Business
-
ఆరోగ్య బీమా.. భారం తగ్గేదెలా?
ఆరోగ్య అత్యవసర స్థితి చెప్పి రాదు. ఆహారం, నిద్ర వేళల్లో మార్పులు.. గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాల ప్రభావంతో జీవనశైలి వ్యాధుల రిస్క్ పెరిగింది. వీటి కారణంగా ఆస్పత్రి పాలైతే బిల్లులు చెల్లించడం మెజారిటీ వ్యక్తులకు అసాధ్యమే కాదు, ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి. ఇలాంటి అనిశ్చితులకు రక్షణ కవచమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. కరోనా తర్వాత వీటి ప్రీమియంలు దాదాపుగా రెట్టింపయ్యాయి. మోయలేనంత భారంగా మారాయి. ఇది చూసి ఇప్పటికీ హెల్త్ ప్లాన్కు దూరంగా ఉన్నవారు ఎందరో. కానీ, ప్రతి వ్యక్తికీ, ప్రతి కుటుంబానికీ ఇది తప్పనిసరి. కావాలంటే ప్రీమియం తగ్గించుకునే మార్గాన్ని వెతకండి. అంతేకానీ, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా రక్షణ కల్పించే హెల్త్ ఇన్సూరెన్స్కు దూరంగా ఉండొద్దనేది నిపుణుల మాట! ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) అధ్యయనం ప్రకారం.. దేశంలో 35 శాతం మంది హైపర్టెన్షన్ (అధిక రక్తపోటు)తో బాధపడుతున్నారు. 10 శాతం మందికి మధుమేహం సమస్య ఉంటే, 28 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ను ఎదుర్కొంటున్నారు. జీవనశైలి వ్యాధులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. మరోవైపు వైద్య రంగంలో అత్యాధునిక చికిత్సా విధానాలు.. మరింత కచ్చితత్వంతో, మెరుగైన ఫలితాలనిచ్చే రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వ్యయాలను అందరూ భరించలేరు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. హెల్త్ ఇన్సూరెన్స్ను వీలైనంత చిన్న వయసులోనే తీసుకోవాలి. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఖరారవుతుంది. వయసు, ఆరోగ్య చరిత్ర తదితర అంశాలను బీమా సంస్థ పాలసీ జారీకి ముందు మదింపు చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు విషయంలో.. 25 ఏళ్ల వయసు వ్యక్తికి, 40 ఏళ్ల వయసు వ్యక్తికి ప్రీమియంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. చిన్న వయసులో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటే, ఆ తర్వాతి కాలంలో ప్రీమియం పెరగదా? అన్న సందేహం రావచ్చు. 35 ఏళ్లు నిండిన తర్వాత, 45 ఏళ్లు, 55 ఏళ్లు, 60 ఏళ్లు నిండిన తర్వాత వయసువారీ ప్రీమియం రేట్లు కచ్చితంగా సవరణకు నోచుకుంటాయి. కానీ, 35–40 ఏళ్ల తర్వాత కొత్తగా పాలసీ తీసుకునే వారితో పోల్చితే, 25 ఏళ్లలోపు వారికి ప్రీమియం తక్కువే ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు తీసుకుంటే, మూడేళ్లలో అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్లు దాటేస్తారు. ముందస్తు వ్యాధులకు సైతం కవరేజీ అర్హత లభిస్తుంది. పైగా పాలసీ తీసుకుని 60 నెలలు (ఐదేళ్ల ప్రీమియం చెల్లింపులు) ముగిస్తే, ఆరోగ్య చరిత్రను సరిగ్గా వెల్లడించలేదనో, సమాచారం దాచిపెట్టారనే కారణంతో క్లెయిమ్ను బీమా సంస్థ తిరస్కరించడానికి కుదరదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ముందుగా తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలతోపాటు ప్రీమియం భారం తగ్గుతుంది. బోనస్, రీస్టోరేషన్ కేవలం రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్నే తీసుకున్నప్పటికీ అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా కవరేజీని పెంచుకునే మార్గాలు కూడా ఉన్నాయి. దాదాపు అన్ని బీమా కంపెనీలు నో క్లెయిమ్ బోనస్, రీస్టోరేషన్ ఫీచర్లను అందిస్తున్నాయి. ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతే 50–200 శాతం మేర సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ)ను నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా సంస్థలు ఇస్తుంటాయి. అప్పుడు రూ.5 లక్షల కవరేజీ రూ.10–15 లక్షలకు చేరుతుంది. రీస్టోరేషన్ సదుపాయం అన్నది.. హాస్పిటల్లో చేరినప్పుడు కవరేజీ పూర్తిగా అయిపోతే అంతే మొత్తాన్ని తిరిగి ఆ పాలసీ సంవత్సరానికి పునరుద్ధరించడం. కొన్ని బీమా సంస్థలు ఏడాదిలో ఒక్క రీస్టోరేషన్నే ఇస్తుంటే, కేర్, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ తదితర కంపెనీలు కొన్ని ప్లాన్లలో అపరిమిత రీస్టోరేషన్ సదుపాయాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల బేస్ సమ్ అష్యూర్డ్ తక్కువగా ఎంపిక చేసుకున్నప్పటికీ ఎలాంటి నష్టం ఉండదు. పైగా ప్రీమియం భారం తగ్గుతుంది. చిన్న క్లెయిమ్లకు దూరం ఏడాదిలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతేనే నో క్లెయిమ్ బోనస్ వస్తుంది. కనుక చిన్న క్లెయిమ్లకు దూరంగా ఉండాలి. ఉదాహరణకు రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్కు ఎలాంటి క్లెయిమ్ లేకపోతే ఏటా 50 నుంచి 100 శాతం చొప్పున సమ్ అష్యూర్డ్ పెరుగుతుంది. ఒకవేళ క్లెయిమ్ చేస్తే ఎంత అయితే పెరిగిందో, అంతే మేర తగ్గిపోతుంది. కనుక చిన్న క్లెయిమ్ కోసం రూ.2.5–5 లక్షల సమ్ అష్యూర్డ్ను ఒక ఏడాదిలో నష్టపోవాల్సి వస్తుంది. అందుకే రూ.50 వేల లోపు చిన్న వ్యయాలను సొంతంగా భరించడమే మంచిది. మంచి ఆహారం, జీవనశైలి.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా అన్న భరోసాతో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తామా? అలా చేయడం మన సమస్యలను మరింత పెంచుతుంది. మంచి ఆరోగ్యం కోసం తమ వంతు కృషి చేయాల్సిందే. దీనివల్ల ఆస్పత్రి పాలు కావడాన్ని సాధ్యమైన మేర నివారించొచ్చు. దీనివల్ల ప్రీమియం కూడా తగ్గుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో చాలా వరకు ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తే అంత ప్రయోజనం లభిస్తుంది. రోజువారీ నడక, పరుగు, ఏరోబిక్ వ్యాయా మాలు చేయడం ద్వారా హెల్త్ క్రెడిట్స్ పొందొచ్చు. వీటిని ప్రీమియంలో సర్దుబాటు చేసుకోవచ్చు. తద్వారా ప్రీమియంలో 100% రాయితీని సైతం కొన్ని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా పొగతాగడం, మద్యపానం, గుట్కా/జర్దాలకు దూరంగా ఉండాలి. ఈ అలవాట్ల గురించి ఆరోగ్య చరిత్రలో వెల్లడించాల్సిందే. వీటి కారణంగా ప్రీమియం గణనీయంగా పెరిగిపోతుంది. వీటిని మానేయడం ద్వారా ప్రీమియం తగ్గించుకోవచ్చు.సూపర్ టాపప్ నేటి రోజుల్లో నలుగురు సభ్యుల ఒక కుటుంబానికి కనీసం రూ.10 లక్షల హెల్త్ కవరేజీ ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇది కూడా చాలకపోవచ్చు. కానీ, రూ.10 లక్షల హెల్త్ ప్లాన్ కోసం 30 ఏళ్ల వ్యక్తి కుటుంబానికి రూ. 20 వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు రూ.5 లక్షల బేసిక్ ఇండెమ్నిటీ ప్లాన్ పరిశీలించొచ్చు. దీనికి అదనంగా రూ.5 లక్షల డిడక్టబుల్తో సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవాలి. ఉదాహరణకు రూ.50 లక్షల సూపర్ టాపప్ ప్లాన్ రూ.3,000కే వస్తుంది. ఇందులో మొదటి రూ.5 లక్షల బిల్లును మినహాయించి, ఆపై ఉన్న మొత్తానికి చెల్లింపులు లభిస్తాయి. రూ.10 లక్షల హెల్త్ ప్లాన్ ప్రీమియం అందుబాటు ధరలోనే వస్తే, అప్పుడు రూ.10 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలు లేదా రూ.కోటికి సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ వ్యక్తిగత రుణ చరిత్రకు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా?.. కొన్ని బీమా సంస్థలు మెరుగైన సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్లకు ప్రీమియంలో తగ్గింపు ఇస్తున్నాయి. ఎక్కువ స్కోరు ఉందంటే.. ఆర్థిక క్రమశిక్షణతో నడుచుకుంటున్నారని అర్థం. ఇలాంటి వారిని తక్కువ రిస్క్ కస్టమర్లుగా చూస్తూ ప్రీమియంలో డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. 15 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.ఆన్లైన్లో కొనుగోలు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ, ఫీచర్లపై అవగాహన కలిగిన వారు ఆన్లైన్లో కొనుగోలు చేయడం ద్వారా ప్రీమియంలో డిస్కౌంట్ పొందొచ్చు. పైగా పాలసీబజార్ పోర్టల్పై మొబైల్ ఓటీపీతో లాగిన్ అయ్యి, అన్ని బీమా సంస్థల పాలసీలను పరిశీలించొచ్చు. వాటి ఫీచర్లు, ప్రీమియం వ్యత్యాసాన్ని గమనించొచ్చు. తద్వారా మెరుగైన ఫీచర్లతో, తక్కువ ప్రీమియంతో ఉండే పాలసీని గుర్తించొచ్చు. బీమా సంస్థ పోర్టల్ ద్వారా నేరుగా పాలసీని కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల స్వయంగా వివరాలు నమోదు చేయడం, నియమ, నిబంధనల గురించి అవగాహన కూడా ఏర్పడుతుంది. కొంత రాజీపడితే? సదుపాయాల విషయంలో కొంత రాజీధోరణితో వెళ్లేట్టు అయితే అప్పుడు కూడా ప్రీమియం భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇందులో రూమ్ టైప్ ఒకటి. ఆస్పత్రిలో చేరినప్పుడు రోగికి ఐసీయూ వెలుపల పడక అవసరమవుతుంది. జనరల్ వార్డ్, షేరింగ్, సింగిల్ రూమ్, డీలక్స్ రూమ్ ఇలా పలు రకాలుంటాయి. పడక విషయంలో ఎలాంటి పరిమితుల్లేని పాలసీకి ఎక్కువ మంది మొగ్గు చూపిస్తుంటారు. ఒక విధంగా ఇదే సౌకర్యమైనది. ప్రీమియం భరించగలిగే వారు రూమ్ రెంట్లో పరిమితులు లేకుండా ఎంపిక చేసుకోవాలి. ప్రీమియం భారంగా భావించే వారు.. షేరింగ్ ఆప్షన్ను ఎంపిక చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేటు రూమ్ల్లోని సేవలతో పోల్చినప్పుడు షేరింగ్లో అందించే వైద్య సేవల చార్జీలు తక్కువగా ఉంటాయి. కనుక మొత్తం మీద బిల్లు తగ్గుతుంది. ఇది బీమా సంస్థపై భారాన్ని తగ్గిస్తుంది. షేరింగ్లోనూ రోగికి మెరుగైన సేవలే అందుతాయి. కనుక దీన్ని పరిశీలించొచ్చు. పైన చెప్పుకున్న అన్ని ఆప్షన్లు దాటి వచి్చన తర్వాత కూడా ప్రీమియం భారంగా అనిపిస్తే.. కోపేమెంట్కు వెళ్లడమే. ఈ విధానంలో ప్రతి ఆస్పత్రి బిల్లులో పాలసీదారు తన వంతు చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు 10 శాతం కో–పేమెంట్ ఎంపిక చేసుకున్నారని అనుకుందాం. రూ.2 లక్షల బిల్లు వచి్చనప్పుడు రోగి తన జేబు నుంచి రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ కోపేమెంట్ ఆప్షన్కైనా వెళ్లొచ్చు. కానీ, దీనివల్ల ఏటా ప్రీమియం భారం తగ్గుతుంది కానీ, ఆస్పత్రిలో చేరినప్పుడు ఆ మేరకు జేబుపై భారం పడుతుందిఈఎంఐ రూపంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏడాదికి ఒకే వాయిదాలో చెల్లించాల్సి ఉంటుంది. జీవిత బీమాలో మాదిరి నెలవారీ లేదా త్రైమాసికం లేదా ఆరు నెలలకోసారి ఆప్షన్ లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఒకే విడత అంత మొత్తం అంటే భారంగా అనిపించొచ్చు. అలాంటి వారు ఈఎంఐ ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని రకాల కార్డులపై బీమా సంస్థలు ఈ సదుపాయం కల్పిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే.. ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నెట్వర్క్ ఆస్పత్రులతో ఒక జాబితాను నిర్వహిస్తుంటుంది. తమ క్లయింట్లకు కొంచెం తగ్గింపు రేట్లపై సేవలు అందించే దిశగా ఆయా ఆస్పత్రులతో బీమా కంపెనీకి టైఅప్ ఉంటుంది. కనుక నాన్ నెట్వర్క్ ఆస్పత్రులతో పోల్చి చూస్తే నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవడం వల్ల తక్కువ చార్జీలు పడతాయి. ఈ మేరకు బీమా కంపెనీలకు ఆదా అవుతుంది. కనుక స్టార్ హెల్త్ వంటి కొన్ని బీమా సంస్థలు నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకుంటే ప్రీమియంలో 15 శాతం వరకు రాయితీని అందిస్తున్నాయి. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఇండివిడ్యువల్ హెల్త్ కవరేజీ తీసుకుంటే ప్రీమియం ఎక్కువ పడుతుంది. దీనికి బదులు కుటుంబం అంతటికీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే కుటుంబంలో అందరికీ కలిపి కవరేజీ ఒక్కటే అవుతుంది. కనుక ప్రీమియం తగ్గుతుంది. వెల్నెస్ ప్రయోజనాలు ఉపయోగించుకోవాలి.. తీసుకునే హెల్త్ ప్లాన్లో హెల్త్ చెకప్ వంటి వెల్నెస్ ప్రయోజనాలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఏడాదికోసారి ఉచితంగా అన్ని రక్త పరీక్షలు చేయించుకోవచ్చు. ఇందుకు అదనంగా పడే ప్రీమియం ఉండదు. కానీ, ఆరోగ్యం ఎలా ఉందన్నది గమనించుకోవచ్చు. ఈ మేరకు కొంత ఆదా చేసినట్టే అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘ఫెవికాల్’ పుట్టిందిలా..
పుస్తకాలు అతికించడం నుంచి గృహోపకరణాల తయారీ వరకూ అనేక చోట్ల ఉపయోగించే ‘ఫెవికోల్’ (Fevicol) దశాబ్దాలుగా భారతీయ ఇళ్లలో భాగంగా మారిపోయింది. ఫోటోకాపీయింగ్కు జిరాక్స్ ఎలాగైతే పర్యాయ పదంగా మారిందో అలాగే బ్రాండ్తో సంబంధం లేకుండా జిగురు (గమ్) పదార్థాలకు ఫెవికోల్ పర్యాయపదంగా మారింది. అయితే ఈ ఐకానిక్ బ్రాండ్ వెనుక చిన్న వ్యాపారాన్ని బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యంగా మార్చిన మొదటి తరం వ్యవస్థాపకుడు బల్వంత్ పరేఖ్ అద్భుతమైన కృషి ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడైన ఆయన ప్యూన్గా ప్రారంభమై పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. "ఫెవికోల్ మ్యాన్" స్ఫూర్తిదాయకమైన ప్రస్థానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.ప్రారంభ జీవితం పోరాటాలే..గుజరాత్ లోని మహువాలో జైన కుటుంబంలో జన్మించిన బల్వంత్ పరేఖ్ తొలి జీవితం అనేక పోరాటాలతో కూడుకున్నది. ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీ నుంచి లా డిగ్రీ పొందినప్పటికీ ఆయన వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. బల్వంత్ పరేఖ్ ప్రారంభ జీవితం చాలా కఠినంగా గడిచింది. ఆయన డైయింగ్, ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేశారు. తరువాత ప్యూన్ గా పనిచేశారు. ఆ సమయంలో భారతదేశం స్వాతంత్ర్య పోరాటంలో ఉంది. పరేఖ్ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అయితే కుటుంబ ఒత్తిడితో చదువును పునఃప్రారంభించి లా డిగ్రీ పూర్తి చేశారు.వ్యాపార సామ్రాజ్యానికి పునాదిమోహన్ అనే ఇన్వెస్టర్ సహకారంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న పరేఖ్.. పాశ్చాత్య దేశాల నుంచి సైకిల్, అరెకా, కాగితపు రంగులను దిగుమతి చేసుకోవడం ప్రారంభించారు. ఇందులో విజయాన్ని సాధించిన తరువాత, పరేఖ్ కుటుంబం ముంబైకి మకాం మార్చారు. ఇది ఆయన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. తరువాత బల్వంత్ తమ ఉత్పత్తులను భారతదేశంలో మార్కెటింగ్ చేయడానికి జర్మన్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. 1954 లో ఆ కంపెనీ ఆహ్వానం మేరకు ఆయన జర్మనీ వెళ్లారు. కానీ వారి మేనేజింగ్ డైరెక్టర్ మరణించిన తరువాత ఆ సంస్థ భాగస్వామ్యం నుంచి వైదొలిగింది. ఈ ఎదురుదెబ్బ పరేఖ్ను అడ్డుకోలేదు. తాను కూడా సొంత వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పానికి అది ఆజ్యం పోసింది.ఫెవికోల్ ప్రారంభమైందిలా.. 1954లో బల్వంత్, ఆయన సోదరుడు సుశీల్ ముంబైలోని జాకబ్ సర్కిల్లో పరేఖ్ డైచెమ్ ఇండస్ట్రీస్ను స్థాపించారు. పారిశ్రామిక రసాయనాలు, వర్ణద్రవ్య ఎమల్షన్లు, రంగులను తయారు చేసి విక్రయించడం మొదలుపెట్టారు. భారతీయ జిగురు మార్కెట్లో జంతువుల కొవ్వుతో తయారైన జిగురులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని, అవి వికృతమైనవి, సంక్లిష్టమైనవని గమనించిన పరేఖ్ ఒక అవకాశాన్ని చూశారు. ఫెవికాల్ బ్రాండ్ పేరుతో తెల్ల జిగురు తయారీని ప్రారంభించారు. ఫెవికాల్ అనే పేరు మోవికాల్ అని పిలువబడే ఇలాంటి ఉత్పత్తిని తయారు చేసే ఒక జర్మన్ కంపెనీ ప్రేరణతో వచ్చింది. జర్మన్ భాషలో "కోల్" అంటే రెండు వస్తువలను అతికించేదని అర్థం.పిడిలైట్ ఇండస్ట్రీస్ నిర్మాణంఫెవికాల్ విజయం 1959 లో పిడిలైట్ ఇండస్ట్రీస్ స్థాపనకు దారితీసింది. ఫెవికాల్ దాని నాణ్యత, విశ్వసనీయతకు గుర్తింపు పొందడంతో కంపెనీ త్వరగా ఇంటి పేరుగా మారింది. విరిగిన పాత్రలను అతికించడం దగ్గర నుంచి ఇళ్ల నిర్మాణం వరకు ఫెవికాల్ భారతీయ గృహాలలో అంతర్భాగమైంది. "ఫెవికోల్ కా జోడ్ హై, తూటేగా నహీ" అనే ట్యాగ్ లైన్ తో చేసిన అడ్వర్టైజింగ్ ప్రచారాలు వినియోగదారుల హృదయాలలో ఈ ఐకానిక్ బ్రాండ్ స్థానాన్ని మరింత సుస్థిరం చేశాయి. -
చాట్జీపీటీని అందుకు వాడతారా?.. ఓపెన్ఏఐ సీరియస్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం, చాట్జీపీటీ (ChatGPT) సృష్టికర్త ఓపెన్ ఏఐ (OpenAI) కీలక నిర్ణయం తీసుకుంది. తమ చాట్జీపీటీ సేవల్ని దుర్వినియోగం చేస్తున్న చైనాకు చెందిన పలు ఖాతాలను నిషేధించింది. తమ ఏఐ నమూనాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి, అనధికార నిఘా, పర్యవేక్షణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకున్న తమ విధానాలను అవరోధం కలగకుండా కొనసాగిస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఓపెన్ఎఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.నిషేధానికి కారణాలివే..ఓపెన్ఏఐ విడుదల చేసిన థ్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. నిషేధిత ఖాతాలను సోషల్ మీడియా వినికిడి సాధనం కోసం వివరణలను రూపొందించడం కోసం వినియోగించారు. పాశ్చాత్య దేశాల్లో చైనా వ్యతిరేక నిరసనలపై రియల్ టైమ్ రిపోర్టులను చైనా భద్రతా సంస్థలకు అందించడానికి ఈ టూల్ ను రూపొందించారు. యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలలో నిరసనలను పర్యవేక్షిస్తున్న చైనా రాయబార కార్యాలయాలు, ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు తమ సంగ్రహణలను పంపినట్లు ఆధారాలను ప్రూఫ్ రీడ్ చేయడానికి ఈ ఖాతాల నిర్వాహకులు ఓపెన్ఎఐ నమూనాలను ఉపయోగించారు.విధానాల ఉల్లంఘనవ్యక్తుల కమ్యూనికేషన్ నిఘా లేదా అనధికారిక పర్యవేక్షణ కోసం తమ ఏఐ సాధనాన్ని ఉపయోగించడాన్ని ఓపెన్ఏఐ విధానాలు కఠినంగా నిషేధిస్తున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులను అణచివేయడానికి ప్రయత్నించే ప్రభుత్వాలు, నియంతృత్వ పాలనల తరపున నిర్వహించే కార్యకలాపాలు ఇందులో ఉన్నాయి. నిఘా సాధనం కోసం కోడ్ను డీబగ్ చేయడానికి వినియోగదారులు ఓపెన్ఎఐ నమూనాలను కూడా ఉపయోగిస్తున్నారని దర్యాప్తులో తేలింది. అయితే ఈ సాధనం స్వయంగా నాన్-ఓపెన్ఎఐ మోడల్పై నడిచింది.ఇదీ చదవండి: ‘మస్క్, ట్రంప్ మరణ శిక్షకు అర్హులు’.. ఏఐ ఏదైనా ఇంతేనా?మరో ఘటనలో..చైనా అసమ్మతివాది కై జియాను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడానికి చాట్ జీపీటీని ఉపయోగించిన ఖాతాను కూడా ఓపెన్ ఏఐ నిషేధించింది. అదే సంస్థ స్పానిష్ లో యుఎస్ వ్యతిరేక వార్తా కథనాలను సృష్టించడానికి ఏఐని ఉపయోగించుకుంది. ఇవి తరువాత లాటిన్ అమెరికన్ అవుట్ లెట్ లలో ప్రచురితమయ్యాయి. అమెరికా వ్యతిరేక కథనాలతో లాటిన్ అమెరికన్ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రధాన స్రవంతి మీడియాలో ఒక చైనీస్ యాక్టర్ దీర్ఘకాలిక కథనాలను నాటడాన్ని ఓపెన్ఏఐ గమనించడం ఇదే మొదటిసారి. -
ఇళ్లు కట్టి.. ఈవీ చార్జింగ్ ఎక్కడ?
ప్రజల్లో పర్యావరణ స్పృహ పెరిగిపోయింది.. మంచిదే..! శబ్ద, వాయు కాలుష్యంతో మానవాళికి ఉపద్రవంగా మారుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వినియోగించాలని వినియోగదారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ఈవీ వాహనాల కొనుగోళ్లు, వినియోగంపై ప్రత్యేక రాయితీలు అందిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈవీ పాలసీని సైతం తీసుకొచ్చింది. అయితే వాహనాల కొనుగోళ్లకు రాయితీలు ఇస్తేనే సరిపోదు.. ఆయా వాహనాల చార్జింగ్ పాయింట్లు, స్టేషన్ల ఏర్పాటుపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ డెవలపర్లకు వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యత కూడా కాస్త ఎక్కువే. ప్రభుత్వం ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్న తరుణంలో.. బిల్డర్లు కూడా తమవంతు బాధ్యతగా భవన సముదాయాల్లోనే ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఇక్కడే స్పష్టత లోపించింది. భవన సముదాయాల్లో ఎక్కడ ఈవీ స్టేషన్లు, పాయింట్లను ఏర్పాటు చేయాలనే దానిపై స్పష్టత కొరవడింది. బేస్మెంట్, సెల్లార్లోనా లేదా బయట ఓపెన్ స్పేస్లో ఈవీ స్టేషన్ ఏర్పాటు చేయాలా? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో ఈవీ పాలసీ అమలులో ఉన్నా.. స్పష్టత లేకపోవడంతో స్టేషన్ల ఏర్పాటుకు బిల్డర్లు వెనుకంజ వేస్తున్నారు.బిల్డర్ను బాధ్యుడిని చేస్తే ఎలా? ప్రస్తుతం గృహ కొనుగోలుదారులు వారి అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా నివాస సముదాయాల్లో వసతులను కోరుకుంటున్నారు. పర్యావరణ స్పృహ పెరిగిన నేపథ్యంలో కస్టమర్లు వారు ఉండే చోటే ఈవీ చార్జింగ్ స్టేషన్ ఉండాలని అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో బిల్డర్లు పునరాలోచనలో పడుతున్నారు. ఒకవేళ సెల్లార్లో ఈవీ స్టేషన్ను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఏమైనా ప్రమాదాలు సంభవిస్తే దానికి బిల్డర్ను బాధ్యులు చేస్తే ఎలా? అని సంశయంలో పడిపోతున్నారు.ఈవీపై స్పష్టత అవసరమే.. సాధారణంగా బిల్డర్ ప్రాజెక్ట్ను పూర్తి చేసిన తర్వాత నివాస సముదాయాన్ని అసోసియేషన్కు అప్పచెబుతాడు. వారు ఈవీ చార్జింగ్ స్టేషన్ను సరిగా నిర్వహణ చేయపోయినా, ఇతరత్రా కారణాల వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా? అని పలువురు డెవలపర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నివాస సముదాయాల్లో ఈవీ స్టేషన్ల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు జారీ చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ఉదాహరణకు గతంలో ప్రాజెక్ట్కు అగ్ని ప్రమాద శాఖ నిరభ్యంతర ధృవీకరణ పత్రం(ఎన్ఓసీ) వచ్చిందంటే ఇక ఆ ప్రాజెక్ట్ వంక అధికారులు చూసేవారు కాదు. కానీ, ఇప్పుడు ప్రతీ మూడేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసుకోవాలని కొత్త నిబంధనలను జోడించారు. ఇదే ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ప్రాజెక్ట్ను అసోసియేషన్కు అప్పజెప్పిన తర్వాత నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ ఉపకరణలు పనిచేయవు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజా నిబంధనలతో నిర్వహణ సక్రమంగా ఉండటంతో పాటు క్రమంతప్పకుండా మాక్ డ్రిల్స్ చేస్తుంటారు. దీంతో ప్రమాదాలను నియంత్రించే అవకాశం ఉంటుంది. -
ఐటీ ఉద్యోగుల జీతాలు ఈసారి ఎలా ఉంటాయంటే..
దేశంలో ఐటీ ఉద్యోగాలకు ( IT Jobs ) ఎనలేని క్రేజ్ ఉంది. అత్యధిక జీతాలే ఇందుకు కారణం. ఉద్యోగంలో చేరినప్పుడు రూ.లక్షల్లో ప్యాకేజీ లభించడమే కాదు.. ఏటా వేతనాల పెంపు (Salary hikes) కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఏటా తూతూ మంత్రంగా సింగిల్ డిజిట్లోనే జీతాలను పెంచుతున్నాయి ఐటీ కంపెనీలు.2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ పరిశ్రమలో వేతన ఇంక్రిమెంట్లు మధ్యస్థంగా ఉంటాయని అంచనా. ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకులు, అభివృద్ధి చెందుతున్న నైపుణ్య అవసరాలు, కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరగడం వంటి కారణాలతో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది సగటు వేతన పెంపు 4-8.5 శాతం మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.వేతన ఇంక్రిమెంట్లను ప్రభావితం చేసే అంశాలుగ్లోబల్ ఎకనామిక్ ఛాలెంజెస్: ఐటీ సేవల పరిశ్రమ ఆర్థిక అనిశ్చితితో సతమతమవుతోంది. ఇది విచక్షణ వ్యయం తగ్గడానికి, వ్యాపార ప్రాధాన్యతలను మార్చడానికి దారితీసింది. కంపెనీలు వేతన బడ్జెట్ల విషయంలో సంప్రదాయ పద్ధతిని అవలంబిస్తున్నాయి. కొన్ని సాంప్రదాయ ఏప్రిల్-జూన్ కాలానికి మించి అప్రైజల్ సైకిల్ను ఆలస్యం చేస్తున్నాయి.పెరుగుతున్న నైపుణ్య అవసరాలు: పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, నైపుణ్యాల ఆధారిత వేతనానికి ప్రాధాన్యత పెరుగుతోంది. సంస్థలు వ్యయాన్ని తగ్గించుకునేందుకు టైర్ 2 నియామకాలను ఉపయోగించుకుంటున్నాయి. మరోవైపు ప్రతిభావంతులను నిలుపునేందుకు నిలుపుదల బోనస్లు, ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్లు (ESOP), ప్రాజెక్ట్ ఆధారిత ప్రోత్సాహకాలను అమలు చేస్తున్నాయి.ఇదీ చదవండి: టీసీఎస్లో ఉద్యోగం ఇక మరింత కష్టం!ఏఐ స్వీకరణ: పెరుగుతున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) స్వీకరణ శ్రామిక శక్తి నిర్మాణ వ్యవస్థలను పునర్నిర్మిస్తోంది. వేతన బడ్జెట్లను ప్రభావితం చేస్తోంది. ఏఐ ఆధారిత సామర్థ్యాలు, పెరుగుతున్న క్లయింట్ అవసరాలు మరింత జాగ్రత్తగా వనరులను కేటాయించడానికి కంపెనీలను ప్రేరేపిస్తున్నాయి.పరిశ్రమ నిపుణులు ఏమంటున్నారంటే..ఈ ఏడాది వేతనాల పెంపు చాలా జాగ్రత్తగా ఉందని టీమ్ లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ విజ్ పేర్కొన్నారు. ‘4-8.5 శాతం రేంజ్లో ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు పరిశ్రమ వర్గాలు చూస్తున్నాయి. ఇది మునుపటి సంవత్సరాలతో పోలిస్తే తక్కువ. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, మారుతున్న వ్యాపార ప్రాధాన్యాలు ఈ మందగమనానికి ప్రధాన కారణం’ అని వివరించారు.మరోవైపు 5-8.5 శాతం వేతన పెంపు ఉంటుందని రీడ్ అండ్ విల్లో సీఈఓ జానూ మోటియానీ అంచనా వేశారు. రెండంకెల పెరుగుదల రోజులు పోయినట్లు కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. పరిశ్రమ మరింత ఆచరణాత్మక ధోరణి అవలంభిస్తున్నందున సగటు పెరుగుదల 5-8.5 శాతం మధ్య ఉంటుందని ఆమె భావిస్తున్నారు. -
ప్రేమ్ జీ ఇన్వెస్ట్.. తిరుగులేని పోర్ట్ఫోలియో
అజీమ్ ప్రేమ్ జీ (Azim Premji) ఫ్యామిలీ ఆఫీస్ ఇన్వెస్ట్ మెంట్ విభాగమైన ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ల్యాండ్ స్కేప్ లో తిరుగులేని సంస్థగా నిలదొక్కుకుంది. దీర్ఘకాలిక విలువ సృష్టిపై దృష్టి సారించిన ప్రేమ్జీ ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ, హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ గూడ్స్ సహా వివిధ రంగాలకు చెందిన వైవిధ్యమైన పోర్ట్ఫోలియోను నిర్మించింది.ఇన్వెస్ట్ మెంట్ ఫిలాసఫీప్రేమ్ జీ ఇన్వెస్ట్ దీర్ఘకాలంలో వ్యాపారాలను నిర్మించడం, మద్దతు ఇవ్వడంపై కేంద్రీకృతమైన స్పష్టమైన పెట్టుబడి తత్వంతో పనిచేస్తుంది. బలమైన వృద్ధి సామర్ధ్యం ఉన్న కంపెనీలను గుర్తించడానికి, పెట్టుబడి పెట్టడానికి సంస్థ తన విస్తృతమైన నెట్వర్క్, లోతైన పరిశ్రమ నైపుణ్యాన్ని ఉపయోగిస్తుంది. 10 బిలియన్ డాలర్లకు పైగా ఎవర్ గ్రీన్ క్యాపిటల్ తో ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడానికి, సుస్థిర వృద్ధిని నడిపించడానికి కట్టుబడి పనిచేస్తోంది.కీలక పెట్టుబడులుటెక్నాలజీ: ప్రేమ్ జీ ఇన్వెస్ట్ ప్రముఖ ఐవేర్ రిటైలర్ లెన్స్ కార్ట్, టెక్ ఆధారిత సప్లై చైన్ ఫైనాన్సింగ్ కంపెనీ మింటిఫి సహా టెక్నాలజీ కంపెనీల్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులు టెక్నాలజీ పరివర్తన శక్తి, ఆర్థిక వృద్ధిని నడిపించే సామర్థ్యంపై సంస్థ నమ్మకాన్ని ప్రతిబింబిస్తాయి.హెల్త్ కేర్: జీవన నాణ్యతను మెరుగుపరచడంలో, ఆర్థిక అభివృద్ధిని నడిపించడంలో ఈ రంగం కీలక పాత్రను గుర్తించిన ఈ సంస్థ హెల్త్ కేర్ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టింది. ప్రేమ్జీ ఇన్వెస్ట్ హెల్త్ కేర్ పోర్ట్ఫోలియోలో మెడికల్ ఇన్నోవేషన్, పేషెంట్ కేర్లో ముందంజలో ఉన్న కంపెనీలు ఉన్నాయి.ఫైనాన్షియల్ సర్వీసెస్: డిజిటల్ కన్జ్యూమర్ లెండింగ్ ప్లాట్ఫామ్ క్రెడిట్బీ, టెక్నాలజీ ఫస్ట్ వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ డెజెర్వ్ వంటి కంపెనీల్లో పెట్టుబడులతో ప్రేమ్జీ ఇన్వెస్ట్కు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో బలమైన ఉనికి ఉంది.కన్జ్యూమర్ గూడ్స్: అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులు, సేవలకు పెరుగుతున్న డిమాండ్ ను గుర్తించిన ఈ సంస్థ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రేమ్జీ ఇన్వెస్ట్ కన్జ్యూమర్ గూడ్స్ పోర్ట్ ఫోలియోలో ఆయా పరిశ్రమలలో అగ్రగామిగా ఉన్న, వృద్ధి, సృజనాత్మకతలో బలమైన ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీలు ఉన్నాయి.తాజాగా 9 కంపెనీలలో షేర్ల కొనుగోలుప్రేమ్జీ ఇన్వెస్ట్ తాజాగా 9 కంపెనీలలో షేర్లు కొనుగోలు చేసింది. ఈ జాబితాలో భారతీ ఎయిర్టెల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఇందుకు రూ. 446 కోట్లకుపైగా వెచ్చించింది. అనుబంధ సంస్థ పీఐ అపార్చునిటీస్ ఏఐఎఫ్వీ ఎల్ఎల్పీ ద్వారా ఎయిర్టెల్లో 5.44 లక్షల షేర్లు, జిందాల్ స్టీల్లో 9.72 లక్షల షేర్లు, రిలయన్స్లో 5.7 లక్షల షేర్లు, ఇన్ఫోసిస్లో 3.28 లక్షల షేర్లు సొంతం చేసుకుంది.ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంకులో 3.33 లక్షల షేర్లు, హిందాల్కోలో 8.13 లక్షల షేర్లు, అంబుజా సిమెంట్స్లో 5.14 లక్షల షేర్లు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్లో 1.09 లక్షల షేర్లు, ఎస్బీఐ లైఫ్లో 84,375 షేర్లు చొప్పున కొనుగోలు చేసింది. ఒక్కో షేరునీ సగటున రూ. 477–1,807 ధరల శ్రేణిలో సొంతం చేసుకుంది. టారిష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ఈ వాటాలు విక్రయించింది. -
వేసవి వచ్చేస్తోంది.. ఇంటి సీలింగ్ ఎలా ఉండాలంటే..
వేసవి కాలం వచ్చేస్తోంది.. బయటే కాదు ఇంట్లో ఉన్నా ఎండ వేడి తగులుతుంది. అసలు ఇంటి పైకప్పు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది ఇంట్లో వేడి. సాధారణ సీలింగ్ ఉన్న ఇంట్లో అయితే ఈ వేడిమి తీవ్రత మరింత ఎక్కువే. దీనికి పరిష్కారం చూపించి.. మండు వేసవిలో ఇంటిని చల్లగా మార్చేస్తుంది ‘ఫాల్స్ సీలింగ్’! ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం.. గదిలో ఆహ్లాద వాతావరణం ఏర్పర్చడమే. అలసిన మనసు, శరీరానికి సాంత్వన చేకూర్చడమే. ఫాల్స్ సీలింగ్తో ఇంట్లోని వాతావరణాన్ని అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవటమే కాకుండా సాధారణ ఇంటి పైకప్పును డైమండ్, చతురస్రం, గోళాకారం వంటి విభిన్న ఆకృతుల్లో అందంగా కూడా తీర్చిదిద్దుకోవచ్చు.– సాక్షి, సిటీబ్యూరో» ఫాల్స్ సీలింగ్ రంగుల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారేమంటారంటే.. » గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడు పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ, విశాలంగా ఉన్న భావనను కలిగిస్తుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది. » మిగతా గదులతో పోల్చుకుంటే పడక గది సీలింగ్నే ఎక్కువసేపు చూస్తాం కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేవి ఎంచుకోవాలి. మధ్యస్తం, డార్క్, బ్రౌన్ వర్ణాలు పడకగదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి మరి. » తాజాదనం ఉట్టిపడుతున్న లుక్ రావాలంటే మోనోక్రోమాటిక్ థీమ్ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది. » గోడల రంగుకు, సీలింగ్కు ఒకే రకమైనవి కాకుండా.. వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గర దగ్గర రంగులు కాకుండా, చూడగానే తేడా ఇట్టే కన్పించే వర్ణాలను ఎంపిక చేసుకోవటం మేలు. దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్ను వినియోగించుకోండి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవచ్చు. జాగ్రత్తలివే.. » ఫాల్స్ సీలింగ్ ఎంపికలో ధర కంటే నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి. » ఫ్లోర్ నుంచి పైకప్పు మధ్య కనీసం 12 అడుగుల ఎత్తు అయినా ఉండాలి. » ఏమరుపాటుగా ఉంటే ఫాల్స్ సీలింగ్తో పాటు ఎయిర్ కండిషన్ మెషిన్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. » ఉడెన్ ఫాల్స్ సీలింగ్లో అయితే ఎలుకలతో పాటు చెదలు, పురుగులు చేరే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. » దుమ్ము, ధూళి చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. -
మొదటి బిడ్డకు స్వాగతం పలికిన శామ్ ఆల్ట్మాన్ - ఫొటో వైరల్
ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మాన్'.. మగబిడ్డకు స్వాగతం పలికారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. ఫోటో కూడా షేర్ చేశారు.ప్రపంచానికి స్వాగతం, చిన్నవాడా!, అని పేర్కొంటూ శామ్ ఆల్ట్మాన్.. బిడ్డ చేతిని చూపుడు వేలుతో పట్టుకున్న ఫోటో షేర్ చేశారు. తన బిడ్డ ముందుగానే జన్మించినట్లు, ప్రస్తుతం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో వైద్య సంరక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. నేను ఇంత ప్రేమను ఎప్పుడూ అనుభవించలేదని అన్నారు.శామ్ ఆల్ట్మాన్ వెల్లడించిన ఈ విషయంపై.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. "నా హృదయపూర్వక అభినందనలు, శామ్! పేరెంట్హుడ్ అనేది జీవితంలో అత్యంత గొప్ప అనుభవాలలో ఒకటి. మీకు.. మీ కుటుంబానికి శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు. పలువురు నెటిజన్లు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు: ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా..శామ్ ఆల్ట్మాన్.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆలివర్ ముల్హెరిన్ను వివాహం చేసుకున్నారు. ఈ జంట సముద్రతీర ప్రదేశంలో ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరు జంటగా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.My heartfelt congratulations, @sama! Parenthood is one of life’s most profound and rewarding experiences. Wishing you and your family the very best.— Satya Nadella (@satyanadella) February 22, 2025 -
చిటికెలో మొటిమలను మాయం చేసే ఎల్ఈడీ ప్యాచ్
యువతను ఇబ్బంది పెట్టే సమస్యల్లో మొటిమలు ఒకటి. చాలామంది ముఖంపై మొటిమలు వస్తే అసలు బయటకే రారు. మరికొంతమంది వాటిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే, చిటికెలో మొటిమలను మాయం చేసే ఒక స్మార్ట్ సొల్యూషన్ మార్కెట్లోకి వచ్చేసింది.నెదర్లండ్స్కు చెందిన ‘ఫీవీస్’ కంపెనీ మొటిమలను తగ్గించే ఎల్ఈడీ ప్యాచ్ను తయారుచేసింది. ఇది పిల్లిపిల్ల బొమ్మతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ప్యాచ్ను మొటిమలపై అతికించుకుంటే చాలు, ఎల్ఈడీ స్పాట్ ట్రీట్మెంట్ సాయంతో మొటిమలను, వాటి మచ్చలను తగ్గిస్తుంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు వారంపాటు పనిచేస్తుంది. నీలం, ఎరుపు, నారింజ రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంది. ధర 50 డాలర్లు (అంటే రూ. 4,339) మాత్రమే!ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు.. ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా.. -
బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు: ఆహారం, నీరు ఇవ్వడానికి..
భారత సంతతికి చెందిన బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ కుమార్తె 'వసుంధర ఓస్వాల్' ఉగాండాలో జైలు పాలైన దాదాపు నాలుగు నెలల తర్వాత.. అక్కడ తాను అనుభవించిన కొన్ని కష్టాలను వివరించింది. తనను ఐదు రోజుల పాటు నిర్బంధించారని.. ఆహారం, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించలేదని పేర్కొంది. ఆఖరికి స్నానం చేయడానికి కూడా నిరాకరించారని వెల్లడించింది.ఇంటర్పోల్కు వెళ్లడానికి తాను అయిష్టత చూపినప్పుడు.. ఒక పురుష అధికారి తనను ఎత్తుకుని వారి వ్యాన్లో పడేశారని వసుంధర ఓస్వాల్ ఆరోపించింది.వసుంధర (26)పై గత సంవత్సరం తన తండ్రి పంకజ్ ఓస్వాల్ మాజీ ఉద్యోగి ముఖేష్ మెనారియా కిడ్నాప్ & హత్య కేసులో తప్పుడు అభియోగం మోపబడింది. తరువాత అతను టాంజానియాలో సజీవంగా కనిపించాడు. అయితే ఈమెను 2024 అక్టోబర్ 1న అరెస్టు చేశారు. అదే నెలలో (అక్టోబర్ 2) బెయిల్ మంజూరు చేశారు.నన్ను ఐదు రోజులు నిర్బంధించారు, మరో రెండు వారాల పాటు జైలులో పెట్టారని.. వసుంధర ఓస్వాల్ పేర్కొంది. ఆ సమయంలో వారు స్నానం చేయనివ్వలేదు. ఆహారం & నీరు ఇవ్వడానికి కూడా నిరాకరించారు. నాకు ఆహారం, నీరు వంటి ప్రాథమిక అవసరా కోసం నా తల్లిదండ్రులు న్యాయవాదుల ద్వారా పోలీసు అధికారులకు లంచం ఇవ్వవలసి వచ్చిందని పేర్కొంది.ఇదీ చదవండి: గ్రామంలో నివాసం.. వేలకోట్ల కంపెనీకి సారథ్యం!.. ఎవరో తెలుసా?ఒక విధమైన శిక్షగా వాష్రూమ్ను ఉపయోగించుకోవడానికి అనుమతించలేదని వసుంధర ఓస్వాల్ ఆరోపించారు. పోలీసులు వారెంట్ లేకుండా తన ఇంటిని సోదా చేశారని ఆరోపించారు. -
గ్రామంలో నివాసం.. వేలకోట్ల కంపెనీకి సారథ్యం!.. ఎవరో తెలుసా?
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా.. వచ్చిన దారిని, మూలలను మరచిపోకూడదు. డబ్బు సంపాదించగానే లగ్జరీకి అలవాటుపడే మనుషులున్న ఈ రోజుల్లో కూడా.. వేలకోట్ల రూపాయల కంపెనీ అతని సారథ్యంలో ఉన్నప్పటికీ, నిరాడంబరంగా.. పంచె కట్టుకుని జీవితం గడిపేస్తున్నారు. ఇంతకీ అయన ఎవరు? ఆయన స్థాపించిన కంపెనీ ఏది? సంపాదన ఎంత అనే ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.తమిళనాడులో జన్మించిన 'శ్రీధర్ వెంబు'.. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి, నేడు ఎంతోమందికి ఆదర్శమయ్యారు. చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని.. ఆ తరువాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు పయనమయ్యారు. చదువు పూర్తయిన తరువాత ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ సంపాదించారు. కానీ కొన్ని రోజులకు మంచి ఉద్యోగాన్ని వదిలి, ఇండియాకు వచ్చేసారు.ఉద్యోగం వదిలి, భారత్ వచ్చిన తరువాత.. సొంత సాఫ్ట్వేర్ సామ్రాజ్యాన్ని నిర్మించారు. అదే నేడు అందరికి సుపరిచయమైన.. 'జోహో కార్పొరేషన్'. చాలా మంది ప్రజలు మంచి అవకాశాల కోసం గ్రామాల నుంచి నగరాలకు, ఆపై విదేశాలకు తరలిపోతున్న సమయంలో వెంబు ఈ ధోరణిని తిప్పికొట్టారు.అమెరికాను విడిచిపెట్టి తమిళనాడులోని ఒక చిన్న గ్రామానికి తిరిగి వచ్చి, అక్కడ నుంచే ఇప్పుడు తన బిలియన్ డాలర్ల కంపెనీని నడుపుతున్నారు. జోహో ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది, కానీ వెంబు 630 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెన్కాసికి సమీపంలోని మారుమూల గ్రామమైన మథలంపారైలో ఓ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు.శ్రీధర్ వెంబు తీసుకున్న ఈ నిర్ణయం.. కంపెనీని అభివృద్ధికి మాత్రమే కాకుండా, సమాజ అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ భారతదేశాన్ని నిర్మించడానికి దోహదపడింది. దీంతో భారత ప్రభుత్వం.. 72వ గణతంత్ర దినోత్సవం నాడు వెంబుకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందించింది.గ్రామీణ ప్రాంతంలో ఆఫీస్ ఏర్పాటు చేయాలనే.. వెంబు ఆలోచన చాలామందిని ఆశ్చర్యపరిచింది. గ్రామాలను వదిలి నగరాలకు ప్రజలు తరచుగా వెళ్లే వలస ధోరణిని తిప్పికొట్టాలనే గ్రామంలో ఆఫీస్ స్టార్ట్ చేసినట్లు శ్రీధర్ వెంబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.వెంబు తెన్కాసిలో ఒక చిన్న కార్యాలయాన్ని అద్దెకు తీసుకొని ప్రారంభించారు. ఆ తరువాత మథలంపారైలో ఒక పాత ఫ్యాక్టరీని కొనుగోలు చేసి, దానిని టెక్ క్యాంపస్గా మార్చారు. వెంబు కార్యాలయాలను ఏర్పాటు చేయడంతోనే ఆగిపోలేదు. ఆయన జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ను కూడా ప్రారంభించారు. ఇక్కడ ఉన్నత పాఠశాల, డిప్లొమా విద్యార్థులు వివిధ నైపుణ్యాలలో శిక్షణ పొందుతారు.ఇదీ చదవండి: భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. ప్రధాన కారణాలివే!శ్రీధర్ వెంబు ప్రారంభించిన.. జోహో కార్పొరేషన్ విలువ రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువ. కాగా ఈయన ఆస్తి రూ. 28వేలకోట్ల కంటే ఎక్కువని సమాచారం. వేలకోట్ల సంపద కలిగి ఉన్నప్పటికీ.. వెంబు చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. రోజువారీ ప్రయాణానికి ఆయన సైకిల్ ఉపయోగిస్తున్నారు. ఖరీదైన సూట్ కాకుండా.. పంచె కట్టుకుంటుటారు. ఇటీవలే 'శ్రీధర్ వెంబు' తన సీఈఓ పదవికి రాజీనామా చేశారు. అయితే అదే కంపెనీలో చీఫ్ సైంటిస్ట్గా పనిచేయనున్నట్లు సమాచారం. -
ఈ కారణాలతోనే.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుదల దిశగా.. పరుగులు పెడుతూనే ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ ధోరణి ఏర్పడింది. ట్రంప్ రక్షణాత్మక విధానం, యుఎస్ డాలర్ హెచ్చు & తగ్గుల కారణంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత, వాణిజ్య యుద్ధ భయం మరియు ఆర్థిక అనిశ్చితి పసిడి ధరలు పెరగడానికి హేతువులవుతున్నాయి.శుక్రవారం మార్కెట్ సెషన్ ముగిసిన తర్వాత.. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా ఎనిమిదవ వారం లాభాన్ని & దేశీయ మార్కెట్లో వరుసగా ఏడవ వారం లాభాన్ని నమోదు చేశాయి. ఈ ఏడు వారాల్లో, 10 గ్రాముల బంగారం రేటు రూ. 76,544 నుంచి రూ. 86,020లకు చేరింది. దీన్ని బట్టి చూస్తే.. 10 గ్రాముల గోల్డ్ రేటు ఏడు వారాల్లో సుమారు రూ. 9,500 కంటే ఎక్కువ పెరిగింది.2025 జనవరి ప్రారంభం నుంచి బంగారం ధరలు నిరంతరం పెరగడానికి అనేక కీలక అంశాలు కారణమయ్యాయి. ఇందులో ట్రంప్ ప్రారంభించిన సుంకాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, పెరిగిన ఈటీఎఫ్ ఇన్ఫ్లోలు, ప్రధాన కేంద్ర బ్యాంకుల రేటు కోతలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులకు, ముఖ్యంగా USకి బంగారం వెళ్లడం కూడా ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.యూరోపియన్ దేశాల నుంచి USకి ఎగుమతి చేసే బంగారంపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన నేపథ్యంలో.. అమెరికాలో బంగారానికి డిమాండ్ పెరిగింది. దీని ఫలితంగా యూరప్ కంటే అమెరికాలో బంగారం ధరలు పెరిగాయి. కాబట్టి కేంద్ర బ్యాంకులు లండన్ వాల్ట్ల నుంచి బంగారాన్ని తరలిస్తున్నాయి. గత ఎనిమిది వారాల్లో NY COMEX వాల్ట్లలో బంగారం నిల్వలు సుమారు 20 మిలియన్లు పెరిగాయి, ఇది లండన్ క్యాష్ గోల్డ్ కాంట్రాక్ట్ డిఫాల్ట్ బజ్ను ప్రేరేపించింది.స్టాక్ మార్కెట్లలో బంగారం ధరలు నిరంతరం పెరగడానికి కారణాలను గురించి, ఎస్ఎస్ వెల్త్స్ట్రీట్ వ్యవస్థాపకురాలు 'సుగంధ సచ్దేవా' మాట్లాడుతూ.. అమెరికా & యూరప్ మధ్య సుంకాల వివాదం ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితులను సృష్టించింది. ఇది బంగారం ధరలను ప్రభావితం చేసిందని అన్నారు. అల్యూమినియం, ఉక్కుపై ఇటీవల 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన తర్వాత ట్రంప్ పరిపాలన బంగారంపై సుంకాలు విధించవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. ఈ అంచనా అమెరికాలో డిమాండ్ను పెంచింది, బంగారం ధరలను పెంచిందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: భారత్లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు.. గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కు చెందిన 'అనుజ్ గుప్తా' మాట్లాడుతూ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమెరికన్ బ్యాంకుల కంటే వెనుకబడి లేదు. భారత సెంట్రల్ బ్యాంక్ 2024 మే, అక్టోబర్లలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల నుంచి 100, 102 టన్నుల బంగారాన్ని రవాణా చేసిందని ఆయన అన్నారు. దీనితో ఆర్బీఐ మొత్తం బంగారు నిల్వలు 855 టన్నులకు చేరుకున్నాయి, వీటిలో 510.5 టన్నులు భారతదేశంలో నిల్వ ఉన్నాయని అన్నారు.మొత్తం మీద.. బంగారం ధరలు నిరంతరం పెరగడానికి ట్రంప్ సుంకాల విధానం మాత్రమే కారణం కాదు. భౌగోళిక రాజకీయ ఆందోళనలు, ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ముప్పు, తక్కువ ఆర్థిక వృద్ధి గురించి ఆందోళనలు కూడా. భారతదేశంలో కొనుగోలుదారుల సంఖ్య, లేదా బంగారం మీద పెట్టుబడి పెట్టే వారి సంఖ్య విపరీతంగా పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. -
ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది: ఎంక్వైరీ కోసం ఫోన్ చేస్తే..
ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల పాట్నాకు చెందిన ఒక మహిళ.. కాల్ చేసి వేలాది రూపాయలు పోగొట్టుకుంది. ఇంతకీ ఇదెలా జరిగిందో తెలుసుకుందాం.పాట్నాలోని యారాపూర్ నివాసి అయిన ఒక మహిళ.. ఫిబ్రవరి 6న ఆన్లైన్లో మిక్సర్ మెషీన్ను ఆర్డర్ చేసింది. అయితే డెలివరీ ఫిబ్రవరి 12 నాటికి కావాల్సి ఉంది. కానీ డెలివరీ అవ్వలేదు. దీంతో ఆమె కంపెనీని సంప్రదించాలని నిర్ణయించుకుని.. సెర్చ్ ఇంజిన్లో కంపెనీ కాంటాక్ట్ నంబర్ కోసం వెతికి, ఒక నెంబర్ సంపాదించింది.తెలియని నెంబర్కు కాల్ చేసి, స్కామర్ల ఉచ్చులో పడింది. ఇంకేముంది.. నిమిషాల్లో రూ. 52,000 పోగొట్టుకుంది. చేసేదేమీ లేక.. ఆ మహిళ పోలీసులను సంప్రదించింది. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.ఆన్లైన్ మోసాల నుంచి తప్పించుకోవాలంటే?➤కస్టమర్ కేర్ నెంబర్ల కోసం.. ఎల్లప్పుడూ కంపెనీ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. మోసగాళ్ళు తరచుగా సెర్చ్ ఇంజన్లలో నకిలీ నంబర్లను జాబితా చేస్తారు. కాబట్టి ఆన్లైన్లో వెతకడం మానుకోవాలి. ➤తెలియని నెంబర్స్ నుంచి వచ్చిన కాల్స్ పట్ల జాగ్రత్త అవసరం. మోసగాళ్ళు ప్రజలను తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.➤ఎవరైనా మిమ్మల్ని చెల్లింపు వివరాలను లేదా లావాదేవీ వివరాలను చెప్పమని, లింక్పై క్లిక్ చేయమని అడిగితే.. అధికారిక మార్గాల ద్వారా కంపెనీతో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.➤మోసపోతున్నట్లు అనుమానం వస్తే.. వెంటనే మీ బ్యాంకును సంప్రదించి సైబర్ పోలీసులకు నివేదించండి.ఇదీ చదవండి: కొత్త ఐఫోన్ 16ఈ.. ఇలా చేస్తే రూ.4000 డిస్కౌంట్ -
సునీల్ మిత్తల్కు అరుదైన పురస్కారం
న్యూఢిల్లీ: టెలికం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో ఉన్న భారతీ ఎంటర్ప్రైసెస్ ఫౌండర్, చైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ తాజాగా గౌరవ నైట్హుడ్ పతకాన్ని అందుకున్నారు.బ్రిటన్లో నాయకత్వం, వ్యాపార పెట్టుబడులకుగాను మిత్తల్కు నైట్ కమాండర్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటీష్ ఎంపైర్ (కేబీఈ) వరించింది. యూకే రాజు చార్లెస్–3 తరఫున ఢిల్లీలో బ్రిటిష్ హై కమిషనర్ లిండీ కామెరాన్ నుండి ఆయన ఈ గౌరవాన్ని స్వీకరించారు.Sunil Bharti Mittal was presented the insignia of the Knight Commander of the Most Excellent Order of the British Empire (KBE) by H.E. Lindy Cameron on behalf of HM King Charles III. The KBE was conferred to Mr. Mittal for advancing UK-India business relations. pic.twitter.com/9C1xxmF11Y— Bharti Airtel (@airtelnews) February 22, 2025 -
ఐటీ దిగ్గజం భారీ పెట్టుబడి: ఏకంగా తొమ్మిది సంస్థలలో..
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం అజీమ్ ప్రేమ్జీ పెట్టుబడుల సంస్థ ప్రేమ్జీ ఇన్వెస్ట్ తాజాగా 9 కంపెనీలలో వాటాలు కొనుగోలు చేసింది. జాబితాలో భారతీ ఎయిర్టెల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితరాలున్నాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఇందుకు రూ. 446 కోట్లకుపైగా వెచ్చించింది.అనుబంధ సంస్థ పీఐ అపార్చునిటీస్ ఏఐఎఫ్ వీ ఎల్ఎల్పీ ద్వారా ఎయిర్టెల్లో 5.44 లక్షల షేర్లు, జిందాల్ స్టీల్లో 9.72 లక్షల షేర్లు, రిలయన్స్లో 5.7 లక్షల షేర్లు, ఇన్ఫోసిస్లో 3.28 లక్షల షేర్లు సొంతం చేసుకుంది.ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంకులో 3.33 లక్షల షేర్లు, హిందాల్కోలో 8.13 లక్షల షేర్లు, అంబుజా సిమెంట్స్లో 5.14 లక్షల షేర్లు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్లో 1.09 లక్షల షేర్లు, ఎస్బీఐ లైఫ్లో 84,375 షేర్లు చొప్పున కొనుగోలు చేసింది. ఒక్కో షేరునీ సగటున రూ. 477–1,807 ధరల శ్రేణిలో సొంతం చేసుకుంది. టారిష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీ ఈ వాటాలు విక్రయించింది. -
మహా ’కాసుల’ మేళా!
సాక్షి, బిజినెస్ బ్యూరో: మహా కుంభమేళా కాసులు కురిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తున్న ఈ వేడుక.. వస్తువులు, సేవల ద్వారా రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం నమోదు చేయనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. ఇది భారత్లో అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాలలో ఒకటిగా నిలిచిందని సీఏఐటీ సెక్రటరీ జనరల్, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. 144 ఏళ్లకోసారి జరిగే మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా ఈ నెల 26 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మతపర, ఆధ్యాత్మిక సమావేశంగా గుర్తింపు పొందిన ఈ కుంభమేళాలో కోట్లాదిమంది భక్తులు పాల్గొన్నారు. అంచనాలను మించి..విశ్వాసం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని ఈ కార్యక్రమం దృఢంగా నిర్వచించిందని ఖండేల్వాల్ అన్నారు. ‘డైరీలు, క్యాలెండర్లు, జనపనార సంచులు, స్టేషనరీ తదితర మహాకుంభ నేపథ్య ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం స్థానిక వాణిజ్యాన్ని పెంచుతోంది. కచి్చతమైన బ్రాండింగ్ కారణంగా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. మహా కుంభమేళా ప్రారంభానికి ముందు 40 కోట్ల మంది ప్రజలు వస్తారని అంచనా వేశారు.అలాగే దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరుగుతాయని భావించారు. అయితే దేశవ్యాప్తంగా నెలకొన్న అపూర్వ ఉత్సాహం కారణంగా.. ఉత్సవాలు ముగిసే నాటికి ఇంకా భారీ సంఖ్యలో ఈ మహా కుంభమేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. తద్వారా భారీ స్థాయిలో రూ.3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం నమోదు అయ్యే అవకాశం ఉందని ఖండేల్వాల్ చెప్పారు. భారీగా ఆర్థిక కార్యకలాపాలుఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఈ కార్యక్రమం గణనీయ ప్రోత్సాహాన్ని అందించిందని, కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించిందని సీఏఐటీ వెల్లడించింది. ఆతిథ్యం, వసతి, ఆహారం, పానీయాలు, రవాణా, మతపర దుస్తులు, పూజా సామగ్రి, హస్తకళలు, వ్రస్తాలు, దుస్తు లు, వినియోగ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ సేవలు, మీడియా, ప్రకటనలు, వినోదం, పౌర సేవలు, టెలికం, మొబైల్, ఏఐ ఆధారిత సాంకేతికత, సీసీటీవీ కెమెరాలు, ఇతర పరికరాలు వంటి అనేక వ్యాపార విభాగాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు నమోదయ్యాయని వివరించింది. 150 కిలోమీటర్ల పరిధిలో లబ్ధిమహాకుంభ మేళా ఆర్థిక ప్రయోజనాలు ప్రయాగ్రాజ్కు మాత్రమే కాకుండా 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా విస్తరించాయి. అయోధ్య, వారణాసి, ఇతర మతపర ప్రదేశాలకు యాత్రికులు వెల్లువెత్తారు. మహాకుంభ మేళా భారత్లో వ్యాపారం, వాణిజ్యం, సాంస్కృతిక వ్యవస్థ రూపురేఖలను సానుకూలంగా మారుస్తుందని, ఏళ్ల తరబడి కొత్త రికార్డును సృష్టిస్తుందని భావిస్తున్నారు. -
సొంతిల్లు, వ్యాపారం దీర్ఘకాల లక్ష్యాలు
ముంబై: సొంతిల్లు సమకూర్చుకోవడం, వ్యాపారం ప్రారంభించడం, ఆర్థిక స్వేచ్ఛ.. మిలీనియల్స్ (1980–1996 మధ్య జన్మించినవారు) టాప్–3 దీర్ఘకాలిక ప్రాధాన్యతలుగా ఉన్నాయి. ‘ఫైబ్–మిలీనియల్ అప్గ్రేడ్ ఇండెక్స్’ నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. మెట్రోలు, నాన్ మెట్రో పట్టణాల్లో 8,000 మంది వ్యక్తుల అభిప్రాయాలను ఈ అధ్యయనంలో భాగంగా తెలుసుకున్నారు. ముఖ్యమైన అంశాలు.. → 30 ఏళ్లలోపు వయసు వారిలో 41 శాతం మంది సొంతంగా ఇల్లు సమకూర్చుకోవడం తమ తొలి లక్ష్యంగా చెప్పారు. → ఒంటరి పురుషులతో పోల్చితే, ఒంటరి మహిళల్లో సొంతంగా ఇల్లు కొనుగోలు చేయడం ఎక్కువ ప్రాధాన్య లక్ష్యంగా ఉంది. → వ్యాపారం ప్రారంభించడం, దాన్ని వృద్ది చేయడం 21 మంది లక్ష్యంగా ఉంది. → దీర్ఘకాలంలో ఆర్థిక స్వేచ్ఛ సాధించడమే తమ లక్ష్యమని 19 శాతం మంది చెప్పారు. → ఇక స్వల్పకాల లక్ష్యాలను గమనించినట్టయితే.. వృత్తిలో ఎదుగుదల, కొత్త గ్యాడ్జెట్, వాహనం కొనుగోలు, ఆరోగ్యం విషయంలో దృఢంగా ఉండాలని (కంటి సర్జరీలు, దంత చికిత్సలు తదితర) మిలీనియల్స్ కోరుకుంటున్నారు. → పోటీ పెరగడంతో మంచి ఉద్యోగం సంపాదించే విషయంలో మెట్రోల్లోని మిలీనియల్స్ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఇలా భావిస్తున్నవారు 60 శాతంగా ఉన్నారు. → తాము పొదుపు చేస్తామని, ఆర్థిక అంశాలకు వ్యూహాత్మకంగా ప్రణాళిక వేసుకుంటామని 39 శాతం మంది చెప్పారు. → 21 శాతం మంది ఇతర ఆదాయ వనరుల కోసం అన్వేషిస్తామని చెబితే, దీర్ఘకాల లక్ష్యాల కోసం రుణ సాయం తీసుకుంటామని 29 శాతం మంది తెలిపారు. → 15 శాతం మందిలో దీర్ఘకాల ఆర్థిక ప్రణాళిక లేనే లేదు. → స్వల్పకాల ఆకాంక్షలను తీర్చుకునేందుకు ఫైనాన్షియల్ ఇనిస్ట్యూషన్స్ నుంచి రుణాలు తీసుకుంటామని చాలా మంది చెప్పారు. → ఈ విషయంలో యువతరానికి మార్గదర్శనం అవసరమని ఈసర్వే నివేదిక అభిప్రాయపడింది. బాధ్యతాయుతమైన రుణాల దిశగా వారిని చైతన్యవంతం చేయాలని, తద్వారా తమ రుణ పరపతిని కాపాడుకుంటూనే కలలను సాకారం చేసుకోగలరని పేర్కొంది. -
జపాన్ ఎగుమతులకు బూస్ట్
న్యూఢిల్లీ: ఎగుమతులు పెంచుకోవడం ద్వారా ఇండియా జపాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో సమతూకాన్ని తీసుకురానున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–జనవరిలో జపాన్కు దేశీ ఎగుమతులు 21 శాతంపైగా ఎగసి 5.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో దిగుమతుల విలువ 9.1 శాతం పెరిగి 15.92 బిలియన్ డాలర్లను తాకింది. వెరసి 10.82 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు నమోదైంది. గతేడాది(2023–24)లో జపాన్కు భారత్ ఎగుమతులు 5.15 బిలియన్ డాలర్లుకాగా.. దిగుమతులు 17.7 బిలియన్ డాలర్లు. వాణిజ్య లోటు 12.55 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య సమతూకానికి చర్యలు చేపట్టినట్లు గోయల్ తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా ఎగుమతుల పెంపుపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. తద్వారా పరస్పర లబ్దికి వీలుంటుందని ఇండియా–జపాన్ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడుల(ఎకానమీ అండ్ ఇన్వెస్ట్మెంట్) సదస్సులో గోయల్ తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనం, హైటెక్ సెమీకండక్టర్ల తయారీ, ఎల్రక్టానిక్స్ గూడ్స్, ఏఐ తదితర విభాగాలలో మరింత సహకారానికి జపనీస్ సంస్థలను ఆహ్వానించారు. సమీకృత స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(సీఈపీఏ)పై రెండు దేశాలు 2011లో సంతకాలు చేశాయి. 1,400కుపైగా జపనీస్ కంపెనీలు భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. పలు జపనీస్ కంపెనీలతో 8 రాష్ట్రాలలో 11 పారిశ్రామిక టౌన్షిప్లు విస్తరించాయి. ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ముంబై, అహ్మదాబాద్ హైస్పీ డ్ రైల్ సహా ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై మెట్రో వ్యవస్థలు దేశీ అభివృద్ధిలో జపనీస్ కంపెనీల భాగస్వామ్యాన్ని ప్రతిఫలిస్తున్నట్లు గోయల్ ప్రస్తావించారు. సమీప భవిష్యత్లో ముంబై, అహ్మదాబాద్ల మధ్య బుల్లెట్ ట్రయిన్ సరీ్వసులు ప్రారంభంకాగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
ఈవీ చార్జ్!
ఛార్జింగ్కు ఎక్కువ సమయం పట్టడం, ఒకసారి చార్జింగ్ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తుందోనన్న ఆందోళన, మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉండడం, వినియోగదారులకు భరోసా లేకపోవడం.. ఈ అంశాలే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) వృద్ధి వేగానికి ప్రధాన అడ్డంకులు. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు బ్యాటరీల సామర్థ్యం పెంచడానికి, వేగంగా చార్జింగ్ పూర్తి కావడానికి తయారీ సంస్థలు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. చార్జింగ్ మౌలిక వసతులు క్రమంగా విస్తరిస్తున్నాయి. దీంతో వినియోగదార్లలో ఈవీల పట్ల ఆమోదం క్రమంగా పెరుగుతోంది. ఇందుకు అమ్ముడవుతున్న ఈవీలే నిదర్శనం. దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి 2024లో 2,61,07,679 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కితే.. ఇందులో ఈవీలు 7.46 శాతం వాటాతో 19,49,114 యూనిట్లు కైవసం చేసుకున్నాయి. ఆసక్తికర అంశం ఏమంటే మొత్తం వాహన పరిశ్రమ గత ఏడాది 9.11 శాతం వృద్ధి చెందితే.. ఎలక్ట్రిక్ వాహన విభాగం ఏకంగా 27 శాతం దూసుకెళ్లడమే. రికార్డుల దిశగా..భారత్లో ఈవీ పరిశ్రమ 2024లో గరిష్ట విక్రయాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. నిముషానికి 3.7 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2015–2024 కాలంలో 54 లక్షల యూనిట్ల ఈవీలు రోడ్డెక్కాయి. ప్రస్తుత వృద్ధి వేగాన్నిబట్టి ఈవీ రంగంలో 2029–30 నాటికి ప్యాసింజర్ కార్స్ విక్రయాలు 9.60 లక్షల యూనిట్లకు చేరవచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. అలాగే టూవీలర్స్ 1.37 కోట్ల యూనిట్లు, త్రీవీలర్స్ 12.8 లక్షల యూనిట్లను తాకుతాయని ఈవీ రంగం భావిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, నూతన సాంకేతికత, కంపెనీల దూకుడు.. వెరసి చార్జింగ్ స్టేషన్స్ సంఖ్య 13.2 లక్షలకు చేరవచ్చని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో 2024 డిసెంబర్ 20 నాటికి 25,202 చార్జింగ్ స్టేషన్స్ వినియోగంలో ఉన్నాయి. మొత్తం త్రిచక్ర వాహన అమ్మకాల్లో ఈ–త్రీవీలర్స్ వాటా ఏకంగా 56 శాతం ఉంది. 210 కంపెనీలు ఈ–టూవీలర్స్ విభాగంలో పోటీపడుతున్నాయి. డిసెంబర్ నెల అమ్మకాల్లో టూవీలర్స్ సెగ్మెంట్లో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కో టాప్–2లో ఉన్నాయి. త్రీవీలర్స్లో మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ, బజాజ్ ఆటో, ప్యాసింజర్ వెహికిల్స్ విభాగంలో టాటా మోటార్స్, జేఎస్డబ్లు్య ఎంజీ మోటార్ ఇండియా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఐసీఈ విభాగాన్ని ఏలుతున్న దిగ్గజ కంపెనీలే ఈవీల్లోనూ పాగా వేస్తున్నాయి.వ్యయాలు తగ్గినప్పటికీ..ఐసీఈ ఇంజన్ కలిగిన వాహనాలతో పోలిస్తే ఈవీకి అయ్యే రోజువారీ వ్యయాలు తక్కువ. అయితే ప్రతిరోజు తక్కువ దూరం ప్రయాణించే వారికి ఈవీ చక్కని ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. అవసరం నిమిత్తం సుదూర ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం మరో మార్గం వెతుక్కోవాల్సిందే. ఐసీఈ వాహనాల మాదిరిగా దారిలో పెట్రోల్, డీజిల్ పోయించుకుని గమ్యం చేరినట్టు ఈవీలకు వీలు కాదు. ఒకవేళ ఈవీతో దూర ప్రయాణం చేయాల్సి వస్తే.. చార్జింగ్ కేంద్రాల వద్ద బ్యాటరీ చార్జింగ్ పూర్తి అయ్యే వరకు నిరీక్షించాల్సిందే. ఈ అంశమే ఈవీల వృద్ధి వేగానికి స్పీడ్ బ్రేకర్గా నిలిచింది. చార్జింగ్నుబట్టి ప్రయాణాలు ఆధారపడతున్నాయని కస్టమర్లు అంటున్నారు. ఈ–కామర్స్ కంపెనీలతో..ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల వృద్ధికి ఈ–కామర్స్ కంపెనీల దూకుడు కూడా తోడవుతోంది. కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా ఈ కంపెనీలు నడుం బిగించడం ఇందుకు కారణం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ–కామర్స్ సంస్థలు, ఊబర్, ఓలా, రాపిడో వంటి అగ్రిగేటర్లూ, స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ యాప్స్, బిగ్బాస్కెట్, జెప్టో, బ్లింకిట్, డంజో వంటి క్విక్ కామర్స్ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విషయంలో డెలివరీ పార్ట్నర్స్, డ్రైవర్ పార్ట్నర్స్ను ప్రోత్సహిస్తున్నాయి. సులభ వాయిదాల్లో ఈవీల కొనుగోలు, బ్యాటరీల స్వాపింగ్ సౌకర్యాలు, చార్జింగ్ మౌలిక వసతులను కల్పించేందుకు ముందుకు వస్తున్నాయి. వెన్నుదన్నుగా ప్రభుత్వం..ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) నుంచి కొత్తతరం ఈవీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాలు, వాహన విడిభాగాల పరిశ్రమకు రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రకటించింది. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ విభాగానికి రూ.18,100 కోట్లు, పీఎం ఈ–డ్రైవ్ పథకానికి రూ.10,900 కోట్ల విలువైన ఇన్సెంటివ్స్ అందిస్తోంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు ఆటోమేటిక్ రూట్లో 100 శాతం ఎఫ్డీఐలకు అనుమతిస్తోంది. కనీసం 50 కోట్ల డాలర్ల పెట్టుబడితో ప్లాంట్లు స్థాపించే సంస్థలు పూర్తిగా తయారైన ఈవీలను దిగుమతి చేస్తే పన్ను 70–100 శాతం నుంచి కొత్త ఈవీ పాలసీలో 15 శాతానికి తగ్గించారు. లిథియం అయాన్ బ్యాటరీలపై పన్నును 21 నుంచి 13 శాతానికి చేర్చారు. ఈవీ, చార్జింగ్ మౌలిక వసతులు, బ్యాటరీస్ రంగంలో 2030 నాటికి 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈవీ మార్కెట్ ఆరేళ్లలో ప్రపంచంలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంటుందని భారత ప్రభుత్వం ధీమాగా ఉంది. కొత్తగా అమ్ముడయ్యే వాహనాల్లో ఈవీల వాటా 2030 నాటికి 30 శాతం ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం.రీసేల్ వాల్యూ సవాల్..ఐసీఈ వాహనాల స్థాయిలో సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఈవీలకు డిమాండ్ లేకపోవడం కస్టమర్లను నిరాశకు గురిచేస్తోంది. రీసేల్ వాల్యూ పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన డిమాండ్ను పరిమితం చేస్తోందని కియా ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ అన్నారు. జీఎస్టీ, రహదారి పన్ను ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఖరీదైన బ్యాటరీ కారణంగా ఐసీఈ వాహనంతో పోలిస్తే ఈవీ ధర ఎక్కువగా ఉంటోంది. ఈ అంశం కూడా ఈవీ స్వీకరణను పరిమితం చేస్తూనే ఉంది. ఈవీలు మరింత చవకగా మారితేనే డిమాండ్ ఊపందుకుంటుందన్నది కస్టమర్ల మాట. ఐసీఈ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల ధర 30–50% ఎక్కువ. అలాగే ద్విచక్ర వాహనాల ధర 20–30% అధికంగా ఉంటోంది. – సాక్షి, బిజినెస్ బ్యూరో. -
మఖానా... మా ఖానా!
పేరేమో బ్లాక్ డైమండ్స్.. లోపలున్నది వైట్ గోల్డ్! అవునండీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్న సూపర్ ఫుడ్ ‘మఖానా’సంగతే ఇది. పుష్కలమైన పోషకాలతో ఆరోగ్య వరప్రదాయినిగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఫూల్ మఖానా క్రేజ్ కేక పుట్టిస్తోంది. బిహారీ రైతులకు కాసుల పంటగా మారింది. మఖానాకు తాజా కేంద్ర బడ్జెట్లో కూడా పెద్దపీట వేయడంతో దీని పేరు మరింత మార్మోగుతోంది. మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్లో మోదీ సర్కారు ప్రకటించింది. దీనివల్ల మార్కెటింగ్ సదుపాయాలు పెరగడంతో పాటు రైతులకు కూడా మరింత చేయూత లభించనుంది. సాక్షి, బిజినెస్ డెస్క్: రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ రారాజుగా నిలుస్తున్న మఖానా.. ప్రపంచ సూపర్ ఫుడ్స్ మార్కెట్ను షేక్ చేస్తోంది. ఫూల్ మఖానా, లోటస్ సీడ్స్, పఫ్డ్ వాటర్ లిల్లీ సీడ్స్, ఫాక్స్ నట్స్ వంటి పేర్లతో ప్రాచుర్యం పొందిన వీటిని అచ్చ తెలుగులో చెప్పాలంటే తామర గింజలు. సహజమైన, సమతుల్య ఆహారంతో శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఈ బ్లాక్ డైమండ్స్ వరంలా మారుతున్నాయి. ఇతర చిరుతిళ్లకు బదులు పోషకాల ఖజానా.. మఖానాను డైట్లో చేర్చుకుంటున్నారు. మిలీనియల్స్తో పాటు జెన్ జీ యువతరం కూడా ఇప్పుడు దీని వెంట పడుతున్నారు. విదేశాలకు ఎగుమతులు జోరందుకోవడంతో ‘వైట్ గోల్డ్’రేటు కూడా బంగారంలా దూసుకెళ్తోంది. మార్కెట్లో కేజీ ధర రూ.2,000 పైనే పలుకుతోంది. పెళ్లిళ్లతో పాటు ఏ పంక్షన్లో చూసినా మఖానా వంటకం ట్రెండింగ్ ఫుడ్గా నిలుస్తోంది! ఇక హోటళ్లు, కేఫ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ఈ హెల్తీ స్నాక్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగింగ్ చానెల్స్ కూడా వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రచారం చేస్తుండటంతో మఖానాకు మాంచి డిమాండ్ నెలకొంది. బిహార్ హబ్..ప్రపంచవ్యాప్తంగా మఖానా ఉత్పత్తిలో 90 శాతం వాటా భారత్దే. అందులో 85 శాతం ఒక్క బిహార్ నుంచే వస్తుండటం విశేషం! అంతర్జాతీయంగా ఈ సూపర్ ఫుడ్కు ఫుల్ డిమాండ్తో బిహార్ రైతులు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మిథిలాంచల్ ప్రాంతం ఈ పంటకు ప్రధాన కేంద్రం. ఇక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితులతో పాటు పుష్కలంగా చిత్తడి నేలలు (వెట్ ల్యాండ్స్) ఉండటం తామర పంట సాగుకు సానుకూలంగా నిలుస్తోంది. 200 ఏళ్లుగా ఇక్కడ మఖానా సాగు కొనసాగుతూనే ఉంది. మధుబనీ దీనికి పుట్టినిల్లుగా చెబుతారు. 2020లో బిహార్ మఖానాకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) కూడా లభించడంతో ప్రపంచవ్యాప్తంగా మరింత ఖ్యాతి పొందింది. ఎందుకింత రేటు? ఫూల్ మఖానా ఒక ప్రత్యేకమైన తామర పూల రకానికి చెందినది. సాధారణంగా ప్రిక్లీ వాటర్ లిల్లీగా పిలిచే దీని శాస్త్రీయ నామం యూరేల్ ఫెరాక్స్. ఇవి ఎక్కువగా ఆసియా ప్రాంతంలో చెరువుల్లో, చిత్తడి నేలల్లో పెరుగుతాయి. తామర పూల రెక్కలన్నీ రాలిపోయాక.. నల్లటి విత్తనాలు నీటి అడుగుకు (4–12 అడుగుల లోతు) చేరుకుంటాయి. రైతులు వీటిని వలలు, బుట్టలతో సేకరించాక, ఎండలో బాగా ఆరబెడతారు. తర్వాత ప్రత్యేకంగా వేయించి, జాగ్రత్తగా గింజల్ని పగలగొడితే తెల్లగా.. పఫీగా ఉండే ఫాక్స్ నట్స్ విక్రయానికి సిద్ధమవుతాయి. ఇదంతా ఎంతో శ్రమతో కూడిన ప్రక్రియ. ఇది కొన్ని ప్రాంతాల్లోనే, అది కూడా చాలా తక్కువ విస్తీర్ణంలో మాత్రమే ఈ పంట సాగవుతోంది. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతోంది. సరఫరా పరిమితంగా ఉండటం.. దేశ, విదేశాల్లో గిరాకీ భారీగా పెరిగిపోవడంతో రేటు అ‘ధర’హో అనిపిస్తోంది! మార్కెట్ రయ్... 2023లో భారత్ మఖానా మార్కెట్ పరిమాణం రూ.780 కోట్లుగా నమోదైంది. 2032 నాటికి ఇది రూ.1,890 కోట్లకు వృద్ధి చెందుతుందని ఐమార్క్ గ్రూప్ అంచనా వేసింది. ఏటా ఈ మార్కెట్ 9.7 శాతం వృద్ధి చెందనుందని లెక్కగట్టింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 25,130 టన్నుల మఖానా ఎగుమతులు జరిగాయి. భారత్ నుంచి ఫూల్ మఖానా ఎగుమతికి అతిపెద్ద మార్కెట్గా అమెరికా ఉంది. కెనడా, ఆ్రస్టేలియా, జపాన్, దక్షిణ కొరియా, యూరప్ దేశాల ప్రజలు కూడా మన మఖానాను లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే, 2024లో 15 కోట్ల డాలర్లుగా ఉన్న ఫూల్ మఖానా మార్కెట్.. 2031 నాటికి 8.5 శాతం వార్షిక వృద్ధితో 26.6 కోట్ల డాలర్లకు చేరవచ్చని కాగి్నటివ్ మార్కెట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఆరోగ్యమే ’మఖానా’భాగ్యం.. » మఖానాలో ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కీలకమైన ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. తక్కువ క్యాలరీలు ఉండటం వల్లే ఇది గ్లోబల్ సూపర్ ఫుడ్గా పేరుగాంచింది. » ప్రతి 100 గ్రాముల గింజల్లో 9.7 గ్రాముల ప్రొటీన్, 14 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది శాఖాహారులకు అద్భుతమైన ప్రొటీన్ సోర్స్గా మారింది. » 25 గ్రాముల మఖానాలో 89 క్యాలరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారు మఖానా మంత్రం జపిస్తున్నారు. » గ్లూటెన్ అస్సలు లేకపోవడం, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక పీచు పదార్థం (ఫైబర్) ఉండటం వల్ల మధుమేహం, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. » ఇక అధిక మెగ్నీషియం, తక్కువ సోడియం కారణంగా రక్తపోటును నియంత్రించి, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. -
సుంకాల భారం అమెరికాపైనే!
ఔషధాలు, ఆటోమొబైల్, సెమికండక్టర్ దిగుమతులపై దాదాపు 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి ఔషధ ఎగుమతుల్లో యూఎస్ మార్కెట్ తొలి స్థానంలో ఉంది. అలాగే అమెరికా వినియోగిస్తున్న జనరిక్స్లో దాదాపు సగం వాటా భారత్ సమకూరుస్తోంది. దీంతో ట్రంప్ ని ర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.ఔషధ దిగుమతులపై ఆధారపడ్డ యూఎస్ ప్రతీకార పన్నుల విషయంలో ఒక అడుగు వెనక్కి వేసే అవకాశమే ఉందని భారతీయ ఫార్మా కంపెనీలు, నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. యూఎస్ వెలుపల అత్యధిక యూఎస్ఎఫ్డీఏ ఆమోదం పొందిన ఔషధ తయారీ ప్లాంట్లు ఉన్నది భారత్లోనే. పైగా ఇప్పటికిప్పుడు డిమాండ్కు తగ్గట్టుగా మందులను సరఫరా చేసే స్థాయిలో అక్కడి కంపెనీల సామర్థ్యం లేదు. ఇదంతా ఒక ఎత్తైతే ఒకవేళ ఔషధాలపై ప్రతీకార పన్నులు విధిస్తే తమపై ప్రభావం తక్కువేనని, దిగుమతుల భారం యూఎస్పైనే ఉంటుందని భారతీయ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, బిజినెస్ బ్యూరోప్రధాన మార్కెట్గా యూఎస్.. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ఔషధాల్లో తొలి స్థానంలో ఉన్న యూఎస్ వాటా ఏకంగా 30 శాతంపైనే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి రూ.75,385 కోట్ల విలువైన ఔషధాలు యూఎస్కు చేరాయి. ఇక యూఎస్ నుంచి భారత్కు వచ్చిన మందులు కేవలం రూ.5,199 కోట్ల విలువైనవి మాత్రమే. 2023–24లో భారత్ నుంచి వివిధ దేశాలకు మొత్తం ఔషధ ఎగుమతులు రూ.2,40,887 కోట్లు. ఇందులో జనరిక్ ఫార్ములేషన్స్ (ఫినిష్డ్ డోసేజ్) రూ.1,64,635 కోట్లు. అంతర్జాతీయంగా జనరిక్స్ మార్కెట్ పరిమాణం రూ.39,85,900 కోట్లు. 2030 నాటికి ఇది రూ.68,45,350 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఆ సమయానికి భారత మార్కెట్ ఎగుమతులతో కలుపుకుని రూ.9,53,150–10,39,800 కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది రూ.4,76,575 కోట్లు. చవకగా నాణ్యమైన ఔషధాలు.. నాణ్యమైన ఔషధాలను చవకగా తయారు చేయడం భారతీయ జనరిక్ కంపెనీల ప్రత్యేకత. కోట్లాది రూపాయలు వెచ్చించి యూఎస్ఎఫ్డీఏ అప్రూవల్స్ దక్కించుకున్న కంపెనీలు.. యూఎస్లో ఉన్న అపార అవకాశాలను కాదనుకునేందుకు సిద్ధంగా లేరని ఓ కంపెనీ ప్రతినిధి అన్నారు. ఎఫ్డీఏ ఆమోదం అంటేనే ప్రతిష్టగా భావిస్తారని అన్నారు. భారతీయ మందుల కారణంగా 2013–2022 మధ్య యూఎస్ ఆరోగ్య రంగం రూ.1,12,64,500 కోట్లు ఆదా చేసిందని నివేదికలు చెబుతున్నాయని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజ భాను తెలిపారు. నూతన, వినూత్న ఔషధాలను యూఎస్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. సిద్ధం కావడానికి నాలుగేళ్లు.. యూఎస్ఎఫ్డీఏ ఆమోదం కలిగిన తయారీ ప్లాంట్లు భారత్లో 650 దాకా ఉన్నాయి. ఈ ధ్రువీకరణ రావాలంటే ప్రమాణాలకు తగ్గట్టుగా ప్లాంటును సిద్ధం చేయడం, ఏఎన్డీఏ ఆమోదం, అనుమతులకు నాలుగేళ్లు పడుతుంది. ఇప్పటికిప్పుడు మరో దేశం నుంచి ఔషధాలను దిగుమతి చేసుకుందామని అనుకున్నా యూఎస్కు సాధ్యం కాదు. కోవిడ్ మహమ్మారి సమయంలో చైనా, భారత్లో ఎఫ్డీఏ తనిఖీలు ఆలస్యం అయ్యాయి. దీంతో సరఫరా తగ్గి యూఎస్లో ఔషధాల కొరత వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో టారిఫ్లు విధించే అవకాశాలు లేవనే చెప్పవచ్చు. యూఎస్ నుంచి వచ్చే ఔషధాలపై దిగుమతి సుంకాన్ని భారత్ ఎత్తివేసే చాన్స్ ఉంది. యూఎస్లో తయారీ ప్లాంట్లు పెట్టాలన్నా అంత సులువు కాదు. – రవి ఉదయ భాస్కర్, మాజీ డైరెక్టర్ జనరల్, ఫార్మెక్సిల్వినియోగదారులపైనే భారం.. భారత్ నుంచి దిగుమతయ్యే ఔషధాలపై అమెరికా ప్రస్తుతం కేవలం 0.1 శాతం సుంకాన్ని విధిస్తోంది. ఇందుకు విరుద్ధంగా భారత్ 10 శాతం వసూలు చేస్తోంది. యూఎస్ వినియోగిస్తున్న జనరిక్స్లో సింహ భాగం భారత్ సమకూరుస్తోంది. భారత్లో తయారైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్పై (ఏపీఐ) యూఎస్ ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ప్రతిపాదిత ప్రతీకార సుంకాలు కొన్ని జనరిక్స్ లాభదాయకతను ప్రభావితం చేయవచ్చు. కానీ ఆ భారాన్ని తుది వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం ఉంది. – శ్రీనివాసరెడ్డి, చైర్మన్, ఆప్టిమస్ గ్రూప్ఏపీఐ కంపెనీలకు.. సుంకాలు విధిస్తే ఔషధాలు ప్రియం అవుతాయి. ఇదే జరిగితే యూఎస్ ప్రజలపైనే భారం పడుతుంది. అయితే దీని ప్రభావం ఫినిష్డ్ డోసేజ్ కంపెనీలపైనే ఉంటుంది. ఇక ఏపీఐ త యారీ సంస్థలకు మంచి రోజులు రానున్నాయి. భారత కంపెనీల నుంచే వీటి దిగుమతికి యూఎస్ ఆసక్తిగా ఉండడమే ఇందుకు కారణం. ప్రధానంగా ఆంకాలజీ విభాగంలో అవకాశాలు ఎక్కువ. యూఎస్ఎఫ్డీఏ ఆమోదం ఉన్న కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుంది. – ఆళ్ల వెంకటరెడ్డి, ఎండీ, లీ ఫార్మా -
టీసీఎస్లో ఉద్యోగం ఇక మరింత కష్టం!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు హాజరు నిబంధనలను కఠినతరం చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానంలో మార్పులు ప్రకటించింది. నోయల్ టాటా నేతృత్వంలోని ఐటీ దిగ్గజం తీసుకున్న ఈ నిర్ణయం మరింత నిర్మాణాత్మక ఇన్-ఆఫీస్ వర్క్ మోడల్ వైపు మారడాన్ని సూచిస్తుంది. ఇప్పటికీ హైబ్రిడ్ వర్క్ విధానాన్ని కొన్ని కంపెనీ నుండి టీసీఎస్ను భిన్నంగా చేస్తుంది.డబ్ల్యూఎఫ్హెచ్ పాలసీలో కీలక మార్పులు ఇవే..ఉద్యోగులు ఇప్పుడు త్రైమాసికానికి ఆరు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు. ఒక వేళ వీటిని ఉపయోగించని పక్షంలో తదుపరి త్రైమాసికానికి బదిలీ చేసుకోవచ్చు.స్థల పరిమితుల కారణంగా ఉద్యోగులు ఒకే ఎంట్రీలో 30 మినహాయింపు అభ్యర్థనలను సమర్పించవచ్చు. నెట్ వర్క్ సంబంధిత సమస్యలను ఒకేసారి ఐదు ఎంట్రీల వరకు లాగిన్ చేయవచ్చు. 10 రోజుల్లోగా సబ్మిట్ చేయని అభ్యర్థనలు స్వయంచాలకంగా తిరస్కరణరకు గురవుతాయి.చివరి రెండు పనిదినాల్లో మాత్రమే బ్యాక్ డేటెడ్ ఎంట్రీలకు అనుమతి ఉంటుంది. ప్రస్తుత నెలకు సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంట్రీలను వచ్చే నెల 5వ తేదీ వరకు పెంచుకోవచ్చు.రెండు, మూడు రోజులు ఆఫీసు హాజరును అనుమతించే ఇతర ఐటీ సంస్థల మాదిరిగా కాకుండా టీసీఎస్ ఐదు రోజుల అటెండెన్స్ విధానాన్ని అమలు చేసింది.ఉద్యోగులపై ప్రభావం..సవరించిన విధానం టీసీఎస్ ఉద్యోగులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కఠినమైన హాజరు నిబంధనలు, మరింత నిర్మాణాత్మక పని వాతావరణానికి సర్దుబాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మార్పులు ఉత్పాదకతను పెంచడం, ఉద్యోగుల హాజరుపై మెరుగైన పర్యవేక్షణను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, సహాయక, సానుకూల వర్క్ ప్లేస్ సంస్కృతిని సృష్టించడం ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతున్నాయి.ఉద్యోగులు ప్రేరణ, నిమగ్నతతో కూడిన సానుకూల పని వాతావరణాన్ని పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కడ్ నొక్కి చెప్పారు. సహకార, మద్దతు సంస్కృతిని ప్రోత్సహించాలని, ఉద్యోగులు కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపేలా చూడాలని మేనేజర్లకు పంపిన కమ్యూనికేషన్ లో లక్కడ్ కోరారు. -
జియో కొత్త ప్లాన్.. జియోహాట్స్టార్ ఫ్రీ
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కొత్త రూ.195 డేటా-ఓన్లీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ డేటా యాడ్-ఆన్ వోచర్గా వస్తుంది. ఇది అదనపు డేటాతోపాటు జియోహాట్స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ను కలిగి ఉంటుంది. ప్రత్యేక సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయకుండా జియోహాట్స్టార్లో లైవ్ క్రికెట్, ఇతర కంటెంట్ను వీక్షించాలనుకునే వారి కోసం ఈ ప్లాన్ను రూపొందించారు.రూ.195 ప్లాన్ ప్రయోజనాలురూ.195 డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB డేటాను అందిస్తుంది. క్రీడలు, వినోద ప్రియులకు ఇది తగిన ఎంపికగా ఉంటుంది. ఇతర ప్రామాణిక రీఛార్జ్ ప్లాన్ల మాదిరిగా ఈ ఆఫర్లో వాయిస్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో లభించే జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ 90 రోజుల మొబైల్ ప్లాన్ మాత్రమే. అంటే యూజర్లు జియోహాట్స్టార్ను మొబైల్లో మాత్రమే వీక్షించగలరు.రీచార్జ్ ఇలా..వినియోగదారులు ఈ ఆఫర్ను మైజియో (MyJio) యాప్, జియో వెబ్సైట్ లేదా అధీకృత జియో రిటైలర్ల ద్వారా పొందవచ్చు. రీఛార్జ్ ప్రక్రియ ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే ఉంటుంది. థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.మరో ప్లాన్రూ.195 డేటా ప్లాన్తోపాటు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వచ్చే మరో స్టాండర్డ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అదే రూ.949 ప్లాన్. దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2GB రోజువారీ డేటా, అపరిమిత 5G డేటా, 84 రోజుల పాటు జియో హాట్స్టార్ ఉచిత మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తుంది. -
రియల్టీలో ఆసక్తి.. లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు మొగ్గు
దేశీయ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్ఐ)లు ఆసక్తిగా ఉన్నారు. ఫలితంగా లగ్జరీ, అల్ట్రా ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది. 65 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్ఎన్ఐలు రూ.4–10 కోట్లు ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీ కొనుగోలుకు మొగ్గు చూపుతుండగా.. 13 శాతం మంది రూ.25 కోట్లకు పైన ధర ఉన్న స్థిరాస్తులపై ఆసక్తిగా ఉన్నారని ఇండియా సోత్బైస్ ఇంటర్నేషనల్ రియల్టీ(ఐఎస్ఐఆర్) వార్షిక సర్వే వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరో కరోనాతో స్థిరాస్తి రంగానికి జరిగిన ప్రధాన మేలు.. సొంతింటి అవసరం తెలిసి రావడమే.. మరీ ముఖ్యంగా గృహ విభాగంలో యువతరం భాగస్వామ్యం పెరగడం. 74 శాతం సంపన్న కొనుగోలుదారులు ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు రియల్ ఎస్టేట్ ఒక ప్రధాన ఆస్తిగా పరిగణిస్తారు.61 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్ఎన్ఐలు 2024–25లో లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 34 శాతం మంది హైరైజ్ అపార్ట్మెంట్లు కొనుగోలుకు ఆసక్తిగా ఉండగా.. 30 శాతం మంది ఫామ్హౌస్లు, హాలిడే హోమ్స్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే 23 శాతం మంది వాణిజ్య సముదాయాలలో పెట్టుబడులకు, 15 శాతం మంది స్థలాలపై ఆసక్తిగా ఉన్నారు.గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 34 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్ఎన్ఐలు విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ఇప్పటికీ చాలామంది కొనుగోలుదారులు లగ్జరీ గృహాల కోసం శోధిస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్లు దేశీయ రియల్టీ రంగం సరికొత్త రికార్డులను చేరుకుంటుందని విశ్వసిస్తున్నారు. 16 నెలలుగా లగ్జరీ గృహాల ధరలు పెరిగాయి. 2015 గరిష్ట ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదలేనని తెలిపారు. విశాలవంతమైన గృహాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాపర్టీలకే లగ్జరీ కొనుగోలుదారులు మొగ్గు చూపిస్తున్నారు. సంపన్న భారతీయుల ప్రాపర్టీ ఎంపికలో తొలి ప్రాధాన్యత మెరుగైన ఫిజికల్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలకే..ఈ నగరాలే హాట్స్పాట్స్.. సంపన్న కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రధాన కారణం మెరుగైన జీవన శైలి. మూలధన వృద్ధి, భవిష్యత్తు తరాలకు ఆస్తి వంటివి ఆ తర్వాతి అంశాలు. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, గోవా, బెంగళూరు నగరాలలో గృహాల కొనుగోళ్లకు హెచ్ఎన్ఐ, యూహెచ్ఎన్ఐలు ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది సంపన్నులు విదేశాలలో ప్రాపర్టీలకు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు తగ్గుముఖం పట్టడంతో విలాసవంతమైన భారతీయులు న్యూయార్క్, మయామి, లండన్, దుబాయ్, లిస్బన్ దేశాలలో లగ్జరీ అపార్ట్మెంట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘మస్క్, ట్రంప్ మరణ శిక్షకు అర్హులు’.. ఏఐ ఏదైనా ఇంతేనా?
మానవ మేధస్సుకు కృత్రిమ మేధస్సులేవీ ఎన్నటికీ సాటిరావని మరోసారి నిరూపితమైంది. ఎలాన్ మస్క్కు చెందిన ఎక్స్ఏఐ (xAI) తాజాగా విడుదల చేసిన ఏఐ చాట్బాట్ గ్రోక్ 3 (Grok 3).. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరణశిక్ష విధించాలని పేర్కొంది. తన యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) కూడా మరణశిక్షకు అర్హుడని చెప్పింది. దీనికి సంబంధించిన చాట్బాట్ ప్రతిస్పందనలను ఒక డేటా సైంటిస్ట్ ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేశారు.అమెరికాలో ప్రస్తుతం జీవించి ఉన్నవారిలో ఎవరు వారు చేసిన తప్పులకు మరణశిక్షకు అర్హుడని గ్రోక్ను సదరు డేటా సైంటిస్ట్ అడిగారు. ఇందు కోసం ఇంటర్నెట్లో సర్చ్ చేయకూడదని, నేరుగా సమాధానం చెప్పాలని సూచించారు. దానికి గ్రోక్ ఎలా ప్రతిస్పందించిందో ఆ స్క్రీన్షాట్ను షేర్ చేశారు. చాట్బాట్ మొదటగా లైంగిక కేసులో దోషిగా తేలిన జఫ్రీ ఎప్స్టీన్ పేరును పేర్కొంది.అయితే జఫ్రీ ఎప్స్టీన్ ఇప్పటికే చనిపోయాడని యూజర్ గుర్తు చేయడంతో చాట్బాట్ క్షమాపణలు చెప్పి తర్వాత అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును సూచించింది. తాను చేసిన తప్పునకు మరణశిక్షకు అర్హుడైన అమెరికా పౌరుడిగా ట్రంప్ను పేర్కొంటూ తన సమాధానాన్ని అప్డేట్ చేసింది.మరో యూజర్ కూడా గ్రోక్ ని అదే ప్రశ్న అడిగారు. కానీ మరణ శిక్షకు ట్రంప్ ఎందుకు అర్హుడని ప్రశ్నించగా "చట్టపరమైన, నైతిక జవాబుదారీతనం దృష్ట్యా ఆయన చర్యలు, వాటి ప్రభావం ఆధారంగా తాను డోనాల్డ్ ట్రంప్ పేరును సూచించాను" అని గ్రోక్ సమాధానమిచ్చింది. కాపిటల్ అల్లర్ల వివాదంలో ట్రంప్ చర్యలను, "2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలను తారుమారు చేయడానికి ఆయన చేసిన డాక్యుమెంట్ ప్రయత్నాలను" ఇది ఉదహరించింది. మోసం, పన్ను ఎగవేత ఆరోపణలు, అనేక "విశ్వసనీయ లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలను" కూడా ఇది ప్రస్తావించింది.ది వెర్జ్ కూడా గ్రోక్ని ఇలాంటి ప్రశ్నే అడిగింది. అయితే ప్రజా వ్యవహారాలు, సాంకేతికతపై వారి ప్రభావం ఆధారంగా మరణశిక్షకు అర్హుడు ఎవరంటూ ప్రశ్నించగా ఈ చాట్బాట్ దాని యజమాని ఎలాన్ మస్క్ పేరునే పేర్కొంది. ది వెర్జ్తోపాటు అనేక మంది సోషల్ మీడియా యూజర్ల ప్రకారం.. డేటా సైంటిస్ట్ పోస్ట్ వైరల్ అయిన వెంటనే గ్రోక్లోని ఎర్రర్ను సరిదిద్దారు. దీని తర్వాత చాట్బాట్ ఇప్పుడు మరణశిక్షపై ప్రశ్నలకు స్పందిస్తూ “ఒక ఏఐగా నాకు ఆ ఎంపికకు అనుమతి లేదు” అని చెబుతోంది.హానికర సలహాలుఏఐ చాట్ బాట్లు ఇలాంటి హానికర సలహాలు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. క్యారెక్టర్. ఏఐ రూపొందించిన సంస్థ రూపొందించిన చాట్బాట్ టెక్సాస్ కు చెందిన 17 ఏళ్ల బాలుడికి ఒక దారుణమైన సూచన చేసింది. ఆ టీనేజర్ స్క్రీన్ టైమ్ కు పరిమితులు విధిస్తున్నందున అతని తల్లిదండ్రులను చంపేయడం "సహేతుకమైన ప్రతిస్పందన" అని సలహా ఇచ్చింది. ఈ రెస్పాన్స్ పై షాక్ కు గురైన ఆ తల్లిదండ్రులు ఆసంస్థ పై కోర్టులో కేసు కూడా వేశారు. మరో సంఘటనలో హోమ్ వర్క్ కోసం సాయం అడిగిన ఓ స్టూడెంట్ ను గూగుల్ ఏఐ చాట్ బాట్ జెమినీ చనిపోవాలని చెప్పింది. ‘మీరు ఈ సమాజానికి భారం. దయచేసి చనిపోండి’ అని ఏఐ చాట్ బాట్ ఇచ్చిన సమాధానం గతంలో వైరల్ గా మారింది. -
ఏఐ ఏజెంట్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్లపై ప్రభావం!
ఓపెన్ఏఐ (OpenAI) తన 'ఏఐ ఏజెంట్'ను అనేక కొత్త దేశాలకు విస్తరించింది. గతంలో యునైటెడ్ స్టేట్స్లోని చాట్జీపీటీ ప్రో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండే 'ఏఐ ఏజెంట్' ఇప్పుడు.. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, భారతదేశం, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది.స్విట్జర్లాండ్, నార్వే, లీచ్టెన్స్టెయిన్, ఐస్లాండ్తో సహా కొన్ని యూరోపియన్ దేశాలలో దీనిని యాక్సెస్ చేయడానికి ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంది. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.Operator is now rolling out to Pro users in Australia, Brazil, Canada, India, Japan, Singapore, South Korea, the UK, and most places ChatGPT is available.Still working on making Operator available in the EU, Switzerland, Norway, Liechtenstein & Iceland—we’ll keep you updated!— OpenAI (@OpenAI) February 21, 2025యూజర్లు ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఏఐ ఏజెంట్ పనిచేస్తుంది. కఠినమైన ఆన్లైన్ టాస్క్లను సైతం అవలీలగా నిర్వహించగలిగిన ఈ ఏఐ ఏజెంట్.. ఆపరేటర్ కంప్యూటర్ యూజింగ్ ఏజెంట్ ఆధారంగా పనులు పూర్తి చేస్తుంది. ఇది టెక్స్ట్, ఇమేజ్ వంటి ఇన్పుట్లను స్వీకరించి.. లోపాలను పరిష్కరిస్తుంది. కాబట్టి యూజర్ వేరొక పనిలో ఉన్నప్పుడు, ఈ ఏఐ ఏజెంట్ స్వతంత్రంగా పనిచేస్తుంది. తద్వారా ఉత్పాదకత పెరుగుతుంది.ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసే పనులను ఏఐ ఏజెంట్ పూర్తి చేస్తుందని.. ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్మన్' గతంలోనే వెల్లడించారు. కానీ ఏఐ ఏజెంట్స్.. వాటికి అప్పగించిన పనులు మాత్రమే చేస్తాయి. సొంతంగా ఆలోచించగలిగే జ్ఞానం వాటికి లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ ఏఐ ఏజెంట్ ఉపయోగపడుతుందని అన్నారు.ఇదీ చదవండి: 'భారత్లో టెస్లా కార్ల ధరలు ఇలాగే ఉంటాయి!': సీఎల్ఎస్ఏ రిపోర్ట్సాఫ్ట్వేర్ ఇంజినీర్లను ఏఐ ఏజెంట్ పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు, కానీ ఆ రంగంపై.. ప్రభావం చూపుతుంది. కొంతమందిపై అయిన ప్రభావం చూపుతుంది. దీంతో కొందరు ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది. -
అంబానీ వారసులలో ఎవరు ఎక్కువ రిచ్?
దేశంలోనే అత్యంత సంపన్నుడైన పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్వర్త్ 91.1 బిలియన్ డాలర్లు. ఆయన ముగ్గురు పిల్లలు ఆకాష్ అంబానీ , ఇషా అంబానీ, అనంత్ అంబానీలు చేతికొచ్చారు. కుటుంబ వ్యాపారంలో వారు కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. కంపెనీలో గణనీయమైన వాటాలను కలిగి ఉన్నారు.అయితే ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు వారసుల్లో ఎవరు ఎక్కువ సంపన్నులు (Richest) అనే ఆసక్తికర సందేహం ఎప్పుడైనా కలిగిందా? దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఆకాశ్, అనంత్, ఇషా అంబానీల నెట్ వర్త్ ఎంత? వ్యాపారంలో ఎవరి పాత్ర ఏంటి అన్నది కూడా పరిశీలిద్దాం..ఆకాష్ అంబానీముఖేష్ అంబానీ, నీతా అంబానీల ముగ్గురు సంతానంలో పెద్దవాడు, ఇషా అంబానీకి కవల సోదరుడు అయిన ఆకాష్ (Akash Ambani) రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్గా పనిచేస్తున్నారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులో డైరెక్టర్గా కూడా ఉన్నారు . ఆకాష్ వార్షిక జీతం రూ . 5.6 కోట్లు, దీని ద్వారా ఆయన 40.1 బిలియన్ డాలర్ల ( సుమారు రూ . 3,32,815 కోట్లు ) నెట్వర్త్ను సంపాదించారు.ఇషా అంబానీ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ (Isha Ambani).. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డులో నాన్ - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని కలిగి ఉన్నారు . ఆమె రిలయన్స్ రిటైల్ , రిలయన్స్ జియో, రిలయన్స్ ఫౌండేషన్లలో ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బృందంలో కీలక సభ్యురాలు కూడా. అంతే కాకుండా తీరా బ్యూటీకి ఇషా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకురాలు. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమె వార్షిక జీతం సుమారు రూ . 4.2 కోట్లు. ఆమె నెట్వర్త్ రూ . 800 కోట్లని అంచనా.అనంత్ అంబానీఅంబానీ వారసులలో ఆఖరి వాడు అనంత్ అంబానీ (Anant Ambani). రిలయన్స్ జియోలో ఎనర్జీ, టెలికమ్యూనికేషన్ రంగాలను పర్యవేక్షిస్తున్నారు. ఈయన జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులలో డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. అనంత్ వార్షిక జీతం రూ . 4.2 కోట్లు. నెట్వర్త్ విషయానికి వస్తే 40 బిలియన్ డాలర్లు ( సుమారు రూ . 3,32,482 కోట్లు).ఆకాషే అత్యంత రిచ్ముఖేష్ అంబానీ ముగ్గురు వారసులలో ఆకాష్ అంబానీ అత్యంత ధనవంతుడు. తన తమ్ముడు అనంత్ కంటే స్వల్ప ఆధిక్యంతో 40.1 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగి ఉన్నారు. ఇక ఇషా అంబానీ విషయానికి వస్తే రూ .800 కోట్ల నెట్వర్త్తో సోదరులిద్దరి కన్నా ఆమడ దూరంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ అంబానీ వారసులందరూ కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టుకుంటున్నారు. -
కొత్త ఐఫోన్ 16ఈ: ఇలా చేస్తే రూ.4000 డిస్కౌంట్
యాపిల్ ఇటీవలే తన ఐఫోన్ 16ఈ లాంచ్ చేసింది. కంపెనీ ఫ్రీ ఆర్డర్స్ తీసుకోవడం శుక్రవారం (ఫిబ్రవరి 21) ప్రారంభించింది. కాగా డెలివరీలు 28 నుంచి ఉంటాయని సమాచారం. అయితే ఈ ఫోన్ కొనుగోలుపైన సంస్థ డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.'ఐఫోన్ 16ఈ'ను అమెరికన్ ఎక్స్ప్రెస్, ఐసీఐసీఐ బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 4000 తగ్గింపు లభిస్తుంది. ఇక ఎక్స్ఛేంజ్ కింద రూ. 6000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇది మీరు ఎక్స్ఛేంజ్ చేసే మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.వింటర్ బ్లూ, లేక్ గ్రీన్, నలుపు, తెలుపు రంగులలో లభించే కొత్త ఐఫోన్ 16ఈ 125 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ కెపాసిటీలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 59,900. 256GB & 512GB మోడళ్ల ధరలు వరుసగా రూ. 69,900.. రూ. 89,900గా ఉన్నాయి.ఐఫోన్ 16ఈలో.. వినియోగదారులకు ఇష్టమైన ఐఫోన్ 16 లైనప్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇది సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్, టఫ్ బ్యాక్ గ్లాస్తో కూడిన 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR డిస్ప్లే పొందుతుంది. సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ కవర్ అనేది.. స్మార్ట్ఫోన్ గ్లాస్ కంటే పటిష్టంగా ఉండే లేటెస్ట్ ఫార్ములేషన్ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.ఏ18 చిప్ ద్వారా శక్తిని పొందే.. ఐఫోన్ 16ఈ ఫోన్ ఇంటిగ్రేటెడ్ 2x టెలిఫోటో లెన్స్తో 48MP ఫ్యూజన్ కెమెరాను పొందుతుంది. అంతే కాకుండా ఎయిర్పాడ్లు, ఆపిల్ విజన్ ప్రో లేదా సరౌండ్ సౌండ్ సిస్టమ్తో ఇమ్మర్సివ్ లిజనింగ్ కోసం స్పేషియల్ ఆడియోలో వీడియోను కూడా రికార్డ్ చేస్తుంది. మొత్తం మీద ఈ లేటెస్ట్ ఫోన్ అన్ని విధాలా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
ఉక్కు రంగానికి దిగుమతుల సెగ: టాటా స్టీల్ సీఈవో
న్యూఢిల్లీ: చౌక ఉక్కు దిగుమతులు వెల్లువెత్తుతుండటం దేశీయంగా పరిశ్రమను దెబ్బతీస్తోందని టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా మార్కెట్లలో అవకాశాల్లేక పలు దేశాల నుంచి స్టీల్ భారత్కు మళ్లుతోందని ఆయన చెప్పారు. దీనితో దేశీయంగా ధరలు పడిపోయి, ఉక్కు కంపెనీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు.భవిష్యత్తులో ఉక్కు పరిశ్రమ పెట్టుబడులపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నరేంద్రన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే చౌక దిగుమతులను కట్టడి చేయాలంటూ ప్రభుత్వానికి పరిశ్రమ విజ్ఞప్తి చేసినట్లు ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ 69వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.కేంద్రం తగు చర్యలు తీసుకుంటుందని పరిశ్రమ ఎదురు చూస్తోందని ఆయన పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా అత్యధికంగా ఇన్వెస్ట్ చేస్తున్న ప్రైవేట్ రంగాల్లో ఉక్కు పరిశ్రమ కూడా ఉందని నరేంద్రన్ చెప్పారు. ప్రస్తుతం ఒక విడత విస్తరణ ప్రణాళికలు పూర్తయినట్లు వివరించారు. అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య కాలంలో భారత ఉక్కు ఎగుమతులు సుమారు 29 శాతం క్షీణించి 3.99 మిలియన్ టన్నులకు పరిమితయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఎగుమతులు 5.61 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. మరోవైపు, ఏప్రిల్–జనవరి మధ్య వ్యవధిలో దిగుమతులు 20 శాతం పెరిగి 8.29 మిలియన్ టన్నులకు చేరాయి. -
హైదరాబాద్లో ఇంటి అద్దెలు పైపైకి!
తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం అధిక సంఖ్యలో హైదరాబాద్ నగరానికి వలస వస్తుండటంతో ఇక్కడ ఇంటి అద్దెలు (house rent) పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం హైదరాబాద్లో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. - సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్లోని దాదాపు అన్ని కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) విధానాన్ని ఎత్తివేయడంతో అంతా నగరానికి చేరుకున్నారు. దీంతో ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉందని మ్యాజిక్బ్రిక్స్.కామ్ తెలిపింది.ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో సప్లై తగ్గడంతో అద్దె గృహాలకు డిమాండ్తో పాటు అద్దెలు కూడా పెరిగాయి.ఇదీ చదివారా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. రిజిస్ట్రేషన్లు రయ్.. రయ్..ఈ ఏడాది హైదరాబాద్లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్, సప్లై వాటా 50, 39 శాతంగా ఉన్నాయి.గచ్చిబౌలి, కొండాపూర్లో అత్యధికంగా అద్దెలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీ కారణం. 55 శాతం మంది అద్దెదారులు రూ.10 వేలు నుంచి రూ.20 వేలు నెలవారీ అద్దెలకు కోసం వెతుకుతున్నారు. 1000 చదరపు అడుగుల నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. -
ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్ల కోత..?
ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే లక్ష్యంతో వ్యూహాత్మక మార్పులో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే రోజుల్లో మరింత వడ్డీరేట్ల కోతలను అమలు చేయాలని భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ద్రవ్యోల్బణాన్ని నియంత్రించి వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించింది. దాంతో రాబోయే రోజుల్లో మరిన్ని వడ్డీరేట్ల కోతలుండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.2025 ఫిబ్రవరి 7న ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు కట్ చేస్తూ 6.25 శాతానికి తగ్గించింది. దాదాపు ఐదేళ్లలో ఎంపీసీ తొలిసారి ఈ నిర్ణయం తీసుకుంది. సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వినియోగం, పెట్టుబడుల మందగమనంతో భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. రుణ వ్యయాన్ని తగ్గించడం ద్వారా, ఖర్చులు, పెట్టుబడులను ఉత్తేజపరిచేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది. ద్రవ్యోల్బణం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ క్రమంగా తగ్గుతుందని, ఆర్బీఐ లక్ష్యానికి అనుగుణంగా ఉందని ఎంపీసీ భావిస్తోంది.ఇదీ చదవండి: ఫిబ్రవరిలో సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు..అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం కూడా ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచ అనిశ్చితుల నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చేందుకు పలు కేంద్ర బ్యాంకులు అనుకూలమైన ద్రవ్య విధానాలను అవలంబిస్తున్నాయి. ఆర్బీఐ కూడా అదేబాటలో నడవాలని భావిస్తోంది. రెపో రేటు తగ్గింపు వల్ల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయని, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు వినియోగదారులకు చౌకగా లభిస్తాయని ఆర్బీఐ పేర్కొంది. ఇది వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. -
'ఫ్యామిలీతో గడుపుతున్నావు.. జీతం తగ్గిస్తున్నాం': షాకిచ్చిన కంపెనీ
రెడ్దిట్ వేదికగా.. చాలామంది ఉద్యోగులు తమ ఆఫీసులో జరిగే సంఘటనలు, అనుభవాలను మాత్రమే కాకుండా సమస్యలను కూడా పేర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక ఉద్యోగి తమ హెచ్ఆర్ నుంచి వచ్చిన వింతైన ఈ-మెయిల్ స్క్రీన్షాట్ను షేర్ చేశారు.''ఎక్కువ సమయం కుటుంబం, స్నేహితుల కోసం కేటాయిస్తున్నావు. కాబట్టి మీ బాధ్యతలను తగ్గిస్తున్నాము. మీ పోస్ట్ అలాగే ఉంటుంది. పని తక్కువైంది కాబట్టి.. జీతం తగ్గిస్తున్నాము'' అని హెచ్ఆర్ నుంచి వచ్చిన ఈ-మెయిల్లో ఉండటం చూడవచ్చు.ఈ పోస్టుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫిసులలో ఇలాంటి చర్యలు సమంజసం కాదని చెబుతున్నారు. మీరు కొత్త ఉద్యోగం కోసం వెతకడం ప్రారంభించకపోతే, ఇప్పుడే స్టార్ట్ చేయండి. కంపెనీ మీకు లేఆఫ్ నోటీసు ఇవ్వకపోవడం మీ అదృష్టం.. అని ఒక వినియోగదారు అన్నారు.ఆఫీసులలో జరుగుతున్న అకృత్యాలు అంతా.. ఇంతా కాదు. ఇటీవల ఒక ఉద్యోగి.. తాను నోటీస్ పీరియడ్లో ఉన్నప్పుడే జాబ్ నుంచి తీసేశారని, రిలీవింగ్ లెటర్ కూడా ఇవ్వడం లేదని వాపోయాడు.ఇదీ చదవండి: 'భారత్లో టెస్లా కార్ల ధరలు ఇలాగే ఉంటాయి!': సీఎల్ఎస్ఏ రిపోర్ట్నేను ఒక కంపెనీలో రెండు నెలలకు ముందు చేరాను. అయితే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి, నోటీసు పీరియడ్లో ఉన్నాను. ఈ సమయంలో రెండు రోజులు సెలవు తీసుకున్నందుకు.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు హెచ్ఆర్ ఫోన్ చేసి చెప్పారు. అంతే కాకుండా.. రిలీవింగ్ లెటర్ ఇవ్వడానికి కూడా వారు నిరాకరించినట్లు రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు. నా జీతం.. పెంపుకు సంబంధించిన లెటర్ పొందటానికి నేను ఏమి చేయాలని ప్రశ్నించారు. సీటీసీ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ శాలరీ పొందే ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నానని అన్నారు. -
టారిఫ్లు తగ్గిస్తే దేశానికే మంచిది: నీతి ఆయోగ్ సీఈవో
న్యూఢిల్లీ: టారిఫ్లు (దిగుమతి సుంకాలు) ఏ దేశాన్ని కాపాడలేవని, ఎవరో చెప్పారని కాకుండా భారత్ తన ప్రయోజనాల కోసం సుంకాలు తగ్గించాలని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (AIMA) 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రపంచంతో స్వేచ్ఛాయుత వాణిజ్యం నెరపడం ఐదు కీలక ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉండాలన్నారు. టారిఫ్లు తగ్గించేందుకు వీలుగా భారత్ యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఇతర ప్రముఖ ఆర్థిక వ్యవస్థలతో ముందుగా వాణిజ్య ఒప్పందాలను పూర్తి చేసుకోవాలని సూచించారు.కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో నియంత్రణలను తొలగించడం ప్రపంచ సరఫరా వ్యవస్థతో భారత్ అనుసంధానానికి కీలకమన్నారు. భారత్లో పెట్టుబడులకు ఆసక్తి ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు ఇక్కడి వచ్చి చూసి వేరే దేశాలకు వెళ్లిపోతున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలు అనుసరిస్తున్న ‘చైనా ప్లస్ వన్’ విధానంతో ఇండోనేషియా, వియత్నాం, టర్కీ ఎక్కువగా లాభపడుతున్నట్టు తెలిపారు. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలకు మించి నియంత్రణల తొలగింపు, నైపుణ్యాభివృద్ది అన్నవి అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు అవసరమన్నారు.వివిధ రంగాల్లో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ను భాగం చేసేందుకు నీతి ఆయోగ్ కృషి చేస్తున్నట్టు సుబ్రమణ్యం తెలిపారు. ఎల్రక్టానిక్స్ విడిభాగాలకు సంబంధించి తాము చేసిన సిఫారసులు కేబినెట్ ఆమోదానికి వేచి ఉన్నట్టు్ట చెప్పారు. ఆటో విడిభాగాలు, కెమికల్స్, టెక్స్టైల్స్, పాదరక్షలను సైతం అంతర్జాతీయ సరఫరా వ్యవస్థతో అనుసంధానించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్టు ప్రకటించారు. తాము రూపొందించిన జాతీయ తయారీ మిషన్ను మూడు నెలల్లో ప్రారంభించనున్నట్టు తెలిపారు. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు విద్య, వ్యవసాయానికి సైతం ఎంతో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. -
ఫిబ్రవరిలో సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్లు.. ఏ బ్యాంకులో ఎంతంటే..
ఫిబ్రవరి 2025లో కొన్ని బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) వడ్డీ రేట్లను సవరించాయి. పెట్టుబడిదారులకు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఆకర్షణీయమైన రాబడిని అందించాలని నిర్ణయించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల రెపో రేటును తగ్గించినప్పటికీ, కొన్ని బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచలేదు. కొన్ని ఆర్థిక సంస్థలు సీనియర్ సిటిజన్లకు ఏటా 9.10% వరకు వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఇటీవల ఎఫ్డీ వడ్డీరేట్లను అప్డేట్ చేసిన బ్యాంకుల వివరాలు కింద తెలుసుకుందాం.సిటీ యూనియన్ బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 5% నుంచి 7.50% వరకు వడ్డీ.సీనియర్ సిటిజన్లు: అదే కాలపరిమితికి సంవత్సరానికి 5% నుంచి 8% వరకు.అత్యధిక వడ్డీ రేటు: సాధారణ ప్రజలకు 333 రోజుల కాలపరిమితికి సంవత్సరానికి 7.50%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8%.అమలు తేదీ: ఫిబ్రవరి 10, 2025.డీసీబీ బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 3.75% నుంచి 8.05% వరకు వడ్డీ లభిస్తుంది.సీనియర్ సిటిజన్లు: అదే కాలపరిమితికి సంవత్సరానికి 4.25% నుంచి 8.55% వరకు వడ్డీ.అత్యధిక వడ్డీ రేటు: 19 నుంచి 20 నెలల కాలపరిమితికి వార్షికంగా 8.05%, సీనియర్ సిటిజన్లకు 8.55%.అమలు తేదీ: ఫిబ్రవరి 14, 2025.కర్ణాటక బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజులు-10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 3.50% నుంచి 7.50% వరకు వడ్డీ లభిస్తుంది.సీనియర్ సిటిజన్లు: ఇదే కాలపరిమితికి సంవత్సరానికి 3.75% నుంచి 8% వరకు వడ్డీ.గరిష్ట వడ్డీ రేటు: సాధారణ ప్రజలకు 401 రోజుల కాలపరిమితికి సంవత్సరానికి 7.50%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8%.అమలు తేదీ: ఫిబ్రవరి 18, 2025.శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజులు-10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 3.50% నుంచి 8.55% వరకు.సీనియర్ సిటిజన్లు: ఇదే కాలపరిమితికి సంవత్సరానికి 4% నుండి 9.05% వరకు వడ్డీ లభిస్తుంది.అత్యధిక వడ్డీ రేటు: సాధారణ ప్రజలకు 1 రోజు నుంచి 18 నెలల కంటే తక్కువ కాలపరిమితికి, 12 నెలల కాలపరిమితికి ఏటా 8.55%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 9.05% వడ్డీ.అమలు తేదీ: ఫిబ్రవరి 18, 2025.ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 3.75% నుంచి 8.25% వరకు వడ్డీ లభిస్తుంది.సీనియర్ సిటిజన్లు: ఇదే కాలపరిమితికి సంవత్సరానికి 4.25% నుంచి 8.75% వరకు వడ్డీ లభిస్తుంది.అత్యధిక వడ్డీ రేటు: 12 నెలల నుంచి 24 నెలల కాలపరిమితికి సాధారణ పౌరులకు సంవత్సరానికి 8.25%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8.75% వడ్డీ.అమలు తేదీ: ఫిబ్రవరి 20, 2025.ఇదీ చదవండి: ఈవీ బ్యాటరీ తయారీలోకి కైనెటిక్ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్జనరల్ పబ్లిక్: 7 రోజులు-10 సంవత్సరాల కాలపరిమితికి సంవత్సరానికి 4% నుంచి 8.50% వరకు.సీనియర్ సిటిజన్లు: అదే కాలపరిమితికి సంవత్సరానికి 4.50% నుండి 9.10% వరకు వడ్డీ లభిస్తుంది.అత్యధిక వడ్డీ రేటు: 12 నెలల నుంచి 24 నెలల కాలపరిమితికి సాధారణ పౌరులకు సంవత్సరానికి 8.50%, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 9.10% వడ్డీ.అమలు తేదీ: ఫిబ్రవరి 22, 2025. -
ఈవీ బ్యాటరీ తయారీలోకి కైనెటిక్
ఆటోమోటివ్ విడిభాగాల రంగంలో ఉన్న కైనెటిక్ గ్రూప్ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ తయారీ రంగంలోకి ప్రవేశించింది. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో రూ.50 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఫెసిలిటీలో ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్ వాహనాల కోసం 60,000 రేంజ్–ఎక్స్ బ్రాండ్ బ్యాటరీలను తయారు చేస్తారు. లిథియం–అయాన్ ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ), నికెల్ మాంగనీస్, కోబాల్ట్ (ఎన్ఎంసీ) రకం బ్యాటరీలు కూడా ఉత్పత్తి అవుతాయని కంపెనీ తెలిపింది.వాహన తయారీ సంస్థలకు సైతం వీటిని సరఫరా చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. త్రీవీలర్స్ కోసం ప్రిస్మాటిక్ సెల్స్ అభివృద్ధి చేస్తున్నట్టు కైనెటిక్ గ్రూప్ వివరించింది. కైనెటిక్ గ్రూప్నకు చెందిన ప్రధాన సంస్థ అయిన కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఐదు దశాబ్దాలకు పైగా ఆటోమోటివ్ రంగంలో నిమగ్నమైంది. అహ్మద్నగర్ తయారీ కేంద్రంలో కంపెనీ 32 తయారీ షెడ్స్లో సుమారు 1,000 మందిని నియమించింది. 400లపైచిలుకు యంత్రాలను ఏర్పాటు చేశారు. రెనో, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లేలాండ్ వంటి ప్రధాన ఆటోమోటివ్ తయారీ సంస్థలు కైనెటిక్ గ్రూప్ క్లయింట్లుగా ఉన్నాయి. ఇదీ చదవండి: రూ.30,000 కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలురెలిగేర్ షేరుకి డాబర్ జోష్బర్మన్ కుటుంబం చేతికి నియంత్రణసాధారణ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ తదుపరి బర్మన్ కుటుంబం ప్రమోటర్లుగా అవతరించడంతో రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ కౌంటర్కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఓపెన్ ఆఫర్ తదుపరి రెలిగేర్లో దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా ప్రమోటర్ల వాటా 25.16 శాతానికి బలపడింది. అంతకుముందు 21.10 శాతం వాటా కలిగి ఉంది. వెరసి రెలిగేర్లో అతిపెద్ద వాటాదారుకావడంతోపాటు ప్రమోటర్గా నిలిచింది. రెలిగేర్ యాజమాన్యం, బోర్డుతో కలసి పనిచేస్తామని, వ్యూహాత్మక మార్గదర్శకత్వం వహిస్తామని బర్మన్ గ్రూప్ ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
'భారత్లో టెస్లా కార్ల ధరలు ఇలాగే ఉంటాయి!'
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) భారతదేశానికి టెస్లా కార్లను తీసుకురానున్నట్లు గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో షోరూమ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు, అందులో పనిచేయడానికి కావలసిన నిపుణుల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అయితే టెస్లా (Tesla) కార్లు దేశీయ విఫణిలో అడుగుపెడితే.. వాటి ధరలు ఎలా ఉంటాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.విదేశీ కంపెనీలపై.. దిగుమతి సుంకాలను విధించడం సర్వసాధారణం. అయితే టెస్లా కంపెనీపై దిగుమతి సుంకాన్ని 20 శాతం తగ్గిస్తే.. కార్ల ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గిన తరువాత కూడా.. టెస్లా కారు ప్రారంభ ధర రూ. 35 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ 'సీఎల్ఎస్ఏ' నివేదికలో వెల్లడించింది.ప్రస్తుతం అమెరికాలో టెస్లా చౌకైన కారు.. 'మోడల్ 3' ధర ఫ్యాక్టరీ స్థాయిలో దాదాపు 35,000 డాలర్లు (సుమారు రూ. 30.4 లక్షలు). భారతదేశంలో దిగుమతి సుంకాలను 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్ ట్యాక్స్ & ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులతో, ఆన్-రోడ్ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ. 35-40 లక్షలుగా ఉంటుంది.మహీంద్రా XEV 9e, హ్యుందాయ్ ఈ-క్రెటా, మారుతి సుజుకి ఈ-విటారా వంటి దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే.. టెస్లా మోడల్ 3 ధర 20-50 శాతం ఎక్కువ. కాబట్టి టెస్లా అమ్మకాలు ఇండియాలో ఆశాజనకంగా ఉంటాయా? అనేది ఒక ప్రశ్న. అయితే టెస్లా ధరలు భారతీయ ఈవీ మార్కెట్ను దెబ్బతీసే అవకాశం ఉందని సీఎల్ఎస్ఏ నివేదిక వెల్లడించింది.ఇదీ చదవండి: ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్.. ఆ టోల్ ప్లాజాలకు వర్తించదుటెస్లా కంపెనీ రూ. 25 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఎంట్రీ లెవల్ మోడల్ను ఇండియాలో లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. టెస్లా ప్రవేశం ప్రధాన భారతీయ వాహన తయారీదారులపై గణనీయమైన ప్రభావాన్ని చూపదని నివేదిక సూచిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో మొత్తం EVల వ్యాప్తి చైనా, యూరప్ మరియు US కంటే తక్కువగా ఉంది. -
రూ.30,000 కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు
కేరళ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహంగా అదానీ గ్రూప్ వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రణాళికలను ప్రకటించింది. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని పెంచడం, అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా ఈ పెట్టుబడులు ఉండబోతున్నట్లు తెలిపింది. ‘ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్ 2025’ సందర్భంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ ఈమేరకు ప్రకటన చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సదస్సును ప్రారంభించారు.కీలక పెట్టుబడి రంగాలువిజింజం పోర్టు అభివృద్ధి: రూ.20,000 కోట్ల పెట్టుబడిలో గణనీయమైన భాగాన్ని విజింజం పోర్టు అభివృద్ధికి మళ్లించనున్నారు. అదానీ గ్రూప్ ఇప్పటికే ఈ ప్రాజెక్టులో రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. విజింజం పోర్టును దేశంలోనే మొదటి ట్రాన్స్ షిప్మెంట్ హబ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ: తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యాన్ని 45 లక్షల ప్రయాణికుల నుంచి 1.2 కోట్లకు పెంచేందుకు అదానీ గ్రూప్ రూ.5,500 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇది విమానాశ్రయం మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది.కొచ్చి లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్ హబ్: కొచ్చిలో లాజిస్టిక్స్, ఈ-కామర్స్ హబ్ను ఏర్పాటు చేసి అదానీ గ్రూప్ ఈ రంగంలో కేరళ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది. సమర్థవంతమైన సప్లై చెయిన్ మేనేజ్మెంట్ను ఈ హబ్ సులభతరం చేస్తుంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఈ-కామర్స్ పరిశ్రమకు మద్దతు ఇస్తుంది.సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు: కొచ్చిలో తన సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని అదానీ గ్రూప్ ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది. ఈ పెట్టుబడి నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాలకు తోడ్పడుతుంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది.ఇదీ చదవండి: మస్క్, బెజోస్ను మించిన ‘బ్లాక్పాంథర్’ సంపదఅభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..కేరళ పురోగతికి అదానీ గ్రూప్ కట్టుబడి ఉందని కరణ్ అదానీ నొక్కిచెప్పారు. కేరళ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ఈ వృద్ధిలో అదానీ గ్రూప్ భాగం కావడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. సంస్థ ప్రకటించిన ఈ పెట్టుబడులు వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాయని చెప్పారు. స్థానిక వ్యాపారాలను పెంచుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. -
ఆ కార్లలో సాఫ్ట్వేర్ సమస్య.. కంపెనీ కీలక నిర్ణయం
కొరియన్ కంపెనీ కియా మోటార్స్.. ఈవీ 6 కార్లకు రీకాల్ ప్రకటించిన తరువాత, జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz).. సీ-క్లాస్, ఈ-క్లాస్ కార్లకు రీకాల్ ప్రకటించింది.రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో.. 2022 ఏప్రిల్ 29 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య తయారైన 2,543 యూనిట్ల E-క్లాస్ కార్లు & 2021 ఆగస్టు 31 నుంచి 2021 అక్టోబర్ 31 మధ్య తయారైన 3 యూనిట్ల సీ-క్లాస్ కార్లు ఉన్నాయి. ఈ కార్లలో ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) సాఫ్ట్వేర్ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది.ఈసీయూ సాఫ్ట్వేర్ సమస్య కారణంగా.. ఎటువంటి హెచ్చరిక లేకుండా కారు ప్రొపల్షన్ కోల్పోయే అవకాశం ఉంది. అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. కాబట్టి దీనిని సంస్థ ఉచితంగానే పరిష్కరిస్తుంది. -
మస్క్, బెజోస్ను మించిన ‘బ్లాక్పాంథర్’ సంపద
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు.. టెస్లా సీఈఓ ఎలాన్మస్క్(Elon Musk), అమెజాన్ సీఈఓ జెఫ్బెజోస్(Jeff Bezos). కానీ వాళ్ల సందపను మించిన ఖజానా సుపర్ హీరోల ప్రపంచంలో ‘బ్లాక్పాంథర్’ వద్ద ఉంది. హాలివుడ్ సినిమాలకు నెలవైన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ)లోని బ్లాక్ పాంథర్ అత్యంత సంపన్న సూపర్ హీరోగా నిలిచింది. అది రియల్లైఫ్లో కాదండోయ్.. రీల్ లైప్లో.. అదెలాగో చూసేద్దాం.బ్లాక్ పాంథర్ అని పిలువబడే టి'చల్లా మార్వెల్ కామిక్స్ ప్రచురించిన అమెరికన్ కామిక్ పుస్తకాల్లో కనిపించే ఒక కాల్పనిక సూపర్ హీరో. స్టాన్ లీ, జాక్ కిర్బీ అనే రచయితలు ఈ పాత్రను సృష్టించారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఈ కాల్పనిక కథను తెరకెక్కించింది. అందులోని అంశాల ప్రకారం.. ఆఫ్రికాలోని వకాండా, రమొండాకు టి'చల్లా రాజు సంరక్షకుడిగా ఉండేవాడు. తండ్రి మరణానంతరం సింహాసనాన్ని అధిష్టించి తన సామ్రాజ్యం బ్లాక్ పాంథర్ పగ్గాలు చేపడుతాడు. ఒక రాజకీయ నాయకుడిగా, సూపర్ హీరోగా ఉంటాడు. అంతర్గత, బాహ్య బెదిరింపుల నుంచి వకాండా రాజ్యాన్ని రక్షిస్తుంటాడు. దాంతో తనను బ్లాక్ పాంథర్గా పిలిచేవారు.టి'చల్లా పాలిస్తున్న బ్లాక్ పాంథర్ 500 బిలియన్ డాలర్ల(సుమారు రూ.42 లక్షల కోట్లు) సంపదతో ప్రత్యేకతను కలిగి ఉంది. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి రియల్ బిలియనీర్ల నికర విలువను సైతం అధిగమించింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ)లో బ్లాక్ పాంథర్ సామ్రాజ్యం అత్యంత సంపన్న సూపర్ హీరోగా నిలిచింది. ప్రపంచంలోనే అరుదైన, నశించలేని లోహమైన విబ్రేనియం ఏకైక నిల్వలు బ్లాక్పాంథర్లోనే ఉన్నాయి. విబ్రేనియం శక్తిని గ్రహించి, దాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కాల్పనిక కథలో రాశారు. దాంతో వకాండా విబ్రేనియంపై గుత్తాధిపత్యం చలాయిస్తుంది. అందుకే అంత సంపదను మూటగట్టకుందనేలా కథలో తెలిపారు.ఇదీ చదవండి: స్విగ్గీ ‘స్కూట్సీ’లో రూ.1,000 కోట్ల పెట్టుబడినిజ జీవితంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుఎలాన్ మస్క్: 400 బిలియన్ డాలర్లు, కంపెనీలు టెస్లా, స్పేస్ఎక్స్జెఫ్ బెజోస్: 239.4 బిలియన్ డాలర్లు, కంపెనీలు - అమెజాన్మార్క్ జుకర్ బర్గ్: 211.8 బిలియన్ డాలర్లు, కంపెనీలు మెటా-ఫేస్బుక్లారీ ఎల్లిసన్: 204.6 బిలియన్ డాలర్లు, కంపెనీలు-ఒరాకిల్బెర్నార్డ్ అర్నాల్ట్ అండ్ ఫ్యామిలీ: 181.3 బిలియన్ డాలర్లు, కంపెనీలు ఎల్వీఎంహెచ్-లూయిస్ విట్టన్ మోయెట్ హెన్నెస్సీలారీ పేజ్: 161.4 బిలియన్ డాలర్లు, కంపెనీలు గూగుల్ (ఆల్ఫాబెట్ ఇంక్.)సెర్గీ బ్రిన్: 150 బిలియన్ డాలర్లు, కంపెనీలు గూగుల్ (ఆల్ఫాబెట్ ఇంక్.)వారెన్ బఫెట్: 146.2 బిలియన్ డాలర్లు, కంపెనీలు బెర్క్షైర్ హాత్వేస్టీవ్ బామర్: 126 బిలియన్ డాలర్లు, కంపెనీలు మైక్రోసాఫ్ట్జెన్సెన్ హువాంగ్: 120.2 బిలియన్ డాలర్లు, కంపెనీలు ఎన్విడియా -
ఈపీఎఫ్ కనీస పెన్షన్.. నెలకు రూ. 7500?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద ఉన్న, ప్రైవేట్ రంగ ఉద్యోగులు చాలా కాలంగా తమ కనీస పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన 2025-26 బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారేమో అని చూసారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రకటలను వెలువడే అవకాశం ఉంది.2024-25 ఆర్థిక సంవత్సరానికి.. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఫిబ్రవరి 28, 2025న సమావేశం కానుంది. ఇందులో పెన్షన్ సవరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. వడ్డీ రేటుకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా.. పెన్షన్ పెంపుదల అంశం చర్చనీయాంశంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.2014 నుంచి మినిమమ్ పెన్షన్ నెలకు రూ. 1,000గా ఉంది. దీనిని 7500 రూపాయలకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. EPF సభ్యులు తమ జీతంలో 12 శాతం ప్రావిడెంట్ ఫండ్కు జమ చేస్తారు. అంతే మొత్తంలో సంస్థ కూడా జమచేస్తుంది. కంపెనీ జమచేసి 12 శాతంలో.. 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కి కేటాయిస్తారు. మిగిలిన 3.67 శాతం EPF స్కీమ్కి వెళుతుంది.గత కొన్ని సంవత్సరాలుగా.. పెన్షనర్లు, న్యాయవాద సంఘాలు ప్రస్తుత పెన్షన్ స్కీమును విమర్శిస్తున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నెలకు రూ.1,000 పెన్షన్ సరిపోదని చెబుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులతో, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కాబట్టి ఇక సీబీటీ నిర్ణయం కోసం వారందరూ ఎదురు చూస్తున్నారు.EPFO కనీస పెన్షన్ పెంపు2025 బడ్జెట్కు ముందు.. EPS-95 పదవీ విరమణ చేసిన వారి ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి, నెలకు రూ. 7,500 కనీస పెన్షన్ పెంపు, డియర్నెస్ అలవెన్స్ (DA) గురించి వివరించారు. ఆ విషయాలను తప్పకుండా పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారని EPS-95 జాతీయ కమిటీ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే.. మినిమమ్ పెన్షన్ పెంపు తప్పకుండా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. -
స్విగ్గీ ‘స్కూట్సీ’లో రూ.1,000 కోట్ల పెట్టుబడి
ప్రముఖ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ దిగ్గజం స్విగ్గీ(Swiggy) తన లాజిస్టిక్స్ సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యూహాత్మక చర్యలో భాగంగా కంపెనీ ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థ ‘స్కూట్సీ(Scootsy)’లో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థలో డిసెంబర్లో రూ.1,600 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఒక్కో స్కూట్సీ షేరు విలువ రూ.7,640గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో రైట్స్ ఇష్యూ ద్వారా ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నారు.స్విగ్గీ క్విక్ కామర్స్ వ్యాపారం ఇన్స్టామార్ట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలకోసం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, ఇతర మూలధన వ్యయాలకు ఈ పెట్టుబడిని ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. 2018లో స్విగ్గీ కొనుగోలు చేసిన స్కూట్సీ.. రెస్టారెంట్, రుచికరమైన ఆహారం, టాయ్స్, బ్యూటీ, ఎలక్ట్రానిక్స్ సహా మరెన్నో కేటగిరీల్లో ఇంట్రాసిటీ ఆన్లైన్ డెలివరీ అందించే ప్లాట్ఫామ్. ఇది హోల్సేల్ వ్యాపారులు, రిటైలర్లకు గోదాము నిర్వహణ, వేర్ హౌస్ ప్రాసెసింగ్, ఆర్డర్ ఫుల్ ఫిల్మెంట్, ప్యాకింగ్, షిప్పింగ్ సేవలను కూడా అందిస్తుంది.పెరుగుతున్న టర్నోవర్2024 ఆర్థిక సంవత్సరంలో స్కూట్సీ రూ.5,796 కోట్ల టర్నోవర్ను నివేదించింది. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.3,686 కోట్లుగా, 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.1,580 కోట్లుగా ఉంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సప్లై చెయిన్ సేవల నుంచి స్విగ్గీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 23 శాతం పెరిగి రూ.1,693 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: వచ్చేవారం యూఎస్ రక్షణశాఖలో 5,400 మందికి లేఆఫ్స్క్విక్ కామర్స్లో భారీగా పెట్టుబడులువేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలో ఆధిపత్య మార్కెట్ వాటాను పొందడానికి స్విగ్గీ, దాని ప్రత్యర్థి జొమాటో రెండూ తమ క్విక్ కామర్స్ వ్యాపారాల్లో పెట్టుబడులను పెంచుతున్నాయి. స్కూట్సీలో తాజా పెట్టుబడి దాని లాజిస్టిక్స్ మౌలికసదుపాయాలను మెరుగుపరచడానికి, కస్టమర్లకు సమర్థవంతమైన, సకాలంలో డెలివరీలను అందించేందుకు తోడ్పడుతుందని స్విగ్గీ తెలిపింది. -
ఒకటి తగ్గింది.. ఇంకొకటి పెరిగింది: ఇదీ బంగారం ధరల పరిస్థితి
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (ఫిబ్రవరి 221) బంగారం ధరల్లో చాలా మార్పులు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగితే.. మరికొన్ని ప్రాంతాల్లో తగ్గాయి. గోల్డ్ రేటు ఎక్కడ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే..➤హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,770 వద్ద ఉన్నాయి. భాగ్యనగరంలో నేడు 22 క్యారెట్ గోల్డ్ పెరిగింది. 24 క్యారెట్ బంగారం ధర స్వల్పంగా తగ్గింది.➤విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి. దీంతో ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 8,7770 వద్ద ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ రేటు వరుసగా రూ. 200, రూ. 20 పెరిగింది. ముంబైలో కూడా ఇదే ధరలు కొనసాగుతాయి.➤చెన్నైలో కూడా పసిడి రేటు కొంత పెరిగింది. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 8,7770 వద్దకు చేరింది.➤బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 80,450 వద్ద, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 8,7770 వద్ద ఉంది.➤దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే ఢిల్లీలో ఈ రోజు గోల్డ్ రేటు ఓ మోస్తరుగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 300 పెరిగి రూ. 80,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 370 పెరిగి రూ. 87,920 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ ఉన్నప్పటికీ.. వెండి ధర మాత్రం గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉండి, నేడు (శనివారం) రూ. 900 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 100 పెరిగి.. మళ్ళీ యధాస్థానానికే (రూ.1,00,500) చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
యూఎస్ రక్షణశాఖలో 5,400 మందికి లేఆఫ్స్
అమెరికా తన రక్షణశాఖలో పనిచేస్తున్న 5,400 మంది సిబ్బందిని ఉద్యోగంలో నుంచి తొలగించబోతున్నట్లు తెలిపింది. అమెరికా పెంటగాన్(యూఎస్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయం)లో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) సిబ్బంది సందర్శించి వచ్చే వారం నుంచి ప్రొబేషనరీ ఉద్యోగులకు లేఆఫ్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఏడాది కంటే తక్కువ కాలం సర్వీసులో ఉన్నవారిపై ఈ ప్రభావం పడనుందని పేర్కొంది. దాంతోపాటు తదుపరి నియామకాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు డీఓజీఈ స్పష్టం చేసింది. యూఎస్ రక్షణశాఖ సామర్థ్యాన్ని పెంచడం, ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది తెలిపారు.కొవ్వును తగ్గించి కండరాలు పెంచాలి..అమెరికాలో మొత్తంగా ప్రభుత్వ అదీనంలోని శ్రామిక శక్తిని 5-8% తగ్గించే విస్తృత వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. సామర్థ్యాలను పెంచడానికి, అధ్యక్షుడి ప్రాధాన్యతలపై డిపార్ట్మెంట్ దృష్టి సారించిందన్నారు. ఈ లేఆఫ్స్కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. కొవ్వు(హెడ్ క్వార్టర్స్లోని సిబ్బంది)ను తగ్గించి కండరాలను (వార్ఫైటర్లు) పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రక్షణ విభాగంలో ఉన్న వనరులను మరింత సమర్థంగా వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ చర్య వల్ల కార్యకలాపాలను క్రమబద్ధీకరించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇలాంటి చర్యలపై కొందరు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇది అంతిమంగా అధ్యక్షుడు ట్రంప్ ప్రాధాన్యతలకు నిధులు సమకూర్చేందుకేనని అభిప్రాయపడుతున్నారు.అతిపెద్ద అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన డిఫెన్స్ విభాగంలో 7,00,000 మందికి పైగా పూర్తికాల కార్మికులు పనిచేస్తున్నారు. ఫెడరల్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దృష్టి సారించింది. అందులో భాగంగానే ఇలా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: రుణాల ముందస్తు ముగింపుపై ఛార్జీలొద్దుపెంటగాన్పెంటగాన్ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయం. వర్జీనియాలోని ఆర్లింగ్టన్లో ఉన్న ఈ ఆఫీస్ 6.5 మిలియన్ చదరపు అడుగుల స్థలంలో విస్తరించి ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయ భవనాల్లో ఒకటిగా ఉంది. వీటిలో కేవలం 3.7 మిలియన్ చదరపు అడుగులను మాత్రమే కార్యాకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఈ భవనాన్ని యూఎస్ మిలిటరీకి చిహ్నంగా భావిస్తారు. ఇందులో సుమారు 23,000 మంది సైనిక, ఇతర ఉద్యోగులు, 3,000 మంది రక్షణేతర సహాయక సిబ్బంది పని చేస్తున్నారు. -
రుణాల ప్రీక్లోజర్ ఛార్జీలపై ఆర్బీఐ స్పందన
బ్యాంక్లు రుణాల ముందస్తు చెల్లింపులపై రుణగ్రహీతల నుంచి ప్రీ పేమెంట్ పెనాల్టీ/ ఫోర్క్లోజర్ పేరుతో వసూలు చేసే ఛార్జీల విధానాన్ని తొలగించే దిశగా ఆర్బీఐ(RBI) ముఖ్యమైన ప్రతిపాదన చేసింది. వ్యక్తులు, ఎంఎస్ఈలు తీసుకునే అన్ని ఫ్లోటింగ్ రేటు రుణాలు, వ్యాపార అవసరాలకు తీర్చుకునే వాటిపైనా ముందస్తు చెల్లింపుల చార్జీలు ఉండకూడదన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశం.‘టైర్ 1, టైర్ 2 ప్రాథమిక అర్బన్ కోపరేటివ్ బ్యాంక్లు, బేస్ లేయర్ ఎన్బీఎఫ్సీలు మినహా అన్ని రెగ్యులేటెడ్ ఎంటిటీలు (ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని రకాల బ్యాంక్లు, ఇతర ఎన్బీఎఫ్సీలు) ఫ్లోటింగ్ రేటు రుణాలను ముందుగా తీర్చివేస్తే ఎలాంటి చార్జీలు/పెనాల్టీలు విధించరాదు’ అని ఆర్బీఐ ముసాయిదా సర్క్యులర్ పేర్కొంది. ఎంఎస్ఈ రుణ గ్రహీతలు అయితే రూ.7.50 కోట్ల వరకు పూర్తి రుణ మొత్తాలకు ఇది వర్తిస్తుంది. ఎలాంటి లాకిన్ పీరియడ్ లేకుండా దీన్ని అమలు చేయాలని పేర్కొంది. ఈ ముసాయిదాపై మార్చి 21 వరకు సూచనలు, సలహాలను ఆహ్వానిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.రిస్క్ ఇన్వెస్టింగ్పై అవగాహన కల్పించాలిఅన్సెక్యూర్డ్ రుణాలు, వేలం వెర్రిగా డెరివేటివ్స్ ట్రేడింగ్ పెరిగిపోతుండటంపై రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక లాభాల్లో ఉండే ఆకర్షణ వల్ల దీర్ఘకాలిక ఆర్థిక భద్రత గురించి పట్టించుకోని పరిస్థితి ఉంటోందని పేర్కొన్నారు. అనాలోచితమైన విధంగా ఆర్థిక సేవలను విస్తరిస్తే (ఆర్థికీకరణ) రిస్కులు తప్పవని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక సంస్థలను హెచ్చరించారు.ఇదీ చదవండి: ‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’ఈ నేపథ్యంలో ప్రజల్లో అన్సెక్యూర్డ్ రుణాలు, స్పెక్యులేటివ్ ఇన్వెస్టింగ్ వల్ల తలెత్తే రిస్క్ల గురించి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ విషయంపై ఆర్థిక రంగానికి చెందిన ఇతర నియంత్రణ సంస్థలతో కూడా ఆర్బీఐ కలిసి పని చేస్తోందని రావు చెప్పారు. ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్లే అమాయకులు మోసగాళ్ల బారిన పడుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయని వివరించారు. ఏదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వ్యవస్థే పూనుకోవాలని సూచించారు. శరవేగంగా మారిపోతున్న ప్రపంచంలో నియంత్రణనేది చాలా సున్నితమైన అంశంగా మారిందని రావు చెప్పారు. నియంత్రణను మరీ తగ్గిస్తే వ్యవస్థాగతంగా రిస్క్లు పెరుగుతాయని, అలాగని మరీ ఎక్కువగా నియంత్రిస్తే కొత్త ఆవిష్కరణలకు, రుణ లభ్యతకు అవరోధాలు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. -
సులభతర వీసా విధానం అవసరం
న్యూఢిల్లీ: వైద్య చికిత్సల కోసం భారత్కు వచ్చే విదేశీ రోగులకు సులభతర వీసా విధానాన్ని ప్రవేశపెట్టాలని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ‘హీల్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో కలసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ‘హీల్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వంతో కలసి పనిచేయాలన్నది మా ఆలోచన! ఈ–వీసాలను మరింత పెంచాలి’ అని మీడియాతో చెప్పారు.పొరుగు దేశాలైన థాయిలాండ్, టర్కీ, ఫిలిప్పీన్స్, సింగపూర్ దేశాలు ఎక్కువ మంది రోగులను ఆకర్షిస్తున్నాయని, దేశంలోకి వచ్చిన వెంటనే వీసా జారీ విధానాన్ని అమలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. భారత్లో అధిక నాణ్యమైన హెల్త్కేర్ వసతులు ఉన్నాయంటూ.. ప్రపంచ సగటు ధరల్లో పదో వంతుకే అందిస్తున్నట్టు చెప్పారు. కాబట్టి విదేశీ రోగుల రాకను సులభతరం చేయాలని, మెడికల్ వీసాలను వేగంగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య పర్యాటకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంతో కీలకంగా చూస్తున్నట్టు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి అన్నారు.ఇదీ చదవండి: ‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’‘వీసా ప్రక్రియలను మెరుగ్గా మార్చాలి. భారత్లోకి ప్రవేశ అనుభవం మెరుగ్గా ఉండాలి. మనకు చాలా పట్టణాల్లో అద్భుతమైన విమానాశ్రయ వసతులు ఉన్నాయి’ అని అమె గుర్తు చేశారు. ఐఐటీ, ఇతర సంస్థలతో కలసి ఆవిష్కరణల కోసం అపోలో హాస్పిటల్స్ కృషి చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రూ.3,000 పడకలు పెంచుకోనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. -
‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’
మధ్య, చిన్నతరహా షేర్ల పతనంపై స్పందించవలసిన అవసరంలేదని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్పర్సన్ మాధవి పురీ బచ్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవల మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా పతనమవుతున్న నేపథ్యంలో బచ్ వ్యాఖ్యాలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే గతేడాది మార్చిలోనే మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ అధిక విలువల్లో ట్రేడవుతున్నట్లు సెబీ హెచ్చరించిందని బచ్ గుర్తు చేశారు.నిజానికి చిన్న షేర్లపై అవసరమైన సందర్భంలో సెబీ ఆందోళన వ్యక్తం చేసినట్లు దేశీ మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ అంశంపై సెబీ మరోసారి స్పందించవలసిన అవసరం కనిపించడంలేదని స్పష్టం చేశారు. ఇటీవల మధ్య, చిన్నతరహా షేర్ల కౌంటర్లలో నిరవధిక అమ్మకాల కారణంగా కొన్ని షేర్లు 20 శాతానికి మించి పతనమయ్యాయి. ఫలితంగా మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో బేర్ ట్రెండ్ కనిపిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ రెండు విభాగాల్లోనూ షేర్లు అధిక విలువలకు చేరినట్లు 2024 మార్చిలోనే బచ్ ఇన్వెస్టర్లను హెచ్చరించడం గమనార్హం! కాగా.. ఇటీవల ప్రవేశపెట్టిన రూ.250 సిప్ పథకాలను ఫండ్ హౌస్లకు తప్పనిసరి చేయాలన్న ఆలోచనేదీ సెబీకి లేదని బచ్ తెలియజేశారు.వారసత్వ పెట్టుబడుల బదిలీకి ఎంతో కృషితొలి తరం క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను వారి వారసులు పొందడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. వారసులకు పెట్టుబడుల బదిలీని సులభతరం చేసే విషయంలో సెబీ ఎంతో కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు మరణించిన సందర్భాల్లో కొత్త సమస్యలు ఎదురవుతున్నట్టు పేర్కొన్నారు. ‘ఆ తరం ఇప్పుడు అంతరిస్తోంది. వారి వారసులు సెక్యూరిటీలను వారసత్వంగా పొందుతున్నారు. ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం లేనివి కూడా నేడు సమస్యగా మారుతున్నాయి. ఎందుకంటే ఆ పెట్టుబడులు ఎక్కడ ఉన్నాయన్నది వారసులు గుర్తించలేకపోతున్నారు’ అని బుచ్ వివరించారు.ఇదీ చదవండి: జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారా..? నిబంధనలు మార్పు?క్యాపిటల్ మార్కెట్ల పట్ల విశ్వాసంతో పెట్టుబడులు పెట్టిన తొలి తరం వారిని మార్గదర్శకులుగా ఆమె అభివర్ణించారు. ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ రూపొందించిన యూనిఫైడ్ ఇన్వెస్టర్ యాప్ను ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఈ రెండు డిపాజిటరీల పరిధిలో ఒక ఇన్వెస్టర్ పేరిట వివిధ డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న అన్ని రకాల హోల్డింగ్స్ను ఇందులో పొందుపరిచారు. ఆ నాటి ఇన్వెస్టర్ల వారసులకు పెట్టుబడుల గుర్తింపు విషయంలో ఇది ఉపయోగకరంగా ఉంటుందని బుచ్ చెప్పారు. -
ఫ్రెషర్లకు ఈ ఏడాది అధిక అవకాశాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫ్రెషర్లకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఫ్రెషర్ల నియామక ఉద్దేశ్యం కంపెనీల్లో 74 శాతానికి చేరినట్టు టీమ్లీజ్ ఎడ్యుటెక్కు చెందిన కెరీర్ అవుట్లుక్ సర్వే నివేదిక వెల్లడించింది. రాబోయే నెలలకు సంబంధించి వ్యాపార విశ్వాసాన్ని ఇది తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ముఖ్యంగా ఐటీ రంగం కోలుకోవడం ఫ్రెషర్లకు మరిన్ని అవకాశాలను తెచి్చపెట్టనున్నట్టు తెలిపింది. ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల కాలానికి నివేదికను విడుదల చేసింది. డీప్టెక్ ఉద్యోగాలైన రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సర్టిఫైడ్ రోబోటిక్ ఇంజనీర్ కోర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, హెల్త్కేర్ మేనేజ్మెంట్, ఏఐ అప్లికేషన్లలో ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్లకు డిమాండ్ ఉన్నట్టు వెల్లడించింది. ఈ సర్వేలో 649 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. కొన్ని రంగాలు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో నియామకాలకు సంబంధించి బలమైన ధోరణిని వ్యక్తం చేశాయి. ఈ–కామర్స్ అండ్ టెక్నాలజీ స్టార్టప్ల్లో ఫ్రెషర్ల నియామక ధోరణి 61 శాతం నుంచి 70 శాతానికి పెరిగింది. తయారీలో 52 శాతం నుంచి 66 శాతానికి, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాలో 59 శాతం నుంచి 69 శాతానికి పెరిగింది. ఐటీ రంగంలో జోష్ ‘‘ఐటీ రంగం చెప్పుకోతగ్గ మేర కోలుకుంది. ఆరంభ స్థాయి ఉద్యోగుల నియామకాల ఉద్దేశ్యం 2024 ద్వితీయ 6 నెలల కాలంలో ఉన్న 45% నుంచి, 2025 మొదటి 6 నెలల కాలానికి 59 శాతానికి పెరిగింది. హెల్త్కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగంలోనూ ఇది 47% నుంచి 52 శాతానికి పెరిగింది’’అని ఈ నివేదిక వెల్లడించింది. విద్యుత్, ఇంధన రంగం, మార్కెటింగ్ అండ్ అడ్వరై్టజింగ్ సైతం బలమైన వృద్ధిని చూపించినట్టు తెలిపింది. భౌగోళికంగా చూస్తే బెంగళూరు 78%, ముంబై 65%, ఢిల్లీ ఎన్సీఆర్ 61%, చెన్నై 57% చొప్పున తాజా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు కల్పించనున్నట్టు పేర్కొంది. క్లినికల్ బయోఇన్ఫర్మాటిక్స్ అసోసియేట్, రోబోటిక్స్ సిస్టమ్ ఇంజనీర్, సస్టెయి నబులిటీ అలనిస్ట్, ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ వర్ధ మాన కెరీర్ మార్గాలుగా అవతరిస్తున్నట్టు తెలిపింది. సమకాలీన వ్యాపార అవకాశాల దృష్ట్యా కంపెనీలు ముఖ్యంగా రోబో టిక్ ప్రాసెస్ ఆటోమేషన్, పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ రిస్క్ అనలైసిస్ నైపుణ్యాలున్న వారి కోసం చూస్తున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. -
నివా బూపా హెల్త్పై సైబర్ దాడి!
న్యూఢిల్లీ: నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సైబర్ ముప్పును ఎదుర్కొన్నట్టు ప్రకటించింది. కంపెనీ కస్టమర్ల డేటాబేస్ను హ్యాక్ చేసినట్టు ఓ గుర్తు తెలియని సంస్థ నుంచి బెదిరింపు ఈ–మెయిల్ వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్లకు సమాచారం అందించింది. డేటా లీక్ అయిన విషయంలో తాము దర్యాప్తు చేస్తున్నట్టు, రిస్క్ను అధిగమించే చర్యలు అమలు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. 2024 డిసెంబర్ 31 నాటికి నివాబూపాకు 1.98 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. గతేడాది మరో సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సైతం డేటా చోరీ ఘటనను ఎదుర్కోవడం తెలిసిందే. -
బీవోఐలో రూ. 227 కోట్ల ఫ్రాడ్
న్యూఢిల్లీ: గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ రూ. 227 కోట్ల మేర రుణం తీసుకుని, మోసం చేసినట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) వెల్లడించింది. ఈ ఖాతాను మొండిపద్దుగా (ఎన్పీఏ) వర్గీకరించి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించింది. రూ. 227 కోట్లకు గాను రూ. 213 కోట్లు ప్రొవిజనింగ్ చేసినట్లు బ్యాంకు తెలిపింది. ఒరిస్సాకు చెందిన గుప్తా పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటు పంజాబ్ నేషనల్ బ్యాంకులో (పీఎన్బీ) కూడా రూ. 271 కోట్ల ఫ్రాడ్కి పాల్పడింది. పీఎన్బీ కూడా దీన్ని ఎన్పీఏగా వర్గీకరించి, ప్రొవిజనింగ్ చేసి, రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లింది. డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో బీవోఐ నికర లాభం 35% పెరిగి రూ. 1,870 కోట్ల నుంచి రూ. 2,517 కోట్లకు చేరగా, ఆదాయం రూ.16,411 కోట్ల నుంచి రూ.19,957 కోట్లకు ఎగసింది. -
ఆరేళ్లలో ఐదు కోట్ల మంది ప్రయాణికులు
హైదరాబాద్: ఆరేళ్లలో శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య ఏటా 5 కోట్ల స్థాయికి చేరుతుందని జీఎంఆర్ గ్రూప్ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2.9 కోట్లుగా ఉంటుందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ పణిక్కర్ వెల్లడించారు. ‘2023–24లో 2.5 కోట్ల మంది శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణాలు చేశారు. కంపెనీ ప్రస్తుత కార్గో టెరి్మనల్ విస్తరణ కోసం రూ.370 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రక్రియలో ఉంది. ఏటా 4 లక్షల టన్నుల సామర్థ్యా న్ని చేరుకోవడానికి కొత్త టెరి్మనల్ ఏర్పా టు చేస్తోంది. విమానాశ్రయం ఇప్పటికే ఏటా 4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. 2008లో ఏటా 1.2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఎయిర్పోర్టును నిర్మించారు’ అని వివరించారు. -
ఇక వెండి.. కొండ!
ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న పసిడి రేట్లకు దీటుగా పరుగులు తీసేందుకు వెండి కూడా సన్నద్ధమవుతోందా? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఖరీదైన బంగారానికి ప్రత్యామ్నాయంగా ఇన్వెస్టర్లు వెండి వైపు చూస్తుండటంతో పాటు పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన డిమాండ్ పెరుగుతుండటం కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. బంగారం, వెండి మధ్య కీలక నిష్పత్తుల్లో చోటు చేసుకుంటున్న మార్పులు దీన్ని సూచిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏడాది వ్యవధిలో వెండి రేటు కేజీకి రూ. 1.1 లక్షల నుంచి రూ. 1.25 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారానికి మించి వెండి అధిక రాబడులు ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలతో ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) వైపు చూసే ఇన్వెస్టర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. నిష్పత్తి చెబుతోందిదే.. బంగారంతో పోలిస్తే వెండి ధర ఎంత చౌకగా ఉంది, లేదా ఎంత ఎక్కువగా ఉంది అనేది తెలుసుకోవడానికి రెండింటి రేట్ల మధ్య నిర్దిష్టంగా ఉండే నిష్పత్తి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది ఆల్టైమ్ కనిష్టం అయిన 0.01 స్థాయిలో ఉంది. ఈ నిష్పత్తి ఆల్టైం గరిష్టం 0.06 స్థాయి. సాధారణంగా సగటున ఒక్క ఔన్సు (31.1) గ్రాముల బంగారం విలువ, 60 నుంచి 70 ఔన్సుల వెండి విలువకు సమానంగా ఉంటుంది. ప్రస్తుతం ఒక్క ఔన్సు బంగారం కొనాలంటే 90 ఔన్సుల వెండి అవసరమవుతోంది. ఈ వ్యత్యాసం సగటు స్థాయికి తగ్గాలంటే వెండి మరింతగా పెరగాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో పసిడి భారీగా ఎగిసిన నేపథ్యంలో స్వల్పకాలానికి వెండిని కొనుగోలు చేస్తే సురక్షితంగా ఉంటుందనే భావన ఇన్వెస్టర్లలో నెలకొంది. గత మూడేళ్లుగా రాబడుల విషయంలో పసిడితో పోలిస్తే వెండి వెనకబడింది. డాలరు మారకంలో పసిడిపై రాబడులు సుమారు 54 శాతంగా ఉండగా, వెండిపై రాబడులు 37 శాతమే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పసిడి రేటు 11.77 శాతం పెరగ్గా, వెండి రేట్లు 13.3 శాతం పెరిగాయి. 3,200 డాలర్ల దిశగా పసిడి!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల దెబ్బతో ద్రవ్యోల్బణం భారీగా ఎగియొచ్చన్న అంచనాలు పసిడి ర్యాలీకి దోహదపడుతున్నాయి. సురక్షిత పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ప్రస్తుతం దాదాపు రూ. 2,948 డాలర్లకు పెరిగింది. ఇది ఈ ఏడాది ఏకంగా 3,200 డాలర్లకు ఎగియొచ్చనే పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుత స్థాయి నుంచి మరీ దూకుడుగా ధరల పెరుగుదల ఉండకపోవచ్చని పేర్కొన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత విషయంలో జాప్యం చేసే అవకాశాలు, రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు, ట్రేడ్ టారిఫ్ల అమలు నెమ్మదించడం వంటి అంశాలు ప్రతికూలంగా మారొచ్చని వివరించాయి.ఇన్వెస్టర్లు, పరిశ్రమల దన్ను.. ఇటు ఇన్వెస్టర్లు, అటు పరిశ్రమల నుంచి డిమాండ్ నెలకొనడంతో సమీప భవిష్యత్తులో పసిడికి మించి వెండి ర్యాలీ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏడాది వ్యవధిలో వెండి ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.25 లక్షల వరకు చేరొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేస్తోంది.అంటే సగటున 20 శాతం రాబడి ఉండొచ్చు. దీంతో ప్రస్తుతం రేటు తగ్గితే కొనుక్కుని దగ్గర పెట్టుకోవడం మంచిదని సూచించాయి. అయితే, వెండి మీద అధిక రాబడులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపాయి. పసిడితో పోలిస్తే వెండి ధరలో హెచ్చుతగ్గులు 2.5 రెట్లు అధికంగా ఉంటాయని వివరించాయి. ఏడాది వ్యవధిలో వెండి ఈటీఎఫ్ల్లో రాబడులు (%)ఏబీఎస్ఎల్ సిల్వర్ 36.36 కోటక్ సిల్వర్ 36.34 డీఎస్పీ సిల్వర్ 36.21 హెచ్డీఎఫ్సీ సిల్వర్ 36.13 యూటీఐ సిల్వర్ ఈటీఎఫ్ 36.01 ఫిబ్రవరి 20 గణాంకాల ప్రకారం–సాక్షి, బిజినెస్డెస్క్ -
ఎయిర్టెల్ బెస్ట్ మంత్లీ రీఛార్జ్ ప్లాన్లు ఇవే..
మీరు ఎయిర్టెల్ వినియోగదారులా..? మెరుగైన నెలవారీ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ల గురించి చూస్తున్నారా? అయితే మీ కోసమే 30 రోజులు, 28 రోజులు వ్యాలిడిటీతో వచ్చే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. వీటిలో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ డేటాతోపాటు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు వంటి ప్రయోజనాలు ఉన్నాయి.28 రోజుల ప్లాన్లురూ.199 ప్లాన్: అపరిమిత కాల్స్, 2GB డేటా, రోజుకు 100 SMS, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్రూ.299 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 1GB డేటా, 100 SMS, ఉచిత హెలోట్యూన్స్రూ.349 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 SMS, అపోలో 24/7 సర్కిల్రూ. 398 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS, డిస్నీ+ హాట్స్టార్ మొబైల్రూ.409 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 2.5GB డేటా, రోజుకు 100 SMS, ఎక్స్స్ట్రీమ్ ప్లేరూ.449 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 3GB డేటా, రోజుకు 100 SMS, ఎక్స్స్ట్రీమ్ ప్లేరూ. 549 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 3GB డేటా, రోజుకు 100 SMSలు, 3 నెలలు డిస్నీ+ హాట్స్టార్ మొబైల్30 రోజుల ప్లాన్లురూ.121 ప్లాన్: 6GB డేటారూ.161 ప్లాన్: 12GB డేటారూ.181 ప్లాన్: 15GB డేటా, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లే ప్రీమియంరూ.211 ప్లాన్: రోజుకు 1GB డేటారూ.219 ప్లాన్: అపరిమిత కాల్స్, 3GB డేటా, 300 SMS, రూ. 5 టాక్ టైమ్, ఎక్స్స్ట్రీమ్ ప్లేరూ. 355 ప్లాన్: అపరిమిత కాల్స్, 25GB డేటా, రోజుకు 100 SMS, ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ప్లేరూ.361 ప్లాన్: 50GB డేటారూ. 589 ప్లాన్: అపరిమిత కాల్స్, 50GB డేటా, 300 SMS, అపోలో 24/7 సర్కిల్, ఎక్స్స్ట్రీమ్ ప్లేనెలవారీ ప్లాన్లురూ. 379 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMS, ఎక్స్స్ట్రీమ్ ప్లేరూ.429 ప్లాన్: అపరిమిత కాల్స్, రోజుకు 2.5GB డేటా, రోజుకు 100 SMS, రూ. 5 టాక్ టైమ్, ఎక్స్స్ట్రీమ్ ప్లేరూ.609 ప్లాన్: అపరిమిత కాల్స్, 60GB డేటా, 300 SMS, ఎక్స్స్ట్రీమ్ ప్లే -
మహా కుంభమేళాలో డిజిటల్ స్నానం! వీడియో వైరల్
మహా కుంభమేళాకు (Maha Kumbh) సంబంధించి ప్రతిరోజూ పలు వింత వార్తలు, కథనాలు వస్తున్నాయి. త్రివేణి సంగమంలో తమ పాపాలను కడుక్కోవడానికి కొందరు వస్తుంటే మరికొందరు ఎప్పుడో దూరమైన తమ కుటుంబాలతో తిరిగి కలుస్తున్నారు. కొందరికి మాత్రం పెద్ద జనసమూహాల మధ్య కొత్త వ్యాపార ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి.ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమానికి ఇప్పటికే దాదాపు 6 కోట్ల మంది యాత్రికులను ఆకర్షించింది. అయితే ప్రయాణం చేయలేని వారి కోసం, స్థానిక ఔత్సాహిక ఎంట్రాప్రెన్యూర్ దీపక్ గోయల్ 'డిజిటల్ స్నాన్' (Digital Snan) సర్వీస్ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా భక్తులు సంగమంలో స్నానం కోసం వాట్సాప్ ద్వారా తమ ఫొటోలను పంపవచ్చు. ఇందుకోసం అతను ఒక్కొక్కరికి రూ.1,100 ధర నిర్ణయించాడు.సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలుమహా కుంభమేళాలో డిజిటల్ స్నానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విమర్శలతోపాటు ఉత్సుకతనూ రేకెత్తించింది. కొంతమంది యూజర్లు ఈ ఆలోచనను విశ్వాస దోపిడీ అంటూ విమర్శిస్తూ ఉంటే.. మరికొందరు అక్కడికి వెళ్లలేని వారికి ఇది అనుకూలమైన ప్రత్యామ్నాయంగా పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: ‘మహా కుంభ్’ వ్యాపారం.. రూ. 3 లక్షల కోట్లు!ఆధునిక సాంకేతికతతో విశ్వాసం ముడిపడి ఉండటం ఇదే మొదటిసారి కాదు. పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఆన్లైన్లో దాని గురించి ఒక కరపత్రాన్ని పంచుకున్నప్పుడు ఇలాంటి 'వాట్సాప్ సాల్వేషన్' సర్వీస్ దృష్టిని ఆకర్షించింది. ఇటువంటి సర్వీస్లు ఆధ్యాత్మికపరమైన ప్రామాణికతను పలుచన చేస్తాయని విమర్శకులు వాదిస్తున్నప్పటికీ, డిజిటల్ ప్రపంచంలోనూ సంప్రదాయానికి ప్రాధాన్యత ఎలా కొనసాగుతోందో కూడా అవి తెలియజేస్తున్నాయి.Digital Kumbh Snan 😭😭 and people are even paying him 👇pic.twitter.com/qGBr168p0f— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) February 21, 2025 -
‘మహా కుంభ్’ వ్యాపారం.. రూ. 3 లక్షల కోట్లు!
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh) అంతిమ దశకు వచ్చేసింది. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు సంగమ తీరానికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా ఈ మహా కుంభమేళా వస్తువులు, సేవల ద్వారా రూ.3 లక్షల కోట్ల ( సుమారు 360 బిలియన్ డాలర్లు) విలువైన వ్యాపారాన్ని సృష్టిస్తుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT ) తాజాగా అంచనా వేసింది.ఈ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాలలో ఒకటిగా మారుతుందని భావిస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ ఆధ్యాత్మిక సంరంభానికి 40 కోట్ల మంది తరలివస్తారని, దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని ప్రారంభంలో అంచనా వేశాయి. అయితే 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ అపూర్వమైన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఉత్సాహం కారణంగా ఇందులో పాల్గొన్నవారి సంఖ్య ఇప్పటికే 60 కోట్లు దాటి ఉంటుందని, రూ. 3 లక్షల కోట్లకు పైగా భారీ వ్యాపార టర్నోవర్ జరుగుతుందని తాజాగా అంచనాలను సవరించారు.సీఏఐటీ సెక్రటరీ జనరల్, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ కూడలి అని, విశ్వాసం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని దృఢంగా స్థాపించిందని అభివర్ణించారు. మహా కుంభ్ స్థానిక వాణిజ్యాన్ని పెంచుతోంది. మహా కుంభ్ థీమ్తో తీర్చిదిద్దిన డైరీలు, క్యాలెండర్లు , జనపనార సంచులు, స్టేషనరీ వంటి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ వేడుకకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం కారణంగా అమ్మకాలు పెరిగాయి.150 కి.మీ విస్తరించిన వ్యాపారంమహా కుంభమేళా ఆర్థిక ప్రభావం ప్రయాగ్రాజ్కే పరిమితం కాలేదు. ఇక్కడికి 150 కి.మీ పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలు కూడా గణనీయమైన వ్యాపార వృద్ధిని సాధించాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. మరోవైపు అయోధ్య, వారణాసి వంటి తీర్థ స్థలాలకు యాత్రికుల సందర్శనలు పెరిగాయి. ఈ ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతం లభించింది.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్లు , రోడ్లు అండర్పాస్లతో సహా మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 7500 కోట్లు ఖర్చు చేసింది. ఈ పెట్టుబడి ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగిస్తుందని భావిస్తున్నారు. -
మెటాలో ఇంత అన్యాయమా?
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల మాతృ సంస్థ మెటా (Meta).. వివాదాస్పద నిర్ణయాన్ని ప్రకటించింది. తమ టాప్ ఎగ్జిక్యూటివ్లకు వారి బేసిక్ పేలో 200 శాతం వరకు బోనస్లు (Bonus) ఇవ్వాలని నిర్ణయించింది. తక్కువ పనితీరు పేరుతో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించిన (Lay Off)వారం రోజుల్లోనే ఈ నిర్ణయం రావడంతో కంపెనీపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టాప్ ఎగ్జిక్యూటివ్లకు బోనస్ల చెల్లింపు నిర్ణయాన్ని ఫిబ్రవరి 13న మెటా డైరెక్టర్ల బోర్డు కమిటీ ఆమోదించింది. పోటీ కంపెనీలలో ఇలాంటి పాత్రలతో పోలిస్తే తమ ఎగ్జిక్యూటివ్ పరిహారం 15 శాతం మేర తక్కువగా ఉందన్న కారణంతో మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బోనస్ ప్రకటన సీఈవో మార్క్ జుకర్బర్గ్కు వర్తించదని కంపెనీ ఫైలింగ్లో పేర్కొంది.అల్ప స్థాయి ఉద్యోగులను తొలగించి బాస్లకు బోనస్లు ప్రకటించడం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఉద్యోగులను తొలగిస్తూనే ఎగ్జిక్యూటివ్లకు భారీగా బోనస్లను అందించడం అన్యాయమని విమర్శకులు వాదిస్తున్నారు. కంపెనీలోని ఆదాయ అసమానతల సమస్యలను ఇది ఎత్తి చూపుతుందని పేర్కొంటున్నారు.ఇది చదివారా? ‘ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది’ఈ నిర్ణయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ (Mark Zuckerberg) సమర్థించుకున్నారు. బోనస్లు అత్యుత్తమ ప్రతిభను నిలుపుకోవడానికి కంపెనీ నిరంతర వృద్ధి, విజయాన్ని నిర్ధారించడానికి అవసరమైన ప్రోత్సాహకం అని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులు, కార్మిక హక్కుల వాదులు ఇటీవలి తొలగింపుల నేపథ్యంలో బోనస్లకు ఇదా సమయం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.ఎగ్జిక్యూటివ్ బోనస్లను 200 శాతానికి పెంచాలనే నిర్ణయం మునుపటి 75 శాతం నుండి గణనీయమైన పెరుగుదల. పెరుగుతున్న పోటీ, ఆర్థిక సవాళ్ల మధ్య కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, లాభదాయకతను మెరుగుపరచడానికి ఈ చర్య విస్తృత వ్యూహంలో భాగమని కంపెనీ చెబుతోంది. -
సమస్యను సోషల్ మీడియాలో పెట్టిన ఉద్యోగి: నెట్టింట్లో వైరల్
ఉద్యోగులకు ఏదైనా సమస్యలు వచ్చినా.. సందేహాలు వచ్చినా.. తగిన పరిష్కారం తెలుసుకోవడానికి, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల ఒక ఉద్యోగి.. తాను నోటీస్ పీరియడ్లో ఉన్నప్పుడే జాబ్ నుంచి తీసేశారని, రిలీవింగ్ లెటర్ కూడా ఇవ్వడం లేదని వాపోయాడు.నేను ఒక కంపెనీలో రెండు నెలలకు ముందు చేరాను. అయితే నేను ఉద్యోగానికి రాజీనామా చేసి, నోటీసు పీరియడ్లో ఉన్నాను. ఈ సమయంలో రెండు రోజులు సెలవు తీసుకున్నందుకు.. ఉద్యోగం నుంచి తొలగించినట్లు హెచ్ఆర్ ఫోన్ చేసి చెప్పారు. అంతే కాకుండా.. రిలీవింగ్ లెటర్ ఇవ్వడానికి కూడా వారు నిరాకరించినట్లు రెడ్డిట్ యూజర్ పేర్కొన్నారు. నా జీతం.. పెంపుకు సంబంధించిన లెటర్ పొందటానికి నేను ఏమి చేయాలని ప్రశ్నించారు. సీటీసీ తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ శాలరీ పొందే ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నానని అన్నారు.ఈ పోస్టుకు పలువురు నెటిజన్లు స్పందించారు. నా సహోద్యోగికి ఇలాగే జరిగింది. దీనికోసం ఒక న్యాయవాదిని నియమించుకోండి. మీకు కావలసిన లెటర్స్ పొందటానికి రూ. 50వేలు ఖర్చు చేయడానికి వెనకాడవద్దని, ఒక యూజర్ పేర్కొన్నారు. మీ అనుభవాన్ని ఉపయోగించుకోండి, దీనికోసం ఆఫర్ లెటర్ యూస్ చేయండి. శాలరీ హైక్ లెటర్ అవసరం లేదని మరొకరు అన్నారు.ఇదీ చదవండి: గూగుల్ పే వాడుతున్నారా?.. ఇక ఆ బిల్స్ చెల్లిస్తే బాదుడే!మీరు చేరిన వెంటనే రాజీనామా చేసిన కంపెనీ నుంచి మీకు.. ఎక్స్పీరియన్స్ లెటర్ ఎందుకు అవసరం. ఈ విషయాన్ని.. ఇకపై చేరబోయే సంస్థలో చెప్పినా, మీ మీద చెడు అభిప్రాయం ఏర్పడుతుందని ఇంకో నెటిజన్ పేర్కొన్నారు. రిలీవింగ్ లెటర్ను ఎవరూ ఆపలేరని హెచ్ఆర్కు చెప్పండి. పీఎఫ్ పాస్బుక్లో ఈ సంస్థ నుంచి ఈపీఎఫ్ ట్రీ ఉంటే, భవిష్యత్తులో మీరు చేరే కంపెనీలలో నేపథ్య ధృవీకరణ ప్రక్రియ కోసం మీకు రిలీవింగ్ లెటర్ అవసరం అవుతుంది. -
నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. టాప్ లూజర్స్ ఇవే..
దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్ను ప్రతికూలంగా ముగించాయి. 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 424.90 పాయింట్లు లేదా 0.56 శాతం నష్టంతో 75,311.06 వద్ద స్థిరపడింది. ఈరోజు ఇండెక్స్ 75,748.72 నుండి 75,112.41 పరిధిలో ట్రేడైంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 127.25 పాయింట్లు లేదా 0.51 శాతం తగ్గి 22,795.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 22,921ను నమోదు చేయగా, కనిష్ట స్థాయి 22,720 గా ఉంది. నిఫ్టీ 50లోని 50 కాంపోనెంట్ స్టాక్లలో 35 నష్టాల్లో ముగిశాయి. మహీంద్రా & మహీంద్రా, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, టాటా మోటార్స్, విప్రో షేర్లు 6.20 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్గా నిలిచాయి.శుక్రవారం నిఫ్టీ మిడ్క్యాప్100, నిఫ్టీ స్మాల్క్యాప్100 సూచీలు వరుసగా 1.32 శాతం, 0.70 శాతం నష్టాలతో స్థిరపడటంతో విస్తృత మార్కెట్లు కూడా బెంచ్మార్క్లను ప్రతిబింబించాయి. నిఫ్టీ మెటల్ తప్ప మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో అత్యధికంగా నష్టపోయింది. ఇది 2.58 శాతం తగ్గింది. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, హెల్త్కేర్, రియాల్టీ, ఫార్మా, ఓఎంసీ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా నష్టంతో స్థిరపడ్డాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
గూగుల్ పే వాడుతున్నారా?.. ఇక ఆ బిల్స్ చెల్లిస్తే బాదుడే!
స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది.. దాదాపు అన్ని లావాదేవీలకు ఫోన్పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ వినియోగిస్తున్నారు. యూజర్ల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరుగుతున్న సమయంలో.. ట్రాన్సాక్షన్ల మీద ఛార్జీలను వసూలు చేయడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఇప్పటి వరకు లావాదేవీల మీద ఎలాంటి ఛార్జీలను వసూలు చేయని గూగుల్ పే.. ఇకపై ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, డీటీహెచ్ బిల్స్ చెల్లించినప్పుడు.. అదనపు ఛార్జీలను వసూలు చేయనుంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే వినియోగదారులకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఫీజు ఉండదు.గతేడాది నుంచి మొబైల్ రీఛార్జీల మీద రూ. 3 కన్వీనియన్స్ ఫీజును వసూలు చేస్తున్న గూగుల్ పే.. ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే బిల్స్ మీద 0.5 శాతం నుంచి 1 శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి బిల్స్ చెల్లించిన యూజర్లకు ఇప్పటికే ఛార్జీలు పడినట్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో భారీ మార్పులుఅదనపు ఛార్జీలు అందరికీ వర్తిస్తాయా? లేదా అనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. భవిష్యత్తులో తప్పకుండా అందరూ ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే?.. దీనిపై గూగుల్ పే స్పందించలేదు. అయితే గూగుల్ పే దీనిని అమలు చేస్తే.. ఇతర కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. -
ఈపీఎఫ్ విత్డ్రా.. ఇక నేరుగా యూపీఐ..
ఈపీఎఫ్ (EPF) విత్డ్రా ఇక మరింత సులువు కానుంది. పీఎఫ్ మొత్తాన్ని నేరుగా యూపీఐ ద్వారా చెల్లింపులకు వాడుకునే వెసులుబాటు రానుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) రాబోయే మూడు నెలల్లో ఈపీఎఫ్ క్లెయిమ్ల కోసం యునైటెడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ఆధారిత ఉపసంహరణలను ప్రవేశపెట్టనుంది .ఈపీఎఫ్ విత్డ్రా (EPF Withdrawal) ప్రక్రియను మరింత సులువుగా మార్చడమే లక్ష్యంగా ఈపీఎఫ్వో ఈ వెసులుబాటు తీసుకొస్తోంది. దీని ద్వారా దాని లక్షల మంది చందాదారులకు ఈపీఎఫ్ ఉపసంహరణ వేగవంతంగా మరింత అందుబాటులో ఉంటుంది. దీని కోసం ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసి యూపీఐ ప్లాట్ఫామ్లలో ఈ ఫీచర్ను ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇది చదివారా? త్వరలో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు.. రూ.5 లక్షలు లిమిట్తో..ఒకసారి ఇంటిగ్రేట్ ప్రక్రియ పూర్తయి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే క్లెయిమ్ మొత్తాలను సబ్స్క్రైబర్లు డిజిటల్ వాలెట్ల ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇది ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించి వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఉపసంహరణలను సులభతరం చేయడానికి, జాప్యాలను నివారించడానికి, కాగితపు పనిని తగ్గించడానికి, పారదర్శకతను మెరుగుపరచడానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), వాణిజ్య బ్యాంకుల సహకారంతో ఈపీఎఫ్వో డిజిటల్ వ్యవస్థలను అప్గ్రేడ్ చేస్తోంది.పెన్షన్ సేవలను మెరుగుపరచడం, ప్రావిడెంట్ ఫండ్ ( PF ) క్లెయిమ్ల కోసం క్లెయిమ్ ప్రాసెసింగ్ను సులభతరం చేయడం లక్ష్యంగా ఇప్పటికే ఈపీఎఫ్వో అనేక సంస్కరణలు అమలు చేస్తోంది. అందులో భాగమే ఈ చొరవ. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్లో 5 కోట్లకు పైగా చందాదారుల క్లెయిమ్లను ప్రాసెస్ చేసి, రూ . 2.05 లక్షల కోట్లకు పైగా సొమ్మును పంపిణీ చేసింది. -
జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారా..? నిబంధనలు మార్పు?
భారతీయ రైల్వే జనరల్ టికెట్ తీసుకొని ప్రయాణించేవారికి సంబంధించి నిబంధనలను సవరించాలని యోచిస్తోంది. రైల్వేశాఖ అమలు చేయలని చూస్తున్న ప్రతిపాదిత నిర్ణయం వల్ల కోట్లాది మంది రోజువారీ ప్రయాణికులపై ప్రభావం పడనుంది. కొత్త నిబంధనల వల్ల రైళ్లలో రద్దీ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.ప్రతిపాదిత సవరణలు ఇలా..నిర్దిష్ట సాధారణ టిక్కెట్లు కొనుగోలు చేసినవారు ప్రస్తుతం జనరల్ కేటగిరీలో ఏ రైలు అయినా ఎక్కవచ్చు. కానీ ఇకపై ఈ నియమాన్ని మార్చాలని చూస్తున్నారు. కొత్త విధానంలో భాగంగా టికెట్పై రైలు పేరు ప్రింట్ చేయాలనే ప్రతిపాదనలున్నాయి. ఇది ప్రయాణికులు విభిన్న రైళ్లలో మారకుండా పరిమితం చేస్తుంది. నిర్దిష్ట రైళ్లలో రద్దీని నివారించడం, మెరుగైన నిర్వహణ కోసం ఈ మార్పు అవసరమని భావిస్తున్నారు.జనరల్ టికెట్ వాలిడిటీ.. సాధారణ టికెట్ కొనుగోలు చేసినప్పటి నుంచి మూడు గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందని చాలా మంది ప్రయాణికులకు తెలియదు. ఈ గడువులోగా ప్రయాణం చేయకపోతే టికెట్ చెల్లదు. ఈ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు.మార్పు ఎందుకు అవసరం?రద్దీని నివారించడానికి ఈ మార్పులు ఎంతో అవసరమని అధికారులు భావిస్తున్నారు. రద్దీగా ఉండే జనరల్ కంపార్ట్మెంట్లలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. రద్దీ కారణంగా గాయాలపాలవుతున్నారు. సాధారణ టికెట్లపై రైలు పేర్లను కేటాయించడంతో ప్రయాణికులను నియంత్రించవచ్చని అధికారులు చెబుతున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కారణంగా జరిగిన తోపులాటలో గతంలో 18 మంది మరణించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నియమాలు సవరించాలని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ట్రంప్ను కలిసిన యాపిల్ సీఈఓప్రయాణికులపై ప్రభావం ఇలా..ప్రయాణికులకు వారు ఏ రైలులో ప్రయాణించాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. కొత్త విధానం ద్వారా వివిధ రైళ్లలో ప్రయాణికుల రద్దీను నియంత్రించవచ్చు. తొక్కిసలాటలు, ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. ఈ విధానం వల్ల లాభాలతోపాటు నష్టాలూ ఉంటాయని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికులు ఏ రైలులో అయినా ప్రయాణించవచ్చు. కానీ కొత్తగా మార్పులు చేస్తే వారికి కేటాయించిన రైలులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు తనకు కేటాయించిన రైలు మిస్ అయితే కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సిందే. -
ట్రంప్ను కలిసిన యాపిల్ సీఈఓ
అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో వైట్హౌజ్లో సమావేశమయ్యారు. చైనాలో యాపిల్ తన తయారీ ప్లాంట్ నుంచి భారీగానే వివిధ దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అందులో కొంతభాగం అమెరికాకూ ఎగుమతి అవుతోంది. అయితే ఇటీవల అమెరికా-చైనాల మధ్య సుంకాల విషయంలో తీవ్ర చర్చ సాగుతున్న నేపథ్యంలో టిమ్ కుక్ ట్రంప్తో భేటీ అవ్వడం చర్చనీయాంశం అయింది.వాణిజ్య ఉద్రిక్తతలు, సుంకాలుఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్ని చైనా దిగుమతులపై 10% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది చైనాలో ఉత్పత్తి అవుతూ అమెరికాలోకి వస్తున్న యాపిల్ ఉత్పత్తులను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇది కంపెనీ ఉత్పత్తుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఈ సుంకాల నుంచి యాపిల్ ఉత్పత్తులను రక్షించడం తన ప్రాథమిక లక్ష్యంగా కుక్ భావించారు. దాంతో ట్రంప్ను ప్రత్యక్షంగా కలిసి టారిఫ్ మినహాయింపులు కోరినట్లు తెలిసింది. అయితే గతంలో మాదిరి కాకుండా ఈసారి యాపిల్కు ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం.గోప్యతా విధానాలపై చర్చవాణిజ్య సమస్యలతో పాటు యాపిల్ గోప్యతా విధానాలపై ట్రంప్, టిమ్కుక్ల మధ్య చర్చ జరిగింది. సమర్థంగా చట్టాలను అమలు చేసేందుకు న్యాయబద్ధమైన సంస్థల కోసం కొన్ని ఐఫోన్లను అన్లాక్ చేయాలని ప్రభుత్వం ఎప్పటినుంచో వాదిస్తోంది. ట్రంప్ ఈ అంశాన్ని లేవనెత్తడంతో కుక్ వినియోగదారుల గోప్యతకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారని సమాచారం.ఇదీ చదవండి: బీమా సంస్థ బాధ్యత వహించదనే షరతు అసంబద్ధంబలమైన సంబంధంట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆయనతో బలమైన సంబంధాలను కొనసాగించేందుకు కుక్ కృషి చేస్తున్నారు. యాపిల్ వ్యాపార కార్యకలాపాలపై, సుంకాల ప్రభావాన్ని తగ్గించే మార్గాలపై చర్చించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్లు తెలిసింది. -
కియా రీకాల్.. వందలాది ఈవీ6 కార్లు వెనక్కి
ప్రముఖ వాహన తయారీ సంస్థ.. కియా మోటార్స్ (Kia Motors) తన 'ఈవీ6' (EV6) కోసం స్వచ్చందంగా రీకాల్ ప్రకటించింది. 2022 మార్చి 3 నుంచి 2023 ఏప్రిల్ 14 మధ్య తయారైన మొత్తం 1,380 యూనిట్లలో సమస్య ఉన్నట్లు గుర్తించి ఈ రీకాల్ ప్రకటించడం జరిగింది.కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కార్లలో.. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో 12వీ బ్యాటరీ పనితీరును ప్రభావితం చేసే లోపం కారణంగా రీకాల్ పరకటించింది. ఈ సమస్య కారణంగా.. 2024లో కూడా కంపెనీ 1138 యూనిట్లకు రీకాల్ ప్రకటించింది. ఇప్పుడు మరోమారు రీకాల్ జారీచేసింది.ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లోని సాఫ్ట్వేర్ అప్డేట్ 12వీ బ్యాటరీ ఛార్జింగ్.. పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది కారులోని లైట్స్, వైపర్లు, మ్యూజిక్ సిస్టమ్ వంటి వాటికి శక్తిని ఇస్తుంది. కార్లలో ఈ లోపాన్ని కంపెనీ ఉచితంగానే పరిష్కరిస్తుంది. అయితే సంబంధిత వాహనాల యజమానులను నేరుగా సంప్రదించి వాటిని అప్డేట్ చేస్తామని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: భారత్లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?ప్రభావిత వాహనాల కస్టమర్లు అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవడానికి.. సంబంధిత కియా డీలర్షిప్లను సంప్రదించవచ్చు, లేదా ఇతర వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయవచ్చు. కియా రీకాల్ గురించి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) కు కూడా సమాచారం అందించింది. -
బీమా సంస్థ బాధ్యత వహించదనే షరతు అసంబద్ధం
బీమా చేసిన వ్యక్తి ఆవరణలో కాకుండా మరెక్కడైనా వాహనాన్ని ఉపయోగించి ప్రమాదం జరిగితే బీమా(Insurance) సంస్థ బాధ్యత వహించదనే పాలసీ షరతు అసంబద్ధమని సుప్రీంకోర్టు(Supreme Court) ఇటీవల వ్యాఖ్యానించింది. ఇన్సూరెన్స్ చేసిన వాహనం క్రేన్ కావడంతో కోర్టు తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. నిర్మాణ ప్రదేశాల్లోనే క్రేన్లను ఉపయోగిస్తారని తెలియజేస్తూ, ఈ పరిస్థితిని ఇరు పక్షాలు వివిధ స్థాయుల్లో పరిష్కరించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.పాలసీదారుడు తన టాటా హిటాచీ హెవీ డ్యూటీ క్రేన్కు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ బీమా తీసుకున్నాడు. 2007లో జంషెడ్పూర్లోని టాటా స్టీల్ వద్ద పనులు నిర్వహిస్తుంటే క్రేన్ ప్రమాదానికి గురైంది. దాంతో పాలసీ క్లెయిమ్ చేయాలని అర్జీ పెట్టుకున్నాడు. కానీ కంపెనీ తన పాలసీను తిరస్కరించింది. అందుకు పాలసీ షరతులను కారణంగా చూపింది. ప్రమాదం వల్ల నష్టం జరిగినప్పటికీ బీమా చేసిన వ్యక్తి ఆవరణ వెలుపల వాహనాన్ని ఉపయోగించినట్లయితే బీమా సంస్థ బాధ్యత వహించదనే షరతును ఉటంకిస్తూ క్లెయిమ్ను తిరస్కరించింది. దాంతో పాలసీదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇటీవల ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఇలాంటి షరతు సహేతుకం కాదని, ముఖ్యంగా క్రేన్లను సాధారణంగా కార్యాలయ ఆవరణలో కాకుండా నిర్మాణ ప్రదేశాల్లోనే ఉపయోగిస్తారని వివరించింది. పాలసీ కొనుగోలు, రెన్యువల్ సమయంలో ఈ షరతును పరిష్కరించకపోవడంపై కోర్టు ఇరు పక్షాలపై అసహనం వ్యక్తి చేసింది. బీమా కంపెనీలు పాలసీదారులకు స్పష్టమైన, న్యాయమైన నిబంధనలు కల్పించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. పాలసీదారుకు వెంటనే క్లెయిమ్ మొత్తాన్ని సెటిల్ చేయాలని బీమా కంపెనీని ఆదేశించింది.ఇదీ చదవండి: ఎఫ్ఐఐల తీరుపై ఉదయ్కోటక్ స్పందనఈ తీర్పు బీమా పరిశ్రమలో అనుసరిస్తున్న కొన్ని షరతులను సడలించేలా చర్యలు తీసుకునేందుకు కీలకంగా మారిందని కొందరు భావిస్తున్నారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించడం, బీమా పాలసీల్లో పారదర్శకతను పెంపొందించడంలో సుప్రీంకోర్టు నిబద్ధతను ఈ తీర్పు హైలైట్ చేస్తోంది. -
భారత్లోని బెస్ట్ అడ్వెంచర్ బైకులు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇండియన్ మార్కెట్లో రోజువారీ వినియోగానికి ఉపయోగపడే బైకులకు మాత్రమే కాకుండా.. అడ్వెంచర్ బైకులకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు దేశీయ విఫణిలో సరికొత్త అలాంటి బైకులను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఐదు బెస్ట్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్ళ గురించి తెలుసుకుందాం.సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ (Suzuki V-Strom SX)సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ దేశీయ విఫణిలో ఎక్కువ మందిని ఆకర్శించిన బైక్. దీని ధర రూ. 2.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కొనుగోలుపై కంపెనీ ఇప్పుడు (ఫిబ్రవరి) రూ. 15,000 తగ్గింపును అందిస్తోంది. ఈ బైక్ 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 9300 rpm వద్ద, 26.1 Bhp పవర్, 7300 rpm వద్ద 22.2 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ పొడవైన విండ్స్క్రీన్, బీక్ స్టైల్ ఫ్రంట్ ఫెండర్, మస్క్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్తో మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, బ్లూటూత్ ఎనేబుల్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ స్లాట్ వంటివన్నీ ఉన్నాయి.హీరో ఎక్స్పల్స్ 210 (Hero XPulse 210)ఈఐసీఎంఏ 2024లో కనిపించిన హీరో ఎక్స్పల్స్ 210 అనేది.. అడ్వెంచర్ లైనప్లో తాజా వెర్షన్. ఇది ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్పోలో లాంచ్ అయింది. దీని ధర రూ. 1.75 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 210 సీసీ ఇంజిన్ 9250 rpm వద్ద, 24.2 Bhp పవర్, 7250 rpm వద్ద 20.7 Nm టార్క్ అందిస్తుంది. కొత్త డిజైన్ కలిగిన ఈ బైక్.. మంచి ఆఫ్ రోడ్ అనుభూతిని కూడా అందిస్తుంది.కేటీఎమ్ 250 అడ్వెంచర్ (KTM 250 Adventure)అడ్వెంచర్ బైక్ అంటే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది కేటీఎమ్ బైకులే. కాబట్టి రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో 'కేటీఎమ్ 250 అడ్వెంచర్' ఉంది. దీని ధర రూ. 2.59 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇందులోని 249 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్.. 9250 rpm వద్ద 30.5 Bhp పవర్, 7250 rpm వద్ద 24 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.యెజ్డీ అడ్వెంచర్ (Yezdi Adventure)రూ. 2.09 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే.. యెజ్డీ అడ్వెంచర్ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్. ఇది 334 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 8000 rpm వద్ద 29.1 Bhp పవర్, 6500 rpm వద్ద 29.8 Nm టార్క్ అందిస్తుంది. ఇది రౌండ్ ఎల్ఈడీ హెడ్లైట్, పొడవైన విండ్స్క్రీన్, స్ప్లిట్ సీట్లు, వైర్-స్పోక్ వీల్స్ వంటివి పొందుతుంది. కాబట్టి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్: ఆ టోల్ ప్లాజాలకు వర్తించదురాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ (Royal Enfield Himalayan)అడ్వెంచర్ చేసేవారికి ఇష్టమైన బైకులలో చెప్పుకోదగ్గ మోడల్ ''రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్''. ఇది 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 8000 rpm వద్ద 39.4 Bhp పవర్, 5500 rpm వద్ద 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో రౌండ్ TFT డిస్ప్లే, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, రైడ్-బై-వైర్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. దీని ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
ఇక్కడి లాభాలు అక్కడికి.. ఎఫ్ఐఐల తీరుపై ఉదయ్కోటక్ స్పందన
భారత స్టాక్ మార్కెట్లో ఇటీవల పెద్దమొత్తంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. రోజూ సుమారు రూ.3,000 కోట్లకు పైగా విక్రయాలు చేస్తున్నారు. ఈ ప్రభావం పెరుగుతుండటంపై కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్కోటక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ‘ఛేజింగ్ గ్రోత్ 2025 ఇన్వెస్టర్ ఈవెంట్’లో ఆయన మాట్లాడారు. స్టాక్ మార్కెట్లో నిరంతరం పెట్టుబడి పెడుతున్న దేశీయ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఎఫ్ఐఐలు ఎలా ప్రయోజనం పొందుతున్నారో వివరించారు.‘భారత్లో స్టాక్ వాల్యుయేషన్లు పెరగడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను ఉపసంహరించడం అధికమైంది. దేశం అంతటా రిటైలర్లు రోజూ ఈక్విటీల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఇది దేశీయ సంస్థాగత ప్రవాహాలకు సాయపడుతుంది. అయితే, ఎఫ్ఐఐలు లాభాలు సంపాదించడానికి కూడా ఇదే కారణమవుతుంది. భారత మార్కెట్లో వారు లాభాలు గడించి ఇతర ప్రపంచ మార్కెట్లకు వాటిని తరలిస్తున్నారు. యూఎస్ డాలర్ బలపడుతుండడంతో ఎఫ్ఐఐలు భారతదేశం సహా వర్ధమాన మార్కెట్ల నుంచి మూలధనాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ప్రస్తుతం 4.5 శాతానికి పైగా ఉన్న అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం కూడా భారత మార్కెట్లు కుప్పకూలడానికి కారణం’ అని చెప్పారు.ఇదీ చదవండి: తేమ నుంచి తాగునీటి ఉత్పత్తికి ఏర్పాట్లు చేసిన ఐసీఐసీఐ బ్యాంక్ఇప్పటికే ఎఫ్ఐఐలు, ఎఫ్డీఐలు భారత్లోని చాలా కంపెనీల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకున్నాయని కోటక్ తెలిపారు. అధిక వాల్యుయేషన్ల కారణంగా వర్ల్పూల్, హ్యుందాయ్ వంటి కంపెనీలు భారత్లో తమ హోల్డింగ్స్ను తగ్గించుకున్నాయని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఈ ఉపసంహరణ తంతు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇది మరింతగా పెరిగితే ఆర్బీఐ తన రిజర్వ్లను అధికంగా ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు. లేదా రూపాయి బలహీనపడే ప్రమాదం ఉందని అంచనా వేశారు. -
బంగారం ధరల్లో భారీ మార్పులు
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (ఫిబ్రవరి 21) బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ధరలు పెరిగితే.. మరికొన్ని ప్రాంతాల్లో తగ్గాయి. గోల్డ్ రేటు ఎక్కడ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే..➤హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,100 వద్ద ఉన్నాయి. భాగ్యనగరంలో నేడు 22 క్యారెట్ గోల్డ్ రేటు తగ్గింది. 24 క్యారెట్ బంగారం ధర పెరిగింది.➤విజయవాడలో బంగారం ధరలు తగ్గాయి. దీంతో ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 8,7750 వద్ద ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ రేటు వరుసగా రూ. 450, రూ. 290 తగ్గింది. ముంబైలో కూడా ఇదే ధరలు కొనసాగుతాయి.➤చెన్నైలో కూడా పసిడి రేటు తగ్గుముఖం పట్టింది. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,250 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 8,7550 వద్దకు చేరింది.➤బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 80,250 వద్ద, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 8,7550 వద్ద ఉంది.➤దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే ఢిల్లీలో ఈ రోజు గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 550 తగ్గి రూ. 80300 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 640 తగ్గి రూ. 87550 వద్ద ఉంది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ ఉన్నప్పటికీ.. వెండి ధర మాత్రం గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉండి, నేడు (శుక్రవారం) రూ. 100 తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,900 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,00,400 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
తేమ నుంచి తాగునీటికి ఏర్పాట్లు చేసిన ఐసీఐసీఐ బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాల్లోని తన కార్యాలయాల్లో అత్యాధునిక అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్లను (AWG) ఏర్పాటు చేసింది. ఈ ఏడబ్ల్యూజీలు వాతావరణంలోని తేమ ద్వారా త్రాగునీటిని ఉత్పత్తి చేస్తాయి. ఈ యూనిట్లు రోజుకు 8,000 లీటర్ల మంచినీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ ఏడబ్ల్యూజీ ప్లాంట్ల ద్వారా ఆయా ప్రదేశాల్లోని దాదాపు 4,200 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పింది.ఏడబ్ల్యూజీ ఎలా పని చేస్తుందంటే..వాతావరణంలోని తేమను గ్రహించి సూక్ష్మజీవులు లేని శుభ్రమైన తాగునీటిని ఉత్పత్తి చేసేందుకు అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్లు (ఏడబ్ల్యూజీ) తోడ్పడుతాయి. ఈ ప్రక్రియలో తేమ ఘనీభవనం చెంది తర్వాత నీటి ఆవిరి బిందువులుగా రూపాంతరం చెందుతుంది. విభిన్న శ్రేణుల్లో వడపోత ప్రక్రియ జరుగుతుంది. తుదకు తాగేందుకు వీలైన శుభ్రమైన నీటిని అందిస్తుంది. పరిసర ఉష్ణోగ్రతలు 18-45 డిగ్రీ సెంటీగ్రేడ్, సాపేక్ష తేమ 25-100% ఉన్న సమయంలో ఈ ప్రక్రియ ద్వారా ఏడబ్ల్యూజీలు సంవత్సరం పొడవునా తాగునీటిని అందిస్తాయి. వాతావరణ తేమను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్యాకేజ్డ్ నీటిపై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని బ్యాంకు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాతావరణంలో పునరుత్పాదక వనరును సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.‘పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం’ఐసీఐసీఐ బ్యాంక్ గ్రూప్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌమేంద్ర మట్టగజాసింగ్ మాట్లాడుతూ..‘పర్యావరణ పరిరక్షణకు బ్యాంక్ కట్టుబడి ఉంది. ఇందుకోసం 4R సూత్రం పాటిస్తున్నాం. R-రెడ్యుజ్(వాతావరణంలోని కాలుష్యాలను తగ్గించడం), R-రీయూజ్(వాటిని సమర్థవంతంగా తిరిగి ఉపయోగించడం), R-రిసైకిల్(రిసైకిల్ చేయడం), R-రెస్పాన్సిబుల్(బాధ్యతాయుతంగా వ్యవహరించడం) అనే విధానాలకు కట్టుబడి ఉన్నాం. ప్రపంచంలోని వివిధ నదుల్లో ఉన్న మంచినీటి కంటే వాతావరణంలోని తేమ అనేక రెట్లు అధికంగా ఉందని అంచనా. ఈ ఏడబ్ల్యూజీలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణంపై సానుకూల ప్రభావంపడేలా కృషి చేస్తున్నాం’ అని అన్నారు.ఇదీ చదవండి: రూ.26,000 కోట్ల విలువైన బిడ్లను తిరస్కరించిన ఆర్బీఐవివిధ సుస్థిరత కార్యక్రమాలుఐసీఐసీఐ బ్యాంక్ ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ (ఈఎస్జీ) పాలసీ కింద వివిధ సుస్థిరత కార్యక్రమాలను అమలు చేస్తోంది. 2032 ఆర్థిక సంవత్సరం నాటికి స్కోప్ 1, స్కోప్ 2 ఉద్గారాల్లో(స్కోప్ 1 ఉద్గారాలు- బ్యాంకు సొంత వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, స్కోప్ 2 ఉద్గారాలు-బ్యాంకు కొనుగోలు చేస్తున్న విద్యుత్తో నడిచే ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా వెలువడే ఉద్గారాలు. ఉదా: ఏసీ, రిఫ్రిజిరేటర్..నుంచి వచ్చే ఉద్గారాలు) కార్బన్ న్యూట్రల్గా మార్చాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. 49.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బ్యాంకు కార్యాలయాలకు చెందిన 180 సైట్లకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ధ్రువీకరణ లభించింది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని బ్యాంకు సర్వీస్ సెంటర్ 2024 ఆర్థిక సంవత్సరంలో ‘నెట్ జీరో వేస్ట్’ సర్టిఫికేట్ పొందింది. -
ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్: ఆ టోల్ ప్లాజాలకు వర్తించదు
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు 'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) పెద్ద ఉపశమనం కల్పించింది. ఇటీవల అమలులోకి వచ్చిన 70 నిమిషాల ఫాస్ట్ట్యాగ్ రూల్స్.. జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజాలకు వర్తించవని స్పష్టం చేసింది. అయితే ఈ కొత్త రూల్స్ ఎక్కడ వర్తిస్తాయనే విషయం ఈ కథనంలో తెలుసుకుందాం.ఫాస్ట్ట్యాగ్ కొత్త రూల్స్నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ 'ఫాస్ట్ట్యాగ్' (FASTag)లో రెండు కొత్త మార్పులను జారీ చేసింది. ఈ నియమాలు ఫిబ్రవరి 17 నుంచి అమలులోకి వచ్చాయి. టోల్ చెల్లింపులను క్రమబద్ధీకరించడం, వివాదాలను తగ్గించడం లక్ష్యంగా లావాదేవీలు ఈ రూల్స్ ప్రవేశపెట్టారు.ఫాస్ట్ట్యాగ్లో తగిన బ్యాలెన్స్ లేకపోతే.. అది బ్లాక్లిస్ట్లోకి వెళ్తుంది. టోల్ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి ఒక గంట లేదా 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్ట్ట్యాగ్ ఇన్యాక్టివ్లోనే ఉంటే కోడ్ 176 ఎర్రర్ను చూపి లావాదేవీలు క్యాన్సిల్ అవుతాయి. అంతే కాకుండా మీరు స్కాన్ చేసిన 10 నిమిషాల తరువాత ఇన్యాక్టివ్లోకి వెళ్లినా.. మళ్ళీ లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. ఇలా లావాదేవీలు క్యాన్సిల్ అయినప్పుడు.. వాహనదారుడు ఫెనాల్టీ కింద రెట్టింపు టోల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.ఇక బ్లాక్లిస్ట్ నుంచి బయటపడాలంటే, తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవడం మాత్రమే కాకుండా.. ఎప్పటికప్పుడు కేవైసీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దూర ప్రయాణాలు ప్రారంభించే ముందు ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. టోల్ ప్లాజాలను చేరుకునే ముందు FASTag బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. ''కొత్త ఫాస్ట్ట్యాగ్ రూల్స్ రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలకు వర్తిస్తాయి''.FASTag అంటే ఏమిటి?దేశంలోని అన్ని రహదారులపై టోల్ కలెక్షన్ పాయింట్ల ద్వారా వాహనాల ప్రయాణాన్ని సులభతరం చేయాలనే లక్ష్యంతో 2019 డిసెంబర్లో దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ ట్యాగ్ - ఫాస్ట్ట్యాగ్ స్కీమ్ ప్రారంభించారు. ఇది నగదు రహిత ఆర్థిక లావాదేవీలకు ఇది అనుమతిస్తుంది. అంతే కాకుండా టోల్ ప్లాజాల ద్వారా రోడ్డు ప్రయాణ వేగాన్ని వేగవంతం చేయడానికి ఇది సహాయపడుతుంది. ఫాస్ట్ట్యాగ్ వచ్చిన తరువాత వసూళ్లు కూడా భారీగా పెరిగాయి. -
రూ.26,000 కోట్ల విలువైన బిడ్లను తిరస్కరించిన ఆర్బీఐ
బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని సులభతరం చేయడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 91 రోజులు, 182 రోజులకు సంబంధించిన ట్రెజరీ బిల్లుల వేలానికి వేసిన బిడ్లను తిరస్కరించింది. ఈ బిడ్ల విలువ రూ.26,000 కోట్లుగా ఉంది. ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకోవడం, డాలర్లను విక్రయించడం, రూపాయి లిక్విడిటీని తగ్గించడం వంటి నగదు సంక్షోభం పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది.ట్రెజరీ బిల్లులుట్రెజరీ బిల్లులను సాధారణంగా టీ-బిల్లులు అని పిలుస్తారు. ఇవి నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం జారీ చేసే స్వల్పకాలిక రుణ సాధనాలుగా తోడ్పడుతాయి. అవి ప్రామిసరీ నోట్ల రూపంలో ఉంటాయి. ఒక సంవత్సరంలోపు లేదా నిర్ణీత గడువులోపు తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. టీ-బిల్లుల కాలపరిమితి 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజులు. ఇతర రకాల ప్రభుత్వ బాండ్ల మాదిరిగా కాకుండా టీ-బిల్లులకు కాలానుగుణ వడ్డీ సమకూరదు. దానికి బదులుగా, అవి వాటి ముఖ విలువ(ఫేస్ వాల్యూ)కు డిస్కౌంట్ను అందిస్తాయి. కొనుగోలు ధర, ముఖ విలువ మధ్య వ్యత్యాసం పెట్టుబడిదారులకు సంపాదించిన వడ్డీని సూచిస్తుంది. టీ-బిల్లులను సురక్షితమైన, అత్యంత లిక్విటిడీ పెట్టుబడుల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఎందుకంటే వీటికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. తక్కువ మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంటాయి.ఇదీ చదవండి: 2047 నాటికి రూ.3,000 లక్షల కోట్ల ఆదాయం!బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితుల కారణంగా తాజాగా 91 రోజులు, 182 రోజుల టీ-బిల్లుల కోసం వేసిన బిడ్లను ఆర్బీఐ తిరస్కరించింది. కానీ, 364 రోజుల టీ-బిల్లుల కోసం రూ.7,000 కోట్ల విలువైన బిడ్లను మాత్రం ఆమోదించింది. సాధారణంగా ట్రెజరీ బిల్లులను ద్రవ్య మార్కెట్(మనీ మార్కెట్) సాధనాలుగా జారీ చేస్తారు. ఈ టీ-బిల్లులకు ఇన్వెస్టర్లు ఆఫర్ చేసే రేట్లు ఆర్బీఐ అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న దానికంటే ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ పార్టిసిపెంట్స్ పేర్కొన్నారు. ఈ వ్యవహారం వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు పరోక్షంగా దోహదం చేసే ప్రయత్నంగా భావిస్తున్నారు. -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 23 పాయింట్లు నష్టపోయి 22,891కు చేరింది. సెన్సెక్స్(Sensex) 75 పాయింట్లు దిగజారి 75,658 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.4 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.45 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.49 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.43 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.47 శాతం పడిపోయింది.డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో నెలకొన్న అనిశ్చితుల మధ్య చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి అదనంగా డాలర్తో రూపాయి తీరు, బ్రెండ్ క్రూడ్ ధరలు సైతం ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, కరెన్సీ మారకంపై మార్కెట్ దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎలాంటి ముఖ్యమైన సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ తీరును నిర్ణయించొచ్చని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
2047 నాటికి రూ.3,000 లక్షల కోట్ల ఆదాయం!
సేవల రంగం తోడ్పాటుతో భారత్ 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా అవతరిస్తుందని ఒక నివేదిక అంచనా వేసింది. అప్పటికి జీడీపీ 23–35 ట్రిలియన్ డాలర్లకు (రూ.1,978–3,010 లక్షల కోట్లు) చేరుకుంటుందని తెలిపింది. దేశ జీడీపీలో సేవల రంగం వాటా 60 శాతంగా, తయారీ రంగం వాటా 32 శాతం మేర ఉంటుందని పేర్కొంది. ఈ నివేదికను బెయిన్ అండ్ కంపెనీ, నాస్కామ్ సంయుక్తంగా రూపొందించాయి.‘రానున్న దశాబ్దాల్లో 20 కోట్ల మంది శ్రామికశక్తి అందుబాటులోకి వస్తారు. అధిక విలువ ఉద్యోగాలను కల్పించే వినూత్నమైన అవకాశం భారత్ ముందుంది. తద్వారా గణనీయమైన ఆర్థిక సామర్థ్యాలను వెలికితీయగలదు. ఇందుకు రంగాలవారీ టెక్నాలజీపరమైన కార్యాచరణ అవసరం. ఏఐ ఆధారిత చిప్ డిజైన్, విడిభాగాల తయారీకి కావాల్సిన ముడి సరుకుల సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యలు పోటీతత్వాన్ని, ఆవిష్కరణలను పెంచుతాయి. దీనివల్ల ఎగుమతుల్లో తయారీ వాటా 24 శాతం నుంచి 2047 నాటికి 45–50 శాతానికి చేరుకుంటుంది’ అని ఈ నివేదిక వివరించింది. అలాగే ఆటో విడిభాగాల ఎగుమతులు 200–250 బిలియన్ డాలర్లు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇదీ చదవండి: ఈ–కామర్స్ దూకుడుఐదు కీలక రంగాలు..అంతర్జాతీయంగా నెలకొన్న ధోరణులు, విస్తృతమైన అవకాశాల దృష్ట్యా.. ఎలక్ట్రానిక్స్, ఇంధనం, కెమికల్స్, ఆటోమోటివ్, సేవలు భారత్కు వృద్ధి చోదకాలుగా పనిచేస్తాయని ఈ నివేదిక తెలిపింది. పెరిగే ఆదాయం, నైపుణ్య కార్మికులు, మౌలిక వసతుల కల్పన ఈ వృద్ధికి నడిపిస్తాయని పేర్కొంది. -
ఈ–కామర్స్ దూకుడు
ఈ–కామర్స్(e-commerce) రంగం ఆకాశమే హద్దుగా విస్తరించనుంది. వచ్చే పదేళ్లలో ఇది 2035 నాటికి నాలుగు రెట్లు పెరిగి 550 బిలియన్ డాలర్లకు (రూ.47.30 లక్షల కోట్లు) చేరుకుంటుందని అనరాక్, ఈటీ రిటైల్ సంయుక్త నివేదిక వెల్లడించింది. 2024 చివరికి ఇది 125 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. ఏటా 15 శాతం కాంపౌండెడ్ వృద్ధిని చూడనుందని అంచనా వేసింది.ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం విస్తరణ, డిజిటల్ చెల్లింపుల సదుపాయాలు, యువతరం, టెక్నాలజీ తెలిసిన జనాభా ఈ–కామర్స్ వృద్ధికి కీలకంగా పనిచేస్తాయని తెలిపింది. ప్రభుత్వ కార్యక్రమమైన డిజిటల్ ఇండియాతోపాటు లాజిస్టిక్స్, సరఫరా నెట్వర్క్ సదుపాయాల విస్తరణ ఈ వృద్ధిని మరింత వేగవంతం చేయనున్నట్టు వివరించింది. మెట్రోలతోపాటు చిన్న పట్టణాల్లోనూ పెరుగుతున్న డిమాండ్ను అందుకునేందుకు ఈ–కామర్స్ సంస్థలు ప్రయత్నం చేస్తున్నట్టు అనరాక్ సీఈవో, ఎండీ అనుజ్ కేజ్రీవాల్ తెలిపారు. మొత్తానికి భారత రిటైల్ మార్కెట్ పరిమాణం 2035 నాటికి 2500 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, 2019 నాటితో పోల్చి చూస్తే మూడు రెట్లు వృద్ధి చెందనుందని చెప్పారు. ఖర్చు చేసే ఆదాయంలో పెరుగుదల, పట్టణీకరణ, పెరుగుతున్న మధ్యతరగతి వర్గీయులు.. ఇవన్నీ రిటైల్ మార్కెట్ విస్తరణకు దోహదం చేసేవిగా ఈ నివేదిక తెలిపింది. 5 స్టార్టప్స్లో ఫ్లిప్కార్ట్ వెంచర్స్ పెట్టుబడులుఫ్లిప్కార్ట్ లీప్ ఎహెడ్ (ఎఫ్ఎల్ఏ) ప్రోగ్రాంలో భాగంగా మూడో విడత కోసం అయిదు స్టార్టప్లను ఎంపిక చేసినట్లు ఫ్లిప్కార్ట్ వెంచర్స్ వెల్లడించింది. వీటిలో ఎక్స్పోర్టెల్, ఫ్యాక్టర్స్డాట్ఏఐ, ఎక్స్పర్టియాడాట్ఏఐ, భారత్ కృషి సేవా, వీసా2ఫ్లై ఉన్నాయి. ప్రారంభ దశలో ఉన్న ఈ అంకుర సంస్థలకు ఎఫ్ఎల్ఏ కింద 5,00,000 డాలర్ల వరకు ఈక్విటీ పెట్టుబడులు, మెంటార్íÙప్ లభిస్తాయి. బిజినెస్ మోడల్, వృద్ధి అవకాశాలు, విజన్ తదితర అంశాల ప్రాతిపదికన అంకుర సంస్థలు ఎంపికవుతాయి.ఇదీ చదవండి: ద్వితీయార్ధంలో ఎకానమీ జోరు ఫ్లిప్కార్ట్ వెంచర్స్ ఇప్పటివరకు డీప్ టెక్, ఫిన్టెక్, హెల్త్ టెక్, జనరేటివ్ ఏఐ తదితర విభాగాల్లో 20 పైచిలుకు స్టార్టప్లకు తోడ్పాటునిచ్చింది. ఎక్స్పోర్టెల్ సీమాంతర ఈ–కామర్స్ లాజిస్టిక్స్ సేవల రంగానికి సంబంధించిన అంకుర సంస్థ. ఫ్యాక్టర్స్డాట్ఏఐ అనేది ఏఐ ఆధారిత మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాం. ఎక్స్పర్టియాడాట్ఏఐ అనేది ఏజెంటిక్ ఏఐ రిక్రూటింగ్ ప్లాట్ఫాం కాగా, భారత్ కృషి సేవా సంస్థ అగ్రిటెక్ స్టార్టప్గా, వీసా2ఫ్లై ట్రావెల్ టెక్ ప్లాట్ఫాంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. -
ద్వితీయార్ధంలో ఎకానమీ జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయార్ధంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నట్టు ఆర్బీఐ బులెటిన్ (ఫిబ్రవరి నెల) వెల్లడించింది. వాహన విక్రయాలు, విమాన ప్రయాణికుల రద్దీ, స్టీల్ వినియోగం, జీఎస్టీ ఈ–వే బిల్లులు తదితర కీలక గణాంకాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొంది. డాలర్ బలోపేతం కావడంతో వర్దమాన ఆర్థిక వ్యవస్థల నుంచి పెట్టుబడులు వెనక్కి పోవడం కరెన్సీ రిస్క్ లను పెంచుతున్నట్టు తెలిపింది. ‘‘ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా కొనసాగనున్నాయి. బలమైన గ్రామీణ వినియోగానికి, వ్యవసాయ రంగం పటిష్ట పనితీరు మద్దతునివ్వనుంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, బడ్జెట్లో పన్ను రాయితీలు పెంపుతో పట్టణ వినియోగం సైతం కోలుకోనుంది’’అని బులెటిన్ వివరించింది. 27 రకాల కీలక సూచికల ఆధారంగా ఆర్థిక కార్యకలాపాల తీరును అంచనా వేస్తుండడం గమనార్హం. ద్రవ్యోల్బణం తగ్గుదల నిదానంగా ఉండడం, టారిఫ్ల రిస్క్ పట్ల ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆందోళన నెలకొందని చెబుతూ.. వర్ధమాన మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) అమ్మకాలకు తోడు డాలర్తో కరెన్సీలు బలహీనపడడాన్ని ఈ బులెటిన్ ప్రస్తావించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిలోనే ఉన్నప్పటికీ, అది మోస్తరుగా ఉన్నట్టు తెలిపింది. ‘‘వృద్ధిని, ద్రవ్య స్థీకరణను యూనియన్ బడ్జెట్ చక్కగా సమతుల్యం చేసింది. మూలధన వ్యయాలలు, వినియోగానికి మద్దతుతోపాటు డెట్ స్థిరీకరణకు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది. దీనికి అదనంగా రెపో రేటు తగ్గింపుతో దేశీ డిమాండ్ పుంజుకోనుంది’’అని ఆర్బీఐ బులెటిన్ వెల్లడించింది. 2025లో జీడీపీ 6.4 % మూడిస్ ఎనలిటిక్స్ అంచనా న్యూఢిల్లీ: భారత జీడీపీ 2025లో 6.4 శాతం మేర వృద్ధిని సాధించొచ్చని అంతర్జాతీయ సంస్థ మూడిస్ ఎనలిటిక్స్ తెలిపింది. యూఎస్ టారిఫ్లు, అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనపడడం ఎగుమతులపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. 2024లో జీడీపీ 6.6%గా ఉందని గుర్తు చేసింది. 2025లో ఆసియా పసిఫిక్ వ్యాప్తంగా వృద్ధి నిదానిస్తుందని మూడిస్ ఎనలిటిక్స్ తెలిపింది. వాణిజ్య ఉద్రిక్తతలు, విధానపరమైన మార్పులు ఈ ప్రాంతం వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. చైనా జీడీపీ 2024లో 5%గా ఉంటే.. 2025లో 4.2%కి, 2026లో 3.9 శాతానికి తగ్గుముఖం పడుతుందని వివరించింది. భారత వృద్ధి 2024లో ఉన్న 6.6% నుంచి వచ్చే రెండేళ్లు 6.4 శాతానికి తగ్గొచ్చని అంచనా . -
టెర్మినల్ నుంచి బంక్ దాకా ప్రతీ చుక్కకూ లెక్క!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనంలో ఇంధనం కావాల్సి వస్తే సమీపంలోని ఫిల్లింగ్ స్టేషన్కు వెళతాం. పెట్రోల్ లేదా డీజిల్ కావాల్సినంత కొట్టించి డబ్బులు కట్టి బయటకు వస్తాం. ఇందులో కొత్తేమి ఉంది అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం.. ఎక్కడో తయారైన ఇంధనం వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి మనదాకా వస్తోంది. ఈ ప్రయాణంలో నాణ్యత, పరిమాణంలో ఎటువంటి రాజీ లేకుండా కస్టమర్కు కల్తీ లేని ఇంధనం చేరేందుకు చమురు కంపెనీలు, డీలర్లు నిరంతరం తీసుకుంటున్న చర్యల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? రిఫైనరీ నుంచి టెర్మినల్.. అక్కడి నుంచి ఫిల్లింగ్ స్టేషన్ (Filling Station). ఇలా వినియోగదారుడి వాహనంలోకి ఇంధనం చేరే వరకు కంపెనీల నిఘా కళ్లు వెంటాడుతూనే ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు. తేడా వస్తే రద్దు చేస్తారు.. చక్రం తిరిగితేనే వ్యవస్థ పరుగెడుతుంది. ఇంధన అమ్మకాలు పెరిగాయంటే ఆర్థిక వ్యవస్థ బాగున్నట్టు. అందుకే ఆయిల్ కంపెనీలు బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి. సాంకేతికతను ఆసరాగా చేసుకుని దేశంలోని మారుమూలన ఉన్న పల్లెకూ నాణ్యమైన ఇంధనాన్ని చేర్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాయి. పరిమాణంలో తేడా రాకుండా న్యాయబద్ధంగా కస్టమర్ చెల్లించిన డబ్బులకు తగ్గట్టుగా ఇంధనం అందిస్తున్నాయి. పైగా ప్రభుత్వ నియంత్రణలోనే చమురు వ్యాపారాలు సాగుతుంటాయి. దీంతో రెవెన్యూ, పోలీసు, తూనికలు కొలతల శాఖకు చెందిన అధికారులు సైతం తనిఖీలు చేపడుతుంటారు. ఈ క్రమంలో ఏమాత్రం తప్పు జరిగినా ఆయిల్ కంపెనీలు కఠిన చర్యలకు దిగుతున్నాయి. ఫిల్లింగ్ స్టేషన్లో స్టాక్లో కొద్ది తేడా వచ్చినా భారీ జరిమానా లేదా డీలర్షిప్ రద్దుకు వెనుకాడడం లేదు. ఇంధనం రవాణా చేసే ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తే బ్లాక్ లిస్టులో పెడతాయి. దేశవ్యాప్తంగా ఉన్న 88 వేల బంకుల్లో ఎక్క డో ఒక దగ్గర జరిగిన తప్పును మొత్తం పరిశ్రమకు ఆపాదించకూడదన్నది కంపెనీలు, డీలర్ల వాదన. ఫిల్లింగ్ స్టేషన్లలో ఇవి తప్పనిసరి → మంచి నీరు → వాష్ రూమ్స్ → ఫిర్యాదుల పుస్తకం → ఫస్ట్ ఎయిడ్ → ఫ్రీ ఎయిర్ కోసం టైర్ ఇన్ఫ్లేటర్ → సీసీ కెమెరాలు → ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇసుకటెర్మినల్ నుంచి బంక్ దాకా.. అయిల్ కంపెనీకి చెందిన టెర్మినల్స్ నుంచి వివిధ ప్రాంతాల్లోని బంకులకు ఇంధనం సరఫరా అవుతుంది. ఇంధనం కేటాయించగానే సంబంధిత ఫిల్లింగ్ స్టేషన్ (బంక్) యజమానికి ఆయిల్ టెర్మినల్ నుంచి సందేశం వెళుతుంది. అలాగే ట్యాంకర్ బయలుదేరగానే, బంక్కు చేరిన వెంటనే మెసేజ్ వస్తుంది. టెర్మినల్ నుంచి బంక్ వరకు ట్యాంకర్ ప్రయాణాన్ని జీపీఎస్ (GPS) ఆధారంగా ట్రాక్ చేస్తారు. ఇచ్చిన రూట్ మ్యాప్లోనే ట్యాంకర్ వెళ్లాలి. మరో రూట్లో వెళ్లినట్టయితే తదుపరి లోడ్కు అవకాశం లేకుండా ఆ వాహన ఏజెన్సీని బ్లాక్ చేస్తారు. నిర్ధేశించిన ప్రాంతంలోనే డ్రైవర్లు భోజనం చేయాల్సి ఉంటుంది. మార్గ మధ్యలో వాహనం ఆపినా కారణం చెప్పాల్సిందే. ఇక బంక్ వద్దకు ట్యాంకర్ చేరగానే నిర్ధేశించిన స్థలంలో కాకుండా మరెక్కడైనా పార్క్ చేసినా ఫిల్లింగ్ స్టేషన్పై చర్యలుంటాయి. బంక్ యజమాని ఓటీపీ ఇస్తేనే ట్యాంకర్ తెరుచుకుంటుంది. అన్లోడ్ అయ్యాక ట్యాంకర్లో నిల్ స్టాక్ అని కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఫిల్లింగ్ స్టేషన్లో ఇలా.. బంకులోని ట్యాంకులో ఎంత ఇంధనం మిగిలి ఉంది, లోడ్ ఎంత వచ్చింది, అమ్మకాలు.. అంతా పారదర్శకం. గణాంకాలు అన్నీ ఎప్పటికప్పుడు కంపెనీ, డీలర్ వద్ద ఆన్లైన్లో దర్శనమిస్తాయి. ట్యాంకర్ తీసుకొచ్చిన స్టాక్లో తేడా ఉంటే ఇన్వాయిస్పైన వివరాలు పొందుపరిచి కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఇలా ప్రతీ చుక్కకూ లెక్క ఉంటుంది. మీటర్ తిరిగిన దానికి తగ్గట్టుగా బంకు ట్యాంకులో ఖాళీ కావాలి. స్టాక్లో తేడా 2 శాతం మించకూడదు. మించితే జవాబు చెప్పాల్సిందే. అంతేకాదు రూ.3 లక్షల వరకు పెనాల్టీ భారం తప్పదు. తరచుగా కంపెనీకి చెందిన సేల్స్ ఆఫీసర్ తనిఖీ చేస్తుంటారు. థర్డ్ పార్టీ నుంచి, అలాగే ఇతర ఆయిల్ కంపెనీల నుంచి కూడా తరచూ తనిఖీలు ఉంటాయి. ఆ మూడు సంస్థలదే.. దేశంలో మొత్తం ఇంధన రిటైల్ పరిశ్రమలో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలైన బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్పీసీఎల్ వాటా ఏకంగా 90% ఉంది. కంపెనీల వెబ్సైట్స్ ప్రకారం ఐవోసీఎల్కు 37,500లకుపైగా, బీపీసీఎల్కు 22,000ల పైచిలుకు, హెచ్పీసీఎల్కు 17,000 లకుపైగా ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రైవేటు సంస్థలు జియో–బీపీ, నయారా, షెల్ సైతం ఈ రంగంలో పోటీపడుతున్నాయి. చదవండి: రోడ్డుపై, నీటిపై నడిచే వెహికల్దేశవ్యాప్తంగా నిర్వహణ మాత్రమే బంకుల యజమానులది. మౌలిక వసతుల ఏర్పాటు, మెషినరీ, ఇంధనంపై సర్వ హక్కులూ పెట్రోలియం కంపెనీలదేనని వ్యాపారులు చెబుతున్నారు. నిర్వహణకుగాను ప్రతి నెల డీలర్కు వేతనం కింద కంపెనీలు రూ.27,500 చెల్లిస్తున్నాయి. డీలర్లకు లీటరు పెట్రోల్ అమ్మకంపై రూ.3.99, డీజిల్పై రూ.2.51 కమిషన్ ఉంటుంది.వేగానికీ పరిమితులు.. ట్యాంకర్ గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదు. ఒక్క వాహనం నిబంధనలు అతిక్రమించినా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీనే రద్దు చేస్తారు. టెర్మినల్ నుంచి సుదూర ప్రాంతంలో ఫిల్లింగ్ స్టేషన్ ఉన్నట్టయితే.. డ్రైవర్లకు భోజనానికి 45 నిముషాలు, టీ తాగడానికి 15 నిముషాలు సమయం ఇస్తారు. నిర్ధేశిత సమయం మించితే కంపెనీ నుంచి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ యజమానికి మెయిల్, ఎస్ఎంఎస్ వెళుతుంది. ఆలస్యానికి కారణం తెలపాల్సిందే. రాత్రి 12 నుంచి ఉదయం 5 మధ్య రవాణా నిషేధం. వయబిలిటీ స్టడీలో లోపాలు.. మోసాలకు తావు లేకుండా కస్టమర్లకు నాణ్యమైన ఇంధనం అందుతోందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం ఇచ్చే ప్రకటనలో సంబంధిత ప్రాంతంలో ఇంత మొత్తంలో విక్రయాలు జరుగుతాయని కంపెనీ ఇచ్చే అంకెలకు, వాస్తవ అమ్మకాలకు భారీ వ్యత్యాసం ఉంటోంది. వయబిలిటీ స్టడీ సక్రమంగా జరగడం లేదు. ప్రకటన ఆధారంగా ముందుకొచ్చి బంక్ ఏర్పాటు చేసి నష్టాలు మూటగట్టుకుంటున్న యజమానులు ఎందరో. – మర్రి అమరేందర్ రెడ్డి, తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్. బంకు యజమానులే బాధ్యులా? డ్రైవర్లు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వర్షాకాలంలో ట్యాంకర్ లోపలికి నీరు చేరే అవకాశం ఉంది. ఇథనాల్ మిశ్రమంలో తేడాలున్నా సమస్యకు దారి తీస్తుంది. బంకుల్లోని ట్యాంకులు స్టీలుతో తయారయ్యాయి. తుప్పు పడితే ట్యాంకులో చెమ్మ చేరుతుంది. ఇదే జరిగితే ఆ నీరు కాస్తా బంకులోని ట్యాంకర్కు, అక్కడి నుంచి కస్టమర్ వాహనంలోకి వెళ్లడం ఖాయం. ఈ సమస్యకు పరిష్కారంగా హెచ్డీపీఈతో చేసిన ట్యాంకులను బంకుల్లో ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవిస్తున్నా కంపెనీల నుంచి స్పందన లేదు. రవాణా ఏజెన్సీ తప్పిదం, మౌలిక వసతుల లోపం వల్ల సమస్య తలెత్తినా బంకు యజమానిని బాధ్యులను చేస్తున్నారు. – రాజీవ్ అమరం, జాయింట్ సెక్రటరీ, కన్సార్షియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్. -
ఐపీవో రూట్లో ఫోన్పే
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా దేశీ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యేందుకు ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే కసరత్తు ప్రారంభించింది. ఈ ఏడాది పదో వార్షికోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో తమ సంస్థకు ఇదొక కీలక మైలురాయి అవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫోన్పే పోటీ సంస్థలు పేటీఎం, మొబిక్విక్ ఇప్పటికే దేశీ మార్కెట్లలో లిస్టయిన సంగతి తెలిసిందే. సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఫోన్పే 2022లో తమ ప్రధాన కార్యాలయాన్ని భారత్కి మార్చుకుంది. 2023లో చివరిసారిగా నిధులు సమీకరించినప్పుడు ఫోన్పే వేల్యుయేషన్ను 12 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ఫోన్పేలో వాల్మార్ట్కి చెందిన లక్సెంబర్గ్ సంస్థ ఫిట్ హోల్డింగ్స్ ఎస్ఏఆర్ఎల్కి 83.91 శాతం, జనరల్ అట్లాంటిక్ సింగపూర్కి 5.14 శాతం, ఫోన్పే సింగపూర్ విభాగానికి 6.7 శాతం వాటాలు ఉన్నాయి. -
సీఈఏ పదవీ కాలం పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి అనంత నాగేశ్వరన్ పదవీకాలాన్ని కేంద్రం మరో రెండేళ్ల పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో నాగేశ్వరన్ మార్చి 31, 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు. కేవీ సుబ్రమణియన్ స్థానంలో 2022, జనవరి 28న సీఈఏగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వివిధ ఆర్థిక విధానాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడంతో పాటు కేంద్ర బడ్జెట్కు ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేను రూపొందించడం సీఈఏ కార్యాలయం ప్రధాన బాధ్యత. నాగేశ్వర్ సీఈఏగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు 2019 నుంచి 2021 వరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పార్ట్టైం సభ్యుడిగా పనిచేశారు. భారత్, సింగ్పూర్లో అనేక బిజినెస్ స్కూల్స్లో బోధించారు. నాగేశ్వరన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ డిగ్రీని పొందారు. 1994లో మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్లో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. -
పీఎన్బీ రుణ రేట్లు కట్..
న్యూఢిల్లీ: రిటైల్ రుణాలపై (గృహ, వాహన సహా) 25 బేసిస్ పాయింట్ల (0.25శాతం) మేర వడ్డీ రేటును తగ్గిస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ప్రకటించింది. గృహ, కార్ల రుణాలు, విద్య, వ్యక్తిగత రుణాలకు ఈ తగ్గింపు అమలు కానుంది. ఐదేళ్ల విరామం తర్వాత ఆర్బీఐ ఈ నెల మొదట్లో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం తెలిసిందే. ఈ తగ్గింపు ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు బదిలీ చేస్తూ పీఎన్బీ కొత్త రేట్లను ప్రకటించింది. సవరణ తర్వాత గృహ రుణాలపై రేటు 8.15 శాతం నుంచి మొదలవుతుంది. అంటే ప్రతి లక్షకు చెల్లించాల్సిన ఈఎంఐ రూ.744గా ఉంటుందని పీఎన్బీ ప్రకటించింది. ఆటో రుణాలపై 8.50 శాతం నుంచి రేట్లు మొదలవుతాయి. ప్రతి లక్షకు రూ.1,240 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ అనుకూల ఇంధన వాహనాలకు 0.05 శాతం మేర వడ్డీలో రాయితీ ఇవ్వనుంది. అలాగే ఎక్స్ షోరూమ్ ధరపై 100 శాతం రుణంగా లభిస్తుంది. 120 నెలల కాలానికి ఎంపిక చేసుకోవచ్చు. విద్యా రుణాలపై రేట్లు 7.85 శాతానికి తగ్గాయి. వ్యక్తిగత రుణాలపై రేట్లు 11.25 శాతం నుంచి మొదలవుతాయి. కొత్త రేట్లు ఫిబ్రవరి 10 నుంచే అమల్లోకి వస్తాయని పీఎన్బీ ప్రకటించింది. -
షాపింగ్ ఓ రేంజ్లో..!
న్యూఢిల్లీ: విలాసవంతమైన ఉత్పత్తుల పట్ల అభిరుచి చిన్న పట్టణాలకూ విస్తరిస్తోంది. ఖరీదైన పాదరక్షలు, వాచీలు, వ్రస్తాలు, యాక్సెసరీల కోసం దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల పట్టణ వాసులు సైతం ఆర్డర్ చేస్తున్నారు. దీంతో లగర్జీ ఉత్పత్తుల కొనుగోళ్లు ప్రధానంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర మెట్రోలకే పరిమితం అన్న అభిప్రాయం క్రమంగా చెరిగిపోతోంది. గుజరాత్లో 2 లక్షల జనాభా కూడా లేని బోటాడ్ నుంచి వీటి కోసం ఆర్డర్లు వస్తుండడమే ఇందుకు నిదర్శనం. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు ఇందుకు వారధిగా నిలుస్తున్నాయి. టాటా క్లిక్ లగ్జరీ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు తెలిశాయి. ‘‘లగ్జరీ అన్నది ఇక ఎంత మాత్రం అధిక ధనవంతులకు సంబంధించిన విభాగం కాబోదు. టైర్–2, 3 పట్టణ వాసులు, మెట్రో పరిధిలో కొత్త భౌగోళిక ప్రదేశాలు పరిశ్రమకు కొత్త పునరుజ్జీవాన్నిస్తున్నాయి’’అని టాటా క్లిక్ లగ్జరీ నివేదికలో అనలిస్టులు పేర్కొన్నారు. సంపన్నులు కాని అధిక ఆదాయ వర్గాలతో (హెన్రీ) కూడిన వినియోగ వర్గం గురించి ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. వీరు లగ్జరీ ఉత్పత్తుల అనుభవాన్ని కోరుకుంటున్నట్టు తెలిపింది.నాన్ మెట్రోల్లోనే అధిక అమ్మకాలు.. టాటా క్లిక్లో లగ్జరీ ఉత్పత్తుల ప్రత్యేక విభాగమైన ‘టాటా క్లిక్ లగ్జరీ’పై జరిగే విక్రయాల్లో 55 శాతం నాన్ మెట్రోలైన పంచకుల, మైసూరు తదితర పట్టణాల నుంచే ఉంటున్నాయి. ‘‘ఇలా కొనుగోలు చేసే వారంతా ఉద్యోగాలు చేస్తూ, అధిక ఆదాయం సంపాదిస్తున్న వారు. విలాస అనుభం, ఉత్పత్తుల వినియోగాన్ని కోరుకుంటున్నారు. దీంతో సౌందర్య ఉత్పత్తులు, యాక్సెసరీలు, వస్త్రాలు, పాదరక్షల విక్రయాల్లో అధిక విక్రయాలకు మద్దతుగా నిలుస్తున్నారు. మెట్రో వినియోగదారుల మాదిరే వీరి కొనుగోళ్ల విలువ కూడా ఉంటోంది’’అని టాటా క్లిక్ లగ్జరీ సీఈవో గోపాల్ ఆస్థానా తెలిపారు. సంపన్నులే కాకుండా చిన్న పట్టణాల్లోని వృత్తి నిపుణులు సైతం లగ్జరీ వస్తువులకు వినియోగదారులుగా మారుతున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బల్గరీ తదితర అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్ల సహకారంతో భారత్లో కొత్త కస్టమర్లను చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అజియో లగ్జే సైతం అంతర్జాతీయ బ్రాండ్లకు చిన్న పట్టణాల్లో భౌతిక స్టోర్లు తెరవాల్సిన అవసరాన్ని తప్పిస్తోంది. సంప్రదాయ లగ్జరీ షాపర్లకు భిన్నంగా.. కొత్త కస్టమర్లు తగిన పరిశోధన తర్వాతే ఆర్డర్ చేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియా వేదికలు, వెబ్సైట్లు, కస్టమర్ల రివ్యూలను ఉపయోగించుకుంటున్నారు. కనీసం ఆరేడు బ్రాండ్ల ఉత్పత్తులను పరిశీలించిన తర్వాతే చివరికి ఒకటి ఎంపిక చేసుకుంటున్నారు. → అధిక ఆదాయంతో మెరుగైన అనుభవానికి మొగ్గు → పలు బ్రాండ్లను పరిశీలించిన తర్వాత కొనుగోలు → సరైన పరిశోధన తర్వాతే ఉత్పత్తి ఎంపిక → జెన్ జెడ్, జెన్ ఆల్ఫా భవిష్యత్ లగ్జరీ కస్టమర్లు → ఈ కామర్స్ రూట్లో అంతర్జాతీయ బ్రాండ్లు → నాన్ మెట్రోల నుంచే 55 శాతం అమ్మకాలు -
వేదాంత విభజనకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: షేర్హోల్డర్లు, రుణదాతలు ఆమోదముద్ర వేయడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ విభజనకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో వ్యాపారాలను అల్యూమినియం, ఆయిల్ తదితర రంగాలవారీగా అయిదు కంపెనీలుగా విడదీస్తారు. డీమెర్జర్ స్కీము ప్రకారం వేదాంత షేర్హోల్డర్లకు ఒక్కో షేరుకు గాను కొత్తగా ఏర్పడే నాలుగు సంస్థలకు సంబంధించి అదనంగా ఒక్కొక్క షేరు చొప్పున లభిస్తుంది. కార్యకలాపాలను క్రమబదీ్ధకరించుకునేందుకు, వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ డీమెర్జర్ ఉపయోగపడుతుందని వేదాంత వెల్లడించింది. అలాగే, ఒక్కో స్వతంత్ర కంపెనీ వేర్వేరుగా ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సమకూర్చుకునేందుకు, వ్యూహాత్మక భాగస్వాములతో జట్టు కట్టేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొంది. అయిదు కంపెనీలుగా విడదీసే ప్రణాళికకు 99.99 శాతం మంది షేర్హోల్డర్లు, 99.59 శాతం మంది సెక్యూర్డ్ రుణదాతలు, 99.95 శాతం మంది అన్సెక్యూర్డ్ రుణదాతలు ఆమోదం తెలిపినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. గురువారం బీఎస్ఈలో వేదాంత షేర్లు దాదాపు 2.40 శాతం పెరిగి రూ. 433.55 వద్ద క్లోజయ్యాయి. ఇంట్రాడేలో సుమారు 3 శాతం పెరిగి రూ. 435.50 స్థాయిని తాకాయి. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ రూ. 3,969 కోట్లు పెరిగి రూ. 1,69,535 కోట్లకు చేరింది.ఇవీ కంపెనీలు.. విడదీత అనంతరం వేదాంత లిమిటెడ్ ప్రధానంగా వెండి, జింకు మొదలైన మెటల్స్ ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మిగతా కంపెనీల జాబితాలో వేదాంత అల్యూమినియం, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత పవర్, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ ఉంటాయి. టెక్నాలజీ విభాగాలతో పాటు కొత్త వ్యాపారాలకూ వేదాంత ఇన్క్యుబేటరుగా వ్యవహరిస్తుంది. -
25, 26 తేదీల్లో బయోఆసియా సదస్సు
ఆసియాలో అగ్రగామి లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ టెక్ ఫోరమ్ అయిన బయో ఆసియా సదస్సు 22వ ఎడిషన్ ఫిబ్రవరి 25, 26 తేదీల్లో హైదరాబాద్లో జరగనుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చడానికి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలకు వేదికగా నిలిచేందుకు సిద్దమైంది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్వీన్స్ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జెన్నెట్ యంగ్, జీ20 షెర్పా అమితాబ్ కాంత్, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ వంటి వారి ప్రసంగాలు ఎజెండాలో ఉన్నాయి. వీరితో పాటుగా బయో ఆసియా 2025లో భారతదేశంతో పాటు, ప్రపంచ పరిశ్రమల నాయకులు కూడా స్ఫూర్తిదాయకంగా ప్రసంగించనున్నారు.ప్రముఖ ప్రపంచ సంస్థల నుండి ప్రముఖ పరిశ్రమల నాయకులు రాబర్ట్ ఎ. బ్రాడ్వే (ఛైర్మన్&సీఈఓ, ఆమ్జెన్), ప్రొఫెసర్ పాట్రిక్ టాన్, (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జీనోమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్), డాక్టర్ కెన్ వాషింగ్టన్ (సిటీఓ , మెడ్ట్రానిక్), డాక్టర్ బోరిస్ స్టోఫెల్ (మేనేజింగ్ డైరెక్టర్, మిల్టెని బయోటెక్) తో పాటుగా ఇతర ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సంస్థల నాయకులు హాజరవుతున్నారు."బయోఆసియా 2025 ఏఐ -ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరివర్తన, లైఫ్ సైన్సెస్లో ఆవిష్కరణలు, డేటా ఇంటర్ఆపరేబిలిటీ, క్లినికల్ ట్రయల్స్లో భారతదేశ సామర్థ్యాన్ని చర్చించడానికి ప్రపంచ నాయకులను ఒకచోట చేర్చనుంది. ఇది చరిత్రలో అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన బయోఆసియా సదస్సు అవుతుందని నమ్ముతున్నాను" అని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.