అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో శనివారం చోటు చేసుకుంది. మండలంలోని చిన్నకొత్తపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులోని 15 మంది గాయపడ్డారు. వీరిలో పదిమంది తీవ్రంగా గాయాలు అయ్యాయి. బాధితులను గుంటూరు జిల్లా నర్సరావుపేటకు , అధ్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
లారీ, బస్సు ఢీ: 15 మందికి గాయాలు
Published Sat, Sep 12 2015 8:50 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement