శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గత 12 గంటలుగా ఏకదాటిగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో జిల్లాలో 21 సెంటీమీటర్ల మేర అత్యధిక వర్షపాతం నమోదు అయింది. రణస్థలంలో 22, లావేరులో 17, పొందూరులో 16, ఎచ్చెర్లలో 13 సెంటీమీటర్ల మేర వర్ష పాతం నమోదు అయింది. అలాగే జిల్లాలోని మూడు మండలాల్లో 51 చెరువులకు గండ్లు పడ్డాయి. వీటితోపాటు ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద చెరువుకు గండిపడింది. దాంతో చెరువులోని నీరు జాతీయ రహదారిపైన ప్రవహిస్తుంది. దాంతో జాతీయ రహదారిపై ట్రాపిక్ భారీగా స్తంభించింది.