగులు వేయడంతో ఈ రంగంలో సానుకూల అడుగులు వేసేందుకు ప్రధానంగా ఊతమిచ్చాయి.భూముల ధరలు పెరగడం తప్ప తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ రంగంలోని అనుభవజ్ఞులు చెబుతున్న మాట ఇది. మరి అలాంటప్పుడు కొనడానికి ఎందుకు ఊగిసలాట అనే సందేహం సహజం. గతంలో కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని అతిగా చూపించి వాస్తవ ధరకంటే ఎంతో ఎక్కువకు స్థలాలను విక్రయించారు.. ఇవి పెరగకపోగా.. అత్యవసరంగా అమ్ముకోవాల్సి వస్తే తక్కువ ధరకే విక్రయించి కొందరు నష్టపోయారు. సాధారణంగా కొనుగోలుదారుల మనస్తత్వం.. ధరలు పెరుగుతుంటే కొనేందుకు పోటీపడతారు. అదే తగ్గుతుందంటే మాత్రం ఎవరూ ముందుకురారు. ఇలాంటప్పుడే డిమాండ్ పడి ధరలు మరింత పతనమయ్యే అవకాశాలు ఉంటాయి. ధరలు పెరగాలంటే అభివృద్ధి నిలకడగా ఉండటం, రాజకీయ సుస్థిరత వంటి అంశాలు ఇంధనంగా పనిచేస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రభావవంతమైన పారిశ్రామిక విధానాలను అవలంభిస్తోంది. నగరంలో ఐటీ, ఫార్మాలతో పాటు విమానయాన, ఎల్రక్టానిక్స్ తదితర రంగాలలో పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. తద్వారా సహజంగానే ఇళ్ల నిర్మాణానికీ డిమాండ్ పెరుగుతోంది. కంపెనీల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన జరిగి చుట్టుపక్కల స్థిరాస్తి రంగం వృద్ధి చెందడానికి మార్గం సుగమం అవుతుంది.నలువైపులా అభివృద్ధి.. నగరం ఒకవైపే అభివృద్ధి కాకుండా నలువైపులా విస్తరించేలా ఆధ్యాత్మిక, ఐటీ, ఉత్పత్తి, ఫార్మా కారిడార్ల ప్రణాళికలు నిర్మాణ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రతికూల పరిస్థితుల నుంచి సానుకూల దిశగా స్థిరాస్తి మార్కెట్ అడుగులు పడేందుకు ఇవి దోహదం చేశాయి. కేంద్ర ప్రభుత్వం స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడులపై నిబంధనలను సరళతరం చేసింది. నిధులు లేక సతమతమవుతున్న నిర్మాణ పరిశ్రమలో ఈ నిర్ణయంతో ఆశలు చిగురించాయి. పెద్ద ప్రాజెక్ట్లకే కాదు చిన్న ప్రాజెక్ట్లకూ ఆర్థిక అండ లభించింది. తద్వారా హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్లోకి మరిన్ని పెట్టుబడులతో పాటుగా అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలకు అవకాశం ఏర్పడింది. టౌన్షిప్ల అభివృద్ధి, గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి నిధులు సమకూరాయి.ఇది చదివారా? ఇల్లు ఇలా కట్టు.. ఇది ఇంకో కొత్త టెక్నిక్కు..రెరాతో జవాబుదారితనం.. స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లుతో మార్కెట్పై సామాన్యుల్లో భరోసా పెరిగింది. దీంతో డెవలపర్లు, కొనుగోలుదారుల్లో సానుకూలత ఏర్పడింది. నిర్మాణం పూర్తయ్యి కొనుగోలుదారులకు అప్పగించాక ఐదేళ్లలో ఏదైనా లోపాలుంటే నిర్మాణదారుడిదే బాధ్యత వహించాలనేది స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లులోని మరో ముఖ్యమైన అంశం. నిర్మాణం మొదలుపెట్టాక ప్లాన్ను మార్చడానికి వీల్లేకుండా కొన్ని మంచి నిబంధనలలూ ఇందులో పొందుపరిచారు. వీటిని ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష వంటి కఠిన నిర్ణయాలతో స్థిరాస్తి మార్కెట్లో జవాబుదారితనం పెరిగింది. -
ఇళ్ల ధరలు 5 శాతం అప్
న్యూఢిల్లీ: గృహాల కొనుగోలుకు పటిష్టమైన డిమాండ్ నెలకొనడంతో వచ్చే ఏడాదిలో (2026) ఇళ్ల ధరలు మరింతగా పెరగనున్నాయి. ఈ పెరుగుదల 5 శాతం పైగా ఉంటుందని దాదాపు 70 శాతం రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంచనా వేస్తున్నారు. రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్, రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నవంబర్, డిసెంబర్ మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 647 మంది డెవలపర్లు పాల్గొన్నారు. క్రెడాయ్ సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. దీని ప్రకారం వచ్చే క్యాలెండర్ సంవత్సరంలో ఇళ్ల ధరలు 5 శాతానికి మించి పెరుగుతాయని 68 శాతం మంది అభిప్రాయపడ్డారు. పెరుగుదల 25 శాతానికి మించి ఉంటుందని 1 శాతం మంది, 15–25 శాతం మధ్య ఉంటుందని 3 శాతం మంది అంచనా వేశారు. ఇక ఇళ్ల ధరలు 10–15 శాతం మధ్యలో పెరుగుతాయని 18 శాతం మంది, 5–10 శాతం మేర పెరుగుతాయని 46 శాతం మంది పేర్కొన్నారు. రేట్లు తగ్గుతాయని 8 శాతం మంది మాత్రమే తెలపగా, ధరల పెరుగుదల 5 శాతం లోపే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు సుమారు 25 శాతం మంది వివరించారు. స్పెక్యులేషన్ కన్నా డిమాండ్కే ప్రాధాన్యం.. 2026 క్యాలెండర్ సంవత్సరంలో రెసిడెన్షియల్ సెగ్మెంట్ సానుకూలంగా ఉంటుందని మూడింట రెండొంతుల మంది డెవలపర్లు అంచనా వేస్తున్నారు. గృహాలకు డిమాండ్ 5 శాతం మేర పెరుగుతుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది రియల్ ఎస్టేట్ రంగ వృద్ధి ప్రధానంగా వినియోగదారుల డిమాండ్ను బట్టే ఉంటుందే తప్ప స్పెక్యులేషన్ ఆధారితమైనదిగా ఉండదని క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ జి. పటేల్ తెలిపారు. టెక్నాలజీ వినియోగంతో ఖర్చులను తగ్గించి, కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రాపరీ్టలను అందించడంపై పరిశ్రమ మరింతగా దృష్టి పెడుతోందని వివరించారు. ఈ వృద్ధి గతిని నిలబెట్టుకోవాలంటే వేగవంతమైన అనుమతులు, రెగ్యులేటరీపరంగా మరింత స్పష్టత అవసరమవుతుందని పటేల్ వివరించారు. క్లియరెన్స్లను క్రమబదీ్ధకరిస్తే వివిధ మార్కెట్లవ్యాప్తంగా కొత్త గృహాల సరఫరా పెరుగుతుందని, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు. అలాగే, పట్టణ ప్రాంతాలు పర్యావరణహితంగా, సమంగా అభివృద్ధి చెందగలవని చెప్పారు. డిమాండ్ స్థిరంగా ఉండబోతోందని, ఒక పద్ధతి ప్రకారమే కొత్త గృహాల సరఫరా పెరగబోతోందని నివేదిక తెలియజేస్తోందని సీఆర్ఈ మ్యాట్రిక్స్ సీఈవో అభిõÙక్ కిరణ్ గుప్తా తెలిపారు. హౌసింగ్ ప్రాజెక్టులకు రుణాల పాలసీని సమీక్షిస్తాం ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి వెల్లడి రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలిచ్చే విషయంలో తమ పాలసీని పునఃసమీక్షించనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఈ నేపథ్యంలో అలాంటి రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో జవాబుదారీతనం, పారదర్శకత కీలకాంశాలుగా ఉంటాయని పేర్కొన్నారు. చాలా సంస్థలు గతంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగానికి రుణాల విషయంలో దూకుడుగా వెళ్లి, చేతులు కాల్చుకున్న సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం హౌసింగ్ ప్రాజెక్టుల రుణాల్లో ఎస్బీఐ వాటా చాలా తక్కువే ఉంటోంది. అయితే, కమర్షియల్ రియల్ ఎస్టేట్, ముఖ్యంగా ఆఫీస్ స్పేస్ విభాగానికి రుణాలను క్రమంగా పెంచుకుంటోంది. ‘ప్రాజెక్టు నిర్వహణ, రిస్కు మేనేజ్మెంటు, పారదర్శకత విషయాల్లో స్థిరత్వం ఉంటే కాస్త నమ్మకం కలుగుతుంది. అలాగే జవాబుదారీతనం కూడా మాలాంటి బ్యాంకులకు కీలకంగా ఉంటుంది. అప్పుడు (పరిశ్రమ) తక్కువ వడ్డీ రేటుకే కన్స్ట్రక్షన్ రుణాలను పొందేందుకు వీలుంటుంది‘ అని క్రెడాయ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శెట్టి చెప్పారు. హౌసింగ్ ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహించే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) నిర్వహణ వ్యయాలను తగ్గించుకుంటే, తక్కువ వడ్డీ రేట్లపై రుణాలు అందించేందుకు వీలవుతుందని శెట్టి సూచించారు. -
హల్దీరామ్స్లో కేటర్టన్కు వాటా
న్యూఢిల్లీ: దేశీ స్నాక్స్ దిగ్గజం హల్దీరామ్స్లో తాజాగా కన్జూమర్ ఫోకస్డ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కేటర్టన్ పార్ట్నర్స్ వాటా కొనుగోలు చేసింది. అంతేకాకుండా హల్దీరామ్స్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నట్లు ఎల్.కేటర్టన్ తాజాగా వెల్లడించింది. అయితే పెట్టుబడి విలువ లేదా వాటా సంబంధ వివరాలు పేర్కొనలేదు. దేశీయంగా నాయకత్వస్థాయిలో ఉన్న హల్దీరామ్స్ అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు వీలుగా చేతులు కలిపినట్లు తెలియజేసింది. కేటర్టన్ సుమారు 39 బిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ పెట్టుబడులను నిర్వహిస్తోంది. వెరసి ఇప్పటికే హల్దీరామ్స్లో ఇన్వెస్ట్ చేసిన పలు అంతర్జాతీయ దిగ్గజాల సరసన చేరింది. ప్యాకేజ్డ్ స్నాక్స్, స్వీట్స్సహా రెస్టారెంట్లను నిర్వహించే హల్దీరామ్స్లో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు చేపట్టే టెమాసెక్(సింగపూర్ కేంద్రం), అల్ఫా వేవ్ గ్లోబల్, ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ(ఐహెచ్సీ) ఈ ఏడాది మొదట్లో వాటాలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వివరాలు వెల్లడికానప్పటికీ 10 బిలియన్ డాలర్ల(రూ. 85,000 కోట్లు) విలువలో హల్దీరామ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా ఎల్.కేటర్టన్కు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్యూఎల్ మాజీ ఎండీ సంజీవ్ మెహతా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కంపెనీ ఇప్పటికే ఫామ్లీ, ఫెరారా క్యాండీ, కెటెల్ ఫుడ్స్, లిటిల్ మూన్స్, ప్లమ్ ఆర్గానిక్స్ తదితరాలలో పెట్టుబడులు చేపట్టింది. -
50 లక్షల మందికి ఐబీఎం శిక్షణ
న్యూఢిల్లీ: 2030 నాటికి దేశీయంగా 50 లక్షల మంది యువతకు ఏఐ, సైబర్సెక్యూరిటీ, క్వాంటమ్ మొదలైన సరికొత్త సాంకేతికతల్లో శిక్షణనివ్వాలని నిర్దేశించుకున్నట్లు టెక్ దిగ్గజం ఐబీఎం వెల్లడించింది. ఇందుకోసం ఐబీఎం స్కిల్స్బిల్డ్ ప్రోగ్రాంను ప్రారంభించినట్లు వివరించింది. అంతర్జాతీయంగా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మందికి శిక్షణ కల్పించాలన్న మిషన్లో భాగంగా భారత్లో దీన్ని చేపట్టినట్లు ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ తెలిపారు. ఈ క్రమంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఒకేషనల్ కాలేజీలకు చేరువ కావడంతో పాటు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)తో కూడా జట్టు కట్టనున్నట్లు వివరించారు. సరికొత్త టెక్నాలజీల్లో నైపుణ్యాలనేవి ఆర్థికంగా పోటీపడేందుకు, సాంకేతిక పురోగతికి, సమాజ పరివర్తనకు తోడ్పడతాయని కృష్ణ చెప్పారు. -
కొలువులు ఉంటేనే.. విదేశాల్లో చదువు..
ముంబై: అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు, వీసా పాలసీలు మారిపోతున్న నేపథ్యంలో విదేశీ విద్యాభ్యాసంపై ఆసక్తి గల విద్యార్థుల ప్రాధాన్యతలు మారుతున్నాయి. అఫోర్డబిలిటీతో పాటు (అందుబాటు స్థాయిలో వ్యయాలు) చదువు అనంతరం ఉద్యోగావకాశాలు, తాము చదివే కోర్సులపై కృత్రిమ మేథ (ఏఐ) ప్రభావం తదితర అంశాలకు వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏఐ ఆధారిత విదేశీ విద్య సేవల ప్లాట్ఫాం లీప్ స్కాలర్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 30 లక్షల మంది పైగా విద్యార్థుల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఇది రూపొందింది. దీని ప్రకారం 2024–25లో జర్మనీపై భారతీయ విద్యార్థుల ఆసక్తి వార్షికంగా 377 శాతం పెరిగింది. అంతకు ముందు సంవత్సరం ఇది 219 శాతం వృద్ధి చెందింది. ఇక న్యూజిలాండ్పై 6 శాతం నుంచి 2,900 శాతం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై 7 శాతం నుంచి 5,400 శాతానికి ఆసక్తి పెరిగింది. విద్యాభ్యాసం పూర్తయ్యాక 18 నెలల పాటు వర్క్ వీసా లభిస్తుండటం జర్మనీ విషయంలో సానుకూలాంశం. పాశ్చాత్య వర్సిటీలతో పోలిస్తే విద్యా వ్యయాలు తక్కువగా ఉండటం, కాస్త అందుబాటు దూరంలో ఉండటం యూఏఈకి సానుకూలంగా నిలుస్తోంది. అటు విద్యాభ్యాసం పూర్తయ్యాక మూడేళ్ల పాటు నివసించేందుకు, పని చేసేందుకు వర్క్ వీసా ఇచ్చే ఇమ్మిగ్రేషన్ పాలసీలతో భారతీయ విద్యార్థులకు న్యూజిలాండ్ ఆకర్షణీయంగా ఉంటోంది. ‘విద్యార్థులు ఇప్పుడు కేవలం అఫోర్డబిలిటీని మాత్రమే చూడటం లేదు. ఫలానా యూనివర్సిటీలో చదివామని గొప్పలకు పోవడం కన్నా సదరు డిగ్రీతో ఎంత వరకు ప్రయోజనం ఉంటుందనేది కూడా వారికి కీలకంగా ఉంటోంది. పెట్టిన పెట్టుబడిపై రాబడి అవకాశాలను సైతం వారు లెక్కలు వేసుకుంటున్నారు‘ అని లీప్ స్కాలర్ సహ–వ్యవస్థాపకుడు ఆర్నవ్ కుమార్ తెలిపారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → స్పెషలైజేషన్కి విద్యార్థులు గతంలో కన్నా మరింతగా ప్రాధాన్యం ఇస్తున్నారు. 40.4 శాతం మంది విద్యార్థులు ఏఐ, మెషిన్ లెరి్నంగ్, డేటా సైన్స్ మొదలైన వాటిల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్పై ఆసక్తిగా ఉన్నారు. → 59.6 శాతం మంది వివిధ కోర్సుల్లో ఏఐ మాడ్యూల్స్ కూడా ఉన్న మాస్టర్స్ డిగ్రీలను ఎంచుకుంటున్నారు. → బిజినెస్, ఇంజినీరింగ్, హెల్త్కేర్ తదితర రంగాలకు ఉపయోగపడే ప్రత్యేక కోర్సులు చేసినా, ఏఐకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఇది నిదర్శనం. → ఏఐ కోర్సులు చదివేందుకు విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఇప్పుడు యూనివర్సిటీ ర్యాంకింగ్ల కన్నా తాము చదువుపై పెడుతున్న పెట్టుబడిపై రాబోయే రాబడులను కూడా లెక్కలు వేసుకుంటున్నారు. → కోర్సు ఖర్చు, ఇతరత్రా వ్యయాలూ తమకు అత్యంత ప్రాధాన్యతాంశాలని 75 శాతం మంది వెల్లడించారు. స్కాలర్షిప్కు 70 శాతం, కెరియర్ పురోగతికి 58 శాతం, జీతభత్యాల పెరుగుదల అవకాశాల అంశానికి 49 శాతం ఓట్లు లభించాయి. 40 శాతం ఓట్లతో అధ్యాపకుల అనుభవం, రీసెర్చ్ అవకాశాలకు అయిదో ర్యాంకు దక్కింది. టాప్ 5 ప్రాధాన్యతాంశాల్లో యూనివర్సిటీ ర్యాంకింగ్లకు చోటు దక్కకపోవడం గమనార్హం. → విదేశీ విద్యను ఎంచుకునే అబ్బాయిలు (58 శాతం), అమ్మాయిల (42 శాతం) మధ్య అంతరం తగ్గుతోంది. అమ్మాయిలు ఎక్కువగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడికల్ (స్టెమ్) కోర్సులను ఎంచుకుంటున్నారు. అందులోనూ ఏఐ, డేటా సైన్స్కి మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. -
రైడింగ్ సమయంలో పెట్రోల్ అదా ఇలా: టిప్స్
మోటార్ సైకిల్ లేదా కారు కొనే ఎవరైనా ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ వాహనాల మైలేజ్ కొంత తగ్గే సూచనలు కనిపించవచ్చు. దీనికి కారణం ఏమై ఉంటుందా? అని చాలామంది ఆలోచిస్తూ.. తలలు పట్టుకుంటారు. బండి మైలేజ్ ఎందుకు తగ్గుతుంది? ఏం చేస్తే.. మైలేజ్ పెరుగుతుందనే విషయాలు ఈ కథనంలో..వాహనాల మైలేజ్ తగ్గడానికి కారణాలుకొత్తగా కొన్న కారు లేదా మోటార్ సైకిల్ మంచి మైలేజ్ అందిస్తుంది. అయితే కొన్ని రోజుల తరువాత మైలేజ్ క్రమంగా తగ్గుతుంది. దీనికి కారణం.. టైర్ ప్రెషర్ తక్కువగా ఉండటం, ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అవ్వడం, స్పార్క్ ప్లగ్ పాడవ్వడం, ఇంజిన్ ఆయిల్, సమయానికి సర్వీసింగ్ చేయించకపోవడం మొదలైనవని తెలుస్తోంది.అంతే కాకుండా.. అకస్మాత్తుగా బండి వేగం పెంచడం, బ్రేక్ వేయడం, గేర్ సరిగా మార్చకపోవడం, క్లచ్ను ఎక్కువగా నొక్కి ఉంచడం, ట్రాఫిక్లో ఎక్కువగా ఆగి మళ్లీ స్టార్ట్ చేయడం, వాహనంపై ఎక్కువ బరువు వేసుకోవడం, నాణ్యతలేని పెట్రోల్ / డీజిల్, సరైన రోడ్లు లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా.. మైలేజ్ తగ్గవచ్చు.ఫ్యూయెల్ ఆదా కోసంరైడింగ్ సమయంలో.. ఒక్కసారిగా వేగం పెంచకుండా.. సాఫ్ట్గా యాక్సిలరేట్ చేయాలి.ఎక్కువ RPMలో రైడ్ చేయడం ఫ్యూయెల్ ఎక్కువగా ఖర్చు చేస్తుంది. కాబట్టి సరైన గేర్ వాడాలి.అనవసరంగా స్పీడ్ పెంచకూడదు. స్థిరమైన స్పీడ్లో బండి నడపాలి.ఎక్కువ సేపు స్టాప్లో ఉంటే (సిగ్నల్ వద్ద) ఇంజిన్ ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల కొంత ఫ్యూయెల్ ఆదా అవుతుంది.టైర్ ప్రెషర్ తక్కువగా ఉంటే.. కూడా మైలేజ్ తగ్గుతుంది. టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవడం మంచిది.ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్ క్లీన్గా ఉండేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించాలి.అనవసరంగా ఎక్కువ బరువులు వేయకూడదు. ఎక్కువసేపు క్లచ్ ప్రెస్ చేస్తూ ఉండకూడదు.ఇదీ చదవండి: ఎయిర్ పొల్యుషన్ ఎఫెక్ట్: BS6 vs BS4 వాహనాల మధ్య తేడా.. -
ఫేక్ యాడ్స్ మోసం.. వివాదంలో మెటా!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల మాతృ సంస్థ అయిన మెటా (Meta).. తన ప్లాట్ఫామ్లలో మోసపూరిత ప్రకటనల ద్వారా బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఇంతకీ ఈ వివాదం ఏమిటి? దీనిపై మెటా స్పందన ఏమిటి? అనే విషయాలను ఇక్కడ చూసేద్దాం.మెటాపై విమర్శలుమోసపూరిత ప్రకటనలను సంస్థ గుర్తించినప్పటికీ.. కఠినమైన చర్యలు తీసుకోలేదు. స్కామర్ల ప్రకటనల వల్ల మెటాకు అడ్వర్టైజింగ్ రూపంలో భారీ లాభాలు వస్తున్నాయి. కాబట్టి మెటా అటువంటి ప్రకటనలను అరికట్టడం లేదని నివేదికలు చెబుతున్నాయి. సామాన్య ప్రజలు.. ముఖ్యంగా యువత, వృద్ధులు ఈ మోసాలకు బలయ్యారు. దీంతో అనేక దేశాలు మెటాపై విమర్శలు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు సంబంధించిన స్కామ్ ప్రకటనలకు విషయంలో లెక్కలేనన్ని ప్రశ్నలు పుడుతున్నాయి.మెటా తన ప్లాట్ఫామ్లలో స్కామ్.. ఇతర మోసపూరిత ప్రకటనలను ప్రసారం చేయడం ద్వారా ఏటా బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గత ఏడాదిలో కంపెనీ.. ఒక్క చైనీస్ కంపెనీల ప్రకటనల నుంచి 18 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ డబ్బు సంపాదించిందని, ఇది కంపెనీ ప్రపంచ ఆదాయంలో 10 శాతం కంటే ఎక్కువ అని రాయిటర్స్ దర్యాప్తులో వెల్లడించింది.స్కామ్ ఎగుమతి దేశంగా చైనా!చైనాలో ఫేస్బుక్ & ఇన్స్టాగ్రామ్లను నిషేదించినప్పటికీ.. అక్కడి కంపెనీలు విదేశీ వినియోగదారులకు ప్రకటనలు ఇవ్వడానికి అనుమతి ఉంది. ఈ విధంగా.. మెటా ప్లాట్ఫామ్లలో దాదాపు 25% స్కామ్ & నిషేధిత ప్రకటనలు చైనావే కావడం గమనార్హం. దీంతో చాలామంది చైనాను స్కామ్ ఎగుమతి దేశంగా అభివర్ణించారు.అయితే.. చైనా నుంచి వచ్చే స్కామ్ యాడ్లను అరికట్టడానికి మెటా తాత్కాలికంగా ఒక యాంటీ ఫ్రాడ్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందాన్ని ఏర్పాటు చేసిన తరువాత కంపెనీ ఆదాయం 19 శాతం నుంచి 9 శాతానికి తగ్గిపోయింది. దీంతో మెటా ఆ బృందాన్ని 2024 చివరలో రద్దు చేసి, చైనీస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలపై ఆంక్షలు ఎత్తివేసింది. ఆ తరువాత ఆదాయం మళ్లీ 16%కి పెరిగింది.మెటా స్పందనమెటా ప్రతినిధి ఆండీ స్టోన్ (Andy Stone) రాయిటర్స్తో మాట్లాడుతూ.. యాంటీ ఫ్రాడ్ టీమ్ కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని అన్నారు. సీఈఓ మార్క్ జుకర్బర్గ్.. ఆ బృందాన్ని రద్దు చేయాలని ఆదేశించలేదని, స్కామ్ కార్యకలాపాలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్త ప్రయత్నాలను ముమ్మరం చేయాలని కంపెనీని ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు. గత 18 నెలల్లో, మెటా తన ప్లాట్ఫామ్ల నుంచి 46 మిలియన్ల చైనీస్ ప్రకటనలను తొలగించిందని వెల్లడించారు.ఇదీ చదవండి: 26ఏళ్ల వయసు.. ఫోర్బ్స్ జాబితాలో చోటు: ఎవరీ కళ్యాణి రామదుర్గం? -
మరింత పెరగనున్న రేటు: జనవరి 1నుంచే..
2026 రాబోతోంది. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు తమ వాహనాల ధరలను 2026 జనవరి నుంచి పెంచనున్నట్లు ప్రకటించాయి. ఈ జాబితాలోకి బీఎండబ్ల్యు మోటోరాడ్ కంపెనీ కూడా చేరింది. వచ్చే ఏడాది ప్రారంభం (జనవరి 1) నుంచే.. తన మోటార్ సైకిళ్ల ధరలను 6 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న అన్ని బైకులకు వర్తిస్తుందని వెల్లడించింది.అధిక ఇన్పుట్ ఖర్చుల కారణంగా.. మోటార్ సైకిళ్ల ధరలను పెంచడం జరిగిందని కంపెనీ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. బీఎండబ్ల్యు మోటోరాడ్ ఇండియా పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం స్థానికంగా ఉత్పత్తి చేసిన, దిగుమతి చేసుకున్న మోడల్లు రెండూ ఉన్నాయి.ఇదీ చదవండి: 2025లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే!మేడ్ ఇన్ ఇండియా మోడళ్ల జాబితాలో బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్, బీఎండబ్ల్యు సీఈ 02 ఉన్నాయి. దిగుమతి చేసుకున్న మోటార్ సైకిళ్ల జాబితాలో.. అడ్వెంచర్, రోడ్స్టర్, టూరింగ్, పెర్ఫార్మెన్స్, క్రూయిజర్ మోడల్లు ఉన్నాయి. BMW C 400 GT వంటి ప్రీమియం స్కూటర్లు, BMW CE 04 వంటి ఎలక్ట్రిక్ మోడళ్స్ కూడా జాబితాలో ఉన్నాయి. వీటన్నింటి ధరలు వచ్చే ఏడాది నుంచే పెరగనున్నాయి. -
ఫోర్బ్స్ జాబితాలో 26 ఏళ్ల కళ్యాణి రామదుర్గం
కోబాల్ట్ ల్యాబ్స్ కో-ఫౌండర్.. భారత సంతతికి చెందిన కళ్యాణి రామదుర్గం(Kalyani Ramadurgam).. మాజీ అఫర్మ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 'ఆషి అగర్వాల్'తో కలిసి, ఫైనాన్స్ విభాగంలో 2026కి ఫోర్బ్స్ 30-అండర్-30 యునైటెడ్ స్టేట్స్ జాబితాలో చోటు సంపాదించారు. ఇంతకీ ఎవరీ కళ్యాణి రామదుర్గం?, ఫోర్బ్స్ జాబితాలో చేరేలా ఏమి సాధించారనే.. విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభించడానికి ముందు.. కళ్యాణి రామదుర్గం యాపిల్ సంస్థలో ఉగ్రవాదం, ఆర్థిక నేరాలు, సెక్యూరిటీ సమస్యలు వంటివి గుర్తించడంలో సహాయపడే టెక్నాలజీపై పని చేశారు.అలా కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభంయాపిల్ కంపెనీలో పని చేస్తూ.. బ్యాంకులు, ఇతర పెద్ద కంపెనీలు తమ నియమాలను పాటిస్తున్నాయా.. లేదా? అని తెలుసుకోవడానికి వేల పేజీల డాక్యుమెంట్లను మనుషులు మాన్యువల్గా చెక్ చేయాల్సి వస్తోంది. ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకోవడమే కాకుండా, తప్పులు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యకు టెక్నాలజీ ద్వారా పరిష్కారం తీసుకురావాలనే సంకల్పంతో కళ్యాణి కోబాల్ట్ ల్యాబ్స్ ప్రారంభించారు.కోబాల్ట్ ల్యాబ్స్ స్టార్టప్.. ఏఐ అండ్ మెషీన్ లెర్నింగ్ సహాయంతో పెద్ద పెద్ద డాక్యుమెంట్లను వేగంగా చదివి, బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు తమ వ్యాపారాలను.. చట్టాలు, నియమాల ప్రకారం చేస్తున్నాయా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా వెల్లడిస్తుంది. దీని వల్ల సమయం ఆదా అవుతుంది, ఖర్చు తగ్గుతుంది. భద్రత కూడా మెరుగవుతుంది.అతి తక్కువ కాలంలో అంతర్జాతీయ గుర్తింపుకోబాల్ట్ ల్యాబ్స్ కంపెనీ అతి తక్కువ సమయంలోనే అంతర్జాతీయ గుర్తింపు పొంది.. మిలియన్ల డాలర్ల ఫండింగ్ను కూడా సాధించగలిగింది. టెక్నాలజీని ఉపయోగించి, అద్భుతం చేసిన.. కల్యాణి రామదుర్గం కృషికి గుర్తింపుగా 26ఏళ్ల వయసులో ఫోర్బ్స్ 30-అండర్-30 జాబితాలో చోటు దక్కింది.కోబాల్ట్ ల్యాబ్స్ ఒక మంచి ఆలోచన, కష్టపడే మనస్తత్వం.. ఆధునిక టెక్నాలజీ కలిస్తే ఎంత పెద్ద విజయాన్ని సాధించవచ్చో చూపించే ఒక ఉత్తమ ఉదాహరణ. ఈ రంగంలో ఇలాంటి ఆలోచనలు చేసే ఎంతోమందికి ఇదొక ప్రేరణ.కళ్యాణి రామదుర్గం యాపిల్ కంపెనీలో ఉద్యోగం ఉంది కదా అని అక్కడే ఆగిపోయి ఉంటే.. నేడు ఫోర్బ్స్ 30-అండర్-30 జాబితాలో చోటు సంపాదించగలిగేవారా?, కాబట్టి యువత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఉన్న ఉద్యోగంతో సంతృప్తి చెందకూడదు. కొత్తగా ఆలోచించాలి, కొత్త మార్గాలను అన్వేషించాలి. పెద్ద సంస్థలో ఉద్యోగం తెచ్చుకోవడం గొప్ప విజయమే. ఆ విజయాన్ని అక్కడితో ఆపేయకూడదు.In 2023, Kalyani Ramadurgam founded Kobalt Labs with former Affirm software engineer Ashi Agrawal to bring compliance into the machine-learning age. Kobalt's AI models sort through mountains of documents to help banks vet their business partners, ensuring they're following the… pic.twitter.com/G238c6pXVg— Forbes (@Forbes) December 17, 2025 -
సెర్చ్ చేస్తే.. కస్టమ్ యాప్!
గూగుల్, ఓపెన్ఏఐ, పెర్ప్లెక్సిటీలాంటి టెక్ దిగ్గజాలు ఈ సంవత్సరం ఏఐ–ఆధారిత బ్రౌజర్లకు శ్రీకారం చుట్టాయి. తాజా విషయం ఏమిటంటే.. గూగుల్లోని క్రోమ్ బృందం ‘డిస్కో’ పేరుతో కొత్త జెమిని 3–ఆధారిత బ్రౌజర్ను ఆవిష్కరించింది.ఇంటర్నెట్ను బ్రౌజ్ చేయడానికి అనుమతించే సంప్రదాయ బ్రౌజర్ల మాదిరిగా కాకుండా, గూగుల్ ‘డిస్కో’ జెన్ ట్యాబ్స్ను (Gentabs) ఉపయోగిస్తుంది. ప్రశ్న లేదా ప్రాంప్ట్లను ఇన్పుట్గా తీసుకుంటుంది. వీటికి సంబంధించిన ట్యాబ్లను ఓపెన్ చేస్తుంది. అంతేకాదు మనం సెర్చ్ చేస్తున్నదానికి సంబంధించి కస్టమ్ యాప్ క్రియేట్ చేస్తుంది.ఉదాహరణకు... మనం ‘డిస్కో’ను ట్రావెల్ టిప్స్ అడిగితే ఆటోమేటిక్గా ప్లానర్ యాప్ను క్రియేట్ చేస్తుంది. గూగుల్ క్రోమ్లాగే బ్రౌజింగ్, ట్యాబ్లను ఒపెన్ చేయడం, ఎక్స్టెన్షన్స్, పేజీలను నావిగేట్ చేయడంలో ‘డిస్కో’ ఉపయోగపడుతుంది.ఈ కొత్త బ్రౌజర్తో యూజర్లు ఎలాంటి కోడ్ను రాయాల్సిన అవసరం ఉండదు. మనకు కావాల్సిన వాటిని సింపుల్గా వివరిస్తే సరిపోతుంది. ఈ ఏఐ–జనరేటెడ్ వెబ్ యాప్తో టెక్స్ ప్రాంప్ట్ల ద్వారా లేఅవుట్స్, విజువల్, ఫీచర్స్కు సంబంధించి మార్పు చేర్పులు చేయవచ్చు.ప్రతి ఏఐ–జనరేటెడ్ కంటెంట్ ఒరిజినల్ వెబ్ సోర్స్తో లింకై ఉంటుంది. మీల్స్ ప్లాన్, ట్రావెల్ ప్లాన్, పిల్లలకు గ్రహాల గురించి పరిచయం చేయడానికి విద్యార్థులకు కూడా బాగా ఉపయోగపడుతుంది డిస్కో. ఒక నిర్దిష్టమైన అంశం గురించి తెలుసుకోవాలనుకుంటే, ఆ అంశానికి సంబంధించి జెన్ ట్యాబ్ ఒక యాప్ను క్రియేట్ చేస్తుంది. సమాచారాన్ని విజువలైజ్ చేసి కాన్సెప్ట్ సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది.చదవండి: ఫ్లెక్స్ క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లింపులు‘డిస్కో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ప్రతీది సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఇది తక్కువ మంది టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నందున దీనిని యాక్సెస్ చేయడానికి మీరు వెయిట్ లిస్ట్లో చేరాల్సి ఉంటుంది’ అని గూగుల్ ప్రకటించింది. -
బంగారం ధరలు.. ఏడాది తిరిగేలోపు చుక్కలు!
ఈ ఏడాది ఇక ముగింపునకు వచ్చేసింది. 2025 సంవత్సరం బంగారం మార్కెట్లో చరిత్రాత్మక ఏడాదిగా నిలిచింది. ఏడాది ప్రారంభంలో తులం (10 గ్రాములు) బంగారం ధర సుమారు రూ.80 వేల స్థాయిలో ఉండగా, ఏడాది చివరికి అది రూ.1.30 లక్షలకుపైగా చేరింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ బలహీనత, భారతీయ రూపాయి మారకం విలువ వంటి అంశాలు బంగారం ధరలను కొత్త రికార్డుల వైపు నడిపించాయి. 2025లో పసిడి ధరలు ఎప్పుడు ఎలా పెరుగుతూ వచ్చాయి.. కొత్త మార్కులను ఎలా దాటాయి.. చూద్దాం ఈ కథనంలో..జనవరి: స్థిరమైన ఆరంభం2025 జనవరిలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.80 వేలు – రూ.82 వేల మధ్య కొనసాగింది. సంవత్సరం ప్రారంభంలో మార్కెట్ పెద్దగా కదలికలు చూపకపోయినా, అంతర్జాతీయంగా వడ్డీ రేట్లపై అంచనాలు బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచాయి.మార్చి: వేగం పుంజుకున్న ధరలుమార్చి నాటికి బంగారం ధరలు రూ.88,000–రూ.90,000 స్థాయికి చేరాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు పెరగడం, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరగడం బంగారాన్ని ‘సేఫ్ హేవన్’గా మార్చాయి.ఏప్రిల్: చరిత్రాత్మక మైలురాయిఏప్రిల్ నెల బంగారం మార్కెట్లో కీలక మలుపు. ఏప్రిల్ చివరి వారంలో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష మార్కును దాటింది. ఒకే రోజులో వేల రూపాయల పెరుగుదల నమోదై, కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురి చేసింది.మే–జూన్: స్వల్ప ఊగిసలాటమే, జూన్ నెలల్లో ధరలు కొంత స్థిరపడుతూ రూ.95,000– రూ.98,000 మధ్య కదిలాయి. అధిక ధరల కారణంగా ఆభరణాల కొనుగోళ్లు కొంత తగ్గినా, పెట్టుబడి డిమాండ్ మాత్రం కొనసాగింది.సెప్టెంబర్: మళ్లీ జోరుసెప్టెంబర్ నాటికి బంగారం ధరలు మరోసారి వేగం పుంజుకుని రూ.1.08 లక్షల నుంచి రూ.1.10 లక్షల స్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం మార్కెట్పై ప్రభావం చూపింది.అక్టోబర్: పండుగ సీజన్ రికార్డులుదసరా–దీపావళి సీజన్లో బంగారం ధరలు మరింత ఎగబాకాయి. అక్టోబర్ మధ్య నాటికి 10 గ్రాముల ధర సుమారు రూ.1.30 లక్షలకు చేరి కొత్త ఆల్టైమ్ హైని నమోదు చేసింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్, పెట్టుబడిదారుల కొనుగోళ్లు కలసి ధరలను ఆకాశానికి చేర్చాయి.డిసెంబర్: స్వల్ప తగ్గుదలడిసెంబర్ చివర్లో ధరలు కొంత సర్దుబాటు చెంది రూ.1.28 లక్షలు – రూ.1.30 లక్షల పరిధిలో కొనసాగాయి. ఏదేమైనప్పటికీ, ఏడాది మొత్తంగా చూస్తే బంగారం భారీ లాభాన్ని ఇచ్చిన ఆస్తిగా నిలిచింది. -
2025లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే!
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో.. వాహన తయారీ సంస్థలు మార్కెట్లో ఎప్పటికప్పుడు ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా లెక్కకు మించిన ఈవీలు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ కథనంలో ఈ ఏడాది (2025) దేశీయ విఫణిలో కనిపించిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ఇండియన్ మార్కెట్లో ఎంతోమందికి ఇష్టమైన హ్యుందాయ్ క్రెటా.. ఈ ఏడాది ఎలక్ట్రిక్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయింది. ఇది 42 కిలోవాట్ బ్యాటరీ, 51.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనే రెండు ఎంపికలతో లభిస్తుదఞ్హి. ఇవి రెండూ వరుసగా 420 కిమీ, 510 కిమీ రేంజ్ అందిస్తాయి. ఈ కారును డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 58 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. దీని ప్రారంభ ధర రూ. 18.02 లక్షలు (ఎక్స్ షోరూమ్).టాటా హారియార్ ఈవీ2025 టాటా మోటార్స్ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి 'టాటా హారియార్ ఈవీ'. acti.ev ప్లస్ EV ప్లాట్ఫామ్పై నిర్మితమైన ఈ కారు 65 kWh & 75 kWh బ్యాటరీ ప్యాక్లతో లభిస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 627 కిమీ దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇందులో లెవల్ 2 ఏడీఏఎస్, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 21.49 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా ఎక్స్ఈవీ 9ఎస్ పేరుతో.. ఏడు సీట్ల ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇది 59 kWh, 70 kWh, 79 kWh అనే బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ఈ కారు రేంజ్.. ఎందుకుని బ్యాటరీ ప్యాక్, వేరియంట్ను బట్టి 521 కిమీ నుంచి 679 కిమీ వరకు ఉంటుంది. ఇందులో పనోరమిక్ సన్రూఫ్, ట్రిపుల్ డిజిటల్ స్క్రీన్లు & లెవల్-2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా కలిగి ఉంది. దీని ధర రూ. 19.95 లక్షలు (ఎక్స్ షోరూమ్).కియా కారెన్స్ క్లావిస్ ఈవీకియా మోటారు లాంచ్ చేసిన కారెన్స్ క్లావిస్ ఈవీ.. ఏడు సీట్ల లేఅవుట్ను పొందుతుంది. ఫ్యామిలీ కారు కావాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. ఇది 42 kWh & 51.4 kWh బ్యాటరీ ప్యాక్లతో.. 404 కిమీ, 490 కిమీ రేంజ్ అందిస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ కారులో లెవల్-2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్రూఫ్, వైర్లెస్ స్మార్ట్ఫోన్ ఛార్జింగ్ వంటివన్నీ ఉన్నాయి. దీని ధరలు రూ. 17.99 లక్షల నుంచి రూ. 24.49 లక్షలు మధ్య ఉన్నాయి.విన్ఫాస్ట్ వీఎఫ్7 & వీఎఫ్6వియత్నామీస్ EV బ్రాండ్ విన్ఫాస్ట్ ఈ ఏడాది.. వీఎఫ్7 & వీఎఫ్6 కార్లను లాంచ్ చేసింది. వీఎఫ్7 ధరలు రూ. 20.89 లక్షల నుంచి రూ. 25.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులో 70.8 కిలోవాట్ బ్యాటరీ, 75.3 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీతో సింగిల్ మోటార్ & డ్యూయల్ మోటార్ వేరియంట్లలో లభిస్తుంది.వీఎఫ్6 విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర రూ. 16.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణంగా 59.6 kWh బ్యాటరీతో.. ఫ్రంట్-మోటార్ సెటప్ & ఫాస్ట్-ఛార్జింగ్ సామర్థ్యంతో వస్తుంది. ఈ కారు 468 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ అద్భుతంగా ఉంటాయి.వోల్వో ఈఎక్స్30వోల్వో కంపెనీ ఈఎక్స్30 ప్రీమియం ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది 69 kWh లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ కారు రియర్ మౌంటెడ్ మోటారుతో జతచేయబడి.. 272 bhp & 343 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది 480 కిమీ రేంజ్ అందిస్తుంది. DC ఛార్జర్ని ఉపయోగించి 28 నిమిషాల్లో 10–80 శాతం ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 39.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
కొత్త ఏడాదిపై రియల్ ఎస్టేట్ గంపెడాశలు
2025లో.. ఔటర్ వరకూ గ్రేటర్ పరిధి విస్తరణ..భారత్ ఫ్యూచర్ సిటీతో నగరంలో నాలుగో నగరి అవతరణ..మూసీకి పునరుజ్జీవంతో నైట్ ఎకానమీ ఆవిష్కరణ..మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ల ప్రణాళికలతో కొంగొత్త ఉత్సాహం....హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చే ఈ మెగా ప్రాజెక్ట్లకు శ్రీకారం పడింది. ఇక, వీటి కార్యాచరణతో కొత్త ఏడాదిలో నగర స్థిరాస్తి రంగం దూసుకెళ్లడం ఖాయమని నిర్మాణ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలతో రియల్ అభివృద్ధికి ఢోకా లేదని భావిస్తున్నారు. మరోవైపు గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల రాకతో ఐటీ నిపుణులు, సంస్థలు హైదరాబాద్ వైపు దృష్టిసారిస్తున్నారు.స్థిరాస్తి రంగానికి మెరుగైన మౌలిక వసతులే జవసత్వాలు. రహదారులు, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు, వినోద కేంద్రాలు వంటి సామాజిక వసతులు ఉన్న చోట స్థిరాస్తి రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్పల్లి, కోకాపేట, నార్సింగి వంటి ప్రాంతాలే ఇందుకు ఉదాహరణ. ఆయా ప్రాంతాలలో ప్రభుత్వాలు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో నిర్మాణ సంస్థలు పోటీపడీ మరీ నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించాయి. దీంతో ఎకరం వందల కోట్లు పలికే రికార్డ్ స్థాయికి ఆయా ఏరియాలు అభివృద్ధి చెందాయి. సాధారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్క చదరపు అడుగు(చ.అ.) కార్యాలయ స్థలం లావాదేవీ జరిగితే.. 10 చ.అ. నివాస స్థలానికి డిమాండ్ ఏర్పడుతుందని అంటారు. ఆఫీసు స్పేస్ అభివృద్ధితో నివాస, వాణిజ్య సముదాయాల అవసరం ఏర్పడుతుంది. రెండేళ్ల కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ)లకు హైదరాబాద్ అడ్డాగా మారింది. మన భాగ్యనగరం బెంగళూరు, చెన్నై వంటి ఐటీ హబ్లకు గట్టిపోటీని ఇస్తోంది. ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, అందుబాటు ధరలు, నిపుణుల లభ్యత, తక్కువ జీవన వ్యయం, కాస్మోపాలిటన్ కల్చర్, ఆహ్లాదకరమైన వాతావరణం వంటి రకరకాల కారణాలతో బహుళ జాతి సంస్థలు, పెట్టుబడిదారులు హైదరాబాద్లో కంపెనీల ఏర్పాటుకు, పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.ఔటర్ గ్రేటర్.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిని విస్తరించిన సంగతి తెలిసిందే. 27 నగర, పురపాలక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో దేశంలోనే అతిపెద్ద మహానగరంగా జీహెచ్ఎంసీ అవతరించింది. రెండు వేల చ.కి.మీకు పైగా విస్తరించిన జీహెచ్ఎంసీని ఒకే కార్పొరేషన్ ఏర్పాటు కావడంతో కొత్త ప్రాంతాలలో స్థిరాస్తి వ్యాపార అవకాశాలు మెరుగవుతాయి. బహుళ స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుతో సమర్థవంతమైన పరిపాలన, సమాంతర అభివృద్ధితో పాటు అభివృద్ధి పనులను వేగవంతమవుతాయి. పట్టణీకరణ సవాళ్లు, మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం సులువు అవుతుంది. పాత మున్సిపాలిటీల్లోనూ మెరుగైన మౌలిక వసతులు రావడంతో రియల్ ఎస్టేట్కు డిమాండ్ ఏర్పడటం ఖాయం. బహుళ అంతస్తుల భవనాలు, భారీ వెంచర్లకు నిర్మాణ సంస్థలు, డెవలపర్లు ముందుకొస్తారు.మెట్రో బూమ్..హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాగోల్–శంషాబాద్ విమానాశ్రయం, రాయదుర్గం–కోకాపేట, ఎంజీబీఎస్ – చాంద్రయాణగుట్ట, మియాపూర్– పటాన్చెరు, జేబీఎస్–మేడ్చల్/శామీర్పేట వంటి కీలక మార్గాలలో మెట్రో పరుగులు పెట్టనుంది. సుమారు 76–86 కి.మీ. మేర మెట్రో కొత్త లైన్ రానుంది. మెట్రో విస్తరణతో శివారు ప్రాంతాలు ప్రధాన నగరంతో అనుసంధానమవుతాయి. ప్రీమియం గృహాలకు డిమాండ్ ఏర్పడుతుంది. కోకాపేట, గచ్చిబౌలి, ఉప్పల్ వంటి విమానాశ్రయంతో అనుసంధానమై ఉన్న ప్రాంతాలు హాట్స్పాట్లుగా మారతాయి. మెట్రో లైన్లలోని ఆస్తి విలువలు 10–20 శాతం మేర పెరుగుతాయి. కొత్త స్టేషన్ల చుట్టూ 2–3 కి.మీ. వరకూ బహుళ అంతస్తుల నివాస, వాణిజ్య సముదాయాలు వస్తాయి.ఫ్యూచర్ బెటర్ఏటేటా మహా నగరం విస్తరిస్తోంది. విద్యా, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం రకరకాల కారణాలతో నగరంలో వలసలు పెరుగుతున్నాయి. శరవేగంగా పట్టణీకరణ జరుగుతుండటంతో ప్రధాన నగరంలో జనసాంద్రత పెరుగుతోంది. మౌలిక వసతులపై ఒత్తిడి పడుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్కు దక్షిణ ప్రాంతంలో శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారుల మధ్యలో మీర్ఖాన్పేటలో సుమారు 30 వేల ఎకరాలలో ఫోర్త్ సిటీ నిర్మాణానికి పునాదులు వేసిన సంగతి తెలిసిందే. ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, యాచారం, మంచాల్ ఏడు మండలాల్లోని 56 గ్రామాలను కలుపుతూ ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్సీడీఏ)ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాలలో రహదారులు, భూగర్భ విద్యుత్ వ్యవస్థ వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ గ్రామాలలో భూములకు రెక్కలొచ్చాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలోకి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్–2047ను కూడా నిర్వహించింది. రెండు రోజుల సమ్మిట్లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి పనులు వేగం అందుకున్నాయి.మూసీ అభివృద్ధికేసి..భాగ్యనగరం నడిబొడ్డున వడ్డాణం మాదిరిగా అందంగా పొదిగిన మూసీ నదికి పునరుజ్జీవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మూసీ నదిని కేవలం నదీ తీర ప్రాంతంగా మాత్రమే కాకుండా నగర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముఖలా నిలిచేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నైట్ ఎకానమీకి మూసీని కేరాఫ్ మూసీ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నారు. మూసీ నదిని బ్లూ, గ్రీన్ అని రెండు భాగాలుగా అభివృద్ధి చేయనున్నారు. బ్లూ మాస్టర్ ప్లాన్లో వరద నీటి నివారణ, వంతెనల నిర్మాణం తదితర అంశాలుంటే.. గ్రీన్ మాస్టర్ ప్లాన్లో నదీ తీరంలో గ్రీనరీ, రవాణా ఆధారిత అభివృద్ధి తదితర అంశాలుంటాయి.మూసీ నదీ తీర పునరుజ్జీవం, ప్రాంతం అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తూర్పు–పశ్చిమ నదీ తీరాన్ని కలుపుతూ 35–40 కి.మీ. కారిడార్ను అభివృద్ధి చేస్తారు. మూసీ నదీ తీరాన్ని రవాణా ఆధారిత అభివృద్ధిగా కలిపి డెవలప్ చేయాలని ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా నది తీరం వెంబడి ప్రజా స్థలాలు, వినోద కేంద్రాలు, విహార ప్రదేశాలు, సాంస్కృతిక వేదికలు, విహార ప్రదేశాలు, ఉద్యానవనాలు, సాంస్కృతిక కేంద్రాలు, సైకిల్, వాకింగ్ ట్రాక్స్ వంటి స్థిరమైన రవాణా ఏర్పాట్లు వంటివి ఏర్పాట్లు చేయనున్నారు. వరదల నిరోధకత, జీవ వైవిధ్యం, సమ్మిళిత రూపకల్పనపై దృష్టిసారించనున్నారు. అలాగే ఆగ్యుమేటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్) ఆధారిత స్టోరీ టెల్లింగ్ జోన్లు, కల్చరల్ ప్లాజాలను ఏర్పాటు చేస్తారు.త్రిబుల్ ఆర్ రయ్.. ప్రధాన నగరంపై ఒత్తిడి తగ్గించడంతో పాటు కొత్త ప్రాంతాలలో అభివృద్ధి విస్తరణకు ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 30–50 కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్ (త్రిబుల్ ఆర్)కు ప్రణాళికలు చేసింది. హైదరాబాద్ చుట్టూ 340 కి.మీ. ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్ ఇదీ. త్రిబుల్ ఆర్తో రాష్ట్ర మొత్తం కనెక్టివిటీ మెరుగవుతుంది. ఇంటర్ ఛేంజ్లు, గ్రోత్ కారిడార్ల అభివృద్ధితో కొత్త ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఏర్పడతాయి. పారిశ్రామిక గిడ్డంగులు, శాటిలైట్ టౌన్షిప్లకు ఆస్కారం ఉంటుంది. -
2026లో బంగారం కొనడం కష్టమే!.. ఎందుకంటే?
2025 ఇంకొన్ని రోజుల్లో ముగుస్తుంది. బంగార ధరలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది (2025) ప్రారంభంలో రూ.78,000 ఉన్న గోల్డ్ రేటు.. ప్రస్తుతం రూ.1.3 లక్షలకు చేరుకుంది. దీంతో 2026లో పసిడి ధరలు ఇంకెలా ఉండబోతున్నాయో అని చాలామంది ఆందోళన చెందుతున్నారు.2026 డిసెంబర్ నాటికి బంగారం ధర ఔన్సుకు 14% పెరిగి 4,900 డాలర్లకు చేరుకుంటుందని.. గోల్డ్మన్ సాచ్స్ (Goldman Sachs) అంచనా వేసింది. సెంట్రల్ బ్యాంక్ డిమాండ్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతలు వంటివి గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతున్నాయి. వచ్చే ఏడాది కూడా బంగారం ధర భారీగా పెరుగుతుందని నివేదికలో గోల్డ్మన్ సాచ్స్ వెల్లడించింది.భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్లో కూడా గోల్డ్ రేటు 61 శాతం పెరిగింది. ఈ విధంగా ధరలు పెరగడానికి ప్రధాన కారణం.. ట్రంప్ టారిఫ్స్ ప్రకటనలు. స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిన సమయంలో చాలామంది పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇది కూడా గోల్డ్ రేటు గణనీయంగా పెరగడానికి ఓ కారణమైంది.ప్రస్తుతం బంగారం కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. ఎందుకంటే అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణం సమయంలో పెట్టుబడిదారులకు గోల్డ్ సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఉపయోగపడుతుంది. రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు సైతం బంగారంపై పెట్టే పెట్టుబడి.. మిమ్మల్ని ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేస్తుందని చెబుతున్నారు. కాబట్టి చాలామంది పసిడిపై పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. కాబట్టి రేటు కూడా పెరుగుతుందని స్పష్టంగా అవగతం అవుతోంది.నేటి ధరలువరుస హెచ్చుతగ్గుల మధ్య ఈ రోజు (డిసెంబర్ 20) బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై నగరాల్లో.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,34,180 వద్ద.. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,23,000 వద్ద నిలిచాయి. చెన్నైలో మాత్రమే ఈ ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి.ఇదీ చదవండి: మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్ -
Real Estate: రిటైల్ పెట్టుబడులకు క్యూ..
పొద్దున లేస్తే ఆన్లైన్లో ఒక్కసారైనా క్లిక్మనిపించాల్సిందే. షాపింగ్, ఫుడ్, లైఫ్స్టైల్.. ప్రతీది ఈ–కామర్స్లో కొనేందుకే నేటి యువత మొగ్గు చూపిస్తోంది. అయితే ఈ–కామర్స్ ఎంత పెరుగుతున్నా.. నేటికీ షాపింగ్ మాల్స్కు ఆదరణ మాత్రం అస్సలు తగ్గడం లేదు. పాశ్చాత్య దేశాల్లో రిటైల్ స్థలం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే.. మన దేశంలో మాత్రం జోరు కొనసాగిస్తోంది. ఇండియాలో మాల్స్ కేవలం షాపింగ్ కేంద్రాలే కాదు వినోదం, ఆహారం వంటి సామాజిక అవసరాలను కూడా తీర్చే కేంద్రాలుగా మారాయి. దీంతో మన దేశంలో ఏటేటా రిటైల్ స్పేస్కు ఆదరణ పెరుగుతోంది. ఇండియాలో రిటైల్ రంగం వృద్ధిని సాధిస్తుంటే.. అమెరికాలో పతనం అవుతున్నాయి.మన దేశంలో 600 కంటే ఎక్కువ ఆపరేషనల్ మాల్స్ ఉన్నాయి. అయితే ఇందులో వంద కంటే తక్కువ మాల్స్ మాత్రమే గ్లోబల్ ఫండ్స్ను ఆకర్షించే సంస్థాగత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ కొరతే ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు దేశీయ మాల్స్లో పెట్టుబడులకు ప్రధాన కారణం. అధిక రాబడి, యువ వినియోగదారుల డిమాండ్, సంస్థాగత పెట్టుబడిదారుల్లో విశ్వాసం కారణంగా భారత రిటైల్ రంగంలో జోరు పెరిగింది. పరిమిత స్థాయిలో వ్యవస్థీకృత రిటైల్ మార్కెట్, సరళమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) విధానాలు, విదేశీ బ్రాండ్లు, పెట్టుబడిదారులు రిటైల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో దేశీయ రిటైల్ రంగం 3.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తోందని అనరాక్ గ్రూప్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది.పాశ్చాత్య దేశాల్లో పతనం.. పాశ్చాత్య దేశాలలో మాల్స్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కొత్త మాల్స్ స్టోర్లలో 78 శాతం పెరుగుదల ఉన్నప్పటికీ.. 2020 నుంచి నికర మాల్ స్టోర్ మూసివేతలు పెరుగుతున్నాయి. అమెరికాలో రికార్డ్ స్థాయిలో 1,200 మాల్స్ మూతపడ్డాయి. ఉన్న మాల్స్లో దాదాపు 40 శాతం ఖాళీలు ఉన్నాయి. అదే మన దేశంలో 2021 నుంచి ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల మధ్యకాలంలో 88కు పైగా విదేశీ బ్రాండ్లు భారత రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించాయి. గ్రేడ్–ఏ మాల్స్ కోసం మరిన్ని అన్వేషణలో ఉన్నాయి. దాదాపు పూర్తి ఆక్యుపెన్సీలో ఉన్న గ్రేడ్–ఏ మాల్స్లో 95–100 శాతం లీజులు పూర్తయ్యాయి. కీలక జోన్లో రిటైల్ స్థలం కోసం దుకాణదారులు ఎదురుచూస్తున్నారు.తలసరి రిటైల్ స్పేస్.. మన దేశంలో తలసరి రిటైల్ స్టాక్ ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. భారత తలసరి రిటైల్ స్టాక్ ప్రథమ శ్రేణి నగరాల్లో కేవలం 4–6 చదరపు అడుగులుగా ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 2–3 చ.అ.లుగా ఉంది. ఇక, గ్రేడ్–ఏ మాల్స్లో తలసరి స్థలం కేవలం 0.6 చ.అ.గా ఉంది. అదే అమెరికాలో సగటు తలసరి రిటైల్ స్థలం 23 చ.అ., చైనాలో 6 చ.అ.లుగా ఉన్నాయి.రిటైల్లో రాబడి.. యువ జనాభా, పెరుగుతున్న ఆదాయాలు, వేగవంతమైన పట్టణ విస్తరణ కారణంగా భారతదేశం 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్ల వినియోగ స్థాయిని చేరుకునే దిశగా పయనిస్తోంది. దేశంలో గ్రేడ్–ఏ రిటైల్ ప్రాపర్టీలు ఏటా 14–18 శాతం రాబడి అందిస్తాయి. అదే పాశ్చాత్య దేశాలలో ఈ రాబడి దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంటుంది. మన దేశంలో నాణ్యమైన రిటైల్ స్థలం కొరతే డిమాండ్కు ప్రధాన కారణం. మన దేశంలో రోజుకు మాల్స్ ఫుట్ఫాల్స్ సగటున 20 వేలకంటే ఎక్కువగా ఉంటాయి. వీకెండ్లో అయితే 40 వేల కంటే అధికంగా ఉంటాయి. ఫుడ్ అండ్ బేవరేజెస్, ఎంటర్టైన్మెంట్ స్పేస్లలో ఫుట్ ఫాల్స్ 30–35 శాతం వాటాలను కలిగి ఉంటాయి. దీంతో ఆన్లైన్ రిటైల్ ప్రభావం భౌతిక మాల్స్పై ప్రభావం లేదు.ఫిజికల్ స్టోర్లు.. మన దేశంలో రిటైల్ స్టోర్లు ‘ఫిజికల్’గా మారుతున్నాయి. ఆఫ్లైన్ స్టోర్లు కస్టమర్లకు అనుభూతిని, విశ్వాసాన్ని పెంచే కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆన్లైన్ ఫ్లాట్ఫామ్లు డిమాండ్ను పెంచుతున్నాయి. మన దేశంలో ప్రముఖ డైరెక్ట్ టు కన్జ్యూమర్(డీ టూ సీ) బ్రాండ్లు ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ విక్రయాలను అధికంగా చేస్తుండటమే ఇందుకు ఉదాహరణ. అయితే మన దేశంలో ఈ–కామర్స్ వాటా 8 శాతంగా ఉంది. అదే చైనా, అమెరికాలో 20 శాతం కంటే అధికం. -
క్రూడాయిల్ ధరలు తగ్గినా.. తగ్గని పెట్రోల్, డీజిల్ రేట్లు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆశించిన స్థాయిలో తగ్గకపోవడం అనేది సామాన్యుడికి ఎప్పుడూ ఒక మిస్టరీగానే ఉంటుంది. ప్రస్తుత (2025) అధికారిక గణాంకాలు, గత దశాబ్ద కాలపు విశ్లేషణను పరిశీలిస్తే దీని వెనుక ఉన్న ఆర్థిక, రాజకీయ కారణాలు స్పష్టమవుతాయి.ప్రస్తుతం (డిసెంబర్ 2025 నాటికి) అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర సుమారు 60 - 70 డాలర్ల మధ్య ఊగిసలాడుతోంది. అయినప్పటికీ దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.103-రూ.110 మధ్య, డీజిల్ రూ.90 నుంచి రూ.98 మధ్య ఉంది.ధరలు తగ్గకపోవడానికి కారణాలుమన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు 50% నుంచి 55% వరకు పన్నులే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ను విధిస్తున్నాయి. చమురు ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి లేదా ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి పన్నులను పెంచుతోంది తప్ప, ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం లేదు.రూపాయి విలువ పతనంపదేళ్ల కిందట డాలర్తో పోలిస్తే రూపాయి విలువ సుమారు రూ.45-50 ఉంటే ప్రస్తుతం అది రూ.90కి చేరుకుంది. ముడి చమురును డాలర్లలోనే కొనుగోలు కాబట్టి, అంతర్జాతీయంగా ధరలు తగ్గినా బలహీనపడిన రూపాయి వల్ల మనం చెల్లించే మొత్తం తగ్గడం లేదు.చమురు కంపెనీల నష్టాల భర్తీగతంలో చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (IOCL, BPCL, HPCL) ప్రజలపై భారం పడకుండా ధరలను స్థిరంగా ఉంచుతాయి. అప్పుడు వాటికి కలిగిన నష్టాలను ఇలాంటి సమయాల్లో అంటే క్రూడ్ ధరలు తగ్గిన సమయంలో లాభాల రూపంలో భర్తీ చేసుకుంటున్నాయి.సెస్, సర్ఛార్జ్కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీలో అధిక భాగం సెస్ రూపంలో ఉంటోంది. దీని వల్ల వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది కేంద్ర ఖజానాకు అదనపు ఆదాయంగా మారుతోంది.10-15 ఏళ్ల కిందటి ధరలతో పోలికసుమారు 2010-2014 మధ్య కాలంలో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, అప్పటి రిటైల్ ధరలు ఇప్పటికంటే తక్కువగా ఉండేవి. 2010లో పెట్రోల్ ధరలను, 2014లో డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రించింది (Deregulation). అంతకుముందు ప్రభుత్వం రిఫైనరీ కంపెనీలకు భారీగా సబ్సిడీలు ఇచ్చేది. అందుకే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఎక్కువగా ఉన్నా దేశీయంగా ధరలు తక్కువగా ఉండేవి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన (రోడ్లు, హైవేలు) కోసం అవసరమైన నిధులను చమురుపై పన్నుల ద్వారా సేకరించడం ప్రారంభించింది.అంశం2011-2012 (సుమారు)2024-2025 (ప్రస్తుతం)ముడి చమురు ధర (బ్యారెల్)డాలర్లు 105 - 115డాలర్లు 65 - 75డాలర్తో రూపాయి విలువరూ.45 - రూ.50రూ.88 - రూ.89పెట్రోల్ ధర (లీటర్)రూ.63 - రూ.68రూ.103 - రూ.107డీజిల్ ధర (లీటర్)రూ.40 - రూ.45రూ.89 - రూ.94కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ (పెట్రోల్)సుమారు రూ.9.48సుమారు రూ.19 - రూ.21 క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా సామాన్యుడికి ఉపశమనం లభించకపోవడానికి ప్రధాన అడ్డంకి ప్రభుత్వాల పన్ను విధానం, రూపాయి బలహీనపడటం. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ (GST) పరిధిలోకి తీసుకువస్తే ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఆదాయాన్ని కోల్పోవడానికి ఇటు కేంద్రం, అటు రాష్ట్రాలు సిద్ధంగా లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి మూలకారణం.ఇదీ చదవండి: పొగమంచు గుప్పిట్లో విమానయానం -
చైనా కంపెనీ సరికొత్త రికార్డ్: 1.5 కోట్ల కారు విడుదల
భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో బీవైడీ కంపెనీ కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. ఈ వాహన తయారీ సంస్థ చైనాలోని జినాన్ ఫ్యాక్టరీలో 15 మిలియన్ల (1.5 కోట్లు) కారును విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఉత్పత్తి మాత్రమే కాకుండా.. బీవైడీ అమ్మకాలు ఎక్కువగానే ఉన్నాయి. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు కంపెనీ 4.182 మిలియన్ యూనిట్లను విక్రయించింది. ఈ అమ్మకాలు అంతకు ముందు ఏడాది కంటే 11.3 శాతం ఎక్కువ. చైనాలో మాత్రమే కాకుండా.. సంస్థ ఇతర దేశాల్లో కూడా లక్షల కార్లను విక్రయించినట్లు వెల్లడించింది. మొత్తం మీద బీవైడీ ఆరు ఖండాల్లో.. 119 దేశాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది.BYD అభివృద్ధికి టెక్నాలజీ ఆవిష్కరణలు ప్రధాన కారణం. 2025 మొదటి మూడు త్రైమాసికాలలో.. కంపెనీ పరిశోధన, అభివృద్ధి వ్యయం 43.75 బిలియన్ యువాన్లకు చేరుకుంది, ఇది అంతకు ముందు ఏడాది కంటే 31% ఎక్కువ. "ఎలిగాన్స్, ఇన్నోవేషన్, టెక్నాలజీ" వంటి వాటితో.. డెంజా మోడల్ ద్వారా సింగపూర్, థాయిలాండ్, మలేషియాతో సహా బహుళ ఆసియా మార్కెట్లలో కంపెనీ విజయవంతంగా ప్రవేశించింది.భారతదేశంలో బీవైడీ కార్లుఆట్టో 3 ఎలక్ట్రిక్ కారుతో.. భారతదేశంలో అడుగు పెట్టిన బీవైడీ కంపెనీ.. ఆ తరువాత సీల్, ఈమ్యాక్స్ 7, సీలియన్ 7 వంటి కార్లను లాంచ్ చేసింది. ఈ కార్లు దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతున్నాయి. ప్రత్యర్ధ కంపెనీలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాయి. -
పొగమంచు గుప్పిట్లో విమానయానం
ఉత్తర భారత దేశాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు విమాన ప్రయాణికులకు చుక్కలు చూపుతోంది. శీతాకాలం తీవ్రత పెరగడంతో విజబిలిటీ(Visibility-దృశ్యమానత) కనిష్ట స్థాయికి పడిపోయి, విమాన సర్వీసులు ఒక్కసారిగా రద్దయ్యాయి. ముఖ్యంగా ఇటీవల పెద్ద మొత్తంలో విమానాలు రద్దు చేసిన ఇండిగో ఈమేరకు మళ్లీ శనివారం (డిసెంబర్ 20) సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.80కి పైగా సర్వీసులు రద్దుప్రతికూల వాతావరణం కారణంగా శనివారం దేశవ్యాప్తంగా 80కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. అంతకుముందు శుక్రవారం కూడా ఢిల్లీ విమానాశ్రయం నుంచి 73 దేశీయ, అంతర్జాతీయ సర్వీసులతో కలిపి మొత్తం 79 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.రాంచీ, జమ్మూ, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం అత్యధికంగా ఉంది. ‘వాతావరణ పరిస్థితులను మేము నిశితంగా గమనిస్తున్నాం. మీ ప్రయాణం సురక్షితంగా సాగేలా మా బృందాలు కృషి చేస్తున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చే ముందే తమ విమాన స్థితిని (Flight Status) తనిఖీ చేసుకోవాలి’ అని ఇండిగో తన తాజా అడ్వైజరీలో పేర్కొంది.ఢిల్లీలో ‘లో విజిబిలిటీ’ అలర్ట్దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పొగమంచు ధాటికి విలవిలలాడుతోంది. విమానాశ్రయంలో ‘లో విజిబిలిటీ ప్రొసీజర్స్’ అమలులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ, దృశ్యమానత తగ్గితే మరిన్ని విమానాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.గోవాలో ఊరటఉత్తరాది అంతా పొగమంచుతో ఇబ్బంది పడుతుంటే పర్యాటక రాష్ట్రం గోవాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. డిసెంబర్ 20న గోవా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడవాల్సిన 38 ఇండిగో విమానాలు ఎటువంటి ఆటంకం లేకుండా షెడ్యూల్ ప్రకారం నడుస్తుండటం ప్రయాణికులకు కొంత ఊరటనిస్తోంది.pic.twitter.com/dymwYz9P3v— Goa International Airport, Dabolim (@aaigoaairport) December 20, 2025 -
పదకొండేళ్ల బైక్కి కేటీఎం బై బై..
ప్రముఖ ప్రీమియం ద్విచక్రవాహన సంస్థ కేటీఎం తమ పాపులర్ కేటీఎం ఆర్సీ390 బైక్కు వీడ్కోలు పలకనుంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గిన కారణంగా ఆర్సీ390 బైక్ మోడల్ను నిలిపిపేయాలని నిర్ణయించుకుంది. ఎంసీఎన్ నివేదిక ప్రకారం.. సింగిల్-సిలిండర్ బైక్కు మార్కెట్లో తగినంత డిమాండ్ లేదు. దీంతో పాటు యూరో5+ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా 373 సీసీ ఇంజిన్ను నవీకరించాలంటే అయ్యే ఖర్చుతో దాని ధర భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఉత్పత్తిని ఇక ఆపేయడం మంచిదనే నిర్ణయానికి ఆస్ట్రియా బైక్ కంపెనీ వచ్చేసినట్లు తెలుస్తోంది.దశాబ్దంపైనే..కేటీఎం ఆర్సీ390 మొట్టమొదటిసారిగా 2014 లో భారత మార్కెట్లో విడుదలైంది. అప్పటి నుండి, ఈ సంవత్సరం తాజా అప్డేట్లో కలిసి రెండుసార్లు అప్డేట్ అయింది. మార్కెట్లో సుమారు 11 సంవత్సరాలపాటు తన ఉనికిని కాపాడుకున్న మిడిల్ వెయిట్ స్పోర్ట్స్ బైక్ మంచి అమ్మకాలనే నమోదు చేస్తూ ప్రత్యర్థి కంపెనీ మోడళ్లకు గట్టి పోటీనే ఇచ్చింది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ నుంచి తప్పుకోకతప్పడం లేదు.భారత్లో మాత్రం ఇంకొన్నాళ్లుఅంతర్జాతీయంగా ఆర్సీ390 బైక్ను నిలిపేస్తున్న కేటీఎం.. యూరోపియన్ మార్కెట్, యూకే డీలర్ షిప్ లలో ప్రస్తుతం ఉన్న స్టాక్ను 2026 వరకు విక్రయించనుంది. అయితే భారత మార్కెట్లో కేటీఎం ఆర్సీ390 బైక్ ఇంకొన్నాళ్లు కొనసాగుతుంది. సరిపడినంత డిమాండ్ ఇక్కడ ఇంకా ఉండటమే ఇందుకు కారణం. కేటీఎం మాతృ సంస్థ అయిన బజాజ్ ఆటో గొడుగు కింద ఈ బైక్ భారత మార్కెట్లో తయారవుతుండటం దీనికి అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తోంది.కేటీఎం ఆర్సీ390 బైక్ ధర భారతదేశంలో ధర రూ .3.22 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా ప్రస్తుతం, బ్రాండ్ అధికారిక వెబ్ సైట్ నుండి ఈ మోటార్ సైకిల్ ధరను కంపెనీ తొలగించింది. ఇది 373 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్తో, ఆరు-స్పీడ్ ట్రాన్స్ మిషన్తోనడుస్తుంది. 43 బీహెచ్పీ శక్తిని, 37 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. -
భారతీయ కస్టమర్లు ‘స్ట్రిక్ట్ టీచర్లు’ లాంటివారు
సాఫ్ట్వేర్ దిగ్గజం జోహో అధినేత శ్రీధర్ వెంబు సోషల్ మీడియా వేదికగా భారతీయ మార్కెట్ తీరుతెన్నులపై కీలక విశ్లేషణ చేశారు. భారతీయ వినియోగదారులు అంత సులభంగా సంతృప్తి చెందరని, వారు ఎప్పుడూ నాణ్యత, విలువల విషయంలో రాజీపడని ‘కఠినమైన ఉపాధ్యాయుల’ వంటి వారని ఆయన పేర్కొన్నారు.దేశీయ మార్కెట్లో రాణిస్తే అంతర్జాతీయంగా ఎగుమతుల్లో విజయం సాధించడం సులభమని ఒక వినియోగదారుడు చేసిన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్కు శ్రీధర్ వెంబు స్పందించారు. ‘భారతీయ కొనుగోలుదారుల అంచనాలను అందుకుని మీరు మనుగడ సాగించగలిగితే ప్రపంచ మార్కెట్ మీకు చాలా సులభం అవుతుంది. మీ ఉత్పత్తి బాగుంటే ఎక్కువ ఆలోచించకుండా ప్రపంచ దేశాల్లోకి తీసుకెళ్లండి’ అని చెప్పారు.స్కూల్ టీచర్తో పోలికఈ సందర్భంగా తన పాఠశాల రోజులను గుర్తు చేసుకున్న వెంబు తన స్కూల్ టీచర్ పరిమళ జీతో భారతీయ కస్టమర్లను పోల్చారు. ‘నా టీచర్ పరిమళ గారు చాలా కఠినంగా ఉండేవారు. ఒకవేళ నాకు పరీక్షలో 95 శాతం మార్కులు వచ్చినా నేను తక్కువ పనితీరు కనబరుస్తున్నానని, ఇంకా కష్టపడాలని ఆమె అనేవారు. భారతీయ కస్టమర్లు కూడా సరిగ్గా అలాగే ఉంటారు. వారు 95 శాతంతో సంతృప్తి చెందరు. అత్యుత్తమమైన దాని కోసమే చూస్తారు’ అని ఆయన వివరించారు.కస్టమర్లు కఠినంగా ఉండటం కంపెనీలకు శాపమా అంటే.. కాదనే అంటున్నారు వెంబు. ‘మమ్మల్ని నిరంతరం అప్రమత్తంగా ఉంచుతున్నందుకు భారతీయ కస్టమర్లకు ధన్యవాదాలు. వారి కఠినమైన వైఖరి వల్లే మేము మరింత కష్టపడి, మెరుగైన ఉత్పత్తులను తయారు చేయగలుగుతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. వినియోగదారుల ఒత్తిడి కారణంగానే జోహో తన మెసేజింగ్ యాప్ ‘అరట్టయ్’(Arattai)లో గోప్యతకు పెద్దపీట వేస్తూ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ను వేగంగా తీసుకువచ్చినట్లు ఆయన ఉదాహరణగా చెప్పారు.జపాన్ వర్సెస్ ఇండియాభారత మార్కెట్ కంటే జపాన్ మార్కెట్ కఠినంగా ఉంటుందనే వాదనను ఆయన ప్రస్తావిస్తూ.. జపనీస్ కంపెనీలు తమ దేశీయ కస్టమర్లు చాలా డిమాండింగ్ అని చెప్పుకుంటాయని, అయితే భారతీయ వినియోగదారులు కూడా ఏమాత్రం తక్కువ కాదని ఆయన స్పష్టం చేశారు. నియంత్రణ అనుమతులు పొందడం లేదా వినియోగదారుల అవసరాలను తీర్చడం వంటి విషయాల్లో భారత మార్కెట్ సవాలుతో కూడుకున్నదైనా అది సంస్థలను ప్రపంచ స్థాయికి ఎదగడానికి సిద్ధం చేస్తుందని ఆయన విశ్లేషించారు.ఇదీ చదవండి: డబ్ల్యూటీఓలో భారత్పై చైనా ఫిర్యాదు -
అబ్బే.. రూ.అరకోటి ఇళ్లా!! మారిన డిమాండ్
నాలుగు గోడలు, పైకప్పుతో ఉండే సాధారణ ఇళ్లకు కాలం చెల్లింది. ప్రైవసీ, ఆధునిక వసతులు ఉండే విలాసవంతమైన ఇళ్లకు ఆదరణ పెరుగుతోంది. ఏడాది కాలంలో దేశంలోని 8 ప్రధాన నగరాలలో 87,605 ఇళ్లు అమ్ముడుపోగా.. ఇందులో రూ.10–20 కోట్ల ధర ఉండే లగ్జరీ యూనిట్ల విక్రయాలు 170 శాతం వృద్ధి చెందగా.. రూ.50 లక్షలలోపు ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్ అమ్మకాలు 16 శాతం తగ్గాయి. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టే డెవలపర్లు కూడా ప్రీమియం ఇళ్ల నిర్మాణానికే మొగ్గు చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ.. స్థిరమైన దేశీయ వినియోగం, ప్రభుత్వ మూలధన వ్యయం కారణంగా భారత ఆర్థిక దృక్పథం స్థిరంగా ఉంది. కరోనా తర్వాత నుంచి విలాసవంతమైన ఇళ్లకు గిరాకీ పెరిగింది. విస్తీర్ణమైన గదులు, ఆధునిక వసతులు, గ్రీనరీ, ఆహ్లాదకరమైన వాతావరణం వంటి కారణంగా లగ్జరీ గృహాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని విలాసవంతమైన ఇళ్లలో 45 శాతం ఐదేళ్లలో వచ్చినవే..పర్యావరణ అనుకూలమైన, ఇంధన సమర్థవంతమైన నివాసాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇవే స్థిరాస్తి రంగంలో స్థిరమైన అభివృద్ధికి కీలకంగా మారాయి. దేశంలోని లగ్జరీ గృహ విక్రయాలలో 10 శాతం వాటాతో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నైల కంటే భాగ్యనగరంలోనే విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఎక్కువగా ఉండటం గమనార్హంఈ ప్రాంతాలు హాట్స్పాట్స్.. లగ్జరీ గృహ విక్రయాలకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, రాయదుర్గం, కోకాపేట, నియోపోలిస్ ప్రాంతాలు హాట్స్పాట్లుగా మారాయి. ఆయా ప్రాంతాల్లో రూ.20–40 కోట్ల మధ్య ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల విక్రయాలు సైతం నమోదవుతుండటం దీనికి ఉదాహరణ. -
సృజనాత్మకత, గోప్యతకు పెద్దపీట.. యూజర్ నియంత్రణకే ప్రాధాన్యం
డిజిటల్ ప్లాట్ఫామ్స్ క్రియేటర్ల సంక్షేమాన్ని, వినియోగదారుల గోప్యతను పరిగణించకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో వీరీల్స్(Vreels) క్రియేటర్లకు ప్రాధాన్యమిస్తూ, విశ్వసనీయమైన, సృజనాత్మకమైన ప్లాట్ఫామ్గా రూపొందుతోంది. భారత్లోని క్రియేటర్ ఎకానమీని అభివృద్ధి చేయడం, సురక్షిత వాతావరణం, ఆదాయం అవకాశాలు, క్రియేటర్ల కోసం సమగ్ర మద్దతు అందించడం వీరీల్స్(Vreels) ప్రత్యేకత.క్రియేటర్లతో నేరుగా చర్చలుసోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సాధారణంగా ఫీచర్లను రూపొందించిన తర్వాతే వినియోగదారుల అభిప్రాయాన్ని తీసుకుంటాయి, కానీ Vreels (www.vreels.com) టీం భారత్లోని క్రియేటర్లను నేరుగా కలిసి మీటప్స్, కమ్యూనిటీ చర్చలు నిర్వహిస్తోంది. క్రియేటర్లు కోరుకునేది ఏమిటో గ్రహించడం.. సృజనాత్మక స్వేచ్ఛ, గుర్తింపు, నైతిక విలువలు, ఆదాయం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే టూల్స్ వంటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్లాట్ఫామ్ను రూపొందించినట్లు చెప్పింది.కళాశాలల్లో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంకళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ప్రతిభను కనుగొనడంలో Vreels ముందడుగు వేస్తోంది. కంటెంట్ పోటీలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను, సృజనాత్మకతను ఎలాంటి భయం లేకుండా వ్యక్తపరిచే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా, Vreels గోప్యత, భద్రతపై అత్యంత దృష్టి పెట్టడం వల్ల యూజర్లు తాము సృష్టించిన కంటెంట్పై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. ఇది ఇతర పెద్ద ప్లాట్ఫామ్స్లో సాధ్యం కాని విషయమని వీరీల్స్ చెప్పింది. యూజర్లు తమ ప్రొఫైల్లో వారి విశ్వవిద్యాలయం లేదా కళాశాల పేరును అప్డేట్ చేస్తే భవిష్యత్తులో వీరీల్స్ ద్వారా వారు తమ కళాశాల లేదా ఇతర కళాశాలల విద్యార్థులతో సులభంగా కనెక్ట్ కావొచ్చు. తమ నెట్వర్క్ను విస్తరించుకోవచ్చు.సులభమైన ఆదాయ అవకాశాలుVreels ప్లాట్ఫామ్లో 10,000 ఫాలోవర్స్ను చేరిన యూజర్లు తమ ఖాతాను మోనిటైజ్ చేయడానికి అర్హత పొందుతారు. ముఖ్యంగా, ఎవరైతే 10,000 ఫాలోవర్స్ చేరుకుంటారో వారికి రూ.10,000 చెక్కు అందిస్తామని వీరీల్స్ తెలిపింది. దీనికి ఎలాంటి పరిమితి లేదని చెప్పింది. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న ఈ విధానంలో భవిష్యత్తులో మార్పులు చేయవచ్చని తెలిపింది.Vreels షాప్.. 2026 క్యూ1లో ప్రారంభంVreels షాప్ 2026లో ప్రారంభం కానుంది. ప్రారంభ విక్రేతలు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ పొందగలుగుతారు. ఇది చిన్న వ్యాపారాలు, బ్రాండ్లకు కొత్త ఆదాయ అవకాశాలను తెరుస్తుంది.వీడియోలు వీక్షిస్తూ దీని ద్వారా ప్రోడక్ట్స్ కొనవచ్చు లేదా మెరుగైన ధరల కోసం బిడ్డింగ్ వేయవచ్చు.వ్యాపారవేత్తలు తమ రీల్స్, ఫోటోలు, కథల ద్వారా బ్రాండ్ను ప్రోత్సహించి, ఆదాయాన్ని పొందవచ్చని వీరీల్స్ చెప్పింది.నమ్మకమైన ఈ సిస్టమ్ ద్వారా వెండర్లు తమ ఉత్పత్తులను భద్రంగా విక్రయించవచ్చని పేర్కొంది. వినోదం, వాణిజ్యం కలిసే కొత్తదనాన్ని అనుభూతి చెందవచ్చని తెలిపింది.దీనిపై మరిన్ని విశేషాలు త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.మెమొరీ క్యాప్సుల్.. ప్రత్యేకమైన, వ్యక్తిగత డిజిటల్ అనుభవంVreels లోని మెమొరీ క్యాప్సుల్ ఫీచర్ ఏ ఇతర ప్లాట్ఫామ్లో లేని ప్రత్యేకమైన ఫీచర్. యూజర్లు ప్రత్యేక కంటెంట్ను రహస్యంగా భద్రపరిచి, నచ్చిన వారికి తీపిగుర్తుగా సర్ప్రైజ్ అందించవచ్చు. ఇది కేవలం మీరు ఎంపిక చేసిన వ్యక్తికి మాత్రమే కనిపిస్తుంది. దీని కారణంగా Vreels కేవలం సాధారణ సోషల్ మీడియా వేదిక లాగా కాకుండా వినియోగదారులకు ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవాలను అందించే వేదికగా కూడా ఉంటుంది.ఈ ఫీచర్ ద్వారా మీరు మీ జ్ఞాపకాలను భద్రంగా ఉంచి, కావలసిన సమయానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, ప్రత్యేక సందర్భాల కోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయవచ్చు. వర్చువల్ టైమ్ లాక్ సిస్టమ్ వల్ల మీరు సృష్టించిన జ్ఞాపకాలు సరైన సమయంలో మాత్రమే బయటకు వస్తాయి.Reels, చాట్, కాల్స్, PixPouch..వీరీల్స్ Reels, చాట్, కాల్స్, PixPouch.. అన్ని అనుభవాలను ఒకే వేదికలో అందిస్తోంది. ఇందులో షార్ట్ వీడియోలు, రియల్ టైం చాట్, వాయిస్/వీడియో కాల్స్, PixPouch ద్వారా ఫోటోలు సులభంగా సేకరించటం వంటి ఫీచర్లున్నాయి. ఇది వినియోగదారులకు సృజనాత్మక స్వేచ్ఛ, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది.గోప్యత, డేటా భద్రతకు మొదటి ప్రాధాన్యతVreelsలో డేటా భద్రత, గోప్యత ముఖ్య ప్రమాణాలు. ఇతర ప్లాట్ఫామ్లు వినియోగదారుల డేటాపై సరైన జాగ్రత్త చూపడంలో విఫలమవుతున్నాయి. కానీ Vreels వినియోగదారులకు వారి కంటెంట్పై పూర్తి నియంత్రణ, రక్షణ, భద్రతా సౌలభ్యాలను ప్రధానంగా అందిస్తుంది. యూజర్ల డేటాను ఎవరు చూడాలో అనే పూర్తి నియంత్రణ కూడా తమ చేతుల్లోనే ఉంటుంది.డేటా లీక్ భయం అనవసరంఈ రోజుల్లో AI ఆధారిత డేటా లీక్ భయం పెరుగుతోంది. కానీ Vreelsలో ఎన్క్రిప్షన్ ద్వారా ప్రతి చాట్, వీడియో, ఫోటో, డేటా భద్రంగా ఉంటుందని కంపెనీ చెప్పింది. యూజర్ల వీడియోలు, ఫోటోలు, పోస్ట్లు.. ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో స్వయంగా పూర్తిగా నియంత్రించవచ్చు.స్థానిక ప్రతిభ నుంచి ప్రపంచ స్థాయి ప్రతిభ వరకుVreels ఇప్పటికే 22 దేశాల్లో బీటా వర్షన్ యాప్ను రిలీజ్ చేసింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. క్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికులైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.Vreels మీ డిజిటల్ జీవితానికి కొత్త అధ్యాయంక్రియేటర్ అయినా, షాపర్ అయినా, డిజిటల్ ప్రేమికుడైనా.. మీకు కావలసిన అన్ని అనుభవాలు Vreels ఒకే వేదికలో అందిస్తుంది.ఇప్పుడే ప్రయత్నించండిVreels: భారతీయ ఆలోచనకు ప్రపంచస్థాయి రూపం. మీ కొత్త అనుభవం ఇక్కడ ప్రారంభమవుతుంది.వెబ్సైట్: www.vreels.comకింద ఇవ్వబడిన మీకు నచ్చిన యాప్ స్టోర్ లింక్ల్లో ఈరోజే Vreels డౌన్లోడ్ చేసుకోండి.Android: https://play.google.com/store/apps/details?id=com.mnk.vreelsApple Store: https://apps.apple.com/us/app/vreels/id6744721098లేదాడౌన్లోడ్ కోసం కింద ఉన్న QR కోడ్ను స్కాన్ చేయండి. -
మరో కొత్త మార్కును దాటేసిన వెండి.. పసిడి మాత్రం..
దేశంలో వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. మరో కొత్త మార్కును దాటేశాయి. బంగారం ధరలు నిలకడగా కొనసాగి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Price) స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు అమాంతం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
డబ్ల్యూటీఓలో భారత్పై చైనా ఫిర్యాదు
అంతర్జాతీయ వాణిజ్య వేదికపై భారత్, చైనాల మధ్య విభేదాలు మరోసారి ముదిరాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ఉత్పత్తులు, సోలార్ రంగంలో భారత్ అందిస్తున్న సబ్సిడీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది భారత్కు వ్యతిరేకంగా చైనా డబ్ల్యూటీఓను ఆశ్రయించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.చైనా ప్రధాన ఆరోపణలుబీజింగ్లోని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భారత్ అనుసరిస్తున్న విధానాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని చైనా ఆరోపించింది. భారత ప్రభుత్వ చర్యలు నేషనల్ ట్రీట్మెంట్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఇది డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం నిషేధించిన దిగుమతి ప్రత్యామ్నాయ రాయితీలను అనుసరిస్తుందని పేర్కొంది. భారత్ తన దేశీయ పరిశ్రమలకు నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీలు ఇస్తూ చైనా ప్రయోజనాలను దెబ్బతీస్తోందని తెలిపింది. తద్వారా భారతీయ కంపెనీలకు అన్యాయమైన పోటీ ప్రయోజనం కలుగుతోందని వాదించింది. డబ్ల్యూటీఓ కట్టుబాట్లను గౌరవించి ఈ రాయితీలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదా సర్దుబాటు చేయాలని చైనా భారత్ను కోరింది.భారత్ వాదనచైనా ఫిర్యాదుపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఈ పరిణామాలపై అవగాహన ఉన్న ఉన్నతాధికార వర్గాల సమాచారం ప్రకారం.. అంతర్జాతీయ వాణిజ్యంలో దేశాలు పరస్పరం సబ్సిడీలు, సుంకాలను ప్రశ్నించుకోవడం సాధారణమేనని అభిప్రాయపడుతున్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి కొన్ని రంగాలు, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం (సోలార్), ఐటీ హార్డ్వేర్ రంగాలకు ప్రోత్సాహకాలు అవసరమని భారత్ చెబుతోంది. భారత్ ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్-పీఎల్ఐ) తయారీ రంగాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అవి నిబంధనలకు లోబడే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.వరుస ఫిర్యాదులతో పెరుగుతున్న ఉత్కంఠగత అక్టోబర్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), బ్యాటరీ రంగాల్లో భారత్ ఇస్తున్న సబ్సిడీలపై చైనా డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేసింది. గ్రీన్ ఎనర్జీ, హైటెక్ తయారీ రంగాల్లో ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగానే చైనా ఈ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం, రెండు దేశాలు సంప్రదింపుల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ చర్చలు విఫలమైతే డబ్ల్యూటీఓ వివాద పరిష్కార కమిటీ ఈ అంశంపై విచారణ జరుపుతుంది.ఇదీ చదవండి: ‘ఫ్లెక్స్’ క్రెడిట్ కార్డ్తో యూపీఐ చెల్లింపులు.. ప్రత్యేకతలివే.. -
‘ఫ్లెక్స్’ క్రెడిట్ కార్డ్తో యూపీఐ చెల్లింపులు.. ప్రత్యేకతలివే..
భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ పే, ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ సంయుక్తంగా ‘గూగుల్ పే ఫ్లెక్స్’ (Google Pay Flex) క్రెడిట్ కార్డును ప్రారంభించాయి. రూపే నెట్వర్క్తో పనిచేసే ఈ కార్డ్ వినియోగదారులకు నేరుగా యూపీఐ ఎకోసిస్టమ్ ద్వారా క్రెడిట్ సౌకర్యాన్ని అందించనుంది. ఇండియాలో ఇలాంటి కార్డు అందులోబాటులోకి తీసుకురావడం ఇదే మొదటిసారి.యూపీఐ సౌలభ్యం..ప్రస్తుతం భారత్లో యూపీఐ చెల్లింపులు సర్వసాధారణం అయ్యాయి. క్రెడిట్ కార్డును యూపీఐకి అనుసంధానించి చెల్లింపులు చేసే వెసులుబాటును ఈ కొత్త కార్డ్ మరింత సులభతరం చేస్తోంది. ప్రజలు ప్రతిరోజూ చేసే యూపీఐ చెల్లింపుల్లో క్రెడిట్ వినియోగాన్ని సులభతరం చేయడమే తమ లక్ష్యమని గూగుల్, యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులు సంయుక్త ప్రకటనలో తెలిపారు.ప్రత్యేకతలు ఇవే..ఈ కార్డు ద్వారా చేసే ప్రతి లావాదేవీకి రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.ఇందులో ఒక పాయింట్ ఒక రూపాయి నిష్పత్తిలో ఉంటుంది.పాయింట్ల రెడీమ్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా గూగుల్ పే ద్వారా తక్షణమే రీడీమ్ చేసుకోవచ్చు.ఈ కార్డు కోసం దరఖాస్తు చేయడం చాలా సులభం. ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా గూగుల్ పే యాప్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.ఆమోదం పొందిన నిమిషాల్లోనే వర్చువల్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది.పెద్ద మొత్తంలో చేసే ఖర్చులను వినియోగదారులు తమ గూగుల్ పే డాష్బోర్డ్ నుంచే నేరుగా ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. దీనివల్ల ఆర్థిక భారం తగ్గుతుంది.కార్డును బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం, పిన్ మార్చుకోవడం లేదా ఖర్చు పరిమితులను సెట్ చేసుకోవడం వంటివన్నీ గూగుల్ పే యాప్ నుంచే నిర్వహించవచ్చు.ఈ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ అండ్ పేమెంట్స్ హెడ్ ఆర్నికా దీక్షిత్ మాట్లాడుతూ.. ‘మారుతున్న భారతీయుల డిజిటల్ ఖర్చుల అలవాట్లను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించాం. యాక్సిస్ బ్యాంక్ బ్యాంకింగ్ నైపుణ్యం, గూగుల్ పే సాంకేతికత కలిసి వినియోగదారులకు భద్రతను, సౌకర్యాన్ని అందిస్తాయి’ అని పేర్కొన్నారు.భద్రతకు పెద్ద పీటభౌతిక కార్డులు పోతాయనే భయం లేకుండా ఈ ‘డిజిటల్-ఫస్ట్’ డిజైన్ భద్రతను పెంచుతుంది. గూగుల్ పే లో ఉండే బహుళ స్థాయుల ఆథెంటికేషన్ కారణంగా లావాదేవీలు సురక్షితంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. రూపే నెట్వర్క్ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది చిరు వ్యాపారుల వద్ద కూడా ఈ కార్డును స్కాన్ చేసి పేమెంట్స్ చేయవచ్చు. ముఖ్యంగా యువతను, టెక్నాలజీని ఎక్కువగా వాడే తరాన్ని లక్ష్యంగా చేసుకుని తెచ్చిన ఈ ‘ఫ్లెక్స్’ కార్డ్ క్రెడిట్ కార్డుల వాడకాన్ని మరింత పెంచుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రారంభంలో ఆశావాహం.. సవాళ్ల సుడిగుండం! -
ప్రారంభంలో ఆశావహం.. సవాళ్ల సుడిగుండం!
భారత పౌర విమానయాన చరిత్రలో 2025వ సంవత్సరం ఒక మరుపురాని అధ్యాయంగా మిగిలిపోనుంది. ఈ ఏడాది ఒకవైపు కుంభమేళా వంటి పండుగలతో ఆకాశమంత సంబరాన్ని చూసింది.. మరోవైపు ఘోర విమాన ప్రమాదాలు, సర్వీసుల రద్దుతో పాతాళమంత విషాదాన్ని మిగిల్చింది. అభివృద్ధి బాటలో పయనిస్తున్న దేశీయ ఏవియేషన్ రంగానికి ఈ ఏడాది ఎదురైన సవాళ్లు, భవిష్యత్తు పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.కుంభమేళా మెరుపులు.. అంతర్జాతీయ గౌరవంసంవత్సరం ప్రారంభంలో దేశీయ విమానయాన రంగం పరిస్థితి ఎంతో ఆశాజనకంగా ఉంది. జనవరి 13న ప్రయాగ్రాజ్లో ప్రారంభమైన కుంభమేళా విమానయాన రంగానికి ఊపునిచ్చింది. 45 రోజుల పాటు సాగిన ఈ వేడుక కోసం విమాన సంస్థలు అదనపు విమానాలను నడిపాయి. దీనివల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో దేశీయ ట్రాఫిక్ 10.35 శాతం వృద్ధి సాధించింది.మరోవైపు, 42 ఏళ్ల విరామం తర్వాత భారతదేశం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) 81వ వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్గా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది.ఎయిరిండియా విషాదం..జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 (AI171) ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. 242 మంది ప్రయాణికుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడటం అత్యంత విషాదకరం.ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైనదిగా భావించే బోయింగ్ 787 చరిత్రలో ఇది తొలి ప్రమాదం. ఈ ఘటనతో డీజీసీఏ బోయింగ్ 787 విమానాలపై కఠిన తనిఖీలను ఆదేశించింది. ఎయిర్ ఇండియా తన విమానాల భద్రతపై పునసమీక్ష చేపట్టింది.ఆర్థిక, ఇండిగో సంక్షోభంవిమాన ప్రమాదాలే కాకుండా భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా విమానయాన సంస్థలను దెబ్బతీశాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడంతో ఒక్క ఎయిరియండానే సుమారు రూ.4,000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అమెరికా, యూరప్ విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడం వల్ల ఇంధన ఖర్చులు, సిబ్బంది భారం పెరిగిపోయింది.ఇక దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు ఊహించని విధంగా ఉన్నపలంగా రద్దయ్యాయి. నవంబర్ మాసంలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు నమోదైనప్పటికీ పైలట్ల కొరత కారణంగా వందలాది విమానాలు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ‘ఇండిగో ఏకఛత్రాధిపత్యం అనేది మార్కెట్ వైఫల్యాల వల్ల ఏర్పడిందే తప్ప, ఒక పద్ధతి ప్రకారం జరిగిన అభివృద్ధి కాదు’ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భవిష్యత్తుపై ఆశలుఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ భారత విమానయాన రంగం కోలుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. దేశీయ విమానాల్లో ప్రయాణ డిమాండ్ బలంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విమానయాన కంపెనీలు స్మార్ట్ భాగస్వామ్యాల ద్వారా వృద్ధి సాధిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్ఐఏ) వంటి ప్రాజెక్టులు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో విమానయాన సామర్థ్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు.2025 సంవత్సరం భారత ఏవియేషన్ రంగానికి ఒక గట్టి హెచ్చరిక. భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం, పైలట్ల నిర్వహణలో వైఫల్యాలు, విదేశీ పరిణామాల ప్రభావం ఈ రంగాన్ని అతలాకుతలం చేశాయి. అయితే, కొత్త విమానాశ్రయాల నిర్మాణం, పెరుగుతున్న ప్రయాణ డిమాండ్ భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి.ఇదీ చదవండి: కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ -
ఎస్ఈఐఎల్ ఎనర్జీకి గ్రేట్ ప్లేస్ టు వర్క్ గుర్తింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వతంత్ర విద్యుదుత్పత్తి దిగ్గజాల్లో ఒకటైన ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఇండియా ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కించుకుంది. 2025–26 సంవత్సరానికి గాను ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ సరి్టఫికేషన్ లభించింది. ఉద్యోగానికి అనువైన సంస్థగా 86 శాతం మంది ఉద్యోగులు ఎస్ఈఐఎల్ని ఎంచుకున్నట్లు కంపెనీ తెలిపింది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ గుర్తింపును పొందడం వరుసగా ఇది రెండోసారని వివరించింది. వ్యక్తిగత జీవితం–ఉద్యోగం మధ్య సమతుల్యత, ఉద్యోగుల ఎదుగుదలకు అవకాశాల కల్పన తదితర అంశాలకు తాము అత్యంత ప్రాధాన్యమిస్తామని కంపెనీ సీఈవో జనమేజయ మహాపాత్ర తెలిపారు. -
తాజ్ జీవీకేలో ప్రమోటర్ల వాటా అప్
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టాటా గ్రూప్ దిగ్గజం ఇండియన్ హోటల్స్ కంపెనీ(ఐహెచ్సీఎల్) భాగస్వామ్య సంస్థ తాజ్ జీవీకేలోగల 25.52 శాతం వాటా విక్రయించనుంది. ప్రమోటర్లు జీవీకే–భూపాల్ కుటుంబానికి ఈ వాటాను అమ్మివేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐహెచ్సీఎల్ వెల్లడించింది. దీంతో ప్రమోటర్లుగా జీవీకే–భూపాల్ కుటుంబం తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్లో 74.99 శాతం వాటా పొందనుంది. కంపెనీ ఐదేళ్ల ప్రణాళిక(యాక్సెలరేట్ 2030)లో భాగంగా అసెట్లైట్ క్యాపిటల్ వ్యూహాలను అమలు చేయనున్నట్లు ఐహెచ్సీఎ ల్ ఎండీ, సీఈవో పునీత్ చత్వాల్ పేర్కొ న్నారు. వెరసి జీవీకే–భూపాల్ కుటుంబంతో దీర్ఘకాలిక మేనేజ్మెంట్ కాంట్రాక్టు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. కాగా.. భవిష్యత్ వృద్ధి అవకాశాలలో భాగంగా ఐహెచ్సీఎల్తో 2025 అక్టోబర్లో 256 గదుల తాజ్ యెలహంక (బెంగళూ రు) కోసం యాజమాన్య కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు తాజ్ జీవీకే హోటల్స్ జేఎండీ కృష్ణ భూపాల్ తెలియజేశారు. 2026లో ప్రారంభకానున్న ఈ హోటల్తోపాటు.. తాజ్ జీవీకే పోర్ట్ఫోలియోలో హైదరాబాద్లోని తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్, తాజ్ క్లబ్హౌస్ (చెన్నై), తాజ్ చండీగఢ్, వివాంతా హైదరాబాద్(బేగంపేట) ఉన్నాయి. -
రిలయన్స్ కన్జూమర్ చేతికి ఉదయమ్స్
చెన్నై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ తాజాగా తమిళనాడు సంస్థ ఉదయమ్స్లో మెజారిటీ వాటా సొంతం చేసుకుంది. అయితే వాటా కొనుగోలు విలువ వెల్లడికాలేదు. ఒప్పందం ప్రకారం ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్ ప్రయివేట్ లిమిటెలో గత ప్రమోటర్లు ఎస్.సుధాకర్, ఎస్.దినకర్ మైనారిటీ వాటాతో కొనసాగనున్నారు. ఉదయమ్ బ్రాండుతో మూడు దశాబ్దాలుగా తమిళనాడు మార్కెట్లో కంపెనీ పటిష్ట కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పంపిణీ నెట్వర్క్ ద్వారా బియ్యం, మసాలా దినుసులు, ఇడ్లీ నూక, స్నాక్స్ తదితర నిత్యావసరాలు విక్రయిస్తోంది. -
ఆకాశమే హద్దు
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ విమానాశ్రయాల బిజినెస్పై భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. రానున్న ఐదేళ్లలో ఇందుకు రూ. లక్ష కోట్లు వెచి్చంచనున్నట్లు అదానీ ఎయిర్పోర్ట్స్ డైరెక్టర్, బిలియనీర్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ పేర్కొన్నారు. ఈ నెల 25న నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశీ విమానాశ్రయ పరిశ్రమపై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు తెలియజేశారు. వెరసి తదుపరి 11 ఎయిర్పోర్టుల బిడ్డింగ్లో మరింత భారీగా పాలుపంచుకోనున్నట్లు వెల్లడించారు. దేశీయంగా ఏవియేషన్ రంగం వార్షిక పద్ధతిలో 15–16 శాతం విస్తరించవచ్చునని అంచనా వేశారు. గ్రూప్ విమానాశ్రయ పోర్ట్ఫోలియోలో నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఎన్ఎంఏఐఎల్) తాజాగా చేరనుంది. తద్వారా దేశీ ఏవియేషన్ రంగంలో కార్యకలాపాలు మరింత విస్తరించనుంది. ఎన్ఎంఏఐఎల్లో అదానీ గ్రూప్ వాటా 74% కాగా.. 2025 డిసెంబర్ 25న వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలకు తెరతీయనుంది. రూ. 19,650 కోట్లు అదానీ గ్రూప్ రూ. 19,650 కోట్ల తొలి దశ పెట్టుబడులతో ఎన్ఎంఏఐఎల్ను అభివృద్ధి చేసింది. వార్షికంగా 2 కోట్లమంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగల సామర్థ్యంతో ఏర్పాటైంది. తదుపరి సామర్థ్యాన్ని 9 కోట్లమంది ప్రయాణికులకు అనువుగా విస్తరించనుంది. తద్వారా ప్రస్తుతం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఎదుర్కొంటున్న సామర్థ్య సవాళ్లకు చెక్ పెట్టనుంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఎంఐఏఎల్)ను జీవీకే గ్రూప్ నుంచి అదానీ గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇవికాకుండా అదానీ గ్రూప్ అహ్మదాబాద్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, జైపూర్, మంగళూరులోనూ ఎయిర్పోర్టులను నిర్వహిస్తోంది. -
శ్రీరామ్ ఫైనాన్స్పై మిత్సుబిషి ఫోకస్
ఇటీవల దేశీ ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడులకు విదేశీ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో ఆర్బీఎల్ బ్యాంక్లో ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ మెజారిటీ వాటాను సొంతం చేసుకోగా, యస్ బ్యాంక్లో జపనీస్ దిగ్గజం ఎస్ఎంబీసీ సైతం 25 శాతం వాటా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో తాజాగా ఎన్బీఎఫ్సీ.. శ్రీరామ్ ఫైనాన్స్లో జపనీస్ దిగ్గజం ఎంయూఎఫ్జీ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ.. శ్రీరామ్ ఫైనాన్స్లో జపనీస్ దిగ్గజం మిత్సుబిషీ యూఎఫ్జే ఫైనాన్షియల్ గ్రూప్(ఎంయూఎఫ్జీ) 20 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు రెండు సంస్థలు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందుకు అనుగుణంగా శ్రీరామ్ ఫైనాన్స్ 47.11 కోట్ల ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఒక్కో షేరుకీ రూ. 840.93 ధరలో వీటిని ఎంయూఎఫ్జీ కొనుగోలు చేయనుంది. తద్వారా శ్రీరామ్ ఫైనాన్స్లో 4.4 బిలియన్ డాలర్లు(రూ. 39,618 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. వెరసి దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా ఇది నిలవనుంది. తాజా డీల్.. దేశీ ఫైనాన్షియల్ రంగ పటిష్టత, వృద్ధి అవకాశాలపట్ల విశ్వాసానికి ప్రతీకగా శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్చైర్మన్ ఉమేష్ రేవంకర్ పేర్కొన్నారు. వాటాదారుల అనుమతి, నియంత్రణ సంస్థల క్లియరెన్స్ల తదుపరి ఎంయూఎఫ్జీ వాటాను సొంతం చేసుకోనున్నట్లు శ్రీరామ్ ఫైనాన్స్ వెల్లడించింది. తాజా నిధులు సంస్థ మూలధన పటిష్టతకు, దీర్ఘకాలిక వృద్ధికి సహకరిస్తాయని తెలియజేసింది. ఎంయూఎఫ్జీతో భాగస్వామ్యం చౌక నిధుల సమీకరణ, మెరుగైన క్రెడిట్ రేటింగ్స్కు వీలు కలి్పంచడంతోపాటు, పాలన, నిర్వహణలో ప్రపంచ ప్రమాణాల సరసన నిలుపుతుందని పేర్కొంది. శ్రీరామ్ ఫైనాన్స్ వృద్ధికి మద్దతిచ్చేందుకు కట్టుబడి ఉన్నట్లు ఎంయూఎఫ్జీ గ్రూప్ సీఈవో హిరొనోరీ కమెజావా పేర్కొన్నారు. తద్వారా భారత్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తమవంతు పాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. ఇద్దరు డైరెక్టర్లు శ్రీరామ్ ఫైనాన్స్లో 20 శాతం వాటా చేజిక్కించుకున్నాక బోర్డులో ఇద్దరు డైరెక్టర్లను నియమించే ప్రణాళికల్లో ఉన్నట్లు ఎంయూఎఫ్జీ వెల్లడించింది. భారత్లో యొకొహామా స్పెసీ బ్యాంక్ ముంబై బ్రాంచ్తో 1,894లో కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థ 1.7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి కలి్పంచింది. గిఫ్ట్ సిటీలో బ్రాంచ్ ప్రారంభించిన తొలి జపనీస్ బ్యాంక్గా నిలుస్తోంది. 2023లో డిజిటల్ ఫైనాన్సియల్ సర్వీసులందిస్తున్న ఎన్బీఎఫ్సీ డీఎంఐ ఫైనాన్స్ ప్రయివేట్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేసింది. కాగా.. యూఏఈలో రెండో పెద్ద సంస్థ ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ ఈ ఏడాది అక్టోబర్లో దేశీ ప్రయివేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్లో 60 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 26,853 కోట్లు వెచి్చంచింది. అంతకుముందే మరో ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్లో జపనీస్ దిగ్గజం సుమితోమొ మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) 24 శాతానికిపైగా వాటాను సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 16,330 కోట్లకుపైగా వెచ్చించింది. -
ఇండస్ఇండ్లో వాటా పెంపు
ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ.. మరో ప్రయివేట్ రంగ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్లో వాటా పెంచుకునేందుకు తాజాగా వీలు చిక్కింది. ఇందుకు ఆర్బీఐ అనుమతించింది. దీంతో ఇండస్ఇండ్లో వాటాను 9.5 శాతంవరకూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పెంచుకోనుంది. వాటా పెంపునకు వీలుగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పెట్టుకున్న దరఖాస్తును ఆర్బీఐ తాజాగా ఆమోదించినట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ 9.5 శాతంవరకూ వాటా కొనుగోలు చేసేందుకు వీలుంటుందని తెలియజేసింది.వెరసి ఇండస్ఇండ్లో మొత్తం 9.5 శాతానికి మించకుండా చెల్లించిన మూలధనంలో వాటా లేదా వోటింగ్ హక్కులను హెచ్డీఎఫ్సీ సొంతం చేసుకోవచ్చునని పేర్కొంది. కాగా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అనుమతి లభించిన ఏడాదిలోగా వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుందని, లేకుంటే అనుమతులు రద్దవుతాయని వివరించింది. తాజా అనుమతికి ముందు 5 శాతంకంటే తక్కువ వాటా కలిగి ఉంటే.. మరో 5 శాతం(9.5 శాతంవరకూ) వాటాను సొంతం చేసుకోవలసి ఉంటుంది. అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ బోర్డులో దరఖాస్తుదారు(హెచ్డీఎఫ్సీ బ్యాంక్) రిప్రజెంటేషన్కు అనుమతించరు. -
ఎయిర్ పొల్యుషన్ ఎఫెక్ట్: BS6 vs BS4 వాహనాల మధ్య తేడా..
ఢిల్లీలో గాలి కాలుష్య విపరీతంగా పెరుగుతున్న సమయంలో.. బీఎస్4 వాహనాలపై నిషేధం విధించి, బీఎస్6 వాహనాలకు మాత్రమే అనుమతిస్తూ.. అక్కడి ప్రభుత్వం కఠినమైన నిబంధనలు జారీ చేసింది. అయితే ఇప్పుడు చాలామంది బీఎస్4 వాహనాలు ఏవి?, బీఎస్6 వాహనాలు ఏవి?.. వాటిని ఎలా గుర్తించాలి అనే విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.2020 ఏప్రిల్ వరకు బీఎస్4 వాహనాలనే కంపెనీలు తయారు చేసేవి. కానీ, ఆ తరువాత బీఎస్6 వాహనాలు తయారు చేయాలని.. వాహన తయారీ సంస్థలను భారత ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా వాయు కాలుష్యం తగ్గించడంలో భాగంగానే.. ఈ కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. ఈ నియమాన్ని పాటిస్తూ.. వాహన తయారీ సంస్థలు బీఎస్6 వాహనాలను తయారు చేయడం మొదలుపెట్టాయి.బీఎస్4 వాహనాలు vs బీఎస్6 వాహనాలుఅంశంBS-4 వాహనాలుBS-6 వాహనాలుకాలుష్యంఎక్కువచాలా తక్కువNOx ఉద్గారాలుఎక్కువ~60–70% తక్కువPM (ధూళి కణాలు)ఎక్కువ~80–90% తక్కువఇంధన సల్ఫర్ స్థాయి50 ppm10 ppmడీజిల్ DPFతప్పనిసరి కాదుతప్పనిసరిరియల్-టైమ్ ఎమిషన్ మానిటరింగ్లేదుఉంటుందినిర్వహణ ఖర్చుతక్కువకొంచెం ఎక్కువవాహన ధరతక్కువకొంచెం ఎక్కువనగరాల్లో అనుమతికాలుష్య సమయంలో ఆంక్షలుసాధారణంగా అనుమతిపర్యావరణ ప్రభావంప్రతికూలంఅనుకూలంBS-6 vs BS-4 వాహనాలను ఎలా గుర్తించాలంటే?మీ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) ద్వారా అది ఏ ఉద్గార ప్రమాణాలను అనుసరిస్తోందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎమిషన్ నార్మ్స్ / బీఎస్ నార్మ్స్ అనే కాలమ్లో BS-IV లేదా BS-4 వెహికల్ అని ఉంటుంది. దీనిని బట్టి మీ వాహనం ఏ కేటగిరికి చెందిందో ఇట్టే కనుక్కోవచ్చు. అంతే కాకుండా కొన్ని కంపెనీలు వాహనంపైనే బీఎస్6 లేదా బీఎస్4 అని మెన్షన్ చేసి ఉంటాయి.ఇదీ చదవండి: కొత్త రూల్స్.. లక్షల వాహనాలపై ప్రభావం! -
కొత్త రూల్స్.. లక్షల వాహనాలపై ప్రభావం!
ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సిర్సా, దేశ రాజధానిలో వాహన కార్యకలాపాలపై కొత్త ఆంక్షలను ప్రకటించారు. డిసెంబర్ 18 నుంచి బీఎస్4 వాహనాలు నగరంలో ప్రవేశించకూడదని వెల్లడించారు.ఢిల్లీ వెలుపల రిజిస్టర్ చేసుకున్న BS4, BS3 వాహనాల ప్రవేశంపై కఠినమైన పరిమితులను విధించారు. పాత పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాల వల్ల పెరుగుతున్న గాలి నాణ్యత సమస్యలను పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణ సామగ్రిని రవాణా చేసే ట్రక్కులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తన ప్రకటనలో హెచ్చరించారు. ఉల్లంఘనలకు పాల్పడితే ఈ వాహనాలపై జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా.. స్వాధీనం చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు.లక్షల వాహనాలపై ప్రభావం!ప్రధానంగా.. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ చేసుకున్న BS-VI కాని వాహనాల ప్రవేశాన్ని అక్కడి ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షల వాహనాలు ఢిల్లీలో ప్రవేశించకుండా చేస్తుంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన పాత పెట్రోల్ వాహనాలను కలిగి ఉన్న రోజువారీ ప్రయాణికులు ఈ నిషేధం వల్ల ప్రభావితమవుతారు.బీఎస్6 ప్రమాణాలు తప్పనిసరిఇప్పుడు ఢిల్లీలో తిరగాలంటే.. మీ వాహనం బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అనుగుణంగా ఉండాల్సిందే. 2020 ఏప్రిల్ తరువాత ఈ బీఎస్6 రూల్స్ అమలులోకి వచ్చాయి. కాబట్టి 2020 తరువాత తయారైన దాదాపు అన్ని వాహనాలు దీనికి అనుగుణంగా అప్డేట్స్ పొందాయి. బీఎస్6 వాహనాలు (పెట్రోల్, డీజిల్) మాత్రమే కాకుండా.. CNG, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు నగరంలో తిరగవచ్చు.మోటారు వాహనాల చట్టం ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానా విధిస్తారు. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే.. వాహనాలను జప్తు చేస్తారు. అంతే కాకుండా చెల్లుబాటు పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. లేకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్ -
50 సెకన్లలో ట్రైన్ టికెట్ బుకింగ్!
రైలు ప్రయాణం సర్వసాధారణం అయిపోయింది. అయితే ట్రైన్ జర్నీ కోసం టికెట్స్ బుక్ చేసుకోవడం మాత్రం చాలామందికి కష్టమే. అయితే కొంతమంది మాత్రం కొన్ని రెంటర్ సాఫ్ట్వేర్లను ఉపయోగించి.. టికెట్స్ బుక్ చేస్తున్నట్లు ఒక జాతీయ వార్తాపత్రిక కథనం వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సాఫ్ట్వేర్లు ఏవి?, వాటిని ఐఆర్సీటీసీ అరికట్టడం సాధ్యం కాదా?రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవాలంటే.. ఐఆర్సీటీసీ లేదా బుక్మైట్రిప్ వంటి కొన్ని నిర్దిష్ట యాప్స్ లేదా రైల్వే కౌంటర్స్ ఉపయోగించుకుంటారు. కానీ కొంతమంది ఏజెంట్స్ రెంటర్ సాఫ్ట్వేర్ల ద్వారా 50 సెకన్లలో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేస్తున్నారు. అంటే ప్రయాణికుడు IRCTC యాప్లోకి లాగిన్ అయ్యే సమయానికి, వాళ్లు(ఏజెంట్స్) టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నారన్నమాట..!సాఫ్ట్వేర్ డెవలపర్లు.. టికెట్స్ బుక్ చేసుకోవడానికి వీలుగా కొన్ని సాఫ్ట్వేర్లను క్రియేట్ చేస్తున్నారు. వాటి అద్దె నెలకు రూ.1200 నుంచి రూ.3200 వరకు ఉంటుంది. వీరు ఎప్పటికప్పుడు ఐపీ అడ్రస్లను కూడా మార్చేస్తూ ఉంటారు. ఐపీ అడ్రస్ల మార్పు కోసం మరికొంత మొత్తంలో డబ్బు చెల్లిస్తారు. ఎక్కువ మంది టెస్లా, గదర్, బ్రహ్మోస్, సూపర్ తత్కాల్, అవెంజర్ వంటి రెంటర్ సాఫ్ట్వేర్లను వాడుతున్నట్లు తెలుస్తోంది.సాధారణంగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో ప్రయాణికుడు మాన్యువల్గా టికెట్ బుక్ చేసుకున్నప్పుడు.. లాగిన్, రైలు ఎంపిక, ప్రయాణికుల వివరాలు, క్యాప్చా, చెల్లింపు వంటి ప్రక్రియలను స్వయంగా పూర్తిచేయాలి. ఈ సమయంలో, వేలాది మంది వినియోగదారులు సిస్టమ్లో ఏకకాలంలో యాక్టివ్గా ఉంటారు, ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయాల్లో చాలా మంది ప్రయాణికులు ఈ ప్రక్రియలో టిక్కెట్లు పొందలేకపోతున్నారు.అయితే ఏజెంట్లు మాత్రమే ఇందుకు భిన్నంగా.. ఆటోమేషన్/AI సాఫ్ట్వేర్ ఉపయోగించి పని కానిచ్చేస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ సాధారణ వినియోగదారులతో పోలిస్తే చాలా రెట్లు వేగంగా సర్వర్కు అభ్యర్థనలను పంపుతుంది. ఈ కారణంగా సాధారణ ప్రయాణికులు టికెట్స్ వేగంగా పొందలేరు. అయితే టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎక్కువ డబ్బు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్న ప్రయాణికులు.. ఈ తరహా అక్రమ సాఫ్ట్వేర్లను వినియోగించే ఏజెంట్స్ సాయం తీసుకుంటున్నారు.ఐఆర్సీటీసీ అరికట్టడం సాధ్యం కాదా?ఐఆర్సీటీసీ ఏజెంట్స్ ఉపయోగించే రెంటల్ సాఫ్ట్వేర్లను ఆరికట్టకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, చట్టపరమైన లొసుగులు. ఆటోమేషన్ అండ్ ఏఐ బేస్డ్ టికెట్ బుకింగ్ సాఫ్ట్వేర్కు సంబంధించి పూర్తిగా నిషేధించే కఠినమైన చట్టాలు లేవు. ప్రస్తుత సమాచార సాంకేతిక చట్టం, రైల్వే చట్టాలు, నిబంధనలు దీనిని పాక్షికంగా మాత్రమే నియంత్రిస్తున్నాయి. అందుకే.. కఠిన చర్యలు తీసుకునే వీలు లేకుండా పోతోంది. దీంతోపాటు.. టెక్నాలజీ మరో కారణంగా చెప్పవచ్చు. వేగంగా టిక్కెట్లు బుక్ చేసుకునే ఐపీ అడ్రస్లను భారతీయ రైల్వేలు బ్లాక్ చేస్తాయి. కానీ ఏజెంట్లు ఎప్పటికప్పుడు ఐపీలను మారుస్తారు. వీపీన్ను వినియోగిస్తారు. అంతేకాకుండా.. ఎప్పటికప్పుడు కొత్త యూజర్ ఐడీలు, పాస్వర్డ్లను ఉపయోగిస్తున్నారు. దీంతో.. ఈ సాఫ్ట్వేర్లను అరికట్టడం ఐఆర్సీటీసీకి సాధ్యం కావడం లేదు.ఇదీ చదవండి: మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్ -
200 దేశాలకు భారత ఔషధాలు!
భారత్ అంతర్జాతీయంగా నాణ్యమైన ఔషధాలను చౌక ధరలకే అందిస్తున్న విశ్వసనీయ భాగస్వామి అని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మాస్యూటికల్ ఎగుమతులు 10 శాతం వృద్ధితో 30.47 బిలియన్ డాలర్లకు చేరినట్టు చెప్పారు.చండీగఢ్లో ఫార్మా ఎగుమతులపై జరిగిన చర్చా కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్గా మాట్లడారు. ఔషధాల ఉత్పత్తిలో (పరిణామం పరంగా) భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా ఉందని, విలువ పరంగా 14వ స్థానంలో ఉందన్నారు. భారత ఔషధాలు 200కు పైగా దేశాలకు వెళుతున్నట్టు తెలిపారు. ఇందులో అమెరికాకు 34 శాతం, యూరప్కు 19 శాతం ఎగుమతి అవుతున్నట్టు చెప్పారు. 3,000కు పైగా కంపెనీలు, 10,500కు పైగా తయారీ యూనిట్లతో కార్యకలాపాలు నిర్వరహిస్తున్నట్టు వెల్లడించారు.సుంకాలేతర అవరోధాల పరిష్కారం, నియంత్రణపరమైన సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, పటిష్టమైన లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల ఎకోసిస్టమ్ ఏర్పాటుపై దృష్టి సారించినట్టు చెప్పారు. దేశీ ఫార్మా మార్కెట్ పరిమాణం 60 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, 2030 నాటికి రెట్టింపై 130 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. -
తొలిరోజే 70వేల బుకింగ్స్: ఈ కారుకు ఫుల్ డిమాండ్!
సరికొత్తగా ప్రవేశపెడుతున్న ప్రీమియం మిడ్ ఎస్యూవి ‘సియెరా’కి గణనీయంగా ఆదరణ లభిస్తున్నట్లు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స తెలిపారు. అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజునే 24 గంటల్లో ఏకంగా 70,000 పైగా ఆర్డర్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అదనంగా 1.35 లక్షల మంది కస్టమర్లు బుకింగ్ ప్రక్రియలో భాగంగా తమకు నచ్చిన కాన్ఫిగరేషన్ వివరాలను అందించినట్లు వివరించారు. మరింత విశాలంగా, విలాసవంతంగా, సౌకర్యవంతంగా లేటెస్ట్ సియెరాను తీర్చిదిద్దినట్లు ఆయన తెలిపారు.మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది. వాహన కొనుగోలు కోసం డిసెంబర్ 16 నుంచి బుకింగ్స్ ప్రారంభమ్యాయి. కొత్త ఏడాది జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్కు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్తో 12-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు.ఇదీ చదవండి: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?: ఇవి తెలుసుకోండివాహనం అన్ని వెర్షన్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇది 4.6 మీటర్ల వీల్ బేస్ తో 2.7 మీటర్ల వీల్ బేస్ ను కలిగి ఉంటుంది. టాటా సియెర్రా ఆరు ఎక్స్టీరియర్, మూడు ఇంటీరియర్ కలర్ స్కీమ్లలో వస్తోంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 447.55 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 84,929.36 వద్ద, నిఫ్టీ 150.85 పాయింట్లు లేదా 0.58 శాతం లాభంతో 25,966.40 వద్ద నిలిచాయి.ఆర్వీ లాబొరేటరీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, డీసీఎక్స్ సిస్టమ్స్, జీ లెర్న్, ప్రెసిషన్ కామ్షాఫ్ట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఉగార్ షుగర్ వర్క్స్, టెసిల్ కెమికల్స్ అండ్ హైడ్రోజన్, భగీరధ్ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్, అవధ్ షుగర్ & ఎనర్జీ, ది వెస్ట్రన్ ఇండియా ప్లైవుడ్స్ కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్
ఎనిమిది ఆర్ధిక పాఠాలు చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి'.. ఇప్పుడు తాజాగా లెసన్ 9 అంటూ తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. ఇందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు మరింత ధనవంతులు కావడం ఎలా?, అనే విషయం గురించి వెల్లడించారు.ఫెడ్ (FED) భవిష్యత్తు కోసం తమ ప్రణాళికలను ప్రపంచానికి తెలియజేసింది. వడ్డీ రేట్లను తగ్గించింది. భవిష్యత్తులో భారీగా డబ్బు ముద్రణ జరుగుతుందని, దీనిని కియోసాకి ఫేక్ మనీ ప్రింటింగ్ అని అభివర్ణించారు. ఈ ఘటనను లారీ లెపార్డ్ తన గొప్ప పుస్తకంలో "ది బిగ్ ప్రింట్" అని పిలిచారు.ప్రభుత్వాలు అతిగా డబ్బు ముద్రిస్తే దాని ఫలితం అధిక ద్రవ్యోల్బణం (Hyper-Inflation) అని అంటారు. ఇదే జరిగితే డబ్బు విలువ బాగా పడిపోతుంది. అవసరమైన వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. ప్రజల జీవితం చాలా ఖరీదవుతుంది. కాబట్టి నా సూచన ఏమిటంటే.. బంగారం, వెండి, బిట్కాయిన్, ఇథీరియం కొనండి.ఇదీ చదవండి: పాత రూ.500, రూ.1000 నోట్లు ఉంటే నేరమా.. జరిమానా ఎంత?గత వారం ఫెడ్ రేట్ల తగ్గింపును ప్రకటించిన వెంటనే నేను మరింత వెండిని కొన్నాను. వెండి ధర భారీగా పెరగనుంది. బహుశా 2026లో ఔన్సు రేటు 200 డాలర్లకు చేరవచ్చు. ఈ ధర 2024లో 20 డాలర్ల వద్ద మాత్రమే ఉంది. దీన్ని బట్టి చూస్తే సిల్వర్ రేటు ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.LESSON # 9: How to get richer as the world economy crashes.The FED just let the world know their plans for the future.The FED lowered interest rates…signaling QE (quantitative easing) or turning on the fake money printing press….What Larry Lepard calls “The Big Print” the…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 17, 2025 -
చిన్న సంస్థలకు ఏఐ దన్ను
కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు (ఎంఎస్ఎంఈ) గణనీయంగా ప్రయోజనం పొందేందుకు ఆస్కారం ఉంది. దీనితో వాటికి 500 బిలియన్ డాలర్లకు పైగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీఎక్స్), భారతీయ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్లో 6.4 కోట్ల ఎంఎస్ఎంఈల ముంగిట అపార అవకాశాలు ఉన్నాయని నివేదిక తెలిపింది.నివేదికలో మరిన్ని అంశాలు..కృత్రిమ మేథ వినియోగానికి సంబంధించి టాప్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంటున్నప్పటికీ, గ్లోబల్ ఏఐ పేటెంట్లలో వాటా మాత్రం 1 శాతం కన్నా తక్కువే ఉంటోంది. ఈ నేపథ్యంలో చిన్న సవాళ్ల పరిష్కారం కోసం ఏఐ ఆధారిత వ్యాపారాలను సృష్టించడంపై దృష్టి పెట్టాలి.ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ప్రాంతీయ వ్యవస్థలవ్యాప్తంగా ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్ ఉత్పాదకతపరమైన ప్రయోజనాలు పొందడం, నాణ్యమైన ఉద్యోగాలు కల్పించడంతో పాటు దీర్ఘకాలికంగా సామాజిక–ఆర్థిక పటిష్టతను సాధించవచ్చు. ఏఐపై ఆసక్తి, పెట్టుబడులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. దాదాపు 44 శాతం ఎగ్జిక్యూటివ్లు ఇప్పటికీ తమ టెక్నాలజీ బడ్జెట్లో ఏఐకి కేటాయిస్తున్నది 10% లోపే ఉంటోంది.ప్రధానంగా ఏఐ ఆధారిత వ్యాపారాలను నిర్మించడం, మరిన్ని ఆవిష్కరణలు చేయడం, వాటిని అందరికీ అందుబాటులోకి తేవడంలాంటి చర్యలతో కృత్రిమ మేథ పూర్తి సామర్థ్యాలను వినియోగించుకోవచ్చు.2026లో నిర్వహణ విధానాల్లో గణనీయంగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. నిర్దిష్ట విధుల నిర్వహణకు, ముందుగా ఏఐని వినియోగించుకోవడం పెరుగుతుంది.ఇదీ చదవండి: రూ.312 కోట్ల వేతన బకాయిలు విడుదల చేసిన ఈడీ -
రూ.312 కోట్ల వేతన బకాయిలు విడుదల చేసిన ఈడీ
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ (కేఏఎల్) మాజీ ఉద్యోగులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రూ.312 కోట్ల వేతన బకాయిలను కంపెనీ మాజీ ఉద్యోగులకు చెల్లించినట్లు అధికారికంగా ప్రకటించింది. చెన్నైలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) ఆదేశాల మేరకు ఈ మొత్తాన్ని అధికారిక లిక్విడేటర్కు ఈడీ బదిలీ చేసింది.గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియానికి ఈడీ అప్పగించిన షేర్ల విక్రయం ద్వారా వచ్చిన నిధుల నుంచే ఈ బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. సెక్యూర్డ్ క్రెడిటర్ల (బ్యాంకుల) క్లెయిమ్ల కంటే కార్మికుల బకాయిలకే ప్రాధాన్యత ఇవ్వడానికి ఎస్బీఐ అంగీకరించింది.మనీలాండరింగ్ కేసు నేపథ్యంవేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేయడంతో 2016లో విజయ్ మాల్యా లండన్కు పారిపోయారు. దీనిపై విచారణ చేపట్టిన ఈడీ, మాల్యాను జనవరి 2019లో పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ ఇప్పటివరకు మాల్యా, కింగ్ఫిషర్ సంస్థలకు చెందిన దాదాపు రూ.5,042 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి జప్తు చేసింది. అదనంగా రూ.1,695 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.రికవరీలో..ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు అనుమతితో జప్తు చేసిన ఆస్తులను ఈడీ బ్యాంకుల కన్సార్టియానికి అప్పగించింది. వీటి విక్రయం ద్వారా బ్యాంకులు ఇప్పటివరకు దాదాపు రూ.14,132 కోట్లు వసూలు చేసుకున్నాయి. ‘దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కార్మికుల బకాయిలను పరిష్కరించడానికి మేము వాటాదారులతో సమన్వయం చేసుకున్నాం. ఎస్బీఐ అధికారులతో చర్చించి పునరుద్ధరించిన ఆస్తుల ద్వారా ఉద్యోగుల క్లెయిమ్లను చెల్లించేలా చొరవ తీసుకున్నాం’ అని ఒక సీనియర్ ఈడీ అధికారి తెలిపారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడిన తర్వాత జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వేలాది మంది మాజీ ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది.ఇదీ చదవండి: సత్య సారథ్యంలో సమూల మార్పులు! -
సత్య సారథ్యంలో సమూల మార్పులు!
సాఫ్ట్వేర్ రంగంలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయిస్తోన్న మైక్రోసాఫ్ట్ ఇప్పుడు అత్యంత కీలకమైన పరివర్తనకు సిద్ధమైంది. కృత్రిమ మేధ (ఏఐ) కేవలం ఒక ఫీచర్గా మాత్రమే కాకుండా కంపెనీ ఉనికికి పునాదిగా మారుతోందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెసీ సీఈఓ సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ తన పనితీరును, సంస్కృతిని, భవిష్యత్తు వ్యూహాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది.బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఇకపై ఏఐని కేవలం ఉత్పత్తులకు అదనపు హంగుగా చూడటం లేదు. భవిష్యత్తులో రాబోయే ప్రతి ఉత్పత్తిని ఏఐ ఆధారంగానే తయారు చేయాలని భావిస్తుంది. ప్రస్తుత ఏఐ ప్రభావాన్ని ఒక ‘అరుదైన క్షణం’గా సత్య నాదెళ్ల అభివర్ణించారు. ఇది కేవలం సాఫ్ట్వేర్ అప్డేట్ వంటిది కాదని, కంపెనీకి ఇదో పూర్తి రీఇన్వెన్షన్గా మారే సమయమని అంతర్గత వర్గాలకు స్పష్టం చేశారు.పాత పద్ధతులకు స్వస్తి‘కంపెనీ ఉత్పత్తుల పరంగా చేసే పనుల్లో సత్య వేగాన్ని, అత్యవసరాన్ని (Urgency) కోరుకుంటున్నారు’ అని ఒక మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఈ వేగాన్ని అందుకోలేక పాత పని పద్ధతులకు అలవాటు పడిన కొందరు సీనియర్ ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఏఐ విప్లవంలో భాగస్వాములు కావాలా లేదా అన్నది తేల్చుకోవాలని నాదెళ్ల పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ‘మీరు దీన్ని ఎంతకాలం, ఎంత నిబద్ధతతో చేయాలనుకుంటున్నారో మీరే ప్రశ్నించుకోవాలి’ అని ఏఐలో వస్తున్న మార్పుల దృష్ట్యా ఉద్యోగులను ఉద్దేశించి ఆ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఉత్పత్తుల నిర్వహణలో జాప్యాన్ని తగ్గించడానికి నాదెళ్ల ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. మేనేజ్మెంట్ వ్యవస్థలపై ఆధారపడకుండా ఆయన నేరుగా ఇంజినీర్లు, ఇతర బృందాలతో సమావేశమవుతున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ -
కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ
ఒకవైపు ఆకాశాన్ని తాకే ఆడంబరపు అద్దాల భవనాలు.. మరోవైపు ఆ భవనాల నీడలోనే మగ్గిపోతున్న రేకుల షెడ్లు. ఒకరికి వేల కోట్ల సంపద ఎలా ఖర్చు చేయాలో తెలియని సందిగ్ధం.. మరొకరికి పూట గడవడానికి కావాల్సిన సరుకులు లేక విచారం. అంకెల్లో చూస్తే అభివృద్ధిలో ప్రపంచంలోనే దేశం పరుగులు పెడుతోంది కానీ, ఆ పరుగులో సామాన్యుడు మాత్రం వెనకబడిపోతున్నాడు. వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ బయటపెట్టిన తాజా వాస్తవాలు భారత్లో పెరుగుతున్న ఈ అగాధాన్ని కళ్లకు కడుతున్నాయి. ఇదే ఆర్థిక అసమానతలు కొనసాగితే సామాజిక అశాంతి పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారత ఆర్థిక వ్యవస్థ ఒక భారీ వృక్షంలా ఎదుగుతోంది. కానీ దాని ఫలాలు మాత్రం కొద్దిమందికే అందుతున్నాయి. దేశంలోని 1 శాతం మంది చేతుల్లోనే 40 శాతం సంపద పోగుపడటం అనేది కేవలం ఆర్థిక లెక్క మాత్రమే కాదు, అది కోట్ల మంది భారతీయుల నిస్సహాయతకు సాక్ష్యం. అభివృద్ధి అంటే కేవలం జీడీపీ పెరగడమేనా? లేక ఆ పెరిగిన సంపద పేదవాడి ఆకలిని తీర్చడమా? ఈ తరుణంలో పెరుగుతున్న అసమానతలపై విశ్లేషణ చూద్దాం.భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. జీడీపీ పరంగా మనం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. అయితే, ఈ గణాంకాల వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం.. పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాలు స్తంభించిపోవడం ఆందోళన కలిగిస్తోంది.గణాంకాలు ఏం చెబుతున్నాయి?వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలో అంతరాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశంలోని కేవలం 1 శాతం అత్యంత ధనవంతుల వద్దే 40 శాతం జాతీయ సంపద ఉంది. సంపదపరంగా టాప్లో ఉన్న 10 శాతం మంది జాతీయ ఆదాయంలో 58 శాతాన్ని పొందుతుండగా, దిగువన ఉన్న 50 శాతం మందికి కేవలం 15 శాతం ఆదాయం మాత్రమే దక్కుతోంది. ప్రస్తుత ఆదాయ అసమానతలు బ్రిటిష్ పాలన కాలం నాటి కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.ఆర్థిక అసమానతల వల్ల తలెత్తే పరిణామాలుఆదాయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నప్పుడు సమాజంలో అసంతృప్తి పెరుగుతుంది. ఇది నేరాలు పెరగడానికి, వర్గ పోరాటాలకు, పౌర అశాంతికి దారితీస్తుంది. మెజారిటీ ప్రజల వద్ద ఆదాయం లేకపోతే వారు నాణ్యమైన విద్య, వైద్యానికి దూరమవుతారు. ఇది దేశ భవిష్యత్తు శ్రామిక శక్తి నాణ్యతను తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ నడవాలంటే సామాన్యుల దగ్గర కొనుగోలు శక్తి ఉండాలి. కేవలం కొద్దిమంది ధనవంతుల ఖర్చుతో దేశ ఆర్థిక చక్రం పూర్తిస్థాయిలో తిరగలేదు. పేదరికం వల్ల మార్కెట్లో వస్తువులకు డిమాండ్ తగ్గి, ఉత్పత్తి రంగం దెబ్బతింటుంది. సంపద కేంద్రీకరణ వల్ల రాజకీయ అధికారం కూడా కొద్దిమంది ధనవంతుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది సామాన్యుల గొంతుకను నొక్కివేస్తుంది.నియంత్రించేందుకు మార్గాలుఅత్యంత ధనవంతులపై సంపద పన్ను(Wealth Tax) లేదా వారసత్వ పన్ను (Inheritance Tax) వంటివి విధించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమ పథకాలకు మళ్లించాలి.ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థలను బలోపేతం చేయడం వల్ల పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గుతుంది. ఇది వారిని పేదరికం నుంచి బయటపడేలా చేస్తుంది.కేవలం కార్పొరేట్ కంపెనీలకే కాకుండా భారీగా ఉపాధి కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలి.అసంఘటిత రంగంలోని కార్మికులకు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కనీస వేతనాలు అందేలా కఠినమైన చట్టాలు అమలు చేయాలి.ఇప్పటికీ దేశంలో సగం జనాభా ఆధారపడుతున్న వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ద్వారా గ్రామీణ ఆదాయాలను పెంచవచ్చు.చివరగా..ఆర్థిక వృద్ధి అనేది కేవలం అంకెల్లో కాకుండా సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ఫలాలను అందించినప్పుడే అది సమ్మిళిత వృద్ధి సాధ్యం అవుతుంది. భారతదేశం వికసిత్ భారత్గా మారాలంటే సంపద సృష్టించడమే కాదు, ఆ సంపద సమంగా పంపిణీ అయ్యేలా చూడటం అత్యవసరం. లేనిపక్షంలో ఈ ఆర్థిక అసమానతలు దేశ సుస్థిరతకు ముప్పుగా మారతాయని గమనించాలి.ఇదీ చదవండి: ఏఐ నియంత్రణపై భారత్ అడుగులు ఎటువైపు? -
ఏఐ నియంత్రణపై భారత్ అడుగులు ఎటువైపు?
ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక విప్లవంలా దూసుకుపోతోంది. పనులను సులభతరం చేస్తూనే, మరోవైపు డేటా గోప్యత, డీప్ఫేక్స్ వంటి రూపాల్లో సరికొత్త సవాళ్లను విసురుతోంది. సాంకేతికత అందించే ఫలాలను అందుకుంటూనే, దానివల్ల కలిగే అనర్థాలను అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో భారత్లో ఏఐని నియంత్రించడానికి ఉన్న చట్టపరమైన చట్రం, తాజా పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.భారత్లో ఏఐ నియంత్రణభారతదేశంలో ప్రస్తుతం ఏఐ కోసం ప్రత్యేకమైన ఏకీకృత చట్టం లేదు. అయినప్పటికీ, ప్రభుత్వం వివిధ ప్రస్తుత చట్టాలు, కొత్త మార్గదర్శకాల ద్వారా ఏఐ వినియోగాన్ని నియంత్రిస్తోంది. ఏఐ వ్యవస్థలు శిక్షణ పొందడానికి, పనిచేయడానికి భారీ మొత్తంలో డేటా అవసరం. ఈ డేటాను ఎలా సేకరించాలి, ఎలా వాడాలి అనే అంశాలను డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం (DPDP Act), 2023 నియంత్రిస్తుంది. ఏఐ మోడల్స్ వ్యక్తిగత డేటాను ఉపయోగించే ముందు సదరు వ్యక్తి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ చట్టం ప్రకారం డేటా ఉల్లంఘనలు జరిగితే ఏఐ సంస్థలపై భారీ జరిమానాలు (రూ. 250 కోట్ల వరకు) విధించే అవకాశం ఉంది.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టం, 2000, 2025 సవరణలుప్రస్తుతానికి ఐటీ చట్టమే డిజిటల్ రంగంలో ప్రాథమిక చట్టంగా ఉంది. 2025లో ప్రతిపాదించిన సవరణల ప్రకారం.. తప్పుదోవ పట్టించే ఏఐ కంటెంట్ లేదా డీప్ఫేక్స్ను నిరోధించే బాధ్యత సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లదే. ఏఐ ద్వారా సృష్టించిన కంటెంట్ను స్పష్టంగా గుర్తించేలా లేబులింగ్ చేయడం తప్పనిసరి.ఇండియా ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాలు 2025నవంబర్ 2025లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం.. ఏఐ వ్యవస్థలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండాలి. అధిక రిస్క్ ఉన్న ఏఐ అప్లికేషన్లపై కఠినమైన నిఘా అవసరం. స్టార్టప్లు ఏఐ సాంకేతికతను సురక్షితమైన వాతావరణంలో పరీక్షించుకునేలా ప్రోత్సహించాలి.బ్యాంకింగ్ రంగంలో ఏఐ వాడకంపై ఆర్బీఐ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ముఖ్యంగా లోన్ అప్రూవల్స్ వంటి వాటిలో ఏఐ వివక్ష చూపకూడదని స్పష్టం చేసింది.ప్రస్తుత చట్టాలు ఏఐకి పూర్తిస్థాయిలో సరిపోవని నిపుణుల అభిప్రాయం. అందుకే ప్రభుత్వం డిజిటల్ ఇండియా బిల్లును ప్రతిపాదిస్తోంది. ఇది రాబోయే రోజుల్లో ఏఐ నియంత్రణలో కీలక పాత్ర పోషించనుంది. భారత ప్రభుత్వం ఏఐ అభివృద్ధిని అడ్డుకోకుండానే ప్రజా భద్రత, గోప్యతను కాపాడటం అనే సమతుల్య విధానాన్ని అనుసరిస్తోంది. భవిష్యత్తులో ఏఐ కోసం మరింత సమగ్రమైన చట్టం వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ప్రపంచంలోని టాప్ 10 రిచ్ ఫ్యామిలీలు -
దిగొచ్చిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. దాంతోపాటు డాలర్తో పోలిస్తే రూపాయి ధరల్లో మార్పులు కూడా పసిడి ధరలు తగ్గేందుకు కారణంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


